breaking news
T20 World Cup 2026
-
T20 WC 2026: సౌతాఫ్రికా-న్యూజిలాండ్ మ్యాచ్లో షాకింగ్ సన్నివేశం
సౌతాఫ్రికా-న్యూజిలాండ్ మధ్య నిన్న (మార్చి 4) జరిగిన టీ20 వరల్డ్కప్ 2026 తొలి సెమీఫైనల్ మ్యాచ్లో షాకింగ్ సన్నివేశం చోటు చేసుకుంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 10వ ఓవర్ తొలి బంతిలో కగిసో రబాడా వేసిన అద్భుత బంతికి టిమ్ సీఫర్ట్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆశ్చర్యకరంగా, ఓ బెయిల్ ఎగిరి ఏకంగా బౌండరీ రోప్పై పడింది. దీంతో ఆటగాళ్లు, అభిమానులు, వ్యాఖ్యాతలు అందరూ షాక్కు గురయ్యారు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. గతంలో ఇలాంటి సన్నివేశాలు చాలా అరుదుగా జరిగాయి.మ్యాచ్ విషయానికొస్తే.. న్యూజిలాండ్ సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించి, ఫైనల్కు దూసుకెళ్లింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని కివీస్ కేవలం 12.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ఫిన్ అల్లెన్ బీభత్సమైన సెంచరీతో (33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 100 నాటౌట్) కివీస్ను ఒంటిచేత్తో గెలిపించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. టీ20 వరల్డ్కప్ నాకౌట్ మ్యాచ్ల్లోనూ ఇదే తొలి సెంచరీ. ఈ సెంచరీతో అల్లెన్ మరిన్ని రికార్డులు కొల్లగొట్టాడు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. 77 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును మార్కో యాన్సెన్ (30 బంతుల్లో 55 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో ఆదుకున్నాడు. అతనికి ట్రిస్టన్ స్టబ్స్ (29) కాసేపు సహకరించాడు. అంతకుముందు డెవాల్డ్ బ్రెవిస్ (34) ఓ మోస్తరు స్కోర్తో పర్వాలేదనిపించాడు. వీరు మినహా సౌతాఫ్రికా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. మార్క్రమ్ 18, డికాక్ 10, మిల్ర్ 6, బాష్ 2, రికెల్టన్, రబాడ డకౌటయ్యారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ను రచిన్ (4-0-29-2), మ్యాట్ హెన్రీ (4-0-34-2), కోల్ మెక్కోంచి (1-0-9-2), ఫెర్గూసన్ (4-0-29-1), మిచెల్ సాంట్నర్ (4-0-25-0) దెబ్బకొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో టిమ్ సీఫర్డ్ (58), ఫిన్ అల్లెన్ (100 నాటౌట్) 9 ఓవర్లలో తొలి వికెట్కు 117 పరుగులు జోడించి గెలుపుకు పటిష్ట పునాది వేశారు. సీఫర్ట్ ఔటయ్యాక మరింత రెచ్చిపోయిన అల్లెన్ కేవలం బౌండరీలు, సిక్సర్లతో మ్యాచ్ను ముగించాడు. అతనికి రచిన్ (13 నాటౌట్) సహకరించాడు.2021 ఎడిషన్ తర్వాత న్యూజిలాండ్ ఫైనల్కు చేరడం ఇదే మొదటిసారి. ఆ ఎడిషన్లో ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం ఎదుర్కొని తృటిలో ప్రపంచ ఛాంపియన్ అయ్యే అవకాశాన్ని కోల్పోయిన కివీస్కు మళ్లీ ఇన్నాళ్లకు ప్రపంచకప్ సాధించే అవకాశం వచ్చింది. భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో న్యూజిలాండ్ తమ తొలి ప్రపంచకప్ టైటిల్ కోసం పోరాడుతుంది. -
ముంబైలో హై వోల్టేజ్ మ్యాచ్..
-
33 బంతుల్లో శతకం.. రికార్డుల మోత మోగించిన కివీస్ యోధుడు
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న (మార్చి 4) జరిగిన తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ సౌతాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి, ఫైనల్కు చేరింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని కివీస్ కేవలం 12.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ఫిన్ అల్లెన్ బీభత్సమైన సెంచరీతో కివీస్ను ఒంటిచేత్తో గెలిపించాడు. అల్లెన్ 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయమైన సెంచరీ చేసి కివీస్ను విజయతీరాలకు చేర్చాడు. ఈ సెంచరీతో అల్లెన్ రికార్డుల మోత మోగించాడు.టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ.ఓవరాల్ టీ20 క్రికెట్ చరిత్రలో ఓ ఫుల్ మెంబర్ జట్టుపై ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ.ఓవరాల్గా (ఫుల్ మెంబర్లు, సభ్య దేశాలు) టీ20ల్లో ఇది మూడో జాయింట్ ఫాస్టెస్ట్ సెంచరీ.ఓవరాల్గా ఓ ఫుల్ మెంబర్ జట్టు తరఫున సికందర్ రజాతో (గాంబియాపై 33 బంతుల్లో శతకం) పాటు జాయింట్ ఫాస్టెస్ట్ సెంచరీ. టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్ల చరిత్రలో తొలి శతకం.టీ20 క్రికెట్లో న్యూజిలాండ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ.టీ20 వరల్డ్కప్ చరిత్రలో బ్రెండన్ మెక్కల్లమ్తో (11 ఫోర్లు, 7 సిక్సర్లు) కలిసి ఓ ఇన్నింగ్స్లో అత్యధిక బౌండరీ కౌంట్ (10 ఫోర్లు, 8 సిక్సర్లు). ఓ టీ20 వరల్డ్కప్ ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు-20.టీ20 వరల్డ్కప్ సెమీస్ లేదా ఫైనల్స్లో కనీసం 30 బంతులు ఆడిన కోటాలో విరాట్ కోహ్లితో పాటు అతి తక్కువ డాట్ బాల్స్ (3). టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్ తరఫున మూడో శతకం (మెక్కల్లమ్, ఫిలిప్).ఈ ఇన్నింగ్స్తో అల్లెన్ మరిన్ని చిన్నా చితకా రికార్డులను కూడా బ్రేక్ చేసి న్యూజిలాండ్ను ప్రపంచకప్ కల సాకారం చేసే దిశగా తీసుకెళ్లాడు. 2021 ఎడిషన్ తర్వాత న్యూజిలాండ్ ఫైనల్కు చేరడం ఇదే మొదటిసారి. ఆ ఎడిషన్లో ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం ఎదుర్కొని తృటిలో ప్రపంచ ఛాంపియన్ అయ్యే అవకాశాన్ని కోల్పోయిన కివీస్కు మళ్లీ ఇన్నాళ్లకు ప్రపంచకప్ సాధించే అవకాశం వచ్చింది. భారత్, ఇంగ్లండ్ మధ్య ఇవాళ జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో న్యూజిలాండ్ తమ తొలి ప్రపంచకప్ టైటిల్ కోసం పోరాడుతుంది. -
భారత్ ఫైనల్ గురి
3-2 టి20 వరల్డ్ కప్లో భారత్, ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్లు జరిగాయి. వీటిలో భారత్ 3 గెలిచి, 2 ఓడింది. గత టి20 ప్రపంచ కప్లో భారత్ విజేతగా నిలిచిన సందర్భంలో సెమీఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించే ముందంజ వేసింది. అంతకుముందు 2022 సెమీఫైనల్లో భారత్పై విజయం సాధించిన ఇంగ్లండ్ ఆపై టైటిల్నూ సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి టైటిల్ పోరుకు ముందు ఈ రెండు జట్లు వరుసగా మూడోసారి సెమీస్ సమరంలోనే ముఖాముఖికి సిద్ధమయ్యాయి. తాజా టోర్నీలో ప్రదర్శనను బట్టి చూస్తే రెండు జట్లూ కూడా ‘లోపాలు లేని అత్యుత్తమ ఆటతీరు’ను కనబర్చలేకపోయాయి. ఇంగ్లండ్ ప్రస్థానం తడబడుతూనే సాగగా... భారత్ కూడా తమపై ఉన్న భారీ అంచనాలకు అనుగుణంగా ప్రత్యర్థులపై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయింది. అయితే ఇక్కడి వరకు ఎలా వచ్చామన్నది ముఖ్యం కాదు మిగిలిన రెండు మ్యాచ్లు ఎలా గెలవడం అనేదే ముఖ్యం. ఈ నేపథ్యంలో భారత్ సొంతగడ్డపై సత్తా చాటుతుందా లేక ఇంగ్లండ్ అనూహ్య ఫలితాన్ని సాధిస్తుందా అనేది ఆసక్తికరం. ముంబై: టి20 వరల్డ్ కప్ డిఫెండింగ్ చాంపియన్ భారత్ వరుసగా రెండోసారి ట్రోఫీ గెలుచుకొని కొత్త చరిత్ర సృష్టించే క్రమంలో అసలైన నాకౌట్ సమరానికి సిద్ధమైంది. నేడు వాంఖెడే మైదానంలో జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్తో భారత్ తలపడుతుంది. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన ప్రత్యర్థులతో పోలిస్తే ఇంగ్లండ్ మరీ బలంగా ఏమీ లేదు. అయితే నాకౌట్ మ్యాచ్ ఒత్తిడిని అధిగమించి టీమిండియా ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. మరోవైపు కెప్టెన్ హ్యారీ బ్రూక్ స్ఫూర్తిదాయక సారథ్యంలో ఇంగ్లండ్ ఒక్కో అడుగు వేస్తూ సెమీస్కు చేరింది. టి20 వరల్డ్ కప్ను రెండేసిసార్లు గెలుచుకున్న ఈ రెండు జట్లు మూడో టైటిల్ వేటలో మరో అడుగు ముందుకు వేసేందుకు నేటి పోరులో ఎలా చెలరేగుతాయో చూడాలి. మార్పుల్లేకుండా... పిచ్, వేదికతో సంబంధం లేకుండా భారత జట్టు అన్ని రకాలుగా ఈ మ్యాచ్ కోసం సిద్ధంగా ఉంది. కొత్తగా వ్యూహాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా బెస్ట్–11తో తుది జట్టు ఎంపిక కూడా ఖాయమైనట్లే. సరిగ్గా ఏడాది క్రితం ఇదే మైదానంలో ఇంగ్లండ్పైనే అభిషేక్ శర్మ విధ్వంసకర ఆటతో తన రాకను ఘనంగా ప్రదర్శించాడు. నాటి మ్యాచ్లో 54 బంతుల్లోనే 7 ఫోర్లు, 13 సిక్స్లతో అతను ఏకంగా 135 పరుగులు సాధించాడు. ఇప్పుడు అలాంటి ప్రదర్శనను పునరావృతం చేయాలని అభిషేక్ భావిస్తున్నాడు. విండీస్పై గత మ్యాచ్లో తడబడినా ఈసారి చెలరేగితే తిరుగుండదు. మరో ఓపెనర్ సంజు సామ్సన్ ఒక్క ఇన్నింగ్స్తో తన విలువేంటో చూపించాడు. అదే జోరు కొనసాగించాలని అతను పట్టుదలగా ఉన్నాడు. ఆపై ఇషాన్, సూర్య, తిలక్లతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ఈ ఐదుగురిలో ఏ ఇద్దరు చెలరేగినా జట్టు భారీ స్కోరు చేయడం ఖాయం. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలు చివర్లో వేగంగా అందించే పరుగులు దీనికి అదనం. ఎనిమిదో స్థానంలో అక్షర్ పటేల్లాంటి ఆటగాడు ఉండటం టీమిండియా బలం. పేసర్లు బుమ్రా, అర్ష్ దీప్ ఎప్పటిలాగే ఆరంభంలో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయగలిగితే మన జట్టు పని మరింత సులువవుతుంది. అక్షర్తో పాటు వైవిధ్యమైన బౌలింగ్ ఉన్న వరుణ్ చక్రవర్తిని ఎదుర్కోవడం ఇంగ్లండ్కు కత్తి మీద సామే. ఇంగ్లండ్పై ఘనమైన రికార్డు ఉన్న స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఆడించాలనే భావిస్తున్నా... ఎవరినీ పక్కన పెట్టలేని పరిస్థితి. బుధవారం సిద్ధి వినాయక ఆలయంలో అభిషేక్, అక్షర్, ఇషాన్ కీలకం విల్ జాక్స్... ఈ వరల్డ్ కప్లో ఇంగ్లండ్ చాలా సాధారణ ఆటతీరు కనబర్చింది. అతి కష్టమ్మీద నేపాల్పై 4 పరుగులతో నెగ్గి ఆపై విండీస్ చేతిలో ఓడింది. ‘సూపర్ ఎయిట్స్’లో కూడా స్వల్ప లక్ష్యాలను ఛేదించే క్రమంలో పాకిస్తాన్, న్యూజిలాండ్లపై చచ్చీ చెడి గెలిచింది. కొన్నాళ్ల క్రితం వరకు కూడా విధ్వంసకర ఆటకు చిరునామాగా నిలిచిన టీమ్ ఇప్పుడు అతి కష్టమ్మీద గెలుపు గీత దాటుతోంది. టోర్నీ మొత్తంలో బెస్ట్ ఓపెనింగ్ జోడీ అంటూ బరిలోకి దిగిన బట్లర్, ఫిల్ సాల్ట్ 7 మ్యాచ్లలో కలిపి 84 పరుగులే జోడించగలిగారు. ఏ మ్యాచ్లోనూ గరిష్టంగా నాలుగు ఓవర్లకు మించి వీరి భాగస్వామ్యం సాగలేదు. అయినా సరే మరో ప్రత్యామ్నాయం లేక మరోసారి జట్టు వీరినే నమ్ముకుంటోంది. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లండ్ ఆల్టైమ్ గ్రేట్లలో ఒకడిగా గుర్తింపు పొందిన బట్లర్ 7 మ్యాచ్లలో కలిపి చేసింది 62 పరుగులే! అయినా సరే, అతని స్థాయికి తగ్గ ప్రదర్శన ఈ ఒక్క మ్యాచ్లోనైనా రావాలని ఇంగ్లండ్ కోరుకుంటోంది. బెతెల్, బాంటన్లను నమ్మే స్థితి లేకపోవడంతో కెప్టెన్ బ్రూక్ మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడటం అవసరం. ఆల్రౌండర్గా స్యామ్ కరన్ పెద్దగా ఆకట్టుకోకపోయినా....ఈ టోర్నీలో నాలుగు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు నెగ్గిన విల్ జాక్స్ కీలకం కానున్నాడు. ఆర్చర్తో పాటు రెండో పేసర్గా ఒవర్టన్పై భారం ఉంది. పిచ్ కొంత అనుకూలిస్తే మధ్య ఓవర్లలో స్పిన్నర్లు ఆదిల్ రషీద్, డాసన్ కూడా ప్రభావం చూపగలరని జట్టు నమ్ముతోంది. పిచ్, వాతావరణం వాంఖెడే పిచ్ మొదటి నుంచీ బ్యాటింగ్కు బాగా అనుకూలం. మంచి బౌన్స్, చిన్న బౌండరీల కారణంగా భారీ స్కోర్లకు అవకాశం ఉంది. టోర్నీలో తొలి మ్యాచ్ను భారత్ ఇక్కడ ఆడగా... ఇంగ్లండ్ రెండు మ్యాచ్లు ఆడింది. మంచు ప్రభావం ఉంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపవచ్చు. మ్యాచ్ రోజున వర్ష సూచన లేదు. ఒకవేళ వర్షం సమస్య కలిగించినా...రిజర్వ్ డే ఉంది. 17-12 భారత్, ఇంగ్లండ్ మధ్య 29 టి20 మ్యాచ్లు జరిగాయి. భారత్ 17 మ్యాచ్ల్లో, ఇంగ్లండ్ 12 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), అభిషేక్, సామ్సన్, ఇషాన్, తిలక్, పాండ్యా, దూబే, అక్షర్, అర్ష్ దీప్, బుమ్రా, వరుణ్. ఇంగ్లండ్: బ్రూక్ (కెప్టెన్ ), సాల్ట్, బట్లర్, బెతెల్, బాంటన్, కరన్, ఒవర్టన్, జాక్స్, డాసన్, ఆర్చర్, రషీద్. -
కివీస్ కిర్రాక్ షో
చోకర్స్... క్రికెట్లో దక్షిణాఫ్రికా జట్టును ఉద్దేశించి తరచూ అనే మాట ఇది. అంటే... అన్నీ నెగ్గినా, ఎన్ని గెలిచినా, అసలైనా పోరులో తుస్సుమంటుందనే అర్థంలో వాడతారు. ఇదేలా ఉన్నా... గతం సంగతి పక్కన బెట్టినా... ఈ టి20 ప్రపంచకప్ వరకే చూసినా కూడా సఫారీ జట్టును ముమ్మూటికీ చోకర్స్ అనక తప్పదేమో! ఎందుకంటే ఈ టోర్నీలో లీగ్ మొదలు, సూపర్–8 ముగిసేదాకా అపజయమన్నదే ఎరుగని జట్టు కీలకమైన సెమీఫైనల్ కొచ్చేసరికి చేతులెత్తేసింది. కోల్కతా: ఇప్పటిదాకా ఈ టి20 ప్రపంచకప్లో ఎదురేలేని ఏకైక జట్టు దక్షిణాఫ్రికాను... రన్రేట్తో సెమీఫైనల్ చేరిన న్యూజిలాండ్ చిత్తు చేసింది. టోర్నీలోనే కఠినమైన ప్రత్యర్థిపై సులువుగా విజయం సాధించింది. బుధవారం ఈడెన్ గార్డెన్స్లో జరిగిన తొలి సెమీఫైనల్లో కివీస్ 7.1 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా జట్టుపై ఘనవిజయం నమోదు చేసింది. న్యూజిలాండ్ ఓపెనర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫిన్ అలెన్ (33 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 8 సిక్స్లు) వీరవిహారంతో దక్షిణాఫ్రికా లక్ష్యం చిన్నబోయింది. సఫారీ జట్టు మూగబోయింది. టాస్ నెగ్గిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోవడంతో ముందుగా బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మార్కో యాన్సెన్ (30 బంతుల్లో 55 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్స్లు) మెరిపించాడు. కివీస్ బౌలర్లు మెక్కోన్కీ (2/9), రచిన్ రవీంద్ర (2/29), హెన్రీ (2/34) తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ అలెన్ శతక సునామీతో 12.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 173 పరుగులు చేసి గెలిచింది. టిమ్ సీఫెర్ట్ (33 బంతుల్లో 58; 7 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా దంచేశాడు. ఈ మెగా టోర్నీలో రెండోసారి ఫైనల్ చేరిన న్యూజిలాండ్ (2021లో తొలిసారి రన్నరప్)... నేడు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం అహ్మదాబాద్లో టైటిల్ కోసం తలపడుతుంది. టాపార్డర్ తడబాటు కెప్టెన్ మార్క్రమ్ (18), డికాక్ (10), రికెల్టన్ (0) ఇలా టాప్–3 బ్యాటర్లు చేతులెత్తేశారు. 55 స్కోరు వద్ద టాపార్డర్ వికెట్లు కూలాయి. దీన్నుంచి తేరుకోకముందే మిల్లర్ (6), అప్పటిదాకా టాప్స్కోరర్ అయిన బ్రెవిస్ (34; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ఇద్దరు 77 పరుగుల స్కోరు వద్దే వెనుదిరిగారు. నిజానికి ఇక్కడే సఫారీ పనైపోయింది. అయితే స్టబ్స్ (24 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్), యాన్సెన్ ఆరో వికెట్కు 73 పరుగులు జోడించిన భాగస్వామ్యం, 27 బంతుల్లో యాన్సెన్ చేసిన ఫిఫ్టీ దక్షిణాఫ్రికాను ఆదుకున్నాయి. అలెన్ ధన్ ధనాధన్ తొలి ఓవర్లో సీఫెర్ట్ రెండు బౌండరీలు, రెండో ఓవర్లో అలెన్ ఫోర్ కొట్టడంతో రెండు ఓవర్లలో కలిపి మొత్తం 19 పరుగులు వచ్చాయి. మరుసటి మూడో ఓవర్లో ఇద్దరు కలిపి కొట్టడంతో 18 పరుగులతో కివీస్ పరుగుల జోరందుకుంది. 4.1 ఓవర్లో జట్టు స్కోరు 50 దాటింది. ఇక బాష్ వేసిన పవర్ ప్లే ఆఖరి ఓవర్లో ఆఖరి బంతి ఒక్కటే బతికి పోయింది. అంతకుముందు పడిన ఐదు బంతుల్ని అలెన్ 6, 4, 4, 4, 4, 0లుగా బాదేయడంతో వరుసబెట్టి మరీ బౌండరీలైన్ను దాటేశాయి. 6 ఓవర్లలో 84/0. అచ్చు హైలైట్స్లాగే లక్ష్యంలో సగం స్కోరు కరిగింది. పవర్ప్లే ముగిసింది కానీ ఓపెనర్ల పవర్ స్ట్రోక్స్ మాత్రం అడ్డు అదుపు లేకుండా కొనసాగాయి. దీంతో 7.5 ఓవర్లోనే న్యూజిలాండ్ స్కోరు 100కు చేరింది. 28 బంతుల్లో సీఫెర్ట్, 19 బంతుల్లో అలెన్ ఫిఫ్టీలు సాధించారు. ఎట్టకేలకు రబడ పదో ఓవర్లో సీఫెర్ట్ను అవుట్ చేశాడు. కానీ కివీస్ స్కోరు 117/1. అప్పటికే సఫారీ వికెట్ సాఫల్యానికి ఆలస్యమైంది. అలెన్ దూకుడుతో న్యూజిలాండ్ లక్ష్యానికి చేరువైంది. యాన్సెన్ వేసిన 13వ ఓవర్లో అలెన్ వరుసగా 4, 4, 6, 6, 4 బాదేయడంతో 76 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న అలెన్ ఒక్క ఉదుటున 33 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐదో బంతి బౌండరీతోనే కివీస్ లక్ష్యాన్ని కూడా చేరుకుంది. 33 టి20 ప్రపంచకప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్గా అలెన్ రికార్డు నెలకొల్పాడు. క్రిస్ గేల్ (2016లో ఇంగ్లండ్పై 47 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును అలెన్ సవరించాడు.6 ప్రస్తుత టి20 ప్రపంచకప్లో నమోదైన సెంచరీలు. 2010, 2014, 2016, 2022 టోర్నీల్లో అత్యధికంగా రెండేసి సెంచరీలు వచ్చాయి. మార్క్రమ్ అవుటా? ఈ టోర్నమెంట్ లో మూడు హాఫ్ సెంచరీలతో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఒకడిగా ఉన్న మార్క్రమ్ కీలకమైన ఈ మ్యాచ్లోనూ అదే జోరు కొనసాగిస్తే... సఫారీ జట్టు భారీ స్కోరు ఖాయమే అనిపించింది. అయితే సందేహాస్పద క్యాచ్ అవుట్తో అతడు నిష్క్రమించిన ప్రభావం సఫారీ జట్టు స్కోరుపై పడింది. రచిన్ రవీంద్ర 8వ ఓవర్ నాలుగో బంతిని షాట్ ఆడగా బౌండరీకి దగ్గర్లో మిచెల్ అందుకున్నాడు. కానీ చేతివేళ్ల సందుల్లోంచి బంతి నేలను తాకినట్లుగా రిప్లేలో కనిపించినా... నిబంధనల ప్రకారం బంతి కిందే చేతివేళ్లున్నాయని థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ (భారత్) స్పష్టం చేసి అవుటిచ్చాడు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) మిచెల్ (బి) రచిన్ 18; డికాక్ (సి) ఫెర్గూసన్ (బి) మెక్కోన్కీ 10; రికెల్టన్ (సి) అలెన్ (బి) మెక్కోన్కీ 0; బ్రెవిస్ (సి) సాంట్నర్ (బి) నీషమ్ 34; మిల్లర్ (సి) మిచెల్ (బి) రచిన్ 6; స్టబ్స్ (బి) ఫెర్గూసన్ 29; యాన్సెన్ (నాటౌట్) 55; బాష్ (బి) హెన్రీ 2; రబడ (సి) నీషమ్ (బి) హెన్రీ 0; కేశవ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–12, 2–12, 3–55, 4–77, 5–77, 6–150, 7–166, 8–166. బౌలింగ్: హెన్రీ 4–0–34–2, మెక్కోన్కీ 1–0–9–2, ఫెర్గూసన్ 4–0–29–1, నీషమ్ 3–0–42–1, సాంట్నర్ 4–0–25–0, రచిన్ రవీంద్ర 4–0–29–2. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: సీఫెర్ట్ (బి) రబడ 58; అలెన్ (నాటౌట్) 100; రచిన్ (నాటౌట్) 13; ఎక్స్ట్రాలు 2; మొత్తం (12.5 ఓవర్లలో వికెట్ నష్టానికి) 173. వికెట్ పతనం: 1–117. బౌలింగ్: యాన్సెన్ 2.5–0–53–0, రబడ 3–0–28–1, ఎన్గిడి 2–0–22–0, బాష్ 2–0–35–0, కేశవ్ 3–0–33–0. -
టి20 ప్రపంచకప్ వీక్షణలో కొత్త రికార్డులు
న్యూఢిల్లీ: భారత్, శ్రీలంక వేదికగా జరుగుతున్న ఐసీసీ టి20 ప్రపంచకప్ కొత్త ప్రసార రికార్డులు నెలకొల్పుతోంది. ఇప్పటి వరకు జరిగిన అన్నీ టోర్నీల కంటే ఈ వరల్డ్కప్నకు అత్యధి వీక్షణలు వచ్చాయని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడు జై షా బుధవారం తెలిపారు. పాత రికార్డులన్నింటిని తిరగరాస్తూ తాజా టోర్నమెంట్ వీక్షకుల సంఖ్య 500 మిలియన్ (50 కోట్లు)లను అధిగమించిందని వెల్లడించారు.ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉండే టోర్నమెంట్గా ఇది నిలిచిందని... డిజిటల్ వినియోగం ద్వారానే వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని జై షా అన్నారు. ‘ఈ వరల్డ్కప్ను విశ్వవ్యాప్తం చేయాలని టోర్నీ ఆరంభానికి ముందే లక్ష్యంగా పెట్టుకున్నాం. భారత్లో జరుగుతున్న ఈ ఈవెంట్ వీక్షకుల సంఖ్య 500 మిలియన్లు దాటింది. టి20 ప్రపంచకప్ల చరిత్రలో ఇదే అత్యధికం. జియో హాట్స్టార్లో ఏకకాలంలో 60.5 మిలియన్ల గరిష్ట వీక్షకులను చూడటం చాలా సంతోషంగా ఉంది’ అని జై షా సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. తాజా టోర్నీలో సెమీఫైనల్స్, ఫైనల్ జరగకముందే... 2024లో అమెరికాలో జరిగిన వరల్డ్కప్ కంటే ఎక్కువమంది ఈవెంట్ను వీక్షించడం గమనార్హం. చివరి మూడు మ్యాచ్లు ముగిసేసరికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. -
T20 WC: అలెన్ విధ్వంసకర శతకం.. వరల్డ్కప్ ఫైనల్లో న్యూజిలాండ్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో న్యూజిలాండ్ ఫైనల్కు దూసుకువెళ్లింది. కోల్కతాలో జరిగిన తొలి సెమీస్ మ్యాచ్లో సౌతాఫ్రికాను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈడెన్ గార్డెన్స్లో బుధవారం నాటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కివీస్.. సౌతాఫ్రికాను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది.కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ న్యూజిలాండ్ బౌలర్లు ఆది నుంచే నిప్పులు చెరిగారు. క్వింటన్ డికాక్ (10)ను అవుట్ చేసి కివీస్ వికెట్ల వేట మొదలుపెట్టిన కోల్ మెకాంచీ.. వన్డౌన్లో వచ్చిన ర్యాన్ రికెల్టన్ (0)ను డకౌట్గా వెనక్కి పంపాడు. ఇక మరో ఓపెనర్, కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (18)ను రచిన్ రవీంద్ర పెవిలియన్కు చేర్చాడు.యాన్సెన్ హాఫ్ సెంచరీఅదే విధంగా డారిల్ మిచెల్ (6)ను కూడా అవుట్ చేసిన రచిన్ కివీస్ శిబిరంలో జోష్ నింపాడు. ఇక డెవాల్డ్ బ్రెవిస్ (34)ను జేమ్స్ నీషమ్ అవుట్ చేయగా.. ట్రిస్టన్ స్టబ్స్ (29)ను లాకీ ఫెర్గూసన్ పెవిలియన్కు పంపించాడు. అయితే, మార్కో యాన్సెన్ హాఫ్ సెంచరీ (30 బంతుల్లో 55) నాటౌట్గా నిలవడంతో సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.ఇక లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 12.5 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ నష్టపోయి 173 పరుగులు సాధించింది. ఓపెనర్లలో టిమ్ సీఫర్ట్ 33 బంతుల్లో 58 పరుగులు సాధించగా.. ఫిన్ అలెన్ విధ్వంసకర శతకం బాదాడు. Everything is flying to the boundary tonight! 🫣ICC Men’s #T20WorldCup | Semi-final 1 #SAvNZ | LIVE NOW 👉 https://t.co/LMBOn54jDE pic.twitter.com/1kQbb9uF6n— Star Sports (@StarSportsIndia) March 4, 2026ఫాస్టెస్ట్ సెంచరీకేవలం 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫోర్ బాది కివీస్ గెలుపును ఖరారు చేశాడు. రచిన్ రవీంద్ర 11 బంతుల్లో 13 పరుగులతో అజేయంగా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్ సందర్భంగా టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్గా అలెన్ చరిత్ర సృష్టించాడు. -
పర్ఫెక్ట్ గేమ్ ఆడలేదు: టీమిండియాకు హ్యారీ బ్రూక్ వార్నింగ్
టీమిండియాతో సెమీ ఫైనల్ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో తాము ఇంత వరకు పరిపూర్ణమైన మ్యాచ్ ఆడలేదని.. అయినప్పటికీ సమిష్టిగా రాణించి విజయం సాధించామని పేర్కొన్నాడు. కాబట్టి టీమిండియాతో మ్యాచ్ గురించి తాము చెందాల్సిన అవసరం లేదన్నాడు.టీ20 ప్రపంచకప్-2026 లీగ్ దశలో నేపాల్ వంటి పసికూన చేతిలో తృటిలో ఓటమి నుంచి తప్పించుకున్న ఇంగ్లండ్.. ఆ తర్వాత సూపర్-8లో మాత్రం అదరగొట్టింది. శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్ మీద విజయాలు సాధించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే, ఈ మూడు మ్యాచ్లలో కూడా ఆఖరి వరకు పోరాడి ఇంగ్లండ్ గెలిచింది.కల నిజమైన తరుణం ఇదిఈ నేపథ్యంలో హ్యారీ బ్రూక్ (Harry Brook) మాట్లాడుతూ.. ‘‘ఆతిథ్య జట్టు (టీమిండియా)తో సెమీ ఫైనల్ ఆడటం విశేషం. మా జట్టులోని చాలా మంది కల నిజమైన తరుణం ఇది. ఈ మ్యాచ్ కోసం మేము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.పర్ఫెక్ట్ గేమ్ ఆడలేదు.. అయినాపూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నాం. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లలో పరిపూర్ణంగా ఆడలేదు. ఒక్కో మ్యాచ్లో ఒక్కొక్కరు కీలకంగా వ్యవహరించారు. టీమిండియాతో మ్యాచ్లో సైతం పూర్తి స్వేచ్ఛగా.. ధైర్యంగా ఆడతాం.ఈ టోర్నీలో కొన్ని ఉత్కంఠ మ్యాచ్లలో మేము గెలిచాము. మా బ్యాటర్లు స్పిన్ను ఎదర్కోవడంలో ఇబ్బంది పడతారని అంతా అనుకుంటున్నారు. కానీ మేము చక్కగా స్పిన్ ఆడగలము.వరుణ్ చక్రవర్తి బౌలింగ్లోప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడైన భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) బౌలింగ్లో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అతడి బౌలింగ్లో అత్యుత్తమంగా ఆడి వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తా’’ అని హ్యారీ బ్రూక్ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా టీమిండియాకు కఠిన సవాలు తప్పదని సంకేతాలు ఇచ్చాడు. తాము ఇప్పటివరకు పర్ఫెక్ట్గా ఆడకపోయినా ఎవరో ఒకరు జట్టును ఆదుకుంటారని.. గతంలో మాదిరే ఈసారి అదే పునరావృతం కావొచ్చని బ్రూక్ వార్నింగ్ ఇచ్చాడు. కాగా ముంబై వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య గురువారం సెమీ ఫైనల్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్ బోర్డులో తొలి రాజీనామా -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన సఫారీ క్రికెటర్లు
న్యూజిలాండ్తో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా ఆల్రౌండర్ మార్కో యాన్సెన్ అద్బుత బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. కివీస్ బౌలర్ల ధాటికి టాపార్డర్ కుదేలైన వేళ తాను ఉన్నానంటూ ముందుకు వచ్చాడు.చరిత్ర సృష్టించిన సఫారీ క్రికెటర్లుకేవలం 77 పరుగులే చేసి సగం వికెట్లు కోల్పోయిన తరుణంలో యాన్సెన్ (Marco Jansen) .. ట్రిస్టన్ స్టబ్స్ (Trisran Stubss)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరు కలిసి ఆరో వికెట్కు 47 బంతుల్లో 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తద్వారా ఈ జోడీ సరికొత్త చరిత్ర సృష్టించింది.సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఆరు లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లకు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జట్టుగా నిలిచింది. అంతేకాదు.. టీ20 ప్రపంచకప్ ప్లే ఆఫ్స్ మ్యాచ్లలో ఆరు లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లకు యాభైకి పైగా పరుగులు జోడించిన రెండో జంటగా యాన్సెన్- స్టబ్స్ నిలిచారు.Marco 𝗖𝗟𝗨𝗧𝗖𝗛 Jansen 🔥Entered at 77/5 & played an innings of a lifetime to guide South Africa a fighting total! 🙌ICC Men’s #T20WorldCup | Semi-final 1 #SAvNZ | LIVE NOW 👉 https://t.co/LMBOn54jDE pic.twitter.com/CCD0QTflth— Star Sports (@StarSportsIndia) March 4, 2026టీ20 ప్రపంచకప్ ప్లే ఆఫ్స్ మ్యాచ్లలో ఆరు లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లకు 50 ప్లస్ పార్ట్నర్షిప్ నమోదు చేసిన జోడీలు👉మార్కస్ స్టొయినిస్- మాథ్యూవేడ్ (ఆస్ట్రేలియా) పాకిస్తాన్ మీద 2021 సెమీ ఫైనల్లో 81*👉మార్కో యాన్సెన్- ట్రిస్టన్ స్టబ్స్ (సౌతాఫ్రికా) న్యూజిలాండ్ మీద 2026 సెమీ ఫైనల్లో 73👉ఏంజెలో మాథ్యూస్- కుమార్ సంగక్కర (శ్రీలంక) పాకిస్తాన్ మీద 2009 ఫైనల్లో 68*👉జార్జ్ బెయిలీ- ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) వెస్టిండీస్ మీద 2012 సెమీ ఫైనల్లో 68👉కార్లోస్ బ్రాత్వైట్- మార్లన్ సామ్యూల్స్ (వెసిండీస్) ఇంగ్లండ్ మీద 2016 ఫైనల్లో 54*👉మైకేల్ హస్సీ- మిచెల్ జాన్సన్ (ఆస్ట్రేలియా) పాకిస్తాన్ మీద 2010 సెమీ ఫైనల్లో 53*169 పరుగులుఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా న్యూజిలాండ్తో సెమీ ఫైనల్లో టాస్ ఓడిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 169 పరుగులు సాధించింది. మార్కో యాన్సెన్ 55 పరుగులతో అజేయంగా నిలవగా.. స్టబ్స్ 29 పరుగులు చేశాడు. డెవాల్డ్ బ్రెవిస్ 34 పరుగులతో రాణించాడు. చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్ బోర్డులో తొలి రాజీనామా -
T20 WC: వార్ వన్సైడ్ అనుకుంటే.. ఆఖర్లో దంచికొట్టేశాడే!
న్యూజిలాండ్తో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా మెరుగైన స్కోరు సాధించింది. ఆదిలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సఫారీ జట్టును ఆల్రౌండర్ మార్కో యాన్సెన్ మెరుపు అర్ధ శతకంతో ఆదుకున్నాడు. ఫలితంగా ప్రొటిస్ జట్టు గౌరవప్రదంగా ఇన్నింగ్స్ ముగించగలిగింది.టీ20 ప్రపంచకప్-2026 తొలి సెమీస్ మ్యాచ్లో భాగంగా కోల్కతాలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ సౌతాఫ్రికాను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఆది నుంచే కివీస్ బౌలర్లు నిప్పులు చెరగడంతో వరుస విరామాల్లో ప్రొటిస్ జట్టు వికెట్లు కోల్పోయింది. టాపార్డర్ కుదేలుఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (18), క్వింటన్ డికాక్ (10), ర్యాన్ రికెల్టన్ (0) పూర్తిగా విఫలమయ్యారు. డెవాల్డ్ బ్రెవిస్ (34) కాసేపు నిలబడగా... డేవిడ్ మిల్లర్ (6) పూర్తిగా నిరాశపరిచాడు. ఫలితంగా డెబ్బై ఏడు పరుగులకే సౌతాఫ్రికా ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఇలాంటి తరుణంలో ట్రిస్టన్ స్టబ్స్ (29)తో కలిసి మార్కో యాన్సెన్ భాగస్వామ్యం నిర్మించాడు. వీరిద్దరు కలిసి ఆరో వికెట్కు 47 బంతుల్లో 73 పరుగులు జోడించారు. 27 బంతుల్లో అర్ధ శతకంఇక ఈ మ్యాచ్లో యాన్సెన్ 27 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. ఈ టోర్నీలో అతడికి ఇదే తొలి హాఫ్ సెంచరీ. లాకీ ఫెర్గూసన్ బౌలింగ్లో సిక్స్ బాది యాభై పరుగుల మార్కు అందుకున్నాడు యాన్సెన్. మొత్తంగా 30 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 55 పరుగులతో అజేయంగా నిలిచాడు.Marco 𝗖𝗟𝗨𝗧𝗖𝗛 Jansen 🔥Entered at 77/5 & played an innings of a lifetime to guide South Africa a fighting total! 🙌ICC Men’s #T20WorldCup | Semi-final 1 #SAvNZ | LIVE NOW 👉 https://t.co/LMBOn54jDE pic.twitter.com/CCD0QTflth— Star Sports (@StarSportsIndia) March 4, 2026మిగిలిన వారిలో కార్బిన్ బాష్ రెండు పరుగులు చేయగా.. కగిసో రబడ డకౌట్ అయ్యాడు. కేశవ్ మహరాజ్ ఒక పరుగుతో నాటౌట్గా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 169 పరుగులు సాధించింది. హెన్రీ పొదుపుగా బౌలింగ్ చేయడంతోకివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, కోల్ మెకాంచీ, రచిన్ రవీంద్ర తలా రెండు వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్, జేమ్స్ నీషమ్ చెరో వికెట్ పడగొట్టారు. ఆఖరి ఓవర్లో హెన్రీ కేవలం ఆరు పరుగులే ఇచ్చి ప్రొటిస్ జట్టును నామమాత్రపు స్కోరుకు పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్ బోర్డులో తొలి రాజీనామా -
PCB: బాబర్పై వేటు.. కెప్టెన్గా ఆఫ్రిది.. ఆరుగురికి చోటు
ఊహాగానాలే నిజమయ్యాయి. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో విఫలమైన ‘స్టార్’ బ్యాటర్ బాబర్ ఆజంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) వేటు వేసింది. బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ నుంచి అతడిని తప్పించింది.బంగ్లాతో వన్డే సిరీస్కాగా ఢాకా వేదికగా బంగ్లాదేశ్- పాకిస్తాన్ మధ్య మార్చి 11- 15 మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగనుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో పర్యటించే జట్టును పీసీబీ బుధవారం ప్రకటించింది. పేస్ బౌలర్ షాహిన్ ఆఫ్రిదిని కెప్టెన్గా కొనసాగించిన యాజమాన్యం.. బాబర్ను మాత్రం ఎంపిక చేయలేదు.ఆరుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటుఅంతేకాదు.. ఈ జట్టులో ఏకంగా ఆరుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటు ఇచ్చారు సెలక్టర్లు. తద్వారా సీనియర్లపై కఠిన చర్యలు తప్పవని.. జట్టు పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే అబ్దుల్ సమద్, మాజ్ సదాకత్, ముహమద్ ఘాజి ఘోరి, సాద్ మసూద్, సాహిబ్జాదా ఫర్హాన్, షామిల్ హుసేన్లకు తొలిసారి వన్డే జట్టులో చోటు ఇచ్చారు.అందుకే బాబర్పై వేటు.. వారికి చోటుకాగా బాబర్ ఆజం ఆట తీరుపై గత కొంతకాలంగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే ప్రపంచకప్ టోర్నీలోనూ అతడు విఫలమయ్యాడు. మొత్తంగా 91 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.ఇక గతేడాది వన్డేల్లోనూ బాబర్ ఆజం 17 ఇన్నింగ్స్లో కలిపి కేవలం 544 పరుగులే చేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో అతడిని పక్కనపెట్టారు. మరోవైపు.. టీ20 జట్టులో నిలకడగా రాణిస్తున్న ఓపెనర్ ఫర్హాన్కు మాత్రం సెలక్టర్లు వన్డేక్యాప్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కాగా ఫర్హాన్ వరల్డ్కప్ టోర్నీలో 383 పరుగులతో రాణించాడు.ఇదిలా ఉంటే.. అన్క్యాప్డ్ ప్లేయర్లు అబ్దుల్, మాజ్, మసూద్, హుసేన్ ఇప్పటికే పాకిస్తాన్ షాహిన్స్ తరఫున సత్తా చాటారు. ఇక సీనియర్ ప్లేయర్, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్, పేసర్ హ్యారిస్ రవూఫ్, మొహమ్మద్ వసీం జూనియర్, ఆల్రౌండర్ ఫాహిమ్ ఆష్రఫ్, సల్మాన్ ఆఘా, మణికట్టు స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ఈ వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు.బంగ్లాదేశ్తో వన్డేలకు పాకిస్తాన్ జట్టుషాహిన్ ఆఫ్రిది (కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, ఫాహిమ్ ఆష్రఫ్, ఫైజల్ అక్రం, హ్యారిస్ రవూఫ్, హుసేన్ తలత్, మాజ్ సదాకత్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ వసీం జూనియర్, ముహమద్ ఘాజి ఘోరి (వికెట్ కీపర్), సాద్ మసూద్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ ఆఘా, షామిల్ హుసేన్షెడ్యూల్మార్చి 11- తొలి వన్డేమార్చి 13- రెండోవన్డేమార్చి 15- మూడో వన్డేవేదిక: షేరే బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియం, ఢాకా.చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్ బోర్డులో తొలి రాజీనామా -
T20 WC 1st Semi Final: టాస్ గెలిచిన కివీస్.. తుదిజట్లు ఇవే
పొట్టి క్రికెట్ మహా సంగ్రామంలో తొలి సెమీ ఫైనల్ పోరుకు తెరలేచింది. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా సౌతాఫ్రికా- న్యూజిలాండ్ మధ్య జరిగే ఈ మెగా మ్యాచ్కు కోల్కతా వేదిక. ఈడెన్ గార్డెన్స్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. ప్రొటిస్ జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించింది.టాస్ సందర్భంగా కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ.. ‘‘పిచ్ బాగుంది. వికెట్ పాతబడే కొద్ది బ్యాటింగ్కు ఇంకాస్త సహకరిస్తుందని అనిపిస్తోంది. అందుకే తొలుత బౌలింగ్ ఎంచుకున్నాం. ఆది నుంచే ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాల్సి ఉంటుంది. మ్యాట్ హెన్రీ తిరిగిఇ వచ్చాడు. సోధి స్థానంలో నీషమ్ కూడా తుదిజట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.It’s semi-final time! Mitchell Santner has won the toss and opted to bowl first! 🪙Who will be the first team to make it to the final? 🤔ICC Men’s #T20WorldCup | Semi-final 1 #SAvNZ | LIVE NOW 👉 https://t.co/LMBOn54jDE pic.twitter.com/N8m1kkxoX8— Star Sports (@StarSportsIndia) March 4, 2026మా తుదిజట్టులో మూడు మార్పులుఇక సౌతాఫ్రికా సారథి ఐడెన్ మార్క్రమ్ మాట్లాడుతూ.. ‘‘ఈ టోర్నీలో ఇప్పటి వరకు మా జట్టులోని ప్రతి సభ్యుడు తమ వంతు సహకారం అందించడం సంతోషకరం. ఈ మ్యాచ్లోనూ గొప్పగా రాణించి మంచి స్కోరు నమోదు చేస్తామని ఆశిస్తున్నా. గత రాత్రి కూడా మేము ప్రాక్టీస్ చేశాము.మా తుదిజట్టులో మూడు మార్పులు చేశాము. రబడ, యాన్సెన్, కేశవ్ మహరాజ్ తిరిగి జట్టులోకి వచ్చారు’’ అని పేర్కొన్నాడు. కాగా సూపర్-8 దశలో అజేయంగా నిలిచిన సౌతాఫ్రికా తొలి టైటిల్ వేట దిశగా సెమీస్ రూపంలో మరో ముందడుగు వేసింది. గత ఎడిషన్లో రన్నరప్తో సరిపెట్టుకున్న సఫారీలు ఈసారి పట్టు వదలకుండా పోరాడేందుకు సిద్ధమయ్యారునిలకడైన ఆట.. ప్రొటిస్దే పైచేయిమరోవైపు.. సౌతాఫ్రికా మాదిరే ఇంత వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని న్యూజిలాండ్ సైతం ఈసారి ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఉంది. అయితే, ఈ ఎడిషన్లో ప్రదర్శనల పరంగా కివీస్ కంటే సఫారీలే ఓ అడుగు ముందున్నారు. ఇక సూపర్-8 దశలో పాకిస్తాన్తో ఆడాల్సిన మ్యాచ్ రద్దు కాగా.. శ్రీలంకపై గెలిచిన న్యూజిలాండ్ సెమీస్ రేసులో ముందుకు దూసుకువచ్చింది. ఆఖరి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఓడినా.. పాక్ శ్రీలంకపై నామమాత్రపు విజయంతో సరిపెట్టుకోవడంతో సెమీ ఫైనల్లో అడుగుపెట్టగలిగింది.తుదిజట్లు ఇవేన్యూజిలాండ్టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కోల్ మెక్కాంచీ, మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్సౌతాఫ్రికాఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, లుంగి ఎన్గిడి.చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్ బోర్డులో తొలి రాజీనామా -
T20 WC 2026: తిరగబడ్డ పాక్ క్రికెటర్లు!.. ఇక..
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో చెత్త ప్రదర్శనతో వార్తల్లో నిలుస్తోంది పాకిస్తాన్ క్రికెట్ జట్టు. గ్రూప్ దశలో అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా వంటి చిన్న జట్లపై గెలుపొందిన సల్మాన్ ఆఘా బృందం.. దాయాది టీమిండియా చేతిలో మాత్రం చిత్తుగా ఓడిపోయింది.పాకిస్తాన్కు భంగపాటుఇక సూపర్-8 దశలోనూ పేలవ ప్రదర్శన కనబరిచింది. న్యూజిలాండ్తో ఆడాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దైపోగా.. తదుపరి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఓడి సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. ఆ తర్వాత శ్రీలంకపై భారీ విజయం సాధించాల్సి ఉండగా.. లంక గట్టి పోరాటం చేయడంతో పాకిస్తాన్కు భంగపాటు తప్పలేదు.లంకపై గెలిచినా న్యూజిలాండ్తో పోటీలో నెట్ రన్రేటు పరంగా వెనుకబడి సెమీస్ చేరకుండానే పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్లో విఫలమైన ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి.భారీ జరిమానాఏకంగా 50 లక్షల రూపాయలు (పాక్ కరెన్సీలో) జరిమానా విధించాలని పీసీబీ నిర్ణయించినట్లు స్థానిక మీడియాలో ప్రచారం జరిగింది. మరోవైపు కెప్టెన్ సల్మాన్ ఆఘాపై వేటు పడనుందనే వార్తలూ ఊపందుకున్నాయి.ఈ పరిణామాల నేపథ్యంలో.. హెడ్కోచ్ మైక్ హసన్కు వ్యతిరేకంగా పాక్ ఆటగాళ్లు తిరుగుబాటు చేసినట్లు సమాచారం. కోచ్ ఏకపక్ష నిర్ణయాల కారణంగా డ్రెసింగ్ వాతావరణం పూర్తిగా దెబ్బతిన్నదని ఇప్పటికే పీసీబీ అధికారులకు వ్యక్తిగతంగా ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది.తిరగబడ్డ పాక్ క్రికెటర్లు!.. ఇక వేటే!జియో సూపర్ కథనం ప్రకారం.. ‘‘టోర్నమెంట్ జరుగుతున్న సమయంలోనే చాలా మంది పాకిస్తాన్ ప్లేయర్లు వ్యక్తిగతంగా పీసీబీ అధికారులను కలసి కోచ్ గురించి ఫిర్యాదు చేశారు. కీలక విషయాలను సైతం కెప్టెన్తో చర్చించకుండానే నిర్ణయం తీసుకున్న తీరును వారి దృష్టికి తీసుకువచ్చారు.సొంత నిర్ణయాలతో యాజమాన్యం విషయాల్లోనూ హసన్ అతిగా జోక్యం చేసుకుంటున్న తీరును వివరించారు. ఇందుకు సీనియర్ అధికారులు సానుకూలంగా స్పందించి.. సమీక్ష జరుపుతున్నారు. కోచ్తో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, హసన్కు రెండేళ్ల కాంట్రాక్టు ఉంది. కాబట్టి ఇప్పట్లో అతడిని తొలగించే ప్రయత్నం జరగకపోవచ్చు’’ అని పీసీబీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్ బోర్డులో తొలి రాజీనామా -
టీమిండియాపై చంద్ర గ్రహణం ఎఫెక్ట్
టీమిండియా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీతో బిజీగా ఉంది. గ్రూప్ దశలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లను ఓడించి అజేయంగా సూపర్-8కు చేరుకుంది.ఇంగ్లండ్తో సెమీ ఫైనల్అయితే, సూపర్-8లో తొలి మ్యాచ్లోనే సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన సూర్యకుమార్ సేన.. ఆ తర్వాత జింబాబ్వే, వెస్టిండీస్లను ఓడించి సెమీస్కు అర్హత సాధించింది. ఈ క్రమంలో రెండో సెమీ ఫైనల్లో భాగంగా ఇంగ్లండ్ (IND vs ENG)తో గురువారం తలపడనుంది టీమిండియా. ఇందుకు ముంబైలోని వాంఖడే మైదానం వేదిక.ఇందుకోసం ఇప్పటికే ముంబై చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టేసింది. అయితే, మంగళవారం నాటి చంద్ర గ్రహణం ప్రభావం టీమిండియాపై కూడా పడింది. గ్రహణం కారణంగా సూర్యకుమార్ సేన తమ ప్రాక్టీస్ సెషన్ను గంటపాటు వాయిదా వేసుకుంది.టీమిండియాపై చంద్ర గ్రహణం ఎఫెక్ట్కాగా గ్రహణం మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 నిమిషాల వరకు కొనసాగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయంత్రం 6- 9 గంటల వరకు టీమిండియా ప్రాక్టీస్ చేయాల్సి ఉండగా.. గంట ఆలస్యంగా అంటే ఏడు గంటలకు నెట్ సెషన్ను ఆరంభించింది. గ్రహణం సమయంలో ఏ పని చేయకూడదని.. అలా చేస్తే దురదృష్టం వెంటాడుతుందేమోనన్న భయంతో భారత జట్టు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.అవును.. మా వాళ్లు చెప్పారుఈ విషయం గురించి టీమిండియా కోచ్ మోర్నీ మోర్కెల్ స్పందించాడు. ‘‘అవును.. చంద్ర గ్రహణం గురించి నాకు మా వాళ్లు చెప్పారు. అందుకే సెషన్ను వాయిదా వేసుకున్నాం. అయితే, గ్రహణం ఒక్కటే మా రాతను మారుస్తుందనే భయం లేదు. గెలుపు కోసం అత్యుత్తమంగా ప్రయత్నించడమే ముఖ్యమైనది’’ అని మోర్కెల్ పేర్కొన్నాడు.కాగా ఇంగ్లండ్తో సెమీ ఫైనల్కు ఆఖరిగా బుధవారం కూడా టీమిండియా ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. అయితే ఇది ఆప్షనల్ కావడంతో వరుణ్ చక్రవర్తి, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ మాత్రమే నెట్స్లో శ్రమించారు. మిగతా వారు విశ్రాంతి తీసుకున్నట్లు సమాచారం. చదవండి: IND vs ENG: అభిషేక్ శర్మను తప్పించండి.. కానీ: రవిశాస్త్రి -
T20 WC 2026: బాబర్ ఆజం ఎందుకు?.. తొలి రాజీనామా
పాకిస్తాన్ క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ను పేలవంగా ముగించింది. సూపర్-8లో తప్పక భారీ విజయం సాధించాల్సిన మ్యాచ్లో నామమాత్రపు గెలుపుతో సరిపెట్టుకుంది. ఫలితంగా సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.గుర్రుగా ఉన్న పీసీబీఐసీసీ ఈవెంట్లో పాక్ సెమీ ఫైనల్ కూడా చేరకుండానే ఇంటిబాట పట్టడం వరుసగా ఇది నాలుగోసారి. ఈ నేపథ్యంలో ఇంటా బయటా పాక్ జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సైతం సల్మాన్ ఆఘా (Salman Agha) బృందంపై తీవ్ర అసంతృప్తితో ఉంది. ఆటగాళ్లకు జరిమానా రూపంలో శిక్ష విధించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.సెలక్టర్ పదవికి రాజీనామాఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్లో వైఫల్యం తర్వాత పాక్ బోర్డులో తొలి వికెట్ పడింది. అలీం దర్ సెలక్టర్ పదవికి రాజీనామా చేశాడు. సెలక్షన్ కమిటీలోని ఇతర సభ్యులు, హెడ్కోచ్ మైక్ హసన్ తీరుకు నిరసనగా అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అంపైర్గా పేరుప్రఖ్యాతులు పొందిన అలీం దర్ అక్టోబరు 11, 2024లో పాక్ జట్టు సెలక్టర్గా నియమితుడయ్యాడు.ఆకిబ్ జావేద్, అజర్ అలీ, అనలిస్టు హసన్ చీమాతో కలిసి సెలక్టర్ పదవి చేపట్టాడు. అయితే, టీ20 ప్రపంచకప్ టోర్నీకి జట్టును ఎంపిక చేసే సమయంలో మైక్ హసన్ అతి జోక్యం వల్ల అలీం దర్ తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు సమాచారం.బాబర్ ఆజం వద్దు అన్నందుకేనా?బాబర్ ఆజం, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ వంటి సీనియర్లను ఎంపిక చేయవద్దని దర్ భావించగా.. ఆకిబ్ జావేద్ మద్దతుతో హసన్ ఈ ముగ్గురిని జట్టులో చేర్చినట్లు సమాచారం. అదే విధంగా మహ్మద్ రిజ్వాన్ను ఆరో స్థానానికి ఎంపిక చేస్తే బాగుంటుందనే అలీం దర్ అభిప్రాయాన్ని కూడా వీరు కొట్టివేసినట్లు తెలుస్తోంది.అంతేకాదు ఆకిబ్ జావేద్ కోచ్ హసన్కే మద్దతు పలుకుతూ.. ఇతర సభ్యుల నిర్ణయాలను ప్రభావితం చేసినట్లు సమాచారం. ఈ పరిణామాలతో విసిగిపోయిన అలీం దర్ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా మంగళవారమే అతడు తన రాజీనామా లేఖను సమర్పించినట్లు పాక్ స్థానిక మీడియా పేర్కొంది. కాగా అలీం దర్ వద్దన్నా.. హసన్, జావేద్ పట్టుబట్టి జట్టులో చేర్చిన బాబర్ ఆజం, షాదాబ్, ఉస్మాన్ ఈ టోర్నీలో దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. చదవండి: అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్ సిగ్నల్! -
IND vs ENG: అభిషేక్ శర్మను తప్పించండి.. కానీ: రవిశాస్త్రి
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ గత కొంతకాలంగా విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో అతడి వైఫల్యాలే ఇందుకు కారణం. ఐసీసీ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ టీ20 బ్యాటర్గా కొనసాగుతున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. కెరీర్లో తొలిసారి వరల్డ్కప్ ఆడుతున్నాడు.మూడు డకౌట్లువిధ్వంసకర ఓపెనర్గా పేరొందిన అభిషేక్ శర్మ (Abhishek Sharma).. సొంతగడ్డపై భారీ అంచనాల నడుమ బరిలోకి దిగాడు. అయితే, ఆడిన తొలి మూడు మ్యాచ్లలో డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. మొత్తంగా ఆరు మ్యాచ్లలో కలిపి అతడు చేసిన పరుగులు కేవలం 80.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో కీలక సెమీ ఫైనల్కు ముందు భారత జట్టు మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) అభిషేక్ శర్మను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. వరుస వైఫల్యాల కారణంగా అతడు మానసికంగా కాస్త కుంగిపోయి ఉండవచ్చని అభిప్రాయపడ్డాడు. అలాంటపుడు తుదిజట్టు నుంచి అభిషేక్ శర్మను తప్పించడమే సరైన నిర్ణయమని పేర్కొన్నాడు.అదొక్క మార్పు సరిపోతుందిఐసీసీ రివ్యూ షోలో మాట్లాడుతూ.. ‘‘నెట్స్లో బ్యాటింగ్ తీరును చూసి అంచనాకు రాకూడదు. అతడితో ప్రత్యేకంగా మాట్లాడాలి. మానసికంగా అతడు ఎంత దృఢంగా ఉన్నాడో తెలుసుకోవాలి.ఒకవేళ అభిషేక్ శర్మను కొనసాగించకూడదని అనుకుంటే.. ఇషాన్ కిషన్ను ఓపెనర్గా ఆడించాలి. లోయర్ ఆర్డర్లో రింకూ సింగ్ను తీసుకువస్తే సరి. సెమీ ఫైనల్లో తుదజట్టులో అదొక్క మార్పు సరిపోతుంది.అయితే, అభిషేక్ శర్మ గత సిరీస్లో ఇంగ్లండ్ మీద అదరగొట్టిన తీరును మర్చిపోకూడదు. వాంఖడేలో గతంలో అతడి ప్రదర్శన అద్భుతం. అక్కడ అతడు భారీ, వేగవంతమైన శతకాలు బాదాడు. కాబట్టి అభిషేక్ శర్మను కొనసాగిస్తే బాగుంటుందనీ అనుకుంటున్నాను ఒకవేళ రింకూను తీసుకురావాలని అనుకుంటే మాత్రం ఓపెనింగ్ జోడీ మారక తప్పదు’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. గతేడాది ఇంగ్లండ్పై ఇరగదీసిన అభిషేక్కాగా గతేడాది వాంఖడే వేదికగా ఇంగ్లండ్తో మ్యాచ్లో అభిషేక్ శర్మ 54 బంతుల్లోనే 135 పరుగులు సాధించాడు. తద్వారా అంతర్జాతీయ పొట్టి క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత బ్యాటర్గా అతడు చరిత్రకెక్కాడు. ఇదిలా ఉంటే.. ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానం వేదికగా భారత్- ఇంగ్లండ్ సెమీ ఫైనల్లో తలపడేందుకు రంగం సిద్ధమైంది.చదవండి: అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్ సిగ్నల్! -
ధోని, కోహ్లీ, రోహిత్ గ్రూప్లో సంజూ
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 మ్యాచ్లో వెస్టిండీస్పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ తర్వాత టీమిండియా వికెట్కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్పై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఆ ఇన్నింగ్స్కు భారత అభిమానులే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ముగ్దులయ్యారు. ప్రస్తుతం భారత క్రికెట్ సర్కిల్స్లో ఏ నోట విన్నా సంజూ పేరే వినిపిస్తుంది. అప్పటిదాకా తిట్టిపోసిన వారు కూడా విండీస్పై చారిత్రక ఇన్నింగ్స్ తర్వాత సంజూను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.అప్పటికే స్టార్ డమ్ ఉన్న సంజూ, ఆ ఒక్క ఇన్నింగ్స్తో దాన్ని మరింత పెంచుకున్నాడు. ఎంతలా అంటే.. భారత మాజీ వికెట్కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ సంజూను దిగ్గజలు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో పోల్చేంతలా. డీకే సంజూను ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో సమానంగా అభిమానుల ఆదరణ పొందుతున్న ఆటగాడిగా అభివర్ణించాడు. అతని మాటల్లో.. సంజూ దేశంలో అత్యంత అభిమానించబడే క్రికెటర్. ఆయనలో ఏదో ప్రత్యేకత ఉంది. ఎత్తుపల్లాలు ఎదురైనా, అభిమానులు ఎప్పుడూ ఆయనపై నమ్మకం ఉంచారని అన్నాడు.డీకే అభిప్రాయం ప్రకారం, సంజూ ప్రపంచకప్ ప్రారంభం నుంచే జట్టులో ఉండాల్సింది. ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్లపై కష్టపడుతున్న ఎడమచేతి వాటం బ్యాటర్లకు ప్రత్యామ్నాయంగా సంజూ సమతుల్యతను తీసుకొచ్చాడు.వాస్తవానికి సంజూ టాలెంట్ ఎప్పుడూ గుర్తింపు పొందినా.. గాయాలు, అస్థిరత, ఎంపికల మార్పులు అతని కెరీర్ను దెబ్బతీశాయి. అయినప్పటికీ, అతను సహజమైన స్ట్రోక్ ప్లే, ఆత్మవిశ్వాసంతో తిరిగి తనను చాటుకున్నాడు.కాగా, విండీస్తో జరిగిన సూపర్-8 మ్యాచ్లో భారత్ 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత టాపార్డర్ తడబడింది. ఈ దశలో సంజూ (50 బంతుల్లో 97 పరుగులు; 12 ఫోర్లు, 4 సిక్సులు) తానున్నానంటూ ముందుకొచ్చి టీమిండియాను గెలిపించాడు. తద్వారా భారత్ సెమీస్ బెర్త్ ఖరారైంది. రేపు జరుగబోయే సెమీస్లో భారత్ ఇంగ్లండ్తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్లోనూ సంజూ కీలకమయ్యే అవకాశం ఉంది. -
నేడే సౌతాఫ్రికా-న్యూజిలాండ్ మధ్య మెగా సమరం
టీ20 ప్రపంచకప్ 2026 తది దశకు చేరింది. ఇవాళ (మార్చి 4) తొలి సెమీఫైనల్.. రేపు (మార్చి 5) రెండో సెమీఫైనల్ జరుగనున్నాయి. సౌతాఫ్రికా-న్యూజిలాండ్ తొలి సెమీఫైనల్లో తలపడనుండగా.. భారత్-ఇంగ్లండ్ రెండో సెమీస్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.సౌతాఫ్రికా-న్యూజిలాండ్ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డన్స్ వేదికగా ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుండగా.. భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రేపు రాత్రి 7 గంటలకు మొదలవుతుంది.సౌతాఫ్రికా-న్యూజిలాండ్ మ్యాచ్ మరి కొద్గి గంటల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏ జట్టుకు విజయావకాశాలు అధికంగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతుంది. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా, బలాబలాల ప్రకారం ఇరు జట్లు సమానంగా ఉన్నాయన్నది కాదనలేని సత్యం.ప్రస్తుత ఎడిషన్లో సౌతాఫ్రికాతో పోలిస్తే న్యూజిలాండ్ కాస్త తడబడినా, ఆ జట్టు శక్తిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎంతటి ప్రతికూల పరిస్థితులను అయినా ఆ జట్టు తమకు అనుకూలంగా మార్చుకున్న సందర్భాలను చాలా చూశాం. ఈ జట్టును ఎప్పుడూ ఫామ్ను బట్టి అంచనా వేయలేని పరిస్థితి. ఒక్కసారి లైన్లోకి వచ్చారంటే వారిని ఆపడం చాలా కష్టం. క్షణాల్లో ఫలితం తారుమారవుతుంది.సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుత ఎడిషన్లో ఓటమి ఎరుగని ఏకైక జట్టుగా దూసుకుపోతుంది. పైగా గ్రూప్ దశలో న్యూజిలాండ్ను ఓడించిన జోష్లో ఉంది. ఫామ్ను పరిగణిలోకి తీసుకుంటే ఈ జట్టే టైటిల్ ఫేవరెట్లలో ముందుంది.అయితే ఈ జట్టుకు కూడా కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. నాకౌట్ మ్యాచ్ల్లో తడబడటం సౌతాఫ్రికాకు పరిపాటి. గతంలో వారు ఇలాంటి అనుభవాలు కోకొల్లలుగా ఎదుర్కొన్నారు. అయితే ఈసారి వారి కసి చూస్తే టైటిల్ గెలవకుండా తమను ఎవరూ ఆపలేరన్నట్లుగా ఉంది. జట్టులోకి ప్రతి ఒక్కరు మంచి ఫామ్లో ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సమతూకంగా ఉంది. ఒక్క నాకౌట్ ఫోబియా తప్పించి సౌతాఫ్రికాను ఏదీ కలవరపెట్టట్లేదు.హెడ్ టు హెడ్ రికార్డులు కూడా ఈ జట్టుకే అనుకూలంగా ఉన్నాయి. ఇరు జట్లు ఇప్పటివరకు 19 టీ20ల్లో తలపడగా.. సౌతాఫ్రికా 12, న్యూజిలాండ్ ఏడింట మాత్రమే గెలుపొందాయి. ప్రపంచకప్ సమరాల విషయానికొస్తే.. సౌతాఫ్రికా సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. మెగా టోర్నీల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 5 సార్లు ఎదురెదురుపడగా.. ఐదింట సౌతాఫ్రికానే జయకేతనం ఎగురవేసింది.ఇన్ని సానుకూల పరిణామాల మధ్య సౌతాఫ్రికా నేటి మ్యాచ్లో మరోసారి హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. ఏ జట్టు పైచేయి సాధిస్తుందో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.న్యూజిలాండ్ సెమీస్ను అధిగమించిన సందర్భాలు.. 2021 (ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి)సౌతాఫ్రికా సెమీస్ను అధిగమించిన సందర్భాలు.. 2024 (ఫైనల్లో భారత్ చేతిలో ఓటమి) -
ఇండియాకు అగ్ని పరీక్ష..!
