breaking news
Nizamabad District Latest News
-
ముగిసిన ఎస్జీఎఫ్ జిల్లా జట్టు శిక్షణ శిబిరం
డిచ్పల్లి: మండలంలోని సుద్దపల్లిలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల క్రీడా మైదానంలో ఈనెల 2 నుంచి 6 వరకు నిర్వహించిన 69వ ఎస్జీఎఫ్ జిల్లా సాఫ్ట్బాల్ అండర్–14 బాలికల జట్టు శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది. పాఠశాల ప్రిన్సిపాల్ నళిని మాట్లాడుతూ.. ఈనెల 7 నుంచి 9 వరకు మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు జెడ్పీహెచ్ఎస్లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టును మొదటి స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు మర్కంటి సుజాత, గంగా మోహన్, చిప్ప నవీన్, జ్యోత్స్న, మెండె రమేశ్, మౌనిక, నర్మదా, అనికేత్, అర్చన తదితరులు పాల్గొన్నారు. తెయూ(డిచ్పల్లి): తెయూ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్, టాస్క్ సహకారంతో ఈ నెల 10, 11వ తేదీల్లో ‘ఏఐ యుగంలో విద్య’ అనే అంశం పై నిర్వహించనున్న రెండు రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంను సద్వినియోగం చేసుకోవాలని రిజిస్ట్రార్ యాదగిరి సూచించారు. శుక్రవారం తన చాంబర్లో తెయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ ఆరతి, ప్రోగ్రాం కన్వీనర్ అతిక్ సుల్తాన్ ఘోరీ తో కలిసి రిజిస్ట్రార్ ప్రోగ్రాం బ్రోచర్ను ఆవిష్కరించారు. రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. పరిశోధన, వినియోగాలలో ఏఐ ప్రాముఖ్యత, ఆధునిక విద్యా విధానంలో ఏఐ సాంకేతిక పరిజ్ఞానం, సవాళ్లు, అవరోధాలు, పరిష్కారాలు ఈ శిక్షణా కార్యక్రమంలో చర్చిస్తారని తెలిపారు. తెయూ పరిధిలోని అనుబంధ డిగ్రీ, పీజీ కళాశాలల సిబ్బంది ఈ నెల 9వ తేదీ లోపు గూగుల్ ఫారం ద్వారా తమ పేరు నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి నీలిమ, అధ్యాపకులు నందిని, భ్రమరాంబిక, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. సుభాష్నగర్: నగరంలోని ఏఐటీయూసీ కా ర్యాలయంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్లో ఎస్డబ్ల్యూఎఫ్ మాజీ నాయకుడు డీ సంజీవ్ శుక్రవారం చేరారు. ఆయనకు యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం వెంకట్ గౌడ్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై ఓమయ్య, యూనియన్ రీజినల్ కార్యదర్శి సాయిలు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వెంకట్గౌడ్, ఓమయ్య మాట్లాడుతూ.. ఆర్టీసీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవడం కోసం రాష్ట్రవ్యాప్తంగా జేఏసీ ఏర్పడిందని తెలిపారు. ఆర్టీసీలో సుమారు 20వేల ఖాళీలు ఏర్పడ్డాయని, వాటిని భర్తీ చేయాలని డిమాండ్చేశారు. రాబోయే కాలంలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని సంజీవ్ తెలిపారు. నాయకులు పీ సుధాకర్, విఠల్ గౌడ్, రాధాకుమార్ పాల్గొన్నారు. -
మల్టీపర్పస్ వర్కర్లకు వేతనాలు పెంచాలి
● సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మునిపల్లి సాయిరెడ్డి ● జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకు వినతిసుభాష్నగర్: గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు వేతనాలను రూ.15వేలకు పెంచాలని సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మునిపల్లి (ముస్కు) సాయిరెడ్డి కోరారు. ఈమేరకు జిల్లాకు విచ్చేసిన జిల్లా ఇన్చార్జి మంత్రి, పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్కను శుక్రవారం నగరంలోని ఆర్అండ్బి అతిథిగృహంలో కలిసి వినతిపత్రం అందజేశారు. సాయిరెడ్డి మాట్లాడుతూ.. మల్టీపర్పస్ వర్కర్లకు వేతనాలను జీపీ నిధుల నుంచి చెల్లించాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీచేసిందని, చిన్న గ్రామ పంచాయతీలకు వేతనాలు భారంగా మారుతున్నాయని వివరించారు. వేతనాల కోసం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి సెపరేట్గా నిధులు జమ చేయాలని విజ్ఞప్తిచేశారు. జీపీల ద్వారా వసూలు చేస్తున్న పన్నులు, ఫీజులు వంటి నిధులు జీపీ అకౌంట్లలో జమ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రికి విజ్ఞప్తిచేశారు. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు గ్రామపంచాయతీలకు విడుదల అయ్యేలా చూడాలని కోరారు. పెండింగ్ బిల్లులు, ట్రాక్టర్ ఈఎంఐలు, సానిటేషన్ పనుల ఖర్చులు జీపీలకు భారమయ్యాయన్నారు. సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మానాల మోహన్రెడ్డి, ముప్ప గంగారెడ్డి, బోర్గాం శ్రీనివాస్, సర్పంచులు పాల్గొన్నారు. -
బాలికలకు హెచ్పీవీ టీకా ఇప్పించాలి
సుభాష్నగర్: బాలికలకు హెచ్పీవీ(హ్యూమన్ పాపిల్లోమా వైరస్) టీకా ఇప్పించాలని డీఎంహెచ్వో రాజశ్రీ అన్నారు. జిల్లా కేంద్రంలోని త న కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేక రుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ నెల 8న నిర్వహించను న్న హెచ్పీవీ టీ కార్యక్రమాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభిస్తారని అన్నారు. 14 ఏళ్ల లోపు బాలికలంద రికి ఈ హెచ్పీవీ టీకాను అందించనున్నట్లు ఆమె పే ర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధి కారి డాక్టర్ అశోక్, పాలన అధికారి సుమంత్ కుమార్, డీహెచ్ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
భళా... సరస్ మేళా!
● పాత కలెక్టరేట్ గ్రౌండ్లో ప్రారంభించిన జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ● సొంత ఉత్పత్తులు, హస్త కళలను ప్రదర్శించిన ఎస్హెచ్జీ మహిళలు డొంకేశ్వర్: జిల్లా గ్రామీణ అభివద్ధి సంస్థ ఆధ్వర్యంలో పాత కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన మినీ సరస్ మేళా – 2026 ఆకట్టుకుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ మేళాకు జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి లతో కలిసి సందర్శించారు. గ్రామీణ, పట్టణ స్వయం సహాయక సంఘాలు వడ్డీలేని రుణాలు పొంది సొంతగా తయా రు చేసిన పలు ఉత్పత్తులు, వస్తువులు, వస్త్రాలను పరిశీలించారు. ఎస్హెచ్జీ మహిళలు వ్యాపారాలు చేసి తమ కాళ్లపై నిలబడి ఆర్థికాభివృద్ధికి బాటలు వేసుకోవడంపై సీతక్క సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని, మహిళా ప్రగతి – తెలంగాణ ఉన్నతి అ నే నినాదానికి సీఎం రేవంత్రెడ్డి కట్టుబడి ఉన్నారని తెలిపారు. మహిళల ఆర్థిక అభ్యున్నతికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే వడ్డీ లేని రుణాల పంపిణీ, ఉచిత ప్రమాద బీమా, లోన్ బీమా, ఆర్టీసీలో ఆద్దె బస్సులు, పెట్రో ల్ బంకులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. వ చ్చే మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కో సం తమ ప్రభుత్వం మరిన్ని కొత్త పథకాలను ప్రవేశపెట్టనుందని మంత్రి వెల్లడించారు. మహిళలు ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక స్వావలంబన సాధించాలని, వారం రోజుల పాటు జరిగే ఈ మేళాను వ్యాపారాభివృద్ధికి సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీఆర్డీవో సాయాగౌడ్, ఏపీడీ మధుసూదన్, డీపీఎంలు, ఏపీఎంలు, ఎస్హెచ్జీ మహిళలు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఉన్న వీఆర్ కాంప్లెక్స్ సెల్లార్లో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్హెచ్వో సత్యనారాయణ తెలిపారు. ఎస్హెచ్వో తెలిపిన వివరాల ప్రకారం.. కాంప్లెక్స్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. మృతుడి వయస్సు 35ఏళ్ల వరకు ఉంటుందని అన్నారు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉందన్నారు. వారం రోజుల క్రితం ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం ని మిత్తం ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్హెచ్వో తెలిపారు. కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య బాన్సువాడ రూరల్: కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బాన్సువాడ మండలం సోమేశ్వర్లో చోటు చేసుకుంది. బాన్సువాడ సీఐ తుల శ్రీధర్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ధ్యావల్ల రాములు (26) హోలీ పండుగ రోజున మద్యం తాగి భార్యతో గొడవపడి కొట్టాడు. మరుసటి రోజు సైతం భార్యను కొట్టడంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన రాములు గురువారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కుమారుడిని చంపిన తండ్రి రిమాండ్ ఇందల్వాయి: కుమారుడిని చంపిన తండ్రిని రిమాండ్కు తరలించినట్లు డిచ్పల్లి సీఐ వినోద్ తెలిపారు. పోలీస్స్టేషన్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన కొత్తగొల్ల కిషన్కు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు భాను ప్రకాశ్ గంజాయికి అలవాటు పడి తల్లితండ్రులను వేధించేవాడు. కొడుకు వేధింపులు భరించలేక కిషన్ తన కుమారుడు భానుప్రకాశ్ను గురువారం హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కుమారుడి వేధింపులు తాళలేకే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని సీఐ పేర్కొన్నారు. -
‘మాండలిక వికాసమే భాషాభివృద్ధికి సోపానం’
ఖలీల్వాడి: మాండలికి వికాసమే భాషాభివృద్ధికి మూలం అని, మన భాషలోని తెలుగు భాషకు మూలాలు ఉన్నాయని పలువురు ప్రముఖ సాహితీవేత్తలు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొరవి గోపరాజు తెలుగు విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం వికాసం వికృతి వైవిధ్యం అంశంపై ఒకరోజు జాతీయ సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఆచార్యులు బాణాల భుజంగరెడ్డి మాట్లాడుతూ.. తెలుగు భాష మూలాలు తెలంగాణ మాండలికంలోనే దాగి ఉన్నాయని పేర్కొన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రముఖ పరిశోధకులు సంగనభట్ల నర్సయ్య మాట్లాడుతూ.. తెలంగాణ భాషా పరిరక్షణకు ప్రత్యేకంగా నిఘంటువును రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రామాణిక వ్యాసాలతో రూపొందించిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త హైదరాబాద్ సిటీ కళాశాల ఆచార్యులు డాక్టర్ కోయ కోటేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి, సదస్సు కన్వీనర్ రామస్వామి, వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం, ఐకేసి కోఆర్డినేటర్ రాజేశ్, పీఆర్వో దండు స్వామి, ఏవో రామకృష్ణ, సూపరింటెండెంట్ ఉదయ్ భాస్కర్, అధ్యాపకులు, శమంత, శ్రీనివాస్ గంగాధర్ రాజేశ్వర్, రాధిక, అర్చన తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా ఇన్చార్జి మంత్రికి ఘన స్వాగతం
సాక్షి నెట్వర్క్: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక అమలుపై కలెక్టరేట్లో శుక్రవారం ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క హాజరయ్యారు. జిల్లా కేంద్రానికి వచ్చిన ఆమె ముందుగా గెస్ట్హౌస్లో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. మంత్రి సీతక్కకు కలెక్టర్ ఇలా త్రిపాఠి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. పలు అంశాలపై ఇన్చార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్రెడ్డి, షబ్బీర్ అలీ, రూరల్ఎమ్మెల్యే భూపతిరెడ్డి, నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి, కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చర్చించారు. పాల్గొన్న ఉమ్మడి జిల్లా అధికారులు -
మహిళలకు బాసటగా నిలుద్దాం
● జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ● నగరంలో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశం నిజామాబాద్అర్బన్: మనమందరం మహిళలకు మంచి అవకాశాలను ఇవ్వడమే కాకుండా వారికి బాసటగా నిలుద్దామంటూ జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మహిళలకు సమాన అవకాశాలను ఇచ్చినట్లయితే వారి నుంచి సమాజ అభివృద్ధికి ఎంతో పొందుతామన్నారు. నగరంలోని విజయలక్ష్మి గార్డెన్లో శుక్రవారం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ స మా వేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తన జీవితాన్ని ఒక ఉదాహరణగా, ఆదర్శవంతమైన మహిళగా తీర్చిదిద్దుకొనుటకు చదువు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి మహిళ కమిట్మెంట్ అండ్ కరేజ్ను కలిగి ఉండాలన్నారు. ఛాలెంజ్ లేని జీవితం చప్పడి కూర వంటిదన్నారు. పదవ తరగతి చదువుతూ విప్లవోద్యమంలో వెళ్లిన తను ఒక నక్సలైట్గా ఏ కో ర్టులో నిల్చున్నానో, అదే కోర్టు లో నేను అడ్వకేట్గా నిలిచినట్లు పేర్కొన్నారు. అనంతరం నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్ సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. అనంతరం నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కరపత్రాలను విడుదల చేశారు. సురక్ష దీప అన్న భద్రత బోర్డులను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఏర్పాటు చేయాలని సీపీ పేర్కొన్నారు. ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. మహిళలు సమాజంలో అభివృద్ధి చెందేందుకు పాటుపడాలన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మేయర్ ఉమారాణి, కౌన్సిల్ కన్వీనర్ అదనపు డీసీపీ బస్వారెడ్డి, కోశాధికారి సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి కవితరెడ్డి, సభ్యు లు కాకతీయ కళాశాల కరస్పాండెంట్ రజినీకాంత్, కామారెడ్డి ఏసీపీ చైతన్యరెడ్డి, కామారెడ్డి డీఎఫ్వో నికిత, నూడా చైర్మన్ కేశవ వేణు పాల్గొన్నారు. -
మత్స్యకారులకు నైపుణ్య పరీక్షలు
నవీపేట: మండలంలోని అబ్బాపూర్(ఎం), అభంగపట్నం గ్రామాల మధ్య ఉన్న ఎర్రుకుంట చెరువులో ఇరు గ్రామాల మత్స్యకారులకు శుక్రవారం నైపుణ్య పరీక్షలు నిర్వహించారు. వల అల్లుట, విసురువల, ఈత కొట్టుట, తెప్ప వినియోగం వంటి అంశాలపై పరీక్షలు నిర్వహించారు. పరీక్షలలో అర్హులైన వారికి లైసెన్స్ పత్రాలను జారీ చేస్తామని మత్స్యశాఖ అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్, కామారెడ్డి ఎఫ్డీవోలు లాయక్ మొయినొద్దీన్, డోలీసింగ్, జిల్లా కో–ఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ రమావతి పాల్గొన్నారు. సుభాష్నగర్: సామాజిక న్యాయాన్ని పాటించకుండా పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో బుద్ధి చెబుతామని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్ మాదిగ అన్నారు. శుక్రవారం నగరంలోని కాంగ్రెస్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రమోద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న మాదిగలకు రాజ్యసభలో సీటు కల్పించకుండా మోసం చేసినందుకు భవిష్యత్లో కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా సమాధి చేస్తామని అన్నారు. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిత్యం మాదిగలను మోసం చేస్తోందని ఆరోపించారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఏళ్లుగా వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నామని గుర్తుచేశారు. రాష్ట్రం నుంచి ఏడుగురు అగ్రకులాల నుంచి ఎంపీలుగా ఉన్నా.. సీఎం రేవంత్రెడ్డి తన సన్నిహితుడైన వేం నరేందర్రెడ్డికి రాజ్యసభ అవకాశం కల్పించారని విమర్శించారు. నేటి నుంచి 13వ తేదీవరకూ వివిధ రూపాల్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసనలు తెలుపుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎదుట నిరసన తెలుపుతున్న నాయకులను పోలీసులు దౌర్జన్యంగా తరలించడంపై వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. నాయకులు సరికెల పోశెట్టి, గంధమాల నాగభూషణం, యమున, భూమయ్య, ఆకారం రమేశ్, మహేశ్, మోహన్, సత్యం, అనిల్ తదితరులు పాల్గొన్నారు. బోధన్: బోధన్కు చెందిన ప్రముఖ కరాటే మాస్టర్ మల్లెపూల పల్లవి జాతీయ స్థాయి ఝాన్సీలక్ష్మీబాయి శౌర్య అవార్డుకు ఎంపికై ంది. హైదరాబాద్కు చెందిన వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్, వసుంధర విజ్ఞాన వికాస మండలి ప్రతి ఏటా వివిధ రంగాల ప్రతిభావంతులకు జాతీయ స్థాయి అవార్డులను అందిస్తుంది. ఈ ఏడాది పట్టణ కేంద్రానికి చెందిన కరాటే మాస్టర్ పల్లవిని అవార్డుకు ఎంపిక చేశారు. ఈ నెల 26న హైదరాబాద్లో నిర్వహించనున్న అవార్డుల ప్రధానోత్సవ వేడుకల్లో నిర్వాహకుల చేతుల మీదుగా అవార్డును అందుకోనున్నట్లు ఆమె శుక్రవారం తెలిపారు. కరాటేతో పాటు కర్ర, కత్తిసాము, గుర్రపు స్వారీ, బాక్సింగ్ విద్యలో శిక్షణ పొందినట్లు ఆమె పేర్కొన్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన కరాటే పోటీల్లో పాల్గొన్న ఆమె ప్రతిభ చాటి అనేక మెడల్స్ సాధించింది. 2022లో మార్షల్ ఆర్ట్స్ సంస్థ నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే స్పారింగ్(ఫైటింగ్) విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే లైసెన్స్ పొందిన ఏకై క మహిళా కరాటే మాస్టర్గా నిలిచింది. జాతీయ స్థాయి అవార్డుకు ఆమె ఎంపిక కావడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో పాల్గొన్న మహిళా సంఘాల సభ్యులు -
ఉమ్మడి జిల్లా విలువిద్య క్రీడాకారుల ఎంపిక
మోపాల్: మండలంలోని ఏకలవ్య ఆర్చరీ అకాడమిలో శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విలువిద్య క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు. మినీ సబ్జూనియర్ విభాగంలో జరిగిన ఎంపికలకు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి సుమారు వంద మంది క్రీడాకారులు హాజరయ్యా రు. పోటీలను అర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్లోని పటాన్చెరువులో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఈ నెల 8న రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలు ఉంటాయన్నారు. రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. జిల్లా నుంచి పోటీ పడే క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా తీర్చిదిద్దాలని నిర్వాహకులకు సూచించారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికై న క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో కోచ్ ఎన్ రవీందర్, ప్రతినిధులు ప్రతాప్దాస్, రవీందర్, మురళి, పీరియా, జైత్రం, నవనీత్రెడ్డి, సంజీవ్రెడ్డి క్రీడాకారులు పాల్గొన్నారు. -
న్యాయవాద వృత్తికి ఉజ్వల భవిష్యత్తు
● రిటైర్డ్ రిజిస్ట్రార్ హైకోర్టు ఆఫ్ తెలంగాణ రఘురామ్ తెయూ(డిచ్పల్లి): సమాజంలో న్యాయవాద వృత్తికి ఉజ్వల భవిష్యత్తు, గౌరవం ఉందని రిటైర్డ్ రిజిస్ట్రార్ హైకోర్టు ఆఫ్ తెలంగాణ, రిటైర్డ్ స్పెషల్ జడ్జి ఫర్ ట్రయల్ కోర్డు ఆఫ్ సీబీఐ టీ రఘురామ్ పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీ న్యాయ కళాశాలలో ‘లే మాన్ టు లా మాన్’ అనే అంశంపై నిర్వహించిన కాలోక్వియంలో రఘురామ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. న్యాయ విద్యార్థులకు న్యాయవాద వృత్తిలో ఎన్నో అవకాశాలు లభిస్తాయన్నారు. న్యాయ వ్యవస్థలో క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధతతో బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. సమాజంలో న్యాయ స్థాపనకు న్యాయ విద్యార్థులు కృషి చేయాలన్నారు. న్యాయవాద వృత్తి ఎంచుకున్న తర్వాత తమ క్లయింట్లతో పాటు న్యాయస్థానాల్లో ఎలా మెలగాలనే విషయాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో లా కాలేజ్ ప్రిన్సిపాల్, హెచ్వోడీ డాక్టర్ ప్రసన్నరాణి, మాజీ ప్రిన్సిపాల్ జెట్లింగ్ ఎల్లోసా, బీవోఎస్ చైర్మన్ స్రవంతి, లా విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ఆవరణలో అగ్నిప్రమాదం
● ఎగిసి పడిన మంటలు నిజామాబాద్అర్బన్: నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం భారీ మంటలు ఎగిసిపడ్డాయి. ఓ శానిటేషన్ కార్మికుడు కలెక్టరేట్ ప్రాంగణంలోని వాహనాల పార్కింగ్ వద్ద జనరేటర్ స మీపంలో చెత్త కుప్పకు నిప్పు పెట్టాడు. అది కాస్త గాలికి పక్కనే ఉన్న ముళ్లపొదలు, చెత్తకు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. జనరేటర్ నుంచి కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ వెనుక వైపు మంటలు వేగంగా వ్యాపించాయి. టాయిలెట్ గదుల వెంబడి ఉన్న ఎండిపోయిన చెట్ల పొదలకు మంటలు అంటున్నా యి. ట్రాన్స్పార్మర్ వైర్లు కాలిపోయాయి. సమీపంలోనే వివిధ శాఖలకు సంబంధించిన కార్లు పార్కింగ్ చేసి ఉండడంతో అప్రమత్తమైన సిబ్బంది కార్లను అక్కడి నుంచి తీసివేయించారు. గంటన్నర పాటు పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. అదే సమయంలో కలెక్టరేట్లో జరుగుతున్న సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఉండడంతో అధికారులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. -
టెన్త్ ఫలితాల్లో టాప్ ఫైవ్లో ఉంటాం!
సాక్షి: ఉత్తమ ఫలితాల కోసం తీసుకుంటున్న చర్యలు డీఈవో: విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో స్పెషల్ క్లాసులు బోధిస్తున్నాం. టీచర్ల కొరత ఉన్న చోట గెస్ట్ టీచర్లను నియమించాం. సర్దుబాటు ద్వారా అవసరం ఉన్నచోట టీచర్లను నియమించి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాం. విద్యార్థులకు ఇప్పటికే కరదీపికలను పంపిణీ చేపట్టి రివిజన్ చేస్తున్నాం. ఏ, బీ, సీ గ్రూపులుగా చదువులు కొనసాగిస్తున్నాం. వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యం. ● విద్యార్థులకు స్నాక్స్ ● ప్రత్యేక తరగతుల నేపథ్యంలో విద్యార్థులు అలసిపోకుండా స్నాక్స్ అందించేందుకు చర్యలు చేపట్టాం. పరీక్షల కోసం విద్యార్థులను మానసికంగా దృఢంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ● కాపీయింగ్ నివారణకు● ఎట్టి పరిస్థితిల్లో కాపీయింగ్ ఆస్కారం లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. టీచర్లు ఎవరు విద్యార్థులను కాపీయింగ్కు ప్రోత్సహించవద్దు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం. ● ఈసారి ఎన్నో స్థానం ● గతేడాది పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో 96.62 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలో 16వ స్థానం వచ్చింది. ఈసారి జరిగే పరీక్షల్లో వంద శాతం విద్యార్థుల ఉత్తీర్ణతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. రాష్ట్రస్థాయిలో ఐదవ స్థానం లోపల ఉండాలని ప్రయత్నిస్తున్నాం. ● పరీక్షలకు విద్యార్థుల హాజరు ● పదో తరగతి పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 144 కేంద్రాలను ఏర్పాటు చేశాం. జిల్లా వ్యాప్తంగా 24,399 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ● పరీక్షల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలు ● పరీక్షల నిర్వహణ కోసం 144 మంది చొప్పున సీఎస్, డీవోలను, 27 మంది కస్టోడియన్లను, నలుగురు అడిషనల్ డిపార్ట్మెంటల్ అధికారులను నియమించాం. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, వైద్య సేవలు, బెంచీలు ఏర్పాటు చేశాం. విద్యార్థులకు మీరిచ్చే సలహాలు పరీక్షలకు వారం రోజుల వరకు సమయం ఉంది. ఈ సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. మాస్ కాపీయింగ్పై ఆధారపడొద్దు. సెల్ఫోన్లు, టీవీలు, సోషల్ మీడియాను వినియోగించవద్దు. పరీక్ష కేంద్రానికి సమయానికి చేరుకోవాలి. విద్యార్థులు మానసికంగా ఆందోళన చెందకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఏవైన సందేహాలు ఉంటే టీచర్లను, ఎంఈవో కార్యాలయ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలి.పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో గతేడాది కంటే ఈసారి జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధించి, రాష్ట్రంలో టాప్ ‘5’లో నిలుస్తామని డీఈవో అశోక్ కుమార్ అన్నారు. ఇందుకోసం చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వారిని పరీక్షలకు సిద్ధం చేస్తున్నామన్నారు. కొన్ని రోజుల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం ‘సాక్షి’ నిర్వహించిన ఇంటర్వ్యూలో పలు అంశాలను డీఈవో వివరించారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 15 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు ఆలస్యంగా వెళ్తే ఐదు నిమిషాలు వెసలుబాటు కల్పించినట్లు చెప్పారు. – ఖలీల్వాడి చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ మాస్ కాపీయింగ్కు ప్రోత్సహిస్తే క్రిమినల్ కేసులు ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఈవో అశోక్ కుమార్ -
అమలులో ఉమ్మడి జిల్లాను ముందంజలో నిలుపుదాం
నిజామాబాద్అర్బన్: పల్లెలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి కోసం, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. కార్యక్రమం అమలులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను ముందంజలో నిలపాలని సూచించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. వివిధ శాఖల వారీగా పరిసరాల శుభ్రత, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, అరైవ్–అలైవ్, సంక్షేమం, పిల్లల భద్రత, డ్రగ్స్ కట్టడి, రైతు సంక్షేమం, వ్యవసాయం, విద్య, యువత, క్రీడలు, మహిళలు, పర్యావరణం అంశాలలో నిర్దేశిత లక్ష్యం మేరకు ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా విజయవంతం అయ్యేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉద్యోగులు ప్రగతి ప్రణాళిక అమలులో క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేస్తూ, ప్రజలకు జవాబుదారీగా పారదర్శకతతో విధులు నిర్వర్తించాలన్నారు. ప్రణాళిక అమలు ద్వారా ఆయా శాఖల్లో స్పష్టమైన మార్పు కనిపించేలా అంకిత భావంతో పని చేయాలన్నారు. కార్యక్రమం పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ను వినియోగించాలని ఉమ్మడి జిల్లా అధికారులకు సూచించారు. ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్రెడ్డి, షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ప్రగతి ప్రణాళిక అమలులో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలన్నారు. ప్రభుత్వ సౌకర్యాలు, పథకాలను ప్రజలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా అవగాహన పెంపొందించాలన్నారు. కేంద్రం ద్వారా సమకూరే నిధులతో చేపట్టాల్సిన పనులను సకాలంలో పూర్తి చేయించేలా చొరవ చూపాలన్నారు. వేసవిలో ఎక్కడ కూడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగానే ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ సలహాదారులు, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఇలా త్రిపాఠి, ఆశిష్ సంగ్వాన్లు ప్రగతి ప్రణాళిక అమలుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక గురించి ఆయా శాఖలు, అంశాల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముగ్గురు దివ్యాంగులకు మంత్రి సీతక్క ల్యాప్టాప్లు అందజేశారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, నగర మేయర్ ఉమారాణి, నుడా చైర్మన్ కేశ వేణు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, సీపీ సాయిచైతన్య, ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, డీఎఫ్వోలు వికాస్ మీనా, నిఖిత, ఏసీపీ చైతన్య రెడ్డి, ఉమ్మడి జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ చైర్పర్సన్లు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి అనసూయ నగరంలో ఉభయ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సన్నాహక సమావేశం -
పది విద్యార్థి.. జాగ్రత్త మరి..
ఖలీల్వాడి: పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం అవుతున్నారు. పాఠశాలల్లో పున:శ్చరణ, రోజువారీ సాధన, డైలీ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలు ఈనెల 14 నుంచి జరగనున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులకు ప్రతి నిమిషం కీలకమేనని, ఇంటి వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని విద్యారంగ, వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్నారు. ● విద్యార్థులు ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ● విద్యార్థులు రాత్రి 8 గంటలకే నిద్ర పోవాలని టీచర్లు సూచిస్తున్నారు. ● పరీక్షల వేళ విద్యార్థులను ఇంటి పనులకు దూరంగా ఉంచడం ఎంతోమేలు. ఫలితాలపై ప్రభావం చూపకుండా జాగ్రత్త వహించాలి. ● విద్యార్థులకు పోషకాహారం అత్యంత కీలకమైంది. పరీక్షలకు సిద్ధం కావాలన్నా, రాయాలన్నా బలం అవసరం అవుతుంది. ఆకు కూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, సోయా గింజలు, పెరుగు, పాలు, ఉడకబెట్టిన గుడ్డు, మాంసాహారులైతే చేపలు, చికెన్ వంటివి తీసుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అలసటగా ఉంటే నిమ్మకాయను నీటిలో కలుపుకొని తాగాలి. పరీక్షలు అయ్యేంత వరకు బయట ఆహారం తీసుకోరాదు. ● విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఆకుల విశాల్ తెలిపారు. ఈనెల 14 నుంచి ఎస్సెస్సీ పరీక్షలు సన్నద్ధతకు ప్రతి నిమిషం కీలకం ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడి దూరం ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి కుటుంబ సభ్యులూ ప్రత్యేక దృష్టి పెట్టాలి -
బీజేపీకి ప్రజలే బాస్
● మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ● మాధవనగర్లో బీజేపీ కౌన్సిలర్, కార్పొరేటర్ల ఆత్మీయ అభినందన సభ నిజామాబాద్ రూరల్: బీజేపీ అంటేనే క్రమశిక్షణ పార్టీ అని, ఇందులో ఎవరు బాస్లు కాదు ప్రజలే బాస్లు అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తామన్నారు. ప్రజలు పదేళ్లు కేసీఆర్ పా లన చూసి బొంద పెట్టారన్నారు. రెండు సంవత్సరాలు పాలించిన రేవంత్ ప్ర భుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. మాధవనగర్లోని క మ్మ సంఘంలో శుక్రవారం నిజామాబాద్పార్లమెంట్ పరిధిలో నూతనంగా ఎన్నికై న బీజేపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ఆత్మీయ అభినందన సభ నిర్వహించా రు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ ప ద్ధతి ప్రకారం నడుచుకునే నాయకుడని, రాష్ట్ర సాధ న కోసం ధర్మరాజు పాత్ర పోషించారన్నారు. అంతుకుముందు ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. తెలంగాణలో హుందాగా ఉన్న ఏకై క నాయకుడు ఈటల రాజేందర్ అని, ఆయనతో కలిసి రా ష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెస్తామన్నారు. ప్ర జాస్వామ్యంలో వ్యాపారం చేయడం సరికాదు, అందుకే నిజామాబాద్ మేయ ర్ పదవిని వదులుకున్నామన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజ లు బీజేపీకి నైతికంగా పట్టం కట్టారన్నారు. ప్రజల కు సేవలందిస్తే నేతలకు రాజకీయ పరంగా భవిష్య త్తు ఉంటుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన ప్రాధాన్యత ఇస్తామన్నారు. పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలంతా బీజేపీ వైపు ఉన్నారన్నారు. బల్దియా ఎన్నికల్లో బీజేపీ తరఫున నిలబడినందుకు ఇందూ రు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అ నంతరం ఎంపీలు రాజేందర్, అర్వింద్, ఎమ్మెల్యే ధ న్పాల్ సూర్యనారాయణలను గజమాలతో సన్మా నించారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లను సన్మానించా రు. రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లావణ్య, శ్రీకాంత్రెడ్డి, జగిత్యా ల జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు, జిల్లా ప్రబారి కాంతారావు, కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా దాటిన పెద్దపులి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉత్తర తెలంగాణలో పెద్ద పులి సంచారం కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఈ పులి గత కొన్ని నెలలుగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట, భువనగిరి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో సంచరిస్తోంది. పెద్ద పులి తాజాగా శుక్రవారం మళ్లీ నిజామాబాద్ జిల్లా నుంచి జగిత్యాల జిల్లా మల్యాల అటవీ ప్రాంతం మీదుగా సిరిసిల్ల జిల్లా చందుర్తి అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. చందుర్తి అటవీ ప్రాంతం సమీపంలో పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు. పులి ఈ నెల 3వ తేదీన సిరిసిల్ల జిల్లా మీదుగా నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి అటవీ రేంజ్లోని గట్టుపొడిచినవాగు వద్దకు వచ్చింది. ట్రాప్ కెమెరాకు చిక్కింది. తోడు కోసం వెతుక్కుంటూ తిరుగుతున్న ఈ పులి మళ్లీ వచ్చిన దారిలోనే వెళ్లింది. అయితే ఈ పెద్ద పులి కామారెడ్డి జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలు సైతం ఉన్నట్లు అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో చుట్టుపక్కల జిల్లాలకు చెందిన అటవీ అధికారులు ఈ పులికి ఎలాంటి హాని కలుగకుండా ఉండేందుకు గాను అన్ని అటవీ రేంజ్ల పరిధి లో పెట్రోలింగ్ మరింత ముమ్మరం చేశారు. పులిని