బజార్హత్నూర్: గిరిజన క్రీడాకారులు జాతీయస్థాయికి ఎదగడం అభినందనీయమని ఏజెన్సీ డీఈవో గోడం చందన్ అన్నారు. ఇటీవల హన్మకొండలో నిర్వహించిన 60 మీటర్ల పరుగుపందెం రాష్ట్రస్థాయి పోటీల్లో జాతర్ల ఆదర్శ క్రీడా పాఠశాల విద్యార్థి కోట్నాక్ జాకేష్ ఉత్తమ ప్రతిభ కనబర్చి గోల్డ్మెడల్ సాధించాడు. ఈ నెల 28న హర్యానలో జరుగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. మంగళవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏజెన్సీ డీఈవో గోడం చందన్ సదరు విద్యార్థిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేశ్, జిల్లా గిరిజన క్రీడాల అధికారి పార్థసారథి, ఏసీఎంవో అర్క జగన్, ఏటీడీవో సుచంత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