-
భారత జట్టు ముమ్మర సాధన
టి20 ప్రపంచకప్లో ఇంగ్లండ్తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్కు సిద్ధమవుతున్న భారత క్రికెట్ జట్టు పూర్తి స్థాయి సాధనలో పాల్గొంది. ముంబైలోనే వాంఖెడే మైదానంలో మంగళవారం సుదీర్ఘ సమయం పాటు సాగిన ప్రాక్టీస్లో జట్టులో 15 మంది సభ్యులందరూ పాల్గొన్నారు. చంద్రగ్రహణం కారణంగా జట్టు ప్రాక్టీస్ దాదాపు గంట ఆలస్యంగా మొదలైంది. బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ పర్యవేక్షణలో అభిషేక్ శర్మ ప్రత్యేకంగా ఆఫ్ స్పిన్ను ఎదుర్కొంటూ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ టోర్నీలో అభిషేక్ ఆఫ్ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోలేక ఇబ్బంది పడ్డాడు. తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ అటు స్పిన్, ఇటు పేస్ బౌలింగ్లో సాధన చేశారు. కుల్దీప్ బౌలింగ్లో స్లాగ్స్వీప్లపై తిలక్ దృష్టి పెట్టాడు. అర్ష్ దీప్ సింగ్ యార్కర్లను సంధించడంపై ఎక్కువగా ప్రాక్టీస్ చేయగా, బుమ్రా మాత్రం ఎదురుగా బ్యాటర్ లేకుండా తనదైన శైలిలో స్పాట్ బౌలింగ్కే ప్రాధాన్యతనిచ్చాడు. హార్దిక్ పాండ్యా మాత్రం భారీ షాట్లపైనే దృష్టి పెడుతూ ప్రతీ బంతినీ బౌండరీకి తరలించే తరహాలో సాధన చేశాడు. సెమీస్కు రెండు రోజుల మాత్రం పిచ్పై చాలా పచి్చక కనిపిస్తున్నా...మ్యాచ్ ముందు దానిని తొలగించే అవకాశం ఉంది. -
సెమీస్ సమరానికి సిద్ధం
టి20 ప్రపంచ కప్ చరిత్రలో రెండు టీమ్లదీ దాదాపు ఒకే రకమైన పరిస్థితి...ఇరు జట్లు ఒక్కో సారి ఫైనల్ వరకు చేరగలిగినా టైటిల్ గెలుచుకోలేక రన్నరప్గానే సంతృప్తి చెందాయి. లీగ్ దశలో అద్భుతంగా ఆడుతున్నా, ప్రత్యర్థి జట్లకు సవాల్ విసురుతున్నా అసలు సమయంలో మాత్రం ఈ టీమ్లు చేతులెత్తేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఫైనల్ చేరి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సిద్ధమయ్యాయి. రెండు టీమ్లలో ఒకరికి మాత్రమే టైటిల్ వేటలో పోటీ పడేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలో తుది పోరుకు అర్హత సాధించేందుకు రెండు జట్లూ సై అంటున్నాయి. ఈడెన్ గార్డెన్స్లో హోరాహోరీ పోరులో ఏ జట్టు పైచేయి సాధిస్తుందనేది ఆసక్తికరం. కోల్కతా: టి20 వరల్డ్ కప్ తొలి నాకౌట్ సమరానికి రంగం సిద్ధమైంది. నేడు (బుధవారం) జరిగే తొలి సెమీఫైనల్లో గత టోర్నీ రన్నరప్ దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ తలపడుతుంది. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్లలో కూడా విజయాలు సాధించే దక్షిణాఫ్రికా అజేయంగా సెమీస్ చేరగా...కివీస్ ప్రస్థానం మాత్రం తడబడుతూ సాగింది. లీగ్ దశలో మూడు బలహీన జట్లను ఓడించిన న్యూజిలాండ్, సూపర్ ఎయిట్స్లో ఒకటే విజయంతో ముందంజ వేసింది. ఈ టోర్నీలో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో దక్షిణాఫ్రికా అలవోక విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే ప్రదర్శనతో దక్షిణాఫ్రికా ఫైనల్ చేరుతుందా లేక గత మ్యాచ్కు కివీస్ ప్రతీకారం తీర్చుకుంటుందా చూడాలి. అద్భుత ఫామ్లో... 2024 వరల్డ్ కప్ ఫైనల్లో దాదాపు చివరి వరకు ఆధిపత్యం ప్రదర్శించి అనూహ్యంగా ఓడిన దక్షిణాఫ్రికా ఈ సారి మెగా టోర్నీకి బాగా సన్నద్ధమై వచ్చినట్లు కనిపించింది. ప్రత్యర్థులకు ఎక్కడా ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆ జట్టు చెలరేగిపోతోంది. అఫ్గనిస్తాన్పై పోరు సూపర్ ఓవర్ వరకు వెళ్లినా...భారత్, న్యూజిలాండ్, వెస్టిండీస్లను ఓడించిన తీరు జట్టు బలాన్ని చూపించింది. కెప్టెన్ మార్క్రమ్ తన కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్లో కనిపిస్తున్నాడు. టాపార్డర్లో డికాక్, రికెల్టన్లనుంచి అతనికి సరైన మద్దతు లభిస్తోంది. బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్లతో మిడిలార్డర్ చాలా పటిష్టంగా ఉంది. మిల్లర్ చాలా కాలంగా నిలకడగా రాణిస్తుండగా, బ్రెవిస్ మెరుపు బ్యాటింగ్తో ఏ టీమ్పైనైనా చెలరేగిపోగలడు. యాన్సెన్, బాష్ రూపంలో ఇద్దరు చక్కటి ఆల్రౌండర్లు ఉండటం జట్టు బలాన్ని పెంచింది. బౌలింగ్లో ఇద్దరు బెస్ట్ ఫాస్ట్ బౌలర్లు జట్టును నడిపిస్తున్నారు. రబాడ, ఎన్గిడి ప్రతీ మ్యాచ్లో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో సఫలం కావడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీసి కోలుకోకుండా చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల తన ఆటను అమాంతం మెరుగుపర్చుకున్న ఎన్గిడి ‘స్లో బంతులు’ బ్యాటర్లకు పెద్ద సమస్యగా మారాయి. జట్టులో ఏకైక స్పిన్నర్గా కేశవ్ మహరాజ్ తన సత్తాను ప్రదర్శిస్తున్నాడు. ఓవరాల్గా అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న సఫారీలకే గెలుపు సానుకూలత ఎక్కువగా ఉంది. తడబడుతూనే... ప్రత్యర్థితో పోలిస్తే న్యూజిలాండ్ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. టోర్నీ ఆరంభానికి ముందు బలాబలాల్లో ఏ జట్టుకూ కూడా తీసిపోనట్లు కనిపించిన కివీస్ అసలు సమయంలో మాత్రం ఆ స్థాయి ప్రదర్శనను చూపించలేకపోయింది. ఏ ఆటగాడు కూడా ఒంటిచేత్తో టీమ్ను గెలిపించేలా కనిపించడం లేదు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో కూడా జట్టులో తడబాటు కనిపిస్తూనే ఉంది. టాప్–3 బ్యాటర్లు సీఫెర్ట్, అలెన్, రచిన్లలో ఎవరూ గొప్పగా ఆడలేదు. ఫిలిప్స్లో కూడా నిలకడ లోపించగా...చాప్మన్ పూర్తిగా విఫలమయ్యాడు. ఇటీవల భారత్తో సిరీస్లో చెలరేగిన మిచెల్ పెద్దగా ప్రభావం చూపలేకపోగా...కెపె్టన్ సాంట్నర్ వైఫల్యం జట్టును దెబ్బ తీసింది. బౌలింగ్లో విఫలమైన సాంట్నర్ బ్యాటింగ్లో కూడా ఒక్క ఇన్నింగ్స్ మినహా ఎక్కడా బాగా ఆడలేదు. ఇంగ్లండ్ చేతిలో పరాజయం జట్టు బలహీనతలను స్పష్టంగా చూపించింది. బౌలింగ్లో ఫెర్గూసన్పైనే ప్రధానంగా పేస్ భారం ఉంది. వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిన హెన్రీ సెమీస్ వరకు తిరిగి వస్తాడని మేనేజ్మెంట్ చెప్పినా, దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒక వేళ హెన్రీ రాకపోతే అతని స్థానంలో డఫీ బరిలోకి దిగుతాడు. కివీస్ ఏకంగా ఐదుగురు స్పిన్నర్లతో ఆడుతున్నా ఒక్కరు కూడా ప్రమాదకరంగా కనిపించడం లేదు. అందరూ ధారాళంగా పరుగులిస్తున్నారు. తుది జట్లు (అంచనా) దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్), డికాక్, రికెల్టన్, బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, యాన్సెన్, బాష్, రబాడ, మహరాజ్, ఎన్గిడి న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్), సీఫెర్ట్, అలెన్, రచిన్, ఫిలిప్స్, చాప్మన్, మిచెల్, మెక్కోన్కీ, సోధి, ఫెర్గూసన్, హెన్రీ / డఫీ5-0 టి20 వరల్డ్ కప్ చరిత్రలో ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్లు జరగ్గా...ఐదు కూడా దక్షిణాఫ్రికానే గెలిచింది. పిచ్, వాతావరణంబ్యాటింగ్కు బాగా అనుకూలమైన పిచ్. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. మంచు ప్రభావంతక్కువగా ఉన్నా సరే ఇక్కడ ఛేదన చాలా సులువు. భారత్, విండీస్ మధ్య పోరులో కూడా ఇది కనిపించింది. మ్యాచ్ రోజు వర్ష సూచన లేదు. -
చెత్త ఫీల్డింగ్.. టీమిండియా గెలవలేదు: పాక్ మాజీ బౌలర్ ఓవరాక్షన్
పాకిస్తాన్ మాజీ బౌలర్ మహ్మద్ ఆమిర్ మరోసారి టీమిండియాపై విమర్శలు గుప్పించాడు. భారత జట్టుకు ఫైనల్ చేరే సత్తా లేదంటూ అవాకులు చెవాకులు పేలాడు. కాగా టీ20 ప్రపంచకప్-2026 గ్రూప్ దశలో సూర్యకుమార్ సేన అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే.అజేయంగా సూపర్-8గ్రూప్-‘ఎ’లో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లను ఓడించి.. సూపర్-8లో అడుగుపెట్టింది. అయితే, స్థాయికి తగ్గట్లు రాణించడంలో మాత్రం విఫలమైందనే చెప్పవచ్చు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమిర్ స్థానిక మీడియాలో మాట్లాడుతూ.. గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా, వెస్టిండీస్ సెమీస్ చేరతాయని.. టీమిండియా ఎట్టి పరిస్థితుల్లోనూ సెమీ ఫైనల్లో అడుగుపెట్టలేదంటూ ఓవరాక్షన్ చేశాడు.అయితే, అతడి అంచనాలు తలకిందులు చేస్తూ భారత జట్టు సెమీ ఫైనల్కు దూసుకువెళ్లింది. వెస్టిండీస్తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో గెలిచి సగర్వంగా టాప్-4లో అడుగుపెట్టింది. దీంతో మహ్మద్ ఆమిర్ను చివాట్లు పెడుతూ టీమిండియా అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.ఆ జట్టు ఫీల్డింగ్ చూడండిఅయినప్పటికీ ఆమిర్ తీరు మారలేదు. మరోసారి టీమిండియాను ఉద్దేశించి అతడు చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ‘‘క్రికెట్ కోణంలోనే నేను మాట్లాడుతున్నాను. నిజానికి టీమిండియా అంత గొప్పగా ఏమీ ఆడటం లేదు. ముఖ్యంగా ఆ జట్టు ఫీల్డింగ్ చూడండి.గత మ్యాచ్లో వాళ్లు 3-4 క్యాచ్లు వదిలేశారు. జస్ప్రీత్ బుమ్రా తప్ప ఇతర బౌలర్లు పెద్దగా రాణించడం లేదు. హార్దిక్ పాండ్యా పెద్ద జట్లపై ఆడలేడని నేను చెప్పాను. అందుకు తగ్గట్లేఅతడు నాలుగు ఓవర్లలో అతడు 40 పరుగులు ఇచ్చుకున్నాడు.టీమిండియా టైటిల్ ఫేవరెట్ కాదుఇక వెస్టిండీస్ బ్యాటర్లు వరుణ్ చక్రవర్తి బౌలింగ్లోనూ చితక్కొట్టారు. సెమీ ఫైనల్లో భారత్తో ఆడే జట్టు స్పిన్నర్ల బౌలింగ్లో రాణించగల సత్తా కలిగి ఉంది. కాబట్టి నా దృష్టిలో టీమిండియా టైటిల్ ఫేవరెట్ కాదు. వాళ్లు ఫైనల్ చేరతారని నేను ఇప్పటికీ నమ్మడం లేదు’’ అని మహ్మద్ ఆమిర్ అతి చేశాడు. ఈ నేపథ్యంలో మరోసారి భారత నెటిజన్లు ఆమిర్కు చురకలు అంటిస్తున్నారు. ముందు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాలని హితవు పలుకుతున్నారు. కాగా పాక్ సూపర్-8 దశలోనే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సెమీ ఫైనల్లో టీమిండియా ఇంగ్లండ్ను ఎదుర్కోనుంది. ముంబైలో గురువారం జరిగే ఈ మ్యాచ్కు వాంఖడే స్టేడియం వేదిక. చదవండి: అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్ సిగ్నల్! -
T20 WC: సంజూకు పొంచి ఉన్న ప్రమాదం.. వేటు తప్పదా?
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నాకౌట్ దశకు చేరుకుంది. ఇప్పటికే నాలుగు సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. తొలి సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా- న్యూజిలాండ్.. రెండో సెమీస్ మ్యాచ్లో ఇంగ్లండ్- టీమిండియా తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి.సఫారీ- కివీస్ జట్లు బుధవారం కోల్కతా వేదికగా అమీతుమీ తేల్చుకోనుండగా.. భారత్- ఇంగ్లండ్ (IND vs ENG) ముంబై గురువారం సెమీ ఫైనల్లో పోటీపడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక సూపర్-8లో హ్యాట్రిక్ విజయాలతో ఇంగ్లండ్ జోరు మీద ఉండగా.. టీమిండియా మాత్రం సెమీస్ చేరేందుకు కష్టపడాల్సి వచ్చింది.వీరోచిత ఇన్నింగ్స్అయితే, వెస్టిండీస్తో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సంజూ శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్ (50 బంతుల్లో 97 నాటౌట్)తో రాణించడంతో భారత్ గట్టెక్కి.. సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే, ఈ మ్యాచ్లో ఫీల్డింగ్ తప్పిదాలు.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తప్ప వేరే బౌలర్ ఎవరూ పెద్దగా రాణించకపోవడం.. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ విఫలం కావడం సెమీస్కు ముందు ఆందోళన కలిగిస్తున్నాయి.సంజూకు పొంచి ఉన్న ప్రమాదంఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో సెమీస్లో తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందా అన్న చర్చ నడుస్తోంది. గత మ్యాచ్లో అదరగొట్టిన సంజూకు ఈ మ్యాచ్లో మాత్రం జోఫ్రా ఆర్చర్ రూపంలో ప్రమాదం పొంచి ఉంది. గతేడాది అంతర్జాతీయ టీ20లలో ఈ ఇంగ్లండ్ పేసర్ సంజూను బాగా ఇబ్బంది పెట్టాడు.సంజూకు ఆర్చర్ 23 డెలివరీలు సంధించగా.. అతడు కేవలం 25 పరుగులే రాబట్టగలిగాడు. ఇందులో ఒక ఫోర్, రెండు సిక్స్లు మాత్రమే ఉన్నాయి. అంతేకాదు.. మూడుసార్లు ఆర్చర్ బౌలింగ్లో అవుటయ్యాడు.ఆర్చర్తో పాటు అతడూఒకవేళ ఇంగ్లండ్ ఈసారి కూడా ఆర్చర్తోనే బౌలింగ్ ఎటాక్ ఆరంభిస్తే.. ఓపెనర్ సంజూ మరింత జాగ్రత్త పడాల్సి ఉంటుంది. లేదంటే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. ఇక సామ్ కర్రాన్ కూడా సంజూకు సవాలు విసిరే అవకాశం ఉంది. పొట్టి క్రికెట్లో నాలుగేళ్లలో సామ్ సంజూకు 16 డెలివరీలు సంధించగా.. అతడు 21 పరుగులు చేయగలిగాడు. రెండుసార్లు అవుటయ్యాడు. ఈ ప్రమాదాల్ని అధిగమిస్తేనే సంజూ టీమిండియాకు మంచి ఆరంభం ఇవ్వగలడు. గత గణాంకాలను బట్టి సంజూను తుదిజట్టులో ఆడిస్తారా?.. ఒకవేళ ఆడించినా ఓపెనర్గా పంపుతారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.వేటు పడుతుందా?అయితే, సంజూపై నమ్మకం ఉంచిన మేనేజ్మెంట్ విండీస్తో ఆడిన జట్టుతోనే ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం. తుదిజట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే భారత్ ఇంగ్లండ్తో సెమీ ఫైనల్ ఆడనున్నట్లు తెలుస్తోంది.కాగా గత కొంతకాలంగా ఫామ్లేమితో సతమతమైన సంజూ ఓపెనర్గా, వికెట్ కీపర్గా జట్టులో స్థానం కోల్పోయాడు. టీ20 ప్రపంచకప్లో నమీబియాతో ఆడిన అతడు.. ఆ తర్వాత మళ్లీ సూపర్-8లో జింబాబ్వే, వెస్టిండీస్లతో ఆడాడు. మొత్తంగా మూడు మ్యాచ్లలో కలిపి 143 పరుగులు సాధించాడు.వెస్టిండీస్తో ఆడిన భారత తుదిజట్టుసంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.చదవండి: అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్ సిగ్నల్! -
బ్యాటింగ్ చేయడు.. చెత్త ఫీల్డింగ్: భారత మాజీ క్రికెటర్ ఫైర్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఆట తీరుపై విమర్శల వర్షం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లు ఆడిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ చేసిన పరుగులు 80. ఇందులో మూడు డకౌట్లు.. ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి.సూపర్-8 దశలో వెస్టిండీస్తో తప్పక గెలవాల్సిన మ్యాచ్లోనూ అభిషేక్ శర్మ విఫలమయ్యాడు. పదకొండు బంతులు ఎదుర్కొని కేవలం పది పరుగులే చేసి నిష్క్రమించాడు. దీంతో సెమీ ఫైనల్కు ముందు భారత శిబిరంలో ఆందోళన నెలకొంది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి.. అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఆట తీరుపై మండిపడ్డాడు. నిర్లక్ష్యంగా ఆడితే.. తుదిజట్టులో చోటు కోల్పోయే దుస్థితి వస్తుందని హెచ్చరించాడు. ఈ మేరకు క్రిక్బజ్తో మాట్లాడుతూ..తక్కువ సమయంలోనే సూపర్ స్టార్గా‘‘వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేయాలి. లేదంటే చెత్త షాట్లతో మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అతి తక్కువ సమయంలోనే అభిషేక్ శర్మ సూపర్ స్టార్ అయ్యాడు. భవిష్యత్తులోనూ సూపర్స్టార్గా కొనసాగాలంటే జట్టుకు విజయాలు అందించాలి.భారత జట్టులో చోటు కోసం ఎంతో మంది పోటీపడుతున్నారు. ఎంతో మంది మ్యాచ్ విన్నర్లుగా ఇప్పటికే నిరూపించుకున్నారు. వాళ్లందరినీ దాటి జట్టులో కొనసాగాలంటే మెరుగ్గా ఆడాలి. బ్యాటింగ్ చేయడు.. చెత్త ఫీల్డింగ్వెస్టిండీస్తో మ్యాచ్లో అతడు బ్యాట్ ఝులిపించాల్సింది. అంతేకాదు రెండు క్యాచ్లు జారవిడిచి.. చెత్త ఫీల్డింగ్తోనూ నిరాశపరిచాడు. అతడి మైండ్సెట్ ఇప్పటికైనా మారాలి’’ అని మనోజ్ తివారి అభిషేక్ శర్మ ఆట తీరును విమర్శించాడు. మరోవైపు.. భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం అభిషేక్ ఫామ్లేమిపై ఆందోళన వ్యక్తం చేశాడు. కాగా ఐసీసీ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ బ్యాటర్గా ఉన్న ఈ టీమిండియా ఓపెనర్ ఆటపై అభిమానులు సైతం గుర్రుగా ఉన్నారు.చదవండి: అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్ సిగ్నల్! -
చిల్లర.. సంకుచిత బుద్ధి: పాక్ బోర్డుపై మండిపడ్డ ఆఫ్రిది
ఐసీసీ ఈవెంట్లో పాకిస్తాన్ మరోసారి నిరాశపరిచింది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో పేలవ ప్రదర్శనతో ‘సూపర్–8’ దశలోనే ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల చెత్త ప్రదర్శనపై విమర్శల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సీనియర్లపై గుర్రుగా ఉంది.ఈ నేపథ్యంలో ఆటగాళ్ల పారితోషికాలు, మ్యాచ్ ఫీజుల్లో కోత విధించేందుకు పీసీబీ సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. ‘‘ఈ విషయంలో బోర్డు తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ ఫీజుల్లో కోత విధించే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. ఆటగాళ్ల చెత్త ప్రదర్శనకు ఈ విధంగా మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంది’’ అని పీసీబీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.చిల్లర.. సంకుచిత బుద్ధిఈ విషయంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది (Shahid Afridi) ఘాటుగా స్పందించాడు. పీసీబీ విధించే జరిమానా చిల్లరలా ఉందని.. ఇంత సంకుచిత స్వభావం పనికిరాదంటూ బోర్డు తీరును విమర్శించాడు. చెత్తగా ఆడి దేశం పరువు తీసిన వాళ్లకు ఇంతకంటే కఠినమైన శిక్షలు విధించాలంటూ పాక్ జట్టు తీరుపై మండిపడ్డాడు.‘‘ఇది చాలా చిన్న మొత్తం. యాభై లక్షల రూపాయలతో మీరేం చేస్తారు? ఇది అసలు జరిమానాలా అనిపించడమే లేదు. ఇంత సంకుచిత బుద్ధి పనికిరాదు. సరిగ్గా ఆడని క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.రెండేళ్లు పక్కన పెట్టండిఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడమని చెప్పాలి. జట్టులో ‘ఇంకొందరు మహానుభావులు’ ఉన్నారు. వాళ్లనైతే మరో రెండేళ్లపాటు జాతీయ జట్టుకు ఎంపిక చేయకూడదు. వాళ్లకు ఇలాంటి శిక్ష అయితేనే సరిగ్గా ఉంటుంది’’ అని షాహిద్ ఆఫ్రిది ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా బాగా ఆడని ఆటగాళ్లకు పాకిస్తాన్ కరెన్సీలో రూ. 50 లక్షలు (భారత కరెన్సీలో దాదాపు రూ. 16 లక్షలు) జరిమానా వేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆఫ్రిది అన్నట్లు పాక్ ఆటగాళ్లకు ఇదేమీ చిన్నమొత్తం కాదు. వార్షిక కాంట్రాక్టులలో గ్రేడ్ సి, డిలలో ఉన్న వాళ్లకు పాక్ కరెన్సీలో కేవలం రూ. 10- 17 లక్షల పారితోషికం మాత్రమే ఉంటుంది.నానాటికీ తీసికట్టుగాఇదిలా ఉంటే.. మేజర్ టోర్నీల్లో పాకిస్తాన్ ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. ఐసీసీ ఈవెంట్లలో కనీసం సెమీస్ కూడా చేరకుండా జట్టు నిష్క్రమించడం వరుసగా ఇది నాలుగోసారి.ఈ నేపథ్యంలో బోర్డు కఠిన నిర్ణయాలకు వెనుకాడటం లేదు. మరోవైపు.. ప్రపంచకప్ మ్యాచ్లన్నీ శ్రీలంకలోనే ఆడిన పాకిస్తాన్ ఆదివారం రాత్రి కొలంబో నుంచి నేరుగా లాహోర్ చేరుకుంది. విమానాశ్రయం నుంచి ఆటగాళ్లంతా గప్చుప్గా ఇంటిబాట పట్టారు. కాగా వరల్డ్కప్ టోర్నీలో సల్మాన్ ఆఘా కెప్టెన్సీలో పాక్.. గ్రూప్ దశలో పసికూనలు నెదర్లాండ్స్, అమెరికా, నమీబియాలపై గెలిచింది. టీమిండియా చేతిలో మాత్రం చిత్తుగా ఓడింది. సూపర్-8 దశలో న్యూజిలాండ్తో ఆడాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా.. తదుపరి ఇంగ్లండ్ చేతిలో ఓడింది. ఆఖరిగా శ్రీలంకపై గెలిచినా నెట్ రన్రేటు పరంగా వెనుకబడి సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టింది. చదవండి: అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్ సిగ్నల్! -
టీ20 ప్రపంచకప్పై యుద్ద ప్రభావం
అమెరికా, ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ద ప్రభావం భారత్, శ్రీలంక దేశాల్లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026పై పడింది. ఈ మెగా టోర్నీలో సూపర్-8 దశలో నిష్క్రమించిన వెస్టిండీస్ జట్టు.. అంతర్జాతీయ ఎయిర్స్పేస్ పరిమితుల కారణంగా భారత్లోనే చిక్కుకుపోయింది. అమెరికా, ఇజ్రాయిల్ దాడులకు ప్రతిగా ఇరాన్ పలు గల్ఫ్ ప్రాంతాలపై దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. విండీస్ జట్టు స్వదేశానికి చేరాలంటే దుబాయ్ మీదుగా వెళ్లాల్సి ఉంది. అయితే యుద్ద నేపథ్యంలో పరిస్థితులు అనూకలించకపోవడంతో విండీస్ జట్టు భారత్లోనే హాల్ట్ అయ్యింది. ఈ విషయాన్ని విండీస్ క్రికెట్ బోర్డు ధృవీకరించింది. వీలైనంత త్వరగా తమ జట్టును స్వదేశానికి చేర్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ విషయంలో విండీస్ బోర్డుకు ఐసీసీ, బీసీసీఐ సహకరిస్తున్నాయి. మరోవైపు విండీస్లాగే మరో జట్టు కూడా భారత్లోనే ఇరుక్కుపోయింది. విండీస్లాగే సూపర్-8లోనే నిష్క్రమించిన జింబాబ్వే కూడా యుద్ద ప్రభావం చేత విమాన రాకపోకలు నిలిచిపోవడంతో భారత్లో హాల్ట్ అయ్యింది. జింబాబ్వే కూడా స్వదేశానికి వెళ్లలంటే దుబాయ్ మీదుగా వెళ్లాల్సిందే. జింబాబ్వే పరిస్థితిని కూడా ఐసీసీ దగ్గరగా పర్యవేక్షిస్తుంది. వీలైనంత త్వరగా జింబాబ్వే జట్టును స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తుంది.ఇదిలా ఉంటే వెస్టిండీస్, జింబాబ్వే జట్లు ప్రపంచకప్లో సూపర్-8లోనే నిష్క్రమించాయి. ఈ రెండు జట్లు భారత్తో పాటు గ్రూప్-1లో ఉన్నాయి. ఈ గ్రూప్ నుంచి భారత్, సౌతాఫ్రికా సెమీస్కు చేరాయి. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఫైనల్-4కు అర్హత సాధించాయి.తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్.. రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది. -
T20 WC 2026: సెమీస్కు అంపైర్లు వీరే..!
టీ20 ప్రపంచకప్ 2026 తుది దశకు చేరింది. నాలుగు సెమీఫైనల్ బెర్త్లు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్.. రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.ఈ మ్యాచ్లకు అఫీషియల్స్ జాబితాను (అంపైర్లు, రిఫరీలు) ఐసీసీ ఇవాళ ప్రకటించింది. ఎనిమిది మంది అంపైర్లు, ఇద్దరు మ్యాచ్ రిఫరీల పేర్లను వెల్లడించింది. ఎప్పటిలాగే తటస్థ అధికారులను నియమించింది. సౌతాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ తొలి సెమీఫైనల్ - ఆన్ ఫీల్డ్ అంపైర్లు: రిచర్డ్ ఇల్లింగ్వర్త్, అలెక్స్ వార్ఫ్ - థర్డ్ అంపైర్: నితిన్ మెనన్ - నాలుగో అంపైర్లు: రాడ్ టక్కర్ - మ్యాచ్ రిఫరీ: జవగల్ శ్రీనాథ్ భారత్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో సెమీఫైనల్ - ఆన్ ఫీల్డ్ అంపైర్లు: క్రిస్ గాఫనీ, అల్లాహుద్దీన్ పాలేకర్ - థర్డ్ అంపైర్లు: ఎడ్రియన్ హోల్డ్స్టాక్ - నాలుగో అంపైరు: పాల్ రైఫెల్ - మ్యాచ్ రిఫరీ: ఆండీ పైక్రాఫ్ట్ -
ట్రోఫీస్ గెలవాలంటే..సంజు కోసం ధోనీ చెప్పిందే నిజమైంది
-
బాబర్ ఆజమ్కు కెప్టెన్సీ పగ్గాలు
టీ20 ప్రపంచకప్ 2026లో వరుస వైఫల్యాల తర్వాత కూడా పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్కు కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి. పాకిస్తాన్ మీడియా నివేదికల ప్రకారం.. బాబర్ ఆజమ్ నేషనల్ టీ20 కప్ 2026లో లాహోర్ రీజియన్ వైట్స్ జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 5న రావల్పిండి క్రికెట్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో లాహోర్ వైట్స్, పెషావర్ రీజియన్ను ఎదుర్కొంటుంది. గత ఎడిషన్లో లాహోర్ వైట్స్ క్వార్టర్ ఫైనల్ వరకు చేరినా, అబ్బొటాబాద్ రీజియన్ చేతిలో ఓటమిపాలైంది. ఈసారి బాబర్ నాయకత్వంలో లాహోర్ వైట్స్ మెరుగైన ఫలితాలు సాధించాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఇదిలా ఉంటే, ప్రపంచకప్ 2026 ఎడిషన్లో పాక్ ఓ మోస్తరు ప్రదర్శనలు చేసినా సూపర్-8 దశలోనే నిష్క్రమించింది. చివరి మ్యాచ్లో శ్రీలంకపై విజయం సాధించినా, న్యూజిలాండ్ కంటే మెరుగైన రన్రేట్ లేని కారణంగా సెమీస్కు అర్హత సాధించలేకపోయింది. ఆరంభ మ్యాచ్లలో దారుణంగా విఫలమైనందుకు బాబార్ ఆజమ్ను శ్రీలంక మ్యాచ్ నుంచి తప్పించారు.ఈ ప్రపంచకప్లో బాబర్ 4 ఇన్నింగ్స్ల్లో కేవలం 91 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు 22.75 కాగా, స్ట్రైక్ రేట్ 112.34గా ఉంది. ఈ చెత్త ప్రదర్శనలతో బాబర్ పాకిస్తాన్ జట్టుకు భారంగా మారాడు. గత కొన్ని సంవత్సరాలుగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ఇదే తీరు కొనసాగుతుంది.2023 వన్డే వరల్డ్కప్ తర్వాత బాబర్ 23 ఇన్నింగ్స్ల్లో కేవలం 772 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఓ శతకం, ఐదు అర్ధశతకాలు ఉన్నాయి. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత అతను 20 ఇన్నింగ్స్ల్లో 451 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు 26.52, స్ట్రైక్ రేట్ 118.99గా ఉంది. ఇందులో మూడు అర్ధశతకాలు ఉన్నాయి.టీ20 ప్రపంచకప్లో ఘోర ప్రదర్శనల తర్వాత జాతీయ జట్టులో స్థానమే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో బాబర్కు దేశవాలీ జట్టు పగ్గాలు దక్కడం ఆశ్చర్యంగా ఉంది. త్వరలో బంగ్లాదేశ్తో జరిగే వన్డే సిరీస్కు బాబర్తో పాటు సీనియర్లను తప్పించే అవకాశం ఉందని తెలుస్తుంది. -
IND VS ENG Semis: చరిత్ర పునరావృతమవుతుందా.. లేక..!
టీ20 ప్రపంచకప్ 2026 రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీకి సిద్దంగా ఉన్నాయి. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ హోరాహోరీ సమరం జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్కు ముందు ఓ ఆసక్తికర అంశం సోషల్మీడియాలో హైలైట్ అవుతుంది. గత మూడు టీ20 ప్రపంచకప్ ఎడిషన్లలో భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్లోనే ఎదురెదురుపడ్డాయి. 2022 ఎడిషన్లో ఇంగ్లండ్ భారత్ను ఓడించి ఫైనల్కు చేరడమే కాకుండా, రెండోసారి ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది.2024 ఎడిషన్లో భారత్ ఇంగ్లండ్ను ఓడించి ఫైనల్కు చేరడమే కాకుండా రెండోసారి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. 2026 ఎడిషన్లోనూ ఇరు జట్లు సెమీస్లో ఎదురెదురుపడటంతో, సెంటిమెంట్ ప్రకారం ఈ మ్యాచ్ విజేత టైటిల్ కూడా ఎగరేసుకుపోతుందని చర్చ నడుస్తుంది. అయితే ఈ సెంటిమెంట్ రిపీటైతే భారత్కు ప్రతికూల ఫలితం వచ్చే ప్రమాదం కూడా ఉంది.ఎందుకుంటే, గత రెండు ఎడిషన్లలో గెలుపు చేతులు మారింది. 2022 ఎడిషన్లో ఇంగ్లండ్ భారత్ను ఓడిస్తే.. 2024 ఎడిషన్లో భారత్ ఇంగ్లండ్ను ఓడించింది. ఈ లెక్కన రొటేషన్ పద్దతిలో ఈసారి ఇంగ్లండ్ గెలుస్తుందని సెంటిమెంట్లు ఫాలో అయ్యే వారు విశ్వసిస్తున్నారు.అయితే క్రికెట్ లాంటి క్రీడల్లో సెంటిమెంట్లకు విశ్వసనీయత లేదని గతంలో చాలా సందర్భాల్లో రుజువైంది. కాబట్టి ఆ రోజు ఏ జట్టు అత్యుత్తమంగా రాణిస్తుందో ఆ జట్టుకే విజయం దక్కే అవకాశాలు అధికంగా ఉంటాయి. అలాగనీ సెంటిమెంట్లను తీసి వేయడానికి కూడా వీల్లేదు. కొన్ని సందర్భాల్లో అవి కూడా వర్కౌటవుతాయి.సెంటిమెంట్ల విషయాన్ని పక్కన పెడితే.. ప్రస్తుత ఎడిషన్లో భారత్, ఇంగ్లండ్ జట్లు పటిష్టంగా ఉన్నాయి. లోతుగా పరిశీలిస్తే..ఇంగ్లండ్ కంటే టీమిండియానే క్తాస మెరుగ్గా ఉంది. ఈసారి హాట్ ఫేవరెట్ కూడా ఇండియానే. అలాగనీ ఇంగ్లండ్ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వారిదైన రోజున వారు అద్భుతాలు చేస్తారు. ప్రస్తుతం వారి జట్టు బ్యాటింగ్ టాపార్డర్ కాస్త బలహీనంగా ఉంది. ఓపెనర్లు సాల్ట్, బట్లర్ సహా జేకబ్ బేతెల్ తరుచూ విఫలమవుతున్నారు. కెప్టెన్ హ్యారీ బ్రూక్, మిడిలార్డర్ బ్యాటర్ల సాయంతోనే ఆ జట్టు ఈ ఎడిషన్లో విజయాలు సాధించింది. బ్యాటింగ్తో పోలిస్తే.. ఆ జట్టు బౌలింగ్ విభాగంలో కాస్త మెరుగ్గా ఉంది. అయితే ఈ రెండు విభాగాల్లో ఇంగ్లండ్ కంటే భారత్ ఇంకాస్త మెరుగ్గా ఉంది. ఫీల్డింగ్ మినహా భారత్ అన్ని విషయాల్లో ఇంగ్లండ్పై పైచేయి సాధించే అవకాశం ఉంది. సెమీస్కు ముందు టీమిండియాను ఫీల్డింగ్ విషయం చాలా కలవరపెడుతుంది. తాజాగా విండీస్తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో భారత ఫీల్డర్లు ఏకంగా 3 క్యాచ్లు నేలపాలు చేశారు. సూపర్-8కి చేరిన జట్లలో అత్యంత చెత్త ఫీల్డింగ్ ప్రదర్శన టీమిండియాదే. ఫీల్డింగ్ మినహా మిగతా అన్ని విభాగాల్లో భారత్దే పైచేయిగా ఉంది. మ్యాచ్కు ముందు ప్రదర్శనలు ఎలా ఉన్నా, ఆ రోజు మ్యాచ్లో ఎవరు రాణిస్తే వారికే అంతిమ విజయం దక్కుతుంది. -
పాక్ ప్రపంచకప్ హీరోకు ఘోర అవమానం
పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్ హీరో సాహిబ్జాదా ఫర్హాన్కు ఘోర అవమానం జరిగింది. హండ్రెడ్ లీగ్ 2026 వేలం తుది జాబితాలో అతనికి అవకాశం దక్కలేదు. ప్రపంచకప్ 2026లో రెండు సెంచరీలు సహా పలు భారీ రికార్డులు నెలకొల్పినా ఫర్హాన్ పేరు వేలం జాబితాలో కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఫర్హాన్ సహా 49 పాక్ ఆటగాళ్ల పేర్లు ఈ జాబితాలో లేకపోవడం చర్చనీయాంశమైంది.కాగా, ఇంగ్లండ్ వేదికగా జరిగే హండ్రెడ్ లీగ్లో తొలిసారి వేలం ద్వారా ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు. ఈ వేలం మార్చి 11, 12 తేదీల్లో లండన్ వేదికగా జరుగనుంది. ఈ వేలంలో తొలుత 710 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 63 మంది పాకిస్తానీ క్రికెటర్లు ఉన్నారు. అయితే ఫ్రాంచైజీలు 75–100 మంది ఆటగాళ్లను మాత్రమే షార్ట్లిస్ట్ చేయమని ఆదేశించడంతో, చివరికి 243 మంది ఆటగాళ్లు మాత్రమే తుది జాబితాలో చోటు దక్కించుకున్నారు. వారిలో పాకిస్తాన్ నుంచి కేవలం 14 మంది (షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్, సైమ్ అయూబ్) అవకాశం దక్కింది. ఈ క్రమంలోనే సాహిబ్జాదా ఫర్హాన్ సహా 49 మంది పాక్ ఆటగాళ్ల పేర్లు గల్లంతయ్యాయి. ఫర్హన్.. టీ20 ప్రపంచకప్ 2026లో 76.60 సగటున 383 పరుగులు చేసి ప్రస్తుతానికి లీడింగ్ రన్ స్కోరర్గా ఉన్నాడు. ఈ క్రమంలో ఓ సింగిల్ ప్రపంచకప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉండేది. ఫర్హాన్ నమీబియా, శ్రీలంకపై అద్భుత శతకాలు సాధించాడు. పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్కు చేరకపోయినా, ఫర్హాన్ వ్యక్తిగతంగా అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. అయినా, హండ్రెడ్ లీగ్ ఫ్రాంచైజీలు అతన్ని పక్కన పెట్టడం చర్చనీయాంశమైంది. మరోవైపు, వరల్డ్ కప్ జట్టులో లేని పాక్ పేసర్ హారిస్ రౌఫ్ వేలంలో మార్కీ ఆటగాడిగా ఎంపిక కావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. రౌఫ్తో పాటు జో రూట్, జానీ బెయిర్స్టో వంటి ఇంగ్లండ్ స్టార్లు.. డేవిడ్ మిల్లర్, సునీల్ నరైన్ వంటి విదేశీ ఆటగాళ్లు కూడా మార్కీ జాబితాలో ఉన్నారు. కాగా, హండ్రెడ్ లీగ్ వేలం జాబితాలో పాక్ స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్ పేర్లు కూడా లేవు. ఈ ఇద్దరు విండీస్తో టెస్ట్ సిరీస్ కారణంగా తమ పేర్లు నమోదు చేసుకోలేదు. -
టీమిండియాలో ఆందోళన.. తప్పు జరిగిందా, చరిత్ర హీనులవుతారు..!
టీ20 ప్రపంచకప్ 2026 తుది దశకు చేరింది. నాలుగు సెమీఫైనల్ బెర్త్లు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్.. రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.కాగా, ఇంగ్లండ్తో సెమీస్కు ముందు టీమిండియాను ఓ విషయం తెగ కలవరపెడుతుంది. భారత ఫీల్డింగ్ ప్రతి భారత క్రికెట్ అభిమానిని ఆందోళనకు గురి చేస్తోంది. విండీస్తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో భారత ఫీల్డర్లు ఏకంగా 3 మ్యాచ్లు నేలపాలు చేశారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ కీలక దశలో రెండు క్యాచ్లు జారవిడిచాడు. ఓ క్యాచ్ను తిలక్ వర్మ వదిలేశాడు. ఈ మ్యాచ్లో టీమిండియాకు ప్రతికూల ఫలితం వచ్చుంటే, అభిషేక్, తిలక్పై ముప్పేట దాడి జరిగుండేది. టీమిండియా గెలవడంతో ఈ ఇద్దరు భారీ ట్రోలింగ్ను తప్పించుకున్నారు.విండీస్తో మ్యాచ్ ఒక్కటే కాదు, మెగా టోర్నీ ప్రారంభం నుంచి టీమిండియా ఫీల్డింగ్ అత్యంత చెత్తగా ఉంది. సూపర్-8కి చేరిన జట్లలో అత్యంత చెత్త క్యాచింగ్ ప్రదర్శనలు మనవే. భారత ఫీల్డర్లు 100లో కేవలం 71 శాతం క్యాచ్లను మాత్రమే పట్టారు. మొత్తంగా సూపర్-8కు చేరిన జట్లలో ఏ జట్టు వదలని విధంగా ఏకంగా 13 క్యాచ్లు నేలపాలు చేశాడు. అదనంగా భారత ఫీల్డర్లు మిస్ ఫీల్డింగ్ కూడా చేసి ప్రత్యర్దిని అదనపు పరుగులు సమకూర్చారు.సెమీస్లో ఇదే పరిస్థితి కొనసాగితే టీమిండియా తప్పక మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్యాచ్లు మ్యాచ్లు గెలిపిస్తాయన్న విషయాన్ని భారత ఆటగాళ్లు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నారు. గత ప్రపంచకప్ ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచే భారత్ను జగజ్జేతగా నిలిపిన విషయాన్ని ప్రస్తుత టీమిండియా సభ్యులు గుర్తు పెట్టుకోవాలి. క్యాచ్లు నేలపాలు చేసినా, మిస్ ఫీల్డింగ్ చేసి అదనపు పరుగులు సమర్పించుకున్నా, సరిదిద్దుకోవడానికి జరగబోయేది సామాన్యమైన మ్యాచ్ కాదు. ఒక్కసారి తప్పు జరిగిపోతే, ఎంతటి స్టార్ ఆటగాడైనా చరిత్ర హీనుడవ్వాల్సిందే. కాబట్టి, సెమీఫైనల్లో ప్రతి భారత ఆటగాడు ఫీల్డ్లో జాగ్రత్తగా ఉండాలని ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. -
T20 WC 2026: అదే జరిగితే భారత్కు చుక్కెదురే..!
టీ20 ప్రపంచకప్ 2026 తుది దశకు చేరింది. తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్.. రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.ఈ మ్యాచ్లకు వరుణుడు నుంచి ఎలాంటి ముప్పు లేనప్పటికీ.. ఏదైనా కారణం చేత రద్దైతే పరిస్థితి ఏంటని అభిమానులు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి ఈ నాకౌట్ మ్యాచ్లకు ఐసీసీ రిజర్వ్ డే కేటాయించింది. షెడ్యూలైన రోజు మ్యాచ్ జరుగకపోయినా లేక పాక్షికంగా జరిగి ఆగిపోయినా, ఆగిన చోటి నుంచి మరుసటి రోజు మ్యాచ్ను కొనసాగిస్తారు. ఒకవేళ రిజర్వ్ డేలో కూడా మ్యాచ్ సాధ్యపడకపోతే మాత్రం సూపర్-8 దశలో మెరుగైన ఫలితాలు సాధించిన జట్టు ఫైనల్స్కు చేరుకుంటుంది.ఈ లెక్కన తొలి సెమీఫైనల్ ఏ కారణంగా అయినా రద్దైతే, సూపర్-8లో గ్రూప్-1 టాపర్గా ఉన్న సౌతాఫ్రికా ఫైనల్కు వెళ్తుంది. న్యూజిలాండ్ ఇంటిముఖం పడుతుంది. రెండో సెమీఫైనల్ ఏ కారణంగా అయినా రద్దైతే, సూపర్-8లో గ్రూప్-2 టాపర్గా ఉన్న ఇంగ్లండ్ ఫైనల్కు అర్హత సాధిస్తుంది. టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. కాబట్టి, ఏ కారణంగా కూడా సెమీస్ రద్దు కాకూడదని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన టీమిండియా
భారత పురుషుల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ ఈవెంట్లలో 20 సార్లు సెమీఫైనల్స్కు చేరిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. టీ20 ప్రపంచకప్ 2026లో సెమీస్కు చేరడంతో ఈ ఘనత సాధించింది. భారత్ తర్వాత అత్యధిక సార్లు ఐసీసీ ఈవెంట్లలో సెమీస్కు చేరిన జట్లుగా ఆస్ట్రేలియా (18), న్యూజిలాండ్ (18) ఉన్నాయి. ఆతర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్ (16), పాకిస్తాన్ (16), సౌతాఫ్రికా (15), శ్రీలంక (11), వెస్టిండీస్ (11), ఆఫ్ఘనిస్తాన్ (1), బంగ్లాదేశ్ (1), కెన్యా (1) జట్లు ఉన్నాయి.ఐసీసీ ఈవెంట్లలో భారత్ సెమీస్కు చేరిన సందర్భాలు..వన్డే వరల్డ్కప్- 8 సార్లు (1983, 1987, 1996, 2003, 2011, 2015, 2019, 2023)టీ20 వరల్డ్కప్- 6 సార్లు (1998, 2000, 2002, 2013, 2017, 2025)ఛాంపియన్స్ ట్రోఫీ- 6 సార్లు (2007, 2014, 2016, 2022, 2024, 2026*)కాగా, టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న (మార్చి 1) జరిగిన సూపర్-8 మ్యాచ్లో వెస్టిండీస్పై విజయం సాధించడంతో భారత్ సెమీస్కు అర్హత సాధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్ (97 నాటౌట్) చారిత్రక ఇన్నింగ్స్ ఆడి భారత్ను గెలిపించాడు. ఓ పక్క వికెట్లు పడుతున్నా శాంసన్ సహనం కోల్పోకుండా కడదాకా క్రీజ్లో ఉండి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. మార్చి 4న జరిగే తొలి సెమీఫైనల్లో గ్రూప్ 1 టాపర్ సౌతాఫ్రికా, గ్రూప్-2లో రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడతాయి. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి. -
Abhishek Sharma: పరుగులు చేయకుంటే.. అవుటైపో!
టీమిండియా విధ్వంసకర ఓపెనర్గా పేరొందిన అభిషేక్ శర్మ.. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. గ్రూప్ దశలో అమెరికా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లతో మ్యాచ్లలో ఈ లెఫ్టాండ్ బ్యాటర్ డకౌట్ అయ్యాడు. ఇక నమీబియాతో మ్యాచ్కు అనారోగ్యం వల్ల దూరం అయ్యాడు.జింబాబ్వేతో మ్యాచ్లో మాత్రంఅనంతరం సూపర్-8 మ్యాచ్లో సౌతాఫ్రికాతో పోరులోనూ అభిషేక్ (Abhishek Sharma) విఫలమయ్యాడు. కేవలం 15 పరుగులే చేసి నిష్క్రమించాడు. ఆ తర్వాత పసికూన జింబాబ్వేతో మ్యాచ్లో మాత్రం అర్ధ శతకం (30 బంతుల్లో 55) చేయగలిగాడు. అయితే, తాజాగా వెస్టిండీస్తో కీలక మ్యాచ్లో మాత్రం మరోసారి అభిషేక్ తేలిపోయాడు.అవుటైపోవడం బెటర్ఈ ఓపెనింగ్ బ్యాటర్ 11 బంతులు ఎదుర్కొని కేవలం 10 పరుగులే చేసి నిష్క్రమించాడు. అకీల్ హొసేన్ బౌలింగ్లో షిమ్రన్ హెట్మైర్కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ అభిషేక్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఓపెనర్ ఎంత వేగంగా ఆడితే అంత మంచింది.తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు చేయడంపై దృష్టి పెట్టాలి. అయితే, విండీస్తో మ్యాచ్లో అభిషేక్ ఆ పని చేయలేకపోయాడు. ఒకవేళ పరుగులు రాబట్టడంలో విఫలమైతే అవుటైపోవడం బెటర్. టీ20 క్రికెట్లో ఇది కీలకం.పవర్ప్లే అయ్యాక అతడు అవుటయ్యాడుపరుగులు తీయలేక ఇబ్బంది పడుతున్న బ్యాటర్ అవుటైతే వేరొకరికి అవకాశం వస్తుంది. నిజానికి వెస్టిండీస్ ఓపెనర్ షాయీ హోప్ ఈ నియమాన్ని పాటించకుండా పవర్ ప్లేలో మొత్తం క్రీజులో ఉండి జట్టును వెనుకపడేశాడు. పవర్ప్లే అయ్యాక అతడు అవుటయ్యాడు.ఇక అభిషేక్ శర్మ తొమ్మిది బంతుల్లో తొమ్మిది పరుగులే చేసి.. ఆ తర్వాత మరీ వెనుకబడ్డాడు. ఆ వెంటనే అవుటైపోయాడు. జట్టు ప్రయోజనాల కోసం అతడు రిస్క్ తీసుకునే సాహసం చేయలేదు’’ అని అభిషేక్ నాయర్.. అభిషేక్ శర్మ ఆట తీరును విశ్లేషించాడు.కాగా వెస్టిండీస్తో మ్యాచ్లో సంజూ శాంసన్ (50 బంతుల్లో 97 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్తో రాణించి.. టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. ఇదిలా ఉంటే.. విండీస్ కెప్టెన్, ఓపెనర్ షాయీ హోప్ 33 బంతుల్లో 32 పరుగులు చేశాడు. అతడి స్లో బ్యాటింగ్ జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ మ్యాచ్లో విండీస్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేయగా.. భారత్ 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.చదవండి: స్వార్థపరుడు.. అతడు జట్టులో దండగ: భారత మాజీ కెప్టెన్ ఫైర్ -
సంజూ సీక్రెట్.. ఆమెతో లవ్స్టోరీ! చారులత గురించి తెలుసా?
ఆదివారం వెస్టిండీస్తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ని ఒంటి చేత్తో గెలిపించి ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు సంజు సామ్సన్. ఈ ఇన్నింగ్స్ అతడి కెరీర్కు కొత్త ఊపు తెచ్చింది. కీలక మ్యాచ్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆడుతూ చక్కటి షాట్లతో అతను జట్టును గెలుపు వరకు తీసుకెళ్లి చిరకాలం గుర్తించుకునే ప్రదర్శనను నమోదు చేశాడు. సంజూ ధనాధన్ ఆట తీరుతో టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ సెమీ ఫైనల్లోకి టీమిండియా అడుగుపెట్టేలా బెర్త్ ఖరారైంది. ఈ నేపథ్యంలో సంజు కుటుంబ జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా..!.సంజు సామ్సన్ తన చిన్ననాటి ప్రియురాలు చారులత రమేశ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట చాలా ఏళ్లు వెయిట్చేసి మరి..2018లో పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ ఈ చారులత రమేశ్ ఎవరంటే..?. ప్రముఖ క్రికెటర్ని పరిణయమాడినప్పటికీ.. వ్యక్తిగత జీవితాన్ని చాలా గొప్యంగానే ఉంచుకుంటారామె. మీడియా కంటపడకుండా జాగ్రత్తపడుతుంటారామె. ఇక చారులత విద్యా నేపథ్యం వచ్చేసి..ఆమె మార్ ఇవానియోస్ కళాశాల నుంచి కెమిస్ట్రీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో పట్టా పొందింది. సంజూ చారులతను తొలిసారి ఈ మార్ ఇవానియోస్ కళాశాలలోనే కలుసుకున్నాడు. ఆ తర్వాత ఫేస్బుక్ ద్వారా స్నేహితులుగా సాగిన సాన్నిహిత్యం కాస్త ప్రేమగా మారింది. అయితే చారులత తన కెరీర్పై దృష్టిసారించగా, సంజు దేశీయ క్రికెట్పై ఫోకస్ పెట్టి కెరీర్లో రాణించడం ప్రారంభించాడు. అయితే ఈ జంట తమ రిలేషన్ని అత్యంత గోప్యంగా ఉంచుకున్నారు. మీడియా కంటపడకుండా సాగించారు. అంతేగాదు వీరి వివాహం సైతం అత్యంత గోప్యంగా కొద్దిమంది కుటుంబసభ్యులు, వ్యక్తిగత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో చేసుకున్నారు. ఈ దంపతులు డిసెంబర్ 22, 2018న వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. (చదవండి: జస్ట్ రెండేళ్లలో 17కిలోలు తగ్గిన టీనేజర్..! నో జిమ్, నో స్ట్రిక్ట్ డైట్..) -
సంజూ కాదు!;.. అతడి రెండు ఫోర్లే కీలకం: బుమ్రా
టీమిండియా అద్భుతం చేసింది. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో వెస్టిండీస్ను ఓడించి టీ20 ప్రపంచకప్-2026 సెమీ ఫైనల్కు చేరుకుంది. ఈ మ్యాచ్లో ఓపెనింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించాడు.ఆద్యంతం నిలకడగా ఆడిన సంజూ జట్టును విజయతీరాలకు చేర్చాడు. మొత్తంగా 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్లు బాది 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖరి ఓవర్లో సిక్స్, ఫోర్ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.వచ్చీ రాగానే వరుసగా రెండు ఫోర్లుఅయితే, టీమిండియా గెలుపునకు 10 బంతుల్లో 17 పరుగులు అవసరమైన వేళ హార్దిక్ పాండ్యా (14 బంతుల్లో 17) ఐదో వికెట్గా వెనుదిరగగా.. శివం దూబే క్రీజులోకి వచ్చాడు. వచ్చీ రాగానే వరుసగా రెండు ఫోర్లు బాదాడు. దీంతో ఆఖరి ఓవర్లో విజయ సమీకరణం ఏడు పరుగులుగా మారగా.. సంజూ తొలుత సిక్స్, ఆ తర్వాత ఫోర్ బాది గెలుపు ఖరారు చేశాడు.Shivam Dube wastes no time as India push to finish this in style to book their semi-final berth. 🔥ICC Men’s #T20WorldCup, SUPER 8, #INDvWI | LIVE NOW ➡️ https://t.co/Y26WH6p8dS pic.twitter.com/Ta4LWZ1VR2— Star Sports (@StarSportsIndia) March 1, 2026ఆ రెండు ఫోర్లు అత్యంత కీలకంనిజానికి దూబే బాదిన రెండు ఫోర్ల వల్ల సంజూపై ఒత్తిడి తగ్గి మరింత స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించగలిగాడు. భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఇదే మాట అంటున్నాడు. ‘‘దూబే బాదిన ఆ రెండు ఫోర్లు అత్యంత కీలకం.క్రికెట్ రికార్డులలో వాటికి చోటు లేకపోవచ్చు. కానీ క్రికెట్ గురించి పూర్తి అవగాహన ఉన్న వారికి వాటి ప్రాధాన్యం ఏమిటో అర్థమవుతుంది. ఆ రెండు ఫోర్లే ఒత్తిడిని తగ్గించాయి. చివరి ఓవర్లో 8-9 పరుగులు తీయడం కూడా ఒక్కోసారి కష్టం కావచ్చు.సంజూ విషయంలో హ్యాపీఏదేమైనా సంజూ విషయంలోనూ నేను సంతోషంగా ఉన్నాను. అతడు గత కొంతకాలంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. వాటన్నింటినీ అధిగమించి గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. అతడు రోజురోజుకీ మరింత గొప్పగా ఆడాలని కోరుకుంటున్నా’’ అని బుమ్రా పేర్కొన్నాడు. కాగా విండీస్తో మ్యాచ్లో బుమ్రా రెండు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.చదవండి: స్వార్థపరుడు.. అతడు జట్టులో దండగ: భారత మాజీ కెప్టెన్ ఫైర్ -
T20 WC 2026: బీసీసీఐ కీలక ప్రకటన
టీమిండియా జూన్ షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా విడుదల చేసింది. భారత క్రికెట్ జట్టు స్వదేశంలో అఫ్గనిస్తాన్తో సిరీస్లు ఆడనుందని వెల్లడించింది. ఇందుకు సంబంధించి సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.సెమీ ఫైనల్లో భారత్కాగా టీమిండియా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన భారత్.. సూపర్-8లో జింబాబ్వే, వెస్టిండీస్లను ఓడించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఇంగ్లండ్తో గురువారం (మార్చి 5) సెమీస్ మ్యాచ్లో తలపడేందుకు షెడ్యూల్ ఖరారైంది.మళ్లీ జూన్లోనేఈ మ్యాచ్లో గెలిచి ఫైనల్కు చేరితే మార్చి 8న టైటిల్ పోరులో టీమిండియా తలపడుతుంది. అనంతరం భారత జట్టులోని ఆటగాళ్లంతా ఐపీఎల్-2026 (IPL)తో బిజీ అవుతారు. ఈ క్రమంలో మళ్లీ జూన్లోనే అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరఫున విధుల్లో పాల్గొంటారు.అఫ్గనిస్తాన్తో సిరీస్ఈ నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా తదుపరి షెడ్యూల్ను విడుదల చేసింది. ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడేందుకు అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు భారత్లో పర్యటిస్తుందని పేర్కొంది. జూన్ 6-10 మధ్య టెస్టు జరుగనుండగా.. ఇరుజట్ల మధ్య జూన్ 14, 17, 20 తేదీల్లో వన్డే సిరీస్ జరుగనుంది. భారత్- అఫ్గన్ టెస్టుకు న్యూ చండీగఢ్ వేదిక కాగా.. వన్డే సిరీస్కు ధర్మశాల, లక్నో, చెన్నై ఆతిథ్యం ఇవ్వనున్నాయి.రో-కో రీఎంట్రీ డేట్ ఫిక్స్.. అభిమానులు ఖుష్అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వన్డేలలో మాత్రం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరు చివరగా ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్ బరిలో దిగారు.రోహిత్ శర్మ ఫర్వాలేదనిపించగా.. కోహ్లి వరుస సెంచరీలతో ఆకట్టుకున్నాడు. అయితే ఈ సిరీస్లో భారత్ కివీస్ చేతిలో ఓడిపోయింది. ఇక తదుపరి అఫ్గనిస్తాన్తో సిరీస్ సందర్భంగా జూన్ 14న రో-కో టీమిండియా తరఫున రీఎంట్రీ ఇవ్వనున్నారు. అంతకంటే ముందు ఐపీఎల్లో బెంగళూరు తరఫున కోహ్లి.. ముంబైకి ఆడుతూ రోహిత్ అభిమానులను అలరించనున్నారు.భారత్ వర్సెస్ అఫ్గనిస్తాన్ షెడ్యూల్👉జూన్ 6- 10 టెస్టు మ్యాచ్, న్యూ చంఢీగఢ్ (ఉదయం 9. 30 నిమిషాలకు ఆరంభం)👉జూన్ 14- తొలి వన్డే, ధర్మశాల👉జూన్ 17- రెండో వన్డే, లక్నో👉జూన్ 20- మూడో వన్డే, చెన్నై.👉వన్డే మ్యాచ్లన్నీ మధ్యాహ్నం 1.30 నిమిషాలకు ఆరంభం. చదవండి: T20 WC: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. ఆటగాళ్లకు భారీ షాక్! -
స్వార్థపరుడు.. అతడు జట్టులో దండగ: భారత మాజీ కెప్టెన్ ఫైర్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో ఆరంభం నుంచి అద్భుత ఆట తీరు కనబరిచిన వెస్టిండీస్కు చేదు అనుభవం ఎదురైంది. సూపర్-8 దశలో జింబాబ్వేపై ఘన విజయం సాధించి సెమీస్ రేసులోకి దూసుకవచ్చిన విండీస్.. కీలక మ్యాచ్లలో మాత్రం చేతులెత్తేసింది.విండీస్ అవుట్తొలుత సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన కరేబియన్ జట్టు.. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్లో టీమిండియా చేతిలో ఓటమిపాలైంది. ఫలితంగా భారత్ సెమీస్కు దూసుకువెళ్లగా.. వెస్టిండీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్.. వెస్టిండీస్ సారథి షాయీ హోప్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. అతడొక స్వార్థ పరుడు.. తుదిజట్టులో అతడికి చోటు దండగ అంటూ ఘాటుగా విమర్శించాడు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇతరులపై నిందలు వేయడం సరికాదని చురకలు అంటించాడు.స్వార్థపరుడు..‘‘ప్రతి మ్యాచ్లో కేవలం స్వార్థం కోసం మాత్రమే అతడు ఆడతాడు. టీమిండియా చేతిలో ఓటమి తర్వాత.. తప్పునంతా పావెల్, హోల్డర్లపై నెట్టేసేందుకు ప్రయత్నించాడు. ఆఖర్లో సరిగ్గా ఆడలేదంటూ వారిని నిందించాడు.నిజానికి నీ చెత్త బ్యాటింగ్తో నువ్వే వెస్టిండీస్ ఇన్నింగ్స్కు ముగింపు పలికావు. కానీ నిన్ను నువ్వు ఎప్పుడూ నిందించుకోవు. నిన్ను కెప్టెన్గా నియమించడమే వెస్టిండీస్ క్రికెట్ చేసిన అతి పెద్ద తప్పు.తుదిజట్టులో ఉండటమే దండగఅసలు తుదిజట్టులో షాయీ హోప్ ఉండటమే దండగ. అతడు కేవలం ఆదేశాలు ఇవ్వడానికి మాత్రమే ముందుంటాడు. బ్యాట్తో రాణించలేడు. అతడికి బదులు వేరొకరిని జట్టులోకి తీసుకుంటే బాగుండేదేమో! నీ బదులు రొమారియో షెఫర్డ్ను ఓపెనర్గా పంపి ఉంటే బాగుండేది హోప్’’ అంటూ క్రిష్ణమాచారి శ్రీకాంత్ షాయీ హోప్ ఆట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా కోల్కతాలో భారత్తో మ్యాచ్లో టాస్ ఓడిన విండీస్ తొలుత బ్యాటింగ్కు దిగింది. కెప్టెన్, ఓపెనింగ్ బ్యాటర్, వికెట్ కీపర్ షాయీ హోప్ 33 బంతులు ఎదుర్కొని 32 పరుగులే చేయగలిగాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. ఇక మరో ఓపెనర్ రోస్టన్ ఛేజ్ 25 బంతుల్లో 40 పరుగులతో రాణించాడు.సంజూ శాంసన్ ధనాధన్ఆఖర్లో రోవ్మన్ పావెల్ (19 బంతుల్లో 34), జేసన్ హోల్డర్ (22 బంతుల్లో 37) మెరుపు ఇన్నింగ్స్తో అజేయంగా నిలిచారు. ఫలితంగా 20 ఓవర్లలో విండీస్ 195 పరుగులు స్కోరు చేయగలిగింది.అయితే, సంజూ శాంసన్ (50 బంతుల్లో 97 నాటౌట్) విజృంభణ కారణంగా టీమిండియా 192. ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా ఐదు వికెట్ల తేడాతో విండీస్ను ఓడించి సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది.చదవండి: IND vs WI అతడొక వరల్డ్క్లాస్ ప్లేయర్.. అందుకే మద్దతు: గంభీర్Varun strikes, and Eden Gardens erupts! 🌪️The bowling change does the trick for #TeamIndia as skipper Shai Hope walks back! ☝️ICC Men’s #T20WorldCup, SUPER 8, #INDvWI | LIVE NOW ➡️ https://t.co/Y26WH6p8dS pic.twitter.com/rPIjxyNNaS— Star Sports (@StarSportsIndia) March 1, 2026 -
సంజూ భాయ్ ఆట... సెమీస్ బాట... అంతేగా.. అంతేగా (ఫొటోలు)
-
T20 WC: పీసీబీ సంచలన నిర్ణయం.. ఆటగాళ్లకు భారీ షాక్!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సంచలన నిర్ణయం తీసుకుంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో విఫలమైన కారణంగా ఆటగాళ్లకు ఊహించని షాకిచ్చినట్లు సమాచారం. బాగా ఆడినపుడు రివార్డులు తీసుకున్నట్లే.. చెత్త ప్రదర్శన కనబరిచినప్పుడు జరిమానా కట్టాల్సిందేనని అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది.టీమిండియా చేతిలో చిత్తుటీ20 వరల్డ్కప్ టోర్నీలో గ్రూప్-ఎ నుంచి భారత్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ జట్లతో కలిసి పోటీపడింది పాకిస్తాన్. గ్రూప్ దశలో నెదర్లాండ్స్, అమెరికా, నమీబియా జట్లపై గెలిచిన సల్మాన్ ఆఘా బృందం.. దాయాది టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిపోయింది.అయితే, మిగిలిన జట్లపై విజయాల కారణంగా భారత్తో కలిసి సూపర్-8లో అడుగుపెట్టింది పాకిస్తాన్. సెమీస్ చేరాలంటే కీలకంగా మారిన ఈ దశలో న్యూజిలాండ్తో ఆడాల్సిన తొలి మ్యాచ్ వర్షం వల్ల టాస్ పడకుండానే రద్దై పోయింది. అనంతరం ఇంగ్లండ్ చేతిలో పాక్ ఓటమిపాలైంది.లంకపై గెలిచినా..సూపర్-8లో ఆఖరిదైన మ్యాచ్లో శ్రీలంకతో తలపడి గెలిచినప్పటికీ నెట్ రన్రేటు కారణంగా వెనుకబడి.. పాక్ సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ చేరగా.. శ్రీలంకతో కలిసి పాకిస్తాన్ ఇంటిబాట పట్టింది.అపుడు లీగ్ దశలోనేఇక గత ఎడిషన్లోనూ పాక్ సెమీస్ చేరకుండా లీగ్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈసారి సూపర్-8కు చేరినా.. సెమీస్ రేసులో మాత్రం వెనుబడిపోయి తీవ్రంగా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ సల్మాన్ ఆఘా బృందంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.భారీ జరిమానా!ఈ నేపథ్యంలోనే విఫలమైన ఆటగాళ్లకు భారీ పనిష్మెంట్ ఇచ్చేందుకు పీసీబీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ కథనం ప్రకారం.. పాక్ జట్టులోని ఆటగాళ్లకు ఒక్కొక్కరికి పాక్ కరెన్సీలో యాభై లక్షల రూపాయలు (భారత కరెన్సీలో దాదాపు 16.28 లక్షలు) జరిమానా విధించనున్నట్లు సమాచారం.టీమిండియా చేతిలో ఓడిపోయిన తర్వాత ఈ మేరకు పీసీబీ నుంచి పాక్ ఆటగాళ్లకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ‘‘మెరుగైన ప్రదర్శనలు ఇచ్చినపుడు రివార్డులు తీసుకునే ఆటగాళ్లు.. చెత్త ప్రదర్శనలకు పెనాల్టీ కట్టాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు’’ అని సదరు కథనం పేర్కొంది. ముఖ్యంగా పీసీబీ వార్షిక కాంట్రాక్టులో అత్యధిక వేతనం అందుకుంటున్న ఆటగాళ్లకు జరిమానా ఇంకాస్త ఎక్కువే ఉండవచ్చని తెలిపింది.టీ20 ప్రపంచకప్-2026లో పాల్గొన్న పాకిస్తాన్ జట్టుసయీబ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), బాబర్ ఆజం, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సల్మాన్ మీర్జా, అబ్రార్ అహ్మద్, ఫఖర్ జమాన్, ఖవాజా నఫాయ్, నసీం షా, ఉస్మాన్ తారిఖ్.చదవండి: అతడొక వరల్డ్క్లాస్ ప్లేయర్.. అందుకే మద్దతు: గంభీర్ -
టీమిండియా ‘ప్రపంచ’ రికార్డు.. పాకిస్తాన్తో సమంగా
వెస్టిండీస్తో సూపర్-8 మ్యాచ్లో టీమిండియా అదరగొట్టింది. ఐదు వికెట్ల తేడాతో విండీస్ను ఓడించి టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో పాకిస్తాన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును భారత జట్టు సమం చేసింది.సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిశ్రీలంకతో కలిసి వరల్డ్కప్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న డిఫెండింగ్ చాంపియన్ భారత్.. లీగ్ దశలో అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, సూపర్-8 దశలో తొలి మ్యాచ్లోనే సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.వరుస విజయాలతో సెమీస్కుఅయితే, తదుపరి మ్యాచ్లో జింబాబ్వే (IND vs ZIM)ను భారీ తేడాతో ఓడించి సెమీ ఫైనల్ రేసులో ముందుకు వచ్చిన భారత్.. ఆదివారం నాటి మ్యాచ్లో వెస్టిండీస్ (IND vs WI)ను చిత్తు చేసి బెర్తును ఖరారు చేసుకుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు సాధించింది.విండీస్ బ్యాటర్లలో రోవ్మన్ పావెల్ (19 బంతుల్లో 34), జేసన్ హోల్డర్ (22 బంతుల్లో 37) అజేయ ఇన్నింగ్స్తో అలరించగా.. ఓపెనర్ రోస్టన్ ఛేజ్ (25 బంతుల్లో 40) టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.సంజూ స్పెషల్ఇక లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభంలో తడబడినా ఓపెనర్ సంజూ శాంసన్ (Sanju Samson) జట్టును విజయతీరాలకు చేర్చాడు. 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 97 పరుగులతో అజేయంగా నిలిచి గెలుపును ఖరారు చేశాడు. ఈ మ్యాచ్లో వెస్టిండీస్పై ఐదు వికెట్ల తేడాతో గెలిచిన భారత్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.Man on a mission! 🚀Sanju Samson looks in sublime touch as he bring up his fifty! 🙌ICC Men’s #T20WorldCup, SUPER 8, #INDvWI | LIVE NOW ➡️ https://t.co/Y26WH6p8dS pic.twitter.com/yrCOStYeaF— Star Sports (@StarSportsIndia) March 1, 2026పాక్ ప్రపంచ రికార్డు సమంకాగా టీమిండియా టీ20 ప్రపంచకప్ టోర్నీలో సెమీస్ చేరడం ఇది ఆరోసారి. తద్వారా పాకిస్తాన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును భారత్ సమం చేసింది. ఇక ఇదే ఎడిషన్లో అందరి కంటే ముందే సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్న ఇంగ్లండ్ సైతం ఆరోసారి సెమీ ఫైనల్లో అడుగుపెట్టి.. పాక్, భారత్ సరసన నిలిచింది. ఇక గురువారం నాటిమ్యాచ్లో ఫైనల్ బెర్తు కోసం టీమిండియా ఇంగ్లండ్ మధ్యమ్యాచ్ జరుగుతుంది. ఇందుకు ముంబై వేదిక.టీ20 ప్రపంచకప్ టోర్నీలో అత్యధికసార్లు సెమీ ఫైనల్ చేరిన జట్లు ఇవే👉పాకిస్తాన్- ఆరుసార్లు (2007, 2009, 2010, 2012, 2021, 2022)👉టీమిండియా- ఆరుసార్లు (2007, 2014, 2016, 2022, 2024, 2026)👉ఇంగ్లండ్- ఆరుసార్లు (2010, 2016, 2021, 2022, 2024, 2026చదవండి: ఇది సరిపోతుందా బాస్!.. విమర్శలకు సంజూ ’స్టైల్’ కౌంటర్ -
సంజు శాంసన్ విశ్వరూపం.. పడి లేచిన కెరటం
-
అతడొక వరల్డ్క్లాస్ ప్లేయర్.. అందుకే మద్దతు: గంభీర్
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ సంజూ శాంసన్పై ప్రశంసలు కురిపించాడు. అతడొక వరల్డ్క్లాస్ ప్లేయర్ అంటూ ఆకాశానికెత్తాడు. సరైన సమయంలో రాణించి తన విలువను మరోసారి చాటుకున్నాడని కొనియాడాడు.టీ20 ప్రపంచకప్-2026 ఆరంభానికి ముందు ఫామ్లేమితో సతమతమైన సంజూ (Sanju Samson)తుదిజట్టులో స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్గా అతడి స్థానాన్ని ఇషాన్ కిషన్ (Ishan Kishan) భర్తీ చేశాడు. అయితే, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్కు దూరం కాగా సంజూ తొలిసారి వరల్డ్కప్ మ్యాచ్ ఆడాడు.బాధ్యతాయుత ఇన్నింగ్స్అనంతరం సూపర్-8లో జింబాబ్వేతో మ్యాచ్లో ఆడిన సంజూ.. తాజాగా వెస్టిండీస్తో ఆదివారం నాటి కీలక మ్యాచ్లోనూ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అదిరిపోయే ఆట తీరుతో జట్టును సెమీ ఫైనల్కు చేర్చాడు.Man on a mission! 🚀Sanju Samson looks in sublime touch as he bring up his fifty! 🙌ICC Men’s #T20WorldCup, SUPER 8, #INDvWI | LIVE NOW ➡️ https://t.co/Y26WH6p8dS pic.twitter.com/yrCOStYeaF— Star Sports (@StarSportsIndia) March 1, 2026కోల్కతా వేదికగా సహచర ఆటగాళ్లు స్థాయికి తగ్గట్లు రాణించలేక విఫలమైన వేళ సంజూ.. 50 బంతుల్లో 97 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ నేపథ్యంలో హెడ్కోచ్ గౌతం గంభీర్ సంజూను ప్రశంసలతో ముంచెత్తాడు.అతడొక వరల్డ్క్లాస్ ప్లేయర్.. అందుకే మద్దతు‘‘సంజూ మంచి ఆటగాడు అని అందరికీ తెలుసు. అయితే, కొన్నిసార్లు విఫలమైనా అతడికి మద్దతుగా నిలవడం అవసరం. మేము అదే పని చేశాము. అందుకు తగ్గట్లుగానే జట్టుకు అతడి అవసరం ఉన్న కీలక సమయంలో రాణించాడు.అతడి పూర్తి స్థాయి నైపుణ్యాలను ఈరోజు ప్రదర్శించి.. జట్టుకు విజయం అందించాడు. అతడు వరల్డ్క్లాస్ ప్లేయర్ అని నేను తరచూ చెబుతూ ఉంటాను. సంజుకు గొప్ప ప్రతిభ ఉంది. ఇప్పటి నుంచి అతడి నుంచి ఇలాంటి ఇంకెన్నో ఇన్నింగ్స్ చూడాలని కోరుకుంటున్నా’’ అని గంభీర్ సంజూను కొనియాడాడు.ఐదు వికెట్ల తేడాతో విజయంకాగా వెస్టిండీస్తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్కతాలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 199 పరుగులు సాధించింది. ఫలితంగా ఐదు వికెట్ల తేడాతో గెలిచి గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికాతో పాటు సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. ముంబై వేదికగా గురువారం సెమీ ఫైనల్లో టీమిండియా ఇంగ్లండ్తో అమీతుమీ తేల్చుకుంటుంది.As soon as Sanju Samson smashed a match winning SIX, just look at the Celebration of Abhishek Sharma, Tilak Varma, Hardik Pandya, Suryakumar Yadav and Jay Shah 💥- Most trolled and most hated Sanju Samson delivered at the biggest stage 👏🏻#INDvsWI pic.twitter.com/tYJmi4fxwC— Fan Account Richard Kettlebourogh (@RichKettle07) March 1, 2026 -
ఇది సరిపోతుందా బాస్!.. విమర్శలకు సంజూ ’స్టైల్’ కౌంటర్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ఆరంభానికి ముందు పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్నాడు టీమిండియా స్టార్ సంజూ శాంసన్. మెగా టోర్నీకి సన్నాహకంగా స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో వరుస వైఫల్యాలతో సతమతమయ్యాడు.ఈ సిరీస్లో సంజూ చేసిన పరుగులు 10, 6, 0, 24, 6. దీంతో వరల్డ్కప్ జట్టులో ఓపెనర్గా అతడి స్థానం గల్లంతైంది. ఇషాన్ కిషన్ అభిషేక్ శర్మకు జోడీగా ఐసీసీ ఈవెంట్లో వరుస అవకాశాలు అందిపుచ్చుక్నునాడు.ఉద్దేశపూర్వకంగానే!అయితే, అభిషేక్ శర్మ అనారోగ్యం కారణంగా నమీబియాతో తొలిసారి బరిలో దిగాడు సంజూ. ఆ మ్యాచ్లో 8 బంతుల్లో 22 పరుగులు చేసిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్... తదుపరి జింబాబ్వేతో సూపర్-8 మ్యాచ్లో 15 బంతుల్లో 24 రన్స్ రాబట్టగలిగాడు. పొరపాట్లను పునరావృతం చేస్తూ షార్ట్ బంతుల్ని తప్పుగా అంచనా వేసి అవుటైన నేపథ్యంలో మరోసారి సంజూపై విమర్శల వర్షం కురిసింది.మరోవైపు.. అతడి అభిమానులు మాత్రం.. మిగతా వాళ్లకు ఇచ్చినట్లుగా సంజూకు అవకాశాలు ఇవ్వడం లేదని మద్దతుగా నిలిచారు. ఈ కేరళ స్టార్ను ఉద్దేశపూర్వకంగా ప్రతీసారి పక్కన పెడుతున్నారని భారత జట్టు యాజమాన్యాన్ని విమర్శించారు. అయితే, వరుస విమర్శల తర్వాత అప్పుడప్పుడు అవకాశాలు పొందుతున్నా సంజూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేక ప్రతీసారి చేతులెత్తేయం ప్రతికూలాంశంగా పరిణమించింది. ఏదో కారణంతో అదృష్టవశాత్తూ చాన్స్ దక్కినా దానిని అతడు వాడుకోలేకపోతున్నాడనే అపవాదు పడింది. ముందుగా చెప్పినట్లు ఈ వరల్డ్ కప్లో కూడా ఆడిన రెండు మ్యాచ్లలో విఫలం కావడం ఇందుకు కారణం.ఒకే ఒక అర్ధ సెంచరీ...నిజానికి 2024 నవంబర్లో సౌతాఫ్రికాపై సెంచరీ తర్వాత శాంసన్ 18 ఇన్నింగ్స్లు ఆడితే ఒకే ఒక అర్ధ సెంచరీ... అదీ బలహీన జట్టు ఒమన్పై వచ్చింది. వరల్డ్ కప్ జట్టులోకి ఎంపికైన తర్వాత కూడా కివీస్తో సిరీస్లో వైఫల్యంతో తన స్థానాన్ని అతను ఇషాన్ కిషన్కు కోల్పోవాల్సి రావడం గమనార్హం.కెరీర్కు కొత్త ఊపుఇలాంటి స్థితిలో ఆదివారం వెస్టిండీస్తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో సంజూ ఇన్నింగ్స్ అతడి కెరీర్కు కొత్త ఊపు తెచ్చింది. కీలక మ్యాచ్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆడుతూ చక్కటి షాట్లతో అతను జట్టును గెలుపు వరకు తీసుకెళ్లి ఎప్పటికీ గుర్తుంచుకునే ప్రదర్శన నమోదు చేశాడు.విండీస్తో మ్యాచ్లో అన్ని రకాల షాట్లతో సంజూ చెలరేగాడు. ఈసారి 20.. 30... దాటిన తర్వాత అతడు వికెట్ పారేసుకోలేదు. అకీల్ హొసీన్ ఓవర్లో ఫోర్, 2 సిక్స్లతో జోరు మొదలు పెట్టిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ షెఫర్డ్ ఓవర్లో వరుసగా 6, 4 బాది 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. This team! 🥹💙🫂Next Stop: Semi-finals 🚀ICC Men’s #T20WorldCup Semi-Final 2 👉 #INDvENG | THU, 5 MAR, 6 PM pic.twitter.com/CEMSGouFlO— Star Sports (@StarSportsIndia) March 1, 2026టీమిండియాను సెమీస్కు చేర్చిటీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో ఛేదనలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచిన సంజూ... ఆఖరి ఓవర్లో వరుస బంతుల్లో 6, 4తో మ్యాచ్ను ముగించాడు. టీమిండియాను సెమీ ఫైనల్కు చేర్చి చిరస్థాయిగా నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్లు.. 97 పరుగులు నాటౌట్గా నిలిచిప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.కాగా 2024లో విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడైన సామ్సన్కు నాడు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశమే రాలేదు. ఇప్పుడు అసలు సమరంలో సత్తాను ప్రదర్శించిన అతను ఇదే ఫామ్ను కొనసాగిస్తే సెమీస్, ఆపై ఫైనల్లో కూడా అద్భుతం చూడవచ్చు. చదవండి: మూడు పరుగులతో సెంచరీ మిస్!.. అత్యంత గొప్ప రోజు.. సంజూ ఎమోషనల్ -
సామ్సన్ ఆట... సెమీస్ బాట...
సెమీస్ చేరాలంటే వెస్టిండీస్పై తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో భారత్ విజయలక్ష్యం 196 పరుగులు... పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నా... ఆరంభం చూస్తే కాస్త సందేహం. హిట్టర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ తొందరగా వెనుదిరగ్గా, సూర్యకుమార్ కూడా ప్రభావం చూపించలేదు. కానీ ఒకే ఒక్కడు నిలబడ్డాడు. చాలా కాలంగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడని సంజు సామ్సన్ అసలు సమయంలో సత్తా చాటాడు. ప్రత్యర్థి బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ ఎక్కడా తడబాటు లేకుండా ఈడెన్ గార్డెన్స్లో జట్టును గెలుపుతీరం చేర్చాడు. అంతకు ముందు విండీస్ మరింత పెద్ద స్కోరు చేయకుండా నిలువరించడంలో మన బౌలర్లు సఫలమయ్యారు. తాజా ఫలితంతో 2024 తరహాలోనే ఈసారి కూడా రెండో సెమీఫైనల్లోనే ఇంగ్లండ్ను ఎదుర్కొనేందుకు టీమిండియా సిద్ధమైంది. మరో రెండు నాకౌట్ పంచ్లతో భారత్ చరిత్ర సృష్టించడమే మిగిలింది. కోల్కతా: డిఫెండింగ్ చాంపియన్ భారత్ టి20 ప్రపంచకప్లో ఆరోసారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. వెస్టిండీస్తో చివరి ‘సూపర్–8’ మ్యాచ్లో కాస్త పోటీ ఎదురైనట్లు కనిపించినా, చివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందంజ వేసింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో విండీస్ను ఓడించింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. రోస్టన్ ఛేజ్ (25 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్), జేసన్ హోల్డర్ (22 బంతుల్లో 37 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్లు), రావ్మన్ పావెల్ (19 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు), షై హోప్ (33 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) భారీ స్కోరులో తలా ఓ చేయి వేశారు. బుమ్రాకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సంజు సామ్సన్ (50 బంతుల్లో 97 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్స్లు) ఒంటి చేత్తో ఛేదనను సులువుగా మార్చేశాడు. గురువారం వాంఖెడే మైదానంలో జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్తో భారత్ తలపడుతుంది. సమష్టి ప్రదర్శన... తొలిసారి అంతర్జాతీయ టి20ల్లో ఓపెనర్గా బరిలోకి దిగిన ఛేజ్ మెరుగ్గానే ఆడినా... మరో ఎండ్లో కెపె్టన్ హోప్ నెమ్మదైన ఇన్నింగ్స్ వెస్టిండీస్కు నష్టాన్ని కలిగించింది. వరుణ్ ఏమరుపాటుగా ఉండడంతో వ్యక్తిగత స్కోరు ‘1‘ వద్ద రనౌట్ కాకుండా తప్పించుకున్న ఛేజ్... 14 పరుగుల వద్ద అభిషేక్ సునాయాస క్యాచ్ వదిలేయడంతో బతికిపోయాడు. పవర్ప్లేలో విండీస్ 45 పరుగులు చేయగలిగింది. వరుణ్ తన తొలి ఓవర్లోనే హోప్ను బౌల్డ్ చేయడంతో తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లంతా క్రీజ్లో ఉన్నంతసేపు దూకుడు కనబర్చడంతో జట్టు మెరుగైన స్కోరు సాధించగలిగింది. వరుణ్ ఓవర్లో సిక్స్ ఫోర్ కొట్టిన హెట్మైర్తో పాటు ఛేజ్ను బుమ్రా ఒకే ఓవర్లో వెనక్కి పంపాడు. ‘1’ వద్ద తిలక్ క్యాచ్ వదిలేయడంతో రూథర్ఫర్డ్ (14) కొన్ని పరుగులు జోడించగలిగాడు. 15 ఓవర్లలో జట్టు స్కోరు 125/4 వద్ద నిలిచింది. ఆఖరి 5 ఓవర్లలో విండీస్ 70 పరుగులు రాబట్టింది. 16వ ఓవర్ వేసిన అర్ష్ దీప్24 పరుగులు ఇచి్చనా... తన తర్వాతి ఓవర్లో అతను 6 పరుగులే ఇచ్చాడు. బుమ్రా 2 ఓవర్లలో విండీస్ 26 పరుగులు స్కోరు చేయగలిగింది. పావెల్, హోల్డర్ ఐదో వికెట్కు 35 బంతుల్లో అభేద్యంగా 76 పరుగులు జోడించారు. రాణించిన తిలక్... ఛేదనలో భారత్కు మరోసారి సరైన ఆరంభం లభించలేదు. తడబడుతూనే ఆడిన అభిషేక్ శర్మ (10)తో పాటు ఇషాన్ కిషన్ (10) కూడా ఎక్కువసేపు నిలవలేదు. అయితే సామ్సన్ పదునైన బ్యాటింగ్తో ఇన్నింగ్స్ను నడిపించడంతో భారత్కు ఇబ్బంది ఎదురు కాలేదు. ముందుగా సూర్యకుమార్ (18) కొద్దిసేపు సామ్సన్కు సహకరించగా, ఆ తర్వాత తిలక్ వర్మ (15 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్) కూడా అండగా నిలిచాడు. జోసెఫ్ ఓవర్లలో వరుసగా మూడు ఫోర్లతో ఆకట్టుకున్న తిలక్ అవుటైన తర్వాత హార్దిక్ పాండ్యా (17) మరికొన్ని పరుగులు జోడించాడు. చివర్లో శివమ్ దూబే (8 నాటౌట్)తో కలిసి సామ్సన్ మ్యాచ్ ముగించాడు.97 టి20 వరల్డ్ కప్ మ్యాచ్లో ఛేదనలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా సామ్సన్ నిలిచాడు. గతంలో కోహ్లి రెండుసార్లు 82 నాటౌట్ (ఆ్రస్టేలియా, పాక్లపై)గా నిలిచాడు.స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: హోప్ (బి) వరుణ్ 32; ఛేజ్ (సి) సూర్యకుమార్ (బి) బుమ్రా 40; హెట్మైర్ (సి) సామ్సన్ (బి) బుమ్రా 27; రూథర్ఫర్డ్ (సి) సామ్సన్ (బి) పాండ్యా 14; పావెల్ (నాటౌట్) 34; హోల్డర్ (నాటౌట్) 37; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1–68, 2–102, 3–103, 4–119. బౌలింగ్: అర్ష్ దీప్4–0–43–0, పాండ్యా 4–0–40–1, అక్షర్ 4–0–35–0, బుమ్రా 4–0–36–2, వరుణ్ 4–0–40–1. భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) హెట్మైర్ (బి) హొసీన్ 10; సామ్సన్ (నాటౌట్) 97; ఇషాన్ కిషన్ (సి) హెట్మైర్ (బి) హోల్డర్ 10; సూర్యకుమార్ (సి) రూథర్ఫర్డ్ (బి) జోసెఫ్ 18; తిలక్ (సి) హెట్మైర్ (బి) హోల్డర్ 27; పాండ్యా (సి) హోల్డర్ (బి) జోసెఫ్ 17; దూబే (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 12; మొత్తం (19.2 ఓవర్లలో 5 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–29, 2–41, 3–99, 4–141, 5–179. బౌలింగ్: హొసీన్ 2–0–22–1, ఫోర్డ్ 3–0–22–0, హోల్డర్ 4–0–38–2, మోతీ 2–0–18–0, షెఫర్డ్ 2.2–0–34–0, జోసెఫ్ 4–0–42–2, ఛేజ్ 2–0–18–0. -
నాకౌట్కూ అజేయంగానే...
న్యూఢిల్లీ: గత మెగా ఈవెంట్ రన్నరప్ దక్షిణాఫ్రికా ఈ టి20 ప్రపంచకప్ను కసిమీద ఆడుతోంది. లీగ్ దశలో గ్రూప్ ‘డి’లో ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచిన దక్షిణాఫ్రికా అజేయంగా ‘సూపర్–8’కు చేరింది. ‘సూపర్–8’లోనూ తమ జోరు కొనసాగిస్తూ ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచి నాకౌట్ పోరుకు సై అంటోంది. దక్షిణాఫ్రికా ఇదివరకే సెమీస్ చేరడంతో.... జింబాబ్వేతో ఆదివారం జరిగిన గ్రూప్–1 ‘సూపర్–8’ నామమాత్రమైంది. అయినప్పటికీ సమష్టి ఆటతీరుతో మెరిపించిన మార్క్రమ్ బృందం 5 వికెట్ల తేడాతో జింబాబ్వేపై గెలుపొంది ఈ టోర్నీలో వరుసగా ఏడో విజయం నమోదు చేసింది. కోల్కతాలో బుధవారం జరిగే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ జట్టుతో దక్షిణాఫ్రికా తలపడుతుంది. సెమీఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డే కేటాయించారు. దక్షిణాఫ్రికాతో పోరులో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కెప్టెన్ సికందర్ రజా (43 బంతుల్లో 73; 8 ఫోర్లు, 4 సిక్స్లు) ఒంటరి పోరాటం చేశాడు. కార్బిన్ బాష్, మఫాక చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం దక్షిణాఫ్రికా 17.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసి గెలిచింది. బ్రెవిస్ (18 బంతుల్లో 42; 2 ఫోర్లు, 4 సిక్స్లు) భారీ సిక్స్లతో విరుచుకుపడగా, జార్జ్ లిండే (21 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. బ్రెవిస్ అవుటయ్యాక లిండే, స్టబ్స్ ఆరో వికెట్కు అజేయంగా 53 పరుగులు జోడించి దక్షిణాఫ్రికాను విజయతీరాలకు చేర్చారు. బౌలింగ్లోనూ 3 వికెట్లు తీసిన జింబాబ్వే కెప్టెన్ రజాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. స్కోరు వివరాలు జింబాబ్వే ఇన్నింగ్స్: మరుమని (బి) మఫాక 7; బెనెట్ (సి) మార్క్రమ్ (బి) నోర్జే 15; మైయెర్స్ (సి) బ్రెవిస్ (బి) లిండే 11; సికందర్ రజా (సి) మిల్లర్ (బి) మఫాక 73; బర్ల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఎన్గిడి 5; మున్యోంగా (బి) బాష్ 2; మడండె (నాటౌట్) 26; ఇవాన్స్ (బి) బాష్ 8; మసకద్జా (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–14, 2–28, 3–66, 4–82, 5–87, 6–126, 7–146. బౌలింగ్: లిండే 3–0–22–1, మఫాక 4–0–21–2, ఎన్గిడి 4–0–29–1, నోర్జే 4–0–29–1, బాష్ 4–0–40–2, మార్క్రమ్ 1–0–11–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: మార్క్రమ్ (బి) సికందర్ రజా 4; డికాక్ (సి) మరుమని (బి) సికందర్ రజా 0; రికెల్టన్ (సి) బర్ల్ (బి) ఇవాన్స్ 31; బ్రెవిస్ (సి) బర్ల్ (బి) సికందర్ రజా 42; మిల్లర్ (సి) మైయెర్స్ (బి) ముజరబాని 22; స్టబ్స్ (నాటౌట్) 21; లిండే (నాటౌట్) 30; ఎక్స్ట్రాలు 4; మొత్తం (17.5 ఓవర్లలో 5 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–1, 2–14, 3–43, 4–93, 5–101. బౌలింగ్: సికందర్ రజా 4–0–29–3, ముజరబాని 3.5–0–32–1, ఇవాన్స్ 3–0–22–1, క్రెమర్ 2–0–27–0, మసకద్జా 2–0–23–0, బర్ల్ 2–0–12–0, బెనెట్ 1–0–9–0. 5 టి20 ప్రపంచకప్ చరిత్రలో సికందర్ రజా అందుకున్న ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారాలు నెగ్గిన జాబితాలో విరాట్ కోహ్లి (8), ఆడమ్ జంపా (6) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. మూడో స్థానంలో షేన్ వాట్సన్, క్రిస్ గేల్, జయవర్ధనే, సికందర్ రజా (5 చొప్పున) ఉన్నారు. -
T20 WC 2026: అత్యంత గొప్ప రోజు.. సంజూ ఎమోషనల్
‘‘నా జీవితంలోనే అత్యంత గొప్ప రోజుల్లో ఇదొకటి. ఇదే (ఆట) నా ప్రపంచం. క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన నాటి నుంచే.. దేశం కోసం ఆడాలనే కల కన్నాను. ఇలాంటి రోజు కోసమే ఎదురుచూశాను. నా కెరీర్లో ఎన్నో ఎత్తు పళ్లాలు ఉన్నాయి.ఒక్కోసారి నా మీద నాకే సందేహం కలిగేది. నేనసలు ఆడగలనా.. ఒకవేళ ఆడితే ఎలా ఉంటుంది. అనుకున్న విధంగా రాణించగలనా.. ఇలా ఎన్నెన్నో సందేహాలు. అయితే, ఆ దేవుడి మీద నమ్మకం మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. ఈరోజు ఆయన నన్ను దీవించాడు. నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. టీ20 ఫార్మాట్లో నాకెంతో అనుభవం ఉంది.విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. గత మ్యాచ్లలో వేగంగా ఆడే క్రమంలో వికెట్లు కోల్పోయాను. అయితే, ఈ రోజు భాగస్వామ్యాలు నిర్మించడంపైనే ఎక్కువ దృష్టి సారించాను. బంతిని చూస్తూ ఆడాను. ఈరోజు నా ప్రణాళికలను పక్కాగా అమలు చేశాను’’ అంటూ టీమిండియా స్టార్ సంజూ శాంసన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.టీ20 ప్రపంచకప్-2026లో భారత్ సెమీ ఫైనల్కు దూసుకువెళ్లడంలో సంజూదే కీలక పాత్ర. టీ20 ఫార్మాట్లో ప్రమాదకర జట్టుగా పేరొందిన వెస్టిండీస్తో మ్యాచ్లో ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ టీమిండియాను గెలిపించాడు. సహచర ఆటగాళ్లు పెవిలియన్కు వరుస కడుతున్నా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో నిలకడగా బ్యాటింగ్ చేశాడు.This team! 🥹💙🫂Next Stop: Semi-finals 🚀ICC Men’s #T20WorldCup Semi-Final 2 👉 #INDvENG | THU, 5 MAR, 6 PM pic.twitter.com/CEMSGouFlO— Star Sports (@StarSportsIndia) March 1, 2026చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో 97 పరుగులతో అజేయంగా నిలిచి భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు. సంజూ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా విండీస్ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి.. సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. కాగా గత కొన్ని రోజులుగా సంజూ ఫామ్లేమితో సతమతమయ్యాడు. ఫలితంగా ఓపెనర్గా స్థానం కోల్పోయాడు.అయితే, గత మ్యాచ్ (జింబాబ్వే)తో మళ్లీ తుదిజట్టులోకి వచ్చిన సంజూ.. తాజాగా వెస్టిండీస్పై అదరగొట్టి తన విలువ చాటుకున్నాడు. చిరకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్తో మెరిసి అభిమానులను ఖుషీ చేశాడు.భారత్ వర్సెస్ వెస్టిండీస్ స్కోర్లువేదిక- ఈడెన్ గార్డెన్స్, కోల్కతాటాస్- భారత్.. తొలుత బౌలింగ్వెస్టిండీస్ స్కోరు- 195/4(20)భారత్ స్కోరు- 199/5 (19.2)ఫలితం- ఐదు వికెట్ల తేడాతో గెలిచిన భారత్ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్- సంజూ శాంసన్ (50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్లు.. 97 పరుగులు నాటౌట్). -
T20 WC 2026: విండీస్ను చిత్తు చేసి సెమీ ఫైనల్లో టీమిండియా
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో టీమిండియా సెమీ ఫైనల్కు దూసుకువెళ్లింది. సూపర్-8 దశలో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో వెస్టిండీస్ (IND Beat WI)ను ఓడించి టైటిల్ దిశగా కీలక ముందడుగు వేసింది. కోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్లో ఆదివారం టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.195 పరుగులుఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్లలో కెప్టెన్ షాయీ హోప్ (33 బంతుల్లో 32) ఫర్వాలేదనిపించగా.. రోస్టన్ ఛేజ్ (25 బంతుల్లో 40) రాణించాడు.మిగిలిన వారిలో షిమ్రన్ హెట్మైర్ (12 బంతుల్లో 27) ధనాధన్ దంచికొట్టగా.. షెర్ఫానే రూథర్ఫర్డ్ (9 బంతుల్లో 14) రాణించాడు. ఆఖర్లో రోవ్మన్ పావెల్ (19 బంతుల్లో 34), జేసన్ హోల్డర్ (22బంతుల్లో 37) మెరుపు ఇన్నింగ్స్తో అజేయంగా నిలిచారు.నిరాశపరిచిన అభిషేక్, ఇషాన్భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమమ్రా రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (11 బంతుల్లో 10) స్వల్ప స్కోరుకే వెనుదిరగగా.. వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (6 బంతుల్లో 10) సైతం నిరాశపరిచాడు.సంజూ బాధ్యతాయుత ఇన్నింగ్స్కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (16 బంతుల్లో 18) చేతులెత్తేయగా.. తిలక్ వర్మ (15 బంతులలో 27) వేగంగా ఆడే క్రమంలో అవుటయ్యాడు. ఇలాంటి దశలో ఓపెనర్ సంజూ శాంసన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్తో స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. Man on a mission! 🚀Sanju Samson looks in sublime touch as he bring up his fifty! 🙌ICC Men’s #T20WorldCup, SUPER 8, #INDvWI | LIVE NOW ➡️ https://t.co/Y26WH6p8dS pic.twitter.com/yrCOStYeaF— Star Sports (@StarSportsIndia) March 1, 2026 అయితే విజయానికి 10 బంతులలో 17 పరుగులు అవసరమైన వేళ హార్దిక్ పాండ్యా (14 బంతులలో 17) రూపంలో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో శివం దూబే సంజూకు జతయ్యాడు. దూబే 4 బంతులలో 8 పరుగులు చేయగా.. సంజూ ఆఖరి ఓవర్లో సిక్సర్, ఫోర్ బాది టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. సెంచరీకి మూడు పరుగుల దూరంలోఈ మ్యాచ్లో సంజూ మొత్తంగా 50 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయినా చిరస్మరణీయ ఇన్నింగ్స్తో జట్టుకు విజయం అందించాడు. ఇక మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విండీస్ను ఓడించింది. -
T20 WC 2026: విండీస్తో డూ ఆర్ డై మ్యాచ్.. టీమిండియా ఇదే..!
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (మార్చి 1) డూ ఆర్ డై మ్యాచ్ జరుగుతుంది. కోల్కతా వేదికగా జరుగనున్న ఈ సూపర్-8 మ్యాచ్లో భారత్, వెస్టిండీస్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు గ్రూప్-1 నుంచి సెమీస్కు చేరుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.అత్యంత కీలకమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్లో జింబాబ్వేపై ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. మరోవైపు ఈ మ్యాచ్ కోసం వెస్టిండీస్ ఓ మార్పు చేసింది. బ్రాండన్ కింగ్ స్థానంలో అకీల్ హొసేన్ తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లు..భారత్: సంజూ శాంసన్ (WK), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్వెస్టిండీస్: షాయ్ హోప్ (c & wk), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మాన్ పావెల్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, రోస్టన్ చేజ్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, అకీల్ హోసేన్, గుడకేష్ మోటీ, షమర్ జోసెఫ్ -
T20 WC 2026: నామమాత్రపు మ్యాచ్లోనూ సౌతాఫ్రికాదే గెలుపు
టీ20 ప్రపంచకప్ 2026లో సౌతాఫ్రికా జైత్రయాత్ర కొనసాగుతోంది. గ్రూప్ దశలో అజేయ జట్టుగా నిలిచిన ఈ జట్టు.. సూపర్-8 దశను కూడా ఓటమి లేకుండా ముగించింది. ఇప్పటికే సెమీస్కు చేరిన సౌతాఫ్రికా.. ఇవాళ (మార్చి 1) జింబాబ్వేతో జరిగిన నామమాత్రపు మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో గెలుపొంది, సెమీస్లో న్యూజిలాండ్తో పోటీకి రెడీ అయ్యింది.ఈ మ్యాచ్లో జింబాబ్వే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. 87 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన జింబాబ్వేను సికందర్ రజా ఆదుకున్నాడు. 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు. మరో ప్లేయర్ క్లైవ్ మదండే 20 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.వీరు మినహా జింబాబ్వే ఇన్నింగ్స్లో ఎవరూ రాణించలేదు. మరుమణి 7, బ్రియాన్ బెన్నెట్ 15, డియాన్ మైర్స్ 11, ర్యాన్ బర్ల్ 5, టోనీ మున్యోంగా 2, బ్రాడ్ ఈవాన్స్ 8 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో మఫాకా, కార్బిన్ బాష్ చెరో 2.. లిండే, ఎంగిడి, నోర్జే తలో వికెట్ తీశారు.అనంతరం 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికాను బ్యాట్తో సత్తా చాటిన సికందర్ రజా (4-0-29-3) బాగా ఇబ్బంది పెట్టాడు. అయితే మధ్య వరుస బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడటంతో జింబాబ్వేకు ఓటమి తప్పలేదు. ఓపెనర్లు మార్క్రమ్ (4), డికాక్ (0) విఫలమైనా.. రికెల్టన్ (31), బ్రెవిస్ (42), మిల్లర్ (22), స్టబ్స్ (21 నాటౌట్), లిండే (30 నాటౌట్) రాణించి సౌతాఫ్రికాను విజయతీరాలకు చేర్చారు. జింబాబ్వే బౌలర్లలో రజాతో పాటు ముజరబానీ (3.5-0-32-1), బ్రాడ్ ఈవాన్స్ (3-0-22-1) వికెట్లు తీశారు. ఈ ఓటమితో ప్రపంచకప్లో జింబాబ్వే పోరాటం ముగిసింది. ఈ టోర్నీలో జింబాబ్వే గ్రూప్ దశలో ఆస్ట్రేలియా, శ్రీలంకపై సంచలన విజయాలు సాధించిన విషయం తెలిసిందే. -
T20 WC 2026: సౌతాఫ్రికాతో మ్యాచ్.. సికందర్ రజా విధ్వంసం
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (మార్చి 1) జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్లో సౌతాఫ్రికా, జింబాబ్వే జట్లు తలపడుతున్నాయి. గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా ఇదివరకే సెమీస్కు అర్హత సాధించగా.. జింబాబ్వే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఢిల్లీలోకి అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ అప్రధానమైన మ్యాచ్లో జింబాబ్వే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.87 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన జింబాబ్వేను సికందర్ రజా, క్లైవ్ మదండే (26 నాటౌట్) ఆదుకున్నారు. ముఖ్యంగా సికందర్ రజా ఆకాశమే హద్దుగా చెలరేగి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. రజా 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు. మదండే 20 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరు మినహా జింబాబ్వే ఇన్నింగ్స్లో ఎవరూ రాణించలేదు. మరుమణి 7, బ్రియాన్ బెన్నెట్ 15, డియాన్ మైర్స్ 11, ర్యాన్ బర్ల్ 5, టోనీ మున్యోంగా 2, బ్రాడ్ ఈవాన్స్ 8 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో మఫాకా, కార్బిన్ బాష్ చెరో 2.. లిండే, ఎంగిడి, నోర్జే తలో వికెట్ తీశారు.అనంతరం 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికాను బ్యాట్తో సత్తా చాటిన సికందర్ రజా ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్లు మార్క్రమ్ (4), డికాక్ (0)ను ఔట్ చేశాడు. 5 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 30-2గా ఉంది. రికెల్టన్ (19), బ్రెవిస్ (7) క్రీజ్లో ఉన్నారు. -
T20 ప్రపంచ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్
-
వరల్డ్కప్ నుంచి నిష్క్రమించిన కొద్ది గంటల్లోనే పాక్ క్రికెటర్ సంచలన నిర్ణయం
టీ20 వరల్డ్కప్ 2026 నుంచి పాక్ సూపర్-8 దశలోనే నిష్క్రమించింది. నిన్న (ఫిబ్రవరి 28) తమ చివరి సూపర్-8 మ్యాచ్లో శ్రీలంకపై గెలిచినా, న్యూజిలాండ్తో పోలిస్తే మెరుగైన రన్రేట్ లేని కారణంగా సెమీస్కు అర్హత సాధించలేకపోయింది. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ ఇదివరకే సెమీస్ బెర్త్ సాధించగా.. పాక్ శ్రీలంకపై గెలిచినా, మెరుగైన రన్రేట్ సాధించలేకపోవడంతో న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరోవైపు గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా ఇదివరకే సెమీస్కు చేరుకోగా.. రెండో బెర్త్ కోసం భారత్, వెస్టిండీస్ పోటీపడుతున్నాయి. ఇరు జట్ల మధ్య ఇవాళ (మార్చి 1) రాత్రి జరుగబోయే మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందో ఆ జట్టు సెమీస్కు చేరకుంటుంది. సెమీస్లో గ్రూప్-1 టాపర్గా ఉన్న సౌతాఫ్రికా గ్రూప్-2లో రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్తో తలపడాల్సి ఉండగా.. వెస్టిండీస్, భారత్ మ్యాచ్లో విజేత గ్రూప్-2 టాపర్ ఇంగ్లండ్తో సెమీస్లో తలపడుతుంది.ఇదిలా ఉంటే, పాక్ టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన గంటల వ్యవధిలో ఆ దేశ దిగ్గజ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ కొడుకు, పాక్ మాజీ స్పిన్నర్ అయిన ఉస్మాన్ ఖాదిర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2024 అక్టోబర్లో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన ఆయన, ఇప్పుడు మళ్లీ అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు సిద్ధమని ప్రకటించాడు. ఉస్మాన్ ఖాదిర్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం పాకిస్తాన్ క్రికెట్లో సంచలనంగా మారింది.32 ఏళ్ల ఉస్మాన్ ఖాదిర్.. అబ్రార్ అహ్మద్, షాదాబ్ ఖాన్ లాంటి వారు జట్టులోకి రాక ముందు పాక్ టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్నారు. అయితే యువ స్పిన్నర్ల రాకతో అతనికి అవకాశాలు కరువయ్యాయి. దీంతో 2024లో రిటైర్మెంట్ ప్రకటించాడు. పాక్ టీ20 ప్రపంచకప్ 2026 నుంచి వైదొలిగాక ఉస్మాన్ ఖాదిర్ తన మనసు మార్చుకున్నాడు.రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవడానికి కారణాలుఉస్మాన్ ఇటీవల ఆస్ట్రేలియాలో ఆడినప్పుడు 41 వికెట్లు తీశాడు. అలాగే స్థానిక లీగ్లలో ఓ మోస్తరు ప్రదర్శనలతో రాణించాడు. ఇంటాబయటా మంచి స్పందన రావడంతో ఉస్మాన్కు అంతర్జాతీయ వేదికపై తిరిగి రాణించగలనన్న నమ్మకం కలిగింది. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత, తన తండ్రి అబ్దుల్ ఖాదిర్ వారసత్వాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. ఎక్స్ వేదికగా.. “నా ప్రయాణం ఇంకా ముగియలేదు. పాకిస్తాన్ క్రికెట్ కోసం మళ్లీ సిద్ధంగా ఉన్నాను” అని ప్రకటించాడు.తండ్రి తరహాలోనే రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ అయిన ఉస్మాన్ ఖాదిర్ పాక్ తరఫున 25 వన్డేల్లో 31 వికెట్లు.. ఒక వన్డే ఓ వికెట్ తీశాడు. 2020లో జింబాబ్వేపై టీ20తో పాక్ తరఫున అరంగేట్రం చేసిన ఉస్మాన్.. 2023 ఆసియా క్రీడల్లో బంగ్లాదేశ్పై తన చివరి మ్యాచ్ ఆడాడు. -
సెమీఫైనల్ లక్ష్యంగా...
టి20 ప్రపంచ కప్ డిఫెండింగ్ చాంపియన్ భారత్ తమ టైటిల్ను నిలబెట్టుకునే ప్రయత్నంలో కఠిన పరీక్షకు సిద్ధమైంది. సెమీస్లో చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో మాజీ చాంపియన్, హిట్టర్లకు మారుపేరైన వెస్టిండీస్తో టీమిండియా తలపడనుంది. ఇరు జట్లు ‘సూపర్ ఎయిట్స్’ దశలో దక్షిణాఫ్రికా చేతిలో చిత్తయి జింబాబ్వేపై ఘన విజయాలు సాధించి సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. 2024 టి20 వరల్డ్ కప్నుంచి ఇరు జట్ల మధ్య ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. అయితే అనుభవంలో మేటిగా ఉన్న టీమిండియా ఎలా పైచేయి సాధిస్తుందా అనేది ఆసక్తికరంకోల్కతా: టి20 వరల్డ్ కప్లో రెండు సార్లు విజేతలుగా నిలిచిన జట్లు ఈ సారి టోర్నీ కీలక దశలో ముఖాముఖీకి సన్నద్ధమయ్యాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ‘క్వార్టర్ ఫైనల్’లాంటి పోరులో నేడు (ఆదివారం) వెస్టిండీస్ను భారత్ ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్లో గెలిచే జట్టు సెమీస్ చేరుకుంటుంది. ఓడిన టీమ్ టోర్నీనుంచి నిష్క్రమిస్తుంది. అయితే రన్రేట్లో ప్రత్యర్థికంటే భారత్ కాస్త వెనుకబడి ఉంది. ఒక వేళ ఊహించని విధంగా వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడం జరిగితే విండీస్ ముందంజ వేస్తుంది. అయితే ఈ అంచనాలను పక్కనపెడితే... వరల్డ్ కప్లో రెండు టీమ్లూ సిక్సర్లతో చెలరేగాయి. మరోసారి మైదానంలో భారీ మోత ఖాయంగా కనిపిస్తోంది. మార్పుల్లేకుండా... జింబాబ్వేపై చెలరేగిన భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం కనిపించడం లేదు. మేనేజ్మెంట్ కూడా అదే వ్యూహాన్ని కొనసాగించాలని భావిస్తోంది. తండ్రి మరణం తర్వాత రింకూ సింగ్ మళ్లీ జట్టుతో చేరినా...అతనికి అవకాశం దక్కకపోవచ్చు. మరో సారి అభిషేక్, సామ్సన్ ఓపెనర్లుగా సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. గత భారీ స్కోర్ల మ్యాచ్లో ఫర్వాలేదనిపించిన సామ్సన్ మరింత పెద్ద స్కోరు చేయాల్సి ఉంది.జింబాబ్వేపై కాస్త తగ్గి ఆడిన అభిషేక్ మళ్లీ తనదైన శైలిలో చెలరేగితే జట్టుకు శుభారంభం ఖాయం. తర్వాతి బ్యాటింగ్ భారాన్ని ఇషాన్, సూర్య మోస్తారు. పాండ్యా, దూబేల దూకుడు అదనపు బలం కాగా, అక్షర్ కూడా తన బ్యాటింగ్తో జట్టుకు కీలకం కాగలడు. ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉండటం జట్టు ప్రధాన బలం. బౌలింగ్లో కూడా మన టీమ్ పదునుగా ఉంది. స్పిన్ను పెద్దగా ఆడలేని విండీస్పై వరుణ్ పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించగలడు. బుమ్రా, అర్ష్ దీప్ లు విండీస్ హిట్టర్లను ఆరంభంలో నిలువరిస్తే తిరుగుండదు. బౌలింగ్లో రాణించేనా! వెస్టిండీస్ టీమ్ మొదటినుంచి తమ బ్యాటింగ్ బలాన్నే నమ్ముకుంది. ఒకరితో పోటీ పడి మరొకరు సిక్సర్లు బాదగల సమర్థులు ఆ జట్టులో ఉన్నారు. దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన మ్యాచ్లో కూడా ఎక్కువ పరుగులు సిక్సర్ల ద్వారానే రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా లీగ్లు ఆడే హిట్టర్లు బౌలర్లు ఎవరైనా ప్రత్యర్థి ఎవరైనా లెక్క చేయకుండా బౌండరీ దాటించడమే పనిగా ఆడుతున్నారు. హెట్మైర్, పావెల్, రూథర్ఫర్డ్, షెఫర్డ్, హోల్డర్... ఇలా అంతా భారీ షాట్లు ఆడేవారే. అంతా సమష్టిగా చెలరేగితే భారత్పై ఒత్తిడి పెరగడం ఖాయం. అయితే భారత్తో పోలిస్తే విండీస్ బౌలింగ్ చెప్పుకోదగినట్లుగా లేదు. ఒక్క షామర్ జోసెఫ్ ఫర్వాలేదనిపించే బౌలర్ కాగా...ఫోర్డ్, మోతీ, హోల్డర్, ఛేజ్ మన బ్యాటర్లను నిలువరించలేరు. అందుకే జట్టు భారీ స్కోరు సాధించడంపైనే గురి పెట్టింది. 2016 టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత వెస్టిండీస్ మరే ఐసీసీ ఈవెంట్లో కూడా సెమీఫైనల్ చేరలేకపోయింది.పిచ్, వాతావరణం ఈడెన్ గార్డెన్స్ పిచ్ బాగా పొడిగా ఉంది. బ్యాటింగ్కు ఎంతో అనుకూలంగా ఉండటంతో భారీ స్కోర్లకు అవకాశం ఉంది. రద్దు గురించి భారత అభిమానులు భయపడుతున్నా... మ్యాచ్ రోజున ఎలాంటి వర్ష సూచన లేదు. 1983 నుంచి మూడు ఫార్మాట్లలో కలిపి భారత్తో 11 మ్యాచ్లలో తలపడిన వెస్టిండీస్ ఒక్కటీ గెలవలేదు. 2 టెస్టులు డ్రా కాగా మిగతా 9 సార్లు (4 టి20లు) ఓడింది.తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, సామ్సన్, ఇషాన్ కిషన్, తిలక్, పాండ్యా, దూబే, అక్షర్, అర్ష్ దీప్ , బుమ్రా, వరుణ్. వెస్టిండీస్: షై హోప్ (కెప్టెన్), కింగ్, హెట్మైర్, పావెల్, ఛేజ్, రూథర్ఫర్డ్, షెఫర్డ్, హోల్డర్, ఫోర్డ్, మోతీ, జోసెఫ్. టి20 ప్రపంచకప్లో నేడుజింబాంబ్వే X దక్షిణాఫ్రికావేదిక: ఢిల్లీ, మ. 3 గంటల నుంచి భారత్ X వెస్టిండీస్వేదిక: కోల్కతా, రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
గెలిచి ఇంటికి పాక్... సెమీస్కు న్యూజిలాండ్
పల్లెకెలె: శ్రీలంకతో తమ చివరి లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్ 212 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది...మ్యాచ్ గెలవడం మాత్రమే కాకుండా లంకను 147 పరుగుల వరకే పరిమితం చేసి ఉంటే పాక్ సెమీఫైనల్కు చేరేది. కానీ తారిఖ్ వేసిన 16వ ఓవర్ ఐదో బంతికి షనక సింగిల్ తీయడంతో లంక స్కోరు 148 పరుగులకు చేరింది. దాంతో పాక్ ఆశలు గల్లంతయ్యాయి. ‘గ్రూప్ 2’లో పాక్కంటే మెరుగైన రన్రేట్ ఉన్న న్యూజిలాండ్ సెమీఫైనల్కు అర్హత సాధించింది. లంకపై మ్యాచ్లో చివరకు 5 పరుగుల తేడాతో గెలిచినా పాక్ టోర్నీనుంచి నిష్క్రమించింది. శనివారం జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సాహిబ్జాదా ఫర్హాన్ (60 బంతుల్లో 100; 9 ఫోర్లు, 5 సిక్స్లు) మెరుపు శతకం సాధించగా, ఫఖర్ జమన్ (42 బంతుల్లో 84; 9 ఫోర్లు, 4 సిక్స్లు) చెలరేగాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసి పోరాడి ఓడింది. కెప్టెన్ షనక (31 బంతుల్లో 76 నాటౌట్; 2 ఫోర్లు, 8 సిక్స్లు) విరుచుకుపడగా, పవన్ రత్నాయకే (37 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించాడు. ఫర్హాన్, ఫఖర్ ధనాధన్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పాక్కు ఓపెనర్లు ఫర్హాన్, ఫఖర్లు ధనాధన్ ఆరంభమిచ్చారు. ఇద్దరు పోటీ పడి బౌండరీలు, సిక్స్లు బాదుతూ పాక్ స్కోరును వాయువేగంతో పెంచారు. పవర్ప్లేలో 64/0 స్కోరు చేసిన పాకిస్తాన్... పదో ఓవర్ ముగియక ముందే 100కు చేరుకుంది. ఫర్హాన్ 32 బంతుల్లో, ఫఖర్ 27 బంతుల్లో అర్ధసెంచరీలు సాధించారు. ఓవర్కు 10 పైచిలుకు రన్రేట్ నమోదు చేసిన పాక్ 14వ ఓవర్లలోనే 150 పరుగుల మార్క్ దాటింది. 16వ ఓవర్ వేసిన చమీర ఎట్టకేలకు ఫఖర్ను బౌల్డ్ చేసి 176 పరుగుల ఓపెనింగ్ జోడీని విడగొట్టాడు. తర్వాత పాక్ వికెట్లు పేకమేడలా కూలాయి. నాఫే (2), షాదాబ్ (7), నవాజ్ (0), కెప్టెన్ సల్మాన్ (0) ఇలా వరుసగా బ్యాటర్లంతా విఫలమయ్యారు. మరో వైపు 59 బంతుల్లో ఫర్హాన్ సెంచరీ పూర్తయింది. ఆశలు రేపిన షనక భారీ లక్ష్యఛేదనలో ఆతిథ్య లంక తడబడింది. నిసాంక (3), మిశార (26), అసలంక (25) వేగంగా ఆడేందుకు యత్నించి వికెట్లు పారేసుకున్నారు. దీంతో విజయానికి ఆమడ దూరంలో నిలిచింది. అయితే రత్నాయకే రాణించగా, కెప్టెన్ షనక అనూహ్యంగా ఆఖరి ఓవర్లో చెలరేగి గెలుపు ఆశలు పెంచాడు. 6 బంతుల్లో 28 పరుగుల అసాధ్యమైన సమీకరణం ఉండగా... షాహిన్ అఫ్రిది చివరి ఓవర్లో షనక వరుసగా 4, 6, 6, 6లతో 22 పరుగులు పిండుకున్నాడు. ఇక 2 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన తరుణంలో స్టేడియమంతా మునివేళ్లపై నిలబడింది. కానీ ఒత్తిడికి గురైన షనక ఆ రెండు బంతులకు పరుగు తీయలేకపోవడంతో పాక్ గెలుపు ఖాయమైంది. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఫర్హాన్ (సి) లియనాగే (బి) మదుషంక 100; ఫఖర్ (బి) చమిర 84; ఖాజా నాఫే (సి) అసలంక (బి) మదుషంక 2; షాదాబ్ రనౌట్ 7; నవాజ్ (సి) తీక్షణ (బి) షనక 0; సల్మాన్ (సి) తీక్షణ (బి) షనక 0; ఉస్మాన్ నాటౌట్ 8; షాహిన్ అఫ్రిది (ఎల్బీడబ్ల్యూ) (బి) మదుషంక 4; నసీమ్ షా రనౌట్ 1; అబ్రార్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 212. వికెట్ల పతనం: 1–176, 2–179, 3–198, 4–199, 5–199, 6–203, 7–207, 8–210. బౌలింగ్: మదుషంక 4–0–33–3, చమిర 4–0–48–1, తీక్షణ 4–0–35–0, షనక 4–0–42–2, వెల్లలాగే 3–0–37–0, లియనాగే 1–0–14–0. శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) నవాజ్ (బి) నసీమ్ షా 3; మిశార (బి) అబ్రార్ 26; అసలంక (బి) అబ్రార్ 25; రత్నాయకె (సి) అయూబ్ (బి) అఫ్రిది 58; మెండిస్ (బి) అబ్రార్ 3; లియనాగే (బి) నవాజ్ 5; షనక నాటౌట్ 76; వెలలాగే నాటౌట్ 2; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 207. వికెట్ల పతనం: 1–8, 2–33, 3–75, 4–94, 5–101, 6–162. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 4–0–48–1, నసీమ్ షా 4–0–36–1, అబ్రార్ 4–0–23–3, ఉస్మాన్ 4–0–43–0, నవాజ్ 2–0–21–1, షాదాబ్ 2–0–33–0. -
చరిత్ర సృష్టించిన పాక్ ఓపెనర్.. కోహ్లి వరల్డ్ రికార్డు బ్రేక్
టీ20 ప్రపంచకప్-2026లో పాకిస్తాన్ యువ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా పల్లెకలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న కీలక మ్యాచ్లో ఫర్హాన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు.కేవలం 60 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ఫర్హాన్ 9 ఫోర్లు, 5 సిక్స్లతో 100 పరుగులు చేశాడు. ఈ అద్బుత ఇన్నింగ్స్తో పర్హాన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.ఫర్హాన్ సాధించిన రికార్డులు ఇవే👉టీ20 వరల్డ్కప్ ఒక ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఫర్హాన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది. 2014 టీ20 ప్రపంచకప్లో విరాట్ 319 పరుగులు చేశాడు. ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్లో ఫర్హాన్ 383 పరుగులు చేశాడు. దీంతో కోహ్లి ఆల్టైమ్ రికార్డును ఫర్హాన్ బ్రేక్ చేశాడు.👉టీ20 వరల్డ్కప్ ఒక ఎడిషన్లో అత్యధిక సిక్స్లు బాదిన ఆటగాడిగా షిమ్రాన్ హెట్మైర్(17)ను ఫర్హాన్(18) అధిగమించాడు.👉టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఎడిషన్లో రెండు సెంచరీలు బాదిన మొట్టమొదటి బ్యాటర్గా సాహిబ్జాదా ఫర్హాన్ నిలిచాడు. ఇంతకుముందు ఏ ఆటగాడు కూడా ఒకే టోర్నీలో రెండు శతకాలు బాదలేదు.👉అదేవిధంగా టీ20 ప్రపంచకప్లో ఓవరాల్గా రెండు సెంచరీలు చేసిన ప్లేయర్గా క్రిస్ గేల్ రికార్డును ఫర్హాన్ సమం చేశాడు. -
పాక్ ఓపెనర్ల విధ్వంసం.. శ్రీలంక ముందు భారీ టార్గెట్
టీ20 ప్రపంచకప్-2026లో పల్లెకలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న డూ ఆర్ డై మ్యాచ్లో పాకిస్తాన్ ఓపెనర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖార్ జమాన్ ఘనమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్కు 176 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఫర్హాన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 60 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్స్లతో 100 పరుగులు చేశాడు.ఫర్హాన్కు ఈ టోర్నీలో ఇది రెండో సెంచరీ కావడం గమనార్హం. అదేవిధంగా జమాన్ 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లతో 84 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓ దశలో పాక్ 250 పరుగుల మార్క్ సునాయసంగా దాటేలా కన్పించింది.అయితే ఆఖరిలో వికెట్లు కోల్పోవడంతో పాక్ 250 ప్లస్ పరుగులు సాధించలేకపోయింది. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక మూడు, షనక రెండు, చమీరా తలా వికెట్ సాధించారు. పాకిస్తాన్ సెమీస్కు అర్హత సాధించాలంటే శ్రీలంకను 147 పరుగుల లోపు కట్టడి చేయాలి. -
శ్రీలంకతో చావో రేవో.. జట్టులో మూడు మార్పులు చేసిన పాక్
టీ20 వరల్డ్ కప్-2026 సూపర్-8 లో భాగంగా కొలంబో వేదికగా శ్రీలంక, పాకిస్తాన్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. శ్రీలంక ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించగా.. పాక్కు మాత్రం ఈ మ్యాచ్ చాలా కీలకం.పాక్ తొలుత బ్యాటింగ్ చేయనున్నందున 65 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించాలి. అప్పుడే న్యూజిలాండ్ను వెనక్కినెట్టి పాక్ సెమీస్కు అర్హత సాధిస్తోంది. ఈ కీలక మ్యాచ్లో పాకిస్తాన్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. ఖవాజా నఫే, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్ తుది జట్టులోకి వచ్చారు.తుది జట్లుపాకిస్తాన్ : సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), ఖవాజా నఫే, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్శ్రీలంక : పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార(వికెట్ కీపర్), చరిత్ అసలంక, పవన్ రత్నాయకే, కమిందు మెండిస్, దసున్ షనక(కెప్టెన్), జనిత్ లియానాగే, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక -
వాళ్లతో బౌలింగ్ చేయిస్తావా?: సాంట్నర్పై సౌతాఫ్రికా లెజెండ్ ఫైర్
ఇంగ్లండ్తో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో న్యూజిలాండ్ చేతులెత్తేసింది. వ్యూహాలను అమలు చేసే క్రమంలో తడబడి ఓటమిని ఆహ్వానించింది. ఫలితంగా సెమీస్ చేరేందుకు మరో మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సిన దుస్థితి తెచ్చుకుంది. 159 పరుగులుకొలంబో వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. టిమ్ సీఫర్ట్ (35), ఫిన్ అలెన్ (29) ఫర్వాలేదనిపించగా.. గ్లెన్ ఫిలిప్స్ (39) రాణించాడు. మిగతా వారు స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కివీస్ 159 పరుగులు చేయగలిగింది.ఆదిలోనే ఎదురుదెబ్బలుఇంగ్లండ్ బౌలర్లలో రెహాన్ అహ్మద్, విల్ జాక్స్, ఆదిల్ రషీద్ రెండేసి వికెట్లు తీయగా.. లియామ్ డాసన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ను కివీస్ బౌలర్లు ఆదిలోనే దెబ్బ కొట్టారు. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (2), జోస్ బట్లర్ (0) ఇలా వచ్చి అలా వెళ్లగా.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (26)ను ఫిలిప్స్ తొందరగానే పెవిలియన్కు పంపాడు.ఆఖర్లో అంతా తలకిందులుఇక జేకబ్ బెతెల్ (21), సామ్ కర్రాన్ (24) నిరాశపరచగా.. టామ్ బాంటన్ (33) రాణించాడు. ఇలాంటి తరుణంలో కివీస్కు గెలుపు అవకాశాలు మెరుగు కాగా.. విల్ జాక్స్, రెహాన్ అహ్మద్ వారి ఆశలపై నీళ్లు చల్లారు. ముఖ్యంగా 18వ ఓవర్లో గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్లో 22 పరుగులు పిండుకున్నారు. ఇక 19వ ఓవర్లో సాంట్నర్ బౌలింగ్లో 16 పరుగులు రాబట్టారు. ఇక ఆఖరి ఓవర్లో ఐదు పరుగులు అవసరం కాగా.. హెన్రీ బౌలింగ్లో రెండు సింగిల్, ఫోర్ బాది పని పూర్తి చేశారు.మొత్తంగా జాక్స్ 18 బంతుల్లో 32, రెహాన్ అహ్మద్ 7 బంతుల్లో 19 పరుగులతో అజేయంగా నిలిచి.. మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లండ్ను గెలిపించారు. కివీస్ బౌలర్లలో రచిన్ రవీంద్ర మూడు, మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, గ్లెన్ ఫిలిప్స్ ఒక్కో వికెట్ తీశారు. అయితే, ఆఖరి రెండు ఓవర్లలో ఫలితం తారుమారు కావడంతో కివీస్కు చేదు అనుభవం తప్పలేదు. శ్రీలంకతో శనివారం నాటి మ్యాచ్లో పాకిస్తాన్ ఓడిపోతేనే న్యూజిలాండ్ సెమీస్ చేరగలదు.వాళ్లతో బౌలింగ్ చేయిస్తావా?ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో మ్యాచ్లో ఆఖరి రెండు ఓవర్లలో కివీస్ అనుసరించిన వ్యూహాన్ని సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఘాటుగా విమర్శించాడు. ‘‘18వ ఓవర్లో.. గెలుపు దోబూచులాడుతున్న వేళ.. ఇద్దరు కుడిచేతి వాటం బ్యాటర్లు క్రీజులో ఉన్న సమయంలో.. ఆఫ్ స్పిన్నర్లను ప్రయోగిస్తారా? ఇంతకంటే జోక్ ఉంటుందా?’’ అంటూ కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్కు గ్రేమ్ స్మిత్ చురకలు అంటించాడు.చదవండి: T20 WC: పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘాపై వేటు! -
T20 WC: పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘాపై వేటు!
టీ20 ప్రపంచకప్-2026 తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘాపై వేటు పడనుందా?.. ఫలితంతో సంబంధం లేకుండా అతడిని తొలగించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సిద్ధమైందా?.. అంటే అందుకు అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఏమాత్రం సంతోషంగా లేరుఈ విషయం గురించి పీసీబీ వర్గాలు స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పాక్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నక్వీ (Mohsin Naqvi)జట్టు ప్రదర్శన పట్ల ఏమాత్రం సంతోషంగా లేరు. ఈసారి పాకిస్తాన్ మెరుగ్గా ఆడుతుందని సెలక్టర్లు, యాజమాన్యం ఆయనకు హామీ ఇచ్చాయి. కానీ ఫలితాలు మాత్రం అందుకు అనుగుణంగా లేవు.కెప్టెన్ సహా వారిపై వేటుముఖ్యంగా సల్మాన్ ఆఘా, బాబర్ ఆజం, ఉస్మాన్ ఖాన్ (Usman Khan)లతో పాటు మరికొంత మంది సీనియర్ ఆటగాళ్లకు ఇదే చివరి వరల్డ్కప్ కానుంది. అంతేకాదు వాళ్ల అంతర్జాతీయ టీ20 కెరీర్ ఇంతటితో ముగిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏదేమైనా టీ20 ప్రపంచకప్ తర్వాత పాకిస్తాన్ టీ20 జట్టులో భారీ మార్పులు చూడబోతున్నారు’’ అని పేర్కొన్నాయి.పసికూనలపై గెలిచికాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తుండగా.. తటస్థ వేదికైన లంకలో పాక్ మ్యాచ్లు ఆడుతోంది. గ్రూప్-ఎ నుంచి భారత్, నమీబియా, అమెరికా, నెదర్లాండ్స్లతో కలిసి లీగ్ దశలో తలపడ్డ పాక్.. టీమిండియా చేతిలో మాత్రమే ఓడింది. మిగిలిన మూడు మ్యాచ్లలో గెలిచి గ్రూప్-ఎలో టీమిండియా తర్వాతి స్థానాన్ని ఆక్రమించి.. సూపర్-8కు చేరుకుంది.లంకపై భారీ తేడాతో గెలిస్తేనేఅయితే, కీలక సూపర్-8 దశలో న్యూజిలాండ్తో ఆడాల్సిన మ్యాచ్ వర్షార్ఫణం కాగా.. ఇంగ్లండ్ చేతిలో పాక్ ఓడిపోయింది. దీంతో శనివారం నాటి మ్యాచ్లో శ్రీలంకపై తప్పక భారీ విజయం సాధిస్తేనే పాకిస్తాన్ సెమీస్ చేరుకుంటుంది. ఇదిలా ఉంటే.. టోర్నీ ఆసాంతం పాక్ సీనియర్ ఆటగాళ్లు పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. దీంతో వారి కెరీర్ ముగించేలా పీసీబీ పావులు కదుపుతున్నట్లు సమాచారం.చదవండి: IND vs WI: విండీస్ను ఓడిస్తే సెమీ ఫైనల్లో.. ప్రత్యర్థి ఎవరంటే? -
T20 WC: హెడ్కోచ్ పదవికి సనత్ జయసూర్య గుడ్బై
శ్రీలంక దిగ్గజ క్రికెటర్, ప్రస్తుత హెడ్కోచ్ సనత్ జయసూర్య కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2026లో శ్రీలంక- పాకిస్తాన్ మధ్య శనివారం నాటి మ్యాచ్ ముగిసిన తర్వాత పదవి నుంచి వైదొలగనున్నాడు.ముందుగానే రాజీనామాఈ ఏడాది మార్చి 31 వరకు హెడ్కోచ్గా సనత్ జయసూర్య (Sanath Jayasuriya)కు పదవీకాలం ఉంది. అయితే, ముందుగానే వైదొలగాలని అతడు నిర్ణయించుకున్నాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో దారుణంగా ఓడిపోయి.. శ్రీలంక క్రికెట్ పతన స్థితికి చేరుకుంది. ఈ ఐసీసీ టోర్నీలో పరాభవం తర్వాత.. దాదాపు ఎనిమిది నెలల అనంతరం సనత్ జయసూర్య హెడ్కోచ్గా వచ్చాడు.మిశ్రమ ఫలితాలుటీమిండియాతో జూలై, 2024లో జరిగిన సిరీస్తో తాత్కాలిక హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టిన సనత్ జయసూర్య.. ఊహించని రీతిలో లంకకు చారిత్రాత్మక విజయం అందించాడు. అతడి మార్గదర్శనంలో దాదాపు రెండున్నర శతాబ్దాల తర్వాత శ్రీలంక భారత్పై వన్డే సిరీస్ గెలిచింది. ఆ తర్వాత కూడా మిశ్రమ ఫలితాలు అందుకుంది.మొత్తంగా దాదాపు 70 మ్యాచ్లలో లంక జట్టుకు సనత్ జయసూర్య మార్గదర్శనం చేయగా.. జయాపజయాలు దాదాపుగా సమానంగా ఉండటం గమనార్హం. అయితే, తాను ఈ పదవిలో పూర్తికాలం కొనసాగబోనని అతడు ఈ ఏడాది జనవరిలోనే స్పష్టం చేశాడు. సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్-2026 ముగిసిన తర్వాత రాజీనామా చేస్తానని ప్రకటించాడు.టీ20 వరల్డ్కప్ టోర్నీలో మరోసారి వైఫల్యంకాగా భారత్తో కలిసి శ్రీలంక టీ20 వరల్డ్కప్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. లీగ్ దశలో గ్రూప్-బి నుంచి పోటీ పడ్డ దసున్ షనక బృందం.. నాలుగింట మూడు విజయాలు సాధించింది. ఐర్లాండ్, ఒమన్, ఆస్ట్రేలియాలపై గెలిచిన లంక.. అనూహ్య రీతిలో జింబాబ్వే చేతిలో ఓడిపోయింది.ఇక సూపర్-8 దశలో తొలుత ఇంగ్లండ్ చేతిలో 51 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన శ్రీలంక.. తదుపరి న్యూజిలాండ్ చేతిలో 61 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. తద్వారా సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. టీ20 ప్రపంచకప్లో శ్రీలంక ఇలా సెమీ ఫైనల్కు చేరకుండానే ఇంటిబాట పట్టడం ఇది వరుసగా ఐదోసారి. ఈ నేపథ్యంలో మరోసారి లంక జట్టు ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. ఇక సూపర్-8లో చివరగా పాకిస్తాన్తో శనివారం నాటి నామమాత్రపు మ్యాచ్లో లంక తలపడుతుంది. ఇందుకు పల్లెకెలె వేదిక.చదవండి: T20 WC 2026 SL vs PAK: పాకిస్తాన్కు చావోరేవో.. గెలిస్తే సరిపోదు! -
IND vs WI: విండీస్ను ఓడిస్తే సెమీ ఫైనల్లో.. ప్రత్యర్థి ఎవరంటే?
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియా తాడోపేడో తేల్చుకోవాల్సిన స్థితిలో నిలిచింది. వెస్టిండీస్తో ఆదివారం జరిగే మ్యాచ్లో గెలిస్తేనే భారత జట్టు సెమీ ఫైనల్కు చేరుకుంటుంది. లేదంటే ఈ డిఫెండింగ్ చాంపియన్కు చేదు అనుభవం తప్పదు.ఇంగ్లండ్, సౌతాఫ్రికా రైట్రైట్నాలుగు గ్రూపుల టాపర్లుగా టీమిండియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే సూపర్-8 దశకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన ప్రకారం టాపర్లన్నింటినీ గ్రూప్-1లో చేర్చింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC).ఇక లీగ్ దశలో ఆయా గ్రూపులలో రెండో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లను గ్రూప్-2లో చేర్చింది. ఈ క్రమంలో గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ హ్యాట్రిక్ విజయాలతో ఇప్పటికే సెమీస్ బెర్తు ఖరారు చేసుకోగా.. గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.మిగిలిన రెండు స్థానాల కోసంమరోవైపు.. మిగిలిన రెండు స్థానాల కోసం టీమిండియా- వెస్టిండీస్... పాకిస్తాన్- న్యూజిలాండ్ రేసులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం నాటి పాక్- శ్రీలంక మ్యాచ్ గ్రూప్-2 నుంచి మరో సెమీ ఫైనలిస్టును తేల్చనుండగా.. ఆదివారం జరిగే భారత్- విండీస్ మ్యాచ్తో నాలుగో సెమీ ఫైనలిస్టు ఎవరో తేలుతుంది.వెస్టిండీస్పై తప్పక గెలవాలికోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్పై తప్పక గెలిస్తేనే టీమిండియా సెమీస్ చేరుకుంటుంది. బ్యాటింగ్కు అనుకూలంగా మలిచిన ఈ పిచ్పై ఫామ్ పరంగా ఇరుజట్లు సమానంగా కనిపిస్తుండటంతో పరుగుల వరద ఖాయం. పైచేయి సాధించిన వారిదే సెమీస్ బెర్తు.సెమీ ఫైనల్లో.. ప్రత్యర్థి ఎవరంటే?అయితే, పటిష్ట టీమిండియా విండీస్ను ఓడించి సెమీ ఫైనల్కు చేరితే.. ఇంగ్లండ్తో తలపడాల్సి ఉంటుంది. ముంబైలోని వాంఖడే మైదానంలో గురువారం (మార్చి 5)న జరిగే రెండో సెమీస్ మ్యాచ్లో హ్యారీ బ్రూక్ బృందంతో అమీతుమీ తేల్చుకోవాల్సి ఉంటుంది. అంతా సజావుగా సాగి విండీస్పై గెలిచి.. ఇంగ్లండ్తో భారత్ సెమీస్ ఆడితే ముఖాముఖి రికార్డు ప్రకారం టీమిండియాదే పైచేయిగా ఉండటం సానుకూలాంశం.టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్- ఇంగ్లండ్ ఇప్పటికి ఐదుసార్లు తలపడగా.. భారత్ మూడు సార్లు, ఇంగ్లండ్ రెండుసార్లు గెలిచాయి. అయితే, ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది. ఇంగ్లండ్ సూపర్-8లో హ్యాట్రిక్ విజయాలతో ఆత్మవిశ్వాసంతో ఉండగా.. భారత్ ఇంకా బెర్తు ఖరారు చేసుకోలేక ఒత్తిడిలో ఉంది. UPDATE: సామ్సన్ ఆట... సెమీస్ బాట...చదవండి: IND vs ZIM: అభిషేక్ డిఫెన్స్ ఆశ్చర్యపరిచింది -
సెమీస్ కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్
-
సంజూది చెత్త టెక్నిక్.. కోచ్ల మాట వినడు: భారత మాజీ క్రికెటర్ ఫైర్
న్యూజిలాండ్తో స్వదేశంలో టీ20 సిరీస్ తర్వాత భారత ఓపెనింగ్ జోడీ మారిపోయింది. వరుస వైఫల్యాల కారణంగా సంజూ శాంసన్ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఓపెనర్గా స్థానం కోల్పోయాడు. కివీస్తో సిరీస్లో వన్డౌన్లో వచ్చి అదరగొట్టిన ఇషాన్ కిషన్ (Ishan Kishan).. అభిషేక్ శర్మకు జోడీగా సంజూ స్థానాన్ని భర్తీ చేశాడు.రెండో అవకాశంఅయితే, నమీబియాతో మ్యాచ్కు అభిషేక్ శర్మ (Abhishek Sharma) అనారోగ్యం కారణంగా దూరం కాగా.. సంజూకు ఇషాన్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం దక్కింది. ఈ మ్యాచ్లో అతడు 8 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఆ తర్వాత మళ్లీ బెంచ్కే పరిమితమైన సంజూ (Sanju Samson).. సూపర్-8లో భాగంగా జింబాబ్వేతో మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగాడు.ఘనంగా ఆరంభించిచెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జింబాబ్వేతో మ్యాచ్లో సంజూ 15 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్, రెండు సిక్స్లు బాది 24 పరుగులు చేశాడు. అయితే, బ్లెసింగ్స్ ముజర్బానీ బౌలింగ్లో షార్ట్ బంతిని తప్పుగా అంచనా వేసి గాల్లోకి లేపగా.. ర్యాన్ బర్ల్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో సంజూ ఇన్నింగ్స్ ముగిసిపోయింది.ఈ నేపథ్యంలో మరోసారి సంజూ ఆట తీరుపై విమర్శలు వచ్చాయి. రాకరాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడంటూ అభిమానులు సైతం విమర్శించారు. భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ కూడా ఇదే మాట అంటున్నాడు. సంజూ టెక్నిక్ తప్పుగా ఉందని.. ఇప్పటికైనా పొరపాటు సరిచేసుకోవాలని సూచించాడు.మరోసారి తన టెక్నిక్ తప్పని నిరూపించాడు‘‘చెపాక్లో సంజూను ఆడించడం వల్ల చెన్నై ప్రేక్షకులు సంతోషించారు. అందుకు తగ్గట్లుగానే అతడు మంచి ఆరంభమే అందుకున్నాడు. కానీ మరోసారి తన టెక్నిక్ తప్పని నిరూపించాడు.లెగ్ సైడ్ దిశగా వచ్చిన బంతిని ఆడేందుకు పక్కకు జరిగి మూల్యం చెల్లించాడు. మూడు స్టంప్స్ను ప్రత్యర్థి బౌలర్కు చూపి ఈజీ టార్గెట్ అయ్యాడు. క్రికెట్లో ఓనమాలు దిద్దినపుడే ప్రతి ఆటగాడు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటాడు. మూడు స్టంప్స్ బౌలర్కు కనిపించేలా ఎప్పుడూ ఓ బ్యాటర్ ఎప్పుడూ తప్పు చేయకూడదు.కోచ్ల మాట వింటాడో లేదో!అలా చేయడం ప్రాథమిక తప్పిదం. అసలు అతడు కోచ్ల మాట వింటాడో లేదో నాకు తెలియదు. నిజానికి టీమిండియాలో ప్రతి ఒక్కరికి వ్యక్తిగత కోచ్ ఉన్నాడు. కాబట్టి అతడు ఎవరి మాట విని ఇలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు. టెక్నికే తప్పుగా ఉంటే.. ఆటలో ఇంకేం ముందుకు వెళ్లగలవు?.. ఈ టోర్నీలో అతడు టెక్నిక్ సరి చేసుకోవడం కష్టమే అనిపిస్తోంది’’ అంటూ ఘాటుగా సంజూను విమర్శించాడు బద్రీనాథ్.కాగా కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ గత ఏడాది కాలంగా భారత టీ20 ఓపెనర్గా రాణించాడు. అయితే, ఇటీవలి కాలంలో అతడు ఫామ్ కోల్పోయాడు. కివీస్తో సిరీస్లో సంజూ చేసిన పరుగులు 10, 6, 0, 24, 6. గత కొంతకాలంగా అతడు షార్ట్ బంతుల్ని తప్పుగా అంచనా వేసి అవుట్ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే బద్రీనాథ్ సంజూ టెక్నిక్ సరిగ్గా లేదంటూ చివాట్టు పెట్టాడు.చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్ ఫైర్𝐃𝐈𝐒𝐏𝐀𝐓𝐂𝐇𝐄𝐃 🚀Sanju Samson starts the innings on a positive note! 💪ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/TtmJRlvcR0— Star Sports (@StarSportsIndia) February 26, 2026 -
T20 WC 2026: పాకిస్తాన్కు చావోరేవో.. గెలిస్తే సరిపోదు!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ సెమీ ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది. హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ ముందుగా సెమీస్ చేరగా.. గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా బెర్తును ఖరారు చేసుకుంది. మిగిలిన రెండు బెర్తుల కోసం గ్రూప్-1 నుంచి టీమిండియా, వెస్టిండీస్.. గ్రూప్-2 నుంచి న్యూజిలాండ్, పాకిస్తాన్ పోటీలో ఉన్నాయి.పాకిస్తాన్ సెమీస్ చేరాలంటేఇందులో భాగంగా పాకిస్తాన్, శ్రీలంక (PAK vs SL) మధ్య శనివారం జరిగే ‘గ్రూప్–2’ సూపర్–8 మ్యాచ్ మూడో సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేస్తుంది. పల్లెకెలె వేదికగా ఈ మ్యాచ్లో ఆతిథ్య శ్రీలంక.. గెలిస్తే న్యూజిలాండ్ సెమీఫైనల్ చేరుకుంటుంది. పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే మ్యాచ్లో గెలవడంతో పాటు రన్రేట్లో కూడా కివీస్ను వెనక్కి నెట్టాల్సి ఉంటుంది.64 పరుగుల తేడాతో గెలవాలి లేదా..ఒకవేళ పాక్ ముందుగా బ్యాటింగ్ చేస్తే కనీసం 65 పరుగుల తేడాతో గెలవాలి లేదా శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని 13.1 ఓవర్లలో ఛేదించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో నెట్ రన్రేటు పరంగా పటిష్టంగా ఉన్న న్యూజిలాండ్ (+1.390) సెమీస్కు దూసుకెళ్తుంది. ఈ విషయాన్ని అంతర్జాతీ క్రికెట్ మండలి (ICC) స్వయంగా చెప్పడం విశేషం. ఇక కోల్కతా వేదికగా ఆదివారం భారత్- వెస్టిండీస్ (IND vs WI) మధ్య జరిగే పోరు నాలుగో సెమీ ఫైనలిస్టును ఖరారు చేస్తుంది.సౌతాఫ్రికా రెండు విజయాలతోకాగా గ్రూప్ దశలో టాపర్లుగా నిలిచిన జట్లను సూపర్-8 గ్రూప్-1లో.. రెండో స్థానంతో ముగించిన జట్లను గ్రూప్-2లో సీడింగ్ చేశారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా.. టీమిండియా, వెస్టిండీస్లపై గెలిచి నాలుగు పాయింట్లతో గ్రూప్-1 నుంచి ముందుగా సెమీస్ చేరింది. తదుపరి ఆదివారం నాటి మ్యాచ్లో జింబాబ్వేతో నామమాత్రపు మ్యాచ్ ఆడుతుంది.ఇంగ్లండ్ హ్యాట్రిక్ఇక ఇప్పటికే జింబాబ్వే వెస్టిండీస్, టీమిండియా చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. మరోవైపు.. గ్రూప్-2లో ఇంగ్లండ్.. శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్లను ఓడించి సగర్వంగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ గ్రూపు నుంచి ఇప్పటికే శ్రీలంక రెండు పరాజయాలతో ఎలిమినేట్ అయింది.టీ20 ప్రపంచకప్-2026: శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్👉వేదిక: పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియం, శ్రీలంక 👉రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారంచదవండి: అతడు ఎక్కడ బౌలింగ్ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్ ఫైర్ -
ఈడెన్లో ఈ సండే పరుగుల పండగే
కోల్కతా: భారత్, వెస్టిండీస్ల మధ్య రేపు జరిగే మ్యాచ్ ఈ టి20 ప్రపంచకప్కే ‘పైసా వసూల్’ మ్యాచ్ కానుంది. ముమ్మాటికి క్వార్టర్ ఫైనల్గా జరిగే ‘సూపర్–8’ మ్యాచ్లో గెలిచిన జట్టే సెమీఫైనల్ చేరుతుంది. ఆదివారం జరిగే మ్యాచ్ కోసం వినియోగించే పిచ్ గురించి క్యూరేటర్ సుజన్ ముఖర్జీ ఆసక్తికర విషయం వెల్లడించగా... బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శుక్రవారం పిచ్పై సుదీర్ఘంగా సమీక్షించినట్లు తెలిసింది. ఈ వరల్డ్కప్లో స్కాట్లాండ్, ఇటలీ జట్ల మధ్య గ్రూప్–సి లీగ్ మ్యాచ్కు వేదికైన పిచ్పైనే ఆదివారం కీలక సూపర్–8 పోరు జరుగుతుందని క్యూరేటర్ ముఖర్జీ వెల్లడించారు. ఈడెన్ పిచ్పై జరిగిన ఆ రెండో మ్యాచ్లో స్కాట్లాండ్ 207/4 స్కోరు చేసింది. తర్వాత ఇటలీని 134 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ నేపథ్యంలో భారత్, కరీబియన్లాంటి మేటి జట్ల మధ్య జరిగే మ్యాచ్లోనూ పరుగుల విందు గ్యారంటీ కావడంతో ఈడెన్ గార్డెన్స్ కిక్కిరిసి పోతుందని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. బ్యాటర్ల మెరుపులకే కాదు నాణ్యమైన స్పిన్కూ ఈడెన్ అచ్చొచ్చే వేదికని ఎన్నోమార్లు రుజువైంది కూడా! ఇటలీపై స్కాట్లాండ్ స్పిన్నర్లు మైకేల్ లిస్క్ (4/17), మార్క్ వ్యాట్ (2/24) 6 వికెట్లతో అదే నిరూపించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ స్వయంగా ఈడెన్ గార్డెన్స్లోకి వెళ్లి పిచ్ను తదేకంగా పరిశీలించారు. క్యూరేటర్తో వికెట్ పరిస్థితిపై చర్చించారు. అలాగే బోర్డు చీఫ్ క్యూరేటర్ ఆశిష్ భౌమిక్ను కూడా కలిసి సమీక్షించారని ‘క్యాబ్’ వర్గాలు తెలిపాయి. వికెట్తో పాటు స్టేడియం మొత్తాన్ని కవర్లతో కప్పి ఉంచారు. -
టీ20 వరల్డ్ కప్: ఇంగ్లండ్ 'హ్యాట్రిక్'
కొలంబో: న్యూజిలాండ్తో ‘సూపర్ ఎయిట్స్’ మ్యాచ్లో ఇంగ్లండ్ విజయానికి చివరి 3 ఓవర్లలో 43 పరుగులు కావాలి. స్పిన్కు బాగా అనుకూలిస్తూ బ్యాటింగ్కు కష్టంగా మారిన పిచ్పై ఇది అంత సులువు కాదనిపించింది. కానీ ఫిలిప్స్ వేసిన 18వ ఓవర్లో జాక్స్, రేహన్ కలిసి 2 ఫోర్లు, 2 సిక్స్లతో సహా 22 పరుగులు రాబట్టి లెక్కను సులువు చేశారు. తర్వాతి 9 బంతుల్లో మరో 22 పరుగులు సాధించి మ్యాచ్ను ముగించారు. దాంతో ‘సూపర్ ఎయిట్స్’లో ఆడిన మూడు మ్యాచ్లూ గెలిచి ఇంగ్లండ్ అగ్రస్థానంతో ముగించగా... గెలిస్తే నేరుగా సెమీస్ చేరే అవకాశాన్ని కివీస్ పోగొట్టుకుంది. శుక్రవారం జరిగిన పోరులో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (28 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్), టీమ్ సీఫెర్ట్ (25 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. అనంతరం ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసి గెలిచింది. టామ్ బాంటన్ (24 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విల్ జాక్స్ (18 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) కీలక ప్రదర్శన కనబర్చారు. ఓపెనర్లు మినహా... తొలి వికెట్కు 42 బంతుల్లోనే 64 పరుగులు జోడించి ఓపెనర్లు సీఫెర్ట్, ఫిన్ అలెన్ (19 బంతుల్లో 29; 3 సిక్స్లు) కివీస్కు శుభారంభం అందించారు. ఆర్చర్ ఓవర్లో సీఫెర్ట్ వరుసగా 4, 4, 6 బాదడంతో పవర్ప్లేలో జట్టు 54 పరుగులు చేసింది. అయితే రెండు పరుగుల వ్యవధిలో ఓపెనర్లు వెనుదిరగ్గా, తర్వాతి బ్యాటర్లలో ఫిలిప్స్ ఒక్కడే చెప్పుకోదగ్గ పరుగులు సాధించాడు. ఇతర బ్యాటర్లంతా విఫలం కావడంతో న్యూజిలాండ్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. తొలి వరల్డ్ కప్ మ్యాచ్ ఆడిన రేహన్ అహ్మద్ తన తొలి బంతికే రచిన్ రవీంద్ర (11)ను అవుట్ చేయడంతో జట్టు పతనం మొదలైంది. 38 పరుగుల వ్యవధిలో కివీస్ మిడిలార్డర్లో నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆఖరి నాలుగు ఓవర్లలో జట్టు 27 పరుగులు మాత్రమే చేయగలిగింది. సమష్టి ప్రదర్శన... ఛేదనలో ఇంగ్లండ్ ఓపెనర్లు సాల్ట్ (2), బట్లర్ (0) మరోసారి విఫలమయ్యారు. అయితే ఆ తర్వాత హ్యారీ బ్రూక్ (24 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్), బెతెల్ (16 బంతుల్లో 21; 4 ఫోర్లు) కలిసి కీలక పరుగులు జోడించారు. వీరిద్దరి తర్వాత బాంటన్ బాధ్యత తీసుకోగా, స్యామ్ కరన్ (22 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచాడు. అయితే ఈ ఇద్దరినీ కూడా తక్కువ వ్యవధిలో అవుట్ చేసి కివీస్ విజయంపై ఆశలు పెంచుకుంది. కానీ జాక్స్, రేహన్ అహ్మద్ (7 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు) కలిసి అంతా మార్చేశారు. 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో అభేద్యంగా 44 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. స్వదేశానికి మ్యాట్ హెన్రీ... కొలంబో: న్యూజిలాండ్ ప్రధాన పేస్ బౌలర్ మ్యాట్ హెన్రీ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి పయనమయ్యాడు. తన భార్య హాలీ రెండో బిడ్డకు జన్మనివ్వనుండటంతో ఆ సమయంలో కుటుంబంతో ఉండేందుకు హెన్రీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్తో మ్యాచ్ తర్వాత అతను న్యూజిలాండ్కు బయల్దేరాడు. జట్టు హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. నేడు జరిగే పాక్, శ్రీలంక మ్యాచ్ ఫలితం తర్వాత కివీస్ సెమీస్కు చేరితే హెన్రీ మళ్లీ తిరిగి వచ్చి జట్టుతో కలుస్తాడు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: సీఫెర్ట్ (స్టంప్డ్) బట్లర్ (బి) రషీద్ 35; అలెన్ (సి) బెతెల్ (బి) జాక్స్ 29; రచిన్ (సి) బెతెల్ (బి) రేహన్ 11; ఫిలిప్స్ (బి) జాక్స్ 39; చాప్మన్ (స్టంప్డ్) బట్లర్ (బి) రషీద్ 15; మిచెల్ (సి) జాక్స్ (బి) డాసన్ 3; సాంట్నర్ (నాటౌట్) 9; మెక్కోన్కీ (బి) రేహన్ 14; హెన్రీ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–64, 2–66, 3–97, 4–123, 5–133, 6–135, 7–152. బౌలింగ్: ఆర్చర్ 3–1–24–0, డాసన్ 4–0–32–1, కరన్ 1–0–10–0, రషీద్ 4–0–28–2, జాక్స్ 4–0–23–2, బెతెల్ 1–0–13–0, రేహన్ 3–0–28–2. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) సీఫెర్ట్ (బి) హెన్రీ 2; బట్లర్ (సి) సీఫెర్ట్ (బి) ఫెర్గూసన్ 0; బ్రూక్ (సి) మిచెల్ (బి) ఫిలిప్స్ 26; బెతెల్ (సి) ఫిలిప్స్ (బి) రచిన్ 21; బాంటన్ (సి) చాప్మన్ (బి) రచిన్ 33; కరన్ (సి) ఫిలిప్స్ (బి) రచిన్ 24; జాక్స్ (నాటౌట్) 32; రేహన్ (నాటౌట్) 19; ఎక్స్ట్రాలు 4; మొత్తం (19.3 ఓవర్లలో 6 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–2, 2–2, 3–50, 4–58, 5–100, 6–117. బౌలింగ్: హెన్రీ 2.3–0–19–1, ఫెర్గూసన్ 2–0–14–1, సాంట్నర్ 4–0–29–0, మెక్కోన్కీ 1–0–13–0, ఫిలిప్స్ 4–0–43–1, రచిన్ 4–0–19–3, సోధి 2–0–21–0. -
T20 WC: రింకూ సింగ్ సంచలన నిర్ణయం!
టీమిండియా స్టార్ రింకూ సింగ్ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. అతడి తండ్రి ఖాంచంద్ సింగ్ కన్నుమూశారు. క్యాన్సర్తో పోరాటంలో ఓడి శుక్రవారం తుదిశ్వాస విడిచారు. గ్రేటర్ నోయిడాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.తండ్రి పాడె మోస్తూ..దీంతో రింకూ సింగ్ (Rinku Singh) హుటాహుటిన స్వస్థలానికి పయనమయ్యాడు. భారత జట్టును వీడి.. చెన్నై నుంచి ఉత్తరప్రదేశ్లోని అలీఘర్కు చేరుకున్నాడు. కన్నీళ్లను దిగమింగుకుని తండ్రి పాడె మోస్తూ.. సోదరులతో కలిసి అంత్యక్రియలు పూర్తి చేశాడు.ఈ నేపథ్యంలో రింకూ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పుట్టెడు దుఃఖంలోనూ తిరిగి టీమిండియాతో చేరేందుకు అతడు సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయం గురించి రింకూ సన్నిహితులు స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీ నుంచి అలీఘర్కు రింకూ రోడ్డు మార్గంలో వచ్చాడు. తండ్రి అంత్యక్రియలకు అతడు హాజరయ్యాడు.आंखों में आंसू, कंधे पर पिता की अर्थी…क्रिकेटर रिंकू सिंह के पिताजी के निधन की खबर बेहद दुखद है। इस कठिन घड़ी में रिंकू और उनके परिवार के साथ पूरे देश की संवेदनाएं हैं।ईश्वर दिवंगत आत्मा को शांति दे और परिवार को यह दुःख सहने की शक्ति प्रदान करे। 🙏#RinkuSinghFatherDemise pic.twitter.com/PUSPVIAt3l— Dinesh Kumar (@DineshRedBull) February 27, 2026రింకూ తిరిగి జట్టుతో చేరతాడుతన నలుగురు అన్మదమ్ములతో కలిసి రింకూ కార్యక్రమం పూర్తి చేశాడు’’ అని చెప్పారు. మరోవైపు.. రింకూ అన్న మాట్లాడుతూ.. ‘‘మా నాన్న అంత్యక్రియల కోసమే రింకూ ఇక్కడికి వచ్చాడు. కార్యక్రమం పూర్తైంది. కోల్కతాలో మ్యాచ్ కోసం రింకూ తిరిగి జట్టుతో చేరతాడు’’ అని స్పష్టం చేశాడు.కీలక మ్యాచ్కు అందుబాటులో ఉండాలనికాగా టీ20 ప్రపంచకప్-2026 సూపర్-8లో టీమిండియా ఆదివారం కీలక మ్యాచ్ ఆడనుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్ జరిగే ఈ మ్యాచ్లో గెలిస్తేనే.. భారత్ సెమీ ఫైనల్కు చేరుకుంటుంది. ఇంతటి కీలక మ్యాచ్కు అందుబాటులో ఉండాలని రింకూ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.బ్యాట్ ఝులిపించనేలేదుఇక లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే రింకూ ఇప్పటి వరకు మెరుగ్గా ఆడనేలేదు. లీగ్ దశలో నాలుగు.. సూపర్-8లో సౌతాఫ్రికాతో మ్యాచ్తో కలిపి మొత్తంగా 24 పరుగులే చేయగలిగాడు. అయితే, కొన్నిసార్లు ఏకంగా అతడిని ఎనిమిదో స్థానంలో ఆడించడం కూడా ప్రభావం చూపింది. కాగా జింబాబ్వేతో గురువారం నాటి మ్యాచ్కు రింకూ అందుబాటులో ఉన్నా.. అతడిని బెంచ్కే పరిమితం చేసింది యాజమాన్యం. చెన్నై వేదికగా ఈ మ్యాచ్లో 72 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది టీమిండియా.చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్ ఫైర్ -
T20 WC 2026: జట్టును వీడనున్న న్యూజిలాండ్ స్టార్
న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ జట్టును వీడనున్నాడు. ఇంగ్లండ్తో శుక్రవారం నాటి మ్యాచ్ అనంతరం స్వదేశానికి పయనం కానున్నాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ కోచ్ రాబ్ వాల్టర్ ధ్రువీకరించాడు.కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో సెమీస్ చేరడమే లక్ష్యంగా న్యూజిలాండ్ ముందుకు సాగుతోంది. సూపర్-8లో తొలుత పాక్తో కివీస్ మ్యాచ్ ఆడాల్సి ఉండగా.. వర్షం వల్ల టాస్ పడకుండానే రద్దై పోయింది. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ వచ్చింది.నెట్ రన్రేటు పరంగానూఇక తమ తదుపరి మ్యాచ్లో న్యూజిలాండ్ శ్రీలంకపై ఘన విజయం సాధించింది. దసున్ షనక బృందాన్ని 61 పరుగుల తేడాతో చిత్తు చేసి నెట్ రన్రేటును భారీగా మెరుగుపరచుకుంది. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంకలతో కూడన గ్రూప్-2 నుంచి ఇప్పటికే ఇంగ్లండ్ సెమీ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది.రెండో బెర్తు కోసం న్యూజిలాండ్- పాకిస్తాన్ మధ్య పోటీ నెలకొనగా.. కివీస్ మూడు పాయింట్లతో ముందంజలో ఉంది. ఇక శుక్రవారం ఇంగ్లండ్తో తమ ఆఖరి మ్యాచ్లో గెలిచిందంటే న్యూజిలాండ్ నేరుగా సెమీస్ చేరుతుంది.ఈ నేపథ్యంలో కొలంబో వేదికగా ఇంగ్లండ్తో మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.రెండో బిడ్డకు స్వాగతం పలికేందుకుఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో మ్యాచ్ ముగిసిన అనంతరం కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ జట్టును వీడనున్నాడు. తమ రెండో బిడ్డకు స్వాగతం పలికేందుకు స్వదేశానికి వెళ్లనున్నాడు. ఈ విషయం గురించి కోచ్ రాబ్ వాల్టర్ మాట్లాడుతూ.. ‘‘మ్యాట్, హోలీల రెండో సంతానం కోసం మేము కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.ఆ కుటుంబానికి ఇది అత్యంత కీలకమైన, ఆనందాయకమైన సమయం. వారికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాం. ఇక జట్టు విషయానికొస్తే.. గతం సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడు అదృష్టం మా వైపు ఉంటుందనే అనుకుంటున్నాం.మ్యాట్తో పాటు మాకు కూడా స్టార్లు కలిసి రావాలి. ఈ టోర్నీ తుది దశలో అతడు తప్పక జట్టుతో చేరతాడు’’ అని పేర్కొన్నాడు. తమ జట్టు తప్పక సెమీస్ చేరుతుందని.. అప్పటికి మ్యాట్ హెన్రీ మళ్లీ జట్టుతో కలుస్తాడని వాల్టర్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా మార్చి 4న తొలి సెమీ ఫైనల్.. మార్చి 5న రెండో సెమీస్ మ్యాచ్కు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్ ఫైర్ -
గోల్డెన్ డక్!.. మరోసారి శ్రేయస్ అయ్యర్ ఫెయిల్
టీమిండియా తరఫున చివరగా న్యూజిలాండ్తో వన్డేతో బరిలోకి దిగాడు శ్రేయస్ అయ్యర్. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఈ మ్యాచ్లో ఈ మిడిలార్డర్ బ్యాటర్ పది బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులే చేసి నిష్క్రమించాడు.మూడు వన్డేల సిరీస్లో భాగంగా శ్రేయస్ (Shreyas Iyer) చేసిన పరుగులు వరుసగా.. 49, 8, 3. ఈ సిరీస్లో న్యూజిలాండ్ 2-1తో టీమిండియాను ఓడించి.. తొలిసారి భారత గడ్డపై వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది.ఇదిలా ఉంటే.. కివీస్తో వన్డే సిరీస్ తర్వాత టీ20 ప్రపంచకప్-2026తో టీమిండియా బిజీగా మారగా.. శ్రేయస్ అయ్యర్ లోకల్ టీ20 టోర్నీలో భాగమయ్యాడు. నవీ ముంబై వేదికగా డీవై పాటిల్ టీ20 కప్లో ఈ ముంబైకర్ BPCL జట్టుకు ఆడుతున్నాడు. తొలి మ్యాచ్లో గోల్డెన్ డకౌట్ఇందులో భాగంగా మంగళవారం నాటి మ్యాచ్లో బ్యాంక్ ఆఫ్ బరోడాతో BPCL తలపడగా.. శ్రేయస్ అయ్యర్ గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్లో BPCL ఎనిమిది పరుగుల తేడాతో ఓటమిపాలైంది.Shreyas Iyer ( Sarpanch Sahab ) Punjab Kings Captain Performances In Random DY Patil Tournament Against Club Level Bowlers - 1st Match 0(1) - 2nd Match 5(13) while chasing 200 Few Days Back , People Were Doing His Paid PR That He Deserves To Be In The T20 World Cup Squad 😂 pic.twitter.com/03yuOVEQXX— Stubbsy (@spideypant_) February 25, 2026మరోసారి ఫెయిల్ఇక రెండో మ్యాచ్లోనూ శ్రేయస్ అయ్యర్ విఫలమయ్యాడు. రిలయన్స్తో మ్యాచ్ సందర్భంగా ఈ ముంబైకర్ పదమూడు బంతులు ఎదుర్కొని కేవలం ఐదు పరుగులే చేసి నిష్క్రమించాడు. ఈ మ్యాచ్లో BPCL 65 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది.ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ వరుస వైఫల్యాలపై విమర్శలు వస్తున్నాయి. కాగా ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ తరఫున పరుగుల వరద పారించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. కెప్టెన్గానూ రాణించి జట్టును ఫైనల్కు చేర్చాడు. అయినప్పటికీ టీమిండియా సెలక్టర్లు అతడిని కరుణించలేదు.అగార్కర్ నిర్ణయం సరైందేనంటూ సెటైర్లుఆసియా టీ20 కప్-2025 ఆడిన జట్టుకు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శ్రేయస్ పేరును పరిగణనలోకి తీసుకోలేదు. ఇక టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ముందు కూడా శ్రేయస్ పేరు వినిపించగా.. అతడిని సెలక్టర్లు పట్టించుకోలేదు.ఇలాంటి తరుణంలో.. ఐపీఎల్-2026 టోర్నీకి ముందు లోకల్ టోర్నమెంట్లో శ్రేయస్ అయ్యర్ ఇలా విఫలం కావడం విమర్శలకు దారితీసింది. శ్రేయస్ను భారత టీ20 జట్టుకు ఎంపిక చేయకుండా అగార్కర్ మంచి నిర్ణయమే తీసుకున్నాడంటూ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. అయితే, అతడి అభిమానులు మాత్రం త్వరలోనే మునుపటి శ్రేయస్ అయ్యర్ను చూడబోతున్నారంటూ మద్దతుగా నిలుస్తున్నారు.చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. దంచికొట్టిన అర్జున్ టెండుల్కర్ -
Tilak Varma: నాకే చోటు లేదా?.. మెరుపులతో ఇరగదీశాడు!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్లలోనూ తిలక్ వర్మ తనదైన మూడో స్థానంలోనే బ్యాటింగ్కు వచ్చాడు. సౌతాఫ్రికాతో సూపర్-8 మ్యాచ్లోనూ వన్డౌన్లో దిగాడు. అయితే, ఐదు మ్యాచ్లలోనూ తిలక్ వర్మ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు.తిలక్ ప్రదర్శన ఇలా..ముఖ్యంగా ఈ హైదరాబాదీ బ్యాటర్ స్ట్రైక్రేటుపై విమర్శలు వచ్చాయి. లీగ్ దశలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లపై తిలక్ వర్మ వరుసగా.. 25, 25 , 25, 31 పరుగులు చేశాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్లో రెండు బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు.టాపార్డర్ నుంచి తీసేశారు!అయితే, తాజాగా జింబాబ్వేతో గురువారం నాటి సూపర్-8 మ్యాచ్లో మాత్రం తిలక్ వర్మ ఇరగదీశాడు. నిజానికి ఈ మ్యాచ్కు ముందు ఈ లెఫ్టాండర్ బ్యాటర్కు తుదిజట్టులో చోటు దక్కదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. టాపార్డర్లో ముగ్గురూ లెఫ్లాండర్లే (ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ) ఉన్న కారణంగా.. ఒకరిపై వేటు తప్పదనే విశ్లేషణలు వినిపించాయి.ఊహించినట్లుగానే టాపార్డర్ మారింది. అభిషేక్ శర్మకు జోడీగా.. ఓపెనర్గా రైట్ హ్యాండర్ సంజూ శాంసన్ తిరిగి రాగా.. ఇషాన్ను వన్డౌన్లో ఆడించారు. అయితే, ఊహించని రీతిలో తిలక్ వర్మను లోయర్ ఆర్డర్కు పంపించారు. ఐపీఎల్లో ఆడిన అనుభవం ఇప్పటికే తిలక్కు ఉంది.16 బంతుల్లోనే ఇక జింబాబ్వేతో మ్యాచ్లో ఆరో స్థానంలో బరిలోకి దిగిన తిలక్ వర్మ మెరుపులు మెరిపించాడు. కేవలం 16 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 44 పరుగులతో అజేయంగా నిలిచాడు. స్ట్రైక్రేటు 275. ఇలా మేనేజ్మెంట్ చేసిన ప్రయోగం ఫలించి.. తిలక్ వర్మ విమర్శకులకు బ్యాట్తోనే సమాధానం ఇచ్చాడు.డౌన్ ఆర్డర్కు పంపడం మంచిదైందిఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తిలక్ విషయంలో టీమిండియా మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాడు. ‘‘తిలక్ వర్మను డౌన్ ఆర్డర్కు పంపి టీమిండియా మంచి పని చేసింది. లోయర్ ఆర్డర్లో అతడు బ్యాటింగ్ చేయడం నేను ఇప్పటికే చూశాను.నిజానికి ఇలా బ్యాటింగ్ ఆర్డర్లో వెనుక రావడం వల్ల.. టాపార్డర్తో పోలిస్తే ఒత్తిడి తక్కువగా ఉంటుంది. హార్దిక్ పాండ్యా ఐదు, తిలక్ ఆరో స్థానంలో రావడం వారితో పాటు జట్టుకు మేలు చేసింది. నిజానికి సౌతాఫ్రికాతో మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ను ఐదు, హార్దిక్ను ఏడో స్థానంలో సూర్య పంపడం చూసి నేను షాకయ్యాను. ఏదేమైనా ఈ మ్యాచ్లో తిలక్, హార్దిక్లను సరైన స్థానాల్లో ఆడించి ఫలితం రాబట్టారు’’ అని సంజయ్ మంజ్రేకర్ టీమిండియా నాయకత్వ బృందాన్ని అభినందించాడు. కాగా జింబాబ్వేతో మ్యాచ్లో టీమిండియా 72 పరుగుల తేడాతో గెలిచి.. సెమీస్ అవకాశాలు మెరుగుపరచుకుంది.చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్ ఫైర్ -
జింబాబ్వేపై గెలిచాం.. కానీ: సూర్యకుమార్ అసంతృప్తి
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో భారత జట్టు సెమీస్ అవకాశాలు మెరుగుపడ్డాయి. సూపర్-8 దశలో తొలి మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో ఓడిపోయిన సూర్యకుమార్ సేన.. జింబాబ్వేపై గురువారం నాటి మ్యాచ్లో 72 పరుగుల తేడాతో గెలిచి నష్టాన్ని పూడ్చుకుంది.ఇక తదుపరి ఆదివారం నాటి మ్యాచ్లో వెస్టిండీస్పై గెలిచిందంటే టీమిండియా సెమీ ఫైనల్లో అడుగుపెడుతుంది. ఒకవేళ వర్షం పడి ఆటంకం కలిగితే.. అపుడు నెట్ రన్రేటు కీలకం అవుతుంది. ప్రస్తుతానికి భారత్ (-0.100) కంటే విండీస్ (+1.791) ఈ విషయంలో మెరుగ్గా ఉంది.భారీ తేడాతో గెలిచి ఉంటే బాగుండేదినిజానికి జింబాబ్వేతో మ్యాచ్లో భారత్ గెలిచినప్పటికీ.. ఇంకాస్త భారీ తేడాతో గెలిచి ఉంటే రన్రేటు మెరుగయ్యేది. ఈ నేపథ్యంలోనే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భారత బౌలర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీమిండియా ఇన్నింగ్స్లో ఆరుగురు బ్యాటర్లు కలిసి 150కి పైగా స్ట్రైక్రేటుతో ఏకంగా 256 పరుగులు రాబట్టారు. అయితే, జింబాబ్వేను తక్కువ స్కోరుకే అవుట్ చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు.𝐂𝐨𝐦𝐞𝐭𝐡 𝐭𝐡𝐞 𝐦𝐨𝐦𝐞𝐧𝐭, 𝐜𝐨𝐦𝐞𝐭𝐡 𝐇𝐚𝐫𝐝𝐢𝐤 𝐏𝐚𝐧𝐝𝐲𝐚. 🤌A breathtaking burst at the death by him, powered #TeamIndia past 250 with authority! 🙌ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/LazrvENuz8— Star Sports (@StarSportsIndia) February 26, 2026ముఖ్యంగా అక్షర్ పటేల్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో జింబాబ్వే బ్యాటర్లు మెరుగ్గా ఆడారు. ఇక శివం దూబే వేసిన రెండు ఓవర్లలోనే ఏకంగా 46 పరుగులు పిండుకున్నారు. మొత్తానికి 20 ఓవర్లలో జింబాబ్వే ఆరు వికెట్లు నష్టపోయి 184 పరుగులు చేయగలిగింది.మా బ్యాటర్లు సూపర్.. కానీ బౌలర్లేఈ నేపథ్యంలో జింబాబ్వేపై విజయానంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్క బ్యాటర్ తమ వంతుగా పరుగులు ఇచ్చి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. ఇంతకంటే ఏ ఆటగాడు ఎక్కువగా ఏమీ చేయలేడు. అయితే, బంతితో మా వాళ్లు ఇంకాస్త మెరుగ్గా రాణించాల్సింది. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాల్సింది’’ అని బౌలర్ల ఆటతీరుపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడు.ఏదేమైనా గెలుపు గెలుపేనని.. వెస్టిండీస్తో మ్యాచ్లో మాత్రం తాము బౌలింగ్ పరంగా మరింత స్మార్ట్గా ఉంటేనే అనుకున్న ఫలితం సులువుగా రాబట్టగలమని సూర్య పేర్కొన్నాడు. కోల్కతాకు వెళ్లిన తర్వాతే తుదిజట్టు కూర్పు గురించి ఆలోచిస్తామని.. సెమీస్ చేరే క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదని అన్నాడు.అదరగొట్టిన అర్ష్దీప్కాగా ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్- వెస్టిండీస్ మధ్య మ్యాచ్కు షెడ్యూల్ ఖరారైంది. ఇదిలా ఉంటే.. గ్రూప్-1 నుంచి ఇప్పటికే సౌతాఫ్రికా సెమీస్ బెర్తు ఖరారు చేసుకోగా.. ఈ మ్యాచ్ ఫలితంతో రెండో సెమీ ఫైనలిస్టు ఎవరో తేలుతుంది. ఇదిలా ఉంటే.. జింబాబ్వేతో మ్యాచ్లో పేసర్ అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, శివం దూబే తలా ఒక్క వికెట్ తీశారు.భారత్ వర్సెస్ జింబాబ్వే స్కోర్లు👉వేదిక: చిదంబరం స్టేడియం, చెన్నై👉భారత్: 256/4(20)👉జింబాబ్వే: 184/6(20) 👉ఫలితం: 72 పరుగుల తేడాతో భారత్ గెలుపు.చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. దంచికొట్టిన అర్జున్ టెండుల్కర్ -
అదేం బౌలింగ్?.. అతడు అవసరమా?: భారత మాజీ కెప్టెన్ ఫైర్
టీమిండియా ఎట్టకేలకు టీ20 ప్రపంచకప్-2026 సూపర్-8 దశలో పాయింట్ల ఖాతా తెరిచింది. చెన్నై వేదికగా పసికూన జింబాబ్వేను 72 పరుగులతో చిత్తు చేసింది. తద్వారా రెండు పాయింట్లు సాధించడంతో పాటు.. నెట్రన్రేటును మెరుగుపరుచుకుంది. తదుపరి ఆదివారం నాటి మ్యాచ్లో వెస్టిండీస్పై గెలిస్తే నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెడుతుంది భారత్.ఏకంగా 256 పరుగులుఇక గురువారం నాటి మ్యాచ్లో చెపాక్ బ్యాటింగ్కు పూర్తిగా అనుకూలించడంతో భారత బ్యాటర్లు చెలరేగిన విషయం తెలిసిందే. జింబాబ్వే బౌలింగ్ను చితక్కొడుతూ టీమిండియా ఏకంగా 256 పరుగులు చేసింది. అనంతరం జింబాబ్వే సైతం ఈ బ్యాటింగ్ పిచ్పై 184 పరుగులు చేయగలిగింది.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ భారత బౌలింగ్ వ్యూహంపై పెదవి విరిచాడు. ముఖ్యంగా ఆల్రౌండర్ శివం దూబే (Shivam Dube)తో ఎందుకు బౌలింగ్ చేయించారో అర్థం కాలేదన్నాడు. కాగా జింబాబ్వే (IND vs ZIM)తో మ్యాచ్లో దూబే రెండు ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 46 పరుగులు సమర్పించుకుని.. ఒకే ఒక్క వికెట్ తీశాడు. నోబాల్, వైడ్లతో ప్రత్యర్థికి అదనపు పరుగులు ఇచ్చుకున్నాడు.ఇది బ్యాటింగ్ పిచ్ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘అసలు ఈ మ్యాచ్లో బౌలింగ్ గురించి ఆందోళన పడాల్సిన పనిలేదు. ఇది బ్యాటింగ్ పిచ్. అలాంటపుడు టీమిండియా ఆరో బౌలింగ్ ఆప్షన్ గురించి ఎందుకు ఆలోచించిందో అర్థం కాలేదు.ఎక్కడ బౌలింగ్ చేస్తున్నాడో చూశారా?అసలు దూబే ఎక్కడ బౌలింగ్ చేస్తున్నాడో చూశారా? అతడు సిక్స్త్ స్టంప్ మీదకు బాల్ వేస్తున్నాడు. ఇలాంటి బౌలింగ్ నేనెప్పుడూ చూడనేలేదు. టీమిండియా వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలనే బరిలోకి దిగింది. ఒకవేళ దూబే వంటి వాళ్లతో బౌలింగ్ చేయించాలనుకుంటే ముందుగా ప్రాక్టీస్ చేయించాలి.ఇది కేవలం నెట్రన్రేటును మెరుగుపరచుకోవడం గురించి కాదు. ముందుగా మ్యాచ్ గెలవాలి. అప్పుడే పాయింట్లు వస్తాయి’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ టీమిండియా యాజమాన్యం తీరును విమర్శించాడు. ఏదేమైనా భారత జట్టు సెమీ ఫైనల్కు చేరుకుంటుందని.. అప్పుడు అవసరమైతే ఆరో బౌలింగ్ ఆప్షన్ను వాడుకోవచ్చని చిక్కా సూచించాడు.చదవండి: T20 WC 2026: భారత్-వెస్టిండీస్ మ్యాచ్ రోజు వర్షం పడితే..? -
టీ20 ప్రపంచకప్లో నేడు మరో కీలక సమరం
టీ20 ప్రపంచకప్ 2026లో నేడు (ఫిబ్రవరి 27) కీలక సమరం జరుగనుంది. గ్రూప్-2 నుంచి ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న ఇంగ్లండ్.. మరో బెర్త్ కోసం రేసులో ఉన్న న్యూజిలాండ్తో తలపడనుంది. కొలొంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్ న్యూజిలాండ్ జట్టు అత్యంత కీలకంగా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్ గెలిస్తేనే ఆ జట్టు నేరుగా సెమీస్కు చేరుకుంటుంది. తద్వారా పాక్ మరో మ్యాచ్ ఆడాల్సి ఉన్నా, టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అదే ఇంగ్లండ్ గెలిస్తే సెమీస్ రెండో బెర్త్ కోసం పోటీ సజీవంగా ఉంటుంది. పాక్ తమ చివరి లీగ్ మ్యాచ్లో శ్రీలంకపై విజయం సాధిస్తే, అప్పుడు పాక్, న్యూజిలాండ్ తలో 3 పాయింట్లతో సమానంగా ఉంటాయి. అప్పుడు రన్రేట్ కీలకమవుతుంది. ప్రస్తుత గణాంకాలు చూస్తే.. న్యూజిలాండ్ ఇంగ్లండ్ చేతిలో సాధారణంగా ఓడినా, పాక్ శ్రీలంకపై నామమాత్రంగా గెలిచినా న్యూజిలాండే సెమీస్కు అర్హత సాధిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం న్యూజిలాండ్ రన్ రేట్ 3.050గా ఉంది. అదే పాక్ రన్రేట్ -0.461గా ఉంది. పాక్ మైనస్ నుంచి ప్లస్ రన్రేట్లోకి రావాలంటేనే శ్రీలంకపై భారీ విజయం సాధించాలి. అదే న్యూజిలాండ్ రన్రేట్ను అధిగమించాలంటే అతి భారీ విజయం సాధించాలి. కాబట్టి, నేటి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఓడినా, న్యూజిలాండ్కు సెమీస్ అవకాశాలు ఇంకా సజీవంగా ఉంటాయి. వాస్తవానికి న్యూజిలాండ్ పరిస్థితిని అంతవరకు తీసుకుపోకపోవచ్చు. ఎందుకంటే, ఈ ఎడిషన్లో ఆ జట్టు అద్భుతమైన ప్రదర్శనలు చేస్తుంది. గ్రూప్ దశలో సౌతాఫ్రికా చేతిలో ఓటమి మినహా మిగతా మ్యాచ్ల్లో సామర్థ్యం మేరకు రాణించింది. పాక్తో జరగాల్సిన తొలి సూపర్-8 మ్యాచ్ రద్దు కావడంతో పరిస్థితి ఇంత వరకు వచ్చింది. అదే మ్యాచ్ జరిగి ఉంటే, న్యూజిలాండ్ సునాయాసంగా పాక్ను చిత్తు చేసి, దర్జాగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకునేది.బలాబలాల ప్రకారం ఇంగ్లండ్, న్యూజిలాండ్ సమతూకంగా కనిపించినా ఎడ్జ్ న్యూజిలాండ్వైపే మొగ్గు చూపుతోంది. ఆ జట్టులో దాదాపు అందరు ఆటగాళ్లు మంచి టచ్లో ఉన్నారు. అదే ఇంగ్లండ్ విషయానికొస్తే.. ఓపెనర్ జోస్ బట్లర్, జేకబ్ బేతెల్ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. బౌలింగ్లో ఆదిల్ రషీద్ సామర్థ్యం మేరకు రాణించలేకపోతున్నాడు. ఫామ్ విషయాన్ని కూడా పక్కన పెడితే, 40 ఓవర్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే జట్టే అంతిమ విజేతగా నిలుస్తుంది.తుది జట్లు..న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్(w), ఫిన్ అలెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), కోల్ మెక్కాంచీ, మాట్ హెన్రీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్/జాకబ్ డఫీఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(w), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్(c), సామ్ కుర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జామీ ఓవర్టన్/రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ -
T20 WC 2026, IND VS ZIM: అభిషేక్ ఖాతాలో అనవసర రికార్డు
టీ20 ప్రపంచకప్ 2026లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ.. అంచనాలను తల్లకిందులు చేస్తూ హ్యాట్రిక్ డకౌట్లు సహా నాలుగో మ్యాచ్లోనూ తక్కువ స్కోర్కే (15) ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో నిన్నటి (ఫిబ్రవరి 26) జింబాబ్వే మ్యాచ్కు ముందు అభిషేక్పై భారీ ఒత్తిడి ఉండింది. అయితే ఈసారి అతను ఒత్తిడిని అధిగమించి 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 30 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 55 పరుగులు చేసి ఔటయ్యాడు.అభిషేక్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసినా, ఓ అనవసర రికార్డు మూటగట్టుకున్నాడు. అభిషేక్కు ఇది తన టీ20 కెరీర్లో రెండో నిదానమైన (బంతుల పరంగా) హాఫ్ సెంచరీగా నిలిచింది. అభిషేక్ కెరీర్లో అత్యంత నిదానమైన హాఫ్ సెంచరీ కూడా జింబాబ్వేపైనే రావడం విశేషం. 2024లో హరారే వేదికగా జరిగిన ఓ మ్యాచ్లో అతను హాఫ్ సెంచరీ పూర్తి చేసేందుకు 33 బంతులు తీసుకున్నాడు. వాస్తవానికి సాధారణ ప్లేయర్లకు 26 బంతుల్లో అర్ద శతకం అంటే చాలా పెద్ద అఛీవ్మెంట్. అయితే అభిషేక్ లాంటి విధ్వంసకర ట్రాక్ రికార్డు ఉన్న ఆటగాడికి మాత్రం ఇది అనవసర రికార్డుగా మిగిలిపోయింది.తాజా ప్రదర్శనలతో అభిషేక్ మరో ఘనత కూడా సాధించాడు. భారత ఓపెనర్లలో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో శిఖర్ ధవన్తో కలిసి మూడో స్థానంలో నిలిచాడు. శిఖర్, అభిషేక్ తమ టీ20 కెరీర్లలో 11 సార్లు ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశారు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (32 ఫిఫ్టి ప్లస్), కేఎల్ రాహుల్ (21) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక్కడ గమనించదగ్గ మరో విషయం ఏంటంటే.. పై జాబితాలోని ఆటగాళ్లలో అభిషేకే అతి తక్కువ మ్యాచ్లు ఆడాడు. అతని కెరీర్ ఇంకా ఆరంభ దశలోనే ఉండటంతో రోహిత్ శర్మను కిందకు దించి ఈ విభాగంలో టాప్ ప్లేస్కు చేరే అవకాశం ఉంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. అభిషేక్ సహా జట్టులోని ప్రతి ఒక్క బ్యాటర్ సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 256 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్కు ఇదే అత్యధిక స్కోర్గా నిలిచింది. భారత ఇన్నింగ్స్లో అభిషేక్ 55, సంజూ శాంసన్ 24, ఇషాన్ కిషన్ 38, సూర్యకుమార్ యాదవ్ 33, హార్దిక్ పాండ్యా 50 నాటౌట్, తిలక్ వర్మ 44 నాటౌట్ పరుగులు చేశారు. భారత ఇన్నింగ్స్ మొత్తంలో 17 సిక్సర్లు నమోదు కావడం విశేషం. ఇది కూడా ఓ ప్రపంచకప్ రికార్డు.అనంతరం ఛేదనలో జింబాబ్వే ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (97 నాటౌట్) ఒంటరిపోరాటం చేసినా, తన జట్టును విజయతీరాలు దాటించలేకపోయాడు. కెప్టెన్ సికందర్ రజా (31) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు. అంతిమంగా జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 184 పరుగులకే పరిమితమై 72 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. భారత బౌలర్లలో అర్షదీప్ 3, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, శివమ్ దూబే తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో భారత్ సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మార్చి 1న కోల్కతాలో వెస్టిండీస్తో జరుగబోయే మ్యాచ్ భారత్కు డూ ఆర్ డై మ్యాచ్గా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే భారత్ సెమీస్కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడినా, మ్యాచ్ రద్దైనా విండీస్కే సెమీస్ బెర్త్ దక్కుతుంది. గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా ఇప్పటికే సెమీస్కు అర్హత సాధించింది. -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన అర్షదీప్ సింగ్
ప్రస్తుతం జరుతున్న టీ20 వరల్డ్కప్-2026లో టీమిండియా లెఫ్డ్ అర్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో నిన్న (ఫిబ్రవరి 26) జరిగిన సూపర్-8 మ్యాచ్లో 3 వికెట్లు తీసిన అర్షదీప్.. టీ20 ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా రికార్డును అధిగమించాడు. అర్షదీప్ తన టీ20 వరల్డ్కప్ కెరీర్లో 19 మ్యాచ్ల్లో 14.25 సగటున, 7.33 ఎకానమీతో 35 వికెట్లు తీయగా.. బుమ్రా తన 19 మ్యాచ్ల వరల్డ్కప్ కెరీర్లో 14.00 సగటున 33 వికెట్లు తీశాడు. ఓవరాల్గా టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఘనత బంగ్లాదేశ్ స్పిన్నర్ షకీబ్ అల్ హసన్కు (50) దక్కుతుంది.సూపర్ ఫామ్లో అర్షదీప్ప్రస్తుత ప్రపంచకప్లో అర్షదీప్ సింగ్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 8 వికెట్లు తీశాడు. టీమిండియా గత ఎడిషన్ టీ20 ప్రపంచకప్ సాధించడంలోనూ అర్షదీప్సింగ్ కీలకపాత్ర పోషించాడు. ఆ ఎడిషన్లో 17 వికెట్లు తీసి జాయింట్ హైయ్యెస్ట్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఇప్పటివరకు 81 టీ20లు ఆడిన అర్షీదప్.. 126 వికెట్లు తీసి భారత్ తరఫున పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కొనసాగుతున్నాడు.కాగా, నిన్నటి మ్యాచ్లో అర్షదీప్ సహా జట్టులోని ప్రతి ఒక్కరు సత్తా చాటడంతో జింబాబ్వేపై టీమిండియా 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. మార్చి 1న కోల్కతాలో వెస్టిండీస్తో జరుగబోయే మ్యాచ్ భారత్కు డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్లో గెలిస్తే భారత్ సెమీస్కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడినా, మ్యాచ్ రద్దైనా విండీస్కే సెమీస్ బెర్త్ దక్కుతుంది.భారత్ వర్సెస్ జింబాబ్వే స్కోర్ వివరాలు..భారత్: 256-4 (అభిషేక్ (55), హార్దిక్ (50 నాటౌట్)జింబాబ్వే: 184-6 (బ్రియాన్ బెన్నెట్ 97 నాటౌట్, అర్షదీప్ 4-0-24-3) -
T20 WC 2026: భారత్-వెస్టిండీస్ మ్యాచ్ రోజు వర్షం పడితే..?
టీ20 ప్రపంచకప్ 2026లో గ్రూప్-1 సూపర్-8 సమరాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ గ్రూప్ నుంచి సౌతాఫ్రికా ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోగా.. రెండో బెర్త్ కోసం భారత్-వెస్టిండీస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నిన్న (ఫిబ్రవరి 26) వెస్టిండీస్ సౌతాఫ్రికా చేతిలో ఓడటం.. భారత్ జింబాబ్వేపై ఘన విజయం సాధించడంతో గ్రూప్-1 నుంచి రెండో సెమీస్ బెర్త్పై క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం వెస్టిండీస్, భారత్ చెరి రెండు పాయింట్లు కలిగి ఉన్నాయి. రన్రేట్ మాత్రం భారత్తో పోలిస్తే విండీస్ది చాలా ఎక్కువగా ఉంది. అయితే ప్రస్తుతానికి రన్రేట్ మ్యాటర్ కాదు.ఎందుకంటే, మార్చి 1న భారత్-విండీస్ మధ్య కోల్కతా వేదికగా జరిగే మ్యాచ్లో ఎవరు గెలిస్తే వారే సెమీస్కు చేరతారు. ఒకవేళ ఆ మ్యాచ్ ఏ కారణంగా అయినా రద్దైతే మాత్రం రన్రేట్ అత్యంత కీలకమవుతుంది. మ్యాచ్ రద్దైతే ఇరు జట్ల ఖతాలో చెరి 3 పాయింట్లు ఉంటాయి. రన్రేట్ విషయానికొస్తే.. విండీస్కు (1.791), భారత్ (-0.100) కంటే మెరుగైన రన్రేట్ ఉంది కాబట్టి, ఆ జట్టుకే సెమీస్ బెర్త్ ఖరారవుతుంది.అయితే దిగులు చెందాల్సిన అవసరం లేని విషయం ఏంటంటే.. భారత్-విండీస్ మ్యాచ్కు ప్రస్తుతానికి ఎలాంటి వర్షాటంకాలు లేవు. యాక్యూవెదర్ ముందస్తు సమాచాం ప్రకారం.. మార్చి 1న, ముఖ్యంగా మ్యాచ్ జరిగే 7-12 (రాత్రి) మధ్య సమయంలో ఎలాంటి వర్ష సూచన లేదు. ఉష్ణోగ్రత 23 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ఈ భరోసాతో టీమిండియా అభిమానులు సల్ల బడ్డారు. మ్యాచ్ సజావుగా సాగితే విజయం తమదేనని ధీమాగా ఉన్నారు. ఈ టోర్నీ ఆరంభం నుంచి అజేయ జట్టుగా ఉండిన వెస్టిండీస్ నిన్న సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడి కాన్ఫిడెన్స్ను కోల్పోగా.. సౌతాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత జింబాబ్వేపై ఘన విజయం సాధించి టీమిండియా మాంచి జోష్లో ఉంది. ఇదే జోష్ను విండీస్ మ్యాచ్లోనూ కొనసాగిస్తే భారత్కు సెమీస్ బెర్త్ ఖాయం. సెమీస్లో భారత్.. ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లలో ఏదో ఒక్క జట్టును ఎదుర్కొనే అవకాశం ఉంది. -
తీవ్ర విషాదం.. రింకూ సింగ్ తండ్రి కన్నుమూత
టీమిండియా విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా స్టేజ్-4 లివర్ క్యాన్సర్తో పోరాడుతున్న రింకూ తండ్రి ఖాచంద్ర సింగ్ ఇవాళ తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా ఖాచంద్ర సింగ్ గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. పరిస్థితి ఏమాత్రం మెరుగుపడకపోవడంతో వెంటిలేటర్పై ఉంచారు. పరిస్థితి మరింత విషమించడంతో నిన్న రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ (CRRT) కూడా నిర్వహించినట్టు సమాచారం. వైద్యులు శక్తివంచన లేకుండా కృష్టి చేసినా రింకూ తండ్రిని కాపాడలేకపోయారు.ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ 2026తో బిజీగా ఉన్న రింకూ సింగ్ తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించిదని తెలిసి హుటాహుటిన నోయిడాకు బయల్దేరాడు. అక్కడ రెండు రోజులు గడిపి, జింబాబ్వేతో కీలకమైన జింబాబ్వే మ్యాచ్ కోసం తిరిగి చెన్నైకి చేరుకున్నాడు. జింబాబ్వేతో మ్యాచ్ సమయానికి రింకూ జట్టులో చేరినప్పటికీ.. తుది జట్టులో అవకాశం దక్కలేదు. అయినా, ఈ మ్యాచ్లో టీమిండియా భారీ విజయం సాధించి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.తండ్రి మరణవార్త విని రింకూ హుటాహుటిన తన స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని అలీఘఢ్కు బయల్దేరాడు. 28 ఏళ్ల రింకూ చాలా పేద కుటుంబం నుంచి ఎదిగి భారత జట్టులో స్థానం సంపాదించాడు. తన సక్సెస్లో తండ్రి పాత్ర చాలా కీలకమని రింకూ గతంలో చాలా సందర్భాల్లో చెప్పాడు. రింకూ అంతర్జాతీయ క్రికెటర్గా ఎదిగినప్పటికీ.. అతని తండ్రి గ్యాస్ డెలివరీ చేస్తూనే జీవనం సాగించాడు. రింకూ తండ్రి మరణవార్త తెలిసి టీమిండియాలో విషాద ఛాయలు నెలకొన్నాయి. -
T20 WC 2026: సెమీస్లో భారత్ వర్సెస్ పాక్..?
టీ20 ప్రపంచకప్ 2026లో సెమీస్కు చేరబోయే జట్లపై ఓ అవగాహణ ఏర్పడింది. గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా ఇప్పటికే ఫైనల్-4కు అర్హత సాధించగా.. రెండో బెర్త్ కోసం వెస్టిండీస్, భారత్ మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ ఇప్పటికే సెమీస్ బెర్త్పై కర్చీఫ్ వేసుకొని కూర్చోగా.. రెండో బెర్త్ కోసం న్యూజిలాండ్, పాక్ పోటీపడనున్నాయి.సెమీస్ బెర్త్లపై ఓ క్లారిటీ రావడంతో ఇప్పుడు అభిమానుల దృష్టంతా ఏ జట్టు ఎవరితో తలపడనుందనే అంశంపై కేంద్రీకృతమైంది. నిన్న (ఫిబ్రవరి 26) జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్ గ్రూప్-1 నుంచి విండీస్కు ప్రధాన పోటీదారుగా మారగా.. గ్రూప్-2లో రెండో బెర్త్ న్యూజిలాండ్కు దాదాపుగా ఫిక్స్ అయ్యింది. అలాగని పాక్ అవకాశాలను తీసిపారేయడానికి వీళ్లేదు.మిగతా జట్ల మాట ఎటున్నా, భారత క్రికెట్ అభిమానులు మాత్రం ప్రస్తుత ప్రపంచకప్లోనే మరోసారి భారత్, పాక్ మ్యాచ్ కోరుకుంటున్నారు. ఇరు జట్లు సెమీస్లో తలపడాలని వారు ఆకాక్షిస్తున్నారు. ఇది కష్టసాధ్యమైన ప్రక్రియే అయినప్పటికీ.. అసాధ్యం మాత్రం కాదు. కొన్ని అద్భుతాలు జరిగితే తప్పక సెమీస్లో భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుంది. అదెలా అంటే..ముందుగా భారత్ విషయానికి వద్దాం.. జింబాబ్వేపై గెలుపుతో భారత్ సెమీస్ బెర్త్పై క్లియర్ పిక్చర్ ఏర్పడింది. తదుపరి మ్యాచ్లో విండీస్ గెలిస్తే టీమిండియా సెమీస్ బెర్త్ ఖరారవుతుంది. ఓడినా లేక మ్యాచ్ రద్దైనా మెరుగైన రన్రేట్ కలిగిన విండీస్కే సెమీస్ బెర్త్ దక్కుతుంది.సెమీస్లో పాక్తో తలపడాలంటే భారత్ విండీస్పై నామమాత్రపు విజయం సాధిస్తే సరిపోదు. ఆ మ్యాచ్లో భారత్ మంచి రన్ రేట్తో భారీ విజయం సాధించాలి. అలాగే ప్రస్తుతం టేబుల్ టాపర్గా ఉన్న సౌతాఫ్రికా తమ చివరి మ్యాచ్లో జింబాబ్వే చేతిలో చిత్తుగా ఓడాలి. అప్పుడు భారత్, సౌతాఫ్రికా తలో 4 పాయింట్లతో ఉంటాయి. ఇక్కడ ప్లేసింగ్ విషయంలో రన్రేట్ కీలకమవుతుంది. విండీస్పై భారత్ భారీ తేడాతో గెలుస్తుంది కాబట్టి రన్రేట్ కూడా భారీగా పెరుగుతుంది. మరోవైపు సౌతాఫ్రికా జింబాబ్వే చేతిలో చిత్తుగా ఓడితే ఆ జట్టు రన్రేట్ భారత్ కంటే తక్కువై పోతుంది. అప్పుడు గ్రూప్ 1 టాపర్గా భారత్.. రెండో స్థానంలో సౌతాఫ్రికా ఉంటాయి.గ్రూప్-1లో అగ్రస్థానంలో నిలిచే జట్టు గ్రూప్-2లో రెండో స్థానంలో నిలిచే జట్టును సెమీస్లో ఢీకొంటుంది. సెమీస్లో భారత్-పాక్ మ్యాచ్ జరగాలి అంటే, పాక్ గ్రూప్-2 నుంచి రెండో స్థానంలో నిలివాలి. ఆ జట్టుకు ప్రస్తుతం అగ్రస్థానికి వెళ్లే ఛాన్స్లు లేవు. భారత్=పాక్ సెమీస్లో తలపడాలంటే టీమిండియానే గ్రూప్-1లో టాప్ ప్లేస్లో ఉండాలి.ఇక పాక్ గ్రూప్-2లో రెండో స్థానానికి ఎలా చేరుకునే అవకాశం ఉందంటే.. ఈ గ్రూప్ నుంచి ఇంగ్లండ్ సెమీస్ బెర్త్ ఖరారైపోయింది. పాక్కు సెమీస్ బెర్త్ దక్కాలంటే వారి చివరి మ్యాచ్లో శ్రీలంకపై అతి భారీ తేడాతో గెలిచి మంచి రన్రేట్ కూడగట్టుకోవాలి. ఇలా జరిగితే పాక్ ఖాతాలో 3 పాయింట్లు చేరతాయి. సెమీస్ బెర్త్ కోసం పాక్కు పోటీదారుగా ఉన్న న్యూజిలాండ్ ఇప్పటికే 3 పాయింట్లు ఖాతాలో కలిగి ఉండి, భారీ రన్రేట్ను కూడా సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ తమి చివరి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో సాధారణంగా ఓడినా, రెండో స్థానంలో సెమీస్కు చేరుకుంటుంది. కానీ, సెమీస్లో మనకు భారత్-పాక్ మ్యాచ్ కావాలంటే న్యూజిలాండ్పై ఇంగ్లండ్ అతి భారీ తేడాతో గెలవాలి. అప్పుడు న్యూజిలాండ్ నెట్ రన్రేట్ బాగా తగ్గిపోతుంది. అప్పటికే శ్రీలంకపై అతి భారీ తేడాతో గెలిచి మంచి రన్రేట్తో ఉన్న పాకిస్తాన్ గ్రూప్-2 నుంచి రెండో జట్టుగా సెమీస్కు చేరుతుంది.అప్పుడు గ్రూప్-1 టాపర్ భారత్.. గ్రూప్-2లో రెండో స్థానంలో నిలిచే పాకిస్తాన్ సెమీస్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. లెక్కల వరకు ఇది బాగానే ఉంది కానీ, ఇలా జరగడం చాలా కష్టం. భారత్ అష్టకష్టాలు పడి గ్రూప్-1లో టాప్ ప్లేస్కు రాగలదేమో కానీ, ఏదైనా మహాద్భుతం జరిగితేనే పాక్కు సెమీస్ బెర్త్ దక్కుతుంది. -
జింబాబ్వేపై భారత్ విజయం
-
IND vs ZIM: వెస్టిండీస్పై గెలిస్తే సెమీఫైనల్కు..
భారత జట్టు తమ కసినంతా జింబాబ్వేపై చూపించింది. గత మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన పరాజయంతో ఒక్కసారిగా షాక్కు గురైన టీమిండియా తర్వాతి పోరులో విధ్వంసకర రీతిలో నష్టనివారణ చేసింది. సామ్సన్ శుభారంభం అందిస్తే, అభిషేక్ శర్మ ఫామ్లోకి వచ్చి దూకుడుగా ఆడాడు. మధ్యలో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ తమదైన శైలిలో ధాటిని ప్రదర్శిస్తే చివర్లో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఇలా భారత బ్యాటర్లంతా ఒకరితో మరొకరు పోటీ పడి సిక్సర్లతో విరుచుకుపడటంతో జింబాబ్వే బెంబేలెత్తిపోయింది. ఆ జట్టు బౌలర్లంతా పూర్తిగా చేతులెత్తేశారు. ఫలితంగా రికార్డు స్కోరు సాధించిన టీమిండియా... ప్రత్యర్థికి ఛేదనలో ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా మ్యాచ్ను ముగించింది. ఇక నెట్రన్రేట్ వంటి గందరగోళపు లెక్కలు అవసరం లేకుండా నాకౌట్ పంచ్ మిగిలింది. ఆదివారం వెస్టిండీస్తో జరిగే చివరి పోరులో భారత్ గెలిస్తే సెమీఫైనల్కు చేరుతుంది. ఓడిపోతే నిష్క్రమిస్తుంది. చెన్నై: టి20 వరల్డ్ కప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఎట్టకేలకు తమ స్థాయికి తగ్గ ప్రదర్శనను కనబర్చింది. ‘సూపర్ ఎయిట్స్’లో భాగంగా గురువారం జరిగిన ‘గ్రూప్–1’ మ్యాచ్లో భారత్ 72 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. తాజా ఫలితంతో జింబాబ్వే సెమీస్ చేరే అవకాశాలు ముగిసిపోయాయి. ఎంఎ చిదంబరం స్టేడియంలో టాస్ గెలిచిన జింబాబ్వే ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (30 బంతుల్లో 55; 4 ఫోర్లు, 4 సిక్స్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ పాండ్యా (23 బంతుల్లో 50 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించగా... తిలక్ వర్మ (16 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్లు), ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ (13 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్లు) జట్టు భారీ స్కోరులో తలా ఓ చేయి వేశారు. పాండ్యా, తిలక్ ఐదో వికెట్కు 31 బంతుల్లోనే అభేద్యంగా 84 పరుగులు జోడించడం విశేషం. అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసి ఓడిపోయింది. ఓపెనర్ బ్రయాన్ బెన్నెట్ (59 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్స్లు) ఒంటరి పోరాటం మినహా అంతా విఫలమయ్యారు. పోటీ పడి పరుగులు... ఇన్నింగ్స్ రెండో బంతికే సంజు సామ్సన్ (15 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్లు) కొట్టిన సిక్స్తో ఆరంభమైన భారత్ జోరు చివరి వరకు సాగింది. మపోసా వేసిన మూడో ఓవర్లోనే భారత్ 23 పరుగులు రాబట్టింది. ఈ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాది అభిషేక్ కూడా ఫామ్లోకి వచ్చాడు. క్రీజ్లో ఉన్న కొద్దిసేపు సామ్సన్ ధాటిగా ఆడాడు. సామ్సన్ వెనుదిరిగిన తర్వాత ఇషాన్ అదే వేగాన్ని కొనసాగించాడు. పవర్ప్లే ముగిసేసరికి జట్టు 80 పరుగులు చేసింది. 26 పరుగుల వద్ద ఇషాన్కు లైఫ్ లభించగా, 26 బంతుల్లో అభిషేక్ అర్ధ సెంచరీ పూర్తయింది. రజా ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన కిషన్ తర్వాతి బంతికి అవుటయ్యాడు. కొద్దిసేపటికి అభిషేక్ కూడా పెవిలియన్కు చేరాడు. 8 పరుగుల వద్ద ముజరబాని క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన సూర్యకుమార్ ఆ అవకాశాన్ని సమర్థంగా వాడుకుంటూ మపోసా ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టాడు. తర్వాతి ఓవర్లోనూ వేగంగా ఆడే క్రమంలో సూర్య ఇన్నింగ్స్ ముగిసింది. 4 ఓవర్లలో 69 పరుగులు... 16 ఓవర్లు ముగిసేసరికి నిస్సహాయంగా మారిపోయిన జింబాబ్వే బౌలర్లపై చివర్లో పాండ్యా, తిలక్ మరింత విరుచుకు పడ్డారు. 17–20 ఓవర్లలో భారత్ వరుసగా 14, 19, 21, 15 పరుగులు రాబట్టింది. ఇందులో 3 ఫోర్లు, 7 సిక్స్లు ఉన్నాయి. ఎన్గరవా వేసిన 19వ ఓవర్లో తిలక్ వరుసగా 2 సిక్స్లు కొట్టగా, ఇవాన్స్ వేసిన ఆఖరి ఓవర్లో పాండ్యా వరుసగా రెండు భారీ సిక్స్లతో ముగించాడు. ఈ క్రమంలో 23 బంతుల్లో పాండ్యా హాఫ్ సెంచరీని అందుకున్నాడు. బ్యాటింగ్కి దిగిన ఆరుగురు కనీసం ఒక సిక్స్ బాదగా భారత్ ఇన్నింగ్స్లో మొత్తం 17 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ మ్యాచ్ కోసం భారత్ తమ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్ స్థానాల్లో అక్షర్ పటేల్, సంజు సామ్సన్ జట్టులోకి వచ్చారు. బెన్నెట్ పోరాటం వృథా... భారీ ఛేదనను జింబాబ్వే ఓపెనర్లు బెన్నెట్, మరుమని (20) జాగ్రత్తగా ప్రారంభించారు. తొలి వికెట్కు వీరిద్దరు 38 బంతుల్లో 44 పరుగులు జత చేశారు. మరుమని, మైయర్స్ (6) తక్కువ వ్యవధిలో వెనుదిరగ్గా... బెన్నెట్, సికందర్ రజా (21 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్లు) భాగస్వామ్యంతో జట్టు ఇన్నింగ్స్ కాస్త సానుకూలంగా కదిలింది. అక్షర్ ఓవర్లో 2 సిక్స్లు, ఫోర్ కొట్టిన బెన్నెట్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. ఆ తర్వాత దూబే ఓవర్లో కూడా బెన్నెట్ 2 సిక్స్లు, 2 ఫోర్లు బాదడంతో మొత్తం 26 పరుగులు వచ్చాయి. అయితే మూడో వికెట్కు బెన్నెట్తో 42 బంతుల్లో 72 పరుగులు జత చేసిన అనంతరం రజా అవుట్ కావడంతో జింబాబ్వే ఆశలు పూర్తిగా కోల్పోయింది. 256/4 టి20 ప్రపంచకప్లో భారత్కు ఇదే అత్యధిక స్కోరు. 2007లో ఇంగ్లండ్పై టీమిండియా చేసిన 217 పరుగుల రికార్డు కనుమరుగైంది. ఓవరాల్గా శ్రీలంక 260/6 (కెన్యాపై 2007లో) తర్వాత వరల్డ్ కప్లో ఇది రెండో అత్యధిక స్కోరు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) బర్ల్ (బి) ముజరబాని 24; అభిషేక్ (సి) రజా (బి) మపోసా 55; ఇషాన్ కిషన్ (సి) ఎన్గరవా (బి) రజా 38; సూర్యకుమార్ (సి) ముసెకివా (బి) ఎన్గరవా 33; పాండ్యా (నాటౌట్) 50; తిలక్ (నాటౌట్) 44; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 256. వికెట్ల పతనం: 1–48, 2–120, 3–150, 4–172. బౌలింగ్: ఎన్గరవా 4–0–62–1, ముజరబాని 4–0–43–1, మపోసా 2–0–40–1, ఇవాన్స్ 4–0–52–0, రజా 3–0–29–1, బెన్నెట్ 2–0–16–0, బర్ల్ 1–0–10–0. జింబాబ్వే ఇన్నింగ్స్: బెన్నెట్ (నాటౌట్) 97; మరుమని (సి) ఇషాన్ కిషన్ (బి) అక్షర్ 20; మైయర్స్ (సి) తిలక్ (బి) వరుణ్ 6; రజా (సి) అభిషేక్ (బి) అర్‡్షదీప్ 31; బర్ల్ (ఎల్బీ) (బి) అర్‡్షదీప్ 0; మున్యోంగా (బి) అర్‡్షదీప్ 11; ముసెకివా (సి) సామ్సన్ (బి) దూబే 7; ఇవాన్స్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1–44, 2–72, 3–144, 4–144, 5–162, 6–173. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–24–3, పాండ్యా 3–0–21–0, బుమ్రా 3–0–21–0, వరుణ్ 4–0–35–1, అక్షర్ 4–0–35–1, దూబే 2–0–46–1. గెలిచే జట్టు సెమీస్కు... జింబాబ్వేపై భారత్ విజయంతో ‘గ్రూప్–1’ నుంచి సెమీఫైనల్ చేరే జట్ల విషయంలో స్పష్టత వచ్చింది. రెండు విజయాలతో దక్షిణాఫ్రికా ఇప్పటికే తమ సెమీస్ స్థానం ఖాయం చేసుకోగా, జింబాబ్వేతో ఆ జట్టు ఆడే మ్యాచ్ నామమాత్రమే. మరోవైపు జింబాబ్వేపై నెగ్గి, దక్షిణాఫ్రికా చేతిలోనే ఓడిన భారత్, వెస్టిండీస్ ఒక్కో గెలుపుతో సమంగా ఉన్నాయి. కాబట్టి ఇరు జట్ల మధ్య ఆదివారం కోల్కతాలో జరిగే మ్యాచ్ క్వార్టర్ ఫైనల్లాంటిది. ఈ మ్యాచ్లో ఎవరు నెగ్గితే వారికి ఎలాంటి సమీకరణాలు, రన్రేట్లతో సంబంధం లేకుండా సెమీస్లో చోటు ఖాయమవుతుంది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో లీగ్ దశలో ఆ్రస్టేలియా, శ్రీలంకలను ఓడించి సంచలనం సృష్టించిన జింబాబ్వే ‘సూపర్ ఎయిట్స్’లో వెస్టిండీస్, భారత్లకు 254, 256 పరుగులు ఇచ్చి ఓటములను ఆహ్వానించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే నిష్క్రమించింది. టి20 ప్రపంచకప్లో నేడుఇంగ్లండ్ X న్యూజిలాండ్ వేదిక: కొలంబో, రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
సెమీస్లో దక్షిణాఫ్రికా
అహ్మదాబాద్: టి20 ప్రపంచకప్లో 2024 టోర్నీ రన్నరప్ దక్షిణాఫ్రికా దూసుకుపోతోంది. లీగ్ దశలో అజేయంగా నిలిచిన సఫారీ టీమ్ ఇప్పుడు ‘సూపర్ ఎయిట్స్’లో రెండో విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు చెన్నైలో జింబాబ్వేపై భారత జట్టు గెలుపొందడంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికా జట్టుకు సెమీఫైనల్ బెర్త్ ఖరారైంది. గురువారం జరిగిన ‘గ్రూప్–2’ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్పై ఘన విజయం సాధించింది. ‘సూపర్ ఎయిట్స్’లో రెండు విజయాలతో దక్షిణాఫ్రికా నాలుగు పాయింట్లతో గ్రూప్–1లో అగ్రస్థానంలో ఉంది. తమ చివరి ‘సూపర్–8’ మ్యాచ్ను ఢిల్లీలో ఆదివారం జింబాబ్వేతో ఆడుతుంది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఓడిపోయినా ఆ జట్టుకు 4 పాయింట్లు ఉంటాయి. ఆదివారమే కోల్కతాలో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే చివరి ‘సూపర్–8’ మ్యాచ్లో గెలిచిన జట్టు కూడా నాలుగు పాయింట్లతోనే ముగిస్తుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా పేసర్లు ఎన్గిడి (3/30), రబాడ (2/22), కార్బిన్ బాష్ (2/31) చెలరేగడంతో విండీస్ 83 పరుగుల వద్దే 7 వికెట్లు కోల్పోయింది. షై హోప్ (16), హెట్మైర్ (2), బ్రెండన్ కింగ్ (21), ఛేజ్ (2), రూథర్ఫర్డ్ (12), రావ్మన్ పావెల్ (9) పూర్తిగా విఫలమయ్యారు. 83/7 నుంచి విండీస్ జట్టును రొమారియో షెఫర్డ్ (37 బంతుల్లో 52 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్లు), హోల్డర్ (31 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్స్లు) కలిసి ఆదుకున్నారు. వీరిద్దరు ఎనిమిదో వికెట్కు 57 బంతుల్లో 89 పరుగులు జోడించారు. దాంతో విండీస్ మెరుగైన స్కోరును నమోదు చేసింది. అయితే బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్పై దక్షిణాఫ్రికా అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. 16.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 177 పరుగులు చేసి జట్టు విజయాన్ని అందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మార్క్రమ్ (46 బంతుల్లో 82 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్లు) చెలరేగి ఆడగా... డికాక్ (24 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్స్లు), రికెల్టన్ (28 బంతుల్లో 45 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు) సహకరించారు. డికాక్తో తొలి వికెట్కు 48 బంతుల్లో 95 పరుగులు జోడించిన కెపె్టన్ మార్క్రమ్... రెండో వికెట్కు రికెల్టన్తో 50 బంతుల్లో అభేద్యంగా 82 పరుగులు జత చేశాడు. 89 అంతర్జాతీయ టి20ల్లో ఎనిమిదో వికెట్కు షెఫర్డ్–హోల్డర్ కొత్త ప్రపంచ రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గతంలో స్కాట్లాండ్ ప్లేయర్లు షరీఫ్–మోమ్సెన్ జోడించిన 80 పరుగుల రికార్డు (2015లో నెదర్లాండ్స్పై) కనుమరుగైంది. -
జింబాబ్వే చిత్తు.. టీమిండియా సెమీస్ ఆశలు సజీవం
టీ20 వరల్డ్కప్-2026లో టీమిండియా తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా చెన్నై వేదికగా జింబాబ్వేతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. జింబాబ్వేను 72 పరుగుల తేడాతో సూర్య సేన చిత్తు చేసింది. ఈ కీలక పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఇండియా బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ(55), హార్దిక్ పాండ్యా(50 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తాచాటగా.. తిలక్ వర్మ(16 బంతుల్లో 44), ఇషాన్ కిషన్(38), సూర్యకుమార్ యాదవ్(33), సంజూ శాంసన్(24) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ ఎన్గర్వ, బ్లెసింగ్ ముజర్బానీ, టినోటెండా మపోసా, కెప్టెన్ సికందర్ రజా తలా ఒక వికెట్ పడగొట్టారు.బెన్నెట్ ఒంటరి పోరాటం..255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ రియాన్ బెన్నెట్ ఒంటరి పోరాటం చేశాడు. 59 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లతో 97 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. కెప్టెన్ సికిందర్ రజా(31) ఫర్వాలేదన్పించాడు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, శివమ్ దూబే తలా వికెట్ సాధించారు. -
చరిత్ర సృష్టించిన టీమిండియా
టీ20 వరల్డ్కప్-2026లో జింబాబ్వేతో మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో మన బ్యాటర్లు జూలు విధిల్చారు. చెన్నైలోని చెపాక్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించారు.బ్యాటింగ్కు ప్రతీ ఒక్కరూ పరుగులు సాధించారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(55), హార్దిక్ పాండ్యా(50 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తాచాటగా.. తిలక్ వర్మ(16 బంతుల్లో 44), ఇషాన్ కిషన్(38), సూర్యకుమార్ యాదవ్(33), సంజూ శాంసన్(24) రాణించారు.అయితే మొత్తం ఆరుగురు బ్యాటర్లు కూడా 150+ స్ట్రైక్రేటుతో బ్యాటింగ్ చేయడం విశేషం. తద్వారా టీమిండియా ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది.టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్లో ఆరుగురు బ్యాటర్లు 20 కంటే ఎక్కువ పరుగులు చేసి, 150+ స్ట్రైక్ రేట్ను నమోదు చేయడం ఇదే తొలిసారి.👉ఓ వరల్డ్కప్ ఎడిషన్లో అత్యధిక సిక్స్లు బాదిన జాబితాలో భారత్ రెండో స్ధానంలో నిలిచింది. ఈ ఏడాది వరల్డ్కప్లో టీమిండియా ఇప్పటివరకు 63 సిక్సర్లు కొట్టింది. వెస్టిండీస్ 66 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉంది.👉టీ20 వరల్డ్కప్లో ఒక ఇన్నింగ్స్లో అతి తక్కువ బంతులు(26) డాట్ చేసిన జట్టుగా భారత్ నిలిచింది. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచ రికార్డు
టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఇంత వరకు ఏ జట్టుకూ సాధ్యం కాని విధంగా.. స్ట్రైక్రేటు పరంగా అత్యంత అరుదైన ఘనత సాధించింది. జింబాబ్వేతో గురువారం నాటి సూపర్-8 మ్యాచ్ సందర్భంగా సూర్యకుమార్ సేన ఈ ఫీట్ నమోదు చేసింది.మెరుపులుచెన్నైలోని చెపాక్ స్టేడియంలో టాస్ ఓడిన టీమిండియా.. జింబాబ్వే ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్గా తిరిగి వచ్చిన సంజూ శాంసన్ (Sanju Samson) 15 బంతుల్లో 24 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్రేటు 160. ఇక మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చి.. 183కు పైగా స్ట్రైక్రేటుతో 55 పరుగులు సాధించాడు.వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 24 బంతుల్లో 38 పరుగులు చేయగా.. స్ట్రైక్రేటు 158.33గా నమోదైంది. మరోవైపు.. ధనాధన్ దంచికొట్టిన కెప్టెన్ సూర్యకుమార్ 13 బంతుల్లో 253కు పైగా స్ట్రైక్రేటుతో 33 పరుగులు రాబట్టాడు.𝙈𝙖𝙥𝙤𝙨𝙖 𝙬𝙚𝙣𝙩 𝙛𝙪𝙡𝙡, 𝙎𝙆𝙔 𝙬𝙚𝙣𝙩 𝙛𝙪𝙧𝙩𝙝𝙚𝙧. 🚀Total control from Suryakumar Yadav as he steers India forward!ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/QZBUsVXD6e— Star Sports (@StarSportsIndia) February 26, 2026అతడి స్ట్రైక్రేటు 275ఇక ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకుని.. 217కు పైగా స్ట్రైక్రేటు నమోదు చేయగా.. తిలక్ వర్మ 16 బంతుల్లోనే 44 పరుగులు సాధించాడు. అతడి స్ట్రైక్రేటు 275గా ఉండటం విశేషం. హార్దిక్, తిలక్ ఆఖరి వరకు అజేయంగా నిలవగా.. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా నాలుగు వికెట్ల నష్టపోయి.. 256 పరుగుల మేర రికార్డు స్కోరు సాధించింది.టీమిండియా ప్రపంచ రికార్డుఈ క్రమంలో టీమిండియా ప్రపంచ రికార్డు సాధించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్లో... ఓ జట్టులోని ఆరుగురు లేదంటే అంతకంటే ఎక్కువ మంది బ్యాటర్లు 150కి పైగా స్ట్రైక్రేటుతో.. ఇరవైకి పైగా పరుగులు సాధించడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే.. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ ఎన్గర్వ, బ్లెసింగ్ ముజర్బానీ, కెప్టెన్ సికందర్ రజా, టినోటెండా మపోసా తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకికాగా మొదటిసారి 2007లో ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్ ట్రోఫీని సొంతం చేసుకున్న టీమిండియా.. 2024లో రెండోసారి టైటిల్ గెలుచుకుంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత్ లీగ్ దశలో సత్తా చాటింది. అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లను ఓడించి అజేయంగా సూపర్-8కు చేరుకుంది.అయితే, సూపర్-8 తొలి మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన టీమిండియా సెమీ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. జింబాబ్వేతో మ్యాచ్లో భారీ విజయం సాధించడంతో పాటు తదుపరి వెస్టిండీస్పై భారీ తేడాతో గెలిస్తేనే సూర్యసేనకు సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.చదవండి: సౌతాఫ్రికా ఘన విజయం.. టీమిండియాకు గుడ్న్యూస్! -
తిలక్ వర్మ మెరుపులు.. కేవలం 16 బంతుల్లోనే
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా యువ ఆటగాడు తిలక్ వర్మ కీలక మ్యాచ్లో తన ఫామ్ను అందుకున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా చెన్నై వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న సూపర్-8లో తిలక్ విధ్వంసం సృష్టించాడు.ఆరో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన తిలక్.. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. చెపాక్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ హైదరాబాదీ హార్దిక్ పాండ్యాతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 16 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్స్లతో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు హార్దిక్ పాండ్యా(50 నాటౌట్), అభిషేక్ శర్మ(55) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో మోపోసా,నగరవా, ముజర్బానీ తలా వికెట సాధించారు. అయితే సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత బ్యాటర్లు చెలరేగడం విశేషం. -
IND vs ZIM: హార్దిక్, తిలక్ విధ్వంసం.. భారత్ భారీ స్కోరు
జింబాబ్వేతో మ్యాచ్లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. సూపర్-8లో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో స్థాయికి తగ్గట్లు రాణించింది. బ్యాటర్లు తమ పనిని విజయవంతంగా పూర్తి చేశారు.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో లీగ్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా.. సూపర్-8లో తొలి మ్యాచ్లోనే బోల్తా పడింది. సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయి సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. దీంతో జింబాబ్వే, వెస్టిండీస్లపై తప్పక గెలవాల్సిన పరిస్థితి.అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీఇలాంటి దశలో గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో మ్యాచ్లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లలో సంజూ శాంసన్ (24) నిరాశపరచగా.. అభిషేక్ శర్మ (30 బంతుల్లో 55) చాన్నాళ్ల తర్వాత బ్యాట్ ఝులిపించాడు. అభి అర్ధ శతకంతో రాణించగా.. వన్డౌన్లో వచ్చిన ఇషాన్ కిషన్ (Ishan Kishan) 24 బంతుల్లో 38 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.హార్దిక్, తిలక్ విధ్వంసంకెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మెరుపులు (13 బంతుల్లో 33) మెరిపించగా.. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (Hardik Pandya), తిలక్ వర్మ దంచికొట్టారు. హార్దిక్ 23 బంతుల్లో రెండు ఫోర్లు, నాలుగు సిక్స్లు బాది 50 పరుగులతో అజేయంగా నిలవగా.. తిలక్ వర్మ 16 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టి 44 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. హార్దిక్ సిక్సర్తో ఇన్నింగ్స్ ముగించగా.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 256 పరుగులు సాధించింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ ఎన్గర్వ, బ్లెసింగ్ ముజర్బానీ, టినోటెండా మపోసా, కెప్టెన్ సికందర్ రజా తలా ఒక వికెట్ పడగొట్టారు.రికార్డు స్కోరుకాగా టీ20 ప్రపంచకప్ చరిత్రలో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. అంతేకాదు టోర్నీలో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగానూ భారత్ నిలిచింది. తాజాగా భారత్ జింబాబ్వేతో మ్యాచ్లో నాలుగు వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. 2007లో శ్రీలంక కెన్యా మీద ఆరు వికెట్ల నష్టానికి 260 రన్స్ రాబట్టింది.చదవండి: T20 WC: మారవా?.. సంజూ శాంసన్ విఫలం𝐂𝐨𝐦𝐞𝐭𝐡 𝐭𝐡𝐞 𝐦𝐨𝐦𝐞𝐧𝐭, 𝐜𝐨𝐦𝐞𝐭𝐡 𝐇𝐚𝐫𝐝𝐢𝐤 𝐏𝐚𝐧𝐝𝐲𝐚. 🤌A breathtaking burst at the death by him, powered #TeamIndia past 250 with authority! 🙌ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/LazrvENuz8— Star Sports (@StarSportsIndia) February 26, 2026 -
కోహ్లి స్టైల్లో సిక్స్ కొట్టిన సంజూ.. గంభీర్ రియాక్షన్ వైరల్
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయాడు. చెన్నై వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్లో శాంసన్కు తుది జట్టులో దక్కింది.టీమ్ మెనెజ్మెంట్ అతడిని ఓపెనర్గా పంపింది. అయితే సంజూ క్రీజులో ఉన్నంత సేపు దూకుడుగా ఆడాడు. 15 బంతుల్లో 1 ఫోరు, 2 సిక్స్లతో 24 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే భారత స్కోరు బోర్డు ఖాతాను సంజూ భారీ సిక్సర్తో తెరిచాడు. ఇన్నింగ్స్ రెండో బంతికే రిచర్డ్ నగరవ బౌలింగ్లో లాంగ్ ఆన్ మీదుగా శాంసన్ ఒక అద్భుతమైన సిక్సర్ బాదాడు. ఆ షాట్కు మైదానంలో ఉన్న ప్రతీ ఒక్కరూ ఫిదా అయిపోయారు. డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఈ షాట్ను చూసి ఆశ్చర్యపోయాడు. ఈ షాట్ 2022 టీ20 ప్రపంచకప్లో హారిస్ రవూఫ్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ కొట్టిన ఐకానిక్ సిక్సర్ను గుర్తుకు తెచ్చిందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్లో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 14 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.𝐃𝐈𝐒𝐏𝐀𝐓𝐂𝐇𝐄𝐃 🚀Sanju Samson starts the innings on a positive note! 💪ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/TtmJRlvcR0— Star Sports (@StarSportsIndia) February 26, 2026 -
వరుస ఫెయిల్యూర్స్ తర్వాత.. ఎట్టకేలకు
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. జింబాబ్వేతో సూపర్-8 మ్యాచ్లో ఈ లెఫ్టాండర్ బ్యాట్ ఝులిపించాడు. ఇరవై ఆరు బంతుల్లోనే అర్ధ శతకం బాది సత్తా చాటాడు.ఆది నుంచి దారుణంగా విఫలంటీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో అభిషేక్ శర్మ ఆది నుంచి దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. లీగ్ దశలో అమెరికాతో మ్యాచ్లో గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఆ తర్వాత కడుపు నొప్పి వల్ల నమీబియాతో మ్యాచ్కు దూరమయ్యాడు.సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లోనూఅనంతరం జట్టులోకి తిరిగి వచ్చిన అభిషేక్ శర్మ పాకిస్తాన్, నెదర్లాండ్స్లతో మ్యాచ్లలోనూ డకౌట్ అయ్యాడు. అయినప్పటికీ యాజమాన్యం జట్టులో కొనసాగించగా.. సూపర్-8లో తొలుత సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లోనూ అతడు విఫలమయ్యాడు. 12 బంతులు ఎదుర్కొని కేవలం 15 పరుగులు చేసి నిష్క్రమించాడు.దీంతో అభిషేక్ శర్మ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. తుదిజట్టు నుంచి తప్పించి.. అతడికి కాస్త బ్రేక్ ఇవ్వాలని మాజీ క్రికెటర్లు సూచించారు. అయితే, మేనేజ్మెంట్ మాత్రం అభిషేక్పై నమ్మకం ఉంచగా.. పసికూన జింబాబ్వేతో మ్యాచ్లో అతడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.A well-constructed half-century for #AbhishekSharma! 👏His first in the ICC Men’s T20 World Cup and what an occasion to bring it up! 💙ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/vIVUWHYhSe— Star Sports (@StarSportsIndia) February 26, 2026అర్ధ శతకంతోజింబాబ్వేతో మ్యాచ్లో అభిషేక్ శర్మ.. ఇరవై ఆరు బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. కాగా కెరీర్లో తొలి వరల్డ్కప్ ఆడుతున్న ఈ పంజాబీ బ్యాటర్కు.. ఐసీసీ ఈవెంట్లో ఇదే తొలి ఫిఫ్టీ కావడం విశేషం. అయితే, మపోసా బౌలింగ్లో సికందర్ రజాకు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ 55 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.ఇదిలా ఉంటే.. 16 ఓవర్ల ఆట ముగిసే సరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 16, తిలక్ వర్మ 11 పరుగులతో క్రీజులో నిలిచారు. ఓపెనర్ సంజూ శాంసన్ 24, వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 38 పరుగులు చేసి అవుటయ్యారు. సూర్య 13 బంతుల్లో 33 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. దంచికొట్టిన అర్జున్ టెండుల్కర్ -
T20 WC: మారవా?.. సంజూ శాంసన్ విఫలం
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ లీగ్ దశలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు సంజూ శాంసన్. నమీబియాతో మ్యాచ్కు అభిషేక్ శర్మ దూరం కావడంతో.. ఓపెనర్గా అతడి స్థానంలో వచ్చాడు. పసికూనతో మ్యాచ్లో ఎనిమిది బంతుల్లో 22 పరుగులు చేయగలిగాడు.అయితే, ఆ తర్వాత మళ్లీ సంజూ (Sanju Samson)కు తుదిజట్టులో చోటు దక్కలేదు. ఓపెనింగ్ జోడీలో ఇషాన్ కిషన్ (Ishan Kishan) మెరుగ్గా ఆడగా.. అభిషేక్ శర్మ లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్లలో డకౌట్ అయ్యాడు. అయినప్పటికీ యాజమాన్యం అతడిని కొనసాగించింది. సంజూను బెంచ్కు పరిమితం చేసింది.మరో అవకాశంఅయితే, తాజాగా జింబాబ్వేతో సూపర్-8 మ్యాచ్ సందర్భంగా మరోసారి సంజూ శాంసన్కు మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చింది. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో లెఫ్టాండర్ అభిషేక్ శర్మతో కలిసి ఈ వికెట్ కీపర్ బ్యాటర్ గురువారం భారత జట్టు ఇన్నింగ్స్ ఆరంభించాడు. 𝐃𝐈𝐒𝐏𝐀𝐓𝐂𝐇𝐄𝐃 🚀Sanju Samson starts the innings on a positive note! 💪ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/TtmJRlvcR0— Star Sports (@StarSportsIndia) February 26, 2026ఘనంగానే ఆరంభించాడు.. కానీఇన్నింగ్స్ రెండో బంతికే సిక్స్ బాది ఘనంగా ఆరంభించాడు సంజూ. రెండో ఓవర్లోనూ ఓ సిక్సర్ బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆ మరుసటి ఓవర్లో బౌండరీ రాబట్టాడు. ఇలా మంచి ఫామ్లోకి వచ్చిన సంజూ.. నాలుగో ఓవర్లో రెండో బంతికి భారీ షాట్కు యత్నించి అవుటయ్యాడు.బ్లెసింగ్ ముజర్బానీ సంధించిన షార్ట్ బాల్ను సంజూ గాల్లోకి లేపగా.. డీప్ మిడ్ వికెట్ నుంచి పరిగెత్తుకు వచ్చి ర్యాన్ బర్ల్ క్యాచ్ అందుకున్నాడు. ఫలితంగా సంజూ శాంసన్ పెవిలిన్ చేరగా.. భారత్ తొలి వికెట్ కోల్పోయింది. మారవా సంజూ!జింబాబ్వేతో మ్యాచ్లో మొత్తంగా 15 బంతులు ఎదుర్కొన్న సంజూ.. ఒక ఫోర్, రెండు సిక్సర్లు బాది 24 పరుగులు చేయగలిగాడు. దీంతో రాకరాక వచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడని అభిమానులు ఉసూరుమంటున్నారు.ఇక తుదిజట్టులో సంజూను చూడటం కష్టమేనని వాపోతున్నారు. కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభానికి ముందు న్యూజిలాండ్తో సిరీస్లోనూ సంజూ వరుసగా విఫలమయ్యాడు. దీంతో ఓపెనర్గా సంజూ స్థానాన్ని ఇషాన్ భర్తీ చేశాడు. ఇక జింబాబ్వేతో మ్యాచ్తో సంజూ తిరిగి రాగా.. ఇషాన్ వన్డౌన్లో దిగాడు. పవర్ ప్లేలో టీమిండియా స్కోరు: 80-1(6). ఆరు ఓవర్ల ఆట ముగిసే సరికి ఇషాన్ 15, అభిషేక్ శర్మ 33 పరుగులతో క్రీజులో నిలిచారు. చెన్నై వేదికగా టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్కు దిగింది.చదవండి: సౌతాఫ్రికా ఘన విజయం.. టీమిండియాకు గుడ్న్యూస్! -
టీమిండియా ఇంటికేనా.? సెమీస్ చేరాలంటే.. జింబాబ్వే & వెస్టిండీస్ పై ఎంత రన్ రేట్ గెలవాలి
-
జింబాబ్వేతో మ్యాచ్.. భారత తుదిజట్టులో రెండు మార్పులు
టీ20 ప్రపంచకప్-2026 సూపర్-8లో భాగంగా చెన్నై వేదికగా భారత్, జింబాబ్వే జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ కీలక మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది.వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్ స్ధానంలో అక్షర్ పటేల్, సంజూ శాంసన్ తుది జట్టులోకి వచ్చాడు. అభిషేక్, సంజూ కలిసి భారత ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నారు. జింబాబ్వే కూడా ఓ మార్పు చేసింది. క్రీమర్ స్థానంలో టినోటెండా మాపోసాకు చోటు దక్కింది.తుది జట్లుజింబాబ్వే: తడివానాషే మారుమణి(వికెట్ కీపర్), బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, ర్యాన్ బర్ల్, సికందర్ రజా(కెప్టెన్), టోనీ మునియోంగా, తషింగా ముసెకివా, బ్రాడ్ ఎవాన్స్, టినోటెండా మపోసా, బ్లెస్సింగ్ ముజారబానీ, రిచర్డ్ నగరవభారత్: సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా -
సౌతాఫ్రికా ఘన విజయం.. టీమిండియాకు గుడ్న్యూస్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ సూపర్-8 దశలో సౌతాఫ్రికా మరో ఘన విజయం సాధించింది. తొలుత టీమిండియాను 76 పరుగులతో చిత్తు చేసిన సఫారీలు.. తాజాగా వెస్టిండీస్ను కూడా చిత్తు చేశారు. తద్వారా సెమీ ఫైనల్ రేసులో ప్రొటిస్ జట్టు ముందుకు దూసుకుపోయింది. అంతేకాదు టీమిండియా సెమీస్ ఆశలను కూడా సజీవం చేసింది.పోటీలో నాలుగుసూపర్-8 దశలో గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా, టీమిండియా, వెస్టిండీస్, జింబాబ్వే బరిలో నిలిచాయి. తొలి మ్యాచ్లో సౌతాఫ్రికా- టీమిండియా తలపడగా.. మార్క్రమ్ బృందం సూర్యకుమార్ సేనను చిత్తుగా ఓడించింది. దీంతో భారత జట్టు సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.మరోవైపు.. వెస్టిండీస్ తమ తొలి మ్యాచ్లో జింబాబ్వేపై ఏకంగా 107 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా రెండు పాయింట్లతో పాటు నెట్రన్రేటు పరంగా పటిష్ట స్థితిలో నిలిచింది. ఇలాంటి తరుణంలో సౌతాఫ్రికా విండీస్ను ఓడిస్తేనే టీమిండియా సెమీస్ అవకాశాలు మెరుగయ్యే పరిస్థితి.టీమిండియాకు సానుకూలాంశంఈ నేపథ్యంలో గురువారం నాటి మ్యాచ్లో సౌతాఫ్రికా విండీస్ను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేయడం.. టీమిండియాకు సానుకూలాంశంగా పరిణమించింది. అహ్మదాబాద్ వేదికగా టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.నిప్పులు చెరిగిన బౌలర్లుఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగలిగింది. విండీస్ బ్యాటర్లలో జేసన్ హోల్డర్ (49), రొమారియో షెఫర్డ్ (52 నాటౌట్) రాణించారు. ప్రొటిస్ బౌలర్లలో లుంగి ఎంగిడి మూడు వికెట్లు తీయగా.. కగిసో రబడ, కార్బిన్ బాష్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.మార్క్రమ్ ధనాధన్ఇక లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 16.1 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ నష్టపోయి పనిపూర్తి చేసింది. ఓపెనర్లలో క్వింటన్ డికాక్ (24 బంతుల్లో 47) ఫర్వాలేదనిపించగా.. ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 46 బంతులు ఎదుర్కొన్న మార్క్రమ్.. ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 82 పరుగులతో అజేయంగా నిలిచాడు.మార్క్రమ్కు తోడుగా ర్యాన్ రికెల్టన్ (28 బంతుల్లో 45 నాటౌట్) రాణించాడు. వీరిద్దరు కలిసి 49 బంతుల్లో 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. కాగా ఇప్పటికే సూపర్-8లో రెండు గెలిచిన సౌతాఫ్రికా తదుపరి జింబాబ్వేపై కూడా గెలవాలి.అదే విధంగా టీమిండియా జింబాబ్వే, వెస్టిండీస్ జట్లపై తప్పక విజయం సాధించాలి. అలా అయితేనే నెట్రన్రేటు లెక్కలతో పనిలేకుండా టీమిండియాకు సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.Is there anything that can stop #AidenMarkram today?! 🤯He is now the highest run-scorer for South Africa in ICC Men’s T20 World Cup history! 🚨ICC Men’s #T20WorldCup | Super 8 #WIvSA | LIVE NOW 👉 https://t.co/IaEbZJRFNR pic.twitter.com/qPhp9R82bA— Star Sports (@StarSportsIndia) February 26, 2026వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా స్కోర్లువెస్టిండీస్: 176/8(20)సౌతాఫ్రికా: 177/1(16.1)ఫలితం: తొమ్మిది వికెట్ల తేడాతో వెస్టిండీస్పై సౌతాఫ్రికా ఘన విజయం చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. దంచికొట్టిన అర్జున్ టెండుల్కర్ -
అతడికి బ్రేక్ ఇవ్వండి.. సంజూను జట్టులోకి తీసుకోండి: వీరేంద్ర సెహ్వాగ్
టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా మరో కీలక పోరుకు సిద్దమైంది. గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో భారత్ తలపడనుంది. సెమీస్ రేసులో నిలవాలంటే సూర్య సేన కచ్చితంగా ఈ మ్యాచ్లో గెలవాల్సిందే. అయితే ఈ మ్యాచ్కు ముందు భారత జట్టు మెనెజ్మెంట్కు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక సూచన చేశాడు. ఫామ్ లేమితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మను తప్పించి సంజూ శాంసన్ను జట్టులోకి తీసుకోవాలని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఈ మెగా టోర్నీలో అభిషేక్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడిన అభిషేక్ కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. అందులో మూడు డకౌట్లు ఉండడం గమనార్హం. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాలని పలువురు మాజీలు సూచిస్తున్నారు."నేను గనుక టీమ్ మెనెజ్మెంట్లో భాగంగా ఉంటే, అభిషేక్కు విశ్రాంతి ఇచ్చే వాడిని. అతడి స్ధానంలో సంజూ శాంసన్ను అవకాశమిస్తాను. ఏదైనా ప్రయత్నం చేయాలంటే ఈ మ్యాచ్లోనే చేయాలి. ఎందుకంటే ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోతే, టోర్నీ నుంచి నిష్క్రమిస్తారు. ఇది చాలా కీలకమైన మ్యాచ్. కాబట్టి ఆటగాళ్ల ఫామ్ ఆధారంగా భా తమ అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్ను ఎంచుకోవాలి.తుది జట్టు ఎంపికలో మార్పులు కచ్చితంగా ఉంటాయని అనుకుంటున్నాను. భారత్ సరైన వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. కానీ వాటిని అమలు చేయడంలో మాత్రం విఫలమవుతోంది. ఈ మ్యాచ్లో భారత్ తమ వ్యూహాలకు మరింత పదును పెట్టే అవకాశముంది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఇద్దరూ మంచి ఫామ్లో లేరన్న విషయం మెనెజ్మెంట్ గుర్తుంచుకోవాలి" అని క్రిక్బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. -
SA vs WI: హోల్డర్, షెఫర్డ్ ధనాధన్.. విండీస్ స్కోరెంతంటే?
సౌతాఫ్రికాతో సూపర్-8 మ్యాచ్లో వెస్టిండీస్ మెరుగైన స్కోరు సాధించింది. ప్రొటిస్ పేసర్లు నిప్పులు చెరగడంతో ఆదిలో తడబడినా.. ఆఖర్లో జేసన్ హోల్డర్, రొమారియో షెఫర్డ్ ధనాధన్ దంచికొట్టడంతో గౌరవప్రదమైన స్కోరుతో ఇన్నింగ్స్ ముగించింది.టీ20 ప్రపంచకప్-2026లో గ్రూప్-1 ప్రస్తుత టాపర్ వెస్టిండీస్- సౌతాఫ్రికా (WI vs SA) మధ్య గురువారం నాటి సూపర్-8 మ్యాచ్కు అహ్మదాబాద్ వేదిక. నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.నిప్పులు చెరిగిన ప్రొటిస్ పేసర్లుఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్కు లుంగి ఎంగిడి, కగిసో రబడ షాకులు మీద షాకులు ఇచ్చారు. తొలుత ఓపెనర్లలో కెప్టెన్ షాయీ హోప్ (16)ను పెవిలియన్కు పంపిన రబడ.. వన్డౌన్ బ్యాటర్ షిమ్రన్ హెట్మైర్ (2)ను కూడా అవుట్ చేశాడు.హోల్డర్, షెఫర్డ్ మెరుపులుఅనంతరం ఎంగిడి రోవ్మన్ పావెల్ (9), రోస్టన్ ఛేజ్ (2), బ్రాండన్ కింగ్ (21)లను వెనక్కి పంపగా.. కార్బిన్ బాష్ షెర్ఫానే రూథర్ఫర్డ్ (12), మాథ్యూ ఫోర్డ్ (11) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జేసన్ హోల్డర్, రొమారియో షెఫర్డ్ బ్యాట్ ఝులిపించారు.హోల్డర్ 31 బంతుల్లో 49 పరుగులు చేయగా.. షెఫర్డ్ 37 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. అర్ధ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో హోలర్డర్ బాష్ బౌలింగ్లో అవుట్ కాగా.. షెఫర్డ్అర్థ శతకం పూర్తి చేసుకోగలిగాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో వెస్టిండీస్ ఎనిమిది వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగలిగింది.మెరుగైన భాగస్వామ్యంహోల్డర్- షెఫర్డ్ కలిసి ఎనిమిదో వికెట్కు 57 బంతుల్లో 89 పరుగులు జోడించారు. వీరిద్దరు విజృంభించడంతో 83/7గా ఉన్న విండీస్ స్కోరు.. 176/8కు చేరుకుంది.టీమిండియా భవిష్యత్ సౌతాఫ్రికా చేతిలోగ్రూప్-1 టాపర్ విండీస్ను సౌతాఫ్రికా చిత్తుగా ఓడిస్తేనే టీమిండియా సెమీస్ అవకాశాలు మెరుగుపడతాయి. ఒకవేళ ఈ మ్యాచ్లో గనుక విండీస్ గెలిస్తే అనధికారికంగా సెమీస్ బెర్తు ఖరారు చేసుకునే వీలుంటుంది. అదే సమయంలో.. టీమిండియా సెమీ ఫైనల్ ఆశలు దాదాపు గల్లంతు అవుతాయి.చదవండి: IND vs ZIM: భారత తుదిజట్టు ఇదే.. ఆ ముగ్గురిపై వేటు! -
IND vs ZIM: భారత తుదిజట్టు ఇదే.. ఆ ముగ్గురిపై వేటు!
జింబాబ్వేతో కీలక సూపర్-8 మ్యాచ్కు టీమిండియా సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య గురువారం చెన్నై వేదికగా రాత్రి ఏడు గంటలకు మ్యాచ్కు తెరలేవనుంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ముందడుగు వేయాలంటే భారత్ ఈ మ్యాచ్లో తప్పక భారీ విజయం సాధించాలి.లెఫ్ట్-రైట్ కాంబినేషన్ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పు విషయంలో యాజమాన్యం ఆచితూచి వ్యవహరిస్తోంది. టాపార్డర్లో ముగ్గురు లెఫ్టాండర్లే ఉండటం వల్ల ప్రత్యర్థి జట్టు బౌలర్లు.. ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్లకు ఈజీ టార్గెట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం సంజూ శాంసన్ను తుదిజట్టులో చోటు ఇవ్వనున్నట్లు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు.ఆ ముగ్గురిపై వేటు!అయితే, ఓపెనింగ్ జోడీగా మాత్రం లెఫ్టాండర్లు ఇషాన్ కిషన్- అభిషేక్ శర్మను కొనసాగించాలని మేనేజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. గాయం నుంచి కోలుకున్న తర్వాత స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్న మరో లెఫ్టాండర్ తిలక్ వర్మపై వేటు వేసి.. అతడి స్థానంలో అంటే వన్డౌన్లో కుడిచేతి వాటం బ్యాటర్ సంజూను ఆడించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.అదే విధంగా.. సౌతాఫ్రికాతో మ్యాచ్లో అక్షర్ పటేల్ను ఆడించకుండా మూల్యం చెల్లించిన నేపథ్యంలో.. తిరిగి అతడిని ప్లేయింగ్ ఎలెవన్లోకి తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు స్పిన్కు అనుకూలమైన చెపాక్ పిచ్పై చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ను కూడా ఆడించాలని మేనేజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో స్థానిక ఆల్రౌండర్, చెన్నై చిన్నోడు వాషింగ్టన్ సుందర్పై వేటు పడవచ్చు. అదే విధంగా రింకూ సింగ్ను కూడా పక్కనపెట్టే అవకాశం ఉంది. మొత్తానికి జింబాబ్వేతో మ్యాచ్లో తిలక్ స్థానంలో సంజూ.. వాషీ స్థానంలో కుల్దీప్.. రింకూ స్థానంలో అక్షర్ పటేల్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.సఫారీల చేతిలో భారీ ఓటమితోకాగా గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా.. సూపర్-8 దశలో తొలి మ్యాచ్లోనే భారీ ఓటమిని మూటగట్టుకుంది. సౌతాఫ్రికా చేతిలో ఏకంగా 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో సెమీ ఫైనల్ చేరాలంటే జింబాబ్వే, వెస్టిండీస్లపై తప్పక భారీ విజయాలు సాధించడంతో పాటు.. విండీస్- సౌతాఫ్రికా మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది.జింబాబ్వేతో సూపర్-8 మ్యాచ్కు భారత తుదిజట్టు (అంచనా)ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి. చదవండి: పతనం అంచుల్లో శ్రీలంక క్రికెట్ -
ఇటలీ క్రికెట్లో కలకలం
ఇటలీ క్రికెట్ బోర్డులో కలకలం రేగింది. వారి దేశ మహిళా జట్టు ప్రధాన కోచ్ ప్రభాత్ ఎక్నెలిగోడాపై లైంగిక దాడి ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు చేసింది ఆ దేశ జాతీయ మహిళా క్రికెటరే. గాయపడిన సమయంలో ప్రభాత్ అనుచితంగా ప్రవర్తించాడని.. గాయానికి మసాజ్ చేసే సమయంలో పరిధి దాటి ప్రవర్తించాడని రోమ్ ప్రాసిక్యూటర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. అయితే, ఈ ఆరోపణలను ప్రభాత్ ఖండించాడు. మొత్తంగా ఈ ఘటన ఇటలీ క్రికెట్లో కలకలం రేపింది.శ్రీలంకకు చెందిన ప్రభాత్పై ఇదివరకే చాలా ఆరోపణలు ఉన్నాయి. అతన్ని మహిళా క్రికెట్ జట్టు విధుల నుంచి అధికారికంగా తప్పించడినప్పటికీ.. ప్రస్తుతం జరుగుతున్న పురుషుల టీ20 వరల్డ్ కప్లో ఇటలీ జట్టు అధికారిక గుర్తింపు కార్డు ధరించి కనిపించాడు. ఈ విషయం కూడా వివాదాస్పదమైంది. మహిళా జట్టు కోచ్ బాధ్యతల నుంచి తప్పించినా కూడా ఇంకా ఆ జట్టు శిక్షణ శిబిరాలకు హాజరవుతున్నాడని విమర్శలు ఉన్నాయి. క్రికెట్ ఇటాలియా (ఇటలీ క్రికెట్ బోర్డు) వెబ్సైట్లో అతని పేరు తొలగించినా, అక్రమంగా ఆ విధుల్లో కొనసాగుతున్నాడని కూడా ఫిర్యాదులు ఉన్నాయి. మొత్తంగా ప్రభాత్ ఉదంతం ఇప్పుడిప్పుడే మొగ్గలేస్తున్న ఇటలీ క్రికెట్ను ఓ కదుపు కుదుపుతుంది. ప్రభాత్ ఎడిసోడ్కు బాధ్యత వహిస్తూ.. ఇటలీ క్రికెట్ ప్రెసిడెంట్ రాజీనామా చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.ఇటలీ మహిళల జట్టు ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్లో 23వ స్థానంలో ఉంది. ఇటీవల వారు మంచి ప్రగతి సాధించారు. 2025 యూరప్ క్వాలిఫయర్లో నెదర్లాండ్స్, ఐర్లాండ్ చేతిలో ఓడిపోవడంతో 2026 మహిళల టీ20 వరల్డ్ కప్కు అర్హత సాధించలేకపోయారు.మరోవైపు ఇటలీ పురుషుల జట్టు ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శనలు చేసి యావత్ క్రికెట్ అభిమానుల మనసులు గెలుచుకుంది. గ్రూప్ దశలో ఆ జట్టు నేపాల్పై సాధించిన విజయం ఆ దేశ క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. ఇటలీ ఏ ఫార్మాట్లో అయినా ప్రపంచకప్ ఆడటం ఇదే మొదటిసారి. అరంగేట్రం ఎడిషన్లోనే ఆ జట్టు మెరుగైన ప్రదర్శనలు చేసి శభాష్ అనిపించుకుంది. -
పతనం అంచుల్లో శ్రీలంక క్రికెట్
స్వదేశంలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026లో శ్రీలంక జట్టు సూపర్-8 దశలోనే నిష్క్రమించి అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ దశలో ఆడిన రెండు మ్యాచ్ల్లో ఘోర పరాజయాలు ఎదుర్కొని ఫ్యాన్స్ను ఉసూరుమనిపించింది. వాస్తవానికి టోర్నీ ప్రారంభానికి ముందు ఈ జట్టుపై ఓ మోస్తరు అంచనాలు ఉండేవి. హోం అడ్వాంటేజ్ కలిసొచ్చి ప్రత్యర్దులను ఇబ్బంది పెడుతుందని అంతా భావించారు. అయితే పరిస్థితి తిరగబడింది. గ్రూప్ దశలో పటిష్టమైన ఆస్ట్రేలియాకు షాకిచ్చినా.. సూపర్-8కు రాగానే తేలిపోయింది. వరుసగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ చేతుల్లో దారుణ పరాజయాలు ఎదుర్కొని టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఆసీస్పై గెలుపు మినహా శ్రీలంక గ్రూప్ దశలోనూ పెద్దగా చేసిందేమీ లేదు. ఇంకా చెప్పాలంటే తమకంటే చాలా బలహీనమైన జింబాబ్వే చేతిలో ఓటమిపాలై, సొంత అభిమానులచే చీవాట్లు తినింది. సూపర్-8 దశలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ను బౌలింగ్లో కట్టడి చేయగలిగినా.. బ్యాటింగ్లో దారుణంగా విఫలమైంది. ఓ మోస్తరు స్కోర్లను ఛేదించలేక చతికిలబడింది. తొలుత ఇంగ్లండ్, తాజాగా న్యూజిలాండ్ మ్యాచ్ల్లో ఇదే జరిగింది. ఇంగ్లండ్ను 146 పరుగులకు కట్టడి చేసి సంకలు గుద్దుకున్నా, ఆతర్వాత బ్యాటింగ్లో చేతులెత్తేసి 95 పరుగులకే కుప్పకూలింది.న్యూజిలాండ్ మ్యాచ్లోనూ బౌలర్లు సత్తా చాటి ప్రత్యర్దిని 168 పరుగులకే కట్టడి చేసినా.. ఇంగ్లండ్ మ్యాచ్ తరహాలోనే ఈ మ్యాచ్లోనూ లంక బ్యాటర్లు ఉసూరుమనిపించారు. కనీసం టార్గెట్కు దరిదాపుల్లోకి కూడా రాలేక 107 పరుగులకే పరిమితమయ్యారు. గ్రూప్ దశలో పసికూనలు ఐర్లాండ్, ఒమన్ మినహా ఈ మెగా టోర్నీలో శ్రీలంక సాధించింది ఏమీ లేదు. ఆసీస్పై దక్కిన విజయాన్ని లంక క్రెడిట్కు ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే ఆ జట్టు స్టార్లు లేక బలహీనంగా ఉండింది.మొత్తంగా హోం గ్రౌండ్ అడ్వాంటేజ్తో సంచలనాలు సృష్టిస్తుందని భావించిన శ్రీలంక సూపర్-8 దశలోనే నిష్క్రమించి అభిమానుల ఆశలను అడియాశలు చేసింది. వాస్తవానికి శ్రీలంక పరిస్థితి గత కొంతకాలంగా ఏమంత ఆశాజనకంగా లేదు. గత పదేళ్లకాలంలో ఆ జట్టు అడపాదడపా విజయాలు మినహాయించి ఐసీసీ టోర్నీల్లో ఒక్కసారి కూడా కనీసం సెమీఫైనల్స్కు చేరుకోలేదు.ఆ జట్టు చివరిగా 2011 వన్డే ప్రపంచకప్లో ఫైనల్స్ వరకు చేరింది. ఫైనల్స్లో భారత్ చేతిలో చిత్తై రన్నరప్తో సరిపెట్టుకుంది. ఆతర్వాత వరుసగా జరిగిన 10 ఐసీసీ మెగా టోర్నీల్లో ఒక్కసారి కూడా సెమీస్కు చేరుకోలేదు. 2015 వన్డే ప్రపంచకప్, 2016 టీ20 ప్రపంచకప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్కప్, 2021 టీ20 వరల్డ్కప్, 2022 టీ20 వరల్డ్కప్, 2023 వన్డే వరల్డ్కప్, 2024 టీ20 వరల్డ్కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, తాజాగా టీ20 వరల్డ్కప్ 2026లో శ్రీలంక సెమీస్కు ముందే నిష్క్రమించింది.ప్రస్తుత శ్రీలంక జట్టు పరిస్థితి చూస్తే.. కొన్నేళ కిందటి వెస్టిండీస్ దుస్థితి గుర్తుకు వస్తుంది. విండీస్ జట్టు స్టార్లంతా రిటైరయ్యాక ఉనికి ప్రశ్నార్థకంగా మార్చుకుంది. ఆ జట్టు ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది. శ్రీలంకను చూస్తే.. విండీస్కు పట్టిన గతే పట్టేలా ఉందనిపిస్తుంది. లంక జట్టులో టాలెంట్కు కొదవ లేకున్నా, నిలకడలేమి పెద్ద సమస్యగా మారింది. నిస్సంక లాంటి ఒకరిద్దరు ఆటగాళ్లు క్రమం తప్పకుండా రాణిస్తున్నా, మిగతా వారి నుంచి వారికి మద్దతు లభించడం లేదు. హసరంగ, పతిరణ లాంటి స్టార్ బౌలర్లు తరుచూ గాయాల బారిన పడి కీలక మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవడం కూడా ఆ జట్టుకు తలనొప్పిగా మారింది. బౌలింగ్లో తీక్షణ, వెల్లాలగే పర్వాలేదనిపించినా, ఆ స్థాయి రాణింపు మ్యాచ్లకు గెలిపించదు. కుసాల్ మెండిస్, అసలంక, కమిందు మెండిస్, కెప్టెన్ షనక లాంటి వారు క్రమం తప్పకుండా రాణిస్తేనే శ్రీలంక ఫేట్ మారుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం సమీప భవిష్యత్తులోనే ఆ జట్టు పసికూన చేతిలో కూడా పరాభవాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ ఆటగాళ్లు
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా శ్రీలంకతో నిన్న (ఫిబ్రవరి 25) జరిగిన సూపర్-8 మ్యాచ్లో న్యూజిలాండ్ 61 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తద్వారా సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. ఈ ఓటమితో ఆతిథ్య శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 84 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన జట్టును కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (47), కోల్ మెక్కోంచి (31 నాటౌట్) ఆదుకున్నారు. వీరిద్దరు ఏడో వికెట్కు 84 పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు.ఈ క్రమంలో సాంట్నర్-మెక్కోంచి జోడీ ఓ వరల్డ్కప్ రికార్డును బద్దలు కొట్టింది. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో ఏడో వికెట్కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా చరిత్ర సృష్టించింది. గతంలో ఈ రికార్డు మైక్ హస్సీ-స్టీవ్ స్మిత్ పేరిట ఉండేది. 2010 ఎడిషన్లో బంగ్లాదేశ్పై ఈ జోడీ ఏడో వికెట్కు 74 పరుగులు జోడించింది. తాజాగా సాంట్నర్-మెక్కోంచి జోడీ ఈ రికార్డును బద్దలు కొట్టింది.డెత్ ఓవర్లలో దూకుడుడెత్ ఓవర్లలో సాంట్నర్-మెక్కొంచి జోడీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. చివరి నాలుగు ఓవర్లలో ఏకంగా 70 పరుగులు రాబట్టింది. 17వ ఓవర్లో 18, 18వ ఓవర్లో 21, చివరి రెండు ఓవర్లలో 19 మరియు 12 పరుగులు పిండుకుంది.అరుదైన మైలురాయిని తాకిన సాంట్నర్ఈ మ్యాచ్లో 47 పరుగులు చేయడంతో సాంట్నర్ ఓ అరుదైన మైలురాయిని తాకాడు. టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేయడంతో పాటు 100 వికెట్లు తీసిన ఎనిమిదో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో మొహమ్మద్ నబీ, హార్దిక్ పాండ్యా, షకీబ్ అల్ హసన్ వంటి ప్రముఖులు ఉన్నారు.బెంబేలెత్తించిన హెన్రీ.. తిప్పేసిన స్పిన్నర్లు169 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్ బౌలర్లు ఆది నుంచే రెచ్చిపోయారు. ముఖ్యంగా మ్యాట్ హెన్రీ (2-1-3-2) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి బంతికే ఇన్ ఫామ్ బ్యాటర్ నిస్సంకను క్లీన్ బౌల్డ్ చేసిన హెన్రీ.. ఆతర్వాతి ఓవర్లో అసలంకను పెవిలియన్కు పంపాడు. ఆతర్వాత స్పిన్నర్లు లైన్లోకి వచ్చి లంక ఇన్నింగ్స్ను నేలమట్టం చేశారు. వీరిలో రచిన్ రవీంద్ర (4-0-27-4) లంక పతనాన్ని శాశించారు. సాంట్నర్ (4-0-19-1), గ్లెన్ ఫిలిప్స్ (4-0-21-1) పొదుపుగా బౌలింగ్ చేసి లంక ఆటగాళ్లను కట్టడి చేశారు. ఫలితంగా శ్రీలంక నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్ల నష్టానికి 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. లంక ఇన్నింగ్స్లో 31 పరుగులు చేసిన కమిందు మెండిసే టాప్ స్కోరర్. -
నేడు కీలక మ్యాచ్.. నిలవాలంటే గెలవాల్సిందే..
-
సౌతాఫ్రికా, విండీస్ ముందున్నాయి.. భారత్ సెమీస్ చేరాలంటే!
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా లీగ్ దశలో అజేయంగా నిలిచింది. గ్రూప్-‘ఎ’లో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్లను ఓడించి టాపర్గా సూపర్-8లో అడుగుపెట్టింది. అయితే, కీలక సమయంలో సమిష్టి వైఫల్యంతో సూర్యకుమార్ సేన చేతులెత్తేసింది.అతిపెద్ద పరాజయంసూపర్-8 గ్రూప్-1లో భాగంగా సౌతాఫ్రికా (IND vs SA)తో మ్యాచ్లో మరీ దారుణంగా 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది టీమిండియా. తద్వారా తమ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే పరుగుల పరంగా అతిపెద్ద పరాజయాన్ని నమోదు చేసింది.అందనంత ఎత్తులో విండీస్మరోవైపు.. గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా టీమిండియాను 76, వెస్టిండీస్ జింబాబ్వే (WI vs ZIM)ను 107 పరుగుల తేడాతో చిత్తు చేసి భారీ విజయాలు సాధించాయి. చెరో విజయంతో రెండేసి పాయింట్లు సంపాదించాయి. అయితే, సఫారీల (+3.800)తో పోలిస్తే విండీస్ (+5.350)నెట్రన్రేటు పరంగా అత్యంత పటిష్ట స్థితిలో నిలిచి టాపర్గా ఉంది.మరోవైపు భారత్ (-3.800) ఘోర పరాజయంతో వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో చెన్నై వేదికగా గురువారం నాటి మ్యాచ్లో.. అదే విధంగా ఆదివారం విండీస్తో మ్యాచ్లో తప్పక భారీ తేడాతో గెలవాలి. లేదంటే సెమీస్ చేరకుండానే నిష్క్రమించాల్సి వస్తుంది. గెలుపు ముఖ్యం.. ఆ తర్వాతే ఏదైనాఅయితే, జింబాబ్వేతో మ్యాచ్లో నెట్రన్రేటు కంటే కూడా గెలుపే ముఖ్యంగా ఆడాలని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అంటున్నాడు. ‘‘జింబాబ్వేతో మ్యాచ్లో మొదట విజయం గురించి మాత్రమే ఆలోచించాలి. గెలిస్తేనే కదా నెట్రన్రేటు లెక్కలోకి వచ్చేది. ఇప్పుడు మనకు గెలుపు పాయింట్లు అత్యంత ముఖ్యం.ఏదేమైనా ఇప్పుడు నెట్రన్రేటు పరంగా వెస్టిండీస్ను మనం ఓడించడం అసాధ్యం. టీ20 క్రికెట్లో జింబాబ్వే, వెస్టిండీస్ వంటి జట్లపై 100 పరుగుల తేడాతో విజయాలు సాధించడం కష్టం. కాబట్టి తదుపరి రెండు మ్యాచ్లలో గెలుపు ఒక్కటే మనకు ముఖ్యం. ఆ తర్వాతే నెట్రన్రేటు గురించి ఆలోచించాలి.ఇంత చెత్తగా ఆడతారా?సౌతాఫ్రికాతో మ్యాచ్లో మూడు విభాగాల్లో భారత్ విఫలమైంది. కనీసం ఒక్క బ్యాటర్ కూడా మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పే ప్రయత్నం చేయలేదు. అందువల్లే భారీ తేడాతో ఓడి సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకున్నాం. ఏదేమైనా ప్రస్తుతం వెస్టిండీస్, సౌతాఫ్రికా నెట్రన్రేటు పరంగా మనకు అందనంత ఎత్తులో ఉన్నాయి. మనం మూడు విభాగాల్లో రాణిస్తేనే ముందడుగు వేయగలం’’ అని ఇర్ఫాన్ పఠాన్ టీమిండియాకు హెచ్చరికలు జారీ చేశాడు.చదవండి: IND vs ZIM: తుదిజట్టులో సంజూ.. ఆ ముగ్గురిలో ఒకరిపై వేటు! -
షాకులిచ్చిన శ్రీలంక.. సాంట్నర్ ధనాధన్ దంచికొట్టగా..
శ్రీలంకతో మ్యాచ్లో న్యూజిలాండ్ మెరుగైన స్కోరు సాధించింది. మిడిలార్డర్ కకావికలమైనా లోయర్ ఆర్డర్ రాణించడంతో గౌరవప్రదంగా ఇన్నింగ్స్ ముగించింది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ సూపర్-8 మ్యాచ్లో భాగంగా కొలంబో వేదికగా.. టాస్ గెలిచిన శ్రీలంక.. కివీస్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది.ఈ క్రమంలో కివీస్కు ఆదిలోనే షాక్ తగిలింది. ఫామ్లో ఉన్న ఓపెనర్ టిమ్ సీఫర్ట్ (8)ను దుష్మంత చమీర త్వరగానే పెవిలియన్కు పంపాడు. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ (13 బంతుల్లో 23)ను మహీశ్ తీక్షణ వెనక్కి పంపగా.. రచిన్ రవీంద్ర (22 బంతుల్లో 32) తీక్షణ బౌలింగ్లో హేమంతకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.పెవిలియన్కు క్యూఅయితే, టాపార్డర్ ఓ మాదిరిగా ఆడగా.. మిడిలార్డర్ బ్యాటర్లు మాత్రం పెవిలియన్కు క్యూ కట్టారు. గ్లెన్ ఫిలిఫ్స్ (18), డారిల్ మిచెల్ (3) ఇలా వచ్చి అలా వెళ్లగా.. మార్క్ చాప్మన్ డకౌట్ అయ్యాడు.సాంట్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మిచెల్ సాంట్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. మొత్తంగా 26 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదిన ఈ బౌలింగ్ ఆల్రౌండర్.. 47 పరుగులు సాధించాడు. Captain to the rescue! 💪Mitchell Santner's power-hitting pushes New Zealand's fightback. ICC Men’s #T20WorldCup | SUPER 8, #SLvNZ ➡️ LIVE NOW 👉 https://t.co/g4wqt4U8vL pic.twitter.com/p0KW8AcuLA— Star Sports (@StarSportsIndia) February 25, 2026రాణించిన మెకాంచీఇక జేమ్స్ నీషమ్ స్థానంలో తుదిజట్టులోకి వచ్చిన మరో బౌలింగ్ ఆల్రౌండర్ కోల్ మెకాంచీ సాంట్నర్కు తోడుగా రాణించాడు. మెకాంచీ 23 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరు కలిసి ఏడో వికెట్కు 47 బంతుల్లో 84 పరుగులు జోడించారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 168 పరుగులు సాధించింది. శ్రీలంక బౌలర్లలో మహీశ్ తీక్షణ, దుష్మంత చమీర చెరో మూడు వికెట్లు తీయగా.. దునిత్ వెల్లలగే ఒక వికెట్ దక్కించుకున్నాడు. తుదిజట్లుశ్రీలంకపాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), చరిత్ అసలంక, పవన్ రత్నాయక్, కమిందు మెండిస్, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంకన్యూజిలాండ్టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అల్లెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కోల్ మెకాంచీ, మాట్ హెన్రీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్.చదవండి: అతడి గురించి బాధ లేదు.. సంజూ రావొచ్చు: టీమిండియా కోచ్ -
IND vs ZIM: తుదిజట్టులో సంజూ.. అతడిపై వేటు!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో కీలక మ్యాచ్కు టీమిండియా సన్నద్ధమైంది. సూపర్-8 దశలో భాగంగా గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో తలపడనుంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందా? అన్న అంశం చర్చనీయాంశంగా మారింది.ఇషాన్ హిట్.. అభిషేక్ ఫ్లాప్కాగా ఓపెనింగ్ జోడీగా ఇషాన్ కిషన్- అభిషేక్ శర్మలకు అవకాశాలు వస్తుండగా.. సంజూ శాంసన్ బెంచ్కే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. అయితే వరల్డ్కప్ టోర్నీలో ఇషాన్ మెరుగ్గా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుండగా.. అభిషేక్ శర్మ లీగ్ దశలో తొలి మూడు మ్యాచ్లలోనూ డకౌట్ అయ్యాడు.ఇక సూపర్-8లో తొలుత సౌతాఫ్రికాతో టీమిండియా తలపడగా.. ఈసారి ఇషాన్ డకౌట్ కాగా.. అభిషేక్ 15 పరుగులు చేయగలిగాడు. మరోవైపు.. సంజూ లీగ్ దశలో నమీబియాతో మ్యాచ్లో బరిలోకి దిగి 8 బంతుల్లో 22 పరుగులు చేయగలిగాడు.తిలక్ వర్మపై విమర్శలుఇదిలా ఉంటే.. మూడో స్థానంలో ఆడుతున్న తిలక్ వర్మ ఇప్పటి వరకు పెద్దగా బ్యాట్ ఝులిపించనేలేదు. అతడి స్ట్రైక్రేటుపై విమర్శలు వస్తున్నాయి. ముగ్గురూ లెఫ్టాండర్లేఇక ఓపెనర్లు ఇషాన్- అభిషేక్.. వన్డౌన్లో వచ్చే తిలక్.. ఈ ముగ్గురూ లెఫ్టాండ్ బ్యాటర్లే. దీంతో ప్రత్యర్థి జట్టు బౌలర్లు, కెప్టెన్కు పని సులువు అయిపోతోంది. వ్యూహాల్లో పెద్దగా మార్పులు లేకుండానే వాళ్లు అనుకున్న ఫలితాలు రాబట్టగలుగుతున్నారు.లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసంఇలాంటి తరుణంలో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం టీమిండియా టాపార్డర్లో మార్పులు చేసేందుకు సిద్ధమైంది. బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. జింబాబ్వేతో మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తుదిజట్టులో సంజూ శాంసన్ను చేర్చే విషయమై చర్చ నడుస్తోంది.సంజూ వస్తాడని సంకేతంజింబాబ్వేతో మ్యాచ్ సందర్భంగా మార్పులు ఉండవచ్చు. మా ఓపెనర్లతో పాటు వన్డౌన్లో వచ్చే ఆటగాడు కూడా లెఫ్టాండర్ బ్యాటరే కావడం ఇందుకు కారణం. అందుకే ఈ విషయంలో పునరాలోచన చేస్తున్నాం. అయితే, మ్యాచ్ సమయంలోనే మేము తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని కొటక్ తెలిపాడు.ఎవరిపై వేటు?ఒకవేళ సంజూ గనుక తుదిజట్టులోకి వస్తే ఎవరిపై వేటు పడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. రింకూ సింగ్ స్థానంలో సంజూను ఆడిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే సంజూను వన్డౌన్లో ఆడించి.. తిలక్ను డిమోట్ చేయడం ఓ ఆప్షన్. అయితే, ఇప్పటికే తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించినా రింకూ జట్టుతో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు కొటక్ తెలిపాడు.రింకూ, తిలక్, అభిషేక్!అంటే రింకూ జింబాబ్వేతో మ్యాచ్ ఆడటం ఖాయమే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మపై వేటు పడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వరుస వైఫల్యాల నేపథ్యంలో రీసెట్ అయ్యేందుకు.. లెఫ్ట్-రైట్ ఓపెనింగ్ కాంబినేషన్ కోసం అతడిని పక్కనపెడతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు.. అభిషేక్- ఇషాన్ జోడిని కొనసాగిస్తే.. తిలక్ వర్మపై వేటు వేసి.. సంజూను మూడోస్థానంలోనే ఆడిస్తారనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. సితాన్షు కొటక్ చెప్పినట్లు మ్యాచ్ ఆరంభానికి ముందు వరకు భారత తుదిజట్టు ఎలా ఉండబోతుందో అంచనా వేయడం ఈసారి కాస్త కష్టమే అనిపిస్తోంది. కాగా చివరగా సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడిన భారత తుదిజట్టులో ఏకంగా ఏడుగురు ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఉండటం విశేషం. ఈ మ్యాచ్లో సఫారీల చేతిలో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన టీమిండియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. చదవండి: T20 WC 2026: రింకూ సింగ్కు సంబంధించి బిగ్ అప్డేట్ -
NZ vs SL: సూపర్-8 మ్యాచ్.. లైన్ క్లియర్!
న్యూజిలాండ్, శ్రీలంక జట్లకు శుభవార్త. ఇరుజట్ల మధ్య సూపర్-8 మ్యాచ్కు మార్గం సుగమమైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో సూపర్-8 దశలో బుధవారం నాటి మ్యాచ్లో కివీస్-లంక తలపడాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉందన్న వార్తలు ఇరజట్ల అభిమానులను కలవరపాటుకు గురిచేశాయి.అయితే, కొలంబోలో ప్రస్తుతం వర్ష సూచన లేదు. దీంతో మ్యాచ్ నిర్వహణకు లైన్ క్లియర్ కాగా.. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక కివీస్తో మ్యాచ్లో లంక తమ తుదిజట్టులో ఒక మార్పు చేసింది. ఒక మార్పుతో బరిలోకికమాల్ మిశారా స్థానంలో చరిత్ అసలంకకు అవకాశం ఇచ్చింది. టాపార్డర్ను పటిష్టం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెప్టెన్ దసున్ షనక వెల్లడించాడు. ఇంగ్లండ్ మ్యాచ్లో చేసిన పొరపాట్లను పునరావృతం కానివ్వమని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.మా జట్టులోనూ ఓ మార్పుమరోవైపు.. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ.. శ్రీలంకతో మ్యాచ్కు పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్లు వెల్లడించాడు. లంక స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రచించుకున్నట్లు తెలిపాడు. జిమ్మీ నీషమ్ స్థానంలో కోల్ మెకాంచీ తుదిజట్టులోకి వచ్చినట్లు సాంట్నర్ తెలిపాడు. మధ్య ఓవర్లలో అదనపు స్పిన్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు.తుదిజట్లుశ్రీలంకపాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), చరిత్ అసలంక, పవన్ రత్నాయక్, కమిందు మెండిస్, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంకన్యూజిలాండ్టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అల్లెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కోల్ మెకాంచీ, మాట్ హెన్రీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్.చదవండి: అతడి గురించి బాధ లేదు.. సంజూ రావొచ్చు: టీమిండియా కోచ్ -
భారత్ సెమీస్ చేరాలంటే..? 11 ఓవర్లలో ఎంత ఛేజ్ చేయాలంటే..!
-
ఇలా అయితే పాక్ వరల్డ్కప్ గెలవదు: పాకిస్తాన్ కెప్టెన్ భార్య ఫైర్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో పాకిస్తాన్కు ఘోర పరాభవం ఎదురైంది. సూపర్-8 దశలో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో పాక్ ఓటమిపాలైంది. పల్లెకెలె వేదికగా మంగళవారం నాటి మ్యాచ్లో రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.సెమీస్ అవకాశాలు సంక్లిష్టంఫలితంగా పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా, అతడి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇంగ్లండ్తో కీలక మ్యాచ్లో పాక్ ఓటమికి సల్మాన్ను బాధ్యుడిని చేస్తూ.. అతడి భార్య, కుమారుడిని అభ్యంతరకర రీతిలో పాక్ జట్టు అభిమానులు తిడుతూ పోస్టులు పెట్టారు.అంతేకాదు.. పాక్ గనుక సెమీస్ చేరకుంటే సల్మాన్తో పాటు అతడి కుటుంబం కూడా భూమ్మీద ఉండదంటూ ఇష్టారీతిన కామెంట్లు చేశారు. ఇలా అయితే పాక్ వరల్డ్కప్ గెలవదుఈ నేపథ్యంలో సల్మాన్ అలీ ఆఘా భార్య సబా మంజర్ ట్రోల్స్కు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ‘‘పాకిస్తానీ అభిమానులారా!... నన్ను లేదంటే.. మా అమాయకపు చిన్నారి కుమారుడిని దూషించడం ద్వారా మనం ప్రపంచకప్ గెలవలేము’’ అంటూ ఘాటుగా బదులిచ్చింది.కాగా ఇంగ్లండ్ చేతిలో ఓటమి తర్వాత సల్మాన్తో పాటు పాక్ జట్టులోని ఆటగాళ్లందరిపై నెట్టింట తిట్ల వర్షం కురుస్తోంది. ఇక పాక్ అభిమానులకు ఇదేమీ కొత్తకాదు. ముఖ్యంగా 1996 వరల్డ్కప్లో టీమిండియా చేతిలో ఓడిన తర్వాత.. పాక్ క్రికెటర్ల నివాసాలపై దాడులు జరిగాయి. నాటి కెప్టెన్ వసీం అక్రం ఇంటి మీద కూడా నిరసనకారులు దాడికి దిగారు.సెమీస్లో తొలి అడుగు ఇంగ్లండ్దేఇదిలా ఉంటే.. భారత్- శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7న మొదలైన టీ20 ప్రపంచకప్-2026లో సూపర్-8 దశ నడుస్తోంది. గ్రూప్-1 నుంచి టీమిండియా, సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్.. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక బరిలో ఉన్నాయి.సూపర్-8లో భాగంగా పాక్ తొలుత న్యూజిలాండ్తో తలపడాల్సి ఉండగా.. వర్షం వల్ల టాస్ పడకుండానే మ్యాచ్ రద్దైపోయింది. దీంతో ఇరుజట్లకు చెరోపాయింట్ వచ్చింది. ఇక ఇంగ్లండ్తో మ్యాచ్లో పాక్ తొలుత బ్యాటింగ్కు దిగి 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 164 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 19.1 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. గత మ్యాచ్లో శ్రీలంకపై.. తాజాగా పాక్పై గెలిచి సెమీస్లో అడుగుపెట్టింది ఇంగ్లండ్.చదవండి: NZ vs SL: కివీస్, శ్రీలంకలకు భారీ షాక్!.. పాక్కు గుడ్న్యూస్? -
అతడి గురించి బాధ లేదు.. సంజూ రావొచ్చు: టీమిండియా కోచ్
సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం తర్వాత టీమిండియా జింబాబ్వేతో తలపడేందుకు సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్-2026 సూపర్-8 దశలో భాగంగా ఇరుజట్ల మధ్య గురువారం మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఇందుకు వేదిక.ఈ నేపథ్యంలో జింబాబ్వేతో మ్యాచ్కు ముందు టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తుదిజట్టు కూర్పు గురించి ముఖ్యంగా.. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్ల గురించి కొటక్ కీలక వ్యాఖ్యలు చేశాడు.సంజూకు మొండిచేయికాగా ఇషాన్ కిషన్ రాకతో భారత టీ20 జట్టులో ఓపెనర్గా సంజూ శాంసన్ స్థానం గల్లైంతైన విషయం తెలిసిందే. లీగ్ దశలో అమెరికా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ మ్యాచ్లలో అభిషేక్ శర్మ- ఇషాన్ జోడీగా బరిలో దిగారు. అయితే, నమీబియాతో మ్యాచ్కు మాత్రం అభిషేక్ గైర్హాజరీలో సంజూ ఓపెనర్గా వచ్చాడు.తిలక్ వర్మ ఆట తీరుపై విమర్శలుమరోవైపు.. వన్డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ క్రీజులో నిలదొక్కుకునేందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. అతడి స్ట్రైక్రేటు కూడా దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో మ్యాచ్లో తిలక్ను తప్పించి సంజూను మూడో స్థానంలో ఆడించేందుకు యాజమాన్యం సుముఖంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.తిలక్ గురించి బాధ లేదుఈ పరిణామాల నేపథ్యంలో సితాన్షు కొటక్ మాట్లాడుతూ.. ‘‘తిలక్ వర్మ బ్యాటింగ్ గురించి మాకు ఎలాంటి సమస్య లేదు. పాకిస్తాన్తో మ్యాచ్లో అతడు చక్కగా ఆడాడు. రెండు, మూడు బౌండరీలు బాదితే అంతా అదే సర్దుకుంటుంది. అతడు బంతులు వృథా చేస్తున్నాడన్న అంశంలో మాకు ఎలాంటి ఆందోళనా లేదు.అభిషేక్ శర్మ గురించి కూడా మేము ఆందోళన చెందడం లేదు. సౌతాఫ్రికా చేతిలో భారీ ఓటమి గురించి కూడా పెద్దగా ఆందోళన లేదు. తదుపరి మ్యాచ్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్న అంశం మీదే మేము ప్రస్తుతం దృష్టి సారించాము.సంజూ రావొచ్చుప్రత్యర్థి జట్టు బౌలింగ్ను అర్థం చేసుకుని.. సరైన జవాబు ఇచ్చే విధంగా మా బ్యాటర్లు సంసిద్ధం అవుతున్నారు. ప్రణాళిక, సన్నాహకాలపైనే అంతా ఆధారపడి ఉంటుంది. అతడి (సంజూ) గురించి చర్చ నడుస్తోంది. అయితే, మేము ముందుగానే తుదిజట్టును నిర్ణయించబోము. అతడిని ఆడించే ఆలోచన లేదని మాత్రం చెప్పము’’ అని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు. అదే విధంగా.. వ్యక్తిగత కారణాల వల్ల జట్టును వీడిన రింకూ సింగ్ బుధవారం సాయంత్రం టీమ్తో కలుస్తాడని తెలిపాడు.సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతోఇదిలా ఉంటే.. లీగ్ దశలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్లపై గెలుపొంది అజేయంగా నిలిచింది టీమిండియా. అయితే, సెమీస్ దిశగా అడుగులు వేసే క్రమంలో ఊహించని రీతిలో సూపర్-8 తొలి మ్యాచ్లోనే ఘోరంగా ఓడిపోయింది. సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి సెమీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. తదుపరి జింబాబ్వే, వెస్టిండీస్లపై నెగ్గితేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.చదవండి: T20 WC 2026: పాక్ జట్టులో కలకలం -
T20 WC: కివీస్, లంకకు భారీ షాక్!.. పాక్కు గుడ్న్యూస్?
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఇప్పటికే రెండు మ్యాచ్లు వర్షార్ఫణం అయ్యాయి. లీగ్ దశలో పల్లెకెలె వేదికగా ఐర్లాండ్- జింబాబ్వే మ్యాచ్ వాన కారణంగా టాస్ పడకుండానే రద్దైంది. ఇక సూపర్-8 దశలో కొలంబో వేదికగా పాకిస్తాన్- న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ కూడా వర్షం వల్ల మొదలుకాకుండానే ముగిసిపోయింది.ఫలితంగా సెమీస్ రేసులో కీలకమైన సూపర్-8 దశలో ఇరుజట్లకు చెరో పాయింట్ వచ్చింది. దీంతో తదుపరి మ్యాచ్లు తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మరో ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి.కివీస్, లంకకు భారీ షాక్!సూపర్-8 గ్రూప్-2లో భాగంగా కివీస్ బుధవారం కొలంబో వేదికగా శ్రీలంకతో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో గెలిస్తే న్యూజిలాండ్ సెమీస్ అవకాశాలు మెరుగుపడతాయి. అయితే, ఈ మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించే సూచనలు ఉన్నాయి. ఆక్యూవెదర్ నివేదిక ప్రకారం.. మ్యాచ్ ఆరంభ సమయం (రాత్రి 7 గంటల) నుంచి తొమ్మిది గంటల వరకు వాన పడేందుకు 14 శాతం అవకాశాలు ఉన్నాయి.రాత్రి 10, 11 గంటల ప్రాంతంలో వర్షం పడేందుకు 49- 58 శాతం అవకాశాలు ఉన్నాయి. దీంతో కివీస్- శ్రీలంక మ్యాచ్ రద్దయిపోయేందుకు ఎక్కువ ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఒకవేళ వర్షం తెరిపినిస్తే ఇరుజట్లు కనీసం ఐదు ఓవర్లు ఆడే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కివీస్ జట్టుకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ఒకవేళ మ్యాచ్ రద్దైతే.. తదుపరి ఇంగ్లండ్తో మ్యాచ్లో తప్పక గెలవాలి. లేదంటే పాకిస్తాన్తో పోటీలో వెనుకబడే అవకాశం ఉంది.పాక్కు ఒక రకంగా శుభవార్తే!కాగా గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్.. శ్రీలంక, పాకిస్తాన్లను ఓడించి ఇప్పటికే సెమీస్కు అర్హత సాధించింది. రెండో స్థానం కోసం కివీస్, పాక్ మధ్య పోటీ నెలకొంది. కివీస్ శ్రీలంకతో పాటు ఇంగ్లండ్ను కూడా ఓడిస్తే నేరుగా సెమీస్ చేరుకుంటుంది.అలా కాక ఒక్క మ్యాచ్లో ఓడినా.. పాక్కు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఇక పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే.. శ్రీలంక, ఇంగ్లండ్ చేతుల్లో న్యూజిలాండ్ తప్పక ఓడిపోవాలి. అదే విధంగా శ్రీలంకపై పాక్ గెలవాల్సి ఉంటుంది. అలా కాకుండా.. న్యూజిలాండ్, పాకిస్తాన్ తదుపరి ఒక్కో మ్యాచ్లో గెలిస్తే.. పాయింట్ల సంఖ్య (3) సమానం అవుతుంది. అలాంటపుడు నెట్రన్రేటు కీలక పాత్ర పోషిస్తుంది. మరోవైపు.. శ్రీలంక రేసులో ఉండాలంటే న్యూజిలాండ్, పాకిస్తాన్లపై భారీ విజయాలు సాధించాలి.కాగా వరల్డ్కప్ టోర్నీకి భారత్తో పాటు శ్రీలంక ఆతిథ్యం ఇస్తోంది. కొన్నిరోజులుగా కొలంబో, పల్లెకెలెలో వర్షం పడటం.. శ్రీలంకలో మ్యాచ్లు ఆడే జట్లకు ఇబ్బందికరంగా మారింది. Update: NZ Vs SL: న్యూజీలాండ్ చేతిలో శ్రీలంక ఘోర పరాజయంచదవండి: T20 WC 2026: రింకూ సింగ్కు సంబంధించి బిగ్ అప్డేట్ -
అఫ్గనిస్తాన్ కొత్త హెడ్కోచ్గా అతడే.. ఏసీబీ ప్రకటన
అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టుకు కొత్త హెడ్కోచ్ వచ్చాడు. తాజా టీ20 ప్రపంచకప్ వరకు అఫ్గన్ జట్టుకు ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ జొనాథన్ ట్రాట్ కోచ్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే, టోర్నీ అనంతరం అతడు పదవి నుంచి దిగిపోయాడు.ట్రాట్ స్థానంలోఈ క్రమంలో ట్రాట్ స్థానంలో కొత్త హెడ్ కోచ్గా రిచర్డ్ పైబస్ను నియమించినట్లు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) తెలిపింది. వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి పైబస్ బాధ్యతలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ‘అఫ్గనిస్తాన్ జాతీయ జట్టుకు రిచర్డ్ పైబస్ను కొత్త హెడ్ కోచ్గా నియమించాం. శ్రీలంకతో సిరీస్ నుంచి అతడు జట్టుతో చేరతాడు’ అని ఏసీబీ పేర్కొంది. కోచ్గా మంచి రికార్డుఇక ఇంగ్లండ్కు చెందిన పైబస్ ఒకే ఒక్క లిస్ట్ ‘ఎ’ మ్యాచ్ ఆడాడు. అయితే, ఆటగాడిగా పెద్దగా అనుభవం లేకపోయినా... కోచ్గా మంచి రికార్డు ఉంది. పైబస్ 2013 నుంచి 2019 వరకు వెస్టిండీస్ జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరించాడు. అతడు విండీస్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా ఉన్న సమయంలోనే కరీబియన్ జట్లు పురుషుల, మహిళల, అండర్–19 వరల్డ్కప్ ట్రోఫీలు సాధించాయి. సూపర్-8 చేరకుండానేకాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్, యూఏఈ, కెనడాలతో తలపడ్డ అఫ్గనిస్తాన్.. నాలుగింటికి రెండే మ్యాచ్లు గెలిచింది. తద్వారా సూపర్-8 చేరకుండానే నిష్క్రమించింది. గత ఎడిషన్లో అఫ్గన్ జట్టు అనూహ్య రీతిలో సెమీస్ చేరిన సంగతి తెలిసిందే.చదవండి: T20 WC 2026: పాక్ జట్టులో కలకలం -
T20 WC 2026: రింకూ సింగ్కు సంబంధించి బిగ్ అప్డేట్
టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో టీమిండియా కీలక ఆటగాడు రింకూ సింగ్కు సంబంధించి బిగ్ అప్డేట్ అందుతుంది. రింకూ నిన్న తన తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో స్వస్థలమైన నోయిడాకు వెళ్లాడు. దీంతో అతను రేపటి (ఫిబ్రవరి 26) జింబాబ్వే మ్యాచ్కు అందుబాటులో ఉంటాడా లేదా అన్న సందిగ్దత నెలకొని ఉండింది.అయితే, ప్రస్తుతమందుతున్న సమాచారం ప్రకారం.. రింకూ రేపటి మ్యాచ్ కోసం చెన్నైకి (వేదిక) బయల్దేరినట్లు తెలుస్తుంది. మ్యాచ్ సమయానికి అతను అందుబాటులో ఉంటాడని సమాచారం. సెమీస్ నేపథ్యంలో రేపటి జింబాబ్వే మ్యాచ్ టీమిండియాకు అత్యంత కీలకం కావడంతో మేనేజ్మెంట్ రింకూ సేవలను కోల్పోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.ఇందులో భాగంగానే రింకూ ప్రయాణానికి (నోయిడా నుంచి చెన్నైకి) ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలుస్తుంది. రింకూ లోయర్ ఆర్డర్ బ్యాటింగ్లో అత్యంత కీలక ఆటగాడు. చివరి ఓవర్లలో అతను వేగంగా చేసే పరుగులు మెగా టోర్నీలో టీమిండియా భవిష్యత్తును నిర్ణయిస్తాయి. రింకూ లేని పక్షంలో మరో లోయర్ ఆర్డర్ బ్యాటర్ శివమ్ దూబేపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది జట్టు సమతుల్యతను దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టే టీమిండియా మేనేజ్మెంట్ రింకూను హుటాహుటిన చెన్నైకి పిలిపించినట్లు తెలుస్తుంది.కాగా, రింకూ తండ్రి ఏడాదికాలంగా స్టేజ్-4 లివర్ క్యాన్సర్తో పోరాడుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్పై ఉంచారు. ఈ పరిస్థితి కారణంగా రింకూ హుటాహుటిన నోయిడాకు వెళ్లాడు.సంజూ శాంసన్ పరిస్థితి ఏంటి..?రింకూ జట్టును వీడిన అనంతరం జింబాబ్వే మ్యాచ్లో సంజూ శాంసన్కు అవకాశం కల్పించాలని మేనేజ్మెంట్ భావించింది. అయితే రింకూ అందుబాటులోకి రావడంతో సంజూకు మొండిచెయ్యి తప్పదని తెలుస్తుంది. తొలుత అభిషేక్తో పాటు సంజూను ఓపెనర్గా పంపి, ఇషాన్ను వన్డౌన్లో ఆడించాలని మేనేజ్మెంట్ భావించిదట. అయితే రింకూ రీఎంట్రీతో సమీకరణలు మారేలా ఉన్నాయి. రింకూ జట్టులో చేరినా, సంజూకు అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తే మాత్రం తిలక్ వర్మపై వేటు పడవచ్చు. ముందుగా అనుకున్నట్లు అభిషేక్-సంజూ ఓపెనర్లుగా ఇషాన్ కిషన్ వన్డౌన్లో బరిలోకి దిగవచ్చు. అలాగే సౌతాఫ్రికా మ్యాచ్లో దారుణంగా విఫలమైన వాషింగ్టన్ సుందర్ను కూడా పక్కకు పెట్టి, అక్షర్ పటేల్ను జట్టులోకి తీసుకోవచ్చు.తుది జట్టు (అంచనా)..అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి -
T20 WC 2026: పాక్ జట్టులో కలకలం
పాక్ జట్టులో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది కోచ్ మైక్ హెస్సన్ను బహిరంగంగా టార్గెట్ చేశాడు. సూపర్-8 మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ హెస్సన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు."అవును, నన్ను నమీబియా మ్యాచ్ నుంచి తప్పించారు. అయినా నా దృష్టి ఎప్పటికీ బౌలింగ్పైనే ఉంటుంది. నాకు అవకాశం వచ్చినప్పుడు జట్టుకు 100 శాతం ఇవ్వడమే నా పని. ఎవరి ముందు నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు" అని అన్నాడు. అలాగే హెస్సన్ నిర్ణయాలపై వ్యంగ్యంగా మాట్లాడుతూ.. "ఆయనకు ఒక మైండ్సెట్ ఉంది. ఆయన హెడ్ కోచ్. జట్టును ఎలా నడిపించాలో ఆయనకే బాగా తెలుసు. దానికి ఆయనే బాధ్యత వహించాలి" అని వ్యాఖ్యానించారు. అఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యలు హెస్సన్పై అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది.అఫ్రిది ఎందుకిలా..?అఫ్రిది-హెస్సన్ మధ్య విభేదాలు ప్రస్తుత టీ20 వరల్డ్కప్లో నమీబియా మ్యాచ్ నుంచి మొదలయ్యాయి. భారత్తో మ్యాచ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడని అఫ్రిదిని హెస్సన్ నమీబియా మ్యాచ్ నుంచి తప్పించాడు. ఈ నిర్ణయాన్ని హెస్సన్ వ్యూహాల్లో భాగంగా పేర్కొన్నప్పటికీ, హెస్సన్ తనను ఉద్దేశపూర్వకంగానే పక్కకు పెట్టాడని అఫ్రిది భావిస్తున్నాడు. దీన్ని అవమానంగా భావించిన అఫ్రిది ఇంగ్లండ్ మ్యాచ్లో రాణించిన తర్వాత హెస్సన్పై పరోక్ష మాటల దాడికి దిగాడు.ఇంగ్లండ్ మ్యాచ్లో పాకిస్తాన్ ఓడినా, అఫ్రిది అద్భుతంగా రాణించాడు. 4 ఓవర్లలో 4 వికెట్లు తీసి మ్యాచ్పై ఆశలు కలిగించాడు. అయితే బ్రూక్ వన్ మ్యాన్ షోతో మ్యాచ్ను పాక్ చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. ఈ ఓటమితో పాక్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అంతకుముందు న్యూజిలాండ్తో జరగాల్సిన తొలి సూపర్-8 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పాక్ ఖాతాలో ప్రస్తుతం ఒక్క పాయింట్ మాత్రమే ఉంది. ఆ జట్టు తమ చివరి మ్యాచ్లో శ్రీలంకపై గెలిచినా, సెమీస్ బెర్త్ దక్కుతుందన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే, ప్రస్తుతం గ్రూప్-1 నుంచి ఖాళీగా ఉంది ఒకే ఒక బెర్త్. ఇంగ్లండ్ ఆడిన రెండు మ్యాచ్ల్లో గెలిచి దర్జాగా సెమీస్కు అర్హత సాధించగా.. న్యూజిలాండ్, పాక్, శ్రీలంక మిగిలిన బెర్త్ కోసం పోటీపడుతున్నాయి. -
టీ20 ప్రపంచకప్లో నేడు మరో సూపర్ మ్యాచ్
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 25) మరో సూపర్-8 మ్యాచ్ జరుగనుంది. ఆతిథ్య శ్రీలంకను న్యూజిలాండ్ కొలొంబో వేదికగా ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్లో గెలిస్తేనే ఇరు జట్లు సెమీస్ రేసులో ఉంటాయి. ఓడినా ఛాన్స్లు ఉంటాయి కానీ, అవకాశాలు చాలా సంక్లిష్టంగా మారతాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఈ మ్యాచ్ చాలా కీలకం.శ్రీలంక తొలి సూపర్ ఓవర్ మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఓడి సెమీస్ రేసులో చిట్టచివరి స్థానంలో ఉండగా.. పాక్తో జరగాల్సిన మ్యాచ్ రద్దై న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంది. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ సెమీస్ బెర్త్ ఖరారు కావడంతో మిగిలిన బెర్త్ కోసం న్యూజిలాండ్-పాక్-శ్రీలంక మధ్య త్రిముఖ పోటీ ఏర్పడింది.న్యూజిలాండే ఫేవరెట్నేటి మ్యాచ్లో ఏ జట్టుకు విజయావకాశాలు అధికంగా ఉన్నాయని పరిశీలిస్తే.. న్యూజిలాండే ఫేవరెట్ అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. గ్రూప్ దశలో ఈ జట్టు నాలుగింట మూడు మ్యాచ్ల్లో (సౌతాఫ్రికా మినహా) గెలిచింది. శ్రీలంక సైతం నాలుగింట మూడు మ్యాచ్ల్లోనే గెలిచినప్పటికీ (జింబాబ్వే మినహా).. బలాబలాల ప్రకారం న్యూజిలాండ్దే ఆధిక్యత కనిపిస్తుంది. గ్రూప్ దశలో ఆసీస్పై సంచలన విజయం సాధించినా, హోం అడ్వాంటేజ్ ఉన్నా.. బలాబలాలను పరిగణలోకి తీసుకుంటే న్యూజిలాండ్పై గెలవడం శ్రీలంకకు చాలా కష్టమనే చెప్పాలి.రికార్డులు కూడా ఇదే చెబుతున్నాయిఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలించినా, న్యూజిలాండ్దే అధిపత్యమని చెబుతున్నాయి. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 28 టీ20 మ్యాచ్లు జరగగా.. న్యూజిలాండ్ 16, శ్రీలంక 11 మ్యాచ్లు గెలిచాయి. ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు. శ్రీలంకలో జరిగిన మ్యాచ్ల్లోనూ న్యూజిలాండ్ ఆధిపత్యమే కనిపిస్తుంది. లంకలో ఇరు జట్లు 8 మ్యాచ్ల్లో తలపడగా.. న్యూజిలాండ్ 5, శ్రీలంక 3 మ్యాచ్ల్లో మాత్రమే గెలుపొందింది.తుది జట్లు (అంచనా)న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్(w), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), జేమ్స్ నీషమ్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, లాకీ ఫెర్గూసన్ శ్రీలంక: పతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, కుసల్ మెండిస్(w), పవన్ రత్నాయక్, కమిందు మెండిస్, దసున్ షనక(c), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ టీమ్
ఇంగ్లండ్ టీ20 జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. పొట్టి ప్రపంచకప్లో వరుసగా ఐదు ఎడిషన్లలో సెమీస్కు చేరిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం జరుగుతున్న 2026 ఎడిషన్లో సెమీస్కు చేరడం ద్వారా ఈ ఘనత సాధించింది. వరుసగా 2016, 2021, 2022, 2024, 2026 ఎడిషన్లలో ఫైనల్-4కు చేరింది. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంక పేరిట సంయుక్తంగా ఉండేది. పాక్ వరుసగా 2007, 2009, 2010, 2012 ఎడిషన్లలో సెమీస్కు చేరింది. శ్రీలంక వరుసగా 2009, 2010, 2012, 2014 ఎడిషన్లలో ఫైనల్-4కు అర్హత సాధించింది.తాజాగా ఎడిషన్లో సెమీస్కు చేరిన తొలి జట్టుగా నిలిచిన ఇంగ్లండ్.. తమ మూడో టైటిల్ దిశగా దూసుకుపోతుంది. 2010, 2022 ఎడిషన్లలో ఛాంపియన్గా నిలిచిన ఈ జట్టు.. తాజాగా పాక్పై సూపర్-8 మ్యాచ్లో గెలుపుతో గ్రూప్-2 నుంచి దర్జాగా సెమీస్కు చేరింది. అంతకుముందు ఇదే దశలో ఆతిథ్య శ్రీలంకపై కూడా గెలిచింది. చివరి సూపర్-8 మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడాల్సి ఉంది.మరోవైపు ఇంగ్లండ్ చేతిలో ఓటమితో పాక్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అధికారికంగా గ్రూప్-2 నుంచి రెండో సెమీస్ బెర్త్ కోసం న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక పోటీ పడుతున్నాయి. గ్రూప్-1లో సెమీస్ రేసులో వెస్టిండీస్, సౌతాఫ్రికా దూసుకుపోతున్నాయి. సౌతాఫ్రికా చేతిలో భారీ ఓటమితో ఈ గ్రూప్లో భారత్ సెమీస్ బెర్త్ కోసం పోరాడాల్సి ఉంటుంది. తదుపరి మ్యాచ్ల్లో టీమిండియా జింబాబ్వే, వెస్టిండీస్లతో తలపడాల్సి ఉంది.ఇదిలా ఉంటే, పల్లెకెలె వేదికగా నిన్న (ఫిబ్రవరి 24) జరిగిన మ్యాచ్లో పాక్పై ఇంగ్లండ్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం (51 బంతుల్లో 100; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) బాది ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. ఎవరి సహకారం లేకున్నా బ్రూక్ ఒక్కడే ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చాడు.చూడముచ్చటైన బౌండరీలు, భారీ సిక్సర్లతో అతను పాక్ బౌలర్లపై విరుచుకుపడిన తీరు కనులపండుగగా ఉండింది. 165 పరుగుల లక్ష్య ఛేదనలో 17 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును బ్రూక్ అద్వితీయ శతకంతో గెలుపు తీరాల వరకు చేర్చాడు. అతనికి విల్ జాక్స్ (28), సామ్ కర్రన్ (16) నామమాత్రంగా సహరించారు. బ్రూక్ శతక్కొట్టుడు కారణంగా ఇంగ్లండ్ 19వ ఓవర్ తొలి బంతికి విజయతీరాలు తాకింది (8 వికెట్ల నష్టానికి).అంతకుముందు సాహిబ్జాదా ఫర్హాన్ (63) రాణించడంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ (25), ఫకర్ జమాన్ (25), షాదాబ్ ఖాన్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
T20 WC 2026: మిల్లర్తో రీల్ చేసిన అమ్మాయికి రేప్ బెదిరింపులు
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో డేవిడ్ మిల్లర్ 35 బంతుల్లో 63 పరుగులు చేసి సౌతాఫ్రికా గెలుపుకు ప్రధాన కారకుడయ్యాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు.ఈ అవార్డు ప్రధానోత్సవం తర్వాత ఐసీసీ ఆహ్వానిత సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ప్రిన్సీ పారిఖ్ మిల్లర్తో ఓ రీల్ చేసింది. మిల్లర్ చుట్టూ తిరుగుతూ వ్యంగ్యంగా చప్పట్లు కొట్టింది. ఈ రీల్ను ఆమె తన సోషల్మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయగా మిశ్రమ స్పందన వచ్చింది. చాలామందికి ఈ రీల్ సరదాగా అనిపించగా.. కొందరికి మాత్రం నచ్చలేదు. ఫలితంగా పారిఖ్పై ఆన్లైన్ దాడులు జరిగాయి. ఫేస్బుక్లో రేప్ బెదిరింపులు, బాడీ షేమింగ్ కామెంట్లు వచ్చాయి.She posted this Instagram story after receiving backlash for her cringe reel. https://t.co/3cMjx42HK3 pic.twitter.com/0YUVM4RXRl— Bewda babloo 🧉 (@babloobhaiya3) February 24, 2026దీన్ని సీరియస్గా తీసుకున్న పారిఖ్.. ఇన్స్టాలో ఓ స్టోరీ పోస్ట్ చేస్తూ.. డేవిడ్ మిల్లర్తో చేసిన వీడియోని ఫేస్బుక్ నుంచి తొలగించాను. ఎందుకంటే వందలాది అసభ్యకరమైన కామెంట్లు, రేప్ బెదిరింపులు రావడం భరించలేకపోయానని పేర్కొన్నారు. అసభ్య కామెంట్లు పెట్టిన వారి అకౌంట్ల యూజర్నేమ్లు, మెసేజ్లు బయట పెడతానని అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. మున్ముందు ఎవరికీ ఇలాంటి బెదిరింపులు రాకూడదని రాసుకొచ్చారు. ప్రిన్సీ పారిఖ్ ఐసీసీ ఆహ్వానించిన ఇన్ఫ్లూయెన్సర్లలో ఒకరు. ఆమెకు ఇన్స్టాలో 1.7 మిలియన్లు, ఫేస్బుక్లో 30 వేల ఫాలోవర్లు ఉన్నారు. ఆమె గతంలో హార్దిక్ పాండ్యా, కేన్ విలియమ్సన్, స్మృతి మంధానతో కూడా రీల్స్ చేశారు.ఇదిలా ఉంటే, సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం తర్వాత భారత్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన రెండు మ్యాచ్ల్లో గెలిచినా సెమీస్కు చేరుతుందని చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే వెస్టిండీస్, సౌతాఫ్రికా తమతమ తొలి మ్యాచ్ల్లో భారీ విజయాలు సాధించి సెమీస్ రేసులో దూసుకుపోతున్నాయి. -
పాక్పై మ్యాచ్ విన్నింగ్ శతకం.. రికార్డుల మోత మోగించిన బ్రూక్
టీ20 వరల్డ్కప్ 2026లో నిన్న (ఫిబ్రవరి 24) జరిగిన సూపర్-8 పోరులో పాకిస్తాన్పై ఇంగ్లండ్ అద్భుత విజయం సాధించింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం (51 బంతుల్లో 100; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) బాది ఒంటిచేత్తో ఇంగ్లండ్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఎవరి సహకారం లేకున్నా బ్రూక్ ఒక్కడే ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చిన వైనం ప్రతి క్రికెట్ అభిమానిని ఆకట్టుకుంది.చూడముచ్చటైన బౌండరీలు, భారీ సిక్సర్లతో అతను పాక్ బౌలర్లపై విరుచుకుపడిన తీరు కన్నుల పండుగలా ఉండింది. 165 పరుగుల లక్ష్య ఛేదనలో 17 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును బ్రూక్ అద్వితీయ శతకంతో గెలుపు తీరాల వరకు చేర్చాడు. అతనికి విల్ జాక్స్ (28), సామ్ కర్రన్ (16) నామమాత్రంగా సహరించారు. బ్రూక్ మూడంకెల స్కోర్ తర్వాత ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో రెండంకెల స్కోర్ చేసింది జాక్స్, కర్రన్ మాత్రమే. బ్రూక్ శతక్కొట్టుడు కారణంగా ఇంగ్లండ్ 19వ ఓవర్ తొలి బంతికి విజయతీరాలు తాకింది (8 వికెట్ల నష్టానికి).ఈ మ్యాచ్ విన్నింగ్ శతకంతో బ్రూక్ రికార్డుల మోత మోగించాడు. తద్వారా తన జట్టును సెమీస్కు కూడా చేర్చాడు. బ్రూక్ సాధించిన ఆ రికార్డులు ఏంటంటే..?టీ20 వరల్డ్కప్లో ఇంగ్లండ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీహ్యారీ బ్రూక్- 50 బంతులు (తాజా మ్యాచ్లో)అలెక్స్ హేల్స్- 60జోస్ బట్లర్- 67టీ20 వరల్డ్కప్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన కెప్టెన్లుబ్రూక్- 100 (తాజా మ్యాచ్లో)క్రిస్ గేల్- 98 లోర్కాన్ టక్కర్- 94 నాటౌట్రోహిత్ శర్మ- 92ఈ సెంచరీతో బ్రూక్ ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. అతనికి ముందు జోస్ బట్లర్, డేవిడ్ మలాన్ ఈ ఘనత సాధించారు.కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో సెమీస్కు చేరిన తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. ఈ జట్టు సూపర్-8లో వరుసగా శ్రీలంక, పాకిస్తాన్పై విజయాలు సాధించి, దర్జాగా సెమీస్కు చేరింది. ఇంగ్లండ్ చేతిలో ఓటమితో పాక్ సెమీస్ అవకాశాలు దాదాపుగా కోల్పోయినట్లే. అధికారికంగా గ్రూప్-2 నుంచి రెండో సెమీస్ బెర్త్ కోసం న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక పోటీ పడతాయి. గ్రూప్-1లో సెమీస్ రేసులో వెస్టిండీస్, సౌతాఫ్రికా దూసుకుపోతున్నాయి. సౌతాఫ్రికా చేతిలో భారీ ఓటమితో ఆ గ్రూప్లో భారత్ సెమీస్ బెర్త్ను సంక్లిష్టం చేసుకుంది. -
తండ్రికి సీరియస్.. జట్టును వీడిన భారత పవర్ హిట్టర్
టీ20 ప్రపంచకప్-2026లో జింబాబ్వేతో సూపర్-8 మ్యాచ్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ వ్యక్తిగత కారణాలతో జట్టును వీడాడు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రింకూ హుటాహుటిన ఇంటికి బయలు దేరి వెళ్లిపోయాడు.దీంతో మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్కు రింకూ దూరమయ్యాడు. అతడు ఎప్పుడు తిరిగి వస్తాడన్నది కూడా స్పష్టత లేదు. రింకూ తండ్రి స్టేజ్-4 లివర్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఆయన ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలోని స్థానిక ఆస్పత్రిలో వెంటిటేలర్పై చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు అండగా ఉండేందుకు రింకూ జట్టును వీడాడు. కాగా ఈ మెగా టోర్నీలో రింకూకు ఎక్కువ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. 5 ఇన్నింగ్స్ల్లో కేవలం 24 పరుగులు చేశాడు. చాలా మ్యాచ్ల్లో ఆఖరి ఓవర్లలోనే క్రీజులోకి వచ్చాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్లో ముందుగానే బ్యాటింగ్కు వచ్చినప్పటికి.. డకౌటై పెవిలియన్కు చేరాడు.అయితే సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓటమి పాల్వడంతో టీమిండియా తమ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. దీంతో గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్ భారత్కు చాలా కీలకం. ఇటువంటి మ్యాచ్కు ముందు రింకూ జట్టును వీడడం గట్టి ఎదురు దెబ్బగానే చెప్పుకోవాలి. -
రాణించిన పాక్ బ్యాటర్లు.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?
టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా పల్లెకలే వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్లో పాకిస్తాన్ ఓ మోస్తారు స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.ఓపెనర్ సైమ్ అయూబ్(9), కెప్టెన్ సల్మాన్ అఘా(5) నిరాశపరిచినప్పటికి.. సాహిబ్జాదా ఫర్హాన్(63), ఫఖర్ జమాన్(25), బాబర్ ఆజం(25),షాదాబ్ ఖాన్(23) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో లైమ్ డాసన్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఓవర్టన్, జోఫ్రా అర్చర్ తలా రెండేసి వికెట్లు చోప్పున సాధించారు.తుది జట్లుఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్ -
ఇంగ్లండ్తో మ్యాచ్.. తొలుత బ్యాటింగ్ చేయనున్న పాక్
టీ20 ప్రపంచకప్-2026లో మరో రసవత్తర పోరుకు తెర లేచింది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా పల్లెకెలె వేదికగా పాకిస్తాన్,ఇంగ్లండ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ హైవోల్టేజ్ మ్యాచ్లో పాక్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఫహీమ్ అష్రాప్ స్ధానంలో షాహీన్ అఫ్రిది తుది జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్ మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు.తుది జట్లుఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్ -
రెండుకు రెండూ గెలిచినా సెమీస్ చేరడం కష్టమేనా..!
-
'గంభీర్ రాజకీయాలు చేస్తున్నాడు.. సూర్యతో కుల్దీప్కు గొడవ'
టీ20 ప్రపంచకప్-2026లో భారత జట్టు పరిస్థితి గందరగోళంగా మారింది. లీగ్ స్టేజిలో వరుస విజయాలతో అదరగొట్టిన మెన్ ఇన్ బ్లూ, కీలకమైన సూపర్-8 స్టేజిలో మాత్రం తేలిపోయింది. సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో ఘోర ఓటమి చవిచూసిన భారత్ .. తమ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.సెమీస్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్లలోనూ భారత్ కచ్చితంగా గెలవాల్సిందే. అంతేకాకుండా ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన ఓ ప్రయోగం బెడిసి కొట్టింది.అద్బుతమైన ఫామ్లో ఉన్న అక్షర్ పటేల్కు కాదని వాషింగ్టన్ సుందర్కు తుది జట్టులో ఛాన్స్ వచ్చారు. సుందర్ బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ విఫలమయ్యాడు. దీంతో గంభీర్పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గంభీర్పై పాకిస్తాన్ మాజీ ఓపెనర్ అహ్మద్ షెహజాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గౌతమ్ గంభీర్ వ్యవహారశైలి జట్టును దెబ్బతీస్తోందని అతడు అన్నాడు."గంభీర్ వ్యూహత్మక నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమయ్యాడు. తుది జట్టులో ఎక్కువ మంది ఎడమచేతి వాటం బ్యాటర్లను ఆడించాల్సిన అవసరం ఏముంది? గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రత్యర్థికి కలిసొచ్చింది. ఐడైన్ మార్క్రామ్ వంటి పార్ట్ టైమ్ బౌలర్ వచ్చి వికెట్ తీస్తే, అది జట్టుపై అనవసరమైన ఒత్తిడిని కచ్చితంగా పెంచుతోంది.భారత జట్టు వద్ద చాలా అప్షన్స్ ఉన్నాయి. అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. కానీ గంభీర్ ఆటగాళ్లను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వంటి మ్యాచ్ విన్నర్లను భారత్ సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుంది. పాకిస్తాన్తో మ్యాచ్ అనంతరం కుల్దీప్ యాదవ్ను సూర్య వెనక్కి నెట్టివేసిన వీడియో ఒకటి వైరలైంది.బహుశా సూర్యకుమార్తో ఉన్న గొడవ వల్లే కులదీప్ను తప్పించారని అందరూ అనుకుంటున్నారు. లేదంటే కుల్దీప్ లాంటి స్టార్ స్పిన్నర్ పక్కన పెట్టే ఛాన్సే లేదు. ఏదైనా రంగంలో రాణించాలంటే పూర్తి ఏకాగ్రత అవసరం. కానీ గంభీర్ రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల అతడి ఆలోచనా దృక్పథం పూర్తిగా మారిపోయింది.గంభీర్ రాజకీయాల్లో పెద్దగా రాణించలేక తిరిగి వెనక్కి వచ్చేశాడు. ఇప్పుడు అదే తరహా రాజకీయాలను టీమిండియాలో చేస్తున్నాడు. గంభీర్ తన సొంతప్రయోగాలతో భారత జట్టు ప్రతిష్టను దెబ్బ తీస్తున్నాడు" అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షెహజాద్ పేర్కొన్నాడు. -
టీ20 ప్రపంచకప్లో నేడు మరో ఆసక్తికర సమరం
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 24) మరో ఆసక్తికర సూపర్-8 సమరం జరుగనుంది. పల్లెకెలె వేదికగా పాకిస్తాన్, ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్ పాకిస్తాన్కు డూ ఆర్ డైగా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే పాక్ సెమీస్ రేసులో ఉంటుంది. లేకపోతే సెమీస్ అవకాశాలు చాలా సంక్లిష్టంగా మారతాయి. మరోపక్క ఇంగ్లండ్కు కూడా ఈ మ్యాచ్ కీలకమే. ఏ తలనొప్పి లేకుండా సెమీస్కు చేరాలనుకుంటే ఇంగ్లండ్ కూడా ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలి. శ్రీలంకపై తొలి సూపర్-8 మ్యాచ్లో గెలిచిన ఇంగ్లండ్ గ్రూప్-2 టాపర్గా ఉంది. ఆ మ్యాచ్లో భారీ తేడాతో గెలవడంతో ఆ జట్టు నెట్ రన్రేట్ (2.550) కూడా మెరుగ్గానే ఉంది. ఈ గ్రూప్ నుంచి తొలి సెమీస్ బెర్త్ దక్కించుకునే అవకాశాలు ప్రస్తుతానికి ఇంగ్లండ్కే అధికంగా ఉన్నాయి.పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన తొలి సూపర్-8 మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచి పెట్టుకుపోవడంతో ఇరు జట్లు చెరో పాయింట్ పొందాయి. ప్రస్తుతం ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్ చేతిలో ఓడిన శ్రీలంక -2.550 రన్రేట్తో పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది.హెడ్ టు హెడ్ రికార్డులుపాకిస్తాన్-ఇంగ్లండ్ ఇప్పటివరకు 30 టీ20ల్లో ఎదురెదురుపడ్డాయి. ఇందులో ఇంగ్లండ్ 21, పాక్ కేవలం 9 మ్యాచ్ల్లో నెగ్గాయి. టీ20 ప్రపంచకప్లో ఇరు జట్ల మధ్య చివరిగా జరిగిన మూడు మ్యాచ్ల్లో కూడా ఇంగ్లండే పైచేయి సాధించింది. ఇందులో 2022 ఎడిషన్ ఫైనల్ కూడా ఉంది.పిచ్ కూడా వారికి అనుకూలమే..!ఈ మ్యాచ్ జరుగనున్న పల్లెకెలె పిచ్ కూడా ఇంగ్లండ్కు అనుకూలంగానే ఉంది. ఈ వేదికపై ఆ జట్టు తొలి సూపర్-8 మ్యాచ్లో ఆతిథ్య జట్టునే చిత్తు చేసింది. దీనికి ముందు ఇదే వేదికపై లంకతో ద్వైపాక్షిక సిరీస్లో టీ20 మ్యాచ్లు ఆడిన అనుభవం కూడా ఉంది. ఇది ఇంగ్లీష్ ఆటగాళ్లకు బాగా కలిసొస్తుంది. మరోపక్క పాక్ ఈ వేదికపై ఇటీవలికాలంలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ పిచ్ పరిస్థితులపై కూడా ఆ జట్టుకు అవగాహణ లేదు. ఎటు చూసినా నేటి మ్యాచ్లో ఇంగ్లండే హాట్ ఫేవరెట్గా కనిపిస్తుంది.. పాక్తో పోలిస్తే ఇంగ్లండ్ ప్రస్తుత టోర్నీలో మెరుగైన ఫామ్లో ఉంది. గ్రూప్ దశలో స్కాట్లాండ్, ఇటలీ, నేపాల్పై విజయాలు సాధించి సూపర్-8లోకి అడుగుపెట్టింది. పాక్ విషయానికొస్తే.. ఈ జట్టు కూడా గ్రూప్ దశలో 3 విజయాలు సాధించి, సూపర్-8లోకి ప్రవేశించినా.. తమకంటే చిన్న జట్లపై గెలిచేందుకు పాక్ ప్లేయర్లు ఆపసోపాలు పడ్డారు. ఈ పరిస్థితుల్లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.తుది జట్లు (అంచనా)..ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వారం), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్ (సి), సామ్ కర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్పాకిస్తాన్: సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ అఘా (c), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్ (wk), షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్ -
T20 WC 2026: జింబాబ్వే ప్లేయర్ వరల్డ్ రికార్డు
జింబాబ్వే రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ బ్రాడ్ ఈవాన్స్ పొట్టి క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరుసగా 28 ఇన్నింగ్స్ల్లో వికెట్ తీసిన తొలి బౌలర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా వెస్టిండీస్తో నిన్న (ఫిబ్రవరి 24) జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు.గతంలో ఈ రికార్డు శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ, ఐర్లాండ్ పేసర్ మార్క్ అదైర్ పేరిట ఉండేది. మలింగ, అదైర్ వరుసగా 27 టీ20 ఇన్నింగ్స్ల్లో కనీసం ఓ వికెటైనా తీశారు. తాజాగా ఈవాన్స్.. మలింగ, అదైర్ పేరిట సంయుక్తంగా ఉండిన రికార్డును బద్దలు కొట్టాడు.ఈ రికార్డుకు సంబంధించి ఈవాన్స్, మలింగ, అదైర్ను సమీపించేందుకు పాకిస్తాన్ వివాదాస్పద బౌలర్ ఉస్మాన్ తారిక్ అతి సమీపంలో ఉన్నాడు. తారిక్ ఇప్పటివరకు వరుసగా 25 ఇన్నింగ్స్ల్లో కనీసం ఓ వికెటైన తీశాడు.వెస్టిండీస్-జింబాబ్వే మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. హెట్మైర్ (85), రోవ్మన్ పావెల్ (59), రూథర్ఫోర్డ్ (31 నాటౌట్), షెపర్డ్ (21), హోల్డర్ (13) విధ్వంసకర ఇన్నింగ్స్లతో విరుచుకుపడ్డారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే 17.4 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. బ్రాడ్ ఈవాన్స్ (43), నగరవ (7 నాటౌట్) చివరి వికెట్కు 44 పరుగులు జోడించి జింబాబ్వేను 100 పరుగుల మార్కును దాటించారు. మోటీ (4-1-28-4), అకీల్ హొసేన్ (4-1-28-3) తమ స్పిన్ మాయాజాలంతో జింబాబ్వే పతనాన్ని శాశించారు. -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన జింబాబ్వే ఆటగాళ్లు
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 24) జరిగిన సూపర్-8 మ్యాచ్లో జింబాబ్వేపై వెస్టిండీస్ 107 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో జింబాబ్వే ఓడినా, ఆ జట్టు ఆటగాళ్లు ఓ ప్రపంచకప్ రికార్డును సాధించారు. ఓటమి ఖరారైన వేల బ్రాడ్ ఈవాన్స్-రిచర్డ్ నగరవ పదో వికెట్కు 44 పరుగులు జోడించి, ప్రపంచకప్ చరిత్రలో పదో వికెట్కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా నిలిచారు.సిక్సర్లతో విరుచుకుపడ్డారుజింబాబ్వే ఓటమి ఖరారయ్యాక ఈవాన్స్, నగరవ సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ఈవాన్స్ 5, నగరవ ఓ సిక్సర్తో విధ్వంసం సృష్టించారు. షమార్ జోసఫ్ వేసిన 17వ ఓవర్లో ఈవాన్స్ మూడు సిక్సర్లు బాదాడు. అంతకుముందు జేసన్ హోల్డర్ వేసిన 16వ ఓవర్లోనూ రెండు సిక్సర్లు కొట్టాడు. దీనికి ముందు ఓవర్ చివరి బంతికి నగరవ ఓ సిక్సర్ బాదాడు.ప్రపంచకప్ రికార్డుఈ మ్యాచ్లో మరో ప్రపంచకప్ రికార్డు కూడా నమోదైంది. ఇరు జట్లు కలిపి ఏకంగా 31 సిక్సర్లు బాదాయి. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఓ మ్యాచ్లో నమోదైన అత్యధిక సిక్సర్లు ఇవే. గతంలో ఈ రికార్డు 2014 ఎడిషన్ నెదర్లాండ్స్-ఐర్లాండ్ మ్యాచ్ పేరిట ఉండేది. ఆ మ్యాచ్లో 30 సిక్సర్లు నమోదయ్యాయి.ముగిసిన జైత్రయాత్రఈ మ్యాచ్లో జింబాబ్వే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ కూడా ఓ ప్రపంచకప్ రికార్డును సొంతం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు (180) చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్లో 5 పరుగుల వద్ద ఔట్ కావడంతో ప్రస్తుత ప్రపంచకప్లో బెన్నెట్ అజైత్రయాత్ర ముగిసింది. ఈ మ్యాచ్కు ముందు బెన్నెట్ 3 ఇన్నింగ్స్ల్లో 175 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు.కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. హెట్మైర్ (85), రోవ్మన్ పావెల్ (59), రూథర్ఫోర్డ్ (31 నాటౌట్), షెపర్డ్ (21), హోల్డర్ (13) విధ్వంసకర ఇన్నింగ్స్లతో విరుచుకుపడ్డారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే 17.4 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. బ్రాడ్ ఈవాన్స్ (43), నగరవ (7 నాటౌట్) చివరి వికెట్కు 44 పరుగులు జోడించి జింబాబ్వేను 100 పరుగుల మార్కును దాటించారు. మోటీ (4-1-28-4), అకీల్ హొసేన్ (4-1-28-3) తమ స్పిన్ మాయాజాలంతో జింబాబ్వే ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. -
T20 WC 2026: టీమిండియాను భారీ దెబ్బ కొట్టిన వెస్టిండీస్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 23) జరిగిన సూపర్-8 మ్యాచ్లో జింబాబ్వేపై వెస్టిండీస్ 107 పరుగుల భారీ తేడాతో తిరుగులేని విజయం సాధించింది. ఈ గెలుపుతో విండీస్ గ్రూప్-1లో అగ్రస్థానానికి చేరుకోవడంతో పాటు అదే గ్రూప్లో ఉన్న టీమిండియాను భారీ దెబ్బ కొట్టింది. అదేంటని అనుకుంటున్నారా..?ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసి 254 పరుగుల భారీ స్కోర్ చేసిన విండీస్.. ఆతర్వాత జింబాబ్వేను 147 పరుగులకే పరిమితం చేసి నెట్ రన్రేట్ను (5.350) భారీగా కూడగట్టుకుంది. ఈ రన్రేటే భారత్ కొంపముంచేలా ఉంది. తొలి మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో ఘోర ఓటమి తర్వాత మన జట్టు రన్రేట్ -3.800లో పడి పోగా.. సౌతాఫ్రికా రన్ రేట్ 3.800 వద్ద కూర్చుంది.ఈ గ్రూప్ నుంచి సెమీస్కు చేరే అవకాశాలు రెండు జట్లకు మాత్రమే ఉంటాయి. తొలి మ్యాచ్లో గెలిచి భారీ రన్ రేట్ కూడగట్టుకున్న విండీస్, సౌతాఫ్రికా సెమీస్ రేసులో ముందున్నాయి. భారత్, జింబాబ్వే మైనస్ రన్ రేట్లతో సెమీస్ రేసులో భారీగా వెనుకపడి పోయాయి. భారత్ సెమీస్కు చేరాలంటే తదుపరి జరిగే రెండు సూపర్-8 మ్యాచ్ల్లో (జింబాబ్వే, విండీస్) భారీ తేడాతో గెలవాలి. ఇలా గెలిచినా సెమీస్కు చేరుతుందన్న గ్యారెంటీ లేదు.ఎందుకంటే విండీస్ రన్ రేట్ విషయంలో కొండెక్కి కూర్చుంది. తదుపరి రెండు మ్యాచ్ల్లో (సౌతాఫ్రికా, భారత్) ఆ జట్టు ఏ ఒక్క మ్యాచ్ గెలిచినా దర్జాగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. మరోపక్క భారత్పై గెలిచి సౌతాఫ్రికా ఇప్పటికే మరో సెమీస్ బెర్త్పై కర్చీఫ్ వేసుకొని కూర్చుంది. ఆ జట్టు తదుపరి రెండు మ్యాచ్ల్లో తమ కంటే బలహీనమైన జింబాబ్వే, విండీస్తో పోటీ పడుతుంది. ఒకవేళ విండీస్తో ఓడినా, జింబాబ్వేపై గెలిస్తే.. మరో సెమీస్ బెర్త్ సౌతాఫ్రికా వశమవుతుంది.ఈ లెక్కన ప్రస్తుత పరిస్థితి చూస్తే, భారత్కు సెమీస్ బెర్త్ దక్కడం చాలా కష్టంగా కనిపిస్తుంది. భారత్ సెమీస్కు చేరాలంటే.. జింబాబ్వే, విండీస్పై భారీ విజయాలు సాధించడంతో పాటు సౌతాఫ్రికా, వెస్టిండీస్ తలో మ్యాచ్లో అయినా ఓడాలి. అప్పుడు కూడా భారత్కు సెమీస్ బెర్త్ దక్కుతుందని గ్యారెంటీగా చెప్పలేని పరిస్థితి.ఉదాహరణకు సౌతాఫ్రికా విండీస్ చేతిలో ఓడి, జింబాబ్వేపై గెలిస్తే.. వారి ఖాతాలో నాలుగు పాయింట్లతో పాటు మంచి రన్ రేట్ ఉంటుంది. విండీస్ భారత్ చేతిలో ఓడి, సౌతాఫ్రికాపై ఓ మోస్తరు విజయం సాధించినా.. ఆ జట్టు ఖాతాలో కూడా నాలుగు పాయింట్లు, మంచి రన్రేట్ ఉంటుంది. ఇలా జరిగి, భారత్.. జింబాబ్వే, విండీస్పై విజయాలు సాధించినా.. విండీస్, సౌతాఫ్రికా రన్రేట్ను అధిగమిస్తుందన్న గ్యారెంటీ లేదు.ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ సెమీస్కు చేరాలంటే ఒక్క సమీకరణకు మాత్రమే అధిక అవకాశాలు ఉన్నాయి. అదేంటంటే.. భారత్.. జింబాబ్వే, విండీస్పై భారీ విజయాలు సాధించాలి. మరోపక్క విండీస్.. సౌతాఫ్రికా చేతిలో కూడా ఓడాలి. అప్పుడు సౌతాఫ్రికా, భారత్ సెమీస్కు చేరుకుంటాయి.అనుకోవడానికి ఇది బాగానే ఉన్నా, ప్రస్తుతం విండీస్ ఉన్న ఫామ్ను పరిగణలోకి తీసుకుంటే ఇది జరిగే పని కాకపోవచ్చు. విండీస్ ఈ ప్రపంచకప్లో వరుసగా ఐదు మ్యాచ్ల్లో గెలిచి మాంచి జోష్లో ఉంది. తదుపరి వారు ఆడబోయే సౌతాఫ్రికా, భారత్ మ్యాచ్ల్లోనూ ఇది కొనసాగవచ్చు. ఇందులో ఏ ఒక్క మ్యాచ్లో విండీస్ గెలిచినా భారత్ మూడో పొట్టి ప్రపంచకప్ కల కల్లగా మారిపోతుంది. మొత్తంగా వెస్టిండీస్.. జింబాబ్వేపై భారీ తేడాతో గెలిచి భారత్ సెమీస్ అవకాశాలను చాలా సంక్లిష్టం చేసేసింది. ఫిబ్రవరి 26న జరిగే వెస్టిండీస్-సౌతాఫ్రికా మ్యాచ్ తర్వాత సెమీస్ బెర్త్లపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ మ్యాచ్లో ఏ జట్టు గెలిచినా, గ్రూప్-1 నుంచి ఓ సెమీస్ బెర్త్ ఖరారైపోతుంది. రెండో బెర్త్ కోసం సౌతాఫ్రికా, భారత్, జింబాబ్వే పోటీ పడాల్సి ఉంటుంది. విండీస్ చేతిలో భారీ తేడాతో ఓడినా, జింబాబ్వేకు కూడా ఇంకా సెమీస్ అవకాశాలు సజీవంగా ఉన్నాయి. ఆ జట్టు తదుపరి రెండు మ్యాచ్ల్లో భారత్, సౌతాఫ్రికాపై ఘన విజయాలు సాధించాలి. అసాధ్యమని చెప్పలేము కానీ, ఇది సాధ్యపడటం మాత్రం చాలా కష్టమే. -
WI vs ZIM: హెట్మైర్ ‘సూపర్’ షో
టాస్ నెగ్గగానే జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా బౌలింగ్ ఎంచుకొని మొదటి తప్పు చేశాడు. హెట్మైర్ బ్యాటింగ్కు దిగగానే 9 పరుగుల వద్ద ముసెకివా సులువైన క్యాచ్ నేలపాలు చేసి ముప్పుతెచ్చాడు. ఇది మ్యాచ్నే మార్చేసింది. వాంఖడేను మురిపించింది. ప్రేక్షకుల్ని మెరుపులతో ముంచెత్తింది. ఈ ప్రపంచకప్లో అసలైన టి20 విందునిచ్చింది. ‘సూపర్–8’లో విండీస్కు భారీ విజయాన్నిచ్చింది. ముంబై: వెస్టిండీస్ విధ్వంసం... జింబాబ్వే విలాపం... ఈ టి20 ప్రపంచకప్కే మెరుపుల ‘షో’కులద్దిన ‘సూపర్–8’ మ్యాచ్లో కరీబియన్ జట్టు 107 పరుగులతో తేడాతో జింబాబ్వేపై భారీ విజయాన్ని నమోదుచేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన వెస్టిండీస్ నిరీ్ణత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెట్మైర్ (34 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్స్లు), రోవ్మన్ పావెల్ (35 బంతుల్లో 59; 4 ఫోర్లు, 4 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఎన్గరవ, ముజరబాని చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత కొండంత లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసిన జింబాబ్వే 17.4 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. ఇవాన్స్ (21 బంతుల్లో 43; 2 ఫోర్లు, 5 సిక్స్లు) రాణించాడు. గుడకేశ్ మోతీ (4/28), హోసిన్ (3/28) వెన్నువిరిచారు. తమ తదుపరి ‘సూపర్–8’ పోటీల్లో 26న దక్షిణాఫ్రికాతో వెస్టిండీస్; అదేరోజు భారత్తో జింబాబ్వే ఆడతాయి. హెట్ ‘ఫైర్’ ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (9), షై హోప్ (14) వికెట్లను కోల్పోయిన విండీస్ హెట్మైర్, పావెల్ ధనాధన్ భాగస్వామ్యంతో శరవేగంగా దూసుకెళ్లింది. క్రిమర్ వేసిన ఏడో ఓవర్లో 2 వరుస సిక్స్లు కొట్టిన హెట్మైర్... రజా వేసిన మరుసటి ఓవర్లో మూడు సిక్స్లు బాదేశాడు. దీంతోనే అతను 19 బంతుల్లో టి20 ప్రపంచకప్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన కరీబియన్ బ్యాటర్గా రికార్డును నెలకొల్పాడు. హెట్మైర్ బాదిన మొత్తం 7 సిక్స్ల్లో ఐదింటిని ఈ రెండు ఓవర్లలోనే కొట్టడం విశేషం! హెట్మైర్ విధ్వంసరచనకు కారణమైన ముసెకివా మళ్లీ అతను 70 పరుగుల వద్ద కొట్టిన షాట్ను రెండోసారి క్యాచ్ పట్టలేకపోయాడు. మరోవైపు పావెల్ 29 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. ఇద్దరు కలిసి మూడో వికెట్కు కేవలం 52 బంతుల్లోనే 122 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. వీళ్లిద్దరు అవుటయ్యాక రూథర్ఫోర్డ్ (13 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు), షెఫర్డ్ (10 బంతుల్లో 21; 3 సిక్స్లు), హోల్డర్ (4 బంతుల్లో 13; 2 సిక్స్లు) దంచేయడంతో విండీస్ సులువుగా 250 పరుగుల్ని దాటేసింది. హెట్మైర్జింబాబ్వే విలవిల ఆ్రస్టేలియా, శ్రీలంకలాంటి మేటి జట్లను ఓడించి సూపర్–8కు చేరుకున్న జింబాబ్వే... విండీస్ ఆల్రౌండ్ ప్రదర్శనకు కుదేలైంది. 20 పరుగుల వద్దే మరుమని (14), బెనెట్ (5), బర్ల్ (0) వికెట్లను కోల్పోయింది. కాస్త కుదుటపడి 50 స్కోరును దాటగానే గుడకేశ్ మోతీ చావుదెబ్బ తీయడంతో 103 పరుగులకే 9 వికెట్లను కోల్పోయి ఓటమికి చేరువైంది. మైయెర్స్ (28), కెప్టెన్ రజా (27) మెరుగ్గా ఆడారంతే! ఆఖరి వికెట్ ఎన్గరవ (7 నాటౌట్) అండతో బ్రాడ్ ఇవాన్స్ కాసేపు చెల రేగడంతో జింబాబ్వే పరాజయం ఆలస్యమైంది.స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: బ్రాండన్ కింగ్ (సి) ముసెకివా (బి) ఎన్గరవ 9; షై హోప్ (సి) బెనెట్ (బి) ఇవాన్స్ 14; హెట్మైర్ (సి) బెనెట్ (బి) క్రిమర్ 85; పావెల్ (సి) ముసెకివా (బి) ముజరబాని 59; రూథర్ఫోర్డ్ (నాటౌట్) 31; షెఫర్డ్ (సి) బర్ల్ (బి) ఎన్గరవ 21; హోల్డర్ (సి) మున్యొంగా (బి) ముజరబాని 13; ఫోర్డ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 21; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 254. వికెట్ల పతనం: 1–17, 2–54, 3–176, 4–194, 5–229, 6–248. బౌలింగ్: ఎన్గరవ 4–0–47–2, ముజరబాని 4–0–42–2, ఇవాన్స్ 4–0–46–1, క్రిమర్ 4–0–38–1, రజా 3–0–52–0, మైయెర్స్ 1–0–19–0. జింబాబ్వే ఇన్నింగ్స్: మరుమని (సి) హెట్మైర్ (బి) ఫోర్డ్ 14; బెనెట్ (బి) హోసిన్ 5; మైయెర్స్ (బి) మోతీ 28; బర్ల్ (సి) హెట్మైర్ (బి) హోసిన్ 0; రజా (బి) మోతీ 27; మున్యొంగా (సి) జోసెఫ్ (బి) మోతీ 14; ముసెకివా (బి) మోతీ 0; ఇవాన్స్ (సి) హోసిన్ (బి) ఫోర్డ్ 43; క్రిమర్ (సి అండ్ బి) హోల్డర్ 0; ముజరబాని (సి) జోసెఫ్ (బి) హోసిన్ 0; ఎన్గరవ నాటౌట్ 7; ఎక్స్ట్రాలు 9; మొత్తం (17.4 ఓవర్లలో ఆలౌట్) 147. వికెట్ల పతనం: 1–20, 2–20, 3–20, 4–52, 5–94, 6–94, 7–101, 8–102, 9–103, 10–147. బౌలింగ్: హోసిన్ 4–1–28–3, ఫోర్డ్ 3.4–0–27–2, మోతీ 4–1–28–4, జోసెఫ్ 3–0–35–0, హోల్డర్ 3–0–25–1. -
వెస్టిండీస్ బ్యాటర్ల విధ్వంసం.. ఏకంగా 254 పరుగుల భారీ స్కోర్
టీ20 ప్రపంచకప్-2026లో వాంఖడే స్టేడియం వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్లో వెస్టిండీస్ బ్యాటర్లు జూలు విధిల్చారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఓపెనర్లు బ్రాండెన్ కింగ్(9), షాయ్ హోప్(14) విఫలమైనప్పటికి.. మిడిలార్డర్ బ్యాటర్లు మాత్రం విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా షెమ్రాన్ హెట్మైర్ అయితే జింబాబ్వే బౌలర్లను ఉతికారేశాడు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడిన హెట్మైర్ కేవలం బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు.మొత్తంగా 34 బంతులు మాత్రమే ఎదుర్కొన్న హెట్మైర్.. 7 ఫోర్లు, 7 సిక్స్లతో 85 పరుగులు చేశాడు. అతడితో పాటు రావ్మన్ పావెల్(59), రూథర్ ఫర్డ్(31), షెఫర్డ్(21) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. జింబాబ్వే బౌలరల్లో నగారవ, ముజర్బానీ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. క్రీమర్, ఎవెన్స్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా టీ20 వరల్డ్కప్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్ కావడం విశేషం. -
చరిత్ర సృష్టించిన హెట్మైర్.. ఫాస్టెస్ట్ ఫిప్టీ
టీ20 ప్రపంచకప్-2026లో వాంఖడే స్టేడియం వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్లో వెస్టిండీస్ పవర్ హిట్టర్ షిమ్రాన్ హెట్మైర్ విధ్వంసం సృష్టించాడు. విండీస్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో క్రీజులోకి వచ్చిన హెట్మైర్ తన ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బౌండరీలు బాదడం మొదలు పెట్టాడు.జింబాబ్వే బౌలర్లను ఉతికారేశాడు. ముఖ్యంగా కెప్టెన్ సికిందర్ రజాకు అయితే చుక్కలు చూపించాడు. 8వ ఓవర్ వేసిన రజా బౌలింగ్లో హెట్మైర్ ఏకంగా మూడు సిక్స్లతో 20 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో హెట్మైర్ కేవలం 19 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. తద్వారా హెట్మైర్ టీ20 ప్రపంచకప్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన విండీస్ ఆటగాడిగా తన రికార్డును తానే మళ్లీ తిరగరాశాడు.వెస్టిండీస్ తరపున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా తన రికార్డును తానే మళ్లీ తిరగరాశాడు. ఇదే టోర్నీలోహెట్మైర్ స్కాట్లాండ్పై 22 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇప్పుడు కేవలం 19 బంతుల్లోనే ఆర్ధం శతకం బాదేశాడు.ఓవరాల్గా ఈ మ్యాచ్లో కేవలం 34 బంతులు మాత్రమే ఎదుర్కొన్న హెట్మైర్.. 7 ఫోర్లు, 7 సిక్స్లతో 85 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్లో రెండు సార్లు హెట్మైర్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రెండు సులువైన క్యాచ్లను జింబాబ్వే ఫీల్డర్లు జారవిడిచారు. ఇందుకు జింబాబ్వే భారీ మూల్యం చెల్లించుకోంది. -
అతడొక అద్భుతం.. కానీ: పాక్ మాజీ క్రికెటర్ యూటర్న్
టీమిండియా విధ్వంసకర ఓపెనర్గా పేరొందిన అభిషేక్ శర్మ.. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో మాత్రం తేలిపోతున్నాడు. కెరీర్లో తొలిసారి వరల్డ్కప్ ఈవెంట్లో ఆడుతున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్కు వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.హ్యాట్రిక్ డకౌట్లులీగ్ దశలో అమెరికా, పాకిస్తాన్, నెదర్లాండ్స్లతో ఆడిన మ్యాచ్లలో అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ అభిషేక్ బ్యాటింగ్ శైలిని విమర్శించాడు. కేవలం పవర్ హిట్టింగ్పైనే ఆధారపడతాడని.. అతడి టెక్నిక్ సరిగ్గా లేదని అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా అతడిని ‘స్లాగర్’గా అభివర్ణించాడు.పరుగులు చేయాలనే తొందరలో వికెట్ పారేసుకుంటున్నాడని.. టెక్నిక్తో ఆడటం అతడికి చేతకాదని ఆమిర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దీంతో టీమిండియా అభిమానులు అతడిపై ఫైర్ అయ్యారు. అభిషేక్ శర్మ టీ20 ర్యాంకింగ్స్లో ప్రస్తుతం ప్రపంచ నంబర్వన్ బ్యాటర్ అని.. ఆటగాడి కెరీర్లో ఎత్తుపల్లాలు సహజమంటూ భారత ఆటగాడికి మద్దతుగా నిలిచారు.మరోసారి విఫలంఇక సూపర్-8 దశలో తొలి మ్యాచ్లోనూ అభిషేక్ శర్మ విఫలమయ్యాడు. సౌతాఫ్రికాతో ఆదివారం నాటి పోరులో ఈ ఓపెనింగ్ బ్యాటర్.. 12 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, ఒక సిక్స్ బాది 15 పరుగులు చేశాడు. మార్కో యాన్సెన్ బౌలింగ్లో కార్బిన్ బాష్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.ఆమిర్ యూటర్న్!ఈ నేపథ్యంలో మహ్మద్ ఆమిర్ మరోసారి అభిషేక్ శర్మ గురించి వ్యాఖ్యలు చేశాడు. తన మాటలను అందరూ అపార్థం చేసుకున్నారంటూ యూటర్న్ తీసుకున్నాడు. ‘‘బౌలర్ వైపు నుంచి నేను అభిషేక్ శర్మ ఆటను విమర్శించాను. అతడి టెక్నిక్ గురించి మాత్రమే నేను మాట్లాడాను.కానీ నేను స్లాగర్ అన్న పదం వాడటం చాలా మందికి నచ్చలేదు. పటిష్ట జట్టు, బౌలర్లను ఎదుర్కోవాల్సి వచ్చినపుడు కాస్త ఓపికగా ఉండాలని చెప్పాను. ఎందుకంటే అభిషేక్ శర్మ బలహీనత ఏమిటో అందరికీ తెలిసిపోయింది. వాళ్లు అతడిని ఈజీగా ట్రాప్ చేయగలరు.అద్భుతమైన నైపుణ్యాలు.. కానీతాజా మ్యాచ్లో అతడు పద్నాలుగు పరుగులను ఒకే వైపు నుంచి రాబట్టాడు. అవి కూడా చెత్త బంతుల ద్వారా వచ్చిన పరుగులే. రబడ బౌలింగ్ మొదలుపెట్టాగానే.. అభిషేక్ శర్మ తెల్లముఖం వేశాడు.సీనియర్ ఆటగాడిగా నేను అభిషేక్ శర్మకు ఓ సలహా ఇస్తున్నా. నీ టెక్నిక్ గురించి ప్రత్యర్థులకు తెలిసిపోయింది. కాస్త ఓపికగా ఉండి.. బంతి ఎలా వస్తుందో అర్థం చేసుకుని ఆడితే నువ్వు మళ్లీ మునుపటిలా విజృంభించగలవు.అతడికి అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయి. అయితే, వాటిని అతడు ఎలా ఉపయోగించుకుంటాడన్న దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. నేను చెప్పాలనుకుంది ఇదే. కానీ చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు’’ అని మహ్మద్ ఆమిర్ చెప్పుకొచ్చాడు. చదవండి: కెప్టెన్, హెడ్కోచ్ ఏం చేస్తున్నారు?.. భారత మాజీ క్రికెటర్ ఆగ్రహం -
వెస్టిండీస్తో మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జింబాబ్వే
టీ20 ప్రపంచకప్-2026 సూపర్-8లో భాగంగా ముంబై వేదికగా వెస్టిండీస్, జింబాబ్వే జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ సూపర్-8 పోరులో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి.జింబాబ్వే జట్టులోకి నగరవ రాగా.. విండీస్ జట్టులోకి రొమారియో షెపర్డ్ వచ్చాడు. కాగా ఈ మెగా టోర్నీ గ్రూపు స్టేజిలో ఇరు జట్లు కూడా అజేయంగా నిలిచాయి. మరి సూపర్-8లో ఎవరు బోణీ కొడతారో వేచి చూడాలి.తుది జట్లుజింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, తడివానాషే మారుమణి(వికెట్ కీపర్), డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), ర్యాన్ బర్ల్, టోనీ మునియోంగా, తాషింగా ముసెకివా, బ్రాడ్ ఎవాన్స్, గ్రేమ్ క్రీమర్, రిచర్డ్ న్గరవ, బ్లెస్సింగ్ ముజారబానీవెస్టిండీస్: బ్రాండన్ కింగ్, షాయ్ హోప్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, మాథ్యూ ఫోర్డే, అకేల్ హోసేన్, గుడాకేష్ మోటీ, షామర్ జోసెఫ్ -
సఫారీ బ్యాటర్తో సుందర్ ఫైట్.. కారణమిదే?
టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో 76 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 188 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక టీమిండియా చతికల పడింది. లక్ష్య చేధనలో మెన్ ఇన్ బ్లూ 111 పరుగులకే కుప్పకూలింది. అయితే ఈ మ్యాచ్లో భారత్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, సఫారీ సూపర్ స్టార్ డేవిడ్ మిల్లర్ మధ్య వాగ్వదం చోటు చేసుకుంది.అసలేమి జరిగిందంటే?సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసేందుకు కెప్టెన్ సూర్యకుమార్ స్పిన్నర్ సుందర్ను ఎటాక్లోకి తీసుకొచ్చాడు. అయితే నాన్-స్ట్రైకర్ ఎండ్లో ఉన్న డేవిడ్ మిల్లర్ క్రీజు వదిలి ముందుకు రావడంపై సుందర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అవుట్ఫీల్డ్ గ్రాస్ కాస్త తడిగా ఉండడంతో, పరుగు తీసేటప్పుడు జారిపోకుండా ఉండేందుకు మిల్లర్ క్రీజు లైన్ అంచున నిలబడ్డాడు.దీంతో బౌలింగ్ వేసే క్రమంలో సుందర్ మధ్యలోనే ఆగిపోయి, మిల్లర్ క్రీజు దాటుతున్నాడంటూ అంపైర్ క్రిస్ గఫానీకి ఫిర్యాదు చేశాడు. ఇది 'మన్కడింగ్' (రనౌట్)లా అన్పించింది. దీంతో మిల్లర్ అసహనం వ్యక్తం చేస్తూ ఏదో ఉన్నాడు. ఓవర్ ముగిసిన తర్వాత కూడా వారిద్దరి మధ్య మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది.The zen masters lost it! Miller vs Sundar explodes 🤬Both are usually the calmest on the field, but this time even they couldn’t keep their cool 🔥 Backing up too far?#INDvsSA #CricketFever #T20WorldCup2026 #Cricket pic.twitter.com/OWStXaB1PY— Cricket Update (@sportshourly) February 23, 2026 మిల్లర్ నేరుగా సుందర్ వద్దకు వెళ్లి సీరియస్గా మాట్లాడు. అంపైర్లు వెంటనే జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్లో సుందర్ బంతితో పాటు బ్యాట్తో కూడా విఫలమయ్యాడు. ఈ ఓటమితో భారత్ తమ సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. -
మీ వల్లే ఈ ఓటమి: భారత మాజీ క్రికెటర్ ఆగ్రహం
పొట్టి క్రికెట్ ప్రపంచకప్ టోర్నీలో భారత్కు కనీవినీ ఎరుగని పరాజయం ఎదురైంది. టీ20 వరల్డ్కప్-2026 ఈవెంట్లో టీమిండియా అవమానకర రీతిలో సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడింది. సూపర్-8 కీలక మ్యాచ్లో 76 పరుగుల తేడాతో ఓటమిపాలై.. పరుగుల పరంగా అతిపెద్ద పరాజయం నమోదు చేసింది.ఊహించని షాక్ఈ నేపథ్యంలో టీమిండియా నాయకత్వ బృందంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆల్రౌండర్, వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ను తుదిజట్టులో ఆడించకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ విషయంపై భారత మాజీ బ్యాటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ కూడా స్పందించాడు.తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఇది ఊహించని షాక్. తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇది సాధారణ ఓటమి కాదు. వాళ్లు మనల్ని చిత్తు చిత్తుగా ఓడించారు. సౌతాఫ్రికా టీమిండియాపై భారీ విజయం సాధించింది.కెప్టెన్, హెడ్కోచ్ ఏం చేస్తున్నారు?ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి బౌలింగ్ను సఫారీ బ్యాటర్లు అటాక్ చేసిన తీరు మరీ ఘోరం. ఇందుకు కెప్టెన్, హెడ్కోచ్ జవాబుదారులుగా ఉండాలి. యాజమాన్యంతో పాటు ఆటగాళ్లు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మైదానంలో అడుగుపెట్టారు.అహంకారం వద్దునెట్ రన్ రేటు గురించి ఆలోచనే లేదు. సెలక్షన్ విషయంలోనూ తప్పులు. మనవాళ్ల బ్యాటింగ్ శైలి ఏమాత్రం సరిగ్గాలేదు. వీటన్నిటికీ యాజమాన్యం సమాధానం చెప్పాలి. జింబాబ్వేతో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఆత్మవిశ్వాసానికి, అహంకారానికి మధ్య సన్నని రేఖ మాత్రమే ఉంటుంది. టీమిండియా దానిని తుడిచివేసేలా కనిపిస్తోంది’’ అంటూ తీవ్ర స్థాయిలో బద్రీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం నాటి మ్యాచ్లో టీమిండియా సమిష్టిగా విఫలమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసి.. 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 187 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 18.5 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. చదవండి: T20 WC 2026: టీమిండియాలో కలకలం -
'అతడొక మ్యాచ్ విన్నర్.. తిరిగి జట్టులోకి తీసుకోండి'
టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో ఘోర ఓటమి చవిచూసిన టీమిండియా.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమవుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో తలపడనుంది. సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్లో భారత్ ఖచ్చితంగా గెలవాల్సిందే.ఈ నేపథ్యంలో భారత తుది జట్టులో మార్పులు చేయాలని మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ సూచించాడు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను తిరిగి జట్టులోకి తీసుకోవాలని పార్ధివ్ అభిప్రాయపడ్డాడు. కాగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో అక్షర్ స్ధానంలో వాషింగ్టన్ సుందర్ను ఆడించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అద్భుతమైన ఫామ్లో ఉన్న అక్షర్ను ఎలా పక్కన పెట్టారని మాజీలు మండిపడ్డాడు. ఈ కీలక మ్యాచ్లో సుందర్ బంతితో పాటు బ్యాట్తో కూడా విఫలమయ్యాడు. దీంతో జింబాబ్వేతో మ్యాచ్కు పటేల్ తిరిగి జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది."అక్షర్ పటేల్ను తిరిగి ప్లేయింగ్ ఎలెవన్లో చూడాలనుకుంటున్నాను. అక్షర్ లాంటి ఆల్రౌండర్ జట్టులో ఉండడం చాలా ముఖ్యం. అతడు కేవల బంతితోనే కాకుండా క్లిష్ట సమయాల్లో బ్యాట్తో కూడా రాణించగలడు. మ్యాచ్-అప్ల పరంగా కూడా అతడు మంచి ఎంపికే" అని స్టార్ స్పోర్ట్స్ షో 'ఫాలో ది బ్లూస్'లో పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు. అదేవిధంగా ప్లేయింగ్ ఎలెవన్లోకి సంజూ శాంసన్ కూడా వచ్చే అవకాశముందని పార్ధివ్ తెలిపాడు. సంజూ లాంటి ప్లేయర్లు ఆఫ్ స్పిన్నర్లను అద్భుతంగా ఎదుర్కొంటారని పటేల్ చెప్పుకొచ్చాడు.చదవండి: మా వాళ్లు అద్భుతం.. విండీస్ ప్రమాదకర జట్టు: మార్క్రమ్ -
భారత్పై సౌతాఫ్రికా పేసర్ అరుదైన రికార్డు
టీ20 ప్రపంచకప్-2026లో సౌతాఫ్రికా తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన సూపర్-8 మ్యాచ్లో 76 పరుగుల తేడాతో భారత్ను ప్రోటీస్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది.తొలుత బ్యాటింగ్లో 187 పరుగులు భారీ స్కోర్ చేసిన దక్షిణాఫ్రికా, అనంతరం బౌలింగ్లోనూ అదరగొట్టింది. మార్కో జాన్సెన్ నాలుగు, కేశవ్ మహారాజ్ మూడు వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాసించారు. లుంగీ ఎంగిడీ కూడా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.ఎంగిడీ తన 4 ఓవర్ల కోటాలో వికెట్లేమీ తీయకపోయినా, కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి భారత బ్యాటర్లను కట్టడి చేశాడు. ఈ మ్యాచ్లో ఎంగిడీ ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవడం గమనార్హం. తద్వారా ఈ సఫారీ స్పీడ్ స్టార్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్పై టీ20ల్లో ఒక పేసర్ బౌండరీ ఇవ్వకుండా నాలుగు ఓవర్లు వేయడం 2019 తర్వాత ఇదే మొదటిసారి. 2019లో బెంగళూరు వేదికగా భారత్ జరిగిన టీ20 మ్యాచ్లో సఫారీ ఫాస్ట్ బౌలర్ బ్యూరాన్ హెండ్రిక్స్ బౌండరీ ఏమీ ఇవ్వకుండా తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేశాడు. అయితే అప్పుడు హెండ్రిక్స్ 14 పరుగులు ఇవ్వగా.. ఎంగిడీ ఇప్పుడు 15 పరుగులు ఇవ్వడం గమనార్హం. -
మా వాళ్లు అద్భుతం.. విండీస్ ప్రమాదకర జట్టు: మార్క్రమ్
టీమిండియాపై సౌతాఫ్రికా ప్రతీకారం తీర్చుకుంది. టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో తమను ఓడించి ట్రోఫీ గెలుచుకున్న భారత్కు.. తాజా ఎడిషన్లో మర్చిపోలేని చేదు అనుభవాన్ని మిగిల్చింది. టీ20 వరల్డ్కప్-2026 సూపర్-8లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్లో సూర్యకుమార్ సేనను 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది.మా వాళ్లు అద్భుతంపొట్టి క్రికెట్ ప్రపంచకప్ టోర్నీల్లో టీమిండియాకు పరుగులపరంగా ఇదే అతిపెద్ద పరాజయం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (Aiden Markram) హర్షం వ్యక్తం చేశాడు. టీమిండియాతో మ్యాచ్లో తమ ఆటగాళ్లు అద్భుత రీతిలో రాణించారని ప్రశంసలు కురిపించాడు. గొప్ప ప్రదర్శనతో టీమిండియాను చిత్తు చేశామని సంతోషం వ్యక్తం చేశాడు.‘‘ఈ వికెట్ భిన్నంగా ఉంది. అయినప్పటికీ మా వాళ్లు పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా తమను తాము మార్చుకుని.. అద్భుతమైన నైపుణ్యాలతో వారి ప్రణాళికలను పక్కాగా అమలు చేశారు. ముఖ్యంగా మా బౌలర్లు అద్భుతం చేశారు.ఆ భాగస్వామ్యం అత్యంత కీలకంఇక మిల్లర్, బ్రెవిస్ నెలకొల్పిన భాగస్వామ్యం అత్యంత కీలకం. మ్యాచ్ను మా వైపు తిప్పేసింది వాళ్లే. లుంగి ఎంగిడి వంటి ప్రమాదకర బౌలర్ మా జట్టులో ఉన్నాడు. మధ్య ఓవర్లలో అతడు మాకు కీలకం. జట్టు ప్రయోజనాల కోసం ఎప్పుడు బౌలింగ్ చేయడానికైనా అతడు సిద్ధంగా ఉంటాడు.టీ20 ఫార్మాట్లో అత్యంత ప్రమాదకారితదుపరి మేము వెస్టిండీస్తో తలపడాల్సి ఉంటుంది. ఆ జట్టు టీ20 ఫార్మాట్లో అత్యంత ప్రమాదకారి. కాబట్టి టీమిండియాపై విజయాన్ని ఆస్వాదిస్తూనే తదుపరి మ్యాచ్కు పూర్తి స్థాయిలో సిద్దమవుతాము. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి అనుకున్న ఫలితం రాబడతాము’’ అని మార్క్రమ్ పేర్కొన్నాడు.కాగా టీమిండియాతో సూపర్-8 మ్యాచ్లో సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి.. 187 పరుగులు సాధించింది. డెవాల్డ్ బ్రెవిస్ (29 బంతుల్లో 45), డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో 63) యాభై బంతుల్లోనే 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.కుప్పకూలిన టీమిండియాఇక లక్ష్య ఛేదనలో భారత్ను కట్టడి చేయడంలో సఫారీ బౌలర్లు విజయవంతమయ్యారు. మార్కో యాన్సెన్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. కేశవ్ మహరాజ్ మూడు వికెట్లు పడగొట్టాడు. కార్బిన్ బాష్ రెండు, మార్క్రమ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఎంగిడి నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులే ఇచ్చి అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు.ఈ క్రమంలో 18.5 ఓవర్లలో కేవలం 111 పరుగులు చేసి టీమిండియా కుప్పకూలింది. ఫలితంగా సౌతాఫ్రికా 76 పరుగుల తేడాతో జయభేరి మోగించి సెమీస్ దిశగా తొలి అడుగు వేసింది. ఇక భారత్ తదుపరి గురువారం జింబాబ్వేతో.. సౌతాఫ్రికా వెస్టిండీస్తో తలపడతాయి.చదవండి: అతడిని పక్కనపెట్టి తప్పు చేశారు.. రింకూ ఎందుకసలు?: మాజీ క్రికెటర్ ఫైర్ -
టీమిండియా ఘోర ఓటమి.. పగలబడి నవ్విన పాక్ మాజీ ప్లేయర్
టీ20 ప్రపంచకప్-2026 లీగ్ స్టేజీలో అజేయంగా నిలిచిన టీమిండియా.. కీలకమైన సూపర్-8లో మాత్రం తమ జోరును కొనసాగించలేకపోయింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో 76 పరుగుల తేడాతో భారత్ ఘోర ఓటమి చవిచూసింది.సూర్యకుమార్ నాయకత్వంలోని భారత జట్టు బౌలింగ్లో కాస్త ఫర్వాలేదన్పించినప్పటికి బ్యాటింగ్లో మాత్రం దారుణంగా విఫలమైంది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 111 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దక్షిణాఫ్రికా బౌలర్ మార్కో జాన్సెన్ 4 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బ తీశాడు.భారత బ్యాటర్లలో శివమే దూబే(42) ఒక్కడే రాణించాడు. ఈ ఓటమితో భారత్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన రెండు మ్యాచ్ల్లోనే భారీ విజయం సాధిస్తేనే టీమిండియా సెమీస్ రేసులో ఉంటుంది. ఈ ఘోర ఓటమితో టీమిండియా రన్రేట్(-3.800) భారీగా పడిపోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రదర్శనపై పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు."ఈ మ్యాచ్లో భారత బ్యాటింగ్ అసలు రూపం బట్టబయలైంది. ఈ టోర్నీలో భారత్ ఛేజింగ్కు దిగడం ఇదే మొదటిసారి. లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా ఒత్తిడి తట్టుకోలేక చిత్తైంది. ఛేజింగ్లో భారత్ తడబడుతుందని నాకు ముందే తెలుసు. ముఖ్యంగా విరాట్ కోహ్లి వంటి సీనియర్ ఆటగాడు లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది"అని జియో న్యూస్కు వచ్చిన ఇంటర్వ్యూలో అమీర్ పేర్కొన్నాడు. కాగా టోర్నీకి ముందే భారత్ సెమీఫైనల్ చేరడం కష్టమని అమీర్ జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఈ టోర్నీలో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా అట్టర్ ప్లాప్ అవుతాడని అమీర్ ఇటీవల చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. అందుకు తగ్గట్టే అభిషేక్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పుడు మ్యాచ్ ఫలితం కూడా అతడు అంచనా వేసినట్లే రావడం అతడు టౌక్ ఆఫ్ది టౌన్గా మారాడు. భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ అనంతరం అమీర్ జియో న్యూస్ చానల్లో జరిగిన చర్చలో పాల్గొన్నాడు. యాంకర్ అతడిని జ్యోతిష్యుడు అంటూ పరిచయం చేయగానే అమీర్ పగలబడి నవ్వుతూ “దేవుడా నన్న క్షమించు, నాకు ఏంటి ఇది” అంటూ స్పందించాడు. దీంతో అతడికి భారత్ అభిమానులు గట్టిగా కౌంటరిస్తున్నారు. టీమిండియా వరుసగా రెండు మ్యాచ్లలో గెలిచి సెమీస్కు కచ్చితంగా వస్తుందని పోస్టులు పెడుతున్నారు. కాగా టీమిండియా తమ తదుపరి మ్యాచ్లో గురువారం జింబాబ్వేతో తలపడనుంది. -
వాళ్లిద్దరు సూపర్.. తిలక్ వర్మ విఫలం: భారత దిగ్గజం
సౌతాఫ్రికాతో మ్యాచ్లో టీమిండియా ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. చెత్త ప్రదర్శనతో భారీ మూల్యమే చెల్లించారంటూ భారత మాజీ క్రికెటర్లు సూర్యకుమార్ సేనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తుదిజట్టు కూర్పు విషయంలో తప్పు జరిగిందంటూ హెడ్కోచ్ గౌతం గంభీర్ను సైతం విమర్శిస్తున్నారు.ఇదే అతిపెద్ద పరాజయంకాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో తలపడ్డ టీమిండియా.. ఏకంగా 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో భారత్కు పరుగుల పరంగా ఇదే అతిపెద్ద పరాజయం. ఈ మ్యాచ్లో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్కు బదులు వాషింగ్టన్ సుందర్ను ఆడించడం విమర్శలకు దారి తీసింది.ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) తనదైన శైలిలో స్పందించాడు. భారత బ్యాటర్లలో ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఆడలేదని విమర్శించాడు. ముఖ్యంగా వన్డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ ఆడిన తీరు తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని పేర్కొన్నాడు.వారిద్దరు సూపర్‘‘సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis), డేవిడ్ మిల్లర్ అద్భుత రీతిలో భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గట్టెక్కించారు. అయితే, టీమిండియా బ్యాటర్లు మాత్రం వారి నుంచి ఏమీ నేర్చుకోలేకపోయారు. వచ్చీ రాగానే బౌండరీ కొట్టాలనే తలంపుతో వికెట్ పారేసుకున్నారు.టీ20 క్రికెట్లో ఇలా ఆడటం సరికాదు. ప్రత్యర్థి జట్టు ఏం చేసిందో చూసిన తర్వాత కూడా ఇలాగే చేస్తారా? వికెట్ అంతగా అనుకూలించకపోయినా వాళ్లు మెరుగ్గా ఆడారు. కానీ మనం.. ఇగోకు పోయాము. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వికెట్లు పోగొట్టుకున్నాం. సౌతాఫ్రికా అద్భుత ప్రదర్శనతో టీమిండియాను చిత్తు చేసింది.తిలక్ వర్మ నిరాశపరిచాడుఈ విజయానికి వారు పూర్తిగా అర్హులు. ఇక తిలక్ వర్మ (Tilak varma) విషయానికొస్తే.. అతడు తెలివైన బ్యాటర్. కానీ ఈ మ్యాచ్లో అతడు ఆడిన తీరు నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. ఓవర్కు 9.5 పరుగులు రాబట్టాల్సింది. కానీ మనోళ్లు 15 పరుగులు చేయాలి అన్నట్లుగా తొందరపడ్డారు.తిలక్ ఇంకాసేపు సమయం తీసుకుని క్రీజులో నిలదొక్కుకోవాల్సింది. అభిషేక్ శర్మ వరుస వైఫల్యాల నేపథ్యంలో తిలక్ కాస్తైనా బాధ్యతాయుతంగా ఆడాల్సింది. కానీ అతడు పూర్తిగా విఫలమయ్యాడు’’ అని గావస్కర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.దూబే ఒక్కడేకాగా అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికా విధించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 111 పరుగులకే కుప్పకూలింది. టాపార్డర్లో ఇషాన్ కిషన్ డకౌట్ కాగా.. అభిషేక్ శర్మ 15 పరుగులు చేయగలిగాడు. తిలక్ వర్మ రెండు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగే చేసి పెవిలియన్ చేరాడు. మిగిలిన వారంతా కూడా విఫలం కాగా.. శివం దూబే 42 పరుగులతో రాణించడంతో భారత్ వంద పరుగుల మార్కు దాటగలిగింది.చదవండి: అతడిని పక్కనపెట్టి తప్పు చేశారు.. రింకూ ఎందుకసలు?: మాజీ క్రికెటర్ ఫైర్ -
T20 WC 2026: టీమిండియాలో కలకలం
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 22) సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో భారత్ 76 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్ తర్వాత భారత క్రికెట్ వర్గాల్లో కలకలం రేగింది. హ్యాట్రిక్ డకౌట్లు సహా వరుసగా నాలుగో మ్యాచ్లోనూ (15) విఫలమైన అభిషేక్ శర్మ గాయంతోనే ఈ మ్యాచ్లన్నీ ఆడాడని వైభవ్ భోలా అనే క్రీడా జర్నలిస్ట్ సోషల్మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. ఈ పోస్టే కలకలానికి కారణమైంది.వైభవ్ భోలా పోస్ట్ ప్రకారం.. అభిషేక్ శర్మ ప్రపంచకప్ తొలి మ్యాచ్కు ముందే గాయపడ్డాడు. టోర్నీ ప్రారంభానికి ముందు జరిగిన అధికారిక ఫోటోషూట్ కార్యక్రమంలో అభిషేక్ చేతికి గాయమైంది. దీని వల్ల అతనికి కుట్లు కూడా పడ్డాయి. అయినా, భారత మేనేజ్మెంట్ దాన్ని దాచి అభిషేక్ను యూఎస్ఏతో మ్యాచ్లో ఆడించింది. ఆ మ్యాచ్లో అతను గోల్డెన్ డకౌటయ్యాడు. ఆ తర్వాత అతనికి కడుపు ఇన్ఫెక్షన్ కూడా రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అప్పటి వరకు మంచి ఫామ్లో ఉన్న అభిషేక్ వరుస వైఫల్యాల బాట పట్టడానికి ఇదే కారణమా అని వైభవ్ తన పోస్ట్ ద్వారా టీమిండియా మేనేజ్మెంట్ను ప్రశ్నించాడు. ఈ పోస్ట్కు అభిషేక్ చేతికి బ్యాండ్ ఎయిడ్ ఉన్న ఫోటోను జోడించాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. అభిషేక్ శర్మకు నిజంగానే గాయమైందా.. దాన్ని దాచిపెట్టే భారత మేనేజ్మెంట్ అతన్ని బరిలోకి దించుతుందా అని భారత క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ పోస్ట్లో నిజానిజాలు ఎంతో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై భారత మేనేజ్మెంట్ తక్షణమే స్పందించాలని కోరుతున్నారు.ఒకవేళ అభిషేక్కు నిజంగా గాయమై ఉంటే, కీలకమైన సౌతాఫ్రికా మ్యాచ్లో ఎందుకు ఆడించారని ప్రశ్నిస్తున్నారు. దీని మూల్యం జట్టు మొత్తం చెల్లించుకోవాల్సి వచ్చిందంటూ మండిపడుతున్నారు.ఈ సంచలన వార్తలో నిజానిజాలను పక్కన పెడితే.. ప్రస్తుత ప్రపంచకప్లో అభిషేక్ ఇబ్బంది పడుతున్నాడన్నది కాదనలేని సత్యం. తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న అభిషేక్పై సహజంగానే ఒత్తిడి ఉంటుంది. భారీ అంచనాలు ఆ ఒత్తిడిని మరింత అధికం చేశాయి. ఇదే అతని వైఫల్యాలకు ప్రధాన కారణమయ్యుండవచ్చు. అభిషేక్ ఫామ్ కోల్పోవడంపై తాజాగా దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్ అయిన అభిషేక్ పూర్తిగా ఫామ్ కోల్పోయాడని.. పవర్ప్లేలో దూకుడుగా ఆడే అతను ఆత్మవిశ్వాసం లేకుండా కనిపిస్తున్నాడని.. ప్రతి బంతిని బౌండరీకి తరలించాలనే ఆతృత పక్కన పెట్టి, సింగిల్స్తో స్ట్రయిక్ రొటేట్ చేస్తే మంచిదని సలహా ఇచ్చాడు. గవాస్కర్ విషయాన్ని కూడా పక్కన పెడితే.. సౌతాఫ్రికా మ్యాచ్లో అభిషేక్ 15 ఓవర్ల పాటు క్రీజ్లో ఉండి ఉంటే భారత్కు ఈ ఘోర పరాభవం తప్పేది. అప్పటికి అభిషేక్ ఆచితూచి ఆడాలనే ప్రయత్నం చేసినా, సౌతాఫ్రికా బౌలర్ల ఎత్తుగడల ముందు నిలబడలేకపోయాడు. ఏదిఏమైనా సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం భారత సెమీస్ అవకాశాలను మాత్రం సంక్లిష్టం చేసేసింది. ఈ ఓటమి తర్వాత భారత రన్రేట్ -3.80కి పడిపోయింది. జింబాబ్వే, విండీస్తో జరిగే మిగతా రెండు సూపర్-8 మ్యాచ్ల్లో నెగ్గినా టీమిండియా తప్పక సెమీస్కు చేరుతుందని చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. -
హార్దిక్ పాండ్యా ఫెయిల్.. గర్ల్ఫ్రెండ్ రియాక్షన్ వైరల్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో టీమిండియా తొలి పరాజయం నమోదు చేసింది. కీలక సూపర్-8 దశలో మొదటి మ్యాచ్లోనే సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడింది. తద్వారా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.అహ్మదాబాద్ వేదికగా సఫారీలతో ఆదివారం తలపడ్డ సూర్యకుమార్ సేన.. 76 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది.ధనాధన్ దంచికొట్టి..డెవాల్డ్ బ్రెవిస్ (29 బంతుల్లో 45), డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో 63), ట్రిస్టన్ స్టబ్స్ (24 బంతుల్లో 44 నాటౌట్) ధనాధన్ దంచికొట్టి ప్రొటిస్ జట్టును ఈ మేరకు పటిష్ట స్థితిలో నిలిపారు. భారత బౌలర్లలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడు, అర్ష్దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి, శివం దూబే తలా ఒక వికెట్ పడగొట్టారు.𝘿𝙚𝙖𝙩𝙝, 𝙩𝙖𝙭𝙚𝙨, 𝙖𝙣𝙙 𝙑𝙖𝙧𝙪𝙣 𝙥𝙞𝙘𝙠𝙞𝙣𝙜 𝙬𝙞𝙘𝙠𝙚𝙩𝙨! 😌1️⃣8️⃣ consecutive innings with a wicket for Varun Chakravarthy in T20Is (Most by an Indian).ICC Men's #T20WorldCup | SUPER 8 | #INDvSA | LIVE NOW 👉 https://t.co/dZWPZfqfbO pic.twitter.com/AmgTPxI3tU— Star Sports (@StarSportsIndia) February 22, 2026దారుణంగా విఫలమైన హార్దిక్ పాండ్యాఇక ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి ఏకంగా 45 పరుగులు సమర్పించుకుని.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అదే విధంగా లక్ష్య ఛేదనలోనూ హార్దిక్ బ్యాట్తో విఫలమయ్యాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన హార్దిక్.. 17 బంతులు ఎదుర్కొని కేవలం 18 పరుగులే చేశాడు.చప్పట్లు కొట్టిన మహీకసఫారీ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ బౌలింగ్లో.. భారీ షాట్కు యత్నించి స్టబ్స్కు క్యాచ్ ఇచ్చిన హర్దిక్ పాండ్యా పెవిలియన్ చేరాడు. ఈ సందర్భంగా హార్దిక్ ప్రేయసి మహీక శర్మ వ్యవహరించిన తీరు వైరల్గా మారింది. హార్దిక్ అవుట్ కాగానే లేచి నిలబడిన మహీక చప్పట్లు కొడుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.Hardik Pandya's girlfriend Mahieka Sharma was clapping when Hardik got out 😭 pic.twitter.com/GFJvy5NA23— Tejash (@Tejashyyyyy) February 22, 2026గర్ల్ఫ్రెండ్ బర్త్డే వేడుకలలో..ఈ నేపథ్యంలో మహీకకు అసలు క్రికెట్ గురించి తెలుసా? అంటూ ట్రోల్స్ వస్తున్నాయి. అయితే, హార్దిక్ అభిమానులు మాత్రం.. అతడిని నిరాశ చెందవద్దని చెప్పేందుకే ఆమె క్లాప్ చేసిందని అంటున్నారు. కాగా భార్య నటాషా స్టాంకోవిక్తో విడాకులు తీసుకున్న కొన్నాళ్లకే మహీకతో తాను ప్రేమలో ఉన్నట్లు హార్దిక్ పాండ్యా వెల్లడించాడు.ఆమె వల్లే గొప్పగా ఆడుతున్నాఇక అప్పటి నుంచి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోంది ఈ జంట. ఈ క్రమంలో మహీక వల్లే తాను గొప్పగా ఆడుతున్నానని.. ఆమె రాకతో జీవితం మారిందని హార్దిక్ ప్రశంసలు కురిపించడం విశేషం. అయితే, తాజా మ్యాచ్లో మాత్రం అతడు దారుణంగా విఫలం కావడం గమనార్హం.ఈ మ్యాచ్కు ముందు మహీక బర్త్డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ వేడుకల్లో మునిగిపోయాడు హార్దిక్. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో భారత్ 18.5 ఓవర్లలో కేవలం 111 పరుగులు చేసి ఆలౌట్ అయింది.చదవండి: T20 WC 2026: టీమిండియా కొంపముంచిన గంభీర్.. నెటిజన్లు ఫైర్ -
అతడు MVP.. రింకూ జట్టులో ఎందుకసలు?: మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా గ్రూప్ దశలో అజేయంగా నిలిచినా.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిందన్నది వాస్తవం. తొలుత అమెరికా.. ఆఖర్లో నెదర్లాండ్స్ రూపంలో పసికూనలు.. పటిష్ట సూర్యకుమార్ సేనకు సవాలు విసిరాయి. నమీబియా, పాకిస్తాన్లపై మాత్రమే భారత్ ఏకపక్ష విజయం సాధించింది.76 పరుగుల తేడాతో సఫారీల చేతిలో చిత్తుగాఈ నేపథ్యంలో సూపర్-8లో జాగ్రత్తగా ఆడి సమిష్టిగా రాణించకపోతే కష్టాలు తప్పవని టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandra Ashwin) ముందుగానే హెచ్చరించాడు. అందుకు తగ్గట్లుగానే భారత్ సూపర్-8లో తమ తొలి మ్యాచ్లో ఘోర పరాజయం పాలైంది. సమిష్టి వైఫల్యంతో 76 పరుగుల తేడాతో సఫారీల చేతిలో చిత్తుగా ఓడిపోయింది. తద్వారా సెమీ ఫైనల్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్లలో తప్పక గెలవాల్సిన పరిస్థితిలో నిలిచింది.తప్పు చేశారుఅయితే, సౌతాఫ్రికా చేతిలో ఓటమికి ప్రధాన కారణం భారత తుదిజట్టు కూర్పేనని మెజారిటీ మంది విశ్లేషకుల అభిప్రాయం. అశ్విన్ కూడా ఇదే మాట అంటున్నాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) నిర్ణయాలను అశూ తప్పుబట్టాడు. అక్షర్ పటేల్ను కాదని.. వాషింగ్టన్ సుందర్ని ఆడించి పెద్ద తప్పే చేశారని విమర్శించాడు.‘‘ఐపీఎల్లో మ్యాచ్-అప్లకు అవకాశం ఉంటుంది. ప్రత్యర్థి జట్టు బ్యాటర్ల కోసం పర్టికులర్గా ఓ బౌలర్తో వ్యూహాలు అమలు చేసే వీలు ఉంటుంది. అక్కడ మనకు పద్నాలుగు మ్యాచ్లు ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రయోగాలు చేయవచ్చు.కానీ ఐసీసీ ఈవెంట్లలో జట్టు ఎంత స్థిరంగా ఉంటే అంత మంచిది. తరచూ మార్పులు చేయడం తగదు. ఎడమచేతి వాటం బ్యాటర్లకు బౌలింగ్ చేయించాలని వాషింగ్టన్ సుందర్ను తీసుకురావడాన్ని నేను వంద శాతం సమర్థిస్తాను.అతడు MVP.. అలాంటి వాడినే పక్కనపెడతారా?అదే సమయంలో అక్షర్ పటేల్ను పక్కన పెట్టడాన్ని మాత్రం ఎంతమాత్రం అంగీకరించను. టీ20 క్రికెట్లో అక్షర్ అత్యంత విలువైన ఆటగాడు (MVP). ఇప్పటికే ఎన్నోసార్లు ఈ విషయాన్ని నిరూపించాడు. ముఖ్యంగా 2024 టీ20 వరల్డ్కప్ ఫైనల్లో సౌతాఫ్రికాతో మ్యాచ్లో విరాట్ కోహ్లితో కలిసి అక్షర్ మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు.ఫలితంగా టీమిండియా 170 పరుగుల మార్కు దాటింది. అనుభవజ్ఞుడైన కోహ్లికి అక్షర్ అక్కడ సాయంగా నిలిచాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అలాంటి ఆటగాడిని పక్కన పెట్టి ఇప్పుడు భారీ మూల్యమే చెల్లించారు.చక్కటి గుణపాఠంఇక రింకూ సింగ్ విషయానికొస్తే.. మీకు ఎనిమిది మంది బ్యాటర్లు ఉన్నారు. అలాంటపుడు రింకూను ఎనిమిదో స్థానంలోనే పంపడం ఎందుకు?.. ఏదేమైనా వాషీని నేను అగౌరవపరచడం లేదు. కానీ సౌతాఫ్రికా టీమిండియాకు చక్కటి గుణపాఠం నేర్పింది. సన్నద్ధం కాకుండా మ్యాచ్కు వస్తే ఇలాగే జరుగుతుంది అని చాటిచెప్పింది’’ అంటూ అశ్విన్ తీవ్ర స్థాయిలో టీమిండియా నాయకత్వ బృందం తీరుపై మండిపడ్డాడు.కాగా సౌతాఫ్రికాతో ఆదివారం నాటి సూపర్-8 మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో టీమిండియా 18.5 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది.ఈ మ్యాచ్లో అక్షర్కు బదులు తుదిజట్టులో ఆడిన వాషీ.. రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగులు ఇచ్చాడు. బ్యాటింగ్లోనూ విఫలమయ్యాడు. కేవలం 11 పరుగులే చేయగలిగాడు. ఇక రింకూ సింగ్ డకౌట్ అయ్యాడు. శివం దూబే 42 పరుగులతో టీమిండియా టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.చదవండి: T20 WC 2026: టీమిండియా కొంపముంచిన గంభీర్.. నెటిజన్లు ఫైర్ -
సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. అయినా, టీమిండియాదే వరల్డ్కప్..!
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 22) సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో భారత్ 76 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే భారత్కు ఇది అతి పెద్ద ఓటమి. ఈ ఓటమితో ఐసీసీ టోర్నీల్లో టీమిండియా జైత్రయాత్రకు కూడా బ్రేక్ పడింది. 2023 వన్డే వరల్డ్కప్ ఫైనల్ తర్వాత భారత్ ఈ మ్యాచ్లోనే (ఐసీసీ టోర్నీల్లో) ఓటమిపాలైంది. ఈ ఓటమితో భారత్ సెమీస్ అవకాశాలను సైతం కఠినం చేసుకుంది. మిగతా రెండు సూపర్-8 మ్యాచ్ల్లో జింబాబ్వే, వెస్టిండీస్పై విజయం సాధించినా.. భారత్ సెమీస్కు చేరుతుందన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే, సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం తర్వాత భారత నెట్ రన్రేట్ -3.80కు పడిపోయింది. ఇది మెరుగుపడాలంటే భారత్ తదుపరి 2 మ్యాచ్ల్లో భారీ విజయాలు సాధించాలి. అలాగే విండీస్, జింబాబ్వే.. సౌతాఫ్రికా చేతిలోనూ ఓడాలి. ఇలా జరిగినప్పుడే భారత్ సెమీస్కు చేరుకుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా జరగడం కాస్త కష్టమే అయినా అసాధ్యమైతే కాదు.ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనూ టీమిండియాను ఓ సెంటిమెంట్ ఏకంగా టైటిల్నే ఊరిస్తుంది. అదేంటంటే.. స్వదేశంలో జరిగిన 2011 వన్డే వరల్డ్కప్లో భారత్ గ్రూప్ దశలో సౌతాఫ్రికా చేతిలో ఓడినా, టైటిల్ గెలిచింది. అలాగే స్వదేశంలోనే జరుగుతున్న ఈ ప్రపంచకప్లోనూ భారత్ సూపర్-8లో సౌతాఫ్రికా చేతిలో ఓడినా, టైటిల్ గెలుస్తుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఈ సెంటిమెంట్ సోషల్మీడియాలో భారత అభిమానులకు సౌతాఫ్రికా చేతిలో పరాభవాన్ని మరిచిపోయేలా చేస్తుంది. మరి ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.కాగా, సౌతాఫ్రికాతో మ్యాచ్లో భారత్ బౌలింగ్ విభాగంలో పర్వాలేదనిపించినా, బ్యాటర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. ఛేదించగలిగే లక్ష్యమే అయినా ఒత్తిడికి చిత్తై చేతులెత్తేశారు.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. భారత పేసర్లు జస్ప్రీత్ బుమ్రా (4-0-15-3), అర్షదీప్ సింగ్ (4-0-28-2) 20 పరుగులకే 3 వికెట్లు తీసి ఇబ్బంది పెట్టినా, ఆతర్వాత డెవాల్డ్ బ్రెవిస్ (29 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో 63; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (24 బంతుల్లో 44 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) మెరుపు విన్యాసాలతో ఇన్నింగ్స్ను చక్కదిద్దారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు ఆదిలోనే చేతులెత్తేశారు. ఇన్నింగ్స్ నాలుగో బంతికే ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్ డకౌటయ్యాడు. ఆతర్వాత రెండు బంతులకే ఫామ్లో లేని తిలక్ వర్మ (1) కూడా పెవిలియన్కు చేరాడు. గత మూడు మ్యాచ్ల్లో డకౌటై ఒత్తిడిలో ఉన్న అభిషేక్ శర్మ (15) మరోసారి అదే ఒత్తిడికి చిత్తయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ (18) బంతులు వృధా చేశాక నిస్సహాయ స్థితిలో ఔటయ్యాడు. వాషింగ్టన్ సుందర్కు (11) ప్రమోషన్ ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. శివమ్ దూబే (42) తన సహజ శైలిలో వేగంగా పరుగులు రాబట్టలేకపోయాడు. హార్దిక్ (18), రింకూ (0) కూడా నిరాశపరిచారు.మొత్తంగా భారత్ 18.5 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికా బౌలర్లు జన్సెన్ (3.5-0-22-4), కేశవ్ మహారాజ్ (3-0-24-3), కార్బిన్ బాష్ (3-0-12-2), మార్క్రమ్ (1-0-5-1) భారత పతనాన్ని శాశించారు. ఎంగిడి (4-0-15-0), రబాడ (4-0-32-0) వికెట్లు తీయలేకపోయినా అద్భుతంగా బౌలింగ్ చేశారు. -
సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం.. టీమిండియాలో కీలక మార్పు
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం ఎదురైన నేపథ్యంలో టీమిండియాలో కీలక మార్పు జరుగనుందని తెలుస్తుంది. జింబాబ్వేతో ఆడబోయే తదుపరి మ్యాచ్కు (ఫిబ్రవరి 26) స్టార్ ఆటగాడు సంజూ శాంసన్ జట్టులోకి వస్తాడని అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే హింట్ ఇచ్చాడు. రాబోయే రోజుల్లో సంజూ టాకింగ్ పాయింట్ అవుతాడని డస్కటే సౌతాఫ్రికా మ్యాచ్ పూర్తయిన అనంతరం మీడియా సమావేశంలో అన్నాడు. దీన్ని బట్టి చూస్తే జింబాబ్వే మ్యాచ్లో సంజూ బరిలోకి దిగడం ఖాయమని తెలుస్తుంది.సంజూ జట్టులోకి వస్తే ఎవరిపై వేటు వేస్తారన్నదే, ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. హ్యాట్రిక్ డకౌట్లు సహా వరుసగా నాలుగో మ్యాచ్లోనూ విఫలమైన అభిషేక్ శర్మను తప్పిస్తారా లేక చెత్త ఫామ్లో ఉన్న తిలక్ వర్మపై వేటు వేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. డస్కటే వ్యాఖ్యలను అంచనా వేస్తే.. అభిషేక్పైనే వేటు పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి.ఎందుకంటే డస్కటే లెఫ్ట్ అండ్ రైట్ ఓపెనింగ్ కాంబినేషన్ల గురించి ప్రస్తావించాడు. అతని మాటల్లో.. టాపార్డర్లో ఉన్న ముగ్గురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ప్రతి మ్యాచ్లో ఆఫ్ స్పిన్ బౌలర్లకు బలవుతున్నారు. పాకిస్తాన్ మ్యాచ్లో సల్మాన్ ఆఘా, దక్షిణాఫ్రికా మ్యాచ్లో మార్క్రమ్ పవర్ప్లేలోనే వికెట్లు తీశారు. దీంతో తక్కువ స్కోర్లకే భారత్ వికెట్లు కోల్పోయింది. ఇది ఆందోళన కలిగించే అంశం. గత 18 నెలల్లో బాగా ఆడిన ఆటగాళ్లను కొనసాగించాలా లేక సంజూని జట్టులోకి తీసుకురావాలా అన్నదే ప్రస్తుతం చర్చనీయాంశమని డస్కటే అన్నారు.డస్కటే వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ప్రత్యర్ది ఆఫ్ స్పిన్ ప్రయోగాలను విజయవంతంగా ఎదుర్కొని, పవర్ ప్లేలో వికెట్లు కోల్పోకుండా ఉండాలంటే టాపార్డర్లో రైట్ హ్యాండ్ బ్యాటర్ అవశ్యకత ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ఆప్షన్ సంజూ మాత్రమే. సంజూను ఓపెనర్గా జట్టులోకి తీసుకుంటే.. ఇషాన్ కిషన్తో కలిసి కుడి-ఎడమ కాంబినేషన్ అవుతుంది. ఈ కాంబినేషన్తో ఆఫ్ స్పిన్నర్ల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడంతో పాటు మిగతా బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్కు కూడా భంగం కలిగించవచ్చు. జింబాబ్వే మ్యాచ్లో భారత మేనేజ్మెంట్ ఈ ప్రయోగాన్ని అమలు చేస్తుందో లేదో చూడాలి.ఇషాన్కు డిమోషన్..?ఒకవేళ భారత మేనేజ్మెంట్ తదుపరి మ్యాచ్ల్లో సంజూను జట్టులోకి తీసుకొని, అభిషేక్ను కూడా కొనసాగించాలనుకుంటే గత కొంతకాలంగా చెత్త ఫామ్లో తిలక్ వర్మపై వేటు వేయక తప్పదు. అప్పుడు అభిషేక్, సంజూతో ఓపెనింగ్ చేయించి, ఇషాన్ను వన్డౌన్లో పంపవచ్చు. అయితే ఈ అడుగు పడటం అంత సులువు కాకపోవచ్చు. ఎందుకంటే, ఓపెనర్గా ఇషాన్ మంచి లయలో ఉన్నాడు. అతన్ని ఆ స్థానం నుంచి తప్పించడమంటే చాలా పెద్ద సాహసం అవుతుంది. సెమీస్ అవకాశాలు కఠినమైన తరుణంలో భారత మేనేజ్మెంట్ ఇలాంటి సాహసాల జోలికి పోకపోవచ్చు. -
T20 WC 2026: జింబాబ్వే మరో సంచలన విజయం సాధిస్తుందా..?
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 23) వెస్టిండీస్, జింబాబ్వే మధ్య సూపర్-8 సమరం జరుగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు గెలుపు కోసం హోరాహోరీగా పోరాడే అవకాశం ఉంది. ఏ జట్టూ ఓటమిని అంత ఈజీగా ఒప్పుకోకపోవచ్చు. గ్రూప్ దశలో ఇరు జట్లు టాపర్లుగా నిలిచి సూపర్-8లోకి ప్రవేశించాయి. వెస్టిండీస్.. ఇంగ్లండ్, స్కాట్లాండ్, ఇటలీ, నేపాల్ జట్లపై విజయాలు సాధించి ఫైనల్-8కు అర్హత సాధించగా.. జింబాబ్వే గ్రూప్ దశలో పెను సంచలనాలే సృష్టించింది. ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఆస్ట్రేలియా జట్టుకు షాకిచ్చిన జింబాబ్వే.. తమ కంటే మెరుగైన శ్రీలంకను వారి సొంతగడ్డపైనే మట్టికరిపించింది. మరో మ్యాచ్లో పసికూన ఒమన్పై విజయం సాధించగా.. ఐర్లాండ్తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రపంచకప్ బరిలోకి దిగిన విండీస్, జింబాబ్వే.. గ్రూప్ దశలో అత్యుత్తమ ఫలితాలు సాధించడంతో నేటి మ్యాచ్కు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మ్యాచ్లో వెస్టిండీసే ఫేవరెట్ అయినా, జింబాబ్వేను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ ఎడిషన్లో వారి ఆటతీరు చాలా మెరుగ్గా కనిపిస్తుంది. జట్టులో ప్రతి ఒక్కరు విజయాల కోసం శక్తివంచన లేకుండా కృష్టి చేస్తున్నారు. ఏ ఒక్కరిపైనో ఆధారపడకుండా కలిసికట్టుగా ఆడుతున్నారు. వారి ప్రధాన ఆయుధాలు కెప్టెన్ సికందర్ రజా, పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీ. వీరిద్దరు మరోసారి చెలరేగితే విండీస్కు కష్టాలు తప్పకపోవచ్చు. ఈ టోర్నీలో ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. అతడు మరోసారి శుభారంభాన్ని ఇస్తే జింబాబ్వే భారీ స్కోర్ చేయగలుగుతుంది. ముజరబానీకి తోడుగా ఫామ్లో ఉన్న బ్రాడ్ ఈవాన్స్ కూడా రాణిస్తే.. విండీస్ బ్యాటర్లకు కష్టాలు తప్పవు.విండీస్ విషయానికొస్తే.. ఈ జట్టు కూడా ప్రస్తుత ప్రపంచకప్లో కలిసికట్టుగా ఆడుతూ వరుస విజయాలు నమోదు చేసింది. గ్రూప్ దశలో ఈ జట్టు ఒక్క బలమైన జట్టుపైనే (ఇంగ్లండ్) విజయం సాధించినప్పటికీ.. చిన్న జట్లపై వారి విజయాలను తీసిపారేయడానికి వీల్లేదు. ఆ మ్యాచ్ల్లో విండీస్ ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టారు. మరోసారి అదే ప్రదర్శనలు పునరావృతమైతే తొలిసారి సెమీస్కు చేరాలనుకున్న జింబాబ్వేకు ఆశాభంగం కలగవచ్చు. గత నాలుగు మ్యాచ్ల్లో కీలకపాత్ర పోషించిన హోప్, హెట్మైర్, షెపర్డ్, మోటీ, హోల్డర్, షమార్ జోసఫ్పై విండీస్ మరోసారి భారీ అంచనాలు పెట్టుకుంది. గత మ్యాచ్లకు దూరంగా ఉన్న రొమారియో షెపర్డ్ ఈ మ్యాచ్కు అందుబాటులోకి రావడం విండీస్ బలాన్ని మరింత పెంచుతుంది. 70 (విండీస్)-30 (జింబాబ్వే) అంచనాలు ఉన్న ఈ మ్యాచ్లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో చూడాలి. -
కొంపముంచిన గంభీర్
-
T20 WC 2026: టీమిండియా ఓటమికి అసలు కారణం ఇదే..!
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 22) సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో భారత్ 76 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్లో టీమిండియా బౌలింగ్ విభాగంలో పర్వాలేదనిపించినా, బ్యాటర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. ఛేదించగలిగే లక్ష్యమే అయినా ఒత్తిడికి చిత్తై చేతులెత్తేశారు. భారత బ్యాటర్లలో ఓ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. అదే ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. ఒకట్రెండు డాట్ బాల్స్ పడంగానే భారత బ్యాటర్లు సహనాన్ని కోల్పోయారు. మూడో బంతికి కచ్చితంగా బౌండరీనో, సిక్సరో బాదాలనే ఆత్రంలో వికెట్ పారేసుకున్నారు. భారత ఇన్నింగ్స్ మొత్తం ఇదే జరిగింది. ముందుగా క్రీజ్లో కుదురుకోవాలన్న బేసిక్ సెన్స్ ఏ ఒక్కరిలో కనపడలేదు. స్ట్రయిక్ రొటేట్ అవుతుంటే ఒత్తిడి కాస్త తగ్గుతుంది. కానీ భారత బ్యాటర్లు దీనిపై దృష్టి పెట్టలేదు. ప్రతి బంతిని బాధడమే పరమావధిగా పెట్టుకున్నారు. ఇలా జరగడం చాలా కష్టం. సింగిల్స్తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ, మధ్యలో చెత్త బంతులపై ఎదురుదాడి చేసుంటే బాగుండేది, కానీ భారత బ్యాటర్లు అలా చేయలేదు.ఓ పక్క వికెట్లు పడుతున్నా, ఒక్కరు కూడా క్రీజ్లో కుదురుకుందామని అలోచించలేదు. అయితే సిక్సర్ లేకపోతే ఔట్ అన్నట్లు వ్యవహరించారు. ఇదే భారత్ కొంపముంచింది. సౌతాఫ్రికా కెప్టెన్ వూహాత్మకంగా ఓ వైపు నుంచి స్పిన్నర్లు, మరోవైపు నుంచి పేసర్లతో అటాక్ చేస్తున్నా, భారత బ్యాటర్లు మొండిగా ముందుకు వెళ్లారు. అందుకు తగిన మూల్యం చెల్లంచుకున్నారు. ఇదే ఆటతీరును జింబాబ్వే, విండీస్ మ్యాచ్ల్లో కూడా కొనసాగిస్తే.. టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలవాలన్న కల సాకారం కాకపోవచ్చు. కాబట్టి భారత బ్యాటర్లు సౌతాఫ్రికా మ్యాచ్తో గుణపాఠం నేర్చుకుంటే మంచిదన్నది అభిమానులందరి అభిప్రాయం.కాగా, నిన్నటి మ్యాచ్లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. భారత పేసర్లు జస్ప్రీత్ బుమ్రా (4-0-15-3), అర్షదీప్ సింగ్ (4-0-28-2) 20 పరుగులకే 3 వికెట్లు తీసి ఇబ్బంది పెట్టినా, ఆతర్వాత డెవాల్డ్ బ్రెవిస్ (29 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో 63; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (24 బంతుల్లో 44 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) మెరుపు విన్యాసాలతో ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. బ్రెవిస్-మిల్లర్-స్టబ్స్ త్రయం బుమ్రా, అర్షదీప్ మినహా మిగతా భారత బౌలర్లందరిపైనా విరుచుకుపడ్డారు.వరుణ్ చక్రవర్తి (4-0-47-1), హార్దిక్ పాండ్యా (4-0-45-0), శివమ్ దూబే (2-0-32-1), వాషింగ్టన్ సుందర్ (2-0-17-0)పై ఎదురుదాడి చేశారు.అనంతరం ఓ మోస్తరుకు మించిన లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు సైతం ఆదిలోనే తడబడ్డారు. అయితే సౌతాఫ్రికన్లలా కాకుండా మిడిలార్డర్ పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో భారత ఓటమి ఛేదన ప్రారంభమైన కొద్ది సమయంలోనే ఖరారైపోయింది. నాలుగో బంతికే ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్ డకౌటయ్యాడు. ఆతర్వాత రెండు బంతులకే ఫామ్లో లేని తిలక్ వర్మ (1) కూడా పెవిలియన్కు చేరాడు. గత మూడు మ్యాచ్ల్లో డకౌటై ఒత్తిడిలో ఉన్న అభిషేక్ శర్మ (15) మరోసారి అదే ఒత్తిడికి చిత్తయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ (18) క్రీజ్లోకి వచ్చిన వెంటనే పలు చూడముచ్చటైన షాట్లు ఆడినా, బంతులు వృధా కావడంతో ఒత్తిడిలో పడి వికెట్ సమర్పించుకున్నాడు. వాషింగ్టన్ సుందర్కు (11) ప్రమోషన్ ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. శివమ్ దూబే (42) తన సహజ శైలిలో వేగంగా పరుగులు రాబట్టలేకపోయాడు. హార్దిక్ (18), రింకూ (0) కూడా నిరాశపరిచారు.మొత్తంగా భారత్ 18.5 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికా బౌలర్లు జన్సెన్ (3.5-0-22-4), కేశవ్ మహారాజ్ (3-0-24-3), కార్బిన్ బాష్ (3-0-12-2), మార్క్రమ్ (1-0-5-1) భారత పతనాన్ని శాశించారు. ఎంగిడి (4-0-15-0), రబాడ (4-0-32-0) వికెట్లు తీయలేకపోయినా అద్భుతంగా బౌలింగ్ చేశారు. -
T20 WC 2026: ముందుకు పోవాలంటే అన్నీ గెలవాల్సిందే..!
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్ నిన్న (ఫిబ్రవరి 22) తమ తొలి సూపర్-8 మ్యాచ్ ఆడింది. అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా ఊహించని పరాభవం ఎదుర్కొంది. తద్వారా సెమీస్ అవకాశాలను కఠినం చేసుకుంది. సెమీస్కు చేరాలంటే టీమిండియా ఇకపై ఆడే రెండు మ్యాచ్లు (వెస్టిండీస్, జింబాబ్వే) గెలవాల్సిందే. ఏ ఒక్క మ్యాచ్లో తడబడినా ఇతర జట్ల ఫలితాలు, నెట్ రన్రేట్పై ఆధార పడాల్సిన పరిస్థితి వస్తుంది. టీమిండియా ఈ స్థితికి రాకుండా ఉండాలంటే జింబాబ్వే, వెస్టిండీస్లను చిన్న జట్లని తక్కువ అంచనా వేయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.విండీస్, జింబాబ్వే పేరుకే చిన్న జట్లైనా, ఈ ప్రపంచకప్లో వారు ఏం చేశారో చూశాం. టీమిండియా లాగే ఆ జట్లు కూడా గ్రూప్ దశలో అన్ని మ్యాచ్లు గెలిచి టాపర్లుగా సూపర్-8లోకి అడుగుపెట్టాయి. పైగా ఆ జట్లు గ్రూప్ దశలో తమకంటే చాలా మెరుగైన జట్లపై విజయాలు సాధించాయి. జింబాబ్వే అయితే ఏకంగా ఆస్ట్రేలియా లాంటి అత్యుత్తమ జట్టుకే షాకిచ్చింది. శ్రీలంకను వారి సొంతగడ్డపైనే మట్టికరిపించింది. విండీస్ విషయానికొస్తే.. ఈ జట్టులో ఇటీవలికాలంలో ఎప్పుడూ కనపడని జోష్ కనిపిస్తుంది. పటిష్టమైన ఇంగ్లండ్కు షాకివ్వడంతో పాటు చిన్న జట్లపై పెద్దగా కష్టపడకుండానే విజయాలు సాధించింది.భారత్ ఫిబ్రవరి 26న జింబాబ్వేతో.. మార్చి 1న వెస్టిండీస్తో తలపడాల్సి ఉంది. జింబాబ్వే మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో.. విండీస్ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగాల్సి ఉన్నాయి. ఆయా వేదికలు భారత్కు అనుకూలమే అయినప్పటికీ.. ఏమరపాటుగా ఉంటే మాత్రం సౌతాఫ్రికా చేతిలో ఎదురైన పరాభవమే పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి చిన్న జట్లని తేలికగా తీసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. -
టీమిండియా కొంపముంచిన గంభీర్.. నెటిజన్లు ఫైర్
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో 74 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో భారత బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమైంది.188 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక టీమిండియా చతికలపడింది. అయితే టీమ్మెనెజ్మెంట్ చేసిన కొన్ని తప్పిదాలు కూడా మెన్ ఇన్ బ్లూ ఓటమికి కారణమమ్యాయి. ముఖ్యంగా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ స్ధానంలో వాషింగ్టన్ సుందర్ని ఆడించి భారత మెనెజ్మెంట్ ఘోర తప్పిదం చేసింది.అద్భుతమైన ఫామ్లో ఉన్న అక్షర్కు నెదర్లాండ్స్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో విశ్రాంతి ఇచ్చారు. అతడి స్దానంలో సుందర్ను తుది జట్టులో ఆడించారు. అయితే సఫారీలతో సూపర్-8 మ్యాచ్కు అక్షర్ తిరిగి అందుబాటులోకి వస్తాడని అంతా భావించారు. కానీ అక్షర్ను బెంచ్కే పరిమితం చేస్తూ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.టాస్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఇది కేవలంవ్యూహాత్మక నిర్ణయం మాత్రమేని చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికా టాప్-5లో ముగ్గురు ఎడమచేతి బ్యాటర్లు ఉండడంతో, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ కంటే ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ వుంటే బాగుంటుందని మేనేజ్మెంట్ భావించింది. కానీ మెనెజ్మెంట్ వ్యూహం బెడిసికొట్టింది. పవర్ప్లేలో సుందర్తో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయింలేదు.కెప్టెన్ అతడిని ఏడో ఓవర్లో ఎటాక్లోకి తీసుకొచ్చాడు. అలా అనీ నాలుగు ఓవర్ల కోటా కూడా పూర్తి చేయించలేదు. సుందర్ రెండు ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చాడు. బ్యాటింగ్లో కూడా సుందర్ అట్టర్ ప్లాప్ అయ్యాడు. 11 బంతుల్లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో గంభీర్పై నెటిజన్లు ఫైరవతున్నారు. "కేవలం 'మ్యాచ్-అప్'ల కోసం ఫామ్లో ఉన్న ప్లేయర్ను తప్పించడం ఎంతవరకు సమంజసం?" అని గంభీర్ను ప్రశ్నిస్తున్నారు. -
మా ఓటమికి కారణమదే.. మళ్లీ బలంగా తిరిగొస్తాం: సూర్యకుమార్
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది. ఈ మెగా టోర్నీలో బాగంగా అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 76 పరుగుల తేడాతో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 18.5 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఈ ఓటమికి బౌలర్ల కంటే బ్యాటర్ల వైఫల్యమే ప్రధాన కారణమని సూర్య చెప్పుకొచ్చా డు."మ్యాచ్ ఆరంభంలో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. 20 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి జట్టును బ్యాక్ఫుట్లో ఉంచాం. కానీ ఆ తర్వాత వారు ఆడిన తీరు నిజంగా అద్బుతం. పవర్ప్లే ముగిసిన తర్వాత దాదాపు 15 ఓవర్లకు మాపై పైచేయి సాధించారు.తర్వాత మళ్లీ వరుసగా వికెట్లు పడగొట్టి మేము తిరిగి గేమ్లోకి వచ్చాము. చివరి ఓవర్లో మళ్లీ పరుగులు వచ్చాయి. ఓవరాల్గా బౌలింగ్ పరంగా ఫర్వాదేన్పించాము. బుమ్రా, అర్ష్దీప్ జోడీ అద్బుతంగా బౌలింగ్ చేసింది. ఇద్దరూ కలిసి 5 వికెట్లు పడగొట్టారు.అయితే బ్యాటింగ్ కాస్త మెరుగ్గా చేసి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది. 180 పరుగులు పైగా లక్ష్యాన్ని చేధిస్తున్నప్పుడు పవర్ప్లే అనేది చాలా ముఖ్యం. కానీ దురదృష్టవశాత్తూ పవర్ప్లేలో మేము రాణించలేకపోయాం. వరుసగా వికెట్లు కోల్పోవడంతో చిన్న చిన్న భాగస్వామ్యాలు కూడా నెలకొల్పలేకపోయాం. కచ్చితంగా ఈ ఓటమిని నుంచి పాఠాలు నేర్చుకుంటాము. మళ్లీ బలంగా తిరిగి వస్తామన్న నమ్మకం నాకుంది. చెన్నైలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్ను కొనసాగిస్తాము . సరైన ప్రణాళికతో బరిలోకి దిగి మళ్ళీ గెలుపు బాట పడతాము" అని పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో సూర్య పేర్కొన్నాడు. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. శివమ్ దూబే మినహా మిగితా ప్లేయర్లంతా ఘోరంగా విఫలమయ్యారు. -
టీమిండియా జోరుకు బ్రేక్.. సౌతాఫ్రికా చేతిలో ఘోర ఓటమి
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా జోరుకు సౌతాఫ్రికా బ్రేక్లు వేసింది. అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో 76 పరుగుల తేడాతో భారత్ ఘోర పరాజయం పాలైంది. 188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా, సఫారీ బౌలర్ల ధాటికి విల్లవిల్లాడింది.లక్ష్య చేధనలో సూర్య కుమార్ సేన 18.5 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో శివమ్ దూబే(42) టాప్ స్కోరర్గా నిలవగా, మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లోనూ తీవ్ర నిరాశపరిచాడు. కేవలం 15 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కేశవ్ మహారాజ్ మూడు, బాష్ రెండు వికెట్లు సాధించారు. ఈ మ్యాచ్లో సఫారీలు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడింటిలోనూ అదరగొట్టారు.మిల్లర్ అదుర్స్..ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను మిడిలార్డర్ బ్యాటర్లు ఆదుకున్నారు. ప్రోటీస్ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్(63) టాప్ స్కోరర్ నిలవగా.. బ్రెవిస్(45), స్టబ్స్(44) రాణించారు.భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్దీప్ సింగ్ రెండు, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలా వికెట్ సాధించారు. ఇక భారత్ సెమీఫైనల్కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్లలోనూ తప్పనిసరిగా విజయం సాధించాలి. టీమిండియా తమ తదుపరి మ్యాచ్లో ఫిబ్రవరి 26న జింబాబ్వేతో తలపడనుంది. ఆ తర్వాత వెస్టిండీస్తో భారత్ ఆడనుంది. -
అభిషేక్ మరో 'సారీ'.. సౌతాఫ్రికాపై అట్టర్ ప్లాప్
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. లీగ్ స్టేజ్లో ఆడిన మూడు మ్యాచ్ల్లో డకౌటైన అభిషేక్ ఇప్పుడు సూపర్-8 దశలోనూ అదే తీరును కనబరుస్తున్నాడు.అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్లో శర్మ ఘోరంగా విఫలమయ్యాడు. 12 బంతులు ఎదుర్కొన్న అభిషేక్.. 2 ఫోర్లు, ఒక సిక్సర్తో 15 పరుగులు చేసి ఔటయ్యాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ అవుట్గా అభిషేక్ వెనుదిరిగాడు. టీ20ల్లో వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్గా ఉన్న అభిషేక్పై భారత అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అభిషేక్ మాత్రం దారుణ ప్రదర్శన కనబరుస్తూ అందరిని నిరాశపరిచాడు. దీంతో అభిషేక్ను పక్కన పెట్టి సంజూ శాంసన్కు అవకాశమివ్వాలని క్రికెట్ నిపుణులు టీమ్మెనెజ్మెంట్ను సూచిస్తున్నారు.అదరగొట్టిన మిల్లర్, బ్రెవిస్ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను మిడిలార్డర్ బ్యాటర్లు ఆదుకున్నారు. డేవిడ్ మిల్లర్(63) టాప్ స్కోరర్ నిలవగా.. బ్రెవిస్(45), స్టబ్స్(44) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్దీప్ సింగ్ రెండు, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలా వికెట్ సాధించారు


