ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య

Mar 18 2026 8:10 AM | Updated on Mar 18 2026 8:10 AM

లోకేశ్వరం: మండలంలోని వట్టోలిలో ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై అశోక్‌ తెలిపారు. గ్రామానికి చెందిన శివరాత్రి భోజన్న(35) ఏపనీ చేయకుండా ఖాళీగా తిరుగుతుండేవాడు. ఈక్రమంలో మద్యానికి బానిసయ్యాడు. ఈ విషయమై శనివారం అతని భార్య రుచిత మందలించి పిల్లలతో కలిసి తీర్థయాత్రకు వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన భోజన్న సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మంగళవారం భోజన్న సోదరుడు శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement