ప్రతిభ కనబర్చిన నిర్మల్‌ జిల్లా విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

ప్రతిభ కనబర్చిన నిర్మల్‌ జిల్లా విద్యార్థులు

Mar 18 2026 8:10 AM | Updated on Mar 18 2026 8:10 AM

తానూరు: జవహర్‌ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలవగా మండలకేంద్రంలోని వాసవి పాఠశాల విద్యార్థి అవదుత్‌వార్‌ గణేశ్‌ ప్రతిభ కనబర్చి కాగజ్‌నగర్‌లోని జవహర్‌ నవోదయ విద్యాలయానికి ఎంపికై నట్లు పాఠశాల డైరెక్టర్‌ నర్సయ్య, ప్రిన్సిపాల్‌ లక్ష్మణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు.

కుభీర్‌: మండలకేంద్రంలోని ప్రగతి విద్యానికేతన్‌ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు శ్రీబిందు, సొప్పరి పూజ నవోదయ విద్యాలయంలో చదివేందుకు ఎంపికయ్యారు. వీరిని పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు. పాఠశాల ప్రిన్సిపాల్‌ ఆనంద్‌, కరస్పాండెంట్‌ గంగాధర్‌, ఉపాధ్యాయులు గంగాకిశోర్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement