T20 WC 2026: విండీస్‌తో డూ ఆర్‌ డై మ్యాచ్‌.. టీమిండియా ఇదే..! | T20 WC 2026 IND VS WI: team india won the toss and choose to bowl | Sakshi
Sakshi News home page

T20 WC 2026: విండీస్‌తో డూ ఆర్‌ డై మ్యాచ్‌.. టీమిండియా ఇదే..!

Mar 1 2026 6:40 PM | Updated on Mar 1 2026 6:40 PM

T20 WC 2026 IND VS WI: team india won the toss and choose to bowl

టీ20 ప్రపంచకప్‌ 2026లో ఇవాళ (మార్చి 1) డూ ఆర్‌ డై మ్యాచ్‌ జరుగుతుంది. కోల్‌కతా వేదికగా జరుగనున్న  ఈ సూపర్‌-8 మ్యాచ్‌లో భారత్‌, వెస్టిండీస్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్‌-1 నుంచి సెమీస్‌కు చేరుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

అత్యంత ​కీలకమైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్‌లో జింబాబ్వేపై ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. మరోవైపు ఈ మ్యాచ్‌ కోసం వెస్టిండీస్‌ ఓ మార్పు చేసింది. బ్రాండన్‌ కింగ్‌ స్థానంలో అకీల్‌ హొసేన్‌  తుది జట్టులోకి వచ్చాడు.

తుది జట్లు..
భారత్‌: సంజూ శాంసన్ (WK), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్

వెస్టిండీస్‌: షాయ్ హోప్ (c & wk), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రోస్టన్ చేజ్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్‌, అకీల్ హోసేన్, గుడకేష్ మోటీ, షమర్ జోసెఫ్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement