నమో నీలకంఠా..
భోళా శంకరుడు లింగరూపంలో ఉద్భవించే మహాశివరాత్రి వేడుకలకు జిల్లాలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. పరమ పవిత్రమైన శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శివుడి దర్శనం, అభిషేకంతో జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. శివరాత్రి వేడుకలకు నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వరాలయం, శంభులింగేశ్వరాలయంతోపాటు జిల్లాలోని ఆర్మూర్ సిద్దులగుట్ట, సిరికొండ మండలంలోని లొంకరామలింగేశ్వరాలయం తదితర ఆలయాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయా ఆలయాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీలు, ఎండోమెంట్ అధికారులు ఏర్పాట్లు చేశారు. – నిజామాబాద్ రూరల్
నమో నీలకంఠా..


