Nizamabad District Latest News
-
ట్యూమర్కు భయపడొద్దు..
బ్రెయిన్ట్యూమర్ అనగానే భయపడొద్దు. గతంలో ట్యూమర్ వస్తే చనిపోతారనే భయం ఉండేది. ప్రస్తుతం వైద్యం అందుబాటులో ఉంది. ట్యూమర్లో చాలా రకాల క్యాన్సర్లు ఉంటాయి. ప్రతి ట్యూమర్ క్యాన్సర్ కాదు. 50శాతం క్యాన్సర్ ఉండదు. ఆపరేషన్తో నయం అవుతుంది. చాలా ట్యూమర్లు జన్యుపరమైనవి కావచ్చు. ఏదీ ఏమైనా ఎమ్ఆర్ఐ చేస్తే తెలిసిపోతుంది. తద్వారా చికిత్సతో నయమవుతుంది. – నరసింహ కట్ట, న్యూరోసర్జన్, మనోరమ ఆస్పత్రి మంచి చికిత్స ఉంది ఒక వ్యాధిగా కాకుండా, రోగికి కొత్త జీవితాన్ని ప్రసాదించే అవకాశంగా చూస్తాం. అధునాతన, న్యూరో–నావిగేషన్ సిస్టమ్స్, మినిమల్ ఇన్వాసివ్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ వంటి అత్యాధునిక పద్ధతులను ఉపయోగించి, రోగులకు సురక్షితమైన, వేగవంతమైన కోలుకునే చికిత్సను అందిస్తున్నాం.ఒక చిన్న స్కాన్, ఒక సరైన వైద్య నిర్ణయం ఒకరి జీవితాన్ని, ఒక కుటుంబ భవిష్యత్తును పూర్తిగా మారుస్తుంది. – శ్రీకృష్ణ ఆదిత్య, న్యూరోసర్జన్, మెడికవర్ ఆస్పత్రి -
అటు వెలుగులు.. ఇటు చీకట్లు..
డిచ్పల్లి: మండల కేంద్రంలోని నాగ్పూర్ రైల్వే గేట్ నుంచి నడిపల్లి, బర్ధిపూర్, ధర్మారం(బి), మాధవనగర్ మీదుగా బోర్గాం (పి) వరకు ప్రధాన రహదారి మధ్యలో డివైడర్లను నిర్మించి మధ్యలో మొక్కలతోపాటు లైట్లు అమర్చారు. లైట్ల నిర్వహణ బాధ్యతను నుడా (నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) పర్యవేక్షిస్తోంది. డివైడర్ మధ్యలో మొక్కలకు నీళ్లు పెట్టడం, ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటి సంరక్షించడం వంటి పనులు నుడా ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. అయితే లైట్లను మాత్రం ఆయా గ్రామ పంచాయతీలకు వదిలేశారు. అయితే అటు నుడా, ఇటు గ్రామ పంచాయతీలు లైట్ల నిర్వహణను పట్టించుకోవడం లేదు. నడిపల్లి గ్రామ పరిధిలో లైట్లు 24 గంటలు వెలుగుతుంటే.. బర్ధిపూర్ పరిధిలోని కార్ల షోరూముల నుంచి నిజాంసాగర్ కాలువ వరకు లైట్లు వెలుగక రోడ్డు చీకటిగా ఉంటోంది. రాత్రి పూట వాహనదారులు చీకట్లో ప్రయాణిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. -
పరుగు పెడితే పతకమే..
వేల్పూర్: రవాణాశాఖలో హోం గార్డుగా పని చేస్తున్న గుగ్గిలం అశోక్ రన్నింగ్లో జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు. వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన అశోక్ పుట్టిన ఊరితోపాటు రాష్ట్రానికి గుర్తింపు తీసుకువస్తున్నాడు. పరుగు పెడితె పతకమే అన్న విధంగా దశాబ్దానికి పైగా జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటూ సుమారు 65 పతకాలు సాధించాడు. రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆదివారం అవంతిక కన్స్ట్రక్షన్స్ నిర్వహించే 3కే, 5కే, 10కే, 21కే రన్నింగ్ పోటీలకు అశోక్ అంబాసిగర్గా గుర్తింపు పొందాడు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించనున్నారు. నాలుగు మారథాన్లకు అంబాసిడర్ జాతీయస్థాయి రన్నింగ్లో ప్రతిభ చాటిన అశోక్ ఇప్పటివరకు నాలుగు మారథాన్లకు అంబాసిడర్గా ఎంపికయ్యారు. మొదట కామారెడ్డిలో మా అసోసియేషన్ వారు నిర్వహించిన ఆఫ్ మారథాన్కు, హైదరాబాద్లో నిర్వహించిన హిస్టారికల్ రన్కు, వరంగ్లో నిర్వహించిన మారథాన్కు అంబాసిడర్గా వ్యవహరించగా, ఆదివారం హైదరాబాద్లో నిర్వహించనున్న ఈవెంట్కు అంబాసిడర్గా వ్యవహరించనున్నారు.పేదరికం నుంచి పరుగువైపు..వేల్పూర్లో గురువు మురళీధర్రెడ్డి వద్ద శిక్షణ పొందిన అశోక్ మండల, జోన్, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఎన్నో పతకాలు సాధించారు. విద్యార్థి దశలోనే సంగారెడ్డిలోని స్పోర్ట్స్ హాస్ట ల్లో ప్రవేశం లభించినా పేదరికం అడ్డురావడంతో వెళ్లలేకపోయారు. ఇంటర్ వరకు చదివిన అశోక్ కుటుంబ పోషణకు ఆటో నడుపు తూ పదేళ్లపాటు ఆటలకు దూరంగా ఉన్నారు. 2012లో స్పోర్ట్స్ కోటాలో రవాణాశాఖలో హోంగార్డుగా ఉద్యోగం పొందిన అశోక్ ప్రస్తు తం కామారెడ్డిలో విధులు నిర్వర్తిస్తున్నారు. క్రీడలపై ఉన్న మక్కువతో తిరిగి తన సాధనను ప్రారంభించాడు. అశోక్ను కామారెడ్డిలో ఫిజికల్ డైరెక్టర్ గోపీరెడ్డి మా అసోసియేషన్లో చేర్చి ప్రోత్సహించారు. వేల్పూర్ వాసి పన్నాల హరీశ్రెడ్డి సూచనతో లాంగ్ రన్నింగ్పై దృష్టి సారించారు. ఉమ్మడి రాష్ట్రం తరఫున విశిష్ట పురస్కారంరన్నింగ్ పోటీల్లో జాతీయస్థాయి క్రీడాకారుడిగా పేరుపొందిన అశోక్ను ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన రవీంద్రభారతిలో ఉమ్మడి రాష్ట్రాల ఉత్తమ క్రీడాకారుడిగా కవయిత్రి మొల్లమాంబ జయంతి సందర్భంగా శాలివాహన విశిష్ట్ట పురస్కారంతో ఏసీపీ డీజీపీ, తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్ పూర్ణచందర్రావు, ఇతర అధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. మెదక్ ఎంపీ రఽఘునందన్రావు సైం అఽభినందించారు. వేల్పూర్ వీడీసీ వారు, మిత్రులు, శ్రేయోభిలాషులు పలుమార్లు అశోక్ను సన్మానించారు. దశాబ్దానికి పైగా జాతీయస్థాయిలో రాణిస్తున్న వేల్పూర్ వాసి అశోక్ నేడు హైదరాబాద్లో నిర్వహించనున్న పోటీలకు అంబాసిడర్గా ఎంపిక కామారెడ్డి రవాణాశాఖలో హోంగార్డుగా ఉద్యోగం చేస్తూనే రాణింపుఒలింపిక్స్లో పతకం సాధించాలి ఒలింపిక్స్లో నిర్వహించే 42 కిలోమీటర్ల ఫుల్ మారథాన్ పోటీల్లో పాల్గొని పతకం సాధించాలన్నదే నా కోరిక. ఈ రన్నింగ్ ఈవెంట్తో ఒలింపిక్ పోటీలకు ముగింపు పలుకుతారు. ఇప్పటిదాకా సాధించిన విజయాల స్ఫూర్తితో ఒలింపిక్లో పతకం సాధిస్తా. నన్ను ప్రోత్సహిస్తున్న ఆత్మీయులందరికీ రుణపడి ఉంటా. – అశోక్ -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
మోపాల్(నిజామాబాద్రూరల్): మోపాల్లోని ఫిట్ నెస్ క్లబ్లో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన 11వ జిల్లా సెలెక్షన్ టోర్నమెంట్ వివిధ విభాగాల్లో రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేసినట్లు అసోసియేష న్ అధ్యక్ష, కార్యదర్శులు కర్నాటి వాసు, కేవీ కిరణ్కుమార్ తెలిపారు. పురుషులు, మహిళల విభాగంలో సింగిల్స్, డబుల్స్లో విజేతలు రాష్ట్రస్థాయి పో టీలకు అర్హత సాధించారన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి సాయిరెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు ప్రకా శ్, సంయుక్త కార్యదర్శి గంగాధర్గౌడ్ పాల్గొన్నారు. ఎంపికై న క్రీడాకారులు.. సింగిల్స్ విభాగంలో పి ప్రణవ్ శ్రీకర్ (విన్నర్), కె మానవు (రన్నర్), డబుల్స్ విభాగంలో కె ప్రణయ్, ఎం రోహిత్ (విన్నర్), మహిళల సింగిల్ విభాగంలో ఏ శ్రీవల్లి (విన్నర్), డబుల్స్ విభాగంలో ఎస్వీఎస్ శ్రీ వైష్ణవి, ఏ శ్రీవల్లి, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో దుర్కికర్ సాయిచరణ్, జి కనిష్క (విన్నర్, అండర్–19), సింగిల్స్ బాలుర విభాగంలో కె మానవు (విన్నర్), ఎస్ విశ్వక్ (రన్నర్), డబుల్స్ బాలుర విభాగంలో ఎం విశ్వజిత్, ఎస్ విశ్వక్ (విన్నర్), అండర్–17 బాలుర విభాగంలో ఎం విశ్వజిత్ (విన్నర్), కె కార్తికేయ (రన్నర్), డబుల్స్ బాలుర విభాగంలో (అండర్–17), ఎం వాస్తవ్ అండ్ వై రూపాలు (విన్నర్). -
దేవుడి పేరే ఊరి పేరైంది
మీకు తెలుసా? బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ప్రవేశాలు ఇలా..మీకోసంవీరన్నగుట్ట గ్రామానికి ఆ పేరు రావడానికి ఓ చరిత్ర ఉంది. నాలుగు వందల సంవత్సరాల కిందట గుట్టమీద ఉన్న బండరాయి పగిలి రెండుగా విడిపోగా వాటి మధలో వీరభద్రస్వామి విగ్రహం బయటపడినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అప్పటి నుంచి చుట్టుపక్కల గ్రామాల భక్తులు ఆలయంలో పూజలు ప్రారంభించారు. కొంతకాలానికి బోధన్ షుగర్ ఫ్యాక్టరీ భూముల్లో చెరుకు నరికేందుకు పలు ప్రాంతాలకు చెందిన కూలీలు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ముందుగా సాటాపూర్ ఫారంగా పంచాయతీ ఏర్పాటైంది. కాలక్రమేణ జనాభా పెరగడంతో వీరన్నగుట్టగా దేవుడిపేరుతో గ్రామానికి పేరు వచ్చింది. ప్రతి సంవత్సరం మహా శివరాత్రి జరిగిన మూడో రోజు ఇక్కడి ఆలయంలో రథోత్సవం, జాతరను వైభవంగా నిర్వహిస్తారు. భక్తుల కొంగు బంగారంగా వీరభద్రుడు విరాజిల్లుతున్నాడు. – రెంజల్(బోధన్)జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ఎస్సీ (షెడ్యూల్డ్ కులం) విద్యార్థులు మాత్రమే ప్రవేశాలు పొందవచ్చు. ఒకటో తరగతి (నాన్ రెసిడెన్షియల్), ఐదో తరగతి (రెసిడెన్షియల్)ల్లో ప్రవేశాల కోసం ఆసక్తి ఉన్న విద్యార్థులు సంబంధిత పాఠశాలల్లో దరఖాస్తులు అందించాలి. దరఖాస్తులు లభించే ప్రాంతం ● నిజామాబాద్ డివిజన్కు చెందిన విద్యార్థులు జిల్లా కేంద్రంలోని కోటగల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో(63026 61897) సంప్రదించాలి. ● బోధన్ డివిజన్కు చెందిన విద్యార్థులు విజయమేరీ ఉన్నత పాఠశాలలో(90103 42437) సంప్రదించాలి. ● ఆర్మూర్ డివిజన్కు చెందిన విద్యార్థులు ప్రభుత్వ ఎస్సీ బాలికల కళాశాలలో(96760 96374) సంప్రదించాలి. దరఖాస్తు చివరి తేదీ ఈనెల 16 అవసరమైన ధ్రువపత్రాలు కుల, ఆదాయ, నేటివిటీ ధ్రువీకరణపత్రాలతోపాటు బర్త్ సర్టిఫికేట్, ఆధార్కార్డు, రేషన్కార్డు. గెజిటెడ్ అధికారి ధ్రువీకరించాల్సి ఉంటుంది. అర్హతలు ● ఒకటో తరగతిలో ప్రవేశం కోసం ఎస్సీ కులానికి చెందిన విద్యార్థులు 1.6.2019 నుంచి 31.05.2020 మధ్యలో జన్మించి ఉండాలి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కుటుంబ సంవత్సర ఆదాయం రూ.లక్షా50వేలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలోపు మించొద్దు. ● ఐదో తరగతిలో ప్రవేశం కోసం నాల్గో తరగతి బోనొఫైడ్, ప్రోగ్రెస్కార్డు జిరాక్స్ తప్పనిసరిగా సమర్పించాలి. సీట్ల కేటాయింపు ఇలా ● ఒకటో తరగతిలో ఎస్సీ గ్రూప్–1 వారికి ఏడు సీట్లు, గ్రూప్–2 వారికి 61 సీట్లు, గ్రూప్–3 వారికి 34 సీట్లు. ● ఐదో తరగతిలో గ్రూప్–1లో ఏడు, గ్రూప్–2లో 60, గ్రూప్–3లో 34 సీట్లు కేటాయించారు. ఐదో తరగతికి హాస్టల్ సదుపాయం ఉంటుంది. – నిజామాబాద్అర్బన్పోలీసుశాఖ ఉన్నతాధికారులునిజామాబాద్ సీపీ 87126 59800 నిజామాబాద్ ఏసీపీ 87126 59807 బోధన్ ఏసీపీ 87126 59809 ఆర్మూర్ ఏసీబీ 87126 59808 ట్రాఫిక్ ఏసీపీ 87126 59810 టాస్క్ఫోర్స్, సీసీఎస్ ఏసీపీ 87126 59812 -
ఎవరెస్టు శిఖరం అధిరోహించిన లింబాద్రి
మోర్తాడ్(బాల్కొండ): భీమ్గల్ మండలం బాబానగర్ తండాకు చెందిన మలావత్ లింబాద్రి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. మలావత్ తిరుపతి కుమారుడు లింబాద్రి నూత్పల్లిలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకులంలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఎవరెస్టు అడ్వెంచర్ శిబిరానికి ఎంపికై న 20 మంది విద్యార్థుల్లో లింబాద్రి ఒకరు. గత నెలలో బయల్దేరిన ఈ బృందం 5,150 మీటర్ల ఎత్తులోని ఎవరెస్ట్ నార్త్ బేస్క్యాంపునకు శనివారం చేరుకున్నారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణ, రాకేశ్ ఆధ్వర్యంలో ఈ విద్యార్థుల బృందం పర్వతారోహణకు వెళ్లింది. చిన్న వయస్సులోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన లింబాద్రిని ఆర్సీవో సత్యనాథ్రెడ్డి, నూత్పల్లి పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్గౌడ్, పీడీ ప్రదీప్ అభినందించారు. లింబాద్రి పర్వతారోహణ విజయవంతం కావడంతో బాబానగర్ తండావాసులు, భీమ్గల్ మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 9 నుంచి డీఈఈ సెట్–2025 ధ్రువపత్రాల పరిశీలన సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రై మరీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల ప్రవేశానికి ఇటీవల నిర్వహించిన డీఈఈ సెట్–2025 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 9 నుంచి నిజామాబాద్ డైయిట్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ టి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు వారికి కేటాయించిన తేదీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్కు హాజరు కావాలని సూచించా రు. ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో పా టు డీఈఈ సెట్ హాల్ టికెట్, ర్యాంకు కా ర్డు, ఇటీవల పొందిన ఆదాయ ధ్రువీకరణ ప త్రం, ఇంటిగ్రేటెడ్ కుల ధ్రువీకరణ పత్రం, పదోతరగతి, ఇంటర్మీడియట్ మార్కుల మెమోలు, 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు బోనోఫైడ్ సర్టిఫికెట్లు, ఇతర రిజర్వేషన్లు (ఎన్సీసీ, క్రీడలు, దివ్యాంగుల ధ్రువీకరణ పత్రాలు) ఉంటే సంబంధిత ఒరిజినల్ ధ్రువపత్రాలతో వెరిఫికేషన్కు హాజరు కావాలన్నారు. డీఈఈ సెట్ వెబ్సైట్లో హాజరు కావాల్సిన తేదీ, స్థలం, ఒరిజినల్ సర్టిఫికెట్ల వివరాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఇతర సందేహాలుంటే 63095–35759, 88864–48818 నంబర్లను సంప్రదించాలని టి శ్రీనివాస్ తెలిపారు. -
బాసరలో మకాం.. నిజామాబాద్లో చోరీలు
ఖలీల్వాడి: బాసరలో ఇల్లు అద్దెకు తీసుకుని నిజామాబాద్లో చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని చిలుకల వాడకు చెందిన షేక్ యామీన్ అలియాస్ సమీర్ అలియాస్ గోపి (40), ఆదిలాబాద్ జిల్లా తాటిగూడ రైల్వేస్టేషన్కు చెందిన సయ్యద్ ఫరూక్ (22), మహారాష్ట్రకు చెందిన సత్య నిర్మల్ జిల్లా బాసరలో ఇంటిని అద్దెకు తీసుకుని నిజామాబాద్ జిల్లాలో చోరీలకు పాల్పడుతున్నారు. యామీన్, సయ్యద్ ఫరూక్ 20 పైగా కేసుల్లో జైలుకి వెళ్లి వచ్చారు. శనివారం నిజామాబాద్ నగరంలోని రైల్వేస్టేషన్లో పార్క్ చేసిన బైక్ని దొంగతనం చేసి, అదే బైక్పై చోరీ కోసం వెళ్తుండగా పోలీసులు పట్టుకుని విచారించారు. నిందితులు ఎడపల్లి పీఎస్ పరిధిలోని ఓ ఇంటితోపాటు పాన్షాప్లో, నగరంలోని మూడో టౌన్ పీఎస్ పరిధిలోని తాళం వేసి ఉన్న ఇంట్లో, జక్రాన్పల్లి పీఎస్ పరిధిలోని బెల్ట్షాప్లో, రైళ్లలో తిరుగుతూ సెల్ఫోన్ల చోరీకి పాల్పడినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. నిందితుల్లో సత్య పరారీలో ఉండగా, పట్టుబడ్డ నిందితుల నుంచి రూ.5 వేల నగదు, ఐదు సెల్ఫోన్లు, ఒక టీవీ, రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. నిందితుల నుంచి దొంగసొత్తును కొన్న హైదరాబాద్లోని కొంపెల్లికి చెందిన అరవింద్ ప్రసాద్పైన కూడా కేసు నమోదు చేసి, నిందితులను రిమాండ్కు తరలించామన్నారు. ముగ్గరి అరెస్ట్.. పరారీలో ఒకరు -
అడ్మిషన్లు ఓ చోట.. చదువు మరోచోట
మోర్తాడ్(బాల్కొండ): మహాత్మా జ్యోతిబాపూలే గు రుకుల కళాశాలల నిర్వహణకు అనువైన భవనాలు లేకపోవడంతో అడ్మిషన్లు ఓ చోట తీసుకుంటూ తరగతులను మరోచోట నిర్వహించాల్సిన పరిస్థితి ఏ ర్పడింది. గురుకుల కళాశాలలకు, పాఠశాలలకు సొంత భవనాల నిర్మాణం అటకెక్కడంతో కళాశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందనే అభిప్రా యం వ్యక్తమవుతోంది. మోర్తాడ్, డిచ్పల్లి మండ లం రాంపూర్, నిజామాబాద్ అర్బన్, మోపాల్లో ఉన్న బీసీ గురుకుల పాఠశాలల్లో ఇంటర్ విద్యను(2023–24) ప్రవేశపెట్టారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపుల్లో చదువు చెబుతున్నారు. అర్బన్ కళాశాలకు సంబంధించి అదనంగా హెచ్ఈసీ గ్రూపులోనూ విద్యనందిస్తున్నారు. ఈ అన్ని గురుకుల పాఠశాలల్లో ఇంటర్ అప్గ్రేడ్ చేసినా సొంత భవనాలు లేకపోవడంతో విద్యార్థులకు సరిపడే వసతులు అందుబాటులో లేకపోయాయి. ఫలితంగా ధర్మారంలోని ఓ ప్రైవేట్ భవనాన్ని బీసీ గురుకులాల సంస్థ అద్దెకు తీసుకుంది. కళాశాల తరగతులను భౌతికంగా నిర్వహించేది ధర్మారంలోనైతే అడ్మిషన్ల ప్రక్రియ మొదలుకొని విద్యార్థులకు సంబంధించిన మెస్ బిల్లులు, ఇతర లావాదేవీలు అన్ని ఆయా గురుకుల పాఠశాలల్లోనే కొనసాగిస్తున్నారు. ధర్మారంలోని ప్రైవేట్ భవనంలో ఏ కళాశాలకు సంబంధించి అక్కడి విద్యార్థులకు తరగతులను నిర్వహిస్తూ ప్రత్యేక వసతి, భోజన సదుపాయంను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి బీసీ గురుకులాలకు సొంత భవనాలను నిర్మిస్తే ఇంటర్ తరగతుల నిర్వహణ ఎక్కడికక్కడే సాధ్యం చేయవచ్చనే వాదన బలంగా వినిపిస్తోంది. బీసీ గురుకుల కళాశాలలకు అనువైన భవనాలు లేకపోవడంతో.. ధర్మారంలో అద్దె భవనంలో ఇంటర్ తరగతుల నిర్వహణ అన్ని కళాశాలలదీ అదే పరిస్థితి అనువైన స్థలాలు లేక.. బీసీ గురుకుల కళాశాలల విద్యార్థులకు సంబంధించి ఆయా గురుకులాలల్లోనే బిల్లుల తయారు ఇతర అంశాలు పరిశీలిస్తున్నాం. అనువైన స్థలాలు లేకపోవడంతో తరగతుల నిర్వహణ ధర్మారంలో కొనసాగుతోంది. సొంత భవనాల నిర్మాణం పూర్తయితేనే సమస్య పరిష్కారమవుతుంది. – ప్రసాద్, బీసీ గురుకుల ప్రిన్సిపాల్, మోర్తాడ్ -
మీ మెదడు చెప్పే మాట వినండి
నిజామాబాద్నాగారం: తలనొప్పిని పని ఒత్తిడిగా... మతిమరుపును వయసు ప్రభావంగా... కళ్ళు తిరగడాన్ని అలసటగా తేలికగా తీసుకుంటాం. ఒక్కోసారి సాధారణ లక్షణాలే మన మెదడులోని ఒక తీవ్రమైన సమస్యకు సంకేతాలు కావొచ్చు. మీ మెదడు మౌనంగా సహాయం కోరుతోందేమో ఎప్పుడైనా ఆలోచించారా..? మెదడు చెప్పే మాట వింటే మనం ముప్పు నుంచి బయటపడొచ్చు. నేడు(ఆదివారం) ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భం ప్రత్యేక కథనం.. జిల్లాలో ఇలా... జిల్లాలో సుమారు 10మంది వరకు న్యూరో సర్జన్లు ఉన్నారు. ఒక్కో వైద్యుడి వద్దకు నెలకు 4వరకు బ్రెయిన్ ట్యూమర్కు సంబంధించిన రోగులు వస్తున్నారు. నెలకు సుమారు 40మంది వరకు బ్రెయిన్ ట్యూమర్ బాధితులు వైద్యుల వద్దకు ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. ఎమ్ఆర్ఐ స్కానింగ్ చేస్తే ఎలాంటి ట్యూమర్ ఉందో ఇట్లే తెలుసుకోవచ్చు. తద్వారా చికిత్స తీసుకుంటే నయం అవకాశాలు ఎక్కువ. లక్షణాలు మీకు మీ కుటుంబసభ్యులకు ఉదయం పూట తరచుగా వచ్చే తీవ్రమైన తలనొప్పులు, వ్యక్తిత్వంలో అకస్మాత్తుగా మార్పులు, చూపు మసకబారడం, మాట తడబడటం, మతిమరుపు లేదా గతంలో ఎప్పుడూ లేని ఫిట్స్ (మూర్ఛలు) వంటి లక్షణాలు ఉంటే గమనించాలి. వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. ఇవి బ్రెయిన్ ట్యూమర్ సంకేతాలు కావొచ్చు. వీలైనంత త్వరగా డాక్టర్ని సంప్రదించి, అవసరమైన స్కానింగ్లు చేయించుకోవాలి.బ్రెయిన్ ట్యూమరా.. భయం వద్దు ఎంఆర్ఐతో సమస్యను గుర్తించొచ్చు వైద్యుల చికిత్సతో నయమయ్యే అవకాశం నేడు ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే -
ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్యాయత్నం
వేర్వేరు కారణాలతో ఇద్దరి ఆత్మహత్యపంచాయతీ కార్యదర్శి హత్య పిట్లం: చిన్నకొడప్గల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ధరావత్ కృష్ణ (28) అనే పంచాయతీ కార్యదర్శి హత్యకు గురయ్యా రు. స్థానికులు తెలిపి న వివరాలిలా ఉన్నాయి. రూం తండాకు చెందిన దరావత్ కృష్ణ చిన్నకొడప్గల్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. దీంతో అతడి తండ్రి గోప్యానాయక్ శుక్రవారం పిట్లం పోలీసులకు పిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గాలింపు చేపట్టగా శనివారం చిన్నకొడప్గల్ శివారులోని రెడ్డి చెరువులో మృతదేహం లభించింది. మృతదేహాన్ని బయటకు తీసిచూడగా తలపై, శరీరంపై గాయాలు ఉన్నాయి. అతడిని హత్య చేసి చెరువు పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. చెరువులో మునిగి జాలరి మృతిఇందల్వాయి: మండలంలోని సిర్నాపల్లి గ్రామానికి చెందిన మత్స్యకారుడు గూండ్ల కిషన్(43) ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. మృగశిర కార్తే కావడంతో చేపలు వేటాడేందుకు గ్రామంలోని తుంగకుంటలోకి వెళ్లిన కిషన్ వలలో చిక్కుకొని నీటమునిగిపోయాడు. మృతుడికి పదేళ్లలోపు వయసున్న ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మృతుడి భార్య శ్రావణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్ తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న దంపతుల అంత్యక్రియలు పూర్తిఖలీల్వాడి: ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యల కారణంగా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న నగరంలోని గాయత్రినగర్కు చెందిన దంపతులు శ్రీనివాస్(56), మమత(48) అంత్యక్రియలను శనివారం పూర్తి చేశారు. పోలీసులు మృతదేహలకు నిజామాబాద్లోని జీజీహెచ్లో పోస్టుమార్ట పూర్తి చేయించి శనివారం కుటుంబసభ్యులకు అప్పగించారు. శ్రీనివాస్, మమత కుమారులు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లగా, కోడలు తల్లిగారి ఇంటికి వెళ్లి తిరిగి వచ్చే సరికి ఈ ఘటన చోటు చేసుకుందని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. పోక్సో కేసులో ఇద్దరి రిమాండ్మోపాల్: పోక్సో కేసులో పరారీలో ఉన్న ఇద్దరిని రిమాండ్కు తరలించినట్లు సీఐ సురేశ్కుమార్ శనివారం తెలిపారు. మండలంలోని బైరాపూర్ గ్రామానికి చెందిన చక్రవర్తితోపాటు మరో బాలుడు ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఇద్దరు పరారయ్యారు. శనివారం వారిద్దరు స్వగ్రామానికి వచ్చినట్లు సమాచారం అందడంతో మోపాల్ ఎస్సై యాదగిరిగౌడ్ అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టి, రిమాండ్కు తరలించారు. చక్రవర్తిని సారంగాపూర్ జిల్లా జైలుకు, బాలుడిని బోస్టన్ స్కూల్కు తరలించినట్లు సీఐ తెలిపారు.లింగంపేట(ఎల్లారెడ్డి): ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన లింగంపేట మండలం కొర్పోల్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నర్సని కాశీరామ్కు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, మొదటి విడత లిస్టులో పేరు వచ్చిందని గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు తెలిపారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు కాశీరాం తాను నివాసం ఉంటున్న గుడిసెను తొలగించి స్థలం చదును చేసుకున్నాడు. ఇంటి నిర్మాణ సమయంలో డబ్బులకు ఇబ్బంది రావొద్దని ముందుగా తనకు ఉన్న 20 గుంటల వ్యవసాయ భూమిని అమ్మేశాడు. ఆ తరువాత జాబితాలో తన పేరు రాకపోవడంతో కలత చెందాడు. ఉన్న గుడిసె తొలగించడంతో ఉండడానికి ఇల్లు లేకుండా పోయిందని, తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించాలని నాయకులను వేడుకున్నాడు. ఈ క్రమంలో తీవ్రమనస్తాపానికి లోనై శనివారం మధ్యాహ్నం గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు హూటాహూటిన అతడిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఖలీల్వాడి: నగరంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన గాజుల రాజమణి గుండెపోటుతో మృతి చెందింది. అయితే తన అసిసెమెంట్ నంబర్తో గంగోనే రాజేశ్వర్ అనే వ్యక్తి తన ఇంటిని రిజస్ట్రేషన్ చేసుకోవడంతో తీవ్రమనస్తాపానికి గురై రాజమణి గుండెపోటుతో మృతి చెందిందని ఆమె సోదరి లలిత, కుటుంబ సభ్యులు ఆరోపించారు. రాజమణి మృతదేహంతో రాజేశ్వర్ ఇంటి ఎదుట ధర్నా చేశారు. రాజేశ్వర్ ఆరు నెలలుగా ఇంటి రిజస్ట్రేషన్ను రాజమణి పేరుపైకి మార్చడంలేదని, దీంతో తీవ్ర ఆందోళనకు గురైన రాజమణికి శుక్రవారం గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. పరిస్థితి విషమించి శనివారం మృతి చెందడంతో ఆమె మృతదేహంతో ధర్నా చేశారు. సమాచారం అందుకున్న టౌన్ సీఐ శ్రీనివాస్రాజు, ఎస్సై హరిబాబు ఘటనాస్థలానికి చేరుకొని ఇరు వర్గాలతో మాట్లాడారు. సోమవారం రోజున ఇంటి రిజిస్ట్రేషన్ మార్పు చేయించి ఇస్తానని గంగోనె రాజేశ్వర్ ఒప్పుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.రాజంపేట: మండలంలోని ఆర్గోండ గ్రామానికి చెందిన రైతు జంగిటి పెంటయ్య(48) ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై పుష్పరాజ్, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పెంటయ్య గ్రామ శివారులోని తనుకున్న 20 గుంటల భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. యాసంగిలో జొన్న సాగు చేయగా అనుకున్న దిగుబడి రాకపోవడం, తన ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లకు చేసిన అప్పులు కూడా భారం కావడంతో మానసిక ఆందోళనకు గురయ్యేవాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం 7:30 గంటలకు పొలానికి వెళ్తున్నానని ఇంట్లో నుంచి వెళ్లిన పెంటయ్య తిరిగిరాలేదు. కొద్ది సేపటి తరువాత అదే గ్రామానికి చెందిన జంగిటి దుర్గయ్య అనే వ్యక్తి ఫోన్ చేసి పంట పొలంలోని చెట్టుకు పెంటయ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. మృతుడి భార్య రాజమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.మతిస్థిమితం లేని వ్యక్తి..ఇల్లు రిజిస్ట్రేషన్ చేయడం లేదని ఆవేదన.. గుండెపోటుతో మహిళ మృతిభిక్కనూరు: మండలంలోని మల్లుపల్లి గ్రామానికి చెందిన ఆకారపు స్వామి(39) అనే వ్యక్తి మతిస్థిమితం లేక ఆత్మహత్య చేసుకున్నట్లు భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. భార్య సంధ్యతో కలిసి ఐదేళ్లుగా హైదరాబాద్లో ఉంటున్న స్వామికి గత కొన్ని నెలలుగా మతిస్థిమితం సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రుల్లో చిక్తిస చేయించారు. స్వామి గత నెల29వ తేదీన హైదరాబాద్ నుంచి మల్లుపల్లికి వచ్చిన స్వామి పురుగుల మందు తాగాడు. కుటుంబీకులు వెంటనే అతడిని ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి అక్కడి నుంచి సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి శనివారం ఉదయం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మహానందం..!
