రూ.1500 కోట్ల అంచనా వ్యయంతో ఆదిలాబాద్లో విమానా శ్రయ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది. భూసేకరణ, ఇతర వాటి కోసం నిధులు కేటాయించాల్సి ఉంటుంది. గవర్నర్ ప్రసంగంలో ఈ అంశం ప్రస్తావించడం ద్వారా మనకు పూర్తి రైట్ వచ్చినట్టే. ఆదిలాబాద్ అభివృద్ధికి ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకెళ్తున్నాం. ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుకు రూ.2వేల కోట్లతో ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం. అందుబాటులోకి వస్తే ఆదిలాబాద్ దశ మారనుంది. – పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే


