టీ20 ప్రపంచకప్ 2026 తుది దశకు చేరింది. నాలుగు సెమీఫైనల్ బెర్త్లు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్.. రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.
ఈ మ్యాచ్లకు అఫీషియల్స్ జాబితాను (అంపైర్లు, రిఫరీలు) ఐసీసీ ఇవాళ ప్రకటించింది. ఎనిమిది మంది అంపైర్లు, ఇద్దరు మ్యాచ్ రిఫరీల పేర్లను వెల్లడించింది. ఎప్పటిలాగే తటస్థ అధికారులను నియమించింది.
సౌతాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ తొలి సెమీఫైనల్
- ఆన్ ఫీల్డ్ అంపైర్లు: రిచర్డ్ ఇల్లింగ్వర్త్, అలెక్స్ వార్ఫ్
- థర్డ్ అంపైర్: నితిన్ మెనన్
- నాలుగో అంపైర్లు: రాడ్ టక్కర్
- మ్యాచ్ రిఫరీ: జవగల్ శ్రీనాథ్
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో సెమీఫైనల్
- ఆన్ ఫీల్డ్ అంపైర్లు: క్రిస్ గాఫనీ, అల్లాహుద్దీన్ పాలేకర్
- థర్డ్ అంపైర్లు: ఎడ్రియన్ హోల్డ్స్టాక్
- నాలుగో అంపైరు: పాల్ రైఫెల్
- మ్యాచ్ రిఫరీ: ఆండీ పైక్రాఫ్ట్