డొంకేశ్వర్(ఆర్మూర్): పల్లెలన్నీ కొత్త భవనాల మో జులో పరుగెడుతుంటే.. డొంకేశ్వర్ ఊర్లో మా త్రం పాత కాలపు పెంకుటిళ్లకు క్రేజీ పెరుగుతోంది. తా తలు, తండ్రులు నిర్మించి ఇచ్చిన ఆస్తులను ఇప్ప టికీ పదిలంగా కాపాడుకుంటున్నారు. గోడ లు, తలుపులకు రంగులద్ది అందంగా తీర్చి దిద్దుకుంటున్నారు. అన్ని హంగులతో కొత్త భవనాలు నిర్మించుకునే స్థాయి ఉన్నా కూడా పెంకుటిళ్లలోనే నివాసం ఉంటున్నారు. అయితే, వీటి నాణ్యతను చూస్తే నేటి తరం సిమెంట్ బిల్డింగులను తల దన్నేలా ఉన్నా యి. మరో యాబై ఏళ్లు కూడా నిలబడే విధంగా ధృఢంగా ఉండడం గమనార్హం. డొంకేశ్వర్ ఎస్సారెస్పీలో ముంపునకు గురైన గ్రామం. ప్రాజెక్టులో ఇళ్ల న్నీ మునిగిపోవడంతో 1975 నుంచి ఎగువ ప్రాంతంలో కొత్తగా ఇళ్లను నిర్మించుకున్నా రు. చాలా మంది భూస్వాములు అప్పట్లో నల్లమట్టితో రెండతస్తుల ఇళ్లను కట్టించారు. తూర్పు నుంచి మేసీ్త్రలు వచ్చి వందల ఇళ్లను నిర్మించారు. ఊరికి పై, కింది భాగాల్లో నిర్మించగా ఇళ్లన్నీ దాదాపు ఒకే (డిజైన్) విధంగా ఉన్నాయి. మట్టి గోడలకు సున్నం వేసి నునుపుగా చేయించారు. మొదటి అంతస్తు స్లా బు కు కూడా మట్టినే వినియోగించారు. ఒకటి, రెండ తస్తులైనా కూడా ఇంటికి పెంకులు (బొంబాయి కూన) వాడారు. అప్పట్లో ఇవే డాబు, దర్పం. చరి త్ర చెప్పుకునేలా ఇంటి నిర్మాణాలు ఆసక్తిగా కూడా ఉన్నాయి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇరువైపులా రాతితో సౌతర్లు కట్టించారు. ప్రధాన ద్వారం చాలా పెద్దదిగా, తలుపులు ధృఢంగా చేయించారు. ఇవి ఇంటికే రాజసాన్ని తెచ్చేలా ఉన్నా యి. కిటికీలు కూడా ఇదే స్థాయిలో అందంగా తయారు చేయించారు. మొదటి గడపను దాటగానే బడకలు, ఇంటి లోపల అరుగులు, మొద్దులతో తయారు చేసిన డిజైన్ స్తంభాలు, దులాలు నాటి కాలపు ఇళ్లకు ప్రత్యేక ఆకర్షణ. విశాలమైన పెంకుటిళ్లలో అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు నివాసం ఉండేవి. ఎవరివి వారికి గదులు ఉండగా, అరుగు మీద భోజనాలు చేసే వారు. పండుగలు కలిసి జరుపుకునే వారు. యాబై ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పెంకుటిళ్లలో ప్రస్తుతం నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇప్పటికీ డొంకేశ్వర్ గ్రామంలో 150 పైగా పెంకుటిళ్లు చెక్కు చెదరకుండా ఉన్నాయి. డొంకేశ్వర్లో బొంబాయి (కూన) పెంకుల ఇళ్లు పాత కాలపు ఇళ్లను పదిలంగా కాపాడుకుంటున్న నేటి తరం యాబై ఏళ్ల క్రితం నిర్మించిన రెండంతస్తుల పెంకుటిళ్లు సౌతర్లు, అరుగులు, బడకలు ప్రత్యేకం ఇప్పటికీ చెక్కు చెదరని నివాసాలు ఉమ్మడి కుటుంబాలకు ఇప్పుడవే జ్ఞాపకాలు డొంకేశ్వర్లో 150 పైగా ఒకే రకమైన గృహాలు -
ఇంటి నుంచి తల్లిదండ్రుల గెంటివేత
భిక్కనూరు : వృద్ధులైన తల్లిదండ్రులను వారి పేరిట ఉన్న భూమిని తనకు ఇవ్వాలని కుమారుడు ఇంటి నుంచి గెంటివేశాడు. ఈ ఘటన భిక్కనూరు మండలం కాచాపూర్లో చోటు చేసుకుంది. వివరా లు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మర్రి భాగవ్వ–రామయ్యలకు నలుగురు కొడుకులు. మూడో కుమారుడు చంద్రం ప్రేమ పెళ్లి చేసుకు ని నిజామాబాద్లో నివసిస్తున్నాడు. రామయ్య పేరిట గ్రామంలో ఐదు ఎకరాల నాలుగు గుంట ల భూమి ఉంది. రామయ్య తన కుమారులకు ఒక్కొక్కరికి ఎకరం చొప్పున పంచి పట్టా చేయించారు. మిగితా ఎకరం నాలుగు గుంటలను తమ పేరిట ఉంచుకున్నారు. మూడో కొడుకు చంద్రం తల్లిదండ్రుల పేరిట ఉన్న భూమిలో తన వాటాకు రావాల్సిన భూమిని ఇవ్వాలని వారిని వేఽ దించాడు. పట్టాదారు పాసుపుస్తకాలను లాక్కెళ్లాడు. అయితే కులపంచాయ తీ లో తల్లిదండ్రుల బాగోగులు చూసిన వాళ్లకు భూమిపై హక్కులు ఉంటాయని కుల పెద్దలు నిర్ణయించారు. చంద్రం శనివారం తల్లిదండ్రుల ఇంటికి వచ్చి వా రిని బయటకు గెంటి వేశాడు. సామగ్రిని బయట పారేసి ఇంటికి తాళం వేశాడు. దీంతో వృద్ధులైన భాగవ్వ –రామయ్యలు భిక్కనూరు పోలీసులను ఆశ్రయించా రు. వీరి ఫిర్యాదు మేరకు ఎస్సై ఆంజనేయులు చంద్రంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.● భూమిని తన పేరిట మార్చాలని తనయుడి అఘాయిత్యం ● భిక్కనూరు మండలం కాచాపూర్లో ఘటన -
సైకిల్పై చార్ధామ్ యాత్ర
రుద్రూర్: సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియో జకవర్గం రాయికోడ్కు చెందిన రామ్ అనే యువకు డు ఇటీవల కేదార్నాథ్, బద్రీనాథ్ వరకు సైకిల్ యాత్ర చేపట్టాడు. యాత్రలో భాగంగా శనివారం ఆయన రుద్రూర్ మండల కేంద్రం నుంచి వెళుతుండగా విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి రోజును సెలవు దినంగా ప్రకటించాలని ఆయన కోరారు. ఇందుకుగాను 12 జ్యోతిర్లింగాలు, చార్ధామ్ యాత్ర సైకిల్పై చే యాలని సంకల్పం పెట్టుకున్నానని తెలిపారు. ప్రస్తుతం కేదారినాథ్, బద్రీనాథ్ మిగిలి ఉన్నందున అక్కడికి వెళుతున్నట్టు వివరించారు. -
జిల్లాలో మొదటి కరోనా కేసు
నిజామాబాద్నాగారం: నిజామాబాద్ జిల్లాలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. నగరంలోని అంబేడ్కర్కాలనీ చెందిన వ్యక్తికి రెండు రోజులుగా జ్వరం, దగ్గు, ఆయాసం రావడంతో శనివారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)కు చికిత్స నిమిత్తం వచ్చారు. వైద్యులు ర్యాపిడ్ టెస్ట్ చేయడంతో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఇంటి వద్దే ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని, మందులు వేసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించారు. అయితే ఇంటి వద్ద చిన్నపిల్లలు, వృద్ధులైన అమ్మనాన్న ఉండడంతో ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకుంటానని బాధితుడు చెప్పాడు. వైద్యులు వెంటనే సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్కు సమాచారం ఇవ్వడంతో జీజీహెచ్లో 7వ అంతస్తులోని ఐసోలేషన్ ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 2020 సంవత్సరంలో కూడా సదరు వ్యక్తికి కరోనా వచ్చినట్లు తెలిపారు. నేడు కుటుంబ సభ్యులకు ర్యాపిడ్ పరీక్షలు కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబానికి చెందిన సభ్యులకు ఆదివారం ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎవరికై నా పాజిటివ్ వస్తే ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందించనున్నట్లు ఆస్పత్రి వైద్యులు డాక్టర్ వెంకటేష్ తెలిపారు. మాస్క్లు, జాగ్రత్తలు తప్పనిసరి జిల్లా ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవా లని జిల్లా వైద్యాధికారి డాక్టర్ బి రాజశ్రీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ సూచించారు. మాస్క్లు ధరించాలన్నారు. చేతులు శానిటైజేషన్ చేసుకోవాలన్నారు. గుంపుల్లో సంచరించ వద్దని, ఎక్కడికి వెళ్లినా కచ్చితంగా మాస్క్లు పెట్టుకోవాలన్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు -
గుంభనంగా గులాబీలు
నిజామాబాద్మానసిక ఒత్తిడికి.. మానసిక ఒత్తిడిని యోగాతో దూరం చేసుకోవచ్చని జిల్లా వైద్యారోగ్య శాఖ అఽధికారిణి రాజశ్రీ అన్నారు. శనివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2025– 10లో uసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత తన తండ్రికి రాసిన లేఖ విషయమై ఇప్పటికీ గందరగోళం సద్దుమణగలేదు. జిల్లాకు ప్రాతినిథ్యం వహిస్తున్న నా యకురాలిగా ఉన్న కవిత రాసిన లేఖ లీక్ వ్యవహారంపై ఏవిధంగా స్పందించాలో తెలియని శ్రేణులు మొదట్లో నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ ఆ తరువాత కొందరు కార్యకర్తలు నిదానంగా సోషల్ మీడియాలో స్పందించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో పలువురు కవిత అభిమానులు లేఖలోని అంశాలు వాస్తవాలేనంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటిస్తూ వచ్చారు. ఒక దశలో సోషల్ వార్ మాదిరిగా దూకుడుగా కవితకు అనుకూలంగా పోస్టులు పెట్టా రు. అయితే బహిరంగంగా మాత్రం ఎక్కడా వ్యా ఖ్యలు చేయలేదు. కాగా ఇందల్వాయి మాజీ ఎంపీపీ రమేశ్నాయక్ మాత్రం కవితకు మద్దతు తెలు పుతూ ప్రెస్మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. ఉద్యమకాలం నుంచి పార్టీలో ఉంటూ ఉద్యమాల్లో పా ల్గొన్న శ్రేణులు మాత్రం కవిత లేఖ విషయమై ఆమెకు మద్దతుగా నిలుస్తూ వచ్చారు. అయితే పార్టీ లైనప్ ఏవిధంగా ఉందో తెలియకపోవడంతో సై లెంట్గా ఉంటూ వస్తున్నారు. చివరకు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు సైతం సైలెన్స్ పాటిస్తూ వస్తున్నారు. అయితే మాజీ ప్రజాప్రతినిధుల ముఖ్య అనుచురుల్లో కొందరు కవితకు వ్యతిరేకంగా సైతం పోస్టులు పెడుతుండడం గమనార్హం. కవిత పర్యటన నేపథ్యంలో.. కవిత గత రెండు రోజులుగా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆమె పర్యటన నేపథ్యంలో నిజామాబాద్ నగరంతోపాటు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఆమె అభిమానులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గత ఫిబ్రవరిలో కవిత జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరైనప్పటికీ ఫ్లెక్సీలు మాత్రం పెట్టలేదు. ప్రస్తుతం మాత్రం ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేసినప్పటికీ శ్రేణుల హాజరు మాత్రం చాలా తక్కువగా ఉంది. పైగా ఫ్లెక్సీల్లో వేర్పాటువాదం స్పష్టంగా కనిపించింది. అన్ని ఫ్లెక్సీల్లో కేసీఆర్ ఫొటో మాత్రమే ఉంచారు. కేటీఆర్, హరీశ్రావు, సంతోష్రావుతోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్థఽన్, షకీల్, గణేశ్గుప్తా, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ విఠల్రావు ఫొటోలు సైతం ఫ్లెక్సీల్లో పెట్టలేదు. కొన్ని ఫ్లెక్సీల్లో ఓ సీనియర్ కార్యకర్త ఫొటో కింద బీఆర్ఎస్ నాయకుడు అని ప్రింట్చేసినప్పటికీ ఆ తరువాత దానిపై పేపర్ అతికించడం గమనార్హం. కవిత తన పర్యటనలో భాగంగా వరుసగా గుడులను సందర్శిస్తున్నారు. అదేవిధంగా పలువురు కార్యకర్తల ఇళ్లకు వెళ్లి పలకరింపులు, పరామర్శలు చేస్తున్నారు. అయితే ఆమె పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గమనిస్తున్న కార్యకర్తలు దీనిని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావడం లేదని పేర్కొంటున్నారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో గులాబీ శ్రేణులు గుంభనంగా ఉన్నాయి.న్యూస్రీల్బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి నిజామాబాద్ జిల్లా అండగా ఉంటూ ఉద్యమంలో మరింత ముందుకెళ్లేలా స్ఫూర్తి రగిలించింది. మోతె మట్టి ముడుపు నుంచి మొట్టమొదటి జిల్లా ప్రజాపరిషత్ గెలుపు అందించడం ద్వారా గులాబీ పార్టీ రాష్ట్ర సాధన వరకు వెనుదిరిగి చూసుకోకుండా అండగా నిలబడింది. అయితే, కవిత కేసీఆర్కు రాసిన లేఖ లీక్ వ్యవహారం తర్వాత ఆ పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. అగ్రనాయకుల మధ్య ఆధిపత్య పోరు నెలకొందని కొంతమంది.. అలాంటిదేమీ లేదని మరికొంత మంది పేర్కొంటున్నారు. ఎమ్మెల్సీ కవిత జిల్లా పర్యటన సందర్భంగా ఫ్లెక్సీల ఏర్పాటు కేసీఆర్ ఫొటో తప్ప కనిపించని రాష్ట్ర, జిల్లా నాయకుల ఫొటోలు భారీగా ఫ్లెక్సీలు.. నామమాత్రంగా కార్యకర్తలు సోషల్ మీడియాలో కొందరి ప్రత్యక్ష.. మరికొందరి పరోక్ష యుద్ధం -
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలి
నిజామాబాద్నాగారం: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ అవసరమైన చర్యలు తీసుకోవా లని జిల్లా వైద్యాధికారిణి రాజశ్రీ సంబంధిత అధికారులను ఆదేశించారు. కీటక జనిత వ్యాధుల నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం డీ ఎంహెచ్వో కార్యాలయంలో సీజనల్ వ్యాధుల ని యంత్రణపై డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడు తూ ఆరోగ్య ఉపకేంద్ర, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప రిధిలో వివిధ శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాఽ దుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి జ్వర సర్వే నిర్వహించి, అనుమానిత కేసులకు చికిత్స అందించాలన్నారు. నీటి నిల్వలను తొలగించేలా అధికారులకు సమాచారం అందించాలని, నీటి ట్యాంకులను క్లోరినేషన్ చేయించాలన్నారు. పీహెచ్సీల పరిధిలో ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పా టు చేయాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్వో, కీటక జనిత వ్యాధుల నియంత్రణ జిల్లా అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ మాట్లాడుతూ దోమల నియంత్రణపై దృష్టి పెట్టి దోమలు పుట్టకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. సమావేశంలో ఎపిడమాలజిస్ట్ వెంకటేశ్, అసంక్రమిత వ్యాధుల నియంత్రణ అధికారి సామ్రాట్ యాదవ్, డీహెచ్ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, గోవర్ధన్, వెంకట్ రవి, పీహెచ్సీల వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ -
దాశరథిని ప్రభుత్వం విస్మరిస్తోంది
నిజామాబాద్అర్బన్: దాశరథి కృష్ణమాచార్య శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించాలని, లేనిపక్షంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తామే నిర్వహిస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ఖిల్లా జైలును ఆమె శుక్రవారం సందర్శించారు. అనంతరం రామాలయం ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణను సోయిలేని ప్రభుత్వం పాలిస్తోందని విమర్శించారు. నిజాం ఆకృత్యాలను ఎండగడుతూ ప్రజలని జాగృతం చేసిన దాశరథి జయంతి వేడుకలను నిర్వహించకపోవడం సరైంది కాదన్నారు. నిజామాబాద్లోని ఖిల్లా జైలులో దాశరథి ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ‘ అని రాసి తెలంగాణ ప్రజలను చైతన్య పరిచారని గుర్తుచేశారు. ఆయన శిక్ష అనుభవించిన జైలును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వ హయాంలో నిధులు విడుదల చేశామన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో రూ.40 కోట్లు విడుదల చేశానని గుర్తు చేశారు. వాగ్దానాలను విస్మరించింది ప్రభుత్వం వాగ్దానాలను విస్మరించిందని కవిత విమర్శించారు. వానాకాలం వచ్చినా ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. ధాన్యం సేకరణు ప్ర భుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రేషన్ షాపు ల్లో బియ్యం కోసం ప్రజలు గంటల తరబడి ని ల్చుంటున్నా సమస్యకు పరిష్కారం చూపడం లేదన్నారు. సమావేశంలో మాజీ మేయర్ నీతు కిరణ్, జాగృతి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆయన గొప్పతనాన్ని రేపటి తరాలకు తెలపాలి శత జయంతిని ప్రభుత్వం నిర్వహించాలి లేని పక్షంలో జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తాం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత -
క్షణికావేశానికి నిండు ప్రాణాలు బలి
● కామారెడ్డి జిల్లాలో కొడుకుతో కలిసి చెరువులో దూకిన తల్లి ● నిజామాబాద్లో దంపతుల ఆత్మహత్యకామారెడ్డి క్రైం: క్షణికావేశంలో ఓ తల్లి తీసుకున్న నిర్ణయం కుటుంబంలో విషాదాన్ని నింపింది. కుమారుడితో సహా తల్లి చెరువులో దూకడంతో ఇద్దరి ప్రాణాలు నీట మునిగాయి. నర్సన్నపల్లి గ్రామంలో చోటు చేసుకున్న విషాద ఘటన వివరాలిలా ఉన్నాయి. నర్సన్నపల్లి గ్రామానికి చెందిన రాచమొల్ల ప్రశాంత్కు భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన స్రవంతి(25)తో వివాహమైంది. వీరికి శ్రీవల్లి అనే కూతురు, రుద్రేశ్వర్(4) అనే కుమారుడు ఉన్నారు. కొన్నాళ్ల క్రితం స్రవంతి అత్తగారికి చెందిన బంగారాన్ని తల్లి గారి కుటుంబ సభ్యులకు ఇచ్చింది. వారు ఆ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారు. నగలను తిరిగి ఇవ్వకపోవడంతో ఇటీవల ఇరు కుటుంబాల మధ్య గొడ వలు జరిగినట్లు తెలిసింది. శుక్రవారం నగల విషయమై స్రవంతితో కుటుంబ సభ్యులు గొడవ పడ్డట్లు సమాచారం. కొద్దిసేపటి తర్వాత స్రవంతి తన ఇద్దరు పిల్లలను వెంట తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. పక్కనే ఉన్న చిన్నమల్లారెడ్డి చెరువు కట్టకు వద్దకు చేరుకున్నారు. నీటిలో దూకడానికి కూతురు నిరాకరించడంతో స్రవంతి కుమారుడు రుద్రేశ్వర్తో కలిసి నీటిలో దూకి మరణించింది. దీనిని గమనించిన స్థానికులు రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఇద్దరి మృతదేహాలను బయటికి తీ యించారు. కుటుంబంలో జరిగిన గొడవల కా రణంగానే స్రవంతి తన కొడుకుతో కలిసి ఆత్మ హత్యకు పాల్పడినట్లు ఆమె తల్లి రాధమణెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని రూరల్ సీఐ రామన్ తెలిపారు. దంపతుల ఆత్మహత్య ఖలీల్వాడి : నగరంలోని గాయత్రినగర్ ప్రాంతంలో దంపతుల ఆత్మహత్య శుక్రవారం కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. కోటగల్లికి చెందిన శ్రీనివా స్ (56), మమత (52)కు ఇద్దరు కుమారు లు, ఒక కూతురు. శ్రీనివాస్ నగరంలోని ఓ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తుండేవాడు. ఇటీవ ల కోటగల్లిలోని సొంతింటిని విక్రయించారు. కూతురికి పెళ్లి చేయడంతోపాటు ఇద్దరు కు మారులను గల్ఫ్ దేశానికి పంపించారు. ప్ర స్తుతం గాయత్రినగర్లో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వేర్వేరు గదుల్లో శ్రీనివాస్, మమత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డా రు. సమాచారం అందుకున్న టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరుకొని దంపతుల ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీశారు. కాగా, ఆర్థిక ఇబ్బందు లతోనే భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికుల ద్వారా తెలిసింది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం రెండు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. ఉమ్మడి జిల్లాలో శుక్రవారం ఆత్మహత్య ఘటనలు కలకలం రేపాయి. కామారెడ్డి జిల్లా నర్సన్నపల్లిలో కుటుంబసభ్యుల మధ్య గొడవ జరగడంతో ఓ తల్లి.. కొడుకుతో కలిసి చెరువులో దూకి మరణించింది. నిజామాబాద్ నగరంలోని గాయత్రినగర్లో ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. -
నవోదయలో మౌలిక సదుపాయాలు కల్పించాలి
నిజామాబాద్ అర్బన్: జిల్లాకు కొత్తగా మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ ఏడాది నుంచే తరగతులను నిర్వహించనున్న దృష్ట్యా మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని నాగారంలో ఉన్న జిల్లా విద్యాశిక్షణ సంస్థ (డైట్) కళాశాల ఆవరణలోని భవన సముదాయాలలో తాత్కాలికంగా జవహర్ నవోదయ విద్యాలయాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ శుక్రవారం డైట్ కాలేజీ భవనాన్ని సందర్శించి, తరగతుల నిర్వహణకు అనువైన పరిస్థితులు, అందుబాటులో ఉన్న వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ఆరో తరగతిలో ప్రవేశాలు చేపట్టి తరగతులను నిర్వహిస్తామని, రెండు సెక్షన్లలో 80 మంది విద్యార్థినీవిద్యార్థులు ప్రవేశం పొందుతారని కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులతోపాటు అధ్యాపకులు, సిబ్బందికి తగిన వసతి, బోధన తరగతుల నిర్వహణ వంటి వాటికి ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. తరగతి గదులు, డార్మెటరీ, డైనింగ్ హాల్, లైబ్రరీ, బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ భవనాలు, స్టాఫ్ క్వార్టర్స్ కోసం ఎంపిక చేసిన గదులను కలెక్టర్ పరిశీలించారు. తాత్కాలిక భవనాలలో కొనసాగుతున్న మరమ్మతు పనులను శరవేగంగా జరిపించాలని, నూతన విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యే నాటికి పనులను పూర్తి చేయించాలని సూచించారు. శాశ్వత భవనం అందుబాటులోకి వచ్చే వరకు జవహర్ నవోదయ విద్యాలయం డైట్ కళాశాల ప్రాంగణంలోని భవన సముదాయాల్లోనే కొనసాగనున్న దృష్ట్యా మరమ్మతు పనులు పక్కాగా జరిపించి అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చొరవ చూపాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట డీఈవో పీ అశోక్, జవహర్ నవోదయ విద్యాలయం ఇన్చార్జి ప్రిన్సిపాల్ యోహన్నన్, పంచాయతీరాజ్ ఈఈ శంకర్ తదితరులున్నారు. తాత్కాలిక భవన మరమ్మతులను వేగంగా చేపట్టాలి శాశ్వత భవనం అందుబాటులోకి వచ్చే వరకు డైట్ భవనంలోనే కొనసాగింపు అధికారులకు కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు ఆదేశం -
‘డబుల్’ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలి
సుభాష్నగర్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్కు సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను అర్హులకు వెంటనే పంపిణీ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు. లేదంటే ఆగస్టు 15న బీజేపీ ఆధ్వర్యంలో పేదలతో గృహప్రవేశం చేయిస్తామని హెచ్చరించారు. శుక్రవారం డబుల్ బెడ్రూం ఇళ్లను బీజేపీ నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా దినేశ్ ప టేల్ మాట్లాడుతూ ప్రజాధనంతో నిర్మించిన డబు ల్ బెడ్రూం ఇళ్లను ప్రభుత్వ వైఫల్యంతో నేటికీ పే దలకు అందించకపోవడం తీవ్ర ఆవేదన కలిగిస్తోందన్నారు. ఆ ఇళ్లు పేదల హక్కు అని, ఎవరి సొత్తు కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో ప్రజల కు ఇవ్వకుండా మోసం చేయగా, ఇప్పుడు ఇందిరమ్మ కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్లపై రాజకీయా లు మానుకొని, వెంటనే అర్హులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, నాయకులు జగన్రెడ్డి, శంకర్రెడ్డి, మాస్టర్ శంకర్, ఆనంద్, నరేశ్, ఆమంద్ విజయ్కృష్ణ తదితరులు పాల్గొన్నారు. లేదంటే ఆగస్టు 15న పేదలతో గృహ ప్రవేశం చేయిస్తాం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి -
కానిస్టేబుల్ కుమారుడిపై మైనర్ డ్రైవింగ్ కేసు
ఖలీల్వాడి: నగరంలో ఓ కానిస్టేబుల్ కుమారుడు మైనర్ డ్రైవింగ్ చేయడంతో ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలోని రైల్వేస్టేషన్ వద్ద శుక్రవారం ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఓ కానిస్టేబుల్కు ప్రభుత్వం కేటాయించిన బైక్ను అతడి కొడుకు (మైనర్) నడిపించడంతో ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి, బైకును సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. ఇసుక వాహనం పట్టివేత రుద్రూర్: కోటగిరి శివారు నుంచి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న టాటా వాహనాన్ని పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. వాహనాన్ని కోటగిరి పోలీస్స్టేషన్కు తరలించారు. డ్రైవర్ షేక్ రఫిక్, వాహన యాజమాని షేక్ లతీఫ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సునీల్ తెలిపారు. పేకాడుతున్న ఏడుగురి అరెస్టు ఆర్మూర్టౌన్: ఆలూర్ మండల కేంద్రంలో పేకాట స్థావరంపై శుక్రవారం పోలీసులు దాడి చేసి, పేకాడుతున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణ తెలిపారు. అలాగే వారి నుంచి రూ. 10830 నగదు, ఐదు సెల్ఫోన్లు, మూడు వాహనాలను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. యువకుడి అదృశ్యం బోధన్: ఎడపల్లికి చెందిన గట్టుపల్లి సాయి కుమార్ (27) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఎడపల్లి ఎస్సై వంశీకృష్ణారెడ్డి శుక్రవారం తెలిపారు. సాయికుమార్కు సరైన ఉద్యోగం లభించక ఏడాదిగా ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెంది ఈ నెల 4న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇప్పటికీ తిరిగి రాకపోవడంతో అతడి భార్య ఆద్రిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. విద్యుత్ షాక్తో గేదె మృతి పిట్లం(జుక్కల్): మండలంలోని రాంపూర్ గ్రామంలో గురువారం సాయంత్రం ఓ గేదె విద్యుత్ షాక్తో మృతిచెందింది. బాధితుడు తెలిపిన వివరాలు.. గ్రామంలోని రైతు ముందడి బలరాంరెడ్డికి చెందిన గేదె రోజులాగే గ్రామ శివారులో మేత మేసేందుకు వెళ్లింది. మేత మేస్తుండగా కింద పడిన విద్యుత్ తీగలను గేదె తాకడంతో విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మరణించింది. రూ. 50వేల విలువ గల గేదె మృతి చెందడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. 70 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత కామారెడ్డి క్రైం: డీసీఎం వ్యాన్లో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 70 క్వింటాళ్ల రేషన్ బియ్యంను కామారెడ్డి సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. వివరాలు ఇలా.. జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి 40 కిలోల చొప్పున రేషన్ బియ్యంను సంచులలో నింపి దాదాపు 180 బస్తాలను ఓ డీసీఎంలో తరలించేందుకు సిద్ధం చేశారు. వెంటనే సీసీఎస్ పోలీసులకు సమాచారం అందడంతో ఎస్హెచ్వో చంద్రశేఖర్రెడ్డి, సీసీఎస్ పోలీసులు కలిసి డీసీఎంను, డ్రైవర్ అర్బాజ్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి వాటిని సివిల్ సప్లయ్ అధికారులకు అప్పగిస్తామని ఎస్హెచ్వో తెలిపారు. -
రండి.. సర్కార్ బడుల్లో చేరండి
మోర్తాడ్(బాల్కొండ): విద్యార్థుల ప్రవేశాల కోసం ప్రయివేటు బడులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు విస్తృతమైన ప్రచారం చేపట్టాయి. అడ్మిషన్ల సంఖ్యను పెంచుకోవాలనే సంకల్పంతో జిల్లావ్యాప్తంగా బడిబాట కార్యక్రమంను శుక్రవారం ఆరంభించారు. అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఆకట్టుకోవడానికి కృషి చేస్తున్నారు. కరపత్రాలు, ఫ్లెక్సీలను ముద్రించి కూడళ్లలో ప్రదర్శిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి విద్యార్థుల పేర్లు నమోదు చేసుకుంటున్నారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి తీసుకుంటున్న కార్యక్రమాలను ఉపాధ్యాయులు వివరిస్తున్నారు. ఉచిత యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులు, స్కాలర్షిపులు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని వెల్లడిస్తున్నారు. గతంలో కంటే ఎక్కువ మంది విద్యార్థులను చేర్పించుకోవడానికి మహిళా సంఘాలు, గ్రామాభివృద్ధి కమిటీల మద్దతుతో ఉపాధ్యాయులు ఇంటింటి ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రయివేటు పాఠశాలల ప్రచారాన్ని తిప్పికొట్టేలా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు చేస్తున్న ప్రచారం అందరిని ఆకట్టుకుంటుంది. ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వ ఉపాధ్యాయుల వినూత్న ప్రచారం ప్రవేశాల కోసం బ్రోచర్లు, ఫ్లెక్సీలను ప్రచురించి బడిబాట నిర్వహిస్తున్న వైనం -
రూ.20తో రెండు లక్షల ప్రమాద బీమా
మీకు తెలుసా? ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై) కింద ఏడాదికి రూ.20 ప్రీమియం చెల్లించవచ్చు. బ్యాంకు ఖాతా కలిగిన 18–70 ఏళ్ల లోపు వయస్సగల వారు అర్హులు. ఈబీమా ద్వారా ప్రమాదం వలన మరణం సంభవించినా, లేదా ప్రమాద కారణంగా రెండు కళ్లు, రెండు చేతులు, లేదా ఒక కంటి చూపు, చెయ్యి లేదా పాదం కోల్పోయిన రూ. రెండు లక్షల బీమా నామినీకి సొమ్ము చెల్లిస్తారు. ● ఒక కన్ను లేదా ఒక చెయ్యి, లేదా ఒక కాలు వీటిలో ఏదేని ఒకటి కోల్పోయిన రూ.లక్ష చెల్లిస్తారు. ● ప్రమాదం జరిగినట్టుగా పోలీసు ఎఫ్ఐఆర్, డాక్టర్ ధ్రువీకరణతో సులభంగానే సంబంధిత బ్యాంకు ద్వారా క్లైమ్ చేసి బీమా సోమ్ము పొందవచ్చు. – కామారెడ్డి అర్బన్ -
బాల్కొండ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో..
బాల్కొండ: మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుటకు విద్యార్థులు కావలెను అంటూ అధ్యాపకులు గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. 2023–24 విద్యాసంవత్సరం మధ్యలోనే డిగ్రీ కళాశాలను ప్రారంభించగా, 2024–25 విద్యా సంవత్సరంలో 30 మంది విద్యార్థులతో కళాశాలను కొనసాగించారు.కళాశాలలో బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సులుండగా, ప్రస్తుత విద్యా సంవత్సరమైన విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని అధ్యాపకులు ఆశిస్తున్నారు. విద్యార్థులు తక్కువగా ఉండటంతో డిగ్రీ పరీక్ష కేంద్రం ఆర్మూర్లోనే కేటాయించారు. వసతులు లేకపోవడంతోనే.. బాల్కొండ మండల ప్రజలు డిగ్రీ కళాశాల కోసం కొన్నేళ్ల నుంచి ఎదురు చూడగా 2023లో అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ సొంత భవనం లేకపోవడంతో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలోని ఓ భవనంలో డిగ్రీ కళాశాలను నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో రెగ్యులర్ ప్రిన్సిపాల్ కూడ లేడు. ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఇక్కడ ఇన్చార్జి ప్రిన్సిపాల్గా కొనసాగుతున్నారు. కళా శాలలో కనీస వసతులు కూడ లేకపోవడంతో విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి జంకుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డిగ్రీ కళాశాలకు సొంత భవనం నిర్మించి, సౌకర్యాలు కల్పిస్తే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ప్రవేశాల కోసం విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాం. ప్రస్తుత విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సొంత భవనం కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. విద్యార్థుల సంఖ్య పెరిగితే పరీక్ష కేంద్రం కూడ ఇక్కడే అనుమతి లభిస్తుంది. – వేణు ప్రసాద్, ఇన్చార్జి ప్రిన్సిపాల్, బాల్కొండ -
మానసిక ఒత్తిడికి యోగాతో పరిష్కారం
నిజామాబాద్నాగారం: మానసిక ఒత్తిడిని యోగాతో దూరం చేసుకోవచ్చని డీఎంహెచ్వో రాజశ్రీ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దశాబ్ధి వేడుకల్లో భాగంగా నగరంలోని కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా అధికారులకు, ఉద్యోగులకు యోగాపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. డీఎంహెచ్వో ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. నిత్య జీవితంలో యోగా ప్రాముఖ్యతను వివరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ‘హర్ దిన్ యోగా–హర్ ఘర్ యోగా’ నినాదంతో ప్రతి ఇంటికి యోగాను తీసుకెళ్లాలని తెలిపారు. వేడుకల్లో ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జిల్లా ఆయుష్ నోడల్ అధికారి గంగదాస్, వైద్యులు తిరుపతి, వెంకటేష్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, డీపీఎం వందన, ఆయుష్ పారా మెడికల్ సిబ్బంది పురుషోత్తం, ఉమా ప్రసాద్, స్వాతి, రమేష్, భిక్షపతి, యోగా శిక్షకులు నమ్రత, సంగీత, విజయభాస్కర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
బాలానగర్లో వివాహిత ఆత్మహత్య
జక్రాన్పల్లి: మండలంలోని బాలానగర్లో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన గుంజ వెంకట్ తన కూతురు గుంజ అక్షయ (19)కు నెల క్రితం నిజామాబాద్ రూరల్ మండలంలోని నాగారం గ్రామానికి చెందిన పల్లపు సునీల్ అనే వ్యక్తితో వివాహం జరిపించాడు. కొన్ని రోజులుగా తనను భర్త శారీరకంగా వేధిస్తున్నాడంటూ అక్షయ రెండు రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. కాగా శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అక్షయ సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త సునీల్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మాలిక్ తెలిపారు. మాక్లూర్లో యువకుడు.. మాక్లూర్: మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన రాచర్ల శ్రీకాంత్(29) కోత మిషన్పై డ్రైవర్గా పని చేస్తూ, జీవనం సాగించేవాడు. గురువారం రాత్రి తన పెళ్లి విషయమై తల్లిదండ్రులతో చర్చించాడు. ప్రస్తుతం వివాహం జరిపించడం కష్టమంటూ తల్లిదండ్రులు తేల్చిచెప్పడంతో అతడు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. శుక్రవారం స్థానిక చెరువులో అతడు శవమై తేలడంతో పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఽమృతదేహాన్ని వెలికి తీసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. చికిత్స పొందుతూ ఒకరు.. బీబీపేట: ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా.. మండలంలోని ఇస్సానగర్ గ్రామానికి చెందిన సంగెపు స్వామి (45) అప్పుల బాద భరించలేక ఈ నెల 4న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి తల్లి రాజవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు.చేపల వేటకు వెళ్లి జాలరి మృతిరెంజల్ (బోధన్): చేపల వేటకు వెళ్లిన జాలరి వలకు చిక్కుకొని ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. వివరాలు ఇలా.. మండలంలోని కూనేపల్లికి చెందిన పాముల సాయిలు (50) అనే వ్యక్తి శుక్రవారం స్థానిక చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు వలకు చిక్కుకొని, నీటిలో పడి చనిపోయాడు. మృతుడి భార్య ఫిర్యా దు మేరకు కేసు న మోదు చేసినట్లు పో లీసులు తెలిపారు. -
అసలు, వడ్డీ చెల్లించాకే రెన్యువల్
గోల్డ్ లోన్ రెన్యువల్ ప్రక్రియకు ఆర్బీఐ విధించిన నిబంధనలు రుణగ్రహీతలకు ప్రతిబంధకంగా మారాయి. గతంలో ఏడాదికోసారి వడ్డీ చెల్లిస్తే సరిపోయేది. కానీ, ఇక మీదట ఏడాది కాగానే అసలు, వడ్డీ మొత్తం చెల్లించిన తర్వాతే రెన్యువల్ చేస్తామని బ్యాంకర్లు చెబుతున్నారు. దీంతో రుణగ్రహీతలు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది. ● గోల్డ్ రుణాలపై మారిన నిబంధనలు ● రెన్యువల్ కోసం రుణం మొత్తం చెల్లించాల్సిందే ● సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందులు ● వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రుణగ్రహీతలు -
అర్హులకు న్యాయం జరిగేలా చూడాలి
బోధన్/ రుద్రూర్ : భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు వేదికగా నిలవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు. అర్హులైన దరఖాస్తుదారులకు పూర్తి న్యాయం జరిగేలా సానుకూల దృక్పథంతో పనిచేయాలని అప్పుడే సదస్సుల నిర్వహణకు సార్థకత చేకూరుతుందన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ప్రభుత్వం భూ భారతి (ఆర్వోఆర్) చట్టం అమలు చేస్తోందన్నారు. సాలూర మండల కేంద్రంతోపాటు రుద్రూర్ మండలం రాణంపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సును సబ్ కలెక్టర్ వికాస్ మహతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారుల సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్లో దరఖాస్తుదారుల వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఆన్లైన్లో వివరాల నమోదులో ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. సదస్సులో ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తును స్వీకరించి రసీదును అందజేయాలని సూచించారు. సానుకూలంగా ఉన్న సమస్యలు సాధ్యమైనంత వరకు అక్కడిక్కడే పరిష్కరించాలని పేర్కొన్నారు. దరఖాస్తుదారులను పదే పదే తిప్పుకోకూడదని రెవెన్యూ బృందాలకు సూచించారు. సమస్యల వారీగా దరఖాస్తులను విభజిస్తూ, పక్కాగా రికార్డులను పొందుపర్చాలన్నారు. తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించదగిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు. భూ సమస్యలున్న ప్రజలు సదస్సులకు హాజరై దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు శశిభూషణ్, తారాబాయి తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆన్లైన్ ఎంట్రీలో తప్పిదాలు ఉండొద్దు భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు వేదికలుగా నిలవాలి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సాలూర, రుద్రూర్ మండలాల్లో సదస్సుల పరిశీలన -
మళ్లీ ‘లంపీ స్కిన్’ కలకలం
డొంకేశ్వర్(ఆర్మూర్) : రెండేళ్ల క్రితం జిల్లాలో కనిపించిన ‘లంపీ స్కిన్’ వైరస్ మళ్లీ తెల్ల జాతి పశువుల్లో కనిపిస్తోంది. వేగంగా వ్యాపించే ఈ వైరస్ లక్షణాలు (దద్దుర్లు) పశువుల్లో బయటపడడంతో పశుసంవర్ధక శాఖ అప్రమత్తమైంది. డిచ్పల్లి, నందిపేట్ మండలాల్లో లేగ దూడలు ఈ వైరస్ బారిన పడినట్లు అధికారులు గుర్తించారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు చుట్టు పక్కల ప్రాంతాల్లోని పశువులకు ఎల్ఎస్డీ వ్యాక్సిన్లు వేయడం ప్రారంభించారు. ఇప్పటికే 10 వేల పశువులకు వ్యాక్సిన్ వేయగా ఇంకా 60 వేల వరకు డోసులు అందుబాటులో ఉంచినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జగన్నాథచారి తెలిపారు. పాడి రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, వైరస్ లక్షణాలు కనిపిస్తే పశువైద్య అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. మిగతా మండలాలకు కూడా వైరస్ విస్తరించకుండా పశువైద్య సిబ్బంది ద్వారా గ్రామాల్లోని రైతులకు పలు జాగ్రత్త చర్యలు సూచిస్తున్నామన్నారు. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● ఆవులు, తెల్లజాతి పశువులకే ‘లంపీ స్కిన్’ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ● మొదట తీవ్రమైన జ్వరం కనిపిస్తుంది. ● మేత సక్రమంగా తినకపోవడం, పాలు తక్కువ ఇవ్వడం ● పశువు శరీరంలో మార్పులు జరిగి దద్దుర్లు రావడం ● సంబంధిత పశువుని మందలోకి వదలకుండా ప్రత్యేకంగా ఉంచాలి ● చికిత్స తర్వాత మేత పుష్టిగా అందించాలి, లేదా గంజి తాగించాలి. తెల్లజాతి పశువులకు విస్తరిస్తున్న వైరస్ అప్రమత్తమైన పశుసంవర్ధక శాఖ -
చేప పిల్లలు.. ఆలస్యం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో చేప పిల్లల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి లక్ష్యం నిర్దేశించలేదు. లెక్కప్రకారం ప్రతి ఏడాది మే నెలలోనే ఏఏ చెరువులకు, ఎన్ని చేప పిల్లలు పంపిణీ చేయాలో లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకెళ్లాల్సి ఉంది. అయితే గత ఏడాది నుంచి ఈ ప్రక్రియ అమలులో ఆలస్యం చేస్తున్నారు. దీంతో మత్స్యకారులు నష్టపోతున్నారు. ఈ ఏడాది జిల్లాలోని 967 చెరువుల్లో 4.54 కోట్ల చేప పిల్లలు పోసేందుకు జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం అందుకు అనుగుణంగా ఇప్పటి వరకు సర్క్యులర్ రాలేదు. వాస్తవానికి ఎండలు బాగా ఉన్న మే నెలలోనే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సింది. ఈసారి వర్షాలు ముందస్తుగా వచ్చాయి. అయినప్పటికీ చేప పిల్లల పంపిణీ లక్ష్యం నిర్దేశించుకోకపోవడం, ఆ దిశగా కసరత్తు చేయకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. మత్స్యకారులు అందోళన చెందుతున్నారు. అసలు ఈ ఏడాది చేప పిల్లల టెండర్లు నిర్వహించే ప్రక్రియ ఊసే లేదు. అదును దాటితే చేప పిల్లలు సక్రమంగా సైజ్ పెరగవని మత్స్యకారులు చెబుతున్నారు. ● గత ఏడాది కూడా చేప పిల్లల పంపిణీలో తాత్సా రం చేయడంతో లక్ష్యం సగం కంటే కూడా తక్కువ కు కుదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత సంవత్స రం 967 చెరువుల్లో 4.45 కోట్ల చేప పిల్లలను వదలాలని లక్ష్యం నిర్దేఽశించుకున్నప్పటికీ చాలా దూరంలో నిలవడం గమనార్హం. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చేప పిల్లల లక్ష్యాన్ని భారీగా తగ్గించారు. ● 967 చెరువుల్లో 4.45 కోట్ల పిల్లలను పోయాల్సి ఉండగా కేవలం 799 చెరువుల్లో 1.92 కోట్ల చేప పిల్లలను మాత్రమే పోశారు. వీటి విలువ రూ.2.13 కోట్లు. ఆయా చెరువుల్లో 35 నుంచి 40 మిల్లీమీటర్లు, 80 నుంచి 100 మిల్లీమీటర్ల సైజులో ఉన్న బొచ్చ, రోహూ, మీరగం చేప పిల్లలను పోశారు. ఈ ఏడాది ముందస్తుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ టెండర్ల ఊసే లేకపోవడం పట్ల మత్స్యకారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఏడాది చేప పిల్లల పంపిణీ విషయమై ప్రతిపాదనలు పంపామని, ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని జిల్లా మత్స్యశాఖ అధికారి ఆంజనేయస్వామి ‘సాక్షి’కి తెలిపారు. ఈ వారంలో ఆదేశాలు వచ్చే అవకాశముందన్నారు. త్వరగా పంపిణీ చేయాలి పోయినేడాది చేప పిల్లలను ఆలస్యంగా చెరువుల్లో పోశా రు. ఈసారి ప్రభుత్వం తొందరగా టెండర్లు పూర్తిచేసి జూలై మొదటి వారంలో పంపిణీ జరిగేలా చర్యలు తీ సుకోవాలి. నాణ్యమైన చేప పిల్లలను పంపిణీ చేస్తే అవి సక్రమంగా పెరిగి మత్స్యకారులకు మంచి ఉపాధి లభిస్తుంది. – మోహన్, మత్స్యకారుడు, డొంకేశ్వర్ పంపిణీకి కసరత్తు మొదలు పెట్టని రాష్ట్ర ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ ఊసే లేకపోవడంతో మత్స్యకారుల్లో ఆందోళన గత ఏడాది ఆలస్యంతో సగానికి పైగా లక్ష్యం కుదించిన వైనం -
గ్రూపు రాజకీయాలకు చెక్
సుభాష్నగర్: నిజామా బాద్ పార్లమెంట్ పరిధిలోని ఆయా నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టేందుకు ఎంపీ అర్వింద్ ధర్మపురి కీలక నిర్ణయం తీ సుకున్నట్లు తెలిసింది. ఎంపీ ల్యాడ్స్ ప్రొసీడింగ్స్ విష యంలో స్వయంగా తనే ప నులను ఫైనల్ చేయనున్నట్లు సమాచారం. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏడాదికి రూ.70 లక్షలు కేటాయిస్తు న్నారు. కొవిడ్ సమయంలో కాకుండా తర్వాతి ఏడా ది నుంచి రూ.5 కోట్ల ఎంపీ నిధులను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన కార్యాలయానికి వ చ్చిన దరఖాస్తులను పరిశీలించి, స్థానిక అవసరాల నిమిత్తం నిధులను సమానంగా కేటాయించేవారు. స్థానిక నాయకుల సిఫార్సులకు ప్రాధాన్యత ఇస్తూ నియోజకవర్గ ముఖ్య నాయకులు, మండలాల అధ్యక్షులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ముఖ్యమైన పనులకు నిధులు కేటాయిస్తూ, ప్రొసీడింగ్ పత్రాలను ముఖ్య నాయకుల ద్వారా అందించేవారు. కాగా, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బీజేపీ నాయకుల గ్రూపు రాజకీయాల నేపథ్యంలో ఎంపీ ల్యాడ్స్ ప్రొసీడింగ్స్ అందజేతపై నిర్ణయం మార్చుకున్నారు. ఈ విషయమై తన కార్యాలయ సిబ్బందిని సైతం ఆదేశించినట్లు తెలిసింది. నియోజకవర్గంలో బీజేపీ బలోపేతమవుతున్న నేపథ్యంలో పార్టీలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఎంపీ ల్యాడ్స్ నిధుల కేటాయింపులు, వాటి ఖర్చు, అభివృద్ధి ప నులు, నిధుల విషయంపై ఎంపీ అర్వింద్ స్వయంగా పర్యవేక్షిస్తారని సమాచారం. ● ఎంపీ ల్యాడ్స్ ప్రొసీడింగ్స్ను స్వయంగా ఇవ్వనున్న అర్వింద్ ధర్మపురి -
8న పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక
నిజామాబాద్నాగారం: నిజామాబాద్ పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 8న ఆదివారం ఏడో పద్మశాలి వధూవరుల పరిచయ వేదికను నగరంలోని వినాయక్నగర్లో గల విజయలక్ష్మి గార్డెన్స్లో నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు దాసరి నర్సింలు తెలిపారు. ఖలీల్వాడిలోని సంఘం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిచయ వేదికను విజయవంతం చేసేందుకు తమ బంధుమిత్రుల ఇళ్లలో పెళ్లి వయస్సు వచ్చిన అమ్మాయిలు/అబ్బాయిలను తీసుకువచ్చి నమోదు చేసుకొని విజయవంతం చేయాలన్నారు. వధూవరుల రిజిస్ట్రేషన్ కోసం ఎలాంటి ఫీజు లేదని, పాల్గొన్న వారికి భోజన వసతి కల్పిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ కోసం 94400091895, 9848047026, 7386323505 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి మైసల నారాయణ, చిలుక నర్సయ్య, భీమర్తి రవి, లోల రాజేందర్, ఆడెపు రాజన్న, భూస శ్రీనివాస్, దిండిగల్ల శంకర్, ధోర్నాల రవి, కోడూరు స్వామి, బీజీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
నవోదయలో ఈ ఏడాది నుంచే తరగతులు
నిజామాబాద్అర్బన్ : జిల్లాలకు కొత్తగా మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రస్తుత (2025–26) విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా సూచించారు. పాఠశాల విద్యా శాఖ సంచాలకులు నర్సింహారెడ్డితో కలిసి గురువారం ఆమె ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా విద్యా శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా సమీక్ష జరిపారు. యోగితారాణా మాట్లాడుతూ, జవహర్ నవోదయ విద్యాలయాలకు శాశ్వత ప్రాతిపదికన భవన నిర్మాణాల కోసం అనుకూలమైన స్థలాన్ని గుర్తించాలని కలెక్టర్లకు సూచించారు. ఇప్పటికే స్థల నిర్ధారణ పూర్తయిన జిల్లాలలో నవోదయ విద్యాలయాల భవన నిర్మాణాలకు చొరవ చూపాలన్నారు. శాశ్వత భవనాలు సమకూరే వరకు అందుబాటులో ఉన్న తాత్కాలిక భవనాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు నిర్వహించాలన్నారు. తరగతి గదులు, నీటి వసతి, టాయిలెట్స్ వంటి కనీస సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. చిన్నచిన్న మరమ్మతులు, ఫర్నీచర్ వంటి వాటి కోసం ప్రతిపాదనలు పంపితే నిధులు మంజూరు చేస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్న్స్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా విద్యా శాఖ అధికారి పి అశోక్, పంచాయతీరాజ్ ఈఈ శంకర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి యోగితారాణా -
ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి
రుద్రూర్: అంతర్రాష్ట్ర చెక్పోస్టు ద్వారా వెళుతున్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య సూచించారు. పోతంగల్ మండల శివారులోని అంతర్రాష్ట్ర చెక్పోస్టును గురువారం సీపీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్పోస్టు వద్ద ఉన్న సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి తెలుసుకున్నారు. అక్కడి రికార్డులు పరిశీలించారు. అక్రమంగా పశువులను తరలించకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాలన్నారు. అనంతరం వాహనాలు తనిఖీ చేశారు. సీపీ వెంట బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రుద్రూర్ సీఐ కృష్ణ, కోటగిరి ఎస్సై సునీల్ ఉన్నారు. సీపీ సాయి చైతన్య -
వాటర్ హీటర్ షాక్తో వృద్ధురాలి మృతి
ఖలీల్వాడి: నగరంలోని వినాయక్నగర్లో వాటర్ హీటర్ షాక్తో రా థోడ్ వీణ(61) మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. నిర్మల్ జిల్లా నాళేశ్వర్ మండలం పుష్పల్ గ్రామంలోని దుర్గా తండాకు చెందిన రాథోడ్ వీణ ఐదేళ్లుగా కూలీ పని చేసుకుంటూ వినాయక్నగర్లో నివాసం ఉంటోంది. గురువారం ఉదయం వీణ స్నానం చేసేందుకు వాటర్హీటర్ను బకెట్లో పెట్టి కొంత సమయం తర్వాత నీళ్లు వేడిగా మారాయో? లేదో తెలుసుకునేందుకు చేతిని నీటిలో పెట్టింది. విద్యుత్ షాక్ తగలడంతో కేకలు వేస్తూ పడిపోయింది. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కోడలు రాథోడ్ రేఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. జీజీహెచ్లో ఫిట్నెస్ సర్టిఫికెట్లకు ఇక్కట్లు నిజామాబాద్ నాగారం: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో వైద్యులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని అమర్నాథ్ యాత్రికులు గురువారం జీ జీహెచ్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా భక్తుడు ధాత్రిక రతన్ మాట్లాడుతూ ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం వచ్చిన భక్తులను ఏడంతస్తుల మేడలో కిందకు, పైకి తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. జీజీహెచ్ అధికారులు, సూపరింటెండెంట్ స్పందించి భక్తులకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక ట్రాక్టర్ సీజ్ మాచారెడ్డి: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టర్ను గురువారం సీజ్ చేసినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. పాల్వంచ మండలం బండరామేశ్వరపల్లి వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో వెళ్లి ట్రాక్టర్ను సీజ్ చేశామన్నారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్సై హెచ్చరించారు. -
పడకేసిన పశు వైద్యం
నిజామాబాద్అసలు, వడ్డీ చెల్లించాకే రెన్యువల్ గోల్డ్ లోన్ రెన్యువల్కు ఇక మీదట ఏడాది కాగానే అసలు, వడ్డీ చెల్లించాల్సిందేనని బ్యాంకర్లు చెబుతున్నారు. శుక్రవారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2025– 10లో u● వెటర్నరీ ఆస్పత్రులు, సబ్ సెంటర్లలో మందుల కొరత ● డీ వార్మింగ్, యాంటీబయాటిక్స్ లేక మూగ జీవాలకు అందని వైద్యం ● రెండేళ్లుగా సరఫరా చేయని ప్రభుత్వం ● డబ్బులు వెచ్చించి బయట కొనుగోలు చేస్తున్న పాడి రైతులుడొంకేశ్వర్(ఆర్మూర్) : పల్లెల్లో పశువైద్యం పడకేసింది. ప్రభుత్వ పశువైద్య కేంద్రాలకు పలు రకాల మందులు సక్రమంగా సరఫరా కావడం లేదు. ప్రధానంగా డీ వార్మింగ్, యాంటీ బయాటిక్స్, ఇతర అత్యవసర మందులు లేక మూగ జీవాలకు వైద్యం అందించలేకపోతున్నారు. దీంతో ఉచితంగా దొరికే మందులను పాడి రైతులు డబ్బులు వెచ్చించి బయట కొనుగోలు చేస్తున్నారు. తద్వారా గ్రా మాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రైమరీ వెటర్నరీ ఆస్పత్రులు, సబ్ సెంటర్లు పేరుకే అన్నట్లుగా మారాయి. 2019 పశు గణన ప్రకారం జిల్లాలో ఆవులు, గేదెలు, ఎడ్లు కలిపి 3.10 లక్షలు ఉన్నాయి. గొర్రెలు, మేకలు కలిపి 8 లక్షల పైచిలు కు ఉన్నాయి. మూగ జీవాలు వ్యాధులకు గురైన సమయంలో పాడి రైతులు ప్రభుత్వ పశువైద్య ఆస్పత్రికి వెళ్తే అవసరమైన మందులు దొరకడం లేదని చెప్తున్నారు. సాధారణ మందులే అందుబాటులో ఉంచుతున్నారని, వచ్చిన మందులు ఏం చేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. నట్టల నివారణ మందులు, యాంటీ బయాటిక్స్ లేక పశువైద్య అధికారులు కూడా బయట కొనుక్కోవాలని చీటీ లు రా సిస్తున్నారు. మందులను బయట కొనాలంటే రూ.500 నుంచి రూ.2 వేల వరకు ఖర్చు అవుతున్న ట్లు రైతులు చెప్తున్నారు. అవసరమయ్యే మందులు కావాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వం సరఫరా చేయ డం లేదని పలువురు పశువైద్య సిబ్బంది సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది లేక మూసి ఉంటున్న ఆస్పత్రులు... ప్రతి గ్రామానికి పశువైద్య సేవలు అందించాలని ప్రభుత్వం ప్రైమరీ వెటర్నరీ ఆస్పత్రులు, సబ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం సరిపడా పశు వైద్యులు లేక పల్లెల్లో ఉన్న పశు వైద్య దావఖానాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల రోజుల తరబడి తెరవడం లేదు. మరికొన్ని ప్రాంతాల్లో ఉదయం తెరిచి మధ్యాహ్నానికే మూసేస్తున్నా రు. వీఎల్వో లు, అటెండ ర్లు లేక ఒకే అ ధికారి పని చే స్తున్న పశువై ద్య కేంద్రాలు జిల్లాలో చాలా ఉన్నాయి. ఈ విషయమై జిల్లా పశుసంవర్ధక శాఖ అధి కారి జగన్నాథచారిని సంప్రదించగా... ఖాళీలు భర్తీ చేయాలని ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్తామని, పల్లె పశు దావఖానాల్లో మందుల కొరతపై సమీక్షిస్తామని, డీ వార్మింగ్ మందులు ప్రభుత్వం నుంచే సరఫరా కావాల్సి ఉందని స్పష్టం చేశారు.న్యూస్రీల్మందులు బయట కొంటున్నాం.. ప్రభుత్వ పశు ఆస్పత్రుల ద్వారా మూగ జీవాలకు ఉచిత వైద్యం, మందులు అందడం లేదు. మండల కేంద్రంలో ఉన్న పశువుల ఆస్పత్రిలో పశువులకు అవసరమ్యే మందులు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు. ఆస్పత్రికి పోతే మందులు బయట కొనుక్కోవాలని చీటి రాసిస్తున్నారు. వాటిని డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించి పశువులకు అవసరమయ్యే అన్ని మందులు అందుబాటులో ఉంచాలి. – రాహుల్ రెడ్డి, పాడి రైతు, డొంకేశ్వర్ -
పసుపు సాగులో మెలకువలు
బాల్కొండ: ఖరీప్ సీజన్లో పసుపు సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. ముందస్తు వర్షాలతో కొందరు రైతులు పసుపు విత్తడం ప్రారంభించారు. జిల్లాలో సుమారు 33 వేల ఎకరాల్లో పసుపు పంటను రైతులు సాగు చేస్తారు. పసుపు సాగులో మె లకువలను పాటించాలని ఆర్మూర్ డివిజన్ ఉద్యానవన అధికారి రుద్ర వినయ్ రైతులకు పలు సూచ నలు, సలహాలు చేస్తున్నారు. ఆయన మాటల్లోనే.. నేల తయారీ.. నేలను బాగా లోతుగా దున్నాలి. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి 40 ట్రాక్టర్ల నల్లమట్టిని నేలలో వేయాలి. ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ను వాడాలి. అడుగు మందుగా ఎకరానికి ఆరు బస్తాల సింగిల్ సూపర్ పాస్పెట్ చల్లాలి. బెడ్ విధానంలో ఇలా.. బెడ్ పద్ధతిలో విత్తినట్లయితే విత్తే రోజు బెడ్ మీద, బెడ్ మధ్యలో 45 సెంటీ మీటర్ల ఎడం ఉండేట్లు రెండు లైన్లు , రెండు అంగుళాల లోతు ఉండేట్లు ఏర్పాటు చేసుకోవాలి. బెడ్ మీద ఎకరానికి మూడు సంచుల వేప పిండి, ఒక్క బస్తా యూరియా, ఒక్క బస్తా పొటాష్ కలిపి లైన్లలో వేయాలి. బెడ్పై లైన్లలో విత్తన ముక్కల్ని సుమారుగా 22.5 సెంటీమీటర్లు (9 అంగుళాలు) దూరం ఉండేట్లు విత్తి బాగా కప్పేయాలి. డ్రిప్పు పైపులు పరిచి నీరు బాగా అందేట్లుగా వదలాలి. కలుపు నివారణ విత్తనం వేసిన మరుసటి రోజు ఎకరానికి కిలో చొప్పున అట్రాజిన్ కలుపు మందును 200 లీటర్ల నీటితో పిచికారీ చేయాలి. విత్తనం వేసిన 21 రోజులకు మొలక వస్తుంది. ఎక్కడైనా గ్యాపులు వస్తే ముందే ట్రేలలో పెంచిన మొక్కలను వాడాలి. విత్తనం ఆదా.. విత్తన శుద్ధి ఇలా కొత్త పద్ధతిలో భాగంగా విత్తన కొమ్మును చిన్నచిన్న ముక్కలు చేయడం ద్వారా విత్తన ఆదా చేసుకోవాలి. విత్తనాన్ని ఒక్క అంగుళం ఉండేట్లు ముక్కలు చేయాలి. దీంతో ఎకరానికి రెండు క్వింటాళ్ల విత్తనం మాత్రమే సరిపోతుంది. విత్తన ముక్కల్ని లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున రిడోమిల్ గోల్డ్ కలిపి తయారు చేసిన మంచు ద్రావణంలో అరగంట సేపు నానబెట్టి శుద్ధి చేసి ఆరబెట్టాలి. విత్తన శుద్ధి రెండు, మూడు రోజుల ముందు చేసుకోవాలి. దీంతో విత్తనం వేసే రోజు హడావుడి ఉండదు. పొలుసు, పురుగు ఉన్న చోట విత్తన శుద్ధి చేసేటప్పుడు లీటర్ నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోపాస్ కలపాలి. -
ఏడాదైనా దొరకని ఏటీఎం దొంగలు
బాల్కొండ : బాల్కొండ మండల కేంద్రంలోని వన్నెల్(బి) చౌరస్తా వద్ద ఎస్బీఐ ఏటీఎంలో గతేడాది జూన్ 4న అర్థరాత్రి తర్వాత భారీ చోరీ జరిగింది. రెక్కీ నిర్వహించి 9 నిమిషాల వ్యవధిలోనే రూ. 24 లక్షల 92 వేల 600 ఎత్తుకెళ్లారు. దొంగిలించిన కారులో వచ్చిన దుండగులు గ్యాస్కట్టర్తో ఏటీఎంను ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లారు. కాగా, ఏడాది కాలం గడుస్తున్నా ఇప్పటి వరకు దొంగల ఆచూకీ లభించలేదు. కేసు ఛేదనలో పోలీసులు పూర్తిగా విఫలం చెందారనే విమర్శలు వస్తున్నాయి. 2022 జూలైలో మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో సైతం ఇదే తరహా చోరీ జరిగింది. నగదు కాలిబూడిద కావడంతోపాటు 8 కిలోల బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. ఆ ఘటనలో కూడా గ్యాస్కట్టర్లతోనే లాకర్లను ధ్వంసం చేశారు. కాగా, కేసులో సగం మంది దొంగలను పోలీసులను పట్టుకున్నారు. 2023 సెప్టెంబర్లో మెండోరా మండలం పోచంపాడ్ ఎస్బీఐ బ్యాంకు వద్ద ఉన్న ఏటీఎంను ధ్వంసం చేసి రూ. 12 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఆ కేసు ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు. రూ. 25 లక్షల నగదు చోరీ బాల్కొండ మండల కేంద్రంలో ఏటీఎం ధ్వంసం త్వరలోనే పట్టుకుంటాం.. బాల్కొండ మండల కేంద్రంలో గతేడాది ఏటీఎం ధ్వంసం చేసి జరిగిన చోరీపై దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలోనే దొంగలను పట్టుకొని కోర్టులో హాజరుపరుస్తాం. – శ్రీధర్రెడ్డి, ఆర్మూర్ రూరల్ సీఐ, బాల్కొండ -
ఉమ్మడి జిల్లా హాకీ జట్టు ఎంపిక
ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలోని మినీ స్టేడియంలో ఉమ్మడి జిల్లాల హాకీ జట్టు క్రీడాకారులను గురువారం ఎంపిక చేసినట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ తెలిపారు. మొత్తం 55 మంది క్రీడాకారులు పాల్గొనగా 18 మందిని ఎంపిక చేశామన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 9, 10, 11 తేదీల్లో ఆదిలాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సబ్జూనియర్ పురుషుల అంతర్ జిల్లాల హాకీ టోర్నీలో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా ఈరవత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఈరవత్రి రాజశేఖర్ ఇద్దరు క్రీడాకారులకు స్పోర్ట్స్ షూ అందజేశారు. కార్యక్రమంలో కోశాధికారి పింజ సురేందర్, సంయుక్త కార్యదర్శి చిన్నయ్య, నాగేశ్, సభ్యులు అర్గుల్ సురేశ్, రాంప్రసాద్, సడక్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. అటెండరే వైద్యుడు! బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది కొరతతో అటెండర్లే వైద్యం చేస్తున్నారు. కాలి గాయంతో గురువారం ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి కి అటెండర్ డ్రెస్సింగ్ చేసి బ్యాండేజీ వేశారు. సాధారణంగా ప్రభుత్వ ఆస్పత్రిలో నలుగురు వైద్యులు ఉండాలి. ఇక్కడ మాత్రం ఒక వైద్యు రాలు, మరొక ఆయుష్ వైద్యుడు మాత్రమే ఉన్నారు. ఆయుష్ వైద్యుడు ఓపీ చూస్తుండటంతో అటెండర్ డ్రెస్సింగ్ చేశారు. ఈ ఆస్పత్రి వైద్య విధాన పరిషత్లోకి వెళ్లినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో సీజనల్ వ్యాధులతో ప్రజలు ఆస్పత్రికి వస్తున్నారు. నిత్యం 200లకు పైగా ఓపీ ఉంటోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వైద్యుల కొరత తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. దరఖాస్తుల ఆహ్వానంబాల్కొండ: మెండోరా మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ ఇంగ్లిష్ మీడియంలో తరగతులు బోధించేందుకు మహిళా అధ్యాపకుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రత్యేకాధికారిణి పద్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్లో తెలుగు, ఇంగ్లిష్, గణితం, జంతు, వృక్ష, భౌతిక, రసాయన శాస్త్రాల్లో బోధించేందుకు ఒక్కో పోస్టు ఖాళీగా ఉందన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈడీతోపాటు పీజీ చేసి ఉండాలని, శుక్రవారం సాయంత్రం వరకు దరఖాస్తులను పాఠశాలలో అందజేయాలని తెలిపారు. మోపాల్ కేజీబీవీలో.. నిజామాబాద్రూరల్: మోపాల్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఇంటర్ తెలుగు, ఆంగ్లం, గణితం, వృక్ష, జంతు, భౌతిక, రసాయన శాస్త్రాలు బోధించేందుకు తాత్కాలిక ప్రాతిపదికన మహిళా అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రత్యేక అధికారిణి రజనీ ఒక ప్రకటనలో తెలిపారు. 7వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నేడు ఆకాశవాణిలో ‘రైతు సంఘాల’పై చర్చడొంకేశ్వర్(ఆర్మూర్): రైతు ఉత్పత్తి సంఘాల నిర్మాణం, వాటి బలోపేతంపై శుక్రవారం ఆకాశవాణిలో చర్చ జరుగుతుందని జేఎంకేపీఎం చైర్మన్ తిరుపతి రెడ్డి తెలిపారు. ‘పంట పొలా లు’ కార్యక్రమంలో సాయంత్రం 7:15 నుంచి 7:45 గంటల వరకు చర్చ ఉంటుందని, రేడి యోతోపాటు ‘న్యూస్ ఆన్ ఎయిర్’ మొబైల్ యాప్లో కూడా వినొచ్చని పేర్కొన్నారు. ఎఫ్ పీవోల నిర్మాణం, బోలోపేతంపై రైతులు ఈ చర్చను విని అవగాహన పొందాలని కోరారు. -
తండ్రికి తనయే బాసట
జీజీహెచ్లో రోగుల ఇబ్బందులునిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగుల అవస్థలకు ఈ చిత్రమే నిదర్శనం.. బుధవారం ఆస్పత్రికి తన తండ్రికి చికిత్స చేయించడం కోసం ఓ కూతురు తీసుకొచ్చింది. అత్యవసర విభాగంలో చికిత్స తీసుకున్న తండ్రి పైఅంతస్తులోని జనరల్ విభాగానికి వెళ్లవలసి ఉంది. స్ట్రెచర్, ఆస్పత్రి సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో నడవలేని స్థితిలో ఉన్న తండ్రిని కూతురు తన భుజంపై చేయివేసుకుని ఇబ్బందులు పడుతూ తీసుకెళ్లింది. – నిజామాబాద్ అర్బన్ -
తల్లి తిట్టిందని కూతురి ఆత్మహత్య
పిట్లం(జుక్కల్): తల్లి తిట్టిందని కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో బు ధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుడగజంగం కాలనీకి చెందిన సంకు వరలక్ష్మి(14)ను బుధవారం సాయంత్రం ఇంటి తాళపు చెవిని పోగొట్టిందని తల్లి సంకు కవిత తిట్టింది. దీంతో మనస్తాపం చెందిన వరలక్ష్మి ఇంట్లోకి వెళ్లి దులానికి చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అనారోగ్యంతో మహిళ.. వర్ని: వర్ని పోలీస్స్టేషన్ పరిధిలోని తగిలేపల్లి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల మక్కవ్వ (45) అనారోగ్య కారణాలతో గురువారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. మక్కవ్వ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. బాధ భరించలేక గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కొడుకు రవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రమాదవశాత్తు ఒకరు.. సిరికొండ: మండలంలోని మెట్టుమర్రి తండా అట వీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు ఒకరు మృతి చెందినట్లు ఎస్సై ఎల్ రామ్ గురువారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన రమణయ్య కొన్నేళ్లుగా తండా లో ఉంటూ మేసీ్త్ర పని చేస్తున్నాడు. అతనికి ఎవరూ లేకపోవడంతో తండావాసులే రేకుల షెడ్డు వేసి ఇచ్చారు. మద్యానికి బానిసైన రమణయ్య అటవీ ప్రాంతంలో మృతి చెందాడని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. యువతి అదృశ్యం రెంజల్(బోధన్): ఎడపల్లి మండలంలోని అంబం గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి అదృశ్యమైనట్లు రెంజల్ ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. వారం రోజుల కిందట రెంజల్లోని తాతయ్య ఇంటికి వచ్చినట్లు పేర్కొన్నారు. గురువారం ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లినట్లు తెలిపారు. కుటుంబీకులు, బంధువుల ఇళ్లల్లో గాలించినా కనిపించకపోవడంతో తాత రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు ఇలా..
నాటి అల్లకొండనే నేటి బాల్కొండ మీకు తెలుసా? మీ కోసంరాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచిన బాల్కొండ ఒకనాటి అల్లకొండ. క్రీ.శ 1059లో సంధికాలంలో ఏర్పడ్డ అల్లకొండను, అల్లయ్య, కొండయ్య అనే మల్లయోధులు పాలించడంతో ముందుగా అల్లకొండగా పేరొందింది. ● కాలక్రమేనా అల్లకొండ క్రీ.శ 1422 తర్వాత బాల్కొండగా పిలువబడుతూ ప్రస్తుతం బాల్కొండ మండల కేంద్రంగా, నియోజకవర్గ కేంద్రంగా చెలామణి అవుతోంది. ● అల్లయ్య, కొండయ్యలు పాలించారనడానికి నిదర్శనంగా వారి విగ్రహలు ఇప్పటికీ బాల్కొండ ఖిల్లాలో ఉన్నాయి. ● యుద్ధ పోరాటంలో బహమనీ సుల్తానులు వాళ్ల కాళ్లు, చేతులు నరికి వేశారు. దీంతో వారి విగ్రహాలు కూడా కాళ్లు, చేతులు లేకుండానే ఉండడం విశేషం. – బాల్కొండ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తోంది. ఐతే, ఈ కొత్త రేషన్ కార్డులకు అర్హత ఏమిటీ? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఏయే పత్రాలు అవసరం? అనే వివరాలు మీ కోసం... ● రేషన్ కార్డుకు ప్రధాన అర్హత వార్షిక ఆదాయ ధ్రువీకరణ. గ్రామీణ ప్రాంతాల్లో వారికి రూ. లక్షా 50 వేలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు మించకూడదు. ● మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు కుటుంబసభ్యుల ఆధార్ కార్డులు, ఇంటి యజమాని కరెంట్ బిల్లు, గ్యాస్ సిలిండర్ పుస్తకం దరఖాస్తుకు జత చేయాలి. ఉంటే ద్విచక్ర వాహన ఆర్సీ లేదంటే ఓటరు కార్డు జిరాక్సు పెట్టాలి. ● దరఖాస్తు పూర్తయిన తర్వాత దానిని స్థానిక తహసీల్ కార్యాలయంలో అందజేస్తే అధికారులు పరిశీలించి ప్రభుత్వానికి ఆన్లైన్లో పంపుతారు. అనుకూలత మేరకు ప్రభుత్వం రేషన్ కార్డు మంజూరు చేస్తుంది. ● కారు, ఇతర నాలుగు చక్రాల వాహనాలు ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగం, ఐదెకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నా కొత్త రేషన్కార్డుకు అనర్హులే. ● ఇప్పటికే రేషన్కార్డు ఉండి అందులో కుటుంబసభ్యుల పేర్లు చేర్పులు, మార్పులు చేయాలంటే సంబంధితుల ఆధార్ కార్డు దరఖాస్తుకు జత చేయాలి. – డొంకేశ్వర్(ఆర్మూర్) -
డ్రోన్ పెట్రోలింగ్
ఖలీల్వాడి: ప్రజలకు భద్రతను పెంచేందుకు పోలీ సు శాఖ ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగి స్తోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఆకతాయిల ఆగడాలు, గొడవలు, గుంపులుగా గుమిగూడిన చోట్ల ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్య నిజామాబాద్ నగరంలో డ్రోన్ మొబైల్ పెట్రోలింగ్కు శ్రీకారం చుట్టారు. పర్యవేక్షణ మెరుగుపరచడం, నేరాలను అడ్డుకోవడం, త్వరితగతిన స్పందించి నిర్ధారించిన ప్రాంతాలకు పోలీసులు సులువుగా వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రయోజనాలు.. డ్రోన్ల ద్వారా పండగలు, ర్యాలీలు, పార్టీల మీటింగ్లు, జనం గుంపులను పర్యవేక్షిస్తారు. ట్రాఫిక్ నియంత్రణ, నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు, మిస్సింగ్ అయిన వ్యక్తులు, అనుమానితుల గుర్తింపు, విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో డ్రోన్లను వినియోగిస్తారు. గతంలోనూ డ్రోన్ కెమెరాలతో పోలీసులు పర్యవేక్షణ చేసిన సందర్భాలు ఉన్నాయి. నేరాలకు చెక్ పడే విధంగా... నగరంలో అర్ధరాత్రి వేళ రోడ్లపై తిరిగే వారు, గ్యాంగ్లు, అనుమానితులు డ్రోన్ కెమెరాలకు చిక్కడంతో వారి ఆగడాలకు చెక్ పడుతుంది. అర్ధరాత్రి వర కు గుంపులు, గుంపులుగా సమావేశమై న్యూసెన్స్ చేసే వారిని ఈజీగా గుర్తించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. చోరీల నివారణ, దర్యాప్తులో ఉపయోగపడుతుంది. బైక్, ఆటో, కార్ల దొంగతనాలకు చెక్పడుతుంది. సీపీ పోతరాజు సాయిచైతన్య ఆదేశాలతో డ్రోన్ల పర్యవేక్షణ నగరంలో త్వరలో అందుబాటులోకి రానుంది.డ్రోన్ ఎలా పని చేస్తుంది నగరంలో లా అండ్ అర్డర్ తోపాటు ట్రాఫిక్ లో డ్రోన్లను అందుబాటులోకి తీసుకురా నున్నారు. ఒక్కో డ్రోన్ ధర సుమారు రూ.12 లక్షల వరకు ఉంటుందని పోలీసు వర్గాలు తెలిపాయి. డ్రోన్ కింద, హై–డెఫినిషన్ కెమెరాలు, నైట్–విజన్ వీడియో కూ డా ఉంటుంది. డ్రోన్ల నుంచి వచ్చే ప్రత్యక్ష వీడియో ఫుటేజీ మొబైల్ పెట్రోలింగ్ యూ నిట్లతోపాటు కమాండ్ కంట్రోల్కు అనుసంధానించబడుతుంది. సున్నిత ప్రాంతాలు, రద్దీగా ఉండే ప్రాంతాలను డ్రోన్తో పర్యవేక్షిస్తారు. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో డ్రోన్లను వినియోగించి ట్రాఫిక్ క్లియర్ చేసే అవకాశం ఉంటుంది.శాంతిభద్రతల పరిరక్షణకు.. డ్రోన్లను సమస్యాత్మక ప్రాంతాల్లో వినియోగిస్తాం. దీనితో తగదాలు, గుంపులు, గుంపులుగా ఉండేవారు, అర్ధరాత్రి తిరిగే ఆకతాయిలను డ్రోన్ సహాయంతో నివారించగలుగతాం. అనుమానితుల, దొంగల గుర్తింపునకు డ్రోన్లు ఉపయోగపడాతాయి. గతంలో పండగలు, ర్యాలీలు, వివిధ వాటికి డ్రోన్లను ఉపయోగించాం. ఇప్పుడు నగరంలో శాంతిభద్రతలకు ఉపయోగిస్తాం. – రాజావెంకట్రెడ్డి, ఏసీపీ, నిజామాబాద్ నగరంలో త్వరలో ప్రారంభించనున్న పోలీసు శాఖ ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్కు ఒక్కోటి.. డ్రోన్ కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం ముందుగా సమస్యాత్మక పోలీస్స్టేషన్ల పరిధిలో అమలు -
డీసీసీబీ సేవలకు ఐఎస్వో గుర్తింపు
నిజామాబాద్ సిటీ: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కస్టమర్లకు అందిస్తున్న సేవలకు గాను ఐఎస్వో ధ్రువీకరణ పత్రం అందజేసినట్లు చైర్మన్ రమేశ్రెడ్డి తెలిపారు. జిల్లాకేంద్రంలోని బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో బుధవారం పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రమేశ్రెడ్డి మా ట్లాడుతూ.. డీసీసీబీ అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తున్నందుకు, బ్యాంకు నిర్వహ ణ, ఖాతాదారులకు బ్యాంకు ద్వారా అంది స్తున్న విలువైన సేవలకుగాను ఐఎస్వో ధ్రువీకరణ పత్రం (9001 : 2015) జారీ చేసిందన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి నిర్వహించిన ఆడిట్లో బ్యాంకు మంచి ఆర్థి క ఫలితాలు సాధించి, అన్ని విభాగాల్లో మె రుగైనట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆడిట్ స్కోర్ 90 సా ధించామని, బ్యాంకు చరిత్రలో మొదటిసారని పేర్కొన్నారు. డైరెక్టర్లు, సీఈవో నాగభూషణం ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి నిజామాబాద్ అర్బన్: ఈవీఎంల భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల ని కలెక్టర్ రాజీవ్గాంధీ హనమంతు అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని వి నాయక్నగర్లో ఉన్న ఈవీఎం గోదాము ను అదనపు కలెక్టర్ కిరణ్కుమార్తో కలిసి కలెక్టర్ బుధవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమ క్షంలో గోదాము సీల్ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూని ట్లు, ఎన్నికల సామగ్రిని భద్రపర్చిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. వారి వెంట ఎన్ని కల విభాగం పర్యవేక్షకుడు పవన్, సిబ్బంది సాత్విక్, విజయేందర్ తదితరులు ఉన్నారు. కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు నిజామాబాద్ రూరల్: కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఏడీఏం అలీం హైమద్ స్పష్టం చేశారు. నగర శివారులోని సారంగాపూర్ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్తోపాటు జిల్లా కేంద్రంలోని విత్తన, పురుగు మందుల దుకాణాలను టాస్క్ఫోర్స్ అధికారులతో కలిసి ఏడీఏ బుధవారం పరిశీలించారు. దుకాణాల్లోని స్టాక్, బిల్లు రిజిస్టర్లు, విత్తన బస్తాల లాట్ నంబర్లను పరిశీలించా రు. లైసెన్ ్డ్స డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. రైతులు విత్తన రసీదులను పంట కాలం పూర్తయ్యే వరకు భద్రపర్చుకోవాలన్నారు. మండల వ్యవసాయ అధికారి జాదవ్ హీరా, సీడ్ సర్టి ఫికేషన్ ఆఫీసర్ నాగేశ్, ఎస్సై మహేశ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మీనాక్షి నటరాజన్తో జిల్లా నేతల సమావేశం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుధవారం హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా జిల్లాకు చెందిన, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు పరిశీలకులుగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్గౌడ్, రాంభూపాల్లు మీనాక్షీకి తమ నివేదికలను అందజేశారు. కేటాయించిన జిల్లాల్లో తాము నిర్వహించిన సమావేశాలు, సేకరించిన వివరాలను పూర్తిస్థాయిలో వివరించారు. ఒక్కొక్కరితో క్షుణ్ణంగా మాట్లాడిన మీనాక్షీ అన్ని విషయాలను కూలంకషంగా అడిగి తెలుసుకున్నట్లు నాయకులు పేర్కొన్నారు. -
పసుపు సాగులో కొత్త పుంతలు
డొంకేశ్వర్(ఆర్మూర్): యాంత్రీకరణను రైతులు అందిపుచ్చుకుంటున్నారు. కూలీలు లేకుండానే భూమిని దున్ని పసుపు విత్తనాలతోపాటు ఎరువు లు కూడా వేసే పసుపు సీడర్ (యంత్రం) అందుబాటులోకి వచ్చినట్లు తెలుసుకుని డొంకేశ్వర్కు చెందిన బార్ల బొర్రన్న కొనుగోలు చేశాడు. రూ.1.45లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన యంత్రంతో తనకున్న ఆరు ఎకరాల్లో సీడర్తోనే పసుపు విత్తనాలు విత్తాడు. సాధారణంగా నలుగురు కూలీలు రోజంతా రెండు ఎకరాలు విత్తనాలు వేస్తే.. ఈ యంత్రం మాత్రం కేవలం రెండున్నర గంటల్లోనే దున్నడం, విత్తనం వేయడం పూర్తి చేస్తుందని రైతు తెలిపాడు. గతేడాది కూలీల తో విత్తనాలు వేయిస్తే ఎకరానికి 25 బస్తాలు అయ్యేవని, ఇప్పుడు 16 బస్తాలే సరిపోయినట్లు చెప్పాడు. డబ్బుతోపాటు విత్తనం ఆదా అయ్యిందని సంతోషం వ్యక్తం చేశాడు. -
దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించాలి
జక్రాన్పల్లి/బాల్కొండ: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి స్వీకరించే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేయా లని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. జక్రాన్పల్లి మండలం మాదాపూర్, బాల్కొండ మండలం కిసాన్నగర్, ముప్కా ల్ మండలం నల్లూర్ గ్రామాల్లో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకే రెవె న్యూ సదస్సులను నిర్వహిస్తున్నామన్నారు. రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్డెస్క్, దరఖాస్తుల స్వీకరణ కౌంటర్ వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఒకే దరఖాస్తులో రెండు, మూడు భూ సమస్యలను పేర్కొనవచ్చని తెలిపారు. సమయపాలన పాటిస్తూ అర్జీలు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇది వరకే మెండోరా మండలంలో భూ భారతి చట్టంపై పైలట్ మండలంగా ఎంపిక చేసి క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి చేశామన్నారు. మిగ తా 32 మండలాల్లో ఈ నెల 20 వరకు రెవెన్యూ సదస్సులు పూర్తి చేస్తామన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, తహసీల్దార్లు కిరణ్మయి, శ్రీధర్, ముంతాజ్బొద్దీన్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు జక్రాన్పల్లి, బాల్కొండ, ముప్కాల్ మండలాల్లో పరిశీలన -
టీచర్ల న్యాయపోరాటం
నిజామాబాద్అర్బన్: పాఠాలు చెప్పాల్సిన టీచర్లు ఏళ్లుగా ఉద్యోగ భద్రత కోసం న్యాయపోరాటం చేస్తున్నారు. మరో వైపు ప్రభుత్వాన్ని తమ పరిస్థితపై అభ్యర్థిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు. ఒకే ఒక ఉత్తర్వు కారణంగా ఉపాధ్యాయ ఉద్యోగం పొగొ ట్టుకున్న డీఎస్సీ–2008 ఉపాధ్యాయుల పరిస్థితి ఇది. ప్రభుత్వం వారిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎస్జీటీలుగా నియమించినా మాడునెలలుగా జీతాలు అందడం లేదు. ఈ నెల 26వ తేదీన వీరి భవితవ్యంపై న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. అనూహ్యంగా ఉద్యోగాలకు దూరం.. 2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం ఇతర స్కూల్ అసిస్టెంట్ పోస్టులతోపాటు 30 వేల సెకండరీ గ్రేడ్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఎస్సీ పరీక్ష పూర్తయిన తరువాత ర్యాంకుల ప్రాతిపదికన రిజర్వేషన్ ఆధారంగా ఎస్జీటీ ఉపాధ్యాయుల ఎంపిక జాబితాను పూర్తిచేసి అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసింది. ఉపాధ్యాయ పోస్టింగులు ఇచ్చే చివరి సందర్భంలో కోర్టు తీర్పు వీరికి అశనిపాతంలా మారింది. మంజూరైన పోస్టుల్లో టీటీసీ/డీఈడీ చేసిన అభ్యర్థులకు 30 శాతం కోటా ఇవ్వాలని కోర్టు ఆదేశించడంతో వీరి ఉద్యోగజీవితాలపై చీకట్లు కమ్ముకున్నాయి. ఉమ్మడి జిల్లాలో 140 మంది.. ఉమ్మడి జిల్లాలో సుమారు 140 మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరంతా ఐక్యంగా హైకోర్టులో డబ్ల్యూపీ నంబర్ 18683/2009, డబ్ల్యూపీ నంబర్ 17340/2013 కేసులు వేశారు. పట్టువదలకుండా 16 ఏళ్లుగా వీరు న్యాయపోరాటం చేస్తుండగా.. 2025 ఫిబ్రవరిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎస్జీటీలుగా నియమించారు. తమను రెగ్యులర్ చేయాలనే వారు న్యాయపోరాటం చేస్తుండగా.. ఈనెల 26వ తేదీన హైకోర్టు ద్వారా తీర్పు వెలువడనుంది. మూడు నెలలుగా అందని వేతనాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేస్తున్న వారికి మూడు నెలలు గడిచినా రూ.31,040 ఫిక్స్డ్ వేతనం అందలేదు. కాంట్రాక్ట్ ఎస్జీటీ ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది ధర్పల్లి, సిరికొండ, భీమ్గల్, కమ్మర్పల్లి , మోర్తాడ్, సాలూర రుద్రూర్ మండలాల్లో పనిచేస్తున్నారు. ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా ఎదురుచూపు లు తప్పడం లేదు. రెగ్యులరైజేషన్ కోసం 16 ఏళ్లుగా ఎదురుచూపులు 2008–డీఎస్సీ టీచర్లకు న్యాయం దక్కేనా.. కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చినా తప్పని వేతన వెతలు మూడునెలలుగా జీతాలు లేవు కాంట్రాక్ట్ ప్రాతపదికన ఎస్జీ టీ ఉపాధ్యాయులుగా కొనసాగుతున్న మాకు మూడు నెలలుగా జీతాలు లేవు. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. రవాణా ఖర్చులు అదనపు ఆర్థికభారంగా మారాయి. – సురేశ్, ధనంబండ పాఠశాల, ధర్పల్లి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలి 16 ఏళ్ల సుదీర్ఘ పోరాటం త రువాత మమ్మల్ని కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎస్జీటీ ఉపా ధ్యాయలుగా నియమించా రు. కానీ మా పోస్టులను క్ర మబద్ధీకరించి రెగ్యులర్ చే యాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. – కె గంగాధర్, ఎంపీపీఎస్ రేకులపల్లి, ధర్పల్లి -
రెచ్చిపోతున్న కలప స్మగర్లు
● జిల్లాలో యథేచ్ఛగా అడవుల నరికివేత ● సిరికొండ, నిజామాబాద్ నార్త్ రేంజ్లలోనే ఎక్కువ ● గడిచిన ఐదు నెలల్లో 300 దుంగల పట్టివేత ● కేసులు నమోదు చేస్తున్నా జంకని టేకు దొంగలు డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో కలప దొంగలు రెచ్చిపోతున్నారు. అధికారుల కళ్లుగప్పి అడవులను కొల్లగొడుతున్నారు. టేకు చెట్లను యథేచ్ఛగా నరికి దుంగలను తీసుకెళ్తున్నారు. ఎవరికీ దొరకుండా దుంగలను రహస్యంగా వ్యవసాయ బావుల్లో, గడ్డి వాముల్లో, పొదల్లో, పాడు బడిన ఇళ్లలో దాచి పెడుతున్నారు. నిజామాబాద్ సౌత్, సిరికొండ రేంజ్ల పరిధిలో కలప పట్టివేత కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. గడిచిన ఐదారు నెలల్లో ఆరుకు పైగా సంఘటనలు జరిగాయి. ఈ ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో టేకు దుంగలు బయట పడుతుండడం అక్కడి అటవీ అధికారులు ఏ విధంగా అడవులను సంరక్షిస్తున్నారో తెలుస్తోంది. జిల్లా అటవీ విస్తీర్ణం 86,871.45 హెక్టార్లలో ఉండగా, టేకు దొరికే అడవులు మాత్రం మోపాల్, సిరికొండ, భీమ్గల్, కమ్మర్పల్లి, వర్ని మండలాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్లో టేకుకు ఎక్కువ డిమాండ్ ఉండడంతో స్మగ్లింగ్ పెరిగిపోయింది. టేకు ఎక్కవగా లభించే ఐదు మండలాల్లో అడవులన్నీ తండాలకు సమీపంలో ఉండటంతో నడి రాత్రుల్లో, తెల్లవారు సమయాల్లోనే టేకు చెట్లను ఎక్కువగా నరికివేస్తున్నారు. అధికారులు పసిగట్టేలోపే స్మగ్లరు అక్కడి నుంచి మాయమవుతున్నారు. కలప ఎవరికీ దొరకకుండా రహస్య ప్రాంతాలకు తరలించి దాచి పెడుతున్నారు. వీటిని కొంతమంది సొంతానికి వాడుకుంటుండగా, మరి కొందరు టింబర్ డిపోలు, కార్పెంటర్లకు విక్రయించి వ్యాపారం చేస్తున్నారు. మోపాల్, సిరికొండ, భీమ్గల్, కమ్మర్పల్లి, వర్ని మండలాల పరిధిలో ‘జీరో’ మాల్ దందా బహిరంగగా సాగేందుకు కొందరు అటవీ అధికారుల సహకారం ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వాయిదాల ప్రకారం ముడుపులు తీసుకుని చూసీచూడనట్లు ఉంటున్నారనే విమర్శలు సైతం ఉన్నాయి. జిల్లాలో రేంజ్ల వారీగా అడవుల విస్తీర్ణం(హెక్టార్లలో)ఈ నెల 3వ తేదీన సిరికొండ మండలం పాకాల అటవీ సమీపంలోని మూడు ఇళ్లతోపాటు పొలాలు, గడ్డి వాముల్లో 131 టేకు దుంగలు లభించాయి. అటవీ అధికారులు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి ముగ్గురిపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన కలప విలువ రూ.2లక్షల పైనే ఉంటుంది. ఇదే మండల పరిధిలో చీమన్పల్లిలో ఐదు నెలల క్రితం 86 టేకు దుంగలు పాడుబడిన ఇళ్లలో, పొదల్లో లభించాయి. వీటి విలువ సుమారు రూ.లక్షా50వేలు ఉంటుంది. ఈ ఏడాది మార్చి నెలలో మోపాల్ మండలం ఎల్లమ్మ కుంటలో 60 టేకు దుంగలను అటవీ అధికారులు పట్టుకున్నారు. ఇవి దొరికిన విధానం సేమ్ ‘పుష్ప’ సినిమాను తలపించింది. ఊరి బయట వ్యవసాయ బావిలో ఒక దుంగ తేలి ఉండడంతో అందులో వెతికారు. ఏకంగా 60 కలప దుంగలు దొరికాయి. అయితే దుంగలను దాచిపెట్టిన వ్యక్తులెవరో అధికారులు గుర్తించలేకపోయారు. ఇదే మోపాల్ మండలం సిర్పూర్లో అడవిలో టేకు స్మగ్లింగ్ జరుగుతోందనే సమాచారంతో అటవీ అధికారులు అక్కడికి వెళ్లగా స్మగ్లర్లు పారిపోయారు. అక్కడ 17 కలప దుంగలను సీజ్ చేశారు. -
ర్యాపిడ్ టీం అందుబాటులో ఉండాలి
● జిల్లా వైద్యాధికారిణి రాజశ్రీ బోధన్టౌన్(బోధన్): డివిజన్లోని ప్రతీ పీహెచ్సీ, యూపీహెచ్సీలో ర్యాపిడ్ టీం అందుబాటులో ఉండాలని జిల్లా వైద్యాధికారి రాజశ్రీ పేర్కొన్నారు. పట్టణంలోని శక్కర్నగర్ కాలనీలో ఉన్న బస్తీ దవాఖానలో డివిజన్ స్థాయి వైద్యాధికారులు, పర్యవేక్షణ సిబ్బందితో బుధవారం కీటక జనిత వ్యాధుల నివారణ, నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. డివిజన్ స్థాయిలో హైరిస్క్ ఏరియాలను గుర్తించి నియంత్రణ, నివారణ చర్యలతోపాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పారామెడికల్ సిబ్బంది సమయపాలన పాటించాలని, పీహెచ్సీ, యూపీహెచ్సీల్లోని సిబ్బంది టూర్ డైరీ, అడ్వాన్స్ టూర్ ప్రోగ్రాం తయారు చేసి త్వరితగతిన అందజేయాలని సూచించారు. గ్రామాల్లో డెంగీ కేసులు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా మలేరియా అధికారి తుకారాం రాథోడ్, డిప్యూటీ డీఎంహెచ్వో మమత, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్కానింగ్ సెంటర్ సీజ్ పట్టణంలోని క్లారిటీ సిటీ స్కాన్ సెంటర్ను డీఎంహెచ్వో రాజశ్రీ బుధవారం సీజ్ చేశారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్తోపాటు రికార్డులు, డాక్టర్ కన్సల్టెంట్, ధరల బోర్డు లేదని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా స్కాన్ సెంటర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లను నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
విచ్చలవిడిగా రసాయన ఎరువుల వాడకం
పంట దిగుబడుల కోసం మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడటంతో భూసారం, పర్యావరణం దెబ్బతింటోంది. పచ్చని పొలాలపై పురుగుల మందులు ఎక్కువగా పిచికారీ చేస్తుండడంతో ప్రకృతి రీత్యా లభించే ఫలాలు విషతుల్యం అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 10.20 లక్షల సాగు విస్తీర్ణం ఉండగా, ఏటా 22.5 లక్షల లీటర్ల పురుగుల మందులు, 3.93 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వాడుతున్నారు. అతిగా ఎరువుల వాడకంతో భూసారం తగ్గడమే కాకుండా మిత్ర పురుగుల సంతతి నశించి కాలుష్యం పెరుగుతోంది. ఎరువుల వాడకాన్ని తగ్గించాలి.సేంద్రియమే సేఫ్ -
తహసీల్దార్కు గాయాలు
● కారును ఢీకొన్న డీసీఎం వ్యాన్ పెద్దకొడప్గల్(జుక్కల్): మండలంలోని అంజనీ చౌరస్తా సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. జుక్కల్ తహసీల్దార్ మహేందర్ కుమార్ పిట్లం నుంచి తన కారులో జుక్కల్కు వెళ్తుండగా పెద్దకొడప్గల్ మండలంలోని అంజనీ చౌరస్తా సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్.. కారును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న తహసీల్దార్ మహేందర్కుమార్, డీసీఎం డ్రైవర్ ఖలీద్కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం తహసీల్దార్ను హైదరాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. రెవెన్యూ సిబ్బంది నాగునాథ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బంగారంతో పరారైన వర్కర్ ఖలీల్వాడి: ఆభరణాల తయారీకి ఇచ్చిన 15 తులాల బంగారం తీసుకొని ఓ వర్కర్ పరారైన ఘటన నగరంలోని ఒకటో టౌన్లో చోటు చేసుకుంది. ఎస్హెచ్వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. కలకత్తాకు చెందిన మహమ్మద్ మజిల్ పదేళ్లుగా నగరంలో గోల్డ్ పనులు చేస్తున్నాడు. అతని వద్ద కలకత్తా నుంచి బాబాన్ హాల్దర్ నాలుగేళ్లుగా ఆభరణాల తయారీ పనులు చేస్తున్నాడు. పనిలో భాగంగా మహమ్మద్ మజిల్ ఇచ్చిన 15 తులాల బంగారం తీసుకొని హాల్దర్ పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
గుట్టలుగా ప్లాస్టిక్
ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాలు, 55 మండలాలు, 1056 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గత పదేళ్లుగా ప్లాస్టిక్ వినియోగం 50 శాతం పెరిగింది. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ సంచులు, చెత్త గుట్టలుగా పేరుకుపోతున్నాయి. భూమి లోనికి నీరు ఇంకే అవకాశం లేకుండా చేస్తున్నాయి. దీంతో మొక్కల పెరుగుదల ఆగిపోతోందని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఆవులు, ఇతర జంతువులు తిని జీర్ణం కాకపోవడం మృత్యువాత పడుతున్నాయి. ప్లాస్టిక్ను కాలుస్తుండడంతో వెలువడే బయాక్సిన్, పూన్చిరాన్ వంటి విషవాయువులు క్యాన్సర్కు దారితీస్తున్నాయి. -
మొక్కలను పెంచుదాం
జాతీయ అటవీ విస్తీర్ణం ప్రకారం భూ విస్తీర్ణంలో 33 శాతం అడవులు ఉండాలి. ఉమ్మడి జిల్లా వైశాల్యం 7956 చదరపు కిలోమీటర్లు కాగా, అడవులు మాత్రం 1196.29 చదరపు కిలోమీటర్లు వ్యాపించి ఉన్నాయి. ఇవి జిల్లా విస్తీర్ణంలో 23 శాతం మాత్రమే. సిరికొండ, ఇందల్వాయి, ఎల్లారెడ్డి, బాన్సువాడ అటవీ క్షేత్ర పరిధిలో గత పదేళ్లలో అడవుల విస్తీర్ణం బాగా తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఏటా ఉమ్మడి జిల్లాలో అడవుల సంరక్షణ కోసం ‘కంపా’ పథకం కింద రూ. 4.20 కోట్లు కేటాయిస్తున్నా గత రెండేళ్లలో అడవుల విస్తీర్ణం 0.929 శాతం మాత్రమే పెరిగింది. -
పర్యావరణ పరిరక్షణలో..చిత్రకారుడు
మార్పు వస్తుందనే.. నా ప్రయత్నంతో ప్రజల్లో కొంత మేరకు మార్పు వస్తుందని ఆశిస్తున్నా. కంటికి కనిపించే ఖాళీ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం నినాదాలు రాస్తున్నాను. కలర్, బ్రష్, నా వెంటే ఉంచుకుంటూ ఖాళీ ప్రదేశంలో నినాదాలు రాస్తాను. – ఇందూరి బల్వీర్ వర్ని: సమాజం ఎటు పోతే నాకేంటి.. మనం బాగుంటే చాలు అనే నేటి రోజుల్లో ఓ చిత్రకారుడు పర్యావరణ పరిరక్షణ కోసం తనవంతు బాధ్యతగా వ్యవహరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. వర్ని మండలం పాత వర్ని గ్రామానికి చెందిన ఇందూరి బల్వీర్. చిత్ర కళ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఖాళీ సమయాల్లో ప్రజలకు పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు గోడలు, కల్వర్టులు, రహదారుల వెంబడి ఖాళీ ప్రదేశాలల్లో పర్యావరణ పరిరక్షణ నినాదాలు రాస్తూ అందరినీ ఆలోచింపజేస్తున్నాడు. -
రెండేళ్ల బాలుడి కిడ్నాప్.. మూడు గంటల్లో ఛేదన
● దంపతుల అరెస్ట్ కామారెడ్డి క్రైం: రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కేసును కామారెడ్డి పోలీసులు మూడు గంటల్లోనే ఛేదించా రు. పడుకున్న చోటు నుంచి బాలుడిని కిడ్నాప్ చేసి న దంపతులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించా రు. పట్టణ పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు వెల్లడించారు. భిక్కనూర్ మండలం గుర్జకుంట గ్రామానికి చెందిన మక్కాల లక్ష్మి, నర్సింలుకు కుమార్తె, కుమారుడు హర్షిత్ (2) ఉన్నారు. కొంతకాలంగా కామారెడ్డిలో భిక్షాటన చేస్తూ సిరి సిల్ల రోడ్డు ప్రాంతంలోని దుకాణాల ఎదుట నిద్రిస్తుంటారు. మంగళవారం రాత్రి ఓ ఫాస్ట్ఫుడ్ సెంటర్ ఎదుట తమ పిల్లలతో కలిసి నిద్రించారు. ఉద యం లేచి చూడగా హర్షిత్ కనిపించలేదు. చుట్టప క్కల గాలించినా దొరకలేదు. బాలుడిని కిడ్నాప్ చేశారని గ్రహించి పట్టణ పోలీసులను ఆశ్రయించారు. అప్రమత్తమైన పోలీసులు బాలుడి ఆచూకీ కోసం 3 బృందాలను ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించగా బాలుడిని ఓ మగ వ్యక్తి, ఓ మహిళ కలిసి ఎత్తుకెళుతున్నట్లు గుర్తించారు. అన్ని కోణాల్లో విచారణ జరుపగా వారిని దోమకొండకు చెందిన పల్లపు రాజు, అతని భార్య శారదగా నిర్ధారించారు. నిందితులు సైతం పట్టణంలో భిక్షాటన చేస్తూ ఉంటారని తేలింది. దీంతో పట్టణంలో గాలింపు చర్య లు చేపట్టి కామారెడ్డి రైల్వేస్టేషన్ వద్ద బాలుడితో కలిసి భిక్షాటన చేసుండగా పట్టుకున్నారు. హర్షిత్ను తల్లిదండ్రులకు అప్పగించి నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన పట్టణ ఎస్హెచ్వో చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సై శ్రీరాం, కానిస్టేబుళ్లు విశ్వనాఽఽథ్, విజయ్, రాజు, నరేశ్, రవి, అశ్విన్ను అభినందించారు. -
చికిత్స పొందుతూ ఒకరి మృతి
సదాశివనగర్: మండల కేంద్రంలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందినట్లు ఎస్సై రంజిత్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన కుర్మ గంగమల్లు(39) నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లి తిరిగొచ్చాడు. తనకున్న ఎకరం 30 గుంటల భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల తన భూమిని ప్రైవేట్ సర్వేయర్తో సర్వే చేయించగా మూడు గుంటల భూమి తక్కువ వచ్చింది. దీంతో మనస్తాపం చెందిన గంగమల్లు మంగళవారం బావి వద్ద గడ్డిమందును సేవించి, ఫోన్లో సమాచారం ఇచ్చాడు. అపస్మారక స్థితిలో ఉన్న గంగమల్లును మొదట కామారెడ్డి ఆస్పత్రికి, తర్వాత ఎల్లారెడ్డిపేట్ అశ్విని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. తాళం వేసిన ఇంట్లో చోరీ ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలోని యోగేశ్వర కాలనీలో తాళం వేసిన ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. కాలనీకి చెందిన సీతాపవర్ అమరనాథ్ కుటుంబసభ్యులతో కలిసి గత నెల 31న హైదరాబాద్కు వెళ్లారు. బుధవారం తిరిగి ఇంటికి వచ్చి చూస్తే తాళం పగులగొట్టి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 12 గ్రాముల బంగారం, రూ.11 వేల నగదు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు నిజామాబాద్ రూరల్: మోపాల్ మండలం సిర్పూర్ శివారులో ఉన్న బాలయోగి అవధూత నిర్మలానంద స్వామి ఆశ్రమంలోని కుటీరం దగ్ధంపై ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై యాదగిరిగౌడ్ బుధవారం పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అర్గుల్ రాజారాం (గుత్ప) ఎత్తిపోతల పథకం
మీకు తెలుసా?చిరుప్రాయంలో అంతర్జాతీయ గుర్తింపు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ను ఎత్తిపోతల పథకం ద్వారా మళ్లించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.204 కోట్ల వ్యయంతో నిర్మాణం పనులు చేపట్టి పూర్తి చేయించారు.●● 2008 మార్చి 18న వైఎస్సార్ స్వహస్తాలతో అర్గుల్ రాజారాం (గుత్ప) ఎత్తిపోతల పథకంగా నామకరణం చేసి ప్రారంభించారు. ● ఆర్మూర్ ప్రాంత బీసీ నాయకుడు, మాజీ మంత్రి అర్గుల్ రాజారాంకు ఇచ్చిన అరుదైన గౌరవం ఇది. ● ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల పరిధిలోని మాక్లూర్, నందిపేట్, ఆర్మూర్, బాల్కొండ, వేల్పూర్, జక్రాన్పల్లి మండలాల్లోని 53 గ్రామాల్లో 38 వేల 792 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అయింది. ● నందిపేట మండలం ఉమ్మెడ శివారులో నిర్మించిన ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్లోని గోదావరి నదీ జలాలు 22.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గుత్ప చెరువు మీదుగా ఆర్మూర్ ప్రాంత వ్యవసాయ భూములకు అందుతుండటంతో రైతులు హర్షంవ్యక్తం చేస్తున్నారు. – ఆర్మూర్ విద్యుత్ 1912 పోలీస్ 112,100 అగ్నిమాపక 101 అంబులెన్స్ 102, 108 రైల్వే విచారణ 139 అవినీతి నిరోధక శాఖ 1031 రోడ్డు ప్రమాదం 1073 సైబర్ క్రైమ్ 1930 – ఖలీల్వాడీఅత్యవసర సేవల టోల్ ఫ్రీ నంబర్లు ఆర్మూర్: ఆర్మూర్ పట్టణానికి చెందిన బాశెట్టి సాయి శృతి.. చిన్నతనం నుంచే ఆంధ్ర నాట్యం, కూచిపూడి ప్రదర్శనలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. తల్లి నటరాజ నృత్యానికేతన్ నాట్య గురువు బాశెట్టి మృణాళిని శిష్యరికంలో ఐదేళ్ల నుంచే నాట్యాన్ని అభ్యసించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం 13 ఏళ్ల సాయిశృతి తొమ్మిదో తరగతి చదువుతూ తను అనుకున్న లక్ష్యాలను సాధిస్తోంది. ఆంధ్ర నాట్యం, కూచిపూడిలో భూషణ్ పరీక్షలను పూర్తి చేసుకొని రెండేళ్ల డిప్లొమా సైతం పూర్తి చేసుకోనుంది. ఇప్పటి వరకు గోల్డెన్ టెంపుల్, కాశీ, కాణిపాకం, తిరుపతి, శ్రీశైలం, స్వర్ణగిరి, యాదగిరిగుట్ట, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, అన్నవరం, బెంగళూరు, ఢిల్లీ, మలేషియా, దుబాయ్తోపాటు పలుచోట్ల సుమారు 80కి పైగా ప్రదర్శనలు ఇచ్చింది. చక్కని ప్రతిభ కనబర్చి నంది అవార్డు, కళాభారతి, నాట్య మయూరి, నాట్య విభూషణ్, నాట్య కుసుమం అవార్డులతోపాటు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్, లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్, స్పిరిచువల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లలో చోటు దక్కించుకుంది. విదేశాల్లో ఉన్న చిన్నారులకు ఆన్లైన్లో నృత్యాన్ని నేర్పిస్తూ చిరుప్రాయంలోనే సహాయ నాట్య గురువుగా అవార్డును అందుకుంది. ‘లోకల్ టాలెంట్’ ఆంధ్ర నాట్యం, కూచిపూడిలో తనకంటూ ప్రత్యేకత జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 80కి పైగా ప్రదర్శనలు -
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్ అర్బన్: భూభారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ పేర్కొన్నారు మంగళవారం కంఠేశ్వర్లోని సీఎస్ఐ పాఠశాలలో నార్త్ మండల ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు గల కొన్నేరుగా ఎదుర్కొంటున్న సమస్యలను భూభారతి ద్వారా పరిష్కారం అవుతాయన్నారు. అనంతరం రైతులు అందించిన దరఖాస్తులను ఇన్చార్జి తహసీల్దార్ విజయకాంత రావు స్వీకరించారు. క్యూబాకు సంఘీభావాన్ని ప్రకటిద్దాం నిజామాబాద్ సిటీ: క్యూబాపై అమెరికా ఆంక్షలు విధిస్తూ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నదని, ప్రజాస్వామికవాదులు క్యూబాకు సంఘీభావం ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్బాబు కోరారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సోషలిస్టు వ్యవస్థను నిర్మిస్తున్న క్యూబా దేశాన్ని కాపాడుకోవాలన్నారు. ఈనెల 4, 5 తేదీలలో విరాళాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. నూర్జహాన్, వెంకటేష్, శంకర్ గౌడ్ పాల్గొన్నారు. -
సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్పై శిక్షణ
మోపాల్: నగరశివారులోని బోర్గాం(పి) జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ అంశాలపై రెండ్రోజుల శిక్షణా కార్యక్రమాన్ని డీఈవో అశోక్ మంగళవారం ప్రారంభించారు. ఈసందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగుతుందని, కేజీబీవీ, రెసిడెన్సియల్ పాఠశాలల నుంచి ఉపాధ్యాయులు హాజరయ్యారన్నారు. రెండు విడతల్లో విడతకు 45మంది చొప్పున ఉపాధ్యాయులకు శిక్షణ అందిస్తున్నామని, పాఠశాలల్లో బాలికల రక్షణ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సమస్యల పట్ల స్పందించే లక్షణాలు, లైంగిక అరాచకాల నివారణ వంటి అనేక అంశాలపై శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలు పాఠశాలల్లో బాలికలకు వివరించి సమాజంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే ధైర్యం వారిలో కలిగించాలని సూచించారు. జీసీడీవో భాగ్యలక్ష్మీ, పాఠశాల హెచ్ఎం శంకర్, ప్రజ్వల ఆర్పీలు పాల్గొన్నారు. కరపత్రాల విడుదల నిజామాబాద్ అర్బన్: టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో రూపొందించిన బడిబాట కరపత్రాలను డీఈవో అశోక్ మంగళవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలన్నా రు. అడ్మిషన్లను పెంచాలన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డి.సత్యానంద్, జిల్లా అధ్యక్షులు రమేష్, ప్రధాన కార్యదర్శి గంగాధర్, కోశాధికారి రాజారా మ్, కార్యదర్శి సాయన్న, తదితరులు పాల్గొన్నారు. -
భూ సమస్యల పరిష్కారానికే భూభారతి
మోపాల్: రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని తహసీల్దార్ రామేశ్వర్ సూచించారు. మండలంలో భూభారతి రెవెన్యూ సదస్సులు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటిరోజు తాడెం, చిన్నాపూర్ గ్రామాల్లో నిర్వహించారు. తాడెంలో తహసీల్దార్ రామేశ్వర్ 24 దరఖాస్తులు, చిన్నాపూర్లో డీటీ సరళ 75 దరఖాస్తులను స్వీకరించారు. ఆర్ఐ రాజేశ్వర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. సిరికొండ: రావుట్లలో తహసీల్దార్ రవీందర్రావు, గడ్కోల్లో ఉప తహసీల్దార్ ప్రవీణ్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించారు. రావుట్లలో 94, గడ్కోల్లో 153 దరఖాస్తులు వచ్చినట్లు వారు తెలిపారు. ఎమ్మారై గంగరాజం, ఏఆర్ఐ నాగన్న, సిబ్బంది పాల్గొన్నారు. డిచ్పల్లి: డిచ్పల్లి మండలంలోని సుద్దులం, కమలాపూర్ గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు డిచ్పల్లి తహసీల్దార్ సతీష్రెడ్డి, నాయబ్ తహసీల్దార్ శ్రీకాంత్ తెలిపారు. తొలిరోజు సుద్దులం గ్రామంలో 78, కమలాపూర్లో 8 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. ఆర్ఐలు సంతోష్, భూపతి ప్రభు, తదితరులు పాల్గొన్నారు. రెండు గ్రామాల్లో రెవిన్యూ సదస్సులు జక్రాన్పల్లి : నారాయణ్పేట్, మనోహరాబాద్ గ్రామాల్లో మంగళవారం రెవిన్యూ సదస్సులు నిర్వహించారు. రెండు గ్రామాల్లో రైతుల నుంచి రెవిన్యూ అధికారులు అర్జీలను స్వీకరించారు. తహసీల్దార్ కిరణ్మయి, డిప్యూటీ తహసీల్దార్ దత్తాత్రి, ఆర్ఐ ప్రవీణ్, జూనియర్ అసిస్టెంట్ నవీన్, సర్వేయర్ డానియల్, రైతులు పాల్గొన్నారు. -
రాజకీయ కక్ష సాధించటానికే కేసీఆర్కు నోటీసులు
నిజామాబాద్ రూరల్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపుల్లో భాగమేనని జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ సర్కార్ ఇలాంటి నోటీసులతో కుట్ర పన్నుతోందని ఓ ప్రకటనలో ఆయన ఆరోపించారు. ఎలాంటి కుట్రలనైనా తిప్పికొట్టే నైపుణ్యం బీఆర్ఎస్కు ఉందని, రేవంత్ సర్కార్ ఇప్పటికై నా బుద్ధి మార్చుకోవాలని హితవు పలికారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ట్రాన్స్ఫార్మర్పై తీగ మొక్కల తొలగింపు సుభాష్నగర్: ‘ప్రమాదకరంగా ట్రాన్స్ఫార్మర్’ పేరుతో ‘సాక్షి’ లో ప్రచురితమైన కథనానికి విద్యుత్శాఖ అధికారులు వెంటనే స్పందించారు. నగరంలోని వినాయక్నగర్లోగల 100 ఫీట్ల రోడ్డుకు ఆను కుని ఉన్న ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభంపైకి ఎగబాకిన తీగ జాతి మొక్కలను మంగళవారం తొలగించారు. అలాగే ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పెరిగిన పిచ్చిమొక్కలను శుభ్రం చేశారు. కాగా విద్యుత్ ప్రమాదంపై ప్రచురితమైన కథనం ద్వారా ట్రాన్స్ఫార్మర్ వద్ద పిచ్చిమొక్కలను తొలగించినందుకు ‘సాక్షి’కి కాలనీవాసులు ధన్యవాదాలు తెలియజేశారు. ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతం నిజామాబాద్అర్బన్: జిల్లాలో మంగళవారం పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 179 మంది విద్యార్థులకుగాను 130 మంది విద్యార్థులు హాజరయ్యారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సిరికొండ: న్యావనంది, కొండాపూర్, జగదాంబ తండాలో బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు మంగళవారం పంపిణీ చేశారు. న్యావనందిలో యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ప్రవీణ్, ఏఎంసీ డైరెక్టర్ ముత్తెన్న, నరేందర్, జనార్దన్, కొండాపూర్లో ఆకుల జగన్, శ్రీధర్, బుచ్చన్న, కిషోర్గౌడ్, గౌస్, చంద్రాగౌడ్, ఫారూఖ్, జగదాంబ తండాలో రవినాయక్, ప్రవీణ్, బలరాం, కిషన్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ధర్పల్లి: దుబ్బాకలో మంగళవారం 21 మంది లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పోతన్న, నాయకులు ప్రతాప్ గౌడ్, సంతోష్ రెడ్డి, సాయి, దశరథ్, ప్రేమ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పనులు ప్రారంభం సిరికొండ: జగదాంబ తండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కాంగ్రెస్ నాయకులు మంగళవారం ప్రారంభించారు. భూమి పూజ చేసి ముగ్గు పోశారు. యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రవినాయక్, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రవీణ్నాయక్, భూపతి, బలరాం, గోపాల్, గంగాధర్, లాల్సింగ్, గణేష్, రాయలు పాల్గొన్నారు. జక్రాన్పల్లిలో.. జక్రాన్పల్లి: మండల కేంద్రంలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ప్రారంభించారు. నాయకులు కాట్పల్లి నర్సారెడ్డి, సొప్పరి వినోద్, వసంత్రావు, నట్ట తిరుపతి, జీపీ కార్యదర్శి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ డిచ్పల్లి: కమలాపూర్లో ఇళ్లు లేని 37 మంది పేదలకు మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులు వీలైనంత త్వరగా ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించుకోవాలని సూచించారు. డీసీఎంఎస్ డైరెక్టర్ న్యాస రాజేశ్వర్, పంచాయతీ కార్యదర్శి సుమతి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పెద్దోళ్ల శ్రీనివాస్, ఆశారెడ్డి, గోపాల్, రాజేందర్, పోచన్న, సాయిబాబా, అనిల్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక పారిశుధ్య పనులు షురూ..!
నిజామాబాద్ సిటీ: నగరంలో ప్రత్యేక పారిశుధ్య పనులు ప్రారంభమయ్యాయి. మంగళవారం 10 డివిజన్లలో మున్సిపల్ శానిటరీ సిబ్బంది పనులు నిర్వహించారు. ఖానాపూర్, కాలూరు, మాణిక్భండార్, బోర్గాం(పి), పాంగ్రా, వినాయక్నగర్లో పనులు చేపట్టారు. ఇంటింటికి వెళ్లి తడి–పొడి చెత్త సేకరణ, డ్రైనేజీలు శుభ్రం చేయడం, శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల పరిశీలన, ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కల తొలగింపు వంటి పనులు చేశారు. దోమల నివారణకు ఆయిల్ బాల్స్ వేశారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ పర్యవేక్షించారు. ఏఎంసీ జయకుమార్, సానిటరీ సూపర్వైజర్ సాజిద్ అలీ, ఇన్స్పెక్టర్లు షాదుల్లా, సునీల్, కృష్ణ, జవాన్లు, తదితరులున్నారు. -
నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడిన వ్యక్తి నరసయ్య
నిజామాబాద్ సిటీ: నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజా పోరాటాలు చేస్తూ బతికిన వ్యక్తి కామ్రేడ్ నాయక్వాడి నరసయ్య అని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు. మంగళవారం ఉదయం జిల్లా కేంద్రంలోని అర్సపల్లి స్వగృహంలో నాయక్వాడి నర్సయ్య మృతిచెందారు. మృతివర్త తెలిసి వందల సంఖ్యలో కమ్యూనిష్టులు, ప్రజాసంఘాల నాయకులు అర్సపల్లికి తరలివచ్చారు. ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆకుల పాపయ్య మాట్లాడుతూ..నర్సయ్య న్యూడెమోక్రసీ పార్టీ తరపున అర్సపల్లి నుంచి కౌన్సిలర్గా, కార్పొరేటర్గా గెలిచారన్నారు. ఆయన తుది శ్వాస విడిచేంతవరకు రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఆలోచించేవాడని అన్నారు. -
అధ్వానంగా కాలూరు– ఖానాపూర్ రోడ్డు
నిజామాబాద్ రూరల్ : నగరంలోని ఒకటో డివిజన్ పరిధిలో గల ఖానాపూర్ – కాలూర్ రోడ్డు అధ్వానంగా మారింది. ఆ మార్గంలో పది అడుగులకో గుంత ఏర్పడింది. రోడ్డంతా గుంతలమయం కావడం.. పరిశ్రమలు ఎక్కువగా ఉండటం.. భారీ వాహనాల రాకపోకలు ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. రాతివేళ గుంతలు కనిపించక ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ మార్గంలో ఎక్కువగా రైస్ మిల్లులు ఉండటంతో వరి పొట్టు ప్రయాణికుల కళ్లలో పడుతోంది. కళ్లు పాడవడంతో పాటు ప్రమాదాలకు గురవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. రైస్ మిల్లుల వద్ద ఇష్టానుసారంగా లారీలు పార్కింగ్ చేయడంతో రాత్రివేళ ప్రయాణికులు వాటిని గమనించక ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభం కాకముందే గుంతలను పూడ్చి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ఆ మార్గంలో ఎక్కువగా పరిశ్రమలు ఉండటంతో ప్రమాదాల బారిన పడుతున్న ప్రయాణికులు పట్టించుకోని అధికార యంత్రాంగంఅధికారులు చర్యలు చేపట్టాలి ఖానాపూర్ – కాలూరు రో డ్డు మరీ అధ్వానంగా త యారైంది. అధికారులు ప ట్టించుకుని సమస్యను సత్వరమే పరిష్కరించాలి. లేదంటే వర్షాకాలంలో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడతా రు. –అగ్గు భోజన్న, మాజీ సర్పంచ్, కాలూరు రాత్రివేళ గుంతలు కనిపించడం లేదు ఖానాపూర్, కాలూర్ రోడ్డు గుంతలమయంగా మారింది. రాత్రివేళ ఎక్కడ గుంత ఉందో తెలియడం లేదు. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయించాలి. ప్రమాదాలను నివారించాలి. – కోర్వ గంగాధర్, మాజీ సర్పంచ్, ఖానాపూర్ -
సీసీరోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ
డిచ్పల్లి:ధర్మారం(బి)లో ఉపాధిహామీ నిధులు రూ. 15 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం ఎంపీడీవో భూక్యా లింగం నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. డీసీసీ డెలిగేట్ వాసుబాబు, పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణ, పార్టీ నాయకులు సింగు ప్రవీణ్, మురళి, పిచ్చేశ్వరరావు, తిరుపతి, సోమ్నాథ్, రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రిన్సిపాళ్లకు సన్మానం సుభాష్నగర్ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 2024–25 విద్యాసంవత్సరంలో మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల్లో పదో తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించిన ప్రిన్సిపాళ్లను గురుకులాల కార్యదర్శి సైదులు మంగళవారం హైదరాబాద్లో శాలువా, పుష్పగుచ్ఛంతో సన్మానించారు. 100 శాతం ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేసిన ఆర్సీవో సత్యనాథ్రెడ్డి, ప్రిన్సిపాళ్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు వేముల మురళీ(కంజర్), నరేష్ గౌడ్(రాంపూర్), సృజన(ఆర్మూర్), పాల్గొన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టాలి సిరికొండ: నకిలీ విత్తనాలను అరికట్టి రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలని అఖిల భారత రైతుకూలీ సంఘం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి కారల్మార్క్స్ డిమాండ్ చేశారు. గడ్కోల్లో సంఘం సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ కంపెనీల కంటే ప్రైవేటు కంపెనీలే 70 శాతం విత్తనాలను సరఫరా చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రైవేటు కంపెనీలు నాసిరకం విత్తనాలను అమ్ముతూ రైతులను నిలువు దోపిడి చేస్తున్నాయని తెలిపారు. గులాం హుస్సేన్, ఎల్లయ్య, చిన్న గంగాధర్ పాల్గొన్నారు. -
నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడి
ఇందల్వాయి/ధర్పల్లి/జక్రాన్పల్లి: నాణ్యమైన విత్తనాల వాడకం వల్లే అధిక దిగుబడి సాధించగలమని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మంగళవారం ఇందల్వాయి, ధర్పల్లి, జక్రాన్పల్లి మండలాలలో నాణ్యమైన విత్తనం– రైతన్నకు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ..నాణ్యమైన విత్తనాలతో పంట దిగుబడి 15 శాతం వరకు పెరిగే అవకాశాలుంటాయని పేర్కొన్నారు. పరిశోధన కేంద్రం ద్వారా నాణ్యమైన విత్తనాన్ని సేకరించి సాగు సాంకేతికతలను పాటిస్తే అదే విత్తనాన్ని మూడేళ్ల వరకు వాడుకోవచ్చునని సూచించారు. ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు నుంచి ఐదుగురు అభ్యుదయ రైతులకు వ్యవసాయ పరిశోధన కేంద్రం ఉత్పత్తి చేసిన విత్తనం అందిస్తామన్నారు. ఎంపికై న రైతులకు విత్తనాలు అందించారు. -
డిచ్పల్లిలో యోగా వాక్
డిచ్పల్లి: అంతర్జాతీయ యోగా దినోత్సవం దశాబ్ద వేడుకల్లో భాగంగా డిచ్పల్లి ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో యోగా వాక్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘ఒక భూమి – ఒక ఆరోగ్యం కోసం యోగా’ అనే నినాదంతో 11వ యోగా దినోత్సవాన్ని ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించాలని సూచించారు. కార్యక్రమంలో ఆయుర్వేద ప్రథమ చిక్సిత ఆలయం యోగా ఇన్స్పెక్టర్లు ఓంసాయి, స్వప్న, బెటాలియన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అవగాహన కల్పించడం ద్వారా హక్కులపై చైతన్యపర్చొచ్చు
నిజామాబాద్ లీగల్: లీగల్–మెట్రాలజీ చట్టం– 2011పై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా వినియోగదారుల హక్కులపై చైతన్యపర్చవచ్చని భారత వినియోగదారుల సమాఖ్య సభ్యులు అభిప్రాయపడ్డారు. నగరంలో లీగల్–మెట్రాలజి నూత న కార్యాలయాన్ని వినియోగదారుల సమాఖ్య, వి నియోగదారుల సంక్షేమ సమితి సభ్యులు సందర్శించి లీగల్, మెట్రాలజీ అధికారులతో భేటి అ య్యారు. ఈ సందర్భంగా భారత వినియోగదా రుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరా జు చక్రపాణి మాట్లాడుతూ.. కిరాణాషాపులు, సూ పర్ మార్కెట్లు, ఆస్పత్రులు, బార్లు, తదితర వ్యా పార దుకాణాల్లో తూకాల్లో మోసాలతో పాటు ఎంఆర్పీ కన్నా ఎక్కువ వసూలు చేస్తున్న నేపథ్యంలో లీగల్ మెట్రాలజీ శాఖ క్రియాశీలకంగా ఉండాలని కోరారు. దీనికోసం ఛాంబర్ ఆఫ్ కామర్స్, వ్యవసాయ శాఖల సమన్వయంతో జూన్ 14 నుంచి అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపా రు. లీగల్ మెట్రాలజీ రూల్స్–2011ను పకడ్బందీ గా అమలు చేయడంతోనే మోసాలను అరికట్టవచ్చని చెప్పారు. భారత వినియోగదారుల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి సందు ప్రవీణ్, నిజామాబాద్ జిల్లా ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షుడు పెందోట అనిల్, ఉపాధ్యక్షుడు వీఎన్ వర్మ, కార్యదర్శులు గైని రత్నాకర్, మహాదేవుని శ్రీనివాస్, యాటకర్ల దేవేష్ పాల్గొన్నారు. -
ఈతకు వెళ్లి.. విగతజీవిగా మారి..
అనారోగ్యంతో ఒకరు.. నీట మునిగి మరొకరు.. తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన ఐతె సామెల్ దంపతులకు ఇద్దరు కుమారులు. మతిస్థిమి తం సరిగ్గాలేని పెద్ద కుమారుడు సాయిబాబు నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. చిన్న కొడుకు నవీన్ బైక్ మెకానిక్గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. అతడైనా వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటాడనుకుంటే.. సోమవారం నిజాంసాగర్ బ్యాక్వాటర్లో మునిగి చనిపోయాడు. ఇలా ఇద్దరు కుమరులు కళ్లముందే మరణించడంతో సామెల్ దంపతులకు తీరని గర్భశోకం మిగిలింది. ఎల్లారెడ్డి/ఎల్లారెడ్డిరూరల్: సరదాగా క్రికెట్ ఆడిన యువకులు.. ఈత కొట్టేందుకు నిజాంసాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతానికి వెళ్లి నీట మునిగి మృతిచెందా రు. ఈ ఘటన మూడు కుటుంబాలలో విషాదాన్ని నింపింది. పోలీసులు, స్థానికులు తెలపిన వివరాలి లా ఉన్నాయి. ఎల్లారెడ్డి మండలానికి చెందిన 11 మంది యువకులు సోమవారం సోమార్పేట్ గ్రామ శివారులో క్రికెట్ ఆడారు. అనంతరం స్నానం చేసేందుకు నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో దిగారు. వీరిలో ఎల్లారెడ్డికి చెందిన మధుకర్గౌడ్(17), సోమార్పేట్కు చెందిన హర్షవర్ధన్(17), తిమ్మారెడ్డికి చెందిన నవీన్(23) గల్లంతయ్యారు. మృతుల బంధువులు గాలించేందుకు ప్రయత్నించి నా అప్పటికే చీకటి పడడంతో వెనుదిరిగారు. మంగళవారం ఉదయం ఫైర్ సిబ్బందితో పాటు మృతుల బంధువులు నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో వలలతో గాలించారు. మొదట మధుకర్గౌడ్ మృతదేహం లభ్యమయ్యింది. మధ్యాహ్న సమయంలో నవీన్, హర్షవర్ధన్ల మృతదేహాలు లభించాయి. చెట్టంత కొడుకులు కళ్లముందు విగత జీవులుగా కనిపించడంతో మృతుల కుటుంబ సభ్యుల రోదన లు స్థానికులను కంటతడి పెట్టించాయి. గాలింపు చర్యలను పట్టించుకోని అధికారులు నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో ముగ్గురు యువకు లు గల్లంతైనా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ఫైర్ సిబ్బందితో పాటు మృతుల బంధువులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వలల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అధికారుల తీరుపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. అగ్నిమాపక సిబ్బందిని స్థానికులు అభినందించారు. ఒక్కగానొక్క కుమారుడు.. సోమార్పేట గ్రామానికి గూల రాజలింగం దంపతులకు హర్షవర్ధన్ (17) ఒక్కడే కొడుకు. ఇంటర్ చదువుతూ గ్రామంలో అందరితో కలుపుగోలుగా ఉండేవాడు. సోమవారం సరదాగా ఆడుకోవడానికి వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లాడు. నిజాంసాగర్ బ్యాక్వాటర్లో మునిగి చనిపోవడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన కిషన్గౌడ్ పెద్ద కొడుకు మధుకర్గౌడ్ (17) ఇంటర్ చదువుతున్నాడు. తోటి వారితో ఆటపాటలతో సరదాగా ఉండేవాడు. స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్లిన మధుకర్.. నిజాంసాగర్ బ్యాక్వాటర్లో మునిగి చనిపోవడంతో అతడి కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. నిజాంసాగర్ బ్యాక్వాటర్లో మునిగి ముగ్గురి మృత్యువాత మూడు కుటుంబాల్లో తీరని విషాదం -
సోషల్ వార్..
నిజామాబాద్కవిత అభిమానుల ఘరానా దొంగల ముఠా అరెస్ట్ జిల్లాలో చోరీలకు పాల్పడిన ఘరానా దొంగల ముఠా సభ్యులను సీసీ ఫుటేజీల ఆధారంగా పట్టుకున్నట్లు సీపీ తెలిపారు.బుధవారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2025– 8లో u విత్తనాలు అందిస్తాం ● వ్యవసాయ అధికారి వీరస్వామి నిజామాబాద్ రూరల్: నాణ్యమైన విత్తనాల ను రైతులకు అందజేస్తామని జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి పేర్కొన్నారు. మంగళవారం నిజామాబాద్ రూరల్ మండలం గుండారంలోని రైతు వేదికలో క్లస్టర్ పరిధిలోని రైతులకు 10 కిలోల వరి విత్తనా లు అందజేశారు. ఆర్డీఆర్ 1200 వరి రకం వంగడం శ్రేష్టమైనదని తెలిపారు. అపరాల పంటలైన ఎంజీజీ పెసర విత్తనాలను అందజేశారు. కార్యక్రమంలో కీటకశాస్త్ర వేత్త సాయిచరణ్, మండల వ్యవసాయాధికారిణి హీరా జాదవ్, వ్యవసాయ విస్తరణ అధి కా రులు స్వాతిలత, రాకేశ్, జ్ఞానేశ్వర్, వసంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వయస్సుకు సంబంధం లేకుండా యోగా చేయాలి నిజామాబాద్నాగారం: వయసుకు సంబంధం లేకుండా అందరూ యోగ చేయవచ్చునని, గర్భిణులు సుఖ ప్రసవానికి, బీపీ, షు గర్, ఉబకాయము, గుండె జబ్బుల ని వారణకు యోగా సాధన చేయడం చక్కటి మార్గమని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధి కారిణి డాక్టర్ రాజ్యశ్రీ పేర్కొన్నారు. 11 వ అంతర్జాతీయ యోగ దినోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం పాలిటెక్నిక్ గ్రౌండ్ నుంచి ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. నోడల్ అధికారి డా క్టర్ గంగదాస్, జిల్లా యోగ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్, యోగా మాస్టర్లు రామచందర్, సిద్ధిరాములు, సంగీత, శ్రీనివాస్, ఐశ్వర్య, తేజస్విని, రుక్మయ్య కిషన్, భూమయ్య రెడ్ క్రాస్ప్రతినిధి రాజశేఖర్ పాల్గొన్నారు. పాత డీఎస్ఆర్ అటెండెన్స్ విధానాన్ని కొనసాగించాలి సుభాష్నగర్: పంచాయతీ కార్యదర్శులకు పాత డీఎస్ఆర్ అటెండెన్స్ విధానాన్ని కొనసాగించాలని పంచాయతీ కార్యదర్శుల జేఏ సీ జిల్లా ప్రతినిధులు డిమాండ్ చేశారు. మంగళవారం ఇన్చార్జి డీపీవో ముత్యాల శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. ప్రతినిధులు మాట్లాడుతూ హాజరు నమోదు కోసం ఉపయోగిస్తున్న డీఎస్ఆర్ యాప్లో బయోమెట్రిక్, ఫేషియల్ రికగ్నైజేషన్ మాడ్యుల్ను ప్రభుత్వం చేర్చిందని తెలిపారు. తద్వారా వ్యక్తిగత గోప్యత, సమాచార భద్రతపై పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. అలాగే పంచాయతీ కార్యదర్శుల హాజరు సమయాన్ని ఉదయం 10.30 గంటలకు చేయాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. కేసీఆర్కు కుమార్తె కవిత రాసిన లేఖ నేపథ్యంలో ఆమెకు మద్దతుగా అభిమానులు, ఉద్యమకారులు సోషల్ మీడియా వేదికగా వార్ కొనసాగిస్తున్నా రు. కవితపై 2018 నుంచే కుట్రలు మొదలయ్యాయని, లోక్సభ ఎన్నికల్లో ఆమె ఓటమి కి అప్పటి ఎమ్మెల్యేలే కారకులయ్యారని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఉద్యమకారులందరం కవితవెంటే ఉంటామంటూ స్పష్టం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమా ర్తె కవిత రాసిన లేఖ విషయమై ఉమ్మడి జిల్లాలో గులాబీ శ్రేణులు గుంభనంగా ఉన్నప్పటికీ ఉద్యమకారులు మాత్రం సోషల్ మీడియా వేదికగా స్వరం గట్టిగా వినిపిస్తున్నారు. లేఖలో కవిత రాసిన అంశా లు ఆరోపణలు కాదని, పచ్చి నిజాలంటూ సోషల్ మీడియాలో వరుస ప్రకటనలు చేస్తున్నారు. మా ధైర్యం మీరే కవితక్క, డాటర్ ఆఫ్ ఫైటర్ అంటూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఉద్యమకారులైన కొందరు సీనియర్ కార్యకర్తలైతే మరింత ఘాటుగా సోషల్ వార్లోకి దిగారు. జిల్లాలో కవితపై 2018 నుంచే కుట్రలు మొదలయ్యాయని, 2019 లోక్సభ ఎన్నికల్లో కవిత ఓటమికి ఎమ్మెల్యేలే కారకులయ్యారని అందుకు తామే ప్రత్యక్ష సాక్షులమంటూ బహిరంగ ప్రకటనలు సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారు. ఉద్యమకారులందరం కవి త వెంటే ఉంటామంటూ చెబుతున్నా రు. కవిత ఉనికిని ఓర్వలేని ఉమ్మడి జిల్లాలోని కొందరు మాజీ ప్రజాప్రతినిధులు పలువురు ఉద్యమకారులను పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేసినట్లు, కవితకు కమ్యూనికేట్ కాకుండా చేసినట్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నగరానికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే సోదరుడు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించడమే కాకుండా కవిత ఫొటోలను డీపీలుగా పెట్టుకోవద్దు, మా సోదరుడి ఫొటోను మాత్రమే పెట్టుకోవాలంటూ బెదిరింపులు చేసినట్లు చెబుతున్నారు. ఈ మాజీ ఎమ్మెల్యే సోదరుడు షాడో మాదిరిగా వ్యవహరించడమే కాకుండా దళితబంధు, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇతర పథకాల్లో చాలామంది వద్ద భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ● అదనపు కలెక్టర్ అంకిత్ న్యూస్రీల్లేఖ లీక్ పై సోషల్ మీడియాలో వైరల్.. లేఖలోనివి ఆరోపణలు కాదు.. నిజాలంటూ అభిమానుల ప్రచారం 2019 నుంచే కవితపై జిల్లాలో కుట్రలు.. లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయేలా చేశారంటున్న ఉద్యమకారులు పీఆర్వో రాజేష్ లేఖ లీక్ చేశాడంటూ వైరల్ అవుతున్న వీడియో కవిత ఫొటో డీపీగా పెట్టుకోవద్దంటూ ఓ మాజీ ఎమ్మెల్యే సోదరుడి బెదిరింపులు ఫుల్స్టాప్ లేకుండా సోషల్మీడియాలో భావప్రకటన చేస్తున్న ఉద్యమకారులు కవితకు పీఆర్వోగా ఉన్న రాజేష్ అనే వ్యక్తి కేసీఆర్కు రాసిన లేఖను లీక్ చేసినట్లు తాజాగా సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. ఈ విషయమై కేటీఆర్, హరీశ్రావు టీముల కు సాక్ష్యాధారాలతో పూర్తి వివరాలు తెలిసినట్లు వీడియోలో ఉంది. ఈ పీఆర్వోనే కవితకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని బయటకు విడుదల చేసినట్లు ఇందులో ఉంది. కేటీఆర్, హరీశ్రావులపై సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేయించినట్లు పేర్కొన్నారు. తాజాగా కాంగ్రెస్లోని ఓ నాయకుడికి కోవర్టుగా మారి, కేటీఆర్, హరీశ్రావులకు వ్యతిరేకంగా జాతీయ మీడియాలో ప్రశ్నలు అడిగేలా ఈ పీఆర్వో చేసినట్లు ఇందులో పేర్కొన్నారు. కవితను ఎక్కువగా జాతీయ మీడియాలో కనిపించాలని ప్రేరేపించినట్లు వీడియోలో వివరించారు. తాజాగా కవిత రాసిన లేఖను సైతం ఈ పీఆర్వో రాజేషే తనకు సన్నిహితుడైన మీడియా పర్సన్ ద్వారా లీక్ చేసినట్లు పేర్కొన్నారు. జాతీయ మీడియా పేరిట కవిత వద్ద భారీగా డబ్బులు దండుకున్న ఇతను హైదరాబాద్ శివార్లలో విల్లా కొనుగోలు చేసినట్లు వైరల్ అవుతోంది. ఈ వీడియోను కేటీఆర్, హరీశ్రావులకు పంపినట్లు ఉద్యమకారులు చెబుతున్నారు. -
500 మందికిపైగా నోటీసులు
సుభాష్నగర్: కలెక్టరేట్లోని జిల్లా పంచాయతీ కార్యాలయానికి 500 మందికిపైగా పంచాయతీ కార్యదర్శులు మంగళవారం తరలివచ్చారు. ఒకేసారి వందల సంఖ్యలో రావడంతో కార్యాలయ సిబ్బంది అయోమయానికి గురయ్యారు. ఇంతమంది రావడానికి గల కారణాలను ఆరా తీయగా.., నోటీసులకు వివరణ ఇచ్చేందుకు వచ్చినట్లు తెలిసి ఉద్యోగులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులకు డైలీ శానిటేషన్ రిపోర్ట్ (డీఎస్ఆర్) కొత్త యాప్ను నూతనంగా ప్రవేశపెట్టింది. ఇందులోభాగంగా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో పంచాయతీ కార్యదర్శులు ఫేస్ రికగ్నైజేషన్ (ఆన్లైన్ అటెండెన్స్) నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ తరహా అటెండెన్స్ను నిరసిస్తూ పంచాయతీ కార్యదర్శులు గత నెల 24 నుంచి డీఎస్ఆర్ను చేపట్టడంలేదు. దీంతో పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు మే 31న పంచాయతీ కార్యదర్శులందరికీ డీపీవో శ్రీనివాస్రావు మెమోలు (నోటీసులు) జారీచేశారు. డీఎస్ఆర్ను ఎందుకు చేపట్టడం లేదో వివరణ ఇవ్వాలని ఆ మెమో సారాంశం. అందులోభాగంగా పంచాయతీ కార్యదర్శులందరూ ఒకేసారి డీపీవో కార్యాలయానికి తరలివచ్చారు. డీపీవో కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి వివరణలు స్వీకరించారు. ‘వివరణ’ ఇచ్చేందుకు డీపీవో కార్యాలయానికి తరలి వచ్చిన పంచాయతీ కార్యదర్శులు -
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
డిచ్పల్లి/ధర్పల్లి: భూసమస్యల శాశ్వత పరిష్కా రం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. మంగళవారం డిచ్పల్లి మండలం సుద్దులం, ధర్పల్లి మండలం గోవింద్పల్లి గ్రామాలలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులలో కలెక్టర్ పాల్గొన్నారు. రైతుల సమస్యలు తెలుసుకున్నారు. భూ సమస్యలు పరిష్కరించి, రైతులకు వారి భూములపై పూర్తి హక్కు లు కల్పించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇప్పటికే మెండోరా మండలంలో పైలెట్ ప్రాతిపదికన రెవెన్యూ సదస్సులు జరిపి, క్షేత్రస్థాయి పరి శీలన పూర్తి చేశామన్నారు. జిల్లాలోని మిగతా 32 మండలాల్లో గల అన్ని రెవెన్యూ గ్రామాలలో ఈ నెల 20 వరకు సదస్సులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్ల నేతృత్వంలో వేర్వేరుగా రెండు బృందాలను ఏర్పాటు చేసి రోజూ ప్రతి మండలంలో రెండు గ్రామాలలో రెవెన్యూ సదస్సులు జరిపేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. భూ రికార్డులలో పేర్ల తప్పులు, విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నెంబర్ మిస్సింగ్, పట్టా పాస్ బుక్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్–బి లో చేర్చిన భూముల సమస్యలు, భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు సదస్సులలో స్వీకరిస్తారని తెలిపారు. భూభారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, నిర్దేశిత గడువు లోపు సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలి పారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆగస్టు 14 లోపు భూభారతి కింద వచ్చిన అన్ని అర్జీలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. నిర్ణీత షెడ్యూల్ ను అనుసరిస్తూ ఆయా గ్రామాలలో అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. రెవె న్యూ సదస్సుల్లో ప్రభుత్వపరంగా నిర్ణీత ప్రొఫార్మాలో ప్రింట్ చేసిన దరఖాస్తులను అందజేస్తారని తెలిపారు. ఇందుకోసం హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేశామన్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన, విచారణ కోసం వచ్చే రెవెన్యూ బృందాలకు సహకరించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్ ల వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూ డాలన్నారు. భూ సంబంధిత సమస్యలు ఉన్న వారు నిర్ణీత ప్రొఫార్మాలో సరైన విధంగా దర ఖాస్తు చేసుకునేలా సహకారం అందించాలని హెల్ప్ డెస్క్ సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, డిచ్పల్లి, ధర్పల్లి తహసీల్దార్లు కే సతీష్రెడ్డి, శాంత, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు సంతోష్, రాజేశ్వర్, సిబ్బంది తదితరులు ఉన్నారు. భూ భారతిని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాష్ట్రప్రభుత్వం రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు -
విషజ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్ అర్బన్: సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా అంకితభావంతో కృషి చేయాలని అ దనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో మంగళవారం అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలో డెంగీ, చికున్ గున్యా, మలేరియా, టైఫాయిడ్ తదితర విషజ్వరాలు ప్రబలకుండా క్షేత్రస్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశుధ్య పనులు పక్కాగా జరిగేలా నిరంతరం పర్యవేక్షణ చేయాలని, దోమల నివారణకు అన్ని నివాస ప్రాంతాలలో ఫాగింగ్ చేయించాలని, నిలువ నీరు ఉన్న చోట, మురుగు కాలువలలో ఆ యిల్ బాల్స్ వేయాలన్నారు. ఎక్కడైనా డెంగీ కేసులు నమోదైతే చుట్టుపక్కల అన్ని నివాస గృహాల వద్ద నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దోమల నివారణ మందులను గ్రామపంచా యతీలలో అందుబాటులో ఉంచుకోవాలని, వారానికి కనీసం రెండు పర్యాయాలు తప్పనిసరిగా పిచికారీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాను న్న దృష్ట్యా అన్ని పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాలు, రెసిడెన్షియల్ బడులలో దోమల నివారణ చ ర్యలు చేపట్టాలని, పారిశుధ్య సమస్యలు లేకుండా చూడాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా నీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. వారంలో రెండు రోజులు డ్రై డే నిర్వహించేలా చూడాలని సూచించారు. సీజనల్ వ్యాధుల నిర్ధారణ కోసం ప్రజలు ర్యాపిడ్ టెస్టులు చేయించుకునేందుకు వీలుగా టోల్ ఫ్రీ నంబర్ 9390653962 ను సంప్రదించాలని తెలిపారు. సమావేశంలో జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఎంహెచ్వో రాజశ్రీ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక
వర్ని: ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న ప్రతి లబ్ధిదారుడికి ఉచితంగా ఇసుక అందజేస్తామని ప్రభు త్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మె ల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. వర్ని మండల కేంద్రంలో వర్ని, చందూర్, మోస్రా, రుద్రూర్ మండలాలకు చెందిన 805 మంది లబ్ధిదారులకు మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుకను మంజీర నుంచి ఉచితంగా తెచ్చుకోవాలని, రెవెన్యూ అధికారులు అనుమతి ఇస్తారని తెలిపారు. ఇంటి నిర్మాణం, బిల్లుల కోసం ఎవరికీ డబ్బులు చెల్లించాల్సిన అవస రం లేదని వెల్లడించారు. గత ప్రభుత్వంలో గృహలక్ష్మి పథకం కింద ఇళ్లు మంజూరై నిర్మించుకున్న వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని వెల్లడించారు. బాన్సువాడ నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరయ్యాయని, ప్రతి లబ్ధిదారుడు వెంటనే ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాలని సూచించారు. రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేశ్ బాబా, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు లక్ష్మణ్, మాజీ ఉపాధ్యక్షులు గోపాల్, మాజీ జెడ్పీటీసీలు హరిదాసు, నారోజీ గంగారాం, అంబర్సింగ్, నాయకులు హనుమంత రెడ్డి, పిట్ల రాము, వీర్రాజు పాల్గొన్నారు. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి -
ప్రజావాణి ఫిర్యాదుపై డీపీవో విచారణ
డిచ్పల్లి: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుపై మంగళవారం ఇన్చార్జి డీపీవో శ్రీనివాస్ డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో విచారణ నిర్వహించారు. చికెన్ సెంటర్ ఏర్పాటు విషయంలో వీడీసీ సభ్యులు అడ్డుపడుతున్నారని గ్రామానికి చెందిన యువకుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. కలెక్టర్ ఆదేశాలతో రాంపూర్ జీపీలో మంగళవారం ఇరువర్గాలతో సమావేశమై మాట్లాడారు. చికెన్ సెంటర్ ఏర్పాటును అడ్డుకోవద్దని వీడీసీకి సూచించారు. తాము ఎలాంటి అభ్యంతరం చెప్పబోమని వీడీసీ సభ్యులు అంగీకరించినట్లు డీపీవో తెలిపారు. -
ఫార్మసీ విద్యార్థినికి స్వర్ణ పతకాలు
మాక్లూర్: మండలంలోని దాస్నగర్ వద్ద గల విజయ్ రూరల్ ఇంజినీరింగ్ కళాశాల ఫార్మసీ విద్యార్థిని బొబ్బిలి శరణ్య ప్రతిష్టాత్మకమైన మూడు స్వర్ణ పతకాలను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా హైదరాబాద్లో అందుకున్నారు. జేఎన్టీయూ ప్రకటించిన బెస్ట్ హౌ టు గోయింగ్ విద్యార్థినిగా, ఫార్మసీలో ఫస్ట్ ర్యాంకర్, షా ధాన్ ఎండోమెంట్, బెస్ట్ స్టూడెంట్గా డాక్టర్ ఆండ్ర నాయుడు ఎండోమెంట్ స్వర్ణ పతకాలను ఏకకాలంలో అందుకున్నారు. వీఆర్ఈసీ కళాశాల ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో శరణ్యను చైర్మన్ నరేందర్ రెడ్డి, సీఈవో అమృతలత, ప్రిన్సిపల్ సురేశ్ అభినందించారు. -
టిప్పర్ ఢీకొని ఒకరి మృతి
మాక్లూర్ : ఎదురుగా వస్తున్న టీవీఎస్ ఎక్సెల్ను టిప్పర్ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందిన ఘటన మండలంలోని మాదాపూర్, బొంకన్పల్లి గ్రామాల మధ్య లో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదానికి టిప్పర్ అతివేగమే కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జన్నెపల్లి నుంచి మాదాపూర్ వైపు వెళ్తున్న టిప్పర్.. ఎదురుగా టీవీఎస్ ఎక్సెల్పై వస్తున్న ముల్లంగి (బి) గ్రామానికి చెందిన భూలోళ్ల నడిపి గంగాధర్ అలియాస్ లక్ష్మణ్ (65)ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన లక్ష్మణ్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడి కొడుకు రాజు ఫిర్యాదు మేరకు డ్రైవర్పై కేసు నమోదు చేసి టిప్పర్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. చెరువులో జారిపడి యువకుడు..రుద్రూర్: పొతంగల్ మండల కేంద్రంలోని చెరువులో జెట్టి గోపాల్ (21) మృతదేహం మంగళవారం లభ్యమైంది. కూలి పనులు చేసే గోపాల్ గత నెల 31న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు వెతుకుతుండగా స్థానిక చెరువులో మృతదేహం లభించింది. స్నానం చేసేందుకు వెళ్లిన గోపాల్ ప్రమాదవశాత్తు చెరువులో జారపడి ఉంటాడని మృతుడి సోదరి సురేఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సునీల్ తెలిపారు. -
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన
మీకు తెలుసా?భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ), ఇతర బీమా కంపెనీలు ఏడాదికి రూ. 436 ప్రీమియంతో బీమాను అందిస్తున్నాయి.కుటుంబంలో ప్రతి ఒక్కరూ చేరవచ్చు. మరణం ఎలా సంభవించిన రూ.2 లక్షల బీమా సొమ్మును నామినీకి చెల్లిస్తారు. ఈపథకంలో ఒకసారి చేరితే 55 ఏళ్ల వరకు కొనసాగుతుంది. ఎలాంటి మెచ్యురిటీ ఉండదు. ● ఏదేని బ్యాంకులో సేవింగ్ ఖాతా ఉన్న 18 నుంచి 50 ఏళ్ల లోపు ఆధార్ కార్డు జిరాక్స్ అందజేసి పీఎంజేజేబీవైలో చేరవచ్చు. 50 ఏళ్లలోపు వారు చేరితే 55 ఏళ్ల వరకు పథకం కొనసాగుతుంది. ● ఏడాది కాలంలో ఏ నెలలో అయినా స్కీంలో చేరవచ్చు. ఖాతాలో సరైన డబ్బు నిల్వ ఉంటే ప్రతి సంవత్సం మే నెలలో ప్రీమియం ఆటో డెబిట్ అవుతుంది. ● రోజుకు ఒకరూపాయి 20 పైసలతో రెండు లక్షల జీవిత బీమా. ● స్కీంలో చేరడానికి ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేదు. – కామారెడ్డి అర్బన్ -
మహిళ హత్య కేసు ఛేదన
బాల్కొండ: నందిపేట్ మండలం అయిలాపూర్ శివారులో గత నెల 26న జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాల్కొండ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్రెడ్డి వివరాలు వెల్లడించారు. నందిపేట్ మండలం శాపూర్కు చెందిన సాద సుమలత(42) గత నెల 26న కూరగాయల కోసం మండల కేంద్రంలో నిర్వహించే సంతకు వచ్చింది. మార్కెట్లో ఆలూర్ మండల కేంద్రానికి చెందిన వేల్పుల పెద్ద గంగాధర్తో పరిచయం ఏర్పడింది. సుమలతను అయిలాపూర్ శివారులోని వంతెన వద్దకు తీసుకెళ్లిన గంగాధర్.. అత్యాచారానికి యత్నించాడు. సుమలత విభేదించడంతో చీర కొంగుతో గొంతు నులిమి హత్య చేశాడు. 27న సుమలత శవమై కనిపించడంతో కొడుకు సాద సంజీవ్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానంతో కేసును ఛేదించారు. మంగళవారం మధ్యాహ్నం నిందితుడు గంగాధర్ ఆర్మూర్ నుంచి నిర్మల్ వైపు వెళ్తుండగా మార్గమధ్యలో బాల్కొండ మండలం చిట్టాపూర్ చౌరస్తా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టినట్లు సీఐ తెలిపారు. కేసును ఛేదించిన నందిపేట్ ఎస్సై చిరంజీవి, సిబ్బందిని సీఐ అభినందించారు. కాగా, గంగాధర్పై గతంలో మాక్లూర్ పోలీస్స్టేషన్లో హత్యకేసుతోపాటు దొంగతనం కేసు కూడా నమోదైంది. -
తిమ్మారెడ్డికి చేరిన యువకుడి మృతదేహం
ఎల్లారెడ్డి: మండలంలోని తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన గూల గోవర్ధన్ (28) మృతదేహం మంగళవారం స్వగ్రామానికి చేరుకుంది. గత నెల 29న గోవర్ధన్ అమెరికాలోని ఒకాయోలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. గోవర్ధన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన కొడుకు మృతితో తండ్రి విఠల్ రోదనలు అందరినీ కలచివేశాయి. గోవర్ధన్ అంత్యక్రియలకు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ హాజరయ్యారు. 12 కిలోల గంజాయి పట్టివేత● రైలులో తరలిస్తుండగా గుర్తించిన ఎకై ్సజ్, రైల్వే పోలీసులు కామారెడ్డి క్రైం: రైలులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎకై ్సజ్ పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో మంగళవారం ఏ ర్పాటు చేసిన సమావేశంలో ఎకై ్సజ్ సీఐ సంపత్ క్రిష్ణ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని నాందేడ్కు వె ళ్తున్న నాగావలి ఎక్స్ప్రెస్లో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం రావడంతో ఎకై ్సజ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు కామారెడ్డిలో రైలు ఆగగానే తనిఖీలు చేపట్టారు. ఓ అనుమానాస్పద బ్యాగులో 12 కిలోల ఎండు గంజాయి ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎవరనేది తెలియలేదు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని సీఐ తెలిపారు. సమావేశంలో ఎకై ్సజ్ ఎస్సై విక్రమ్, ఆర్పీఎఫ్ ఎస్సై వెంకటేశ్వర్లు, ఏఎస్సై రవీంద్ర బాబు, సిబ్బంది పాల్గొన్నారు. ఆశ్రమ కుటీరం దగ్ధంమోపాల్: మండలంలోని సిర్పూర్ శివారులో ఉన్న బాలయోగి అవధూత నిర్మలానంద స్వామి ఆశ్రమంలోని కుటీరం సోమవారం రాత్రి దగ్ధమైంది. పోలీసులు, నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆశ్రమంలో సోమవారం సాయంత్రం వరకు భక్తులు భజనలు, కీర్తనలు చేశారు. అనంతరం కుటీరానికి తాళం వేసి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం చూసే సరికి కుటీరం దగ్ధమైంది. ఎస్సై యాదగిరి గౌడ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. భక్తుడు మాణిక్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, ఆశ్రమం నిర్మించిన స్థలంపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాత్రికిరాత్రే కుటీరం దగ్ధం కావడంపై భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్వో కార్యాలయానికి పోలీస్ బందోబస్తు సుభాష్నగర్: నగరంలోని కలెక్టరేట్లోగల జిల్లా పౌరసరఫరాలశాఖ కార్యాల యానికి మంగళవారం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవల కొత్త రేషన్కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు, కార్డుల్లో స భ్యుల పేర్ల చేర్పులు, మార్పులపై దరఖాస్తుదారులు వందల సంఖ్యలో తరలివచ్చారు. దీంతో కార్యాలయం వద్ద గందరగోళం నెలకొని ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నారు. పరిస్థితి అదుపు తప్పితే అనుకోని ఘటనలు ఏమైనా జరగవచ్చని ఉద్దేశంతో పౌరసరఫరాలశాఖ అధికారి వినతి మేరకు కలెక్టరేట్ పోలీసులు కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఘరానా దొంగల ముఠా అరెస్ట్
● 39 దొంగతనాలకు పాల్పడిన 8 మంది నిందితులు ● 15 తులాల బంగారం, 4 వాహనాల స్వాధీనం ● సీసీ ఫుటేజీ ఆధారాలతో కేసు ఛేదన ● సీపీ పోతరాజు సాయిచైతన్య వెల్లడిఖలీల్వాడి: జిల్లాలో చోరీలకు పాల్పడిన ఘరానా దొంగల ముఠా సభ్యులను సీసీ ఫుటేజీల ఆధారంగా పట్టుకున్నట్లు సీపీ పోతరాజు సాయిచైతన్య వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడారు. నగరంలోని ఆరో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడిన కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఘటన స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, ఆధారాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా హైదరాబాద్కు చెందిన మహమ్మద్ అమేర్పై అనుమానం రావడంతో ఏసీపీ రాజావెంకట్రెడ్డి ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. అమేర్ చిన్నతనంలో పిక్ ప్యాకెట్లకు పాల్పడేవాడని, దొంగతనాలు చేసేటప్పుడు హైదరాబాద్కు చెందిన మహ్మద్ అబ్దుల్ ఆసిఫ్తో పరిచయం ఏర్పడింది. అబ్దుల్ ఆసిఫ్ తనకు పరిచయం ఉన్న వసీం, సోహైల్, జావీద్ ఖాన్, రియాజ్, అలీ, ఆసిఫ్ ఖాన్ను మహమ్మద్ అమేర్కు పరిచయం చేశాడు. వీరంతా గతంలో నేరాలకు పాల్పడినవారే. అందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి పక్కా ప్రణాళికతో దొంగతనాలు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ముఠా సభ్యుల నగరంలోని ఆటోనగర్, ధర్మపురిహిల్స్, పెయింటర్ కాలనీ, డ్రైవర్ కాలనీ, అక్బర్నగర్ కాలనీ, శాంతినగర్లలో సుమారు 24 ఇండ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేశారు. దొంగిలించిన బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను షేక్ వసీంకు ఇచ్చేవారు. వసీం వాటిని నిజామాబాద్ రూరల్ మండలంలోని మోహన్కు అమ్మేవాడు. మోహన్ వస్తువులను తక్కువ ధరకు కొనుగోలు చేసేవాడు. వచ్చిన నగదును అందరూ కలిసి పంచుకునేవారు. వీరు హైదరాబాద్ శివార్లోని షాపూర్, జీడిమెట్ల పరిసర ప్రాంతాలలో 15 ఆటోలను కూడా దొంగతనం చేశారు. ముఠాసభ్యుల్లో షేక్ వసీంపై 8 కేసులు ఉండగా మీర్పేట్లో పీడీయాక్ట్ నమోదు చేశారు. షేక్ సోహైల్ అలియాస్ చార్పాట్ సోహైల్పై గతంలో 7 కేసులు, మహమ్మద్ అమేర్పై 21 కేసులు, మహమ్మద్ అబ్దుల్ ఆసిఫ్పై 10 కేసులు, జావీద్ ఖాన్ 5 కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ముఠా సభ్యులపై నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, హైదరాబాద్ నగరాలలో కేసులు నమోదైనట్లు సీపీ వెల్లడించారు. బంగారం కొనుగోలు చేసిన మోహన్పై కేసు నమోదు చేశామన్నారు. నిందితుల నుంచి 15 తులాల బంగారం, నాలుగు వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసులో బబ్లూ, అలీ అనే నిందితులు పరారీలో ఉన్నారని, మిగతా వారిని రిమాండ్కు తరలిస్తున్నట్లు చెప్పారు. కేసు ఛేదనకు కృషి చేసిన సీఐ సురేశ్, ఎస్సై వెంకట్రావు, కానిస్టేబుళ్లను అభినందించి, రివార్డు అందజేశారు. -
పాతికేళ్లకు కలిశారు..
జక్రాన్పల్లి: మండలంలోని అర్గుల్ మైత్రి గార్డెన్స్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మంగళవారం నిర్వహించారు. అర్గుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2000–21లో విద్యనభ్యసించిన పదో తరగతి విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత కలిశారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆత్మీయంగా పలుకరించుకున్నారు. చిన్ననాటి మధుర స్మృతులను గుర్తు చేసుకొని సంబరపడ్డారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. అర్గుల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం -
ఎస్ఆర్ విద్యార్థుల ప్రతిభ..
నిజామాబాద్ అర్బన్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు డీజీఎం గోవర్ధన్ రెడ్డి తెలిపారు. దేవావత్ వరుణ్ ఆలిండియా 1,715 ర్యాంకు, నవీన్ కుమార్ 1,779, టీ ఆకాశ్ 1,882, ఎం.అజయ్ కుమార్ 1,895, రాము 2,351, జీ నవతేజ్ 2,423, బీ రవితేజ 2,780, ఎం. శ్రీ రిత్విక్ 5,584 ర్యాంకు సాధించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను డీజీఎం గోవర్ధన్ రెడ్డి, జోనల్ ఇన్చార్జి శ్రీకాంత్ అభినందించారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, కరిక్యులం, మెటీరియల్స్, నిరంతరం నిర్వహించే పరీక్షలతో తమ విద్యార్థులు జాతీయస్థాయి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. వెక్టర్ కళాశాల విద్యార్థికి 1520 ర్యాంకు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో నగరంలోని విక్టర్ కళాశాలకు చెందిన నిశాంత్ రెడ్డి ఆలిండియా 1520 ర్యాంకు, వినాయక జోషి 3,850 ర్యాంకు సాధించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్ మధుసూదన్ జోషి అభినందించారు. -
ఆర్టీసీ బస్సు, కారు ఢీ
డిచ్పల్లి: డిచ్పల్లి బస్టాండ్ వద్ద సోమవారం ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్ బస్సు, కారును ఢీకొట్టింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళుతున్న ఎక్స్ప్రెస్ బస్సు (నబరు టీజీ 16 టీ 2156) డిచ్పల్లి బస్టాండ్లో నుంచి ప్రధాన రోడ్డుపైకి వస్తోంది. అదే సమయంలో నాగ్పూర్ గేట్ వైపు నుంచి నిజామాబాద్ వెళుతున్న కారు (నంబర్ టీఎస్ 18 హెచ్ 6831)ను వెనక నుంచి బస్సు ఢీకొట్టింది. కారు ఒక్కసారిగా రోడ్డుకు అడ్డంగా తిరగడంతో కారు, బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళన చెందారు. అదృష్టవశాత్తు కారులోని వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. రోడ్డుకు అడ్డుగా రెండు వాహనాలు నిలిచిపోయేసరికి కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న డిచ్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రోడ్డుకు అడ్డంగా ఉన్న కారు, ఆర్టీసీ బస్సును పక్కకు తొలగించి వాహన రాకపోకలను క్రమబద్ధీకరించారు. -
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో మెరిసిన విద్యార్థులు
నిజామాబాద్అర్బన్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. నగరంలోని కాకతీయ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు జాతీయస్థాయి ర్యాంకులు సాధించారు. సాయి సర్వజిత్ ఆలిండియా 347 ర్యాంకు, ఎల్.శివ 1,299, ఎం.సంకీర్త్ 6,383, జి.వేదాక్షర్ 9,524 ర్యాంకులు సాధించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం సోమవారం సన్మానించింది. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ సీహెచ్ రామోజీరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉత్తమ ప్రణాళికతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నట్లు పేర్కొన్నారు. జేఈఈ అడ్వాన్స్డ్లో కళాశాలకు చెందిన విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంకులు సాధించడం గర్వకారణమన్నారు. -
యువతకు నైపుణ్యమస్తు..
బోధన్: యువత, విద్యార్థులకు స్కిల్ కోర్సులు అందించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు బోధన్ పట్టణ శివారులోని మైనార్టీ ఐటీఐ ప్రాంగణంలో ఏటీసీ(అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్) సిద్ధమవుతోంది. మరో వారంలో కేంద్రానికి వచ్చిన ఆధునిక సాంకేతిక పరికరాల బిగింపు ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది విద్యా సంవత్సరానికి స్థానిక మైనార్టీ ఐటీఐలో ఉన్న ట్రేడ్ కోర్సులతోపాటు ఏటీసీలో అత్యాధునిక కొత్త కోర్సుల్లో ప్రవేశానికి త్వరలోనే నోటిఫికేషన్ జారీ కానుంది. పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత ఉంటుంది. టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ సౌజన్యంతో అత్యాధునిక పరికరాలు, యంత్రాలతో తరగతుల నిర్వహణ, ప్రయోగాత్మక బోధనకు వీలుగా తీర్చిదిద్దనున్నారు. దీంతో విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవంతో నైపుణ్యాలను మెరుగుపర్చనున్నారు. ఆరు కొత్త కోర్సులు ..172 సీట్లు ఏటీసీకి ఆరు అత్యాధునిక సాంకేతిక కోర్సులు మంజూరయ్యాయి. ఏడాది వ్యవధి కోర్సులైన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమెషిన్లో 40 సీట్లు, ఇండస్ట్రీయల్ రొబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్లో 40, ఆర్టిసన్ యూజింగ్ అడ్వాన్స్ టూల్ (సెక్టార్ క్యాపిటల్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్)లో 20 సీట్లు ఉన్నాయి. రెండేళ్ల వ్యవధి కోర్సులైన బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫయర్ మెకానికల్లో 24 సీట్లు, అడ్వాన్స్డ్ సీఎన్సీ మ్యాచినింగ్ టెక్నీషియన్లో 24, మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికిల్ కోర్సులో 24 సీట్లు ఉన్నాయి. ఆసక్తి గల విద్యార్థులు ప్రవేశ దరఖాస్తుకు ఎస్ఎస్సీ మెమో, కుల ధృవీకరణ పత్రం, టీసీ, బోనాఫైడ్, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు జత చేయాల్సి ఉంటుంది. త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందని, అనంతరం అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ శాంతారాం తెలిపారు. మిగతా వివరాలకు 94925 80776, 90592 10915 నంబర్లకు సంప్రదించాలని ఆయన సూచించారు. బోధన్లో పూర్తి కావొస్తున్న ఏటీసీ త్వరలోనే కొత్త కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ -
వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రానికి చెందిన బొంత నందిని(16) కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల కేంద్రంలోని మత్తడికింది పల్లెకు చెందిన నందిని తరచూ ఫోన్ చూస్తోందని తల్లిదండ్రులు శెణవ్వ, పోచయ్య మందలించారు. దీంతో మనస్తాపం చెందిన నందిని ఆదివారం రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఇంటి తలుపులకు గొళ్లెం పెట్టి వెళ్లిపోయింది. సోమవారం ఉదయం తల్లిదండ్రులు లేచి చూడగా బయట నుంచి తలుపులకు గొళ్లెం పెట్టి ఉంది. నందిని కనిపించకపోవడంతో చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో లింగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం లింగంపేటలోని చీరపేండ్ల కుంటలో నందిని మృతదేహం లభించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. తండ్రి మందలించాడని.. గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని సీతాయిపల్లి గ్రామానికి చెందిన మొగుళ్ల అనిల్ కుమార్(24) మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. అనిల్కుమార్ మద్యానికి బానిసై ఏ పనీ చేయకుండా జులాయిగా తిరిగేవాడు. ఏదైనా పని చేయాలని తండ్రి సాయిలు ఆదివారం మందలించడంతో రాత్రి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్కు తరలిస్తుండగా సోమవారం మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అంబరాన్నంటిన అవతరణ సంబరాలు
నిజామాబాద్అర్బన్: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీ కరించారు. కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు, సీపీ సాయి చైతన్య, డీసీసీబీ చైర్మన్ రమేశ్రెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, డీఎఫ్వో వికాస్ మీనా, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్, ఆయా శాఖల అధికారులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. బాలభవన్, డ్యాన్స్ అకాడమీలకు చెందిన కళాకారులు ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బాలభవన్ చిన్నారులు ‘తల్లి భారతి వందనం’ గీతంపై నృత్య ప్రదర్శనతోపాటు ఆత్మ రక్షణ ఆవశ్యకతను చాటుతూ కర్రసాము విద్యను ప్రదర్శించారు. అనిల్ ఈరవత్రి, కలెక్టర్, సీ,పీ, ఇతర అధికారులు కళాకారుల వద్దకు వెళ్లి వారిని అభినందించి జ్ఞాపికలు బహూకరించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో శకటాలను ప్రదర్శించారు. పలుశాఖల ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేశారు. రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తూ నిరంతర నిఘా కోసం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ప్రవేశపెట్టిన డ్రోన్ వ్యవస్థను పరిచయం చేస్తూ ప్రయోగాత్మకంగా పనితీరును ప్రదర్శించారు. ముఖ్య అతిథి అనిల్తో కలిసి కలెక్టర్, ఆయా శాఖల ఉన్నతాధికారులు స్టాళ్లను సందర్శించారు. రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు జిల్లా కేంద్రంలోని వినాయక్నగర్లో ఉన్న తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వద్ద రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్ తదితరులు నివాళులు అర్పించారు. పరేడ్ మైదానంలో అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు -
మీసేవ సర్టిఫికెట్లు పొందండి ఇలా..
డొంకేశ్వర్(ఆర్మూర్): విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ప్రవేశాలు, దరఖాస్తుల కోసం విద్యార్థులకు కుల, ఆదాయ, నివాస ధృవపత్రాలు తప్పనిసరి. వీటి కోసం మీసేవ కేంద్రాల్లో ఏవిధంగా దరఖాస్తు చేయాలి? ఏయే పత్రాలు దరఖాస్తుకు జత చేయాలి? అనే వివరాలు మీ కోసం.. కులం (క్యాస్ట్) సర్టిఫికెట్● ఆధార్తోపాటు టెన్త్ మెమో లేదా బోనాఫైడ్/ పుట్టిన తేదీ సర్టిఫికెట్ జత చేయాలి. ● దరఖాస్తుదారునిది పాత కులం సర్టిఫికెట్ లేదా కుటుంబసభ్యుల్లో ఎవరిదైనా ఒకరిది. ఆదాయం (ఇన్కమ్) సర్టిఫికెట్ ● ఆధార్ కార్డు /ఓటరు కార్డు, రేషన్ కార్డు ● ఒక పాస్పోర్టు సైజు ఫొటో నివాస సర్టిఫికెట్ ● ఆధార్కార్డు /ఓటరు కార్డు / ఇంటిపన్ను రసీదు/ కరెంట్ బిల్లు ● ఒక పాస్ పోర్టు సైజు ఫొటో పె ధృవపత్రాలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలు మీసేవ కేంద్రాల్లోనే లభిస్తాయి. ఆన్లైన్లో దరఖాస్తు పూర్తయిన తర్వాత ఆ ఫారాన్ని స్థానిక తహసీల్ కార్యాలయంలో అందజేయాలి. అధికారులు పరిశీలించి నిర్ణీత గడువులోపు ఆమోదిస్తారు. అనంతరం మీ సేవ కేంద్రంలోనే సర్టిఫికెట్ ప్రింట్ తీసుకోవాలి. -
బైక్, ఆటో ఢీ..ఒకరికి గాయాలు
ఎల్లారెడ్డి: బైక్, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. ఎల్లారెడ్డికి చెందిన ఖలీల్ ఎల్లారెడ్డి నుంచి దేవునిపల్లికి వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, ఖలీల్ కాలు విరగడంతో కామారెడ్డికి రిఫర్ చేసినట్లు వైద్యులు తెలిపారు. పీడీఎస్ బియ్యం పట్టివేత ఎల్లారెడ్డి రూరల్: మండలంలోని మల్లయ్యపల్లి గ్రామ శివారులో పీడీఎస్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. ఆదివారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా వెళ్తున్న గూడ్స్ ఆటోను తనిఖీ చేశామన్నారు. 13 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం లభించడంతో వాహనాన్ని ఎల్లారెడ్డి పోలీస్స్టేషన్కు తరలించామని తెలిపారు. విద్యుదాఘాతంతో గేదె మృతి నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలంలోని అక్కంపల్లిలో సోమవారం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో గేదె మృత్యువాత పడింది. గ్రామంలోని మండ గోపాల్కు చెందిన గేదె మేత కోసం వెళ్లి.. ప్రమాదవశాత్తు గ్రామ పంచాయతీ బోరు మోటారుకు అమర్చిన విద్యుత్ వైరుకు తగిలి అక్కడికక్కడే మరణించింది. గేదె విలువ సుమారు రూ.50వేలకు పైగా ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. -
యూనివర్సిటీలు సంపద సృష్టి కేంద్రాలుగా ఎదగాలి
● తెయూ వీసీ ప్రొఫెసర్ టీ యాదగిరి రావు తెయూ(డిచ్పల్లి): రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం తెలంగాణ యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. వీసీ ప్రొఫెసర్ టీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరితో కలిసి పరిపాలనా భవనం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో యూనివర్సిటీలు గ్రోత్ ఇంజిన్లుగా పనిచేస్తూ సంపద సృష్టి కేంద్రాలుగా ఎదగాలని సూచించారు. నీళ్లు, నిధులు, నియామకాలు ప్రధాన ఎజెండాగా ఏర్పడిన రాష్ట్రం నేడు అభివృద్ధి చెందుతూ దేశానికే రోల్మోడల్గా ఉండటం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో వర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ మామిడాల, ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్, కంట్రోలర్ కే సంపత్ కుమార్, అడ్మిషన్స్ డైరెక్టర్ వాసం చంద్రశేఖర్, అధ్యాపకులు సీహెచ్ ఆంజనేయులు, కే రవీందర్రెడ్డి, లక్ష్మణచక్రవర్తి, సంపత్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయాగౌడ్, ఏఈ వినోద్, కాంట్రాక్టు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, అవుట్సోర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సమగ్ర వ్యాధి నిర్ధారణ అంబులెన్స్ ప్రారంభం
నిజామాబాద్అర్బన్ : జిల్లా వైద్యారోగ్యశాఖలోని ఎయిడ్స్ కంట్రోల్ యూనిట్ ఆధ్వర్యంలో ఉచిత సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షల వాహనాన్ని(అంబులెన్స్) కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు, సీపీ సాయి చైతన్యలతో కలిసి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ ప్రారంభించారు. బీపీ, షుగర్తోపాటు టీబీ, హైపటైటిస్– బీ, సీ, హెచ్ఐవీ తదితర వ్యాధుల నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తారని డీఎంహెచ్వో రాజశ్రీ తెలిపారు. ఈ వాహనం జిల్లాలోని అన్ని గ్రామాల్లోకి వెళ్తుందని, సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆపరేషన్ సిందూర్ దేశానికే గర్వకారణం సిరికొండ: పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దేశానికే గర్వకారణమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి పేర్కొన్నారు. భారత సాయుధ దళాలకు గౌరవ సూచకంగా మండల కేంద్రంలో సోమవారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. అంగడి బజార్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు జాతీయ జెండాలను చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దినేశ్ కులాచారి మాట్లాడుతూ పహల్గాంలో టూరిస్టులపై పాక్ ఉగ్రవాదులు చేసిన దాడికి బదులుగా భారత ఆర్మీ పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసిందన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు సంజీవ్రెడ్డి, జిల్లా నాయకులు నక్క రాజేశ్వర్, రాజేశ్వర్రెడ్డి, రామస్వామి, శ్రీనివాస్, సతీశ్, బాబూరావు, గోవింద్, ప్రభాకర్, నవీన్, లింబాద్రి, లింబాగౌడ్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం జక్రాన్పల్లి: మండలంలోని పడకల్ గ్రామంలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్లో 5 ఎంఏ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను జిల్లా ట్రాన్స్కో ఎస్ఈ ఆర్ రవీందర్ సోమవారం ప్రారంభించారు. సబ్స్టేషన్లో 3.15 ఎంవీఏ నుంచి 5 ఎంఏగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. దీంతో ఓవర్ లోడ్ సమస్యను అధిగమించవచ్చని ఏఈ భాస్కర్ తెలిపారు. కార్యక్రమంలో డిచ్పల్లి డీఈ రమేశ్, ఎంఆర్డీఈ వెంకటరమణ, రూరల్ ఏడీ భాలేష్, ఎంఆర్డీఈ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి ఎస్సెస్సీ సప్లిమెంటరీ పరీక్షలు నిజామాబాద్అర్బన్: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి(మంగళవారం) ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంటముందుగానే చేరుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే 90302 82993 నంబర్ను సంప్రదించాలన్నారు. -
మున్సిపాలిటీ.. జీపీ.. మున్సిపాలిటీగా..
మీకు తెలుసా?ఏ గ్రామమైనా పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారుతుంది. కానీ ఆర్మూర్ మాత్రం మొదట మున్సిపాలిటీగా, తర్వాత గ్రామ పంచాయతీగా, మళ్లీ మున్సిపాలిటీగా మారిందని ఎంత మందికి తెలుసు.. ● 1956 నుంచి 1962 వరకు మున్సిపాలిటీగా ఉన్న ఆర్మూర్కు మొదటి చైర్మన్గా కేవీ నర్సింహారెడ్డి ఎన్నికయ్యారు. ● పరిపాలనా సౌలభ్యం కోసం 1962లో మున్సిపాలిటీని గ్రామ పంచాయతీగా మార్చారు. ● 44 ఏళ్ల పాటు జీపీగా ఉన్న ఆర్మూర్ను 2006లో 23 వార్డులతో మున్సిపాలిటీగా అభివృద్ధి చేశారు. ● కోర్టు కేసుల అనంతరం 2008 జూన్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. ● 2014, 2019లో మున్సిపల్ ఎన్నికలు చేపట్టారు. ● 2019 ఎన్నికల్లో భౌగోళికంగా ఆర్మూర్ పట్టణానికి చుట్టూ మూడు కిలో మీటర్ల పరిధిలో ఉన్న పెర్కిట్, కొటార్మూర్(హామ్లెట్ గ్రామం), మామిడిపల్లి జీపీలను మున్సిపల్లో విలీనం చేశారు. ● 36 వార్డులుగా విభజించి రిజర్వేషన్లు కేటాయించి ఎన్నికలు నిర్వహించారు. దీంతో ఆర్మూర్ పట్టణ పరిధి మరింత పెరిగింది. –ఆర్మూర్ -
సందిగ్ధంలో సర్దుబాటు
నిజామాబాద్అర్బన్ : ఓవైపు బడిబాట ప్రారంభం కాలేదు.. బడులు పునఃప్రారంభమూ కాలేదు.. వి ద్యార్థుల ప్రవేశాలపై క్లారిటీ లేదు. మరోవైపు వి ద్యార్థు సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల స ర్దుబాటును ఈనెల 13వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వుల జారీ తో అవాక్కయిన ఉపాధ్యాయ సంఘాలు.. ఏ ప్రాతిపదికన సర్దుబాటు చేపడతారని మండిపడుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 770 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. 2024 డీఎస్సీ ప్రక్రియ పూర్తయినా కూ డా 90 పాఠశాలలు ఒకే ఉపాధ్యాయుడితో నడుస్తున్నాయి. ఒకరి నుంచి పది మంది విద్యార్థులు ఉంటే ఒక ఉపాధ్యాయుడు ఉండాలని సర్దుబాటు ఉత్తర్వులు చెబుతున్నాయి. ఒకే ఉపాధ్యాయుడు అన్ని తరగతుల సబ్జెక్టులు బోధించడం కష్టమని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. 11 నుంచి 60 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో ఇద్దరు ఉ పాధ్యాయులను సర్దుబాటు చేయాలని ఆదేశాలు ఇ వ్వడం అశాసీ్త్రయమైన చర్య అని మండిపడుతున్నాయి. ప్రాథమికోన్నత పాఠశాలల్లో.. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 20 మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లను ఇవ్వాలి. అలాగే మైదాన ప్రాంతం నుంచి ఉపాధ్యాయులను ఏజెన్సీ ప్రాంతాలకు సర్దుబాటు చేయొచ్చు. ఒకే ప్రాంగణంలో రెండు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉంటే ఒకే బడిగా గుర్తించాల్సి ఉంటుంది. తొలిమెట్టు పాఠశాలల్లో.. తొలిమెట్టు అమలవుతున్న ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉంటే గుణాత్మక విద్య అందుతుందని విద్యావేత్తలు అంటున్నారు. ఈ సర్దుబాటు ఉత్తర్వుల కారణంగా ప్రాథమిక విద్యకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి.ప్రాథమిక పాఠశాలల్లో సర్దుబాటు ఇలా.. టీచర్ల సర్దుబాటు ఉత్తర్వులు జారీ ఈనెల 13లోగా పూర్తి చేయాలని ఆదేశాలు మండిపడుతున్న ఉపాధ్యాయ సంఘాలుఉత్తర్వులు రద్దు చేయాలి ప్రాథమిక విద్యావ్యవస్థకు గొడ్డలిపెట్టుగా ఉన్న సర్దుబాటు ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలి. ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించి పర్యవేక్షణ పెంచితే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. – సతీశ్, ఎస్జీటీ ప్రాథమిక బడులకు నష్టం సర్దుబాటు ఉత్తర్వుల కారణంగా ప్రాథమిక పాఠశాలలు ఎక్కువగా నష్టపోతాయి. ఉపాధ్యాయులు లేకపోవడంతో పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వ బడిపై ఆసక్తి చూపడం లేదు. సర్దుబాటు ఉత్తర్వుల నుంచి ప్రాథమిక పాఠశాలలను మినహాయించి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలి. – అంకం నరేశ్, పీఆర్టీయూ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు -
సమగ్రాభివృద్ధి
నిజామాబాద్సమ ప్రాధాన్యత ● లక్ష మంది రైతులు రుణాల నుంచి విముక్తులయ్యారు ● ధాన్యం సేకరణలో జిల్లాకు అగ్రస్థానం ● సాగు ప్రణాళిక సిద్ధం ● గ్రామాల్లో భూ భారతి రెవెన్యూ సదస్సులు ● ఆర్టీసీ బస్సులో 3.59 కోట్ల మంది మహిళలకు ఉచిత ప్రయాణం ● రూ.142.86 కోట్ల గృహజ్యోతి సబ్సిడీ ● రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు కార్పొరేషన్ కమిషనర్ దిలీప్..సీపీ సాయిచైతన్య..కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్..తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తున్న ఈరవత్రి అనిల్..మంగళవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2025నేటి నుంచి భూ భారతి సదస్సులు నిజామాబాద్ అర్బన్: జిల్లా వ్యాప్తంగా నేటి (మంగళవారం) నుంచి భూ భారతి రెవె న్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బోధన్ డివిజన్లో 14 బృందాలు, నిజామాబాద్ డివిజన్లో 19, ఆ ర్మూర్ డివిజన్లో 17 మ్తొతం 50 బృందాలు అవగాహన సదస్సులు నిర్వహిస్తాయని పే ర్కొన్నారు. బృందాలు గ్రామాల్లో ప్రజలకు భూ భారతి చట్టంపై అవగాహన కల్పిస్తా యని తెలిపారు. జెడ్పీ కార్యాలయంలో జెండా ఎగురవేసిన కలెక్టర్ నిజామాబాద్అర్బన్: రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెడ్పీ సీఈవో సాయాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, సమీకృత జిల్లా కార్యాలయాల సముదా యంలో అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. 11న యోగా వాక్ నిజామాబాద్నాగారం: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 11న నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్ నుంచి ఓల్డ్ కలెక్టర్ గ్రౌండ్ వరకు యోగా వాక్ నిర్వహించనున్నట్లు ఆయుష్ జిల్లా నోడల్ అధికారి డా.జె.గంగదాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ ప్రాంత ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 4న సుభాష్నగర్లోని దయానంద యోగా కేంద్రంలో ఉదయం 10 గంటలకు యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివరాలకు 7981434641 నంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. ‘డ్రోన్ మొబైల్ పెట్రోలింగ్’ఖలీల్వాడి: కమిషనరేట్ పరిధిలో డ్రోన్ మొబైల్ పెట్రోలింగ్ను టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్, కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు, సీపీ సాయిచైతన్య సోమవారం నగరంలోని పరేడ్ మైదానంలో ప్రారంభించారు. సున్నిత, రద్దీగా ఉండే ప్రాంతాల పర్యవేక్షణ కోసం డ్రోన్లను వినియోస్తున్నట్లు సీపీ తెలిపారు. డ్రోన్ల నుంచి వచ్చే ప్రత్యక్ష వీడియో ఫుటేజీ మొబైల్ పెట్రోలింగ్ యూనిట్లతో అనుసంధానమై ఉంటుంది, దీంతో అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించిన వెంటనే తక్షణ చర్యలు తీసుకోవచ్చునని పేర్కొన్నారు. పండగలు, ర్యాలీల సమయంలో జనం గుంపులపై పర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో పర్యవేక్షణ, విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో డ్రోన్లు దోహదపడతాయన్నారు.నిజామాబాద్అర్బ న్: రాష్ట్రంలోని అన్ని సామాజికవర్గాల ప్ర జల ఆకాంక్షలకు అ నుగుణంగా.. గ్రా మీణ, పట్టణ, నగ ర ప్రాంతాలకు స మకు సమ ప్రాధా న్యతనిస్తూ సమగ్రాభివృద్ధి సాధిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చై ర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ ప రేడ్ గ్రౌండ్లో సోమవారం నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భా వ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజ రై జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమా లు, సాధించిన ప్రగతిని వివరించారు. అనిల్ ప్రసంగం సాగిందిలా.. నాలుగు విడతల్లో రుణమాఫీ అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే ప్రభు త్వం దేశ వ్యవసాయరంగ చరిత్రలో నిలిచిపోయే లా రైతులకు రుణ మాఫీ పథకం అమలైంది. జిల్లా లో ఇప్పటి వరకు 4 విడతల్లో మొత్తం 1,00,612 మంది రైతులకు రూ.782.31 కోట్లు మాఫీ అయ్యింది. పెట్టుబడి సాయం పెంచి రైతుభరోసా కింద ఎకరానికి రూ.12వేల ఆర్థిక సాయం అందుతోంది. ధాన్యం కొనుగోళ్లలో.. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 700 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,05,774 మంది రైతుల నుంచి రబీ సీజన్కు సంబంధించి 8,19,665 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగింది. సన్న ధాన్యం సాగు చేసిన రైతులకు రూ.500 చొప్పున బోనస్ అందుతుంది. భూ భారతి దరఖాస్తులు 706 భూ భారతి రెవెన్యూ సదస్సులు ఈనెల 3 నుంచి 20వ తేదీ వరకు గ్రామాల్లో కొనసాగుతాయి. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన మెండోర మండలంలో మే 5 నుంచి 8వ తేదీ వరకు సదస్సులు నిర్వహించగా 706 దరఖాస్తులు అందాయి. 369 పరిష్కరించదగినవి కాగా, విచారణ అనంతరం 72 దరఖాస్తులకు ఆమోదం లభించింది. 133 దరఖాస్తులు తిరస్కరణకు గురి కాగా, 104 విచారణలో ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్లు జిల్లాలో 19,490 ఇందిరమ్మ ఇళ్లు లక్ష్యం కాగా, 16,286 ఇళ్లు లబ్ధిదారులకు మంజూరయ్యాయి. 4,177 ఇళ్ల నిర్మాణానికి మార్కింగ్ పూర్తికాగా, 430 బేస్మెంట్, 56 రూఫ్ లెవెల్ , 10 ఇళ్ల స్లాబ్ లెవెల్ పనులు పూర్తయ్యాయి. రూ.5.08 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. వ్యవసాయం జిల్లాలో వానాకాలం సీజన్కు జిల్లా వ్యవసాయశాఖ 5.61 లక్షల ఎకరాల సాగు అంచనాతో ప్రణాళికలు సిద్ధం చేసింది. అలాగే యూరియా 75,000 మెట్రిక్ టన్నులు, డీఊసీ 13,072, పొటాష్ 13,105, కాంప్లెక్స్ ఎరువులు 44,480 మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని అంచనా. సన్న బియ్యం జిల్లాలో 3,81,584 ఆహార భద్రత, 20,910 అంత్యోద య, 1,016 అన్నపూర్ణ కార్డులు మొత్తం 4,03,510 ఆహార భద్రతకార్డులు ఉన్నాయి. ఆహార భద్రత కింద 13,94,503 మంది లబ్ధి పొందుతున్నారు. మహాలక్ష్మి మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో 2,42,710 మంది గ్యాస్ వినియోగదారులకు 10,19,994 సిలిండర్లకు సంబంధించి సబ్సిడీ విడుదల చేసి మొత్తం రూ.30.73 కోట్ల చెల్లించడం జరిగింది. ఇప్పటి వరకు జిల్లాలో 3.59 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. కళ్యాణ లక్ష్మి – షాదీముబారక్ కళ్యాణలక్ష్మి పథకం ద్వారా 2024–25 ఆర్థిక సంవత్సరంలో 6,126 మంది లబ్ధిదారులకు రూ.61 కోట్ల 33 లక్షలు అందాయి. అలాగే షాదీ ముబారక్ ద్వారా 3,585 మంది లబ్ధిదారులకు సుమారు రూ.35 కోట్ల 85 లక్షల ఆర్థికసాయం అందింది. గృహజ్యోతి గృహజ్యోతి ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.142.86 కోట్ల సబ్సిడీ అందజేసింది. నాయీబ్రాహ్మణ, రజక వృత్తులకు చెందిన 3,023 మంది లబ్ధిదారులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందుతోంది.న్యూస్రీల్ చేయూత పథకం ద్వారా ప్రతినెలా 2,68,952 మందికి రూ.57 కోట్ల 94 లక్షలు. గల్ఫ్ దేశాల్లో మరణించిన 55 మంది కుటుంబాలకు ఎక్స్గ్రేషియా కింద రూ.5లక్షల చొప్పున రూ.2కోట్ల 75లక్షలు అందాయి. ఉపాధిహామీ ద్వారా 1,73,628 మంది కూలీలకు పని అవకాశం కలిగింది. బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ ని యోజకవర్గాలకు రెండో విడతలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్స్ మంజూరయ్యా యి. ఒక్కో స్కూల్కు రూ.200 కోట్ల చొప్పు న రూ.600 కోట్ల నిధులు ప్రభుత్వ కేటా యింపు. వన మహోత్సవం 2025–26 లో 51.493 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భరోసా సెంటర్ జనవరి 19న ప్రారంభమైంది. అసాంఘిక కార్యకలాపాలు, సైబర్ నేరాలు, మూఢనమ్మకాల బారినపడకుండా ప్రజలను పోలీసులు చైతన్యం చేస్తున్నారు. -
రుద్రూర్ వరి ఆర్డీఆర్–1162
ఇది స్వల్ప కాలిక రకం. రెండు కాలలకు అనువైనది. వాన కాలంలో 120–125 రోజులకు, యాసంగిలో 130–135 రోజులకు పంట చేతికి వస్తుంది. మిక్కిలి సన్న గింజ రకం. ఎకరాకు సుమారుగా వాన కాలంలో 32, యాసంగిలో 34 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. తక్కువ నూక శాతం ఉంటుంది. కంకినల్లి, ఉల్లికోడు, ఆకు తెగులు, మెడ విరుపు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. గంగా కావేరి కన్నా అతి సన్న గింజ కలిగి ఉంటుంది. అన్నం మంచి నాణ్యతను, రుచిని కలిగి ఉంటుంది. ఈ రకం 7–10 రోజుల నిద్రావస్థ కలిగి ఉన్నందున కోసిన ధాన్యాన్ని వెంటనే విత్తనంగా వాడు కోవాలంటే బాగా ఎండబెట్టిన తర్వాత మొలక శాతాన్ని పరీక్షించి నారు పోసుకోవాలని పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్ అంజయ్య వివరించారు. పరిశోధనలు జరిపి శాస్త్రవేత్తలు రూపొందించిన కొత్త వరి రకాలను రైతులు సాగు చేసి లబ్ధి పొందాలని ఆయన కోరారు. -
కొత్త వంగడాలతో అధిక దిగుబడులు
రుద్రూర్: రైతులకు వ్యవసాయంలో అవసరమగు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు కొత్త వంగడాలను రూపొందించి రైతులకు అందించడానికి 1935లో రుద్రూర్ చెరుకు, వరి ప్రాంతీయ పరిశోధన స్థానాన్ని ఏర్పాటు చేశారు. కాలానుగుణంగా నాటి నుంచి ఎన్నో చెరుకు, వరి వంగడాలు రూపొందించి రైతులకు పరిచయం చేశారు. చీడ పీడలను తట్టుకుని అధిక దిగుబడులు సాధించే వంగడాల కోసం శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. కొత్తగా తెగుళ్లను తట్టుకుని మంచి దిగుబడినిచ్చే చెరుకు, రెండు వరి వంగడాలను రూపొందించి రైతులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ మూడు కొత్త వంగడాలు గూర్చి పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్ అంజయ్య ఆయన మాటల్లో.. రుద్రూర్ వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం కృషి చెరుకు, వరిలో నూతన వంగడాలు సృష్టి -
అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
కామారెడ్డి క్రైం: అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులతో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి మండలం గర్గుల్లో ఆదివారం చోటు చేసుకుంది. దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుంటికాడి నర్సింలు(45) ఆటో నడిపిస్తూ జీవనం సాగించేవాడు. అతనికి ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం కుమార్తెకు వివాహం చేయగా అప్పులయ్యాయి. దీనికి తోడు ఆటో సరిగ్గా నడవక ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో మానసికంగా కుంగిపోయేవాడు. శనివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన అతను తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం నిర్మాణంలో ఉన్న గంగపుత్ర సంఘం భవనం వద్ద ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి రెండో భార్య వినోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఏఎంసీల ఫీజు వసూళ్ల లక్ష్యాలు ఖరారు
కమ్మర్పల్లి: కమ్మర్పల్లి, వేల్పూర్ వ్యవసాయ మా ర్కెట్ కమిటీ(ఏఎంసీ)ల మార్కెటింగ్ రుసుం వ సూలు లక్ష్యాలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఖరారు చేసింది. గతేడాది నిర్దేశించిన లక్ష్యానికి మించి ఆదాయం పొందడంతో 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఈ రెండు మార్కెట్ కమిటీలకు కలిపి రూ. 92.50 లక్షలుగా మార్కెటింగ్ రుసుము(ఫీజు) రూపంలో లక్ష్యం నిర్దేశించింది. ఇందులో కమ్మర్పల్లి మార్కెట్ కమిటీకి రూ. 60 లక్షలు, వేల్పూర్కు రూ.32.50 లక్షలుగా పేర్కొంది. ఈ మేరకు లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది లక్ష్యానికి మించి.. రైతులు పండించిన పంట ఉత్పత్తులను మార్కెట్కు తరలించే క్రమంలో మార్కెట్ కమిటీ చెక్పోస్టు వద్ద ఆపి మార్కెటింగ్ ఫీజు వసూలు చేస్తారు. ప్రధానంగా వరి, మొక్కజొన్న, సోయాబీన్, జొన్నలను మార్కెట్కు తరలిస్తారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను కమ్మర్పల్లి ఏఎంసీకు రూ. 50లక్షల మార్కెటింగ్ ఫీజు లక్ష్యం ఉండగా, రూ.58 లక్షలు వసూలయ్యాయి. వేల్పూర్ ఏఎంసీకి రూ. 25లక్షలు లక్ష్యం కాగా, రూ. 32.53 లక్షలు వసూలయ్యాయి. దీంతో ప్రస్తుత ఏడాది లక్ష్యాన్ని పెంచింది. కమ్మర్పల్లి మార్కెట్ కమిటీకి రూ. 60 లక్షలు వేల్పూర్ మార్కెట్ కమిటీకి రూ. 32.50 లక్షలు గడువులోగా లక్ష్యం పూర్తి చేస్తాం.. ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ లక్ష్యాన్ని సిబ్బంది సహకారంతో గడువులోగా పూర్తి చేస్తాం. గతేడాది విధించిన లక్ష్యాన్ని సమర్థవంతంగా పూర్తిచేశాం. మార్కెట్కు తరలే ప్రతి వాహనాన్ని చెక్పోస్ట్ వద్ద సిబ్బంది ఆపి తనిఖీ చేసి మార్కెటింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. – టీ మెర్సీ, కమ్మర్పల్లి, వేల్పూర్ మార్కెట్ కమిటీల కార్యదర్శి -
ఈసారీ బాదుడే..
నిజామాబాద్బల్దియాలో సంస్కరణలునిజామాబాద్ నగర పాలక సంస్థలో కమిషనర్ దిలీప్కుమార్ లోపాలు సవరిస్తూ, సంస్కరణలు చేపడుతున్నారు.సోమవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 2025– 8లో u● ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల మోత ● ఇంజినీరింగ్, మెడిసిన్ విద్య పేరిట అధిక ఫీజులు ● సామాన్య, మధ్యతరగతి వారికి తప్పని కష్టాలు ● పుస్తకాలు, దుస్తుల కొనుగోళ్లు పాఠశాలల్లోనే.. ● చోద్యం చూస్తున్న విద్యాశాఖ నిజామాబాద్అర్బన్: ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల దోపిడీ తల్లిదండ్రులు, విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తోంది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఫీజులు భా రంగా మారాయి. లా భార్జనే ధ్యేయంగా కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల పెంపుదలను కొనసాగిస్తున్నాయి. పాఠశాల ఫీజు తోపాటు ల్యాబ్, లైబ్రరీ, స్పో ర్ట్స్ ఇతర ఫీజులు, ట్యూషన్ ఫీజు కింద అందినకాడికి దండుకుంటున్నాయి. ఫీజుల నియంత్రణను నిరంతరం పర్యవేక్షించాల్సిన విద్యాశాఖ పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఉత్తర్వుల అమలు ఎక్కడ ? ఫీజుల నియంత్రణపై అధికారుల నిర్లక్ష్యంతో ప్రైవేటు పాఠశాలల ఆగడాలు అంతేలేకుండా పోయాయి. 2017 ఫిబ్రవరిలో ప్రొఫెసర్ తిరుపతిరావు నేతత్వంలోని ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 2018 మార్చిలో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తూ ఏటా 10 శాతం ఫీజులను పెంచుకోవచ్చునని ప్రతిపాదనలు చేసింది. కానీ ఇంత వరకు ఆ కమిటీ సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. 2020 ఏప్రిల్లో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు నంబర్ 46ను జారీ చేసింది. జీవో నంబర్ 01 ప్రకారం ట్యూషన్ ఫీజులను నియంత్రించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కానీ, ఉత్తర్వుల అమలుకు విద్యాశాఖ అధికారులు మీనమేషాలు లెక్కబెడుతున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి మొదలుకొని మండల విద్యాశాఖ అధికారులకు వరకు ఒక్కరు కూడా ప్రైవేటు పాఠశాలలను తనిఖీ చేయడం లేదనేది బహిరంగ రహస్యమే. ఫిర్యాదు వస్తేనే చూద్దామనే ధోరణిలో అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కొందరు ఎంఈవోలు ప్రైవేటు యాజమాన్యాలతో మిలాఖత్అయి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం అడ్మిషన్ ఫీజులు వసూలు చేయొద్దు. కానీ, జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు అడ్మిషన్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇదంతా తెలిసినా అధికారుల్లో చలనం లేకపోవడం గమనార్హం. న్యూస్రీల్ఎల్కేజీకి రూ.65వేలా?ఈ విద్యా సంవత్సరంలో అధిక ఫీజుల వసూళ్లకు ప్రైవేటు పాఠశాలలు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఈసారి ఫీజుల మోత మోగించనున్నాయి. ఐఐటీ, మెడిసిన్ ఫౌండేషన్ పేరిట ప్రత్యేక విద్యాబోధన అంటూ ఫీజులు పెంచేశాయి. మరికొన్ని పాఠశాలలు సీబీఎస్ఈ సిలబస్ పేరిట ప్రత్యేక ఫీజులు వసూలు చేస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 498 ప్రైవేటు పాఠశాలలు కొనసాగుతున్నాయి. వీటిలో 1.73 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆర్మూర్, ని జామాబాద్, బోధన్, భీమ్గల్, డిచ్పల్లి వంటి ప ట్టణాల్లో ప్రైవేటు పాఠశాలల్లో ఎల్కేజీ నుంచి ఫీజుల భారం మోపుతున్నారు. జిల్లా కేంద్రంలో ఎల్కేజీ విద్యార్థికి అన్ని ఫీజులు కలుపుకొని రూ.65 వేల వరకు ఒక కార్పొరేట్ పాఠశాల వ సూలు చేస్తోంది. టెక్నో పాఠశాల, డిజిటల్ బోధ న, ఐఐటీ ఫౌండేషన్ పేరిట మరికొన్ని పాఠశాల ల యాజమాన్యాలు అత్యధికంగా ఫీజులు వసూ లు చేస్తున్నాయి. ఆర్మూర్ గ్రామీణ ప్రాంతంలో ఓ కార్పొరేట్ పాఠశాల, బోధన్ రాకాసీపేటలో మరో ప్రైవేటు పాఠశాలలోని ఫీజులు మధ్యతర గతి వారికి అందనంత ఎత్తులో ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాల 6 నుంచి 10వ తరగతి వరకు రూ. 86 వేల ఫీజు వసూలూ చేస్తోంది. ఏసీ తరగతులంటూ ప్రచారం చేస్తోంది. అనుమతి లేకుండా కొనసాగుతున్న సీబీఎస్ ఈ పాఠశాలలో ఏకంగా రూ.లక్ష వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. కాగా, సర్కారు బడుల్లో పిల్లలను చేర్పించాలని ప్రచారం చేస్తున్న విద్యా శాఖ అధికారులు.. ప్రైవేటు పాఠశాలల తనిఖీకి విముఖత చూపడంపై విమర్శలు వస్తున్నాయి.చర్యలు తీసుకుంటాం ఽఅధిక ఫీజుల వసూళ్లపై ఫి ర్యాదులు వస్తే విచారణ జరి పి చర్యలు తీసుకుంటాం. ప్ర భుత్వ నిబంధనల మేరకే ఫీ జులు వసూలు చేయాలి. ప్రై వేటు పాఠశాలల యాజమాన్యాలకు కూడా నిబంధనలు తెలియజేస్తాం. – అశోక్, డీఈవో -
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం
వేల్పూర్: ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో ఆదివారం ఓ కార్యక్రమానికి హాజరై వెళ్తుండగా రహదారిపై మొలకెత్తిన ధాన్యాన్ని, తూకం వేయకుండా ఉన్న ధాన్యపు రాశులను ఆయన బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు ఇంకా కష్టాలు తప్పడం లేదన్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై 3 నెలలవుతున్నా రోడ్లపై ధాన్యపు రాశులు ఉన్నాయన్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు జరుగక అకాల వర్షాలకు తడిసి మొలకలు వచ్చిన ధాన్యాన్ని కిలోకు రూ. 4 లేదా రూ. 5 కు అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. దీనికి కారణం సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనమేనని ఆరోపించారు. సీఎంకు అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని విమర్శించారు. అక్కడే ఉన్న ఓ రైతు ఈ రోజే కొనుగోలుకు చివరి రోజని, రేపటి నుంచి కొనుగోలు చేయమని అంటున్నారని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. దీంతో అక్కడి నుంచే కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతుతో ఫోన్లో మాట్లాడారు. మరో నాలుగు రోజులు సెంటర్ కొనసాగించి పూర్తి ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ను కోరారు. రేపటి నుంచి వడ్లు కొనుగోలు చేయమని రైతులు భయపడేలా చేసిన ఐకేపీ అధికారిని ఎమ్మెల్యే మందలించారు. నెలలు గడుస్తున్నా రహదారులపైనే ధాన్యపు రాశులు మొలకెత్తిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి -
లైసెన్స్ రెన్యువల్ ఈజీగా చేసుకుందాం ఇలా..
మీకు తెలుసా? ఒకసారి తీసుకున్న డ్రైవింగ్ లైసెన్స్ గడువులోగా రెన్యువల్ చేసుకోవడం చాలా మంది మరిచిపోతుంటారు. గడువు తీరిన 30 రోజుల్లోపు రెన్యువల్ చేయించుకోకుంటే జరిమానా విధిస్తారు. మరీ ఎక్కువ రోజులైతే రద్దు చేసే అవకాశం ఉంది. ● గతంలో ఆర్టీఏ కార్యాలయం చుట్టూ తిరిగాల్సి వచ్చేది. https:// transport. telangana. gov. in/ వెబ్సైట్లోకి వెళ్లి ఈజీగా రెన్యువల్ చేసుకోవచ్చు. ● ముందుగా రవాణాశాఖ వెబ్సైట్లోకి వెళ్లి లైసెన్స్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ● తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఎంచుకుంటే మరో పేజీ ఓపెన్ అవుతుంది. ● అందులో కింద ఉండే రెన్యువల్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్పై క్లిక్ చేయాలి. ● తర్వాత క్లిక్ హియర్ టు బుక్ ది స్లాట్ ఆప్షన్ ఎంచుకోవాలి. ● మరో కొత్త విండోలో కనిపించే డ్రైవింగ్ లైసెన్స్ బాక్స్లోని రెన్యూవల్ ఆఫ్ లైసెన్స్ తర్వాత కంటిన్యూ స్లాట్ బుకింగ్ని క్లిక్ చేయాలి. ● తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ నంబరు, ఎక్కడ ఇచ్చారు, పుట్టిన తేదీ, మొబైల్ నంబరు తదితర వివరాలు నమోదు చేయాలి. ● రిక్వెస్ట్ ఓటీపీనీ క్లిక్ చేస్తే మన ఫోన్ నంబర్కు ఓటీపి వస్తుంది. ● దానితో పాటు క్యాప్చర్ను ఎంటర్ చేసి గెట్ డీటైల్స్పై నొక్కగానే వివరాలన్ని కనిపిస్తాయి. ● జాగ్రత్తగా పరిశీలించి కన్ఫం క్లిక్ చేయాలి. తర్వాత పేమెంట్ ఆప్షన్ ద్వారా రుసుం చెల్లించాలి. ● ప్రింట్ తీసుకుని నిర్దేశించిన తేదీ రోజు ఒరిజినల్ లైసెన్స్, గుర్తింపు కార్డుతో ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాలి. ● అక్కడ అధికారులు పరిశీలించి డ్రైవింగ్ లైసెన్స్ను రెన్యువల్ చేస్తారు. – కామారెడ్డి టౌన్ -
బైక్ అదుపు తప్పి ఒకరి మృతి
సదాశివనగర్: బైక్ అదుపుతప్పి కిందపడిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలోని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై రంజిత్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని భూంపల్లి గ్రామానికి చెందిన కార్తిక్రావు(24) కామారెడ్డి నుంచి బైక్పై స్వగ్రామానికి వస్తుండగా గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో అదుపు తప్పి కిందపడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో ఘటన స్థలిలోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక
మాక్లూర్: నల్గొండ జిల్లాలో ఈనెల 4, 5, 6వ తేదీ ల్లో నిర్వహించే 47వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్, మెన్ అండ్ ఉమెన్ హ్యాండ్బాల్ పోటీలకు క్రీడాకారులు ఎంపికయ్యారు. మాక్లూర్ మండలం కల్లెడి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్రీడాకారులను ఎంపిక చేశారు. ఎంపికల ప్రక్రియను జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు టి విద్యాసాగర్రెడ్డి పర్యవేక్షించారు. అనంతరం ఇటీవల సౌత్ జోన్ హ్యాండ్బాల్ నేషనల్ పోటీల్లో మంచి ప్రతిభ కనబర్చిన జిల్లాకు చెందిన సంకీర్తనను అభినందించారు. హ్యాండ్బాల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పింజ సురేందర్, కోశాధికారి జీ రాజేశ్, పీడీలు రమణ, మాధురి, పీఈటీ సంజీవ్, సీనియర్ క్రీడాకారులు రాహుల్, సాయి, విష్ణు, శ్రావణిత్ పాల్గొన్నారు. -
సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు సుబ్బారావు మృతి
మాక్లూర్: రాష్ట్ర, జాతీయ స్థాయి సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు మైనేని సుబ్బారావు (59) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఆయన పుట్టి పెరిగింది కొత్తపల్లి గ్రామంలోనే. జిల్లా, రాష్ట్ర జాతీయ స్థాయిలో జరిగిన కబడ్డీ పోటీల్లో పాల్గొని ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఆ క్రమంలోనే కబడ్డీ కోచ్గా నగరంలోని పలు ప్రైవేట్ విద్యాసంస్థల్లో కొనసాగుతూ వచ్చారు. ఈయన మృతిపై ఆయా క్రీడా కోచులు సంతాపం తెలిపారు. అంత్యక్రియలు జిల్లా కేంద్రంలో నిర్వహించారు.రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యడిచ్పల్లి: మండలంలోని బర్ధిపూర్ శివారు మాధవనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి (45) ఆత్మహత్య చేసుకున్నట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై హెచ్ సాయిరెడ్డి ఆదివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మాధవనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి సికింద్రాబాద్ నుంచి ముంబై వెళ్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. శనివారం రాత్రి నిజామాబాద్ స్టేషన్ మేనేజర్ హరికృష్ణ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712658591 నంబర్కు సమాచారం అందించాలని రైల్వే ఎస్సై సాయిరెడ్డి కోరారు. -
‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ బీజేపీ లక్ష్యం
నిజామాబాద్ సిటీ: ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అనే విధానం దేశానికి చాలా అవసరమని, ఇదే బీజేపీ ఆలోచనా విధానమని దీంతో జాతీయ సమైక్యత, సమర్ధతను తీసుకువచ్చేందుకు దోహదపడుతుందని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. నగరంలోని బీజేపీ జిల్లా కా ర్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీసీ కులగణన చేశామని కాంగ్రెస్ గొప్పలు చెప్పు కుంటోందని, వాస్తవానికి జనగణన అనేది కేంద్ర పరిధిలోని అంశమన్నారు. కేంద్రమంత్రి రాజ్నాథ్సింగ్ 2021లోనే జనగణన చేస్తామని ప్రకటించా రని గుర్తుచేశారు. రాహుల్గాంధీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఒకమాట, విపక్షంలో ఉన్నప్పుడు మరోమాట మాట్లాడతారని విమర్శించారు. కులగణనను కాంగ్రెస్ రాజకీయం చేస్తోంద ని ఎద్దేవా చేశారు. పేద ప్రజల కోసం కేంద్రం ఎన్నో సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేస్తుందన్నారు. ఓబీసీలకు రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లకు చిత్తశుద్ధి లేదన్నారు. బీజేపీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందన్నారు. ఓబీసీ జాతీయ కమిషన్కు చట్టబద్ధ హోదా ఇచ్చిందని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ కవిత కొత్తగా బీసీ నినా దం ఎత్తుకోవడంపై ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్లో ఇంటిపోరు నడుస్తోందని, దాంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సాహసోపేత నిర్ణయమని ప్రపంచం ప్రశంసిస్తుంటే, కాంగ్రెస్ ఎంపీలు అనుచిత విమర్శలు చేయడం బాధాకరమన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేశారు. విలేకరుల సమావేశంలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేశ్, నాయకులు స్రవంతిరెడ్డి, పద్మారెడ్డి, పోతనకర్ లక్ష్మీనారాయణ, మాస్టర్ శంకర్, సాయి వర్ధన్, వెల్డింగ్ నారాయణ, తారక్ వేణుగోపాల్, బాలాపురం ఆనంద్ రావు, కోడూరు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు బీఆర్ఎస్ ఇంటిపోరుతో బీజేపీకి సంబంధం లేదు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ -
జిల్లా పోలీసులకు సేవా పతకాలు
● మహోన్నత సేవా పతకానికి ఇద్దరు, ఉత్తమ సేవా పతకానికి ఒకరు ఎంపికనిజామాబాద్అర్బన్: తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ సేవా పతకాలను ప్రకటించింది. రాష్ట్ర హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా నుంచి చాలా మంది పోలీసులు ఉత్తమ సేవా పతకాలకు ఎంపికయ్యారు. వీరికి నేడు హైదరాబాద్లో నిర్వహించే కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి పతకాలు అందజేయనున్నారు. ఇందులో మహోన్నత సేవా పతకానికి సీసీఎస్లో పనిచేస్తున్న సీఐ పోలు రవీందర్, ఇంటలిజెన్స్ విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్న వి కృష్ణ ఎంపికయ్యారు. ఉత్తమ సేవా పతకానికి రుద్రూరు ఎస్సై పి సాయిన్న ఎంపికయ్యారు. సేవా పతకాలకు ట్రాఫిక్ ఎస్సై ఎండీ రహమతుల్లా, వీఆర్లో ఉన్న ఎస్సై డి పీటర్, నారాయణసింగ్, హెడ్క్వార్టర్లో ఆర్ఎస్సైగా ఉన్న జె చంద్రశేఖర్, ఏఆర్ఎస్సైలు ఎస్ వినోద్రావు, ఎండీ అమీరొద్దీన్, సహిద్ ఇతియాజ్అలీ, సీఎస్బీలో ఏఎస్సైగా ఉన్న కె గంగాధర్, నవీపేట ఏఎస్సై కె మోహన్రెడ్డి, ఐదో టౌన్ ఏఎస్సై టి శ్రీనివాస్గౌడ్, సీసీఆర్బీలో ఏఎస్సైగా ఉన్న శ్రీనివాస్రెడ్డి, హెడ్క్వార్టర్ ఏఆర్ఎస్సైలు టి గంగాధర్, మాధవ గోపాల్, హెడ్క్వార్టర్ ఏఆర్హెచ్సీలు ఎం ప్రసాద్, ఎస్ సంగారెడ్డి, మిర్జానజీర్బేగ్, సీటీసీ హెడ్కానిస్టేబుల్ గంగాధర్గౌడ్, ట్రాఫిక్ పీఎస్ హెడ్కానిస్టేబుల్ డి మోహన్, ఏర్గట్ల హెడ్కానిస్టేబుల్ పుట్టి గంగాధర్, వేల్పూర్ హెడ్కానిస్టేబుల్ ఎస్ గంగాధర్రావు, హెడ్క్వార్టర్ ఏఆర్హెచ్సీలు టి నరేందర్, బి బాల్సింగ్, ఆకుల ఆగమయ్య, వై చంద్రప్రకాశ్, ఎస్ వెంకట్రాములు, ఎం నాగరాజు, బి మోజీరాం, కె కృష్ణ, బి మహేశ్వర్, గోపు రాజు, సీటీసీ కానిస్టేబుల్ శశిభూషణ్రావు, హెడ్క్వార్టర్ ఏఆర్పీసీ శ్రీనివాస్, సీసీఆర్బీ కానిస్టేబుల్ కాలూరుశ్రీనివాస్, హెడ్క్వార్టర్ ఏఆర్పీసీ కిషన్, మోర్తాడ్ కానిస్టేబుల్ పి జనార్దన్రెడ్డి, ఇంటలిజెన్స్ విభాగం హెడ్కానిస్టేబుల్ బి దామోధర్, సీఐడీ విభాగం ఏఎస్సై ఎ రాజేశ్వర్రావు, ట్రాన్స్కో హెడ్కానిస్టేబుల్ కె రవికిరణ్ ఎంపికై న వారిలో ఉన్నారు. -
పీసీసీ క్రమశిక్షణ సంఘం కార్యవర్గం ప్రమాణస్వీకారం
నిజామాబాద్సిటీ: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో చైర్మన్గా మల్లు రవి, సభ్యుడిగా జిల్లాకు చెందిన జీవీ రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేపట్టారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్, సభ్యులను జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు శాలువాతో సత్కరించారు. తన నియమకానికి కృషి చేసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కు రామకృష్ణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు వచ్చిన ఈ పదవితో మరింత బాధ్యత పెరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎడ్ల నాగరాజ్, రాంభూపాల్, హరిబాబు, బాబి, ధర్మారం నవీన్, పత్తి శోభన్ కుమార్, సర్దార్ గబ్బర్ సింగ్, సుమన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి● రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్నిజామాబాద్నాగారం: మున్నూరు కాపు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. తెలంగాణ మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఎస్సెస్సీ, ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన మున్నూరు కాపు విద్యార్థులకు ప్రతిభా అవార్డులను జిల్లా కేంద్రంలో అందజేశారు. కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ హాజరై మాట్లాడారు. యువత లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా పయనించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులచారి, తోట రాజశేఖర్, బాల శ్రీనివాస్ పటేల్, ధర్మపురి సురేందర్, నరాల రత్నాకర్, అబ్బాపూర్ రవి, బుస్సా ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, రెంజర్ల నరేశ్, హరిచరణ్, చిట్టి నారాయణరెడ్డి, సాయికుమార్, వాసు, శేఖర్, మోహన్, స్వర్ణలత, యెండల స్వప్న, ఆకుల పుష్పకుమారి పాల్గొన్నారు. ప్రైవేట్ ఎలక్ట్రీషియన్కు గాయాలునవీపేట: మండల కేంద్రంలోని ఓ పెట్రోల్ బంక్లో ఆదివారం ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేస్తుండగా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ను గాయాలయ్యాయి. స్టేషన్ ఏరియాకు చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ సాయిలు పెట్రోల్ బంక్లో కరెంటు లేకపోవడంతో మరమ్మతులు చేసేందుకు ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లాడు. ఎల్సీ తీసుకోకుండానే మరమ్మతులు చేయడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ గురయ్యాడు. చేతులకు, వీపుపై గాయాలయ్యాయి. స్థానికులు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. -
బల్దియాలో సంస్కరణలు
నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ మున్సిపల్ కా ర్పొరేషన్ తెలంగాణలోనే మూడో అతి పెద్దది. నా లుగు లక్షల జనాభా గల ఈ మున్సిపాలిటీ కరీంనగర్, వరంగల్తో పోల్చితే అంతగా అభివృద్ధి జరగలేదు. కానీ కొందరు మున్సిపల్ కమిషనర్లు మా త్రం నగర అభివృద్ధికి మనసు పెట్టి పనులు చేశా రు. తమదైన మార్కు చూయించారు. అందులో గ తంలో పనిచేసిన వాసం వెంకటేశ్వర్లు, చిత్రమిశ్రా.. అదే మార్గంలో కొత్తగా వచ్చిన దిలీప్కుమార్. 20 24అక్టోబర్29న బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటివరకు అంకితభావంతో పనులు చేస్తున్నారు. బల్దియాలోని లోపాలు సవరిస్తూ, కొత్త సంస్కరణ లు చేపడుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ దిలీప్కుమార్ ప్రజల మన్ననలు పొందుతున్నారు. శానిటరీ, రెవెన్యూ విభాగాల్లో లోపాలు బల్దియాలో ప్రధాన విభాగాలు రెవెన్యూ, శానిటేషన్. వీటిలో విపరీతమైన లొసుగులున్నాయి. బల్దియాకు రావాల్సిన పన్నుల్లో నిర్లక్ష్యం, పక్షపాతం, తీసుకున్న బిల్లులకు లెక్కలు చూపకపోవడం, చెల్లించాల్సిన పన్నుల కన్నా తక్కువ తీసుకోవడం. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడం వంటి వాటిని సవరించారు. రికార్డు స్థాయిలో పన్నుల వసూలు బల్దియాకు రావాల్సిన పన్నులు 2024–25 ఆర్థిక సంవత్సరం రూ.45 కోట్లకు పైగా వసూలు చేశారు. ఎర్లీబడ్ ఆఫర్(ముందస్తు చెల్లింపులో) కూడా రికా ర్డు స్థాయిలో రూ.30 కోట్ల మేర వసూలు చేశారు. గతంతో పోల్చితే రూ.8 కోట్లు అధికం. ఇది రాష్ట్రంలో ఇతర మున్సిపాలిటీలతో ముందువరుసలో ఉన్నట్లే. వెహికిల్ మెయింటెనెన్స్లో.. బల్దియాలో చెత్త సేకరణ, తొలగింపు కోసం 137 వాహనాలున్నాయి. వీటి మరమ్మతుల పేరుతో ప్రతినెల లక్షల రూపాయల ధనం పక్కదారిపడుతోంది. గతంలో ఒక టైర్ పంక్చర్కు రూ.2,500 బిల్లులు వేసేవారు. ఇందులో 50 శాతంపైగా నకిలీ బిల్లులే. దీంతో ప్రస్తుత కమిషనర్ వెహికిల్స్ రిపేర్ పేరుతో జరిగే దోపిడీకి అడ్డుకట్ట వేశారు. వీటిని నియంత్రించేందుకు బల్దియాలోనే మెకానిక్ షెడ్ను ఏర్పాటు చేశారు. మెకానిక్ ఇంజినీర్తోపాటు ఇద్ద్దరు మెకానిక్లను నియమించారు. దీంతో ప్రతినెల రూ.2.75 లక్షలు ఆదా అవుతోంది. శానిటరీ అటెండెన్స్లో గోల్మాల్కు చెక్.. పారిశుధ్య విభాగంలో అంతా అవినీతే. ఉద్యోగులు హాజరుకాకున్నా అటెండెన్స్ వేయడం, సగం మంది పర్మినెంట్ ఉద్యోగులు రాకున్నా హాజరు వేస్తూ ఇలా ఒక్కొక్కరి నుంచి రూ.15 నుంచి 20 వేలు వసూలు చేసేవారు. దీంతో కమిషనర్ ఆకస్మిక తనిఖీలు, హాజరుపట్టిక తనిఖీలతో ఫేక్ అటెండెన్స్కి అడ్డుకట్ట పడింది. బదిలీ వర్కర్ల పేరుతో జరుగుతున్న అవినీతికి అడ్డుకట్ట వేశారు. హెల్ప్ డెస్క్ ఏర్పాటు బల్దియాకు వచ్చేవారికి తగిన సమాచారం కోసం ‘హెల్ప్ డెస్క్’ను ఏర్పాటు చేశారు. నగరంలో ట్రా ఫిక్ను నియంత్రించేందుకు బల్దియా ఆధ్వర్యంలో పెయిడ్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో ‘భువన్ సర్వే’ కొనసాగుతోంది. అండర్ అసెస్మెంట్ను, రీఅసెస్మెంట్లను చేపడుతున్నారు. కార్పొరేషన్ పరిధిలో 72 రైస్ మిల్లులకు రీఅసెస్మెంట్ చేయిస్తున్నారు. బల్దియాలోని అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు మొదటి వారంలోనే వేతనాలు అందిస్తున్నారు. ఉద్యోగులు సమయపాలన పాటించేలా సర్క్యులర్ జారీచేసి వారిలో జవాబుదారీ తనం పెంచారు. కార్పొరేషన్లో జరుగుతున్న పనులపై నగరవాసులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.అభివృద్ధికి సహకరించాలి నగర ప్రజలు పన్నులు సకాలంలో చెల్లించి అభివృద్ధికి సహకరించాలి. ఉన్న వనరులతో ప్రాధాన్యతాక్రమంలో పనులు చేపడుతున్నాం. ఏవైనా సమస్యలుంటే నా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తాం. – దిలీప్కుమార్, మున్సిపల్ కమిషనర్గతంలో బల్దియాలో కోట్ల రూపాయలు వృథాగా ఖర్చయ్యేవి. మున్సిపల్ వాహనాల డీజిల్కు నెలకు రూ.6 లక్షలు ఖర్చు పెట్టేవారు. కమిషనర్ పాలనలో పోలీసు పెట్రోల్బంక్కు డీజిల్ను ఇవ్వడం ద్వారా ప్రతి నెల డీజిల్ రూపంలో బల్దియాకు రూ. 6 లక్షల నగదును ఆదా చేస్తున్నారు. అలాగే జిరాక్స్ పేరుతో సైతం నెలకు రూ. లక్షల బిల్లులు చెల్లిస్తున్నారు. గత పదిహేనేళ్లుగా ఒకే జిరాక్స్ సెంటర్కు ఆర్డర్ ఇస్తూ లక్షల రూపాయల ప్రజాధనం వృథా చేశారు. ఇకపై జిరాక్స్లు బల్దియాలోనే చేయించడంతో లక్షల రూపాయలు ఆదా అవుతోంది.వృథా ఖర్చులకు కళ్లెం కార్పొరేషన్ను గాడిలో పెడుతున్న కమిషనర్ దిలీప్కుమార్ శానిటరీ, రెవెన్యూ విభాగాల్లో లోపాలు గుర్తింపు పన్నుల వసూళ్లలో మెరుగైన ఫలితాలు పారదర్శకంగా సాగుతున్న పనులు -
మూడు నెలల కోటా.. ఆరుసార్లు వేలిముద్ర
డిచ్పల్లి: మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీకి తొలిరోజు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురయ్యాయి. బయోమెట్రిక్లో మార్పులు చోటు చేసుకోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో సాంకేతిక సమస్యలు, నిబంధనల మార్పుతో తీవ్ర ఆలస్యం జరుగుతోంది. గతంలో రేషన్ తీసుకోవడానికి లబ్ధిదారుడు ఒకసారి బయోమెట్రిక్ వేసేవారు. ప్రస్తుతం ఒక నెల రేషన్కు రెండుసార్లు బయోమెట్రిక్ వేసేలా మార్పులు చేశారు. ఒకరికి 6 కిలోల బియ్యం ఇస్తుండగా, కేంద్రం వాటా 5 కిలోలకు ఒకసారి, రాష్ట్రవాటా 1 కిలోకి మరోసారి బయోమెట్రిక్ వేయాల్సి వస్తోంది. ప్రస్తుతం మూడు నెలల రేషన్ ఒకేసారి ఇస్తుండటంతో మొత్తం 6 సార్లు బయోమెట్రిక్ వేయాల్సి వస్తుండగా, ప్రతి వినియోగదారుడికి కనీసం 15–20 నిమిషాలు సమయం పడుతోంది. దీంతో ఇతర వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఓటీపీ విధానం రద్దు.. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, మోపాల్, నిజామాబాద్ రూరల్, సిరికొండ, జక్రాన్పల్లి మండలాలలో మొ త్తం 165 రేషన్ దుకాణాలు ఉండగా 85 దుకాణాలకు మాత్రమే ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి బి య్యం సరఫరా అయింది. దీంతో పలు గ్రామాల్లోని రేషన్ షాపుల్లో ఇంకా బియ్యం పంపిణీ ప్రారంభం కాలేదు. రేషన్కార్డులో ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు ఉంటే ఓటీపీ విధానంలో ఇతరుల సహాయంతో రేషన్ బియ్యం తీసుకునే వారు. ఈసారి ఆ విధానం రద్దు కావడంతో వారు సైతం రేషన్ దుకాణం వర కు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరుసార్లు వేలి ముద్ర విధానంతో వినియోగదారులకు ఇబ్బందు లు పడుతున్న దృష్ట్యా త్వరలోనే ఈ–పాస్ మిషన్ లో మార్పులు తెచ్చి ఒకేసారి వేలిముద్రతో బియ్యం తీసుకునేలా చేయాలని అధికారులు నిర్ణయించారు. రేషన్ బయోమెట్రిక్లో మార్పులు లబ్ధిదారుల ఇబ్బందులు -
బోధన్ ఆస్పత్రిలో బాధలు పట్టేదెవరికి?
వైద్యులు పోస్టులు అందుబాటులో ఉన్నది సివిల్ సర్జన్లు 13 01 సివిల్ సర్జన్ ఆర్ఎంవో 02 01 డిప్యూటీ సివిల్ సర్జన్ 09 00 సివిల్ అసిస్టెంట్ సర్జన్ 27 05 రెగ్యులర్ (తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న వారు 11 మంది) సివిల్ సీనియర్ సర్జన్ 01 00 బోధన్టౌన్(బోధన్): పట్టణంలోని జిల్లా ఆస్పత్రిలో చెప్పుకునేందుకే 100 పడకలు ఉండగా వైద్యులు మాత్రం వేళ్ల మీద లెక్కపెట్టేంత మంది మాత్రమే ఉన్నారు. పూర్తిస్థాయిలో వైద్య సేవలందక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చికిత్స కోసం ప్రతిరోజూ పట్టణ ప్రజలతోపాటు బోధన్, సాలూర, రుద్రూర్, పొతంగల్, కోటగిరి, వర్ని, ఎడపల్లి, రెంజల్ మండలాలకు చెందిన వారు, పక్కరాష్ట్రమైన మహారాష్ట్రకు చెందిన వారు సైతం వస్తుంటారు. ప్రతి రోజూ 700 ఓపీ ఉంటుండగా, 30 నుంచి 40 మంది రోగులు ఇన్ పేషెంట్లుగా ఉంటున్నారు. ఎమర్జెన్సీ కేసులు తప్పనిసరి పరిస్థితుల్లో జిల్లా కేంద్రంలోని జీజీహెచ్కు వెళ్లాల్సిందే. రెగ్యులర్ వైద్యులు ఆరుగురే.. ఆస్పత్రిలో మొత్తం 50 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 18 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో రెగ్యులర్ వైద్యులు ఆరుగురు కాగా, తాత్కాలిక ప్రాతిపదికన 11 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. 49 మందే వైద్య సిబ్బంది ఆస్పత్రిలో మొత్తం 74 మంది వైద్య సిబ్బంది ఉండాల్సి ఉండగా కేవలం 49 మంది మాత్రమే ఉన్నారు. ఇందులో 37 మంది రెగ్యులర్ వారుకాగా, 12మంది తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్నారు. తగ్గుతున్న ప్రసవాల సంఖ్య పూర్తిస్థాయిలో వైద్యులు లేకపోవడంతో గడిచిన నాలుగు నెలలుగా ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. మే నెలలో 65 కాన్పులు కాగా, ఇందులో 33 నార్మల్, 32 ఆపరేషన్లు ఉన్నాయి. గైనిక్లు, వైద్య సిబ్బంది లేకపోవడంతో ఏప్రిల్లో 20 మంది గర్భిణులను, మేలో 12 మందిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఆస్పత్రిలో ఇద్దరు గైనకాలజిస్టులు ఉండగా వారం రోజుల క్రితం నుంచి ఓ వైద్యురాలు విధులకు రావడం లేదు. ప్రస్తుతం ఆర్మూర్ నుంచి ఓ గైనకాలజిస్టును డిప్యుటేషన్పై పంపించారు. జిల్లా ఆస్పత్రిలో వంద పడకలు.. 18 మంది వైద్యులు ఆర్థో కేసులొస్తే నిజామాబాద్కు వెళ్లాల్సిందే.. మిగతా వైద్య సేవలన్నీ నామమాత్రమే ప్రతిపాదనలు పంపించాం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బది నియామకం కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. చికిత్సల కోసం వచ్చే రోగులకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందిస్తున్నాం. – రాహుల్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ -
ఇసుక అందుబాటులో ఉంచాలి
నిజామాబాద్అర్బన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాని కి అవసరమైన ఇసుక, మొరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తహసీల్దార్లను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో తహసీల్దార్లతో శనివారం సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో, లబ్దిదారులను అన్ని విధాలుగా ప్రోత్సహించాలని అన్నారు. లబ్ధిదారులకు ఇ సుకను రవాణా చేసే వాహనాలకు ప్రత్యేక వే బిల్లులను అందించాలని, ఇసుక పక్క దారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వర్షాలు ప్రారంభమైతే ఇసు క లభించే పరిస్థితి ఉండదని, దీనిని దృష్టిలో పెట్టుకుని వానలు కురవకముందే సరిపడా ఇసుక నిల్వలను ఇందిరమ్మ లబ్ధిదారులు ముందస్తుగా సమకూర్చుకునేందుకు వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇసుక కొరత కారణంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయనే ఫిర్యాదులు రాకూడదన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఆర్డీవోలు రాజేంద్రకుమార్, రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. భూ భారతి సదస్సులు సమర్థవంతంగా..ఈనెల 3వ తేదీ నుంచి భూ భారతి రెవెన్యూ సదస్సులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ హనుమంతు సూచించారు. తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సర్వేయర్లకు రెవెన్యూ సదస్సుల నిర్వహణ, దరఖాస్తుల పరిశీలన, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భూ భారతి చట్టంలోని నిబంధనలు, దరఖాస్తులను పరిశీలించాల్సిన తీరును వివరించారు. అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, పక్కాగా ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహించాలని, మొక్కుబడిగా కాకుండా ప్రతి అంశాన్ని ఎంతో జాగ్రత్తగా, సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఆర్డీవోలు రాజేంద్రకుమార్, రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. వాహనాలకు ప్రత్యేక వే బిల్లులు ఇసుక పక్కదారి పట్టొద్దు తహసీల్దార్లకు కలెక్టర్ హనుమంతు ఆదేశాలు జారీ -
ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించాలి
సుభాష్నగర్: నిజామాబాద్ నగరంలో ఫుట్పాత్ ఆక్రమనలను తొలగించి ట్రాఫిక్ను నియంత్రించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ సాయిచైతన్య, మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ తోపాటు ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే శనివారం సమీక్ష నిర్వహించారు. సీపీ, మున్సిపల్ కమిషనర్కు పలు సలహాలు, సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పెద్ద నగరాల్లో నిజామాబాద్ కార్పొరేషన్ ఒకటని, నగర అభివృద్ధి, సుందరీకరణకు అందరం సమష్టి కృషితో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. నగరంలో జనాభా పెరుగుతున్న క్రమంలో ప్రజలు నిత్యం ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నారన్నారు. ట్రాఫిక్ నియంత్రణలోభాగంగా ఫుట్పాత్ కబ్జాలు, సిగ్నల్ పాయింట్స్, వన్ వే రోడ్, పార్కింగ్ విషయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల సరఫరాపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. నగరంలో గ్యాంగ్ రెచ్చిపోతున్నారని, వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. అర్ధరాత్రి వరకు విచ్చలవిడిగా దుకాణాలు నడుపుతున్న వారిపై పోలీసులు కఠినచర్యలు తీసుకోవడంపై ఎమ్మెల్యే అభినందించారు. ఏసీపీ రాజావెంకట్రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, బీజేపీ నాయకులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు. నగర అభివృద్ధి, సుందరీకరణకు సమష్టిగా కృషి చేద్దాం డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపండి సమీక్షలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ -
ధూమపానం మానసిక, శారీరక బానిసత్వం
నిజామాబాద్నాగారం: ధూమపానం అనేది అలవాటు కాదని, అది ఆరోగ్యాన్ని నాశనం చేసే మానసిక, శారీరక బానిసత్వమని డీప్యూటీ డీఎంహెచ్వోలు తుకారాం రాథోడ్, అంజనా అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నగరంలోని మాలపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పొగాకు వ్యతిరేక అవగాహన ర్యాలీని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీప్యూటీ డీఎంహెచ్వోలు మాట్లాడుతూ.. సిగరెట్, గుట్కా, బీడీ వంటివాటిలో నికోటిన్, టార్ వంటి విషపదార్థాలు ఉంటాయని, అవి ఊపిరితిత్తుల క్యాన్సర్, హార్ట్ఎటాక్, స్ట్రోక్, నోటి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తాయన్నారు. పాసివ్ స్మోకింగ్కు ధూమపానం అలవాటు లేని వారు సైతం బలవుతుంటారన్నారు. ‘నేను ధూమపానం మానుతాను – ఆరోగ్యంగా జీవిస్తాను’ అనే నినాదంతో ముందుకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో పవైద్యులు సామ్రాట్యాదవ్, వెంకటేశ్, సహిస్తా ఫిర్దోస్, అజ్మతున్నేసా బేగం, భార్గవి, అవంతి, మెడికోలు, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. -
నవోదయ గ్రామీణ విద్యార్థులు అనుకూలం
జక్రాన్పల్లి: ఇచ్చిన మాట ప్రకారం జిల్లాకు నవోదయ, పసుపు బోర్డు తీసుకువచ్చిన ఘనత ఎంపీ అర్వింద్కు దక్కుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి అన్నారు. నవోదయ మంజూరును హర్షిస్తూ మంలంలోని కలిగోట్లో శనివారం ఎంపీ అర్వింద్, ప్రధాని మోదీ చిత్రపటాలకు నాయకులతో కలిసి దినేశ్ పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుమూల గ్రామమైన కలిగోట్ ప్రాంతంలో నవోదయ ఏర్పాటుతో ఈ ప్రాంతం విద్యాభివృద్ధికి నిలయంగా మారుతుందన్నారు. ఇక్కడ విద్యాలయం ఏర్పాటు అన్ని మండలాల విద్యార్థులకు ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు. నవోదయ, పసుపు బోర్డు కార్యాలయం రూరల్ నియోజక వర్గంలో ఏర్పాటు చేయడం అభినందించదగిన విషయమన్నారు. అలాగే 44 నంబర్ జాతీయ రహదారిపై సర్వీసు రోడ్లు, ప్రధాన కూడళ్ల ఏర్పాటుకు ప్రధాని మోదీ నిధులు మంజూరు చేసి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేశారన్నారు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కన్నెపల్లి ప్రసాద్, రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, నాయకులు మహేందర్, శ్రీనివాస్గౌడ్, దత్తాద్రిగౌడ్, నాయిడి రాజన్న, ఆనంద్, శశాంక్, సతీశ్, కొరట్పల్లి నర్సయ్య, అశోక్, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి -
సమన్వయంతో న్యాయవివాదాల పరిష్కారం
● జిల్లాలో పర్యటించిన హైకోర్టు జడ్జి సుజననిజామాబాద్ లీగల్: జిల్లాలో పనిచేసిన కాలంలో బార్ అండ్ బెంచ్ మధ్య సమన్వయంతో దీర్ఘ్ఘకాలిక న్యాయవివాదాలను పరిష్కరించుకున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి సుజన గుర్తుచేశారు. శనివారం నిజామాబాద్ నగరానికి వచ్చిన ఆమెకు బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల సాయరెడ్డి, మాణిక్ రాజు ఆధ్వర్యంలో స్వాగతం పలికా రు. ఈ సందర్భంగా జిల్లా జడ్జిగా విధులు నిర్వర్తించిన కాలపు స్మృతులను ఆమె నెమరు వేసుకున్నా రు. అనంతరం బార్ అధ్యక్షుడు సాయరెడ్డి మాట్లాడుతూ జిల్లా న్యాయవ్యవస్థకు వెన్నుదన్నుగా నిలవాలని జస్టిస్ సుజనను కోరారు. కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీ రాజేశ్వర్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు, బార్ కార్యవర్గ సభ్యులు ఆకుల రమేశ్, టక్కర్ హన్మంత్ రెడ్డి, నీలకంఠ రావు, గడుగు గంగాధర్, పిట్లం శ్రీనివాస్, వీ భాస్కర్, జే వెంకటేశ్వర్, మాజీ పీపీ మధుసూదన్ రావు, ఆశ నారాయణ, శ్రీనివాస్ గౌడ్, శ్రీమాన్ తదితరులు ఉన్నారు. ఆలయాల్లో పూజలు జస్టి్స్ సుజన శంకర్ దంపతులు, కుమారులతో కలిసి నగరంలోని నీలకంఠేశ్వర ఆలయం, సుభాష్నగర్ శ్రీరామాలయం, సారంగపూర్ హనుమాన్ ఆలయాల్లో పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లా జడ్జిగా విధులు నిర్వహించిన సమయంలో మొక్కుకున్న మొక్కులు తీర్చుకున్నట్లు ఆమె తెలిపారు. హైకోర్టు జడ్జిని కలిసిన సీపీ నిజామాబాద్నాగారం: జిల్లాకు వచ్చిన హైకోర్టు జడ్జి కే సుజనను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య శనివారం ఆర్అండ్బీ అథితి గృహాంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూలమొక్కను అందజేసి స్వాగతం పలికారు. -
బినోలాలో వాల్మీకి సమాధి
మీకు తెలుసా? మానవజాతికి రామాయణ సందేశం బహుముఖం. దేశ కాలాతీతమైన, ప్రకాశవంతమైన కార్యసృష్టి చేసిన వాల్మీకి చరితార్థుడు. ఆ మహర్షి చివరి గడియలను మన జిల్లాలోనే గడిపారనే విషయం ఎంతమందికి తెలుసు. అందుకు సాక్ష్యమే నవీపేట మండలం బినోలా గ్రామంలోని సమాధి. ● గ్రామానికి ప్రారంభంలోనే చెరువు కట్ట పక్కన ఈ సమాధి ఉంది. సమాధికి వినియోగించిన రాళ్లపై రాతలు(లిపి) ఉన్నాయి. ● మహర్షిగా మారకముందు వాల్మీకి బినోలా శివారులోని గోదావరి పరీవాహక ప్రాంతంలో పక్షులను వేటాడేవారని, సప్తరుషులు ఒకరోజు ప్రత్యక్షమై ఆయనకు హితబోధ చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ● అప్పటి నుంచి మహర్షిగా మారి ఇదే ప్రాంతంలో శిష్యులకు బోధనలు చేశారు. గోదావరిలో స్నానమాచరించి గ్రామంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేసేవారు. ● పవిత్ర కాశీలో ఉన్న ఆలయాలు.. బినోలాలో కూడా ఉన్నట్లు వేద పండితులు చెబుతారు. – నవీపేట్ -
కోనేరులో జారిపడి ఒకరు..
రామారెడ్డి: ప్రమాదవశాత్తు కోనేరులో జారిపడి వ్యక్తి మృతి చెందిన ఘటన రామారెడ్డి మండలం మద్దికుంటలో శనివారం చోటు చేసుకుంది. ప్రొబెషనరీ ఎస్సై నవీన్చంద్ర తెలిపిన వివరాల ప్ర కారం.. మద్దికుంటకు చెందిన ఓరుగంటి గంగయ్య(50) తన భార్య 20 సంవత్స రాల క్రితం వెళ్లగా అప్పటి నుంచి ఒంటరిగా నివసిస్తున్నాడు. వృద్ధాప్యం కారణంగా ఇటీవలే మద్దికుంట వృద్ధాశ్రమానికి వచ్చాడు. బుగ్గ కోనేరులో శనివారం స్నానం చేసేందుకు వెళుతుండగా, ప్రమాదవశాత్తు నీటిలో జారిపడి మృతి చెందాడు. మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, భార్య ఓరుగంటి బాలవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పీఎస్సై తెలిపారు. చేపూర్లో ఒకరు..ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామ శివారులో ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి గుడి వద్ద కురాకుల మురళి(63) మృతి చెందినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. భీమ్గల్ మండలం ముచ్కూర్ గ్రామానికి చెందిన మురళి కొద్దిరోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అప్పుడప్పుడు వీరబ్రహ్మేంద్రస్వామి గుడికి వస్తుంటాడు. శుక్రవారం రాత్రి సైతం గుడికి వస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఒకరి ఆత్మహత్య నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీకి చెందిన సంతోష్(37) ఆర్థిక ఇబ్బందులతో శనివారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రొబెషనరీ ఎస్త్సె శైలిందర్ తెలిపారు. చంద్రశేఖర్ కాలనీ చెందిన సంతోష్కు అప్పులు పెరిగిపోవడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
సీనియారిటీ ప్రకారమే పదోన్నతులు కల్పించాలి
సుభాష్నగర్: ఉద్యోగులకు సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలని, పీఆర్సీ వెంటనే ఇప్పించాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఉమ్మడి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె దయాసాగర్, దొంతుల నర్సయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఎన్డీసీసీబీ చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో సీఈవో నాగభూషణం వందేకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జీవో ఎంఎస్ 44 ప్రకారం డీఎల్ఈసీ ఫండ్ ద్వారా జీతాలు లేని అన్ని సంఘాలకు జీతాలు ఇచ్చి బదిలీలు చేపట్టాలన్నారు. సంఘ ఉద్యోగుల పదవీవిరమణ బెనిఫిట్స్ డీసీసీబీ ద్వారా ఇవ్వాలని కోరారు. ఉద్యోగులకు సొంత జిల్లాలో మాత్రమే బదిలీలు చేయాలని, 2019 తర్వాత నుంచి పనిచేస్తున్న వారికి కూడా జీవో ఎంఎస్ 44 అమలు చేయాలన్నారు. ఎన్డీసీసీబీ ఉద్యోగుల నియామకాల్లో సంఘ ఉద్యోగులతో 25 శాతం భర్తీ చేయాలన్నారు. సంఘ ఉద్యోగుల బదిలీలు కౌన్సెలింగ్ ద్వారా చేపట్టాలని, హెల్త్ ఇన్సూరెన్స్, ఐడీ కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్యాక్స్ ఉద్యోగులు, సీఈవోలు బస్వంత్ రావు, విష్ణువర్ధన్, నాగరాజు, సుభాష్, మోహన్, ఉమ్మడి జిల్లాల ఉద్యోగులు పాల్గొన్నారు. ఎన్డీసీసీబీ సీఈవోకు సిబ్బంది వినతి -
చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి
బిచ్కుంద(జుక్కల్): మండలంలోని గుండెనెమ్లి గ్రామానికి చెందిన గడ్డి బాలబోయి(48) శుక్రవారం మంజీరలో చేపల వేటకు వెళ్లి మృతి చెందాడని ఎస్సై మోహన్రెడ్డి తెలిపారు. శుక్రవారం రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో శనివారం భార్య బందెవ్వ మంజీరకు వెళ్లి చూడగా బాలబోయి మృతదేహం నీటిలో తేలియాడుతూ కనిపించింది. చేపల వల కాళ్లకు చుట్టుకోవడంతో నీట మునిగి చనిపోయినట్లు తెలిపారు. పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశామన్నారు. జీజీహెచ్లో గుర్తు తెలియని మహిళ.. నిజామాబాద్నాగారం: ప్రభుత్వ ఆస్పత్రిలో గుర్తుతెలియని మహిళ మృతి చెందినట్లు ఒకటో టౌన్ ఎస్సై రఘుపతి శనివారం తెలిపారు. నగరంలోని దేవీరోడ్లో గుర్తు తెలియని మహిళ అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించిన స్థానికులు డయల్ 100కు కాల్ చేయగా, ఘటనా స్థలానికి చేరుకున్న టౌన్ 1 బ్లూకోల్ట్ సిబ్బంది ఆ మహిళను గురువారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మహిళ మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి వయసు సుమారు 40 వరకు ఉంటుందని, వంకాయ కలర్ చీర, నీలి రంగు జాకెట్ ధరించి ఉందన్నారు. మహిళ సమాచారం ఎవరికై నా తెలిస్తే వన్టౌన్లో సంప్రదించాలని సూచించారు. -
ప్రగతి రథం.. ఆ పల్లెలకు దూరం
మాక్లూర్: గ్రామీణ ప్రాంత ప్రజలు నిత్యం తమ అవసరాల కోసం సమీప పట్టణాలు, మండలాలకు వెళ్లాలంటే ఎక్కువగా ఆర్టీసీ బస్సునే ఆశ్రయిస్తారు. సురక్షిత ప్రయాణంతోపాటు ప్రైవేటు వాహనాలతో పోలిస్తే తక్కువ చార్జీలు.. అందుకే ఎక్కువగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణాలకు మొగ్గుచూపుతారు. కానీ, టీఎస్ ఆర్టీసీ మాత్రం పలు పల్లెలకు బస్సులు నడిపేందుకు మొగ్గు చూపడం లేదు. పుష్కరకాలం నుంచి బస్సుల్లేవ్.. మాక్లూర్ మండలంలో చాలా గ్రామాలకు పుష్కరకాలం నుంచి బస్సులు నడవడం లేదు. దీంతో ప్రజలు ఐదారు కిలోమీటర్ల మేర కాలినడక వెళ్లి బస్సు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో కాలినడక వెళ్లే మహిళలపై దుండగులు దాడులు చేసి గొలుసు చోరీలకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. మండలంలోని వల్లభాపూర్, మెట్పల్లి, రాంపూర్, వెంకటాపూర్, గంగరమంద, డీకంపల్లి, అమ్రాద్తండా, సట్లాపూర్ తండాలకు పల్లె వెలుగు బస్సు కనిపించక ఏళ్లు గడిచాయి. లక్నాపూర్ గ్రామానికి ఇప్పటి వరకు బస్సు సౌకర్యం లేదు. ఇక ఉన్నత చదువుల కోసం వెళ్లే పట్టణాలకు వెళ్లే విద్యార్థుల బాధలు వర్ణణాతీతం. చదువుకోవాలంటే కిలోమీటర్ల మేర నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా మండలంలోని చాలా గ్రామాలకు బీటీ రోడ్లు కూడా ఉన్నాయి. కానీ, ఆర్టీసీ బస్సు నడపకపోవడంలో ఆంతర్యమేమిటోనని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఈ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. మాక్లూర్ మండలం వల్లభాపూర్ గ్రామ ముఖచిత్రంబస్సు ఎక్కాలంటే నడవాల్సిన దూరంగ్రామం బస్సు ఎక్కే ప్రాంతం కి.మీ రాంపూర్ వేణు కిసాన్నగర్ 7 వెంకటాపూర్ మెట్టు 5 మెట్పల్లి జన్నెపల్లి 5 అమ్రాద్ తండా అమ్రాద్ 4 వల్లభాపూర్ జన్నెపల్లి 3 సట్లాపూర్ తండా మదనపల్లి 3 మదన్పల్లి తండా మదన్పల్లి 2 లక్నాపూర్ ఆంధ్రానగర్ 3 నేటికి ఆర్టీసీ బస్సుకు నోచుకోని పలు గ్రామాలు ఇబ్బందులు పడుతున్న ప్రజలు పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నప్పటికీ మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల కొద్దీ కాలినడకన నడిచి గమ్యానికి చేరుకుంటున్నారు. బస్సు సౌకర్యం కల్పించాలి మండలంలో బస్సు సౌకర్యం లేని పల్లెలకు బస్సు సౌకర్యం కల్పించాలి. కళాశాలలకు వెళ్లే విద్యార్థులు , పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలి. – బి.నర్సయ్య(మెట్పల్లి), మాక్లూర్ పదేళ్ల నుంచి బస్సు రాలే.. మా గ్రామానికి బస్సు రాక పదేళ్లు అవుతుంది. మెరుగైన బీటీ రోడ్డు ఉంది. కా నీ బస్సు సౌకర్యం క ల్పించడం లేదు. బ స్సు ఎక్కాలంటే నాలుగు కిలో మీటర్లు నడవాల్సిన పరిస్థితి. – మూడా గోవింద్ నాయక్, అమ్రాద్ తండా, మాక్లూర్ -
పేకాడుతున్న ఐదుగురి అరెస్టు
బోధన్టౌన్(బోధన్): బోధన్ పట్టణంలోని రాకాసీపేట్ పరిధిలోని లయన్స్ కంటి ఆస్పత్రి వెనుక ఉన్న దర్గా సమీపంలో పేకాటస్థావరంపై శనివారం దాడి చేసినట్లు సీఐ వెంకటనారాయణ తెలిపారు. ఐదుగురిని పట్టుకొని, వారి నుంచి రూ. 1,970 నగదు, ఆరు సెల్ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. 38 పశువుల పట్టివేత భిక్కనూరు: అక్రమంగా తరలిస్తున్న 38 పశువులను పట్టుకొని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఆంజనేయులు శనివారం తెలిపారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం సాటాపూర్ గ్రామం నుంచి 12 లేగదూడలు, 26 ఎడ్లను బోలెరో, డీసీఎం వ్యాన్లలో మెదక్ జిల్లా నార్సింగి గ్రామంలోని మార్కెట్లో విక్రయించేందుకు తీసుకెళ్తుండగా జాతీయ రహదారిపై పట్టుకున్నామన్నారు. పశువులను జంగంపల్లి శ్రీ క్రిష్ణ మందిరంలోని గోశాలకు తరలించామన్నారు. డ్రైవర్లపై కేసు నమోదు చేశామన్నారు. కామారెడ్డిలో యువకుడు అదృశ్యం కామారెడ్డి క్రైం: నిజామాబాద్కు చెందిన ఓ వ్యక్తి కామారెడ్డిలో అదృశ్యమైనట్లు పట్టణ ఎస్హెచ్వో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్లోని గంగస్థాఽన్కు చెందిన వెంట్రామోల్ల సాహిత్ కుమార్ ప్రైవేటు కంపెనీలో సేల్స్మన్గా పని చేస్తున్నాడు. శుక్రవారం కామారెడ్డికి వచ్చిన సాహిత్ కుమార్ సాయంత్రం దేవునిపల్లి ప్రాంతంలో పోలీసులకు డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డాడు. అనంతరం స్నేహితుడు భరత్కుమార్ అతడిని బస్టాండ్కు తీసుకువచ్చి నిజామాబాద్ బస్సు ఎక్కించాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతోపాటు ఇంటికి చేరకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు శనివారం సాయంత్రం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్హెచ్వో తెలిపారు. కత్తితో పొడుచుకొని ఆత్మహత్యాయత్నం నిజామాబాద్నాగారం: నగరంలోని గాజులపేట్ ప్రాంతంలో గురుద్వార్ వద్ద ఖాజా మొయినుద్దీన్(60) జీవితంపై విరక్తితో శనివారం రాత్రి తనకు తాను కత్తితో పొడుచుకున్నాడు. స్థానికులు గమనించి 108 అంబులెన్స్కు సమాచారం అందించడంతో క్షతగాత్రుడిని జీజీహెచ్కు తరలించారు. తక్షణమే స్పందించిన 108 ఈఎంటీ రాములు, పైలెట్ అజయ్ని స్థానికులు అభినందించారు. -
కలెక్టరేట్లో రక్తదాన శిబిరం
అభినందించిన కలెక్టర్ నిజామాబాద్అర్బన్: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్, హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు ప్రారంభించగా, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులతోపాటు వివిధ శాఖలకు చెందిన సుమారు 60 మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. తలసేమియా పేషెంట్ల కోసం రక్తదాన శిబిరం నిర్వహించడం గొప్ప విషయమని ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడేందుకు రక్తదానం ఉపకరిస్తుందని గుర్తుచేశారు. రక్తదానం చేసిన ఉద్యోగులకు రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ప్రశంసాపత్రాలు అందజేశారు. రెడ్క్రాస్ సౌజన్యంతో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, అసోసియేషన్ ప్రతినిధులు మహేశ్, శ్రీనివాస్, రెడ్క్రాస్ బాధ్యులు బుస్స ఆంజనేయులు, తోట రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
జెన్కో, ఎస్సారెస్పీ అధికారుల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జెన్కో, ప్రాజెక్టు అధికారుల మధ్య శనివారం స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ జరిగింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మ్యాచ్ నిర్వహించారు. మ్యాచ్లో ప్రాజెక్ట్ అధికారుల జట్టు విజయం సాధించిగా, ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను సన్మానించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఈఈ చక్రపాణి, జెన్కో డిప్యూటీ ఈఈ శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతిభ ఆస్పత్రిలో విచారణ నిజామాబాద్నాగారం: నిజామాబాద్ నగరంలోని ప్రతిభ ఆస్పత్రిలో రోగి రాధిక మృతి చెందిన ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విచారణ చేపట్టింది. డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ అంజనాదేవి శనివారం ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో రోగి మృతిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రోగి ఆస్పత్రికి వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉందని, సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆరా తీశారు. ఆస్పత్రిలో రోగికి చేసిన పరీక్షలను పరిశీలించారు. సర్జరీ సమయంలో వైద్యులు ఎలాంటి వైద్యం అందించారో పూర్తి వివరాలను నమోదు చేసుకున్నారు. సర్జరీ చేసిన వైద్యుల అర్హత, ఎన్ని సంవత్సరాల అనుభవం తదితర వివరాలను తనిఖీ బృందం సభ్యులు క్షుణ్ణంగా ఆరా తీశారు. ప్రతిభ ఆస్పత్రిలో రోగి మృతి చెందిన ఘటనపై పూర్తి నివేదికను డీఎంహెచ్వోకు సమర్పిస్తామని డిప్యూ టీ డీఎంహెచ్వో అంజనాదేవి తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్, డీహెచ్ఈ వేణుగోపాల్, హెచ్ఈవో గోవర్ధన్ పాల్గొన్నారు. యోగాతో మానసిక ఒత్తిడి దూరం ● ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శివప్రసాద్ నిజామాబాద్నాగారం: యాంత్రీకరణ జీవనంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురవుతున్నారని, యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శివప్రసాద్ అన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలను శనివారం జీజీహెచ్లో జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ జే గంగదాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ యోగా ద్వారా మానసిక ఒత్తిడి, నిద్రలేమి, కోపం, డిప్రెషన్ తదితర వాటిని ఎలా నియంత్రించగలమో వివరించారు. అంతకుముందు యోగ శిక్షకులు ఆసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో యోగా వైద్యులు డాక్టర్ తిరుపతి, ఆయుష్ ఫార్మాసిస్ట్లు పురుశోత్తం, ఉమ్యాప్రసాద్, నీరజ, యోగా శిక్షకులు విజయ భాస్కర్, రాజేందర్, నమ్రత, సంగీత తదితరులు పాల్గొన్నారు. -
దాబా హోటళ్లలో తనిఖీలు
డొంకేశ్వర్(ఆర్మూర్): వన్యప్రాణుల మాంసాన్ని వండిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవ ని అధికారులు హెచ్చరించారు. మండలంలోని ప లు గ్రామాల్లో ఉన్న దాబా హోటళ్లలో పోలీసు, అట వీ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఫ్రిడ్జ్లలో నిలువ ఉంచిన మాంసాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ కుందేళ్లు, నెమళ్లు, దుప్పిలు మొదలగు అటవీ జంతువులను వండకూడదన్నారు. వన్యప్రాణుల ను వేటాడినా, వాటికి హాని కలిగించినా శిక్షకు గురవుతారని తెలిపారు. బయటి వ్యక్తులు వేట మాంసాన్ని తీసుకువస్తే అధికారులకు సమాచారం అందించాలన్నారు. ఒకవేళ అలాంటి వారికి సహాయం చేస్తే నాన్ బెయిల్ కేసులు నమోదు చేస్తామని నోటీసులు అందజేశారు. తనిఖీల్లో డిప్యూటీ ఎఫ్ఆర్వో సుధాకర్, పోలీసులు పాల్గొన్నారు. -
ఎస్ఎస్ఆర్ కళాశాలకు అటానమస్
నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలకు యూజీసీ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి హోదా లభించినట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ తెలిపారు. కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మీడియాతో ఆయన మాట్లాడారు. 33 సంవత్సరాలుగా జిల్లాలో ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాల కొనసాగుతోందని, 2025–26 విద్యా సంవత్సరం నుంచి కళాశాలకు నూతనంగా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ స్వయం ప్రతిపత్తి హోదాను కల్పించిందన్నారు. ఈ గుర్తింపుతో కళాశాల విద్యా ప్రాముఖ్యత, సృజనాత్మకత సమగ్ర విద్య అభివృద్ధి దిశగా ఓ మైలురాయి చేరుకున్నట్లు తెలిపారు. స్వయం ప్రతిపత్తితో కళాశాలకు సొంత పాఠ్య ప్రణాళిక రూపొందించుకోవడం, కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంతోపాటు ఆధునిక విద్య అవసరాలు, పరిశ్రమ అవసరాలను ప్రతిబింబించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామని వివరించారు. స్వయంగా పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం చేసే అవకాశం ఉందన్నారు. స్వయం ప్రతిపత్తి హోదా లభించడంతో మరింత బాధ్యత పెరిగిందన్నారు. ప్రత్యేక హోదాకు కృషి చేసిన కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, పూర్వ విద్యార్థులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో కళాశాల డైరెక్టర్ హరిత గౌడ్, హర్షిత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కేసు పెట్టారు.. వదిలేశారు!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సామాన్యుడు చిన్న తప్పిదం చేస్తే, అది నిరూపణ కాకముందే యుద్ధప్రాతిపదికన చర్యలకు ఉపక్రమించే అధికార యంత్రాంగం.. భారీ మాయాజాలం విషయంలో మా త్రం ప్రజాధనాన్ని రికవరీ చేయకుండా తమకేం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తోంది. దీనిపై సాక్షాత్తూ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో అధికార యంత్రాంగాన్ని కడిగిపారేశారు. 2014–15 నుంచి 2022–23 సంవత్సరాలకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో 44 మిల్లుల నుంచి రూ.250 కోట్లు, కామారెడ్డి జిల్లాలో 49 మిల్లుల నుంచి రూ.45 కోట్ల విలువజేసే సీఎంఆర్ రికవరీ చేయాల్సి ఉంది. ఇందులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ నుంచి రావా ల్సిందే రూ.60 కోట్ల మేర ఉండడం గమనార్హం. ఇందుకు సంబంధించి ఈ నెల 29న కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో మంత్రి జూపల్లి ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లవుతున్న ప్పటికీ రికవరీ చేయకుండా నోటీసులిచ్చి వదిలేయ డమేమిటంటూ అసహనం వ్యక్తం చేశారు. షెడ్యూల్, యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని కేసుల మీద కేసులు పెట్టి ఆరు నెలల్లో రికవరీ చేయాలని ఆదేశించారు. ● సీఎంఆర్ విషయంలో బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు మంత్రికి వివరించారు. దీంతో సంతృప్తి చెందని మంత్రి జూపల్లి రెండువారాల్లో పూర్తి వివరాలతో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని అడ్వొకేట్ జనరల్తో కలిసి హైదరాబాద్లో సమీక్షకు రావాలని ఆదేశించారు. ● హైకోర్టు ఆదేశాలతో కేసు అయితే నమోదు చేశారు కానీ.. తదుపరి విచారణ, చర్యల విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం గమనార్హం. బాధితుడి సంతకం ఫోర్జరీ చేసినట్లు నిర్ధారణకు వచ్చిన హైకోర్టు తక్షణమే కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో చేసినప్పటికీ, ఇప్పటివరకు ఒక్కసారి కూడా సదరు అధికారులను పోలీసు లు ప్రశ్నించకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. కాలయాపన చేస్తే చాలు అన్నట్లుగా యంత్రాంగం వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు గుర్రుగా ఉన్నారు. వందలకోట్ల ప్రజాధ నం అక్రమార్కులు బొక్కేస్తే ఉన్నతాధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై వాళ్లకు సైతం వాటాలు ముట్టినట్లు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ● 2021–22 యాసంగి, 2022–23 వానాకాలం సీజన్లకు గాను షకీల్కు చెందిన రహీల్, రాస్, అమీర్, దాన్విక్ అనే మిల్లుల పేరిట 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఈ మిల్లుల్లో ఒక్క గింజ ధాన్యం కూడా మిల్లింగ్ చేయలేదు. నేరుగా ధాన్యాన్ని అక్రమ మార్గంలో ముంబై, కాకినాడ పోర్టుల ద్వారా ఎగుమతి చేసి సొమ్ము చేసుకున్నాడు. కేవలం 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యానికి ఇచ్చేంత పరిమాణంలో రీసైకిల్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు ఇచ్చాడు. ఓ 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రం ఏఆర్ ఇండస్ట్రీస్ (ఎడపల్లి), ఆర్కాం ఇండస్ట్రీస్ (వర్ని), అబ్దుల్ ఐ ఇండస్ట్రీస్ (ఎడపల్లి), ఎఫ్టీఎఫ్ ఇండస్ట్రీస్ (బోధన్) వాళ్లకు ఇచ్చినట్లు చూపించాడు. ఈ నాలుగు మిల్లుల యజమానులతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని బలవంతంగా ధాన్యం తీసుకున్నట్లు లేఖలు ఇప్పించాడు. షకీల్ ఒత్తిడితోనే లేఖలు ఇచ్చినట్లు సదరు మిల్లర్లు తెలిపారు. రూ.60 కోట్ల విలువ చేసే ధాన్యానికి బియ్యం ఇవ్వకపోవడంతో ప్రభుత్వం షకీల్కు చెందిన మిల్లులకు రూ.10 కోట్ల జరిమానా వేసింది. ఇప్పటివరకు షకీల్ కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వకపోవడంతో పాటు, జరిమానా సైతం కట్టలేదు. అధికారులు మాత్రం నోటీసులు ఇచ్చామని చెబుతూ కాలం గడిపారు. మరోవైపు బాధితుడు కిశోర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి కథ నడిపిన అధికారులే, సీఎంఆర్ సైతం కిశోరే ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడం గమనార్హం. అధికార దుర్వినియోగంఅధికారంలో ఉన్న సమయంలో.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కోట్లాది రూపాయల విలువజేసే ధాన్యాన్ని ప్రభుత్వం నుంచి తీసుకుని ఒక్క గింజ కూడా మిల్లింగ్ చేయకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు దందా చేశాడు. మళ్లీ అధికారంలోకి వస్తామనే నమ్మకంతో ధాన్యం ఇవ్వకుండానే కిశోర్ మిల్లు నుంచి సీఎంఆర్ ఇవ్వాల్సిందేనని ఒత్తిడి చేయించాడు. సీఎంఆర్ రికవరీలో అధికారుల తీరు ఒకరికి ధాన్యం ఇచ్చి.. మరొకరికి వేధింపులు నిజామాబాద్ జిల్లాలో రూ.250 కోట్లు, కామారెడ్డి జిల్లాలో రూ.45 కోట్ల విలువైన సీఎంఆర్ పెండింగ్ చివరికి ఇన్చార్జి మంత్రి నిలదీయాల్సిన పరిస్థితి.. అయినా రికవరీపై అనుమానాలే.. సీఎంఆర్ విషయంలో ఉన్నతాధికారులే అధికార దుర్వినియోగానికి పాల్పడిన వ్యవహారంలో గత మార్చి 30న బాధితుడి పోరాటంతో ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రస్తుతం సంగారెడ్డి అదనపు కలెక్టర్గా పనిచేస్తున్న, గతంలో నిజామాబాద్ అదనపు కలెక్టర్గా పనిచేసిన చంద్రశేఖర్, మాజీ డీఎస్వో చంద్రప్రకాశ్, డిప్యూటీ తహసీల్దార్ నిఖిల్రాజ్లపై వర్ని పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. 2022–23 సీజన్లో వర్ని మండలంలోని కిశోర్ అనే వ్యక్తికి చెందిన శ్రీనివాస రైస్మిల్లుకు కేటాయించిన ధాన్యం పంపించకుండానే పంపించినట్లు చూపించిన ఉన్నతాధికారులే, సదరు రైస్మిల్లు యజమాని సంతకాన్ని సైతం ఫోర్జరీ చేయించడం విశేషం. ధాన్యం మాత్రం మాజీ ఎమ్మెల్యే షకీల్ మిల్లుకు పంపించి, కస్టమ్ మిల్లింగ్ రైస్ను కిశోర్కు చెందిన శ్రీనివాస రైస్ మిల్లు నుంచి ఇవ్వాలని ఈ ఉన్నతాధికారులే ఒత్తిడి తేవడం గమనార్హం. దీంతో దిక్కుతోచని బాధితుడు కిశోర్ నెలల తరబడి న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది. -
రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణ సభ్యుడిగా రామకృష్ణ నియామకం
నిజామాబాద్ సిటీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, న్యాయవాది జీవీ రామకృష్ణ రాష్ట్ర డిసిప్లినరీ కమిటీ సభ్యుడిగా నియామకం కావడంతో పలువురు నాయకులు ఆయనను అభినందించారు. శుక్రవారం కాంగ్రెస్ భవన్లో ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ శాలువాతో సత్కరించారు. పార్టీకోసం పనిచేసిన వారికి పదవులు వాటంతట అవే వస్తాయని తెలిపారు. రామకృష్ణను కాంగ్రెస్ నాయకులు నరేందర్ సింగ్, సేవాదల్ సంతోష్, బొబ్బిలి రామకృష్ణ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ నాగారం: రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణ సభ్యుడిగా నియమితులైన జి రామకృష్ణను ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్కు కృతజ్ఞతలు తెలిపారు. రామకృష్ణ గత 35 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎడ్ల నాగరాజ్, పూజారి గంగాధర్, రాంభూపాల్,బాబు, ప్రమోద్, భూషణ్, మనోహర్ రవి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా బీరప్ప కల్యాణం
నిజామాబాద్ రూరల్: నగర శివారులోని బోర్గాం(పి)లో కుర్మ సంఘం సభ్యులు బీరప్ప కామరాతి కల్యాణ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కల్యాణ వేడుకలకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సంఘం సభ్యులు ఎమ్మెల్యేకు గొంగడి, మేక పిల్లను అందించారు. సంఘం పెద్దలు, ఒగ్గు కళాకారులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.మహిళలకు భద్రత కల్పించాలినిజామాబాద్ సిటీ: మహిళలకు అనేక చట్టాలు ఉన్నా భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ అన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జిల్లా ప్రత్యేక శిక్షణా తరగతులను జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. శిక్షణ కా ర్యక్రమానికి అరుణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో అనేక మార్పులు చెందుతున్నా, టెక్నాలజీ పెరుగుతున్నా మహిళలపై హింస ఆగడం లేదన్నారు. చట్టాలు సరి గా అమలుకాకపోవడం వల్లే మహిళలపై దాడు లు పెరుగుతున్నాయని అన్నారు. నాయకులు సుజాత, అనిత, హసీనా బేగం, కళ, శారద, శ్రీదేవి, రేఖ, స్వప్న పాల్గొన్నారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు భూమిపూజడిచ్పల్లి: మండలంలోని మిట్టాపల్లి, మిట్టాపల్లి తండా, ఘన్పూర్ గ్రామాల్లో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, మాజీ ఎంపీపీలు కంచెట్టి గంగాధర్, సీహెచ్ నర్సయ్య, మైనార్టీ నాయకులు డాక్టర్ షాదు ల్లా, రామకృష్ణ శుక్రవారం భూమి పూజ చేశా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇళ్లు లేని పేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని అన్నారు. కార్యక్రమంలో జీపీ కార్యదర్శులు రమేశ్, నరేశ్, హరీశ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు హబీబ్, బాల గంగాధర్, నంద్యానాయక్, డాక్టర్ లింబాద్రి, సతీశ్రెడ్డి, శక్కరికొండ సాగర్, వెంకటేశ్, ఎన్నోల్ల గంగాధర్, వీడీసీ సభ్యులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.లోతు దుక్కులతో అధిక ప్రయోజనాలురెంజల్(బోధన్): వేసవిలో లోతు దుక్కుల ద్వారా నేల ద్వారా సంక్రమించే తెగుళ్లు, పురుగులు మాత్రమే కాకుండా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని రుద్రూర్ ప్రాంతీయ వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సూచించారు. శుక్రవారం రెంజల్ రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు రాకేశ్, పద్మావతిలు రైతుల సందేహాలను నివృత్తి చేశారు. విత్తన శుద్ధి, ఎరువుల వాడకం, పురుగు మందుల వినియోగం, తెగుళ్ల నివా రణ, తదితర అంశాలపై వివరించారు. ఏవో శ్రీనివాస్రావ్, రెంజల్ విండో చైర్మన్ మొయినొద్దిన్, రైతులు పాల్గొన్నారు. -
బాజిరెడ్డి జగన్ జన్మదినం
సిరికొండ: బీఆర్ఎస్ రూరల్ నియోజకవర్గ నాయకుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ జన్మదిన వేడుకలను మండల కేంద్రంతో పాటు రావుట్ల తదితర గ్రామాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో జగన్ను కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, తోట రాజన్న, దువ్వూరి సంతోష్ రెడ్డి, బాజిరెడ్డి రమాకాంత్, అన్స ర్, భూషణ్ రెడ్డి, సురేందర్ రెడ్డి, సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం స్థల పరిశీలన రుద్రూర్: పోతంగల్ మండలం పీఎస్ఆర్ నగర్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం కేటాయించిన స్థలాన్ని శుక్రవారం టీజీఈడబ్ల్యూఐడీసీ ఎండీ గణపతి రెడ్డి పరిశీలించారు. ఆయనతో పాటు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాస్ గౌడ్, డీఈలు సుబ్బరాయుడు, రవికుమార్, తహసీల్దార్ గంగాధర్, సర్వేయర్ పోశెట్టి, మాజీ జెడ్పీటీసీలు శంకర్ పటేల్, పుప్పాల శంకర్, మాజీ ఎంపీపీ గంధపు పవన్, తదితరులు ఉన్నారు. -
వెన్నునొప్పితో వెళ్తే ప్రాణాలే పోయాయి
నిజామాబాద్నాగారం: వెన్నునొప్పి చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళ ఆపరేషన్ అ నంతరం కన్నుమూసింది. నగరంలోని ప్రతిభ ఆ స్పత్రిలో శుక్రవారం చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన రాధిక(35) వెన్నునొప్పితో బాధపడడంతో భర్త సురేశ్ ప్రతిభ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. పరీక్షించిన వైద్యులు వె న్నుపూసకు ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని తెల పడంతో సురేశ్ ఒప్పుకున్నాడు. గురువారం ఉద యం ఆపరేషన్ పూర్తి చేసి రాధికను వెంటిలేటర్పై ఉంచగా శుక్రవారం ఉదయం 8గంటల సమయంలో మరణించింది. కాగా, సీనియర్ వైద్యులు చే యాల్సిన ఆపరేషన్ను జూనియర్ వైద్యులు చేయడంతోనే రాధిక మృతి చెందినట్లు భర్త, కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఆపరేషన్ చేస్తామని చెప్పి ప్రాణాలు తీశారంటూ బోరున విలపించారు. ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులు వచ్చి మృతదేహా న్ని తీసుకొని బయటికి వెళ్లాలని చెప్పడంతో కు టుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అదే సమ యంలో మృతురాలి కుటుంబీకులు, బంధువులు, కుల సంఘాల ప్రతినిధులు, మీడియా, పోలీసులు ఆస్పత్రికి చేరుకోవడంతో శవాన్ని ఆస్పత్రి లోపలికి తీసుకెళ్లారు. అనంతరం రూ. లక్ష ఇస్తామని, మృతదేహాన్ని తీసుకెళ్లాలని బేరసారాలకు దిగడంతో కుటుంబసభ్యులు మరింత ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆపరేషన్ ఎలా చేశారో, కే షీట్, ఎమ్ఆర్ఐ తదితర వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కు టుంబసభ్యుల ఆందోళన, యాదవ సంఘం మహి ళా అధ్యక్షురాలు మంజుల యాదవ్ ఒత్తిడితో చివరకు రూ. 3లక్షల 20వేలకు రాజీకుదిరింది. మహిళ మృతి, కుటుంబసభ్యుల ఆందోళన విషయం తెలుసుకొని సిబ్బందితో కలిసి ప్రతిభ ఆస్పత్రికి చేరు కున్న నగర సీఐ శ్రీనివాస్రాజ్..బాధితుల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో వెనుదిరిగి వెళ్లా ల్సి వచ్చింది. కాగా, రాధిక మృతదేహానికి పోస్టు మార్టం చేయిస్తే అసలు నిజాలు బయటికి వచ్చేవని స్థానికంగా పలువురు చర్చించుకున్నారు. ఆపరేషన్ తర్వాత మహిళ మృతి ప్రైవేటు ఆస్పత్రిలో రోజంతా హైడ్రామా వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబీకుల ఆందోళన ప్రాణానికి వెలకట్టిన ఆస్పత్రి యాజమాన్యం -
అత్యవసర సేవలకు ‘శానిటరీ స్పెషల్టీం’
నిజామాబాద్ సిటీ: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అత్యవసర పనుల కోసం శానిటరీ విభాగానికి చెందిన పది మంది సిబ్బందితో స్పెషల్ టీంను అధికారులు ఏర్పాటు చేశారు. వర్షాకాలం ప్రారంభమైనందున అర్ధరాత్రి వేళ అత్యవసర సేవలకు, లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు నిలిచినా, చెట్లు విరిగిపడినా, ఇతర అత్యవసర సేవలకు బల్దియా అధికారులు పది మందితో కూడిన పారిశుధ్య కార్మికుల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరు ప్రతి రోజు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు విధులు నిర్వహించనున్నారు. వర్షంలో సైతం పనిచేసేందుకు వీరికి రెయిన్కోట్స్, చేతులకు గ్లౌవుస్, తలకు హెల్మెట్స్, రాత్రివేళల్లో కనిపించేందుకు ఆఫ్రాన్స్, ఇతర పరికరాలను అందించారు. వర్షాకాలం వరకు ఈ స్పెషల్ టీం ప్రతిరోజు డ్యూటీలో ఉంటుంది. ఈ బృందానికి జవాన్ ప్రేమ్కుమార్ను సైతం కేటాయించారు. మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ ఆదేశాలతో ఈ స్పెషల్ టీంను సిద్ధంగా ఉంచినట్లు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ జయకుమార్ తెలిపారు. -
పట్టాదారులకే భూమి కబ్జా ఇవ్వాలి
సిరికొండ : సిరికొండ రెవెన్యూ శివారులోని సర్వే నంబర్ 532లో పట్టాలు కలిగిన లబ్ధిదారులకు భూమిని కబ్జా ఇవ్వాలని సీపీఐఎంఎల్ మాస్లైన్ నాయకుడు రమేశ్ డిమాండ్ చేశారు. సీపీఐఎంఎల్ ఆధ్వర్యంలో పట్టాదారులతో కలిసి తహసీల్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించి తహసీల్దార్ రవీందర్రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూమిని రెవెన్యూ భూమిగా గుర్తించి రెండు వందల మంది పేదలకు పట్టాలిచ్చారని తెలిపారు. అటవీ అధికారులు ఆ భూమి అటవీ భూమిది అంటు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు దామోదర్, సాయారెడ్డి, లింబాద్రి, రమేశ్, నరేశ్, ఎర్రన్న, బాల్రెడ్డి, రాజపండరి తదితరులు పాల్గొన్నారు. -
బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం
నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగిరేలా కృషి చేయాలన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు వాటంతట అవే వస్తాయన్నారు. 2017కు ముందున్న వారికి డివిజన్ స్థాయి అధ్యక్ష పదవులు ఇవ్వాలని అధిష్టానం సూచించిందన్నారు. పాత, కొత్త తేడా లేకుండా అందరూ పార్టీ కోసం పనిచేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిజామాబాద్ అర్బన్కు 3500 కేటాయించగా, అందులో కేవలం 752 మాత్రమే అర్హులుగా నిలవడం బాధాకరమని అన్నారు. నిజమైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు వచ్చేలా స్థానిక నాయకులు చూడాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లను ఇందిరమ్మ కమిటీ నాయకులతోనే పంపిణీ చేస్తామని తెలిపారు. రూ. 50 వేలు, రూ. లక్ష రాజీవ్ యువ వికాస్ రుణాల కోసం బ్యాంక్ సిబిల్ అవసరం లేదన్నారు. అర్హులైన వారికి రుణాలు అందిస్తామన్నారు. ఇదివరకు రూ. లక్షకు పైగా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నవారు రుణ పరిమితి, రూ. 50 వేలు, రూ. లక్షకు మార్చుకునే అవకాశం కూడా ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకుడు తిరుపతి మాట్లాడుతూ.. డివిజన్ అధ్యక్షుల కోసం ఆయా డివిజన్ నాయకులు ఏకగ్రీవంగా ఒకరి పేరు సూచిస్తూ జాబితాను పార్టీ నగర అధ్యక్షుడు కేశ వేణుకు ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, నగర అధ్యక్షుడు నుడా చైర్మన్ కేశ వేణు, నరాల రత్నాకర్, విపుల్గౌడ్, బొబ్బిలి రామకృష్ణ, జావెద్ అక్రమ్, రాంభూపాల్, సంతోష్, నరేందర్ గౌడ్, సయ్యద్ ఖైసర్, నరేందర్సింగ్, రేవతి, పోల ఉష తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం పాతవారికే డివిజన్ అధ్యక్ష పదవులు -
పేదలకు వరం సీఎంఆర్ఎఫ్
డిచ్పల్లి: అనారోగ్యంతో మెరుగైన వైద్యం చేయించుకోలేని బాధితులకు సీఎంఆర్ఎఫ్ వరంగా మారిందని డీసీసీ డెలిగేట్ వాసుబాబు పేర్కొన్నారు. డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలో శుక్రవారం ఎనిమిది మంది బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు అందజేశారు. గత ప్రభుత్వంలో ఆగిపోయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను సైతం తిరిగి మంజూరు చేసిన సీఎం రేవంత్రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిలకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మురళి, మురారి, సోమనాథ్, పిచ్చయ్య, యాదయ్య, వెంకట్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న ఆర్వోబీ పనులు నిజామాబాద్ రూరల్: మండలంలోని మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద పనులు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం పెద్ద క్రేన్ సహాయంతో పిల్లర్ల వద్ద ఉన్న ఖాళీ స్థలాల్లో కాంక్రిట్ను నింపుతున్నారు. పనులు చేపట్టేందుకు పెద్ద క్రేన్ రావడంతో ప్రయాణికులు, స్థానికులు ఆసక్తిగా తిలకించారు. -
పరిశోధన కేంద్రం నుంచి మూడు కొత్త వంగడాలు
రుద్రూర్: రుద్రూర్ ప్రాంతీయ చెరకు, వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు రూపొందించిన కొత్త వంగడాలను సాగుకు విడుదల చేసినట్లు పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్ టీ అంజయ్య వెల్లడించారు. వ్యవసాయ పరిశోధన కేంద్రంలో శుక్రవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుదీర్ఘకాలం తర్వాత రుద్రూర్ చెరకు–81 (2013 ఆర్81/కోఆర్ 19141) రకంతోపాటు వరి లో ఆర్డీఆర్–1162, ఆర్డీఆర్–1200 రకాలను విడుదల చేశామన్నారు. వీటిని రైతులు సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని కోరారు. నూతన వంగడాలను రూపొందించిన శాస్త్రవేత్తలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. అభ్యుదయ రైతులకు విత్తనాలు.. వ్యవసాయ పరిశోధన స్థానాల ద్వారా ఉత్పత్తి చేసి న నాణ్యమైన విత్తనాన్ని ప్రతి గ్రామంలో మూడు నుంచి ఐదుగురు అభ్యుదయ రైతులకు అందజేసామని, ఈ కార్యక్రమాన్ని జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. గ్రామాల వారీగా విత్తనం తీసుకున్న రైతులు సాగు చేసి పంట ద్వారా ఉత్పత్తి అయిన విత్తనాన్ని స్థానిక రైతులకు తక్కువ ధరకు అందజేయాల్సి ఉంటుందన్నారు. ఎంపిక చేయబడిన రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సల హాలు, సూచనలు అందజేస్తారన్నారు. జూన్ 3న విత్తన మేళా నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో పరిశోధన కేంద్రం, కేవీకే శాస్త్రవేత్తలు రాజ్కుమార్, విజయ్కుమార్, సాయిచరణ్, రాకేశ్, దినేశ్, రమ్య, సౌందర్య తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల 3న విత్తన మేళా పరిశోధన కేంద్రం అధిపతి టీ అంజయ్య -
నియంత్రించలేకపోతున్నారు!
● ఎత్తిపోతల పథకాలే లక్ష్యంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చోరీలు ● లక్షలాది రూపాయల నష్టం ● పది నెలల్లో పది ఘటనలు ● ఆందోళనలో రైతాంగం నందిపేట్: జిల్లాలో ఎత్తిపోతల పథకాలే లక్ష్యంగా వరుస చోరీలు జరుగుతున్నాయి. పది నెలల్లో పది ఘటనలు చోటుచేసుకున్నాయి. దుండగులు విద్యు త్ ట్రాన్స్ఫార్మర్లలోని విలువైన సామగ్రిని ఎత్తుకెళ్తున్నారు. వీటిపై ఆయకట్టు రైతుల సమాచారం మేర కు ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చే స్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. ఇంతవర కు ఎవరు, ఎందుకు చోరీలకు పాల్పడుతున్నారనేది తేల్చలేకపోతున్నారు. జిల్లాలో చోరీల్లో అత్యధికంగా ఉమ్మడి నందిపేట మండలంలోనే జరగడం గమనార్హం. అందులో తల్వేద ఎత్తిపోతల పథకంలో ఇప్పటి వరకు మూడు సార్లు చోరీలు జరిగాయి. ఒకే తరహాలో ఘటనలు పది నెలల నుంచి జిల్లాలో వరుస ఘటనలు ఒకే తరహాలో జరుగుతున్నప్పటికీ చోరీలకు పాల్పడుతున్నది ఎవరనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. దుండగులు ఎత్తిపోతల పథకాల వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి రూ. లక్షల విలువైన రాగి కాయిల్స్, ఇంధనం, ఇతర పరికరాలను అపహరించుకు పోతున్నారు. ప్రతి చోట ఒకే తరహాలో ఘటనలు చోటు చేసుకుంటున్నాయంటే అనుభవం ఉన్న వ్యక్తులే ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నట్లు రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయినా ఒక్క కేసు కూడా దర్యాప్తు కొలిక్కి రాలేదు. వేల ఎకరాలకు ఇబ్బందులు ఎత్తిపోతల పథకాల ట్రాన్స్ఫార్మర్లు పనిచేయక పోవడంతో వేల ఎకరాల్లో ఖరీఫ్ సాగుకు నీరందని పరిస్థితి నెలకొంది. రూ. లక్షలు వెచ్చించి రిపేర్లు చేసినా మళ్లీ దొంగతనాలు కావడంతో పంటలను ఎలా పండించాలో తెలియక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను గుర్తించాలని, ప్రభుత్వం ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.ట్రాన్స్ఫార్మర్లు చోరీ జరిగిన ఎత్తిపోతల ప్రాంతాలురైతులే చూసుకోవాలి ఎత్తిపోతల పథకాల నిర్వహణ బాధ్యతను ఆయకట్టు రైతులే చూస్తున్నారు. వాటిని వారే భద్రంగా చూసుకోవాలి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో విలువైన రాగి, ఇతర పరికరాలు చోరీకి గురికావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాం. ట్రాన్స్ఫార్మర్లను తిరిగి రైతులే సమకూర్చుకోవాలి. – ప్రవీణ్, ఇరిగేషన్ ఏఈ, నందిపేటదర్యాపు చేస్తున్నాం ఎత్తిపోతల పథకాల్లో వరుస చోరీలు జరుగడంపై దర్యాప్తు చేస్తున్నాం. ఎత్తిపోతల పథకాల వద్ద వాచ్మన్ను నియమించుకోవాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. – చిరంజీవి, ఎస్సై, నందిపేట -
దళిత రత్న అవార్డుల ప్రదానం
నిజామాబాద్ అర్బన్ : నగరంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో దళిత రత్న అవార్డుల కమిటీ చైర్మన్ ఇటుక రాజు జిల్లాకు చెందిన దళిత నాయకులకు శుక్రవారం అవార్డులను అందజేశారు. అవార్డులు అందుకున్న వారిలో పులి జైపాల్, డాక్టర్ బుర్ర లక్ష్మణ్, కోటేశ్వరరావు, సదాశివరావు, విజయ కాంతారావు, అబ్బులు, సాయిలు, లత, జ్యోతి, కొత్తపల్లి దుర్గయ్య ఉన్నారు. అనుమతి లేని పాఠశాలపై చర్యలు తీసుకోవాలి నిజామాబాద్ అర్బన్: నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ సమీపంలో అనుమతి లేకుండా సీబీఎస్ పాఠశాల అంటూ అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతున్న ఓ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎ జిల్లా ప్రధాన కార్యదర్శి జ్వాలా శుక్రవారం డిమాండ్ చేశారు. రూరల్ మండల విద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. పాఠశాల భవనం నిర్మాణ దశలో ఉండగానే అడ్మిషన్లు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. బీజేపీ మండల కార్యవర్గ నియామకం జక్రాన్పల్లి: మండల కేంద్రంలో శుక్రవారం భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గాన్ని నియమించినట్లు పార్టీ మండల అధ్యక్షుడు కన్నెపల్లి ప్రసాద్ తెలిపారు. పార్టీ మండల ఉపాధ్యక్షులుగా నవీన్, చిరంజీవి, బాల్రెడ్డి, రాజకళా, ప్రధాన కార్యదర్శులుగా ఆకుల లత మహేందర్, కుంట శ్రీనివాస్, కార్యదర్శులుగా తిరుపతిరెడ్డి, లక్ష్మణ్, సాయిలు, మమత, కోశాధికారిగా కుంట భూషణ్తో పాటు మరో ఇరవై మంది కార్యవర్గ సభ్యులను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. నేడు అహల్యాబాయి జయంతి సుభాష్నగర్: మహారాణి అహల్యాబాయి హోల్కర్ జయంతి సందర్భంగా శనివారం సాయంత్రం జి ల్లా కేంద్రంలో శోభాయాత్ర నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి శుక్రవారం తెలిపారు. నగరంలోని గోల్ హనుమాన్ మందిరం నుంచి కోటగల్లి మార్కండేయ మందిరం వరకు ఈ శోభాయాత్ర ఉంటుందని, యాత్రకు ముఖ్యఅతిథులుగా అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. శోభాయాత్రలో పార్టీ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడాలి
నిజామాబాద్ అర్బన్: కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలపై, ఉపాధి హామీ కూలీలపై చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని వీడాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట స్వాములు అన్నారు. శుక్రవారం అదనపు కలెక్టర్ కిరణ్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఉపాధి రంగానికి నిధులు తగ్గించారని, పట్టణ ప్రాంతంలో కూడా పేద కూలీలు పెరిగిపోతున్నారని వీరికి ఉపాధి కల్పించాలన్నారు. జాబ్ కార్డు లేనివారికి జాబ్ కార్డులు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి, శంకర్, చంద్రకాంత్, శేఖర్ గౌడ్ తదితరులు ఉన్నారు. -
పద్మశాలి సంఘం అభివృద్ధికి కృషి చేస్తా
నిజామాబాద్నాగారం: పద్మశాలి సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఇటీవల నూతనంగా ఎన్నికై న పద్మశాలి సంఘం నగర నూతన కార్యవర్గ సభ్యులు శుక్రవారం జిల్లా కేంద్రంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంఘం అభివృద్ధికి, పద్మశాలి సమాజ ఉన్నతికి తన పూర్తి సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. అనంతరం సంఘ సభ్యులను సన్మానించారు. అదేవిధంగా నగరంలోని ఆర్అండ్బీ గెస్హౌస్లో రాష్ట్ర ఉర్దూ అకాడమి చైర్మన్ తాహెర్బిన్ హందాన్ను, నుడా చైర్మన్ కేశవేణును పద్మశాలి సంఘం నగర నూతన కార్యవర్గ సభ్యులు కలిశారు. తాహెర్ను సంఘ సభ్యులు సన్మానించారు. కార్యక్రమాల్లో పద్మశాలి సంఘం నగర అధ్యక్షుడు పెంట దత్తాత్రి, బిల్ల మహేశ్, చౌటి భూమేశ్వర్, మోర సాయిలు, పల్నాటి రఘు, మైసల నారాయణ, కన్న దుబ్బరాజాం, బాగుల శ్రీనివాస్, ఎనగందుల సుభాష్, బూస రవి, బొడ్డు గంగా ప్రసాద్, కస్తూరి గంగరాజు, ఎనగందుల మురళి, అవధూత రాములు, సత్యపాల్, భీమర్తి రవి, బొట్టు వెంకటేశ్, పల్నాటి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. -
నందిపేట మహిళలకు లక్పతి దీదీ అవార్డులు
నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండలానికి చెందిన ఇద్దరు మహిళలు లక్పతి దీదీ అవార్డులు అందుకున్నారు. పేదరిక నిర్మూలనలో భాగంగా స్వయం సహాయక మహి ళా సంఘ సభ్యుల కుటుంబాలను లక్షాధికారులను చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం లక్పతి దీదీ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం అమలులో రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా మొదటిస్థా నంలో ఉండగా, లక్పతి దీదీలుగా రాష్ట్రం తరఫున నందిపేట మండలం సీహెచ్ కొండూర్ గ్రామానికి చెందిన మంగు లావణ్య, నందిపేటకు చెందిన మహ్మాదీ అజ్మిరీ బేగంలు ఎంపికయ్యారు. ఒడిశాలో శుక్రవారం నిర్వహించిన జాతీయ స్థాయి కాన్క్లేవ్లో ఆ రాష్ట్ర సీఎం మోహన్ చరణ్ మాఝీ చేతుల మీదుగా లావణ్య, అజ్మిరీలు అవార్డు అందుకున్నారు. కాగా, రాష్ట్రంలోనే నందిపేట మండల సమాఖ్య 100 శాతం అజీవిక రిజిస్టర్ నమోదులో ముందుండడంతో ఐకేపీ ఏపీఎం మాణిక్యం సైతం అవార్డు అందుకున్నారు. అవార్డు వచ్చేలా కృషి చేసిన డీఆర్డీవో సాయాగౌడ్, అడిషనల్ డీఆర్డీవో రవీందర్కు కృతజ్ఞతలు తెలిపారు.ఎస్సెస్సీ సప్లిమెంటరీ పరీక్షలకు బందోబస్తుఖలీల్వాడి: జిల్లాలో వచ్చే నెల 3 నుంచి 13వ తేదీ వరకు కొనసాగనున్న పదో తరగ తి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ పోతరాజు సాయిచైతన్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:50 గంటల వరకు పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా నిషేధిత ఆ దేశాలు జారీ చేస్తున్నామన్నారు. కేంద్రాల వ ద్ద సెక్షన్ 163 అమలులో ఉంటుందన్నారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడరాదని, సెంటర్ పరిసర ప్రాంతాలలోని అన్ని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలన్నారు. డిగ్రీ పరీక్షలకు 142 మంది గైర్హాజరు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల్లో శుక్రవారం 142 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన 32 పరీక్ష కేంద్రాల్లో 1,546 మంది విద్యార్థులకు గానూ 1,404 మంది హాజరైనట్లు తెలిపారు. ఉదయం జరిగిన 6వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షకు 337 మంది విద్యార్థులకు గానూ 319 మంది హాజరైనట్లు తెలిపారు. మధ్యాహ్నం జరిగిన 1వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షకు 1,209 మంది విద్యార్థులకు గానూ 1,085 మంది హాజరైనట్లు వివరించారు. -
రైస్మిల్లుల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న అర్సపల్లి, ఖానాపూర్, సారంగాపూర్ ప్రాంతాల్లోని రైస్మిల్లులను కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్ కిరణ్కుమార్తో కలిసి అర్సపల్లిలోని రుద్రా రైస్మిల్లు, ఖానాపూర్లోని ఎల్జీ ఆగ్రో ఇండస్ట్రీస్, వీరభద్ర రైస్మిల్లు, సారంగాపూర్లోని అనూ ఫుడ్స్ రైస్మిల్లును సందర్శించారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం వివరాలను తెలుసుకున్నారు. వర్షాలు కురుస్తున్నందున ధాన్యాన్ని వెంటదివెంట దిగుమతి చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు. మిల్లింగ్ ప్రక్రియ సైతం త్వరగా చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఎస్వో అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు. -
జీవితంపై విరక్తితో ఒకరి ఆత్మహత్య
రెంజల్(బోధన్): మద్యానికి బానిసైన వ్యక్తి జీవితంపై విరక్తితో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. మండలంలోని బోర్గాం గ్రామానికి చెందిన మేకల లక్ష్మణ్(42) మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవపడేవాడు. గత శనివారం మద్యం సేవించి ఇంటికి వచ్చిన లక్ష్మణ్ భార్యతో ఘర్షణ పడగా, ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో జీవితంపై విరక్తితో బుధవారం రాత్రి ఇంట్లోని ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం తెల్లవారుజామున ఇంటికి వచ్చిన తల్లికి లక్ష్మణ్ మృతదేహం కనిపించింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని బోధన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. తల్లి పోసాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అమెరికాలో తిమ్మారెడ్డి యువకుడు అనుమానాస్పద మృతి
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి గ్రా మానికి చెందిన గోవర్ధన్ (28) అనే యువకుడు గురువారం అమెరికాలో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గ్రామానికి చెందిన గూల విఠల్ కుమారుడు గోవర్ధన్ నాలుగు సంవత్సరాల క్రితం అమెరికాలో ఒకాయోలో ఎంఎస్ చదివేందుకు వెళ్లా డు. గతేడాది నుంచి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న గోవర్ధన్.. బుఽ దవారం కుటుంబసభ్యులతో మాట్లాడాడు. గురువారం గోవర్ధన్ మృతి చెందినట్లు సమాచారం రావడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. కుమారుడి మృతిపై అనుమానం ఉన్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. గోవర్ధన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహం వచ్చేందుకు నాలుగు రోజులు పట్టే అవకాశం ఉన్నదని స్థానికులు తెలిపారు. -
నవనాథ సిద్దులగుట్టపై ఏకశిల స్థూపం
ఆర్మూర్: ఆర్మూర్ పట్టణానికి దక్షిణ నైరుతి భాగంలో కొన్ని కిలోమీటర్ల మేర సిద్దుల గుట్ట విస్తరించి ఉంది. గుట్ట చుట్టూ ప్రజలు నివాసాలను ఏర్పరుచుకున్నారు. రాతియుగంలో గుట్టకు దక్షిణాన ఉన్న ప్రజలకు కనిపించేలా ఏక శిల స్థూపాన్ని నిర్మించారు. సుమారు 15 ఫీట్ల పొడవుతో ఈ స్థూపం ఉంటుంది. స్థూపంపైన నాలుగు మూలల్లో నాలుగు పిల్లర్లు ఉండి పైనుంచి కప్పు నిర్మాణం ఉంటుంది. కింది నుంచి విసిరే రూపాయి కాయిన్ స్థూపంపైన నాలుగు పిల్లర్ల మధ్యన నిలిస్తే మనసులోని కోరికలు నెరవేరుతాయనేది భక్తుల నమ్మకం. -
పప్పు, నూనె గింజ పంటలతో అధిక లాభాలు
రుద్రూర్ : పప్పు ధాన్యాలు, నూ నె గింజ పంటల సాగుతో అధిక లాభాలను అర్జించవచ్చునని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్కుమార్ సూచించారు. పొతంగల్ మండలం హెగ్డోలిలో గురువారం నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వరి, సోయా, మొక్కజొన్న పంటల్లో తీసుకోవాల్సిన సమగ్ర సస్యరక్షణ విధానాలను వివరించారు. ఒకే రకమైన పంట వేయడంతో భూములు చౌడు బారిపోతున్నాయని, దీని నివారణకు పంట మార్పిడి చేయాలన్నారు. తక్కువ కాల పరిమితి రకాలను ఎంపిక చేసుకోవడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చునని తెలిపారు. వ్యవసాయ సమాచార సాధానాలపై విస్తరణ శాస్త్రవేత్త శ్వేత అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారిణి నిశిత, వెటర్నరీ డాక్టర్ సురేశ్కుమార్, ఏఎంసీ చైర్మన్ హన్మంతు, మాజీ ఎంపీపీ పుప్పాల శంకర్, రైతులు పాల్గొన్నారు. -
మాకూ.. బతకాలని ఉంటుంది
కీటకాల మనోవ్యథ హాయ్ అండీ... మేము నోరు లేని చిన్నపాటి జీవాలం..మాకూ భూమిపై బతకాలని ఆశగా ఉంటుంది.. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో మీరు సంతోషంగా ఉంటారని తెలుసు.. మీరెంత సంతోషంగా ఉంటారో మేమంత బాధలో ఉంటామని మీకు తెలుసా? కారణం వర్షాలతో మా నివాసాల్లోకి నీరు చేరడంతో రోడ్డుపైకి చేరుతాము. రోడ్డును దాటుతున్న తరుణంలో మీ వాహనాల చక్రాల కింద దాక్కున్న యముడు కన్నెర్రజేసి కనికరం లేకుండా యమపాశాన్ని ప్రయోగిస్తున్నాడు. మిమ్మల్ని అడ్డుగా పెట్టుకొని ఆ యముడు మమ్మల్ని తన లోకానికి తీసుకెళ్తున్నాడు. ఎన్నటికై నా..అక్కడికే వెళ్లాల్సిందే. కానీ కొన్ని రోజులు మీ మాదిరిగానే మా తల్లిదండ్రులు, బంధువులు, ఆప్తులతో గడపాలని మాకూ కోరికగా ఉంటుంది. – నవీపేటకనికరం లేకుండా ఆత్మలేని నా(తాబేలు) దేహాన్ని భుజిస్తున్న నాతోటి జీవి కాకి విష సర్పాలమని చక్రాల కింద నలిపేశారు హమ్మయ్య.. నేను, నా(నత్త) పిల్లలు బ్రతికిపోయాం..బహుశా నా(తేలు)లో విషముందని చంపేశారేమో.. నేనేం(బూగ) పాపం చేశానని ఈ శిక్ష విధించారు నడుం కాళ్లు విరిగి నేను(కప్ప) ఎలా బతకాలి.. -
రక్తదానంతో ప్రాణదాతలవ్వండి
నిజామాబాద్అర్బన్: రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ పేర్కొన్నారు. నగరంలోని కోటగల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈవో మాట్లాడుతూ.. ప్రతి పాఠశాలలో రక్తదాన అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని రెడ్క్రాస్ సొసైటీని కోరారు. పాఠశాలలో జూనియర్ క్రాస్ను బలో పేతం చేద్దామని ఉపాధ్యాయులకు సూచించారు. 40 మంది రక్తదానం చేయడం స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో అర్బన్ మండల ఎంఈవో, కోర్స్ డైరెక్టర్ సాయిరెడ్డి, రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి కే రవీందర్, జేఆర్సీ కోఆర్డినేటర్ డాక్టర్ అబపూర్ రవీందర్, మెడికల్ ఆఫీసర్ రాజేశ్, ప్రతినిధులు ధర్మేందర్, శ్రీకాంత్, శ్రీనివాస్, వెంకట్, శ్రీనివాస్, నగేశ్, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. డీఈవో అశోక్ -
చెరువు శిఖం భూమి కబ్జా
నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని సారంగా పూర్ శివారులో చెరువు శిఖం భూముల ఆక్రమణ, అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహరం ఇటీవల వెలుగు చూసింది. 10 ఎకరాల చెరువు శిఖం భూమిలో ప్లా ట్ల దందా ప్రారంభించారు. నిజామాబాద్ – బోధన్ ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న కోట్ల రూపా యల విలువజేసే ఈ స్థలంపై అక్రమార్కుల కన్ను పడింది. దీంతో శిఖం భూమి పక్కనే ఉన్న ప్రైవేటు భూమి పట్టాను చూపుతూ కొందరు కబ్జాకు యత్నిస్తున్నట్లు తెలిసింది. కాగా, గతంలో చెరువు శిఖం భూమిని పరిశీలించిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలంగా గుర్తిస్తూ బోర్డును పెట్టారు. సర్వే నంబర్ 231లోని సుమారు 10 ఎకరాల 8 గుంటల శిఖం భూమి చుట్టూ కందకాన్ని తవ్వారు. కానీ, ఇటీవల ఓ మాజీ కార్పొరేటర్ కందకాన్ని తొలగించి శిఖం స్థలంలో ప్లాట్లు చేసి అమాయకులకు విక్రయించేందుకు యత్నిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అందులో భాగంగానే శిఖం భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలని స్థానిక నాయకులు కొందరు ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్డీవో రాజేంద్ర కుమార్ రెవెన్యూ సిబ్బందితో కలిసి చెరువు శిఖం భూమిని పరిశీలించారు. పది ఎకరాల్లో ప్లాట్ల దందా కోట్ల విలువ చేసే భూములు అన్యాక్రాంతం -
ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించాలి
కామారెడ్డి క్రైం: ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించాలని డీజీపీ జితేందర్ సూచించారు. గురువా రం ఆయన జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఎస్పీ రాజేశ్ చంద్ర పుష్పగుచ్ఛాన్ని అందించి స్వాగతం పలికారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కార్యాలయ ఆవరణలో డీజీపీ మొక్కలు నాటారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలో ని పోలీసు అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో శాంతి భద్రతల నిర్వహణ, ప్రాధాన్యమైన కేసులు, నేరాల పరిశోధన, ప్రజలకు అందిస్తున్న సేవలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ తాము సురక్షితంగా ఉన్నామన్న భావన ప్రజల్లో కలిగేలా పోలీసింగ్ ఉండాలన్నారు. ప్రతి కేసులో సమర్థవంతమైన, నిష్పక్షపాత దర్యా ప్తు జరిపి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నప్పుడే ప్రజలలో నమ్మకాన్ని పెంపొందించవచ్చన్నారు. సాంకేతికత ఉపయోగంలో దేశంలో నే తెలంగాణ పోలీసు శాఖ ప్రథమ స్థానంలో ఉందన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు హైవే అథారిటీ, రవాణా శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరస్తుల విషయంలో కఠినంగా వ్యవహరించడం, బాధితులకు అండగా నిలవడం, నేరస్తులకు శిక్ష పడేలా కేసుల విచారణ జరిపించడం తదితర అంశాల్లో జిల్లా అధికారుల పనితీరు బాగుందని ప్రశంసించారు. సమీక్షలో మల్టీ జోన్–1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, నిజామాబాద్ సీపీ సాయి చైతన్య, అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, ఏఎస్పీ చైతన్యరెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి పోలీసు అధికారులతో సమీక్షలో డీజీపీ జితేందర్సిబ్బందికి అభినందన కామారెడ్డి క్రైం: ఇటీవల డయల్ 100 కాల్స్పై తక్షణమే స్పందించిన బ్లూకోల్ట్, పెట్రో కార్ పోలీసులను డీజీపీ అభినందించారు. బాన్సువాడ ఎస్సై తాజుద్దీన్, బాన్సువాడ కానిస్టేబుల్ శంకర్, పిట్లం కానిస్టేబుల్ రవిచంద్ర, పిట్లం హోంగార్డ్ మారుతిలను అభినందించి ప్రోత్సాహకంగా నగదు బహుమతిని అందించారు.