జాగ్రత్తగా సంరక్షించే అంశం అటవీ శాఖకు పెద్ద సవాల్గా మారింది. అటవీ శాఖకు అతిపెద్ద సవాల్.. గత ఏడాది జూలైలో పెద్ద పులిపై విషప్రయోగం జరిగిన ఘటన నేపథ్యంలో ఈ పులికి సైతం అలాంటి హాని జరుగకుండా చూసేందుకు గా ను అటవీ శాఖ అధికారులు, సిబ్బంది అత్యంత పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. చుట్టుపక్కల అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. విషప్రయోగం జరుగకుండా, వేటగాళ్ల బారిన పెద్ద పులి పడకుండా, వ్యవసాయ క్షేత్రాల వద్ద, అటవీ భూముల్లో ఏమైనా తీగలు, ఉచ్చులు పెట్టి ఉంటే వాటిని గుర్తించి తొలగించేందుకు గాను అటవీ అధికారులు, సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో టెన్షన్ పడుతున్నారు. పెద్ద పులి బారిన పడకుండా ఉండాలని అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉండే గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూనే దాన్ని రక్షంచేందుకు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా పులి జనావాసాల్లోకి వస్తేనే, మనుషులపై దాడి చేస్తేనే.. వైల్డ్ లైఫ్ బోర్డు నుంచి పూర్తి స్థాయి అనుమతులు తీసుకుని మాత్రమే పట్టుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప దాన్ని పట్టుకునే ప్రయత్నం ఏమాత్రం చేయకూడదు. పెద్ద పులికి ఎలాంటి హాని తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ఉన్న నేపథ్యంలో అటవీశాఖకు అతిపెద్ద సవాల్గా మారింది.ఆ పులి ఆచూకీ మిస్టరీ 2025 జూలై నెలలో కామారెడ్డి జిల్లాలోకి మరో పెద్ద పులి ప్రవేశించి అటవీ ప్రాంతా ల్లో తిరుగాడింది. ఈ క్రమంలో సదరు పులి మాచారెడ్డి రేంజ్ పరిధిలో ఓ ఆవును చంపేసింది. పులి మళ్లీ ఆవు మాంసం తినేందు కు వస్తుందనే ఆలోచనతో కొందరు సదరు ఆవు కళేబరంపై విషం చల్లారు. అటవీ అధికారులు విషప్రయోగం చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి రిమాండ్కు పంపారు. అయితే ఆ పులి తరువాత కనిపించకుండా పోయింది. దీంతో ఆ పులి మరణించిందా లేక మరోవైపు వెళ్లిందా అనే విషయ మై ఇప్పటికీ ఆనవాళ్లు లేకుండా పోవడం పట్ల అనేక అనుమానాలకు తావిచ్చింది. ఆ పులి ఆచూకీ మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. మళ్లీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశం సిరిసిల్ల జిల్లా చందుర్తి ప్రాంతంలో పాదముద్రల గుర్తింపు కామారెడ్డి జిల్లా అటవీప్రాంతంలోకి వచ్చే అవకాశాలు పెద్ద పులి రక్షణే అటవీశాఖకు సవాల్ గత జూలైలో కామారెడ్డి జిల్లాలో పులిపై విషప్రయోగం నేపథ్యంలో టెన్షన్ -
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
పెర్కిట్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఆలూరు మండలం దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం సా యంత్రం తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో డ్యూటీ డాక్టర్ రక్షిత అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించకుండా, స రైన వివరాలు అందించని ఏఎన్ఎం పద్మలత తీరును తప్పుబడుతూ, షోకాజ్ నోటీ సు జారీ చేయాలని డీఎంహెచ్వోను ఆదేశించారు. అన్ని రకాల మందులు అందుబాటు లో ఉన్నాయా అని ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. 289 మంది విద్యార్థుల గైర్హాజరు ఖలీల్వాడి: జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. శు క్రవారం నిర్వహించిన సెకండియర్ మ్యాథ్స్ –2బీ, జువాలజీ, హిస్టరీ, ఒకేషనల్ పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. మొత్తం 14,761 మందికి 14,472 మంది 289 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైనట్లు ఆయన పే ర్కొన్నారు. జిల్లాలో మొత్తం 58 కేంద్రాల్లో పరీక్షలు కొనసాగుతుండగా 47 కేంద్రాలను తనిఖీ చేసినట్లు డీఐఈవో తెలిపారు. తేలిన మల్లన్న గుడి డొంకేశ్వర్(ఆర్మూర్): గోదావరి నీటిలో మునిగిన మల్లన్న గుడి బయటకు తేలింది. డొంకేశ్వర్ మండలం జీజీ నడ్కుడ పాత గ్రామంలోని మల్లన్న ఆలయం వర్షాకాలంలో ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో ముంపునకు గురైంది. పంటల సాగు కోసం లిఫ్టులు, ప్రాజెక్టు ద్వారా నీళ్లు విడుదల చేస్తుండడంతో ప్రస్తుతం ఆలయం బయటకు తేలింది. ఈసందర్భంగా గ్రామస్తులు శుక్రవారం వెళ్లి పూజలు నిర్వహించారు. -
కిసాన్ క్లాత్ షోరూంలో సమ్మర్ స్పెషల్ కాంబో
నిజామాబాద్ రూరల్: నగరంలోని కిసాన్ క్లాత్ యాజమాన్యం సమ్మర్ స్పెషల్ కాంబో ఏర్పాటు చేసింది. శుభకార్యాలను పురస్కరించుకొని కిసాన్ కల్యాణ ఆఫర్ల జాతర కొనసాగుతోంది. కిడ్స్వేర్, మెన్స్వేర్, మహిళలు, యువతులకు సమ్మర్ స్పెషల్ కాటన్ దుస్తువులను అతి తక్కువ ధరలో వినియోగదారులకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి కొనుగోలుపై బహుమతులను అందిస్తున్నట్లు తెలిపారు. కిసాన్ క్లాత్ షోరూంలో ప్రస్తుతం ఆఫర్ల సందర్భంగా బట్టలను కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది మక్కువ చూపుతున్నారు. కిసాన్ అందిస్తున్న ఆఫర్లను వినియోగదారులు సద్వినిమోగం చేసుకోవాలని కిసాన్ క్లాత్ నిర్వాహకులు కోరారు. -
నర్సరీ మొక్కల పరిశీలన
జక్రాన్పల్లి: మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో నర్సరీలోని మొక్కలను సర్పంచ్ చింత ప్రియాంక గురువారం పరిశీలించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు పెంచాలని సూచించారు. నాయకులు చింత మహేశ్, గంగాధర్ తదితరులు ఉన్నారు. డిచ్పల్లి: మండలంలోని నర్సింగ్పూర్ గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీలక్ష్మీ నర్సింహస్వామి వారి కల్యాణ మహోత్సవం శుక్రవారం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సబ్యులు, గ్రామ పెద్దలు గురువారం తెలిపారు. మధ్యాహ్నం స్వామి వారి కల్యాణం, భక్తులకు అన్నదానం, సాయంత్రం రథోత్సవం ఉంటుందని అన్నారు. -
కంచెట్టిని పరామర్శించిన ఎమ్మెల్యే
డిచ్పల్లి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, డిచ్పల్లి మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి గురువారం సాయంత్రం మండల కేంద్రంలోని కంచెట్టి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ రాంచందర్గౌడ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గొట్టిపాటి వాసుబాబు, డీసీసీ డెలిగేట్ ధర్మాగౌడ్, శ్యాంసన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. -
పిల్లల భవిష్యత్తును పాడు చేయొద్దు
● పోలీస్ కమిషనర్ సాయిచైతన్య సుభాష్నగర్: వేశ్య వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగించవద్దని, తమ పిల్ల లు కూడా ఈ వృత్తిని ఎంచుకొని వారి బంగారు భవిష్యత్ను పాడు చేసుకోకుండా చూసే బాధ్యత తల్లిదండ్రులపై ఉందని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య అన్నారు. గురువారం నగరంలోని ఖలీల్వాడిలో ఉన్న స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ టార్గెట్ ఇంటర్వేన్షన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా సెక్స్ వర్కర్ల హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ.. తప్పనిసరి పరిస్థితుల్లో వేశ్య వృత్తి ఎంచుకుని తమ కుటుంబాన్ని పోషించుకున్నారని తెలిపారు. కానీ ఇదే వృత్తిపై ఆధారపడి జీవనం పూర్తిగా కొనసాగించవద్దని సూచించారు. ఈ తరంతో వృత్తికి స్వస్తి పలకాలని, భవిష్యత్తరాలకు పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు. తమ పిల్లలు కూడా ఈ వృత్తిని ఎంచుకొని వారి బంగారు భవిష్యత్ను పాడు చేసుకోకుండా చూసే బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుందన్నారు. పోలీస్శాఖ మహిళ సెక్స్ వర్కర్ల హక్కులు, వారి జాగ్రత్తల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. సెక్స్ వర్కర్లకు ప్రత్యేక హక్కులు ఉన్నాయని, హక్కుల కోసం పోలీస్శాఖ, షీ టీమ్, భరోసా సెంటర్ అందుబాటులో ఉందన్నారు. అనంతరం విశేష సేవలు అందించిన సిబ్బంది, ఎడ్యుకేటర్లు, మహిళా సెక్స్ వర్కర్లను జిల్లా సంక్షేమాధికారి పద్మ అనిల్తో కలిసి సీపీ సన్మానించారు. కార్యక్రమంలో స్నేహ టీఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ సిద్ధయ్య, జిల్లా వయోజన విద్య సహాయ సంచాలకులు పురుషోత్తం, మానసిక వైద్యనిపుణులు డాక్టర్ ఏ వికాస్, డీపీఎం సుధాకర్, సీపీవో మొయిజ్ అహ్మద్, సఖీ సెంటర్ అడ్మినిస్ట్రేషన్ అధికారి భానుప్రియ, స్నేహ సొసైటీ గవర్నింగ్ బాడీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. -
డాక్టర్ కాసర్లకు ధర్మనిధి పురస్కారం
నిజామాబాద్ రూరల్: తెలంగాణ సారస్వత పరిషత్, హైదరాబాద్ వారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అందించే ‘ధర్మ నిధి పురస్కారం’ 2026వ సంవత్సరానికి ఇందూరు కవి డాక్టర్ కాసర్ల నరేశ్ రావుకి అందజేయనున్నట్లు పరిషత్ ప్రధాన కార్యదర్శి జే చెన్నయ్య తెలిపారు. సాహిత్య రంగంలో విస్తృతమైన సేవలు నిరంతరం అందిస్తున్న వారికి ఈ పురస్కారాన్ని ప్రతిఏటా పరిషత్ వారు అందజేస్తున్నారు. దీంట్లో భాగంగా గత 30 ఏళ్లుగా ఇందూరు జిల్లా సాహిత్య రంగంలో నిత్య కవిగా, రచయితగా, వ్యాఖ్యాతగా, బాల సాహిత్య వేత్తగా రాణిస్తున్న కాసర్లకు ఈ ఏడాది పురస్కారం వరించింది. ఈనెల 17న హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్ లో అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఇతర సాహిత్య వేత్తల చేతుల మీదుగా అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సాహిత్య ధర్మనిధి పురస్కారాన్ని అందుకోనున్న కవి కాసర్లను ఇందూరు జిల్లా కవులు వీపీ చందనరావు, పంచరెడ్డి లక్ష్మణ, తల్లా వజ్జల మహేశ్ బాబు, డాక్టర్ గణపతి అశోక శర్మ, డాక్టర్ తంగుడిగె ఫణీంద్ర, వారె దస్తగిరి, ప్రవీణ్ కుమార్ శర్మ, నాగుల రాజేందర్, అష్ట గంగాధర్ తదితరులు అభినందించారు. సుభాష్నగర్: హైదరాబాద్లోని గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్తోపాటు నూతనంగా ఎన్నికై న గిరిజన ఆదివాసీ చైర్మన్ శంకర్ నాయక్ను నిజామాబాద్ ఆదివాసీ చైర్మన్ కెతావత్ యాదగిరి నాయక్ గురువారం శాలువాతో సన్మానించారు. అంతకుముందు ఆదివాసీ గిరిజన విభాగం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, పోడు భూములపై హక్కులు, చేవెళ్ల డిక్లరేషన్పై సుదీర్ఘంగా చర్చించారు. గిరిజన, ఆదివాసీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఈ అంశాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో చర్చించినట్లు కెతావత్ యాదగిరి నాయక్ తెలిపారు. సమావేశంలో మాజీ ఎంపీటీసీ వెంకట్రాం నాయక్, బానోత్ రవీందర్, తదితరులు జిల్లా నుంచి పాల్గొన్నారు. -
కాంగ్రెస్తోనే గ్రామాల అభివృద్ధి
● నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి మోపాల్: గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి అన్నారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధులతో నిర్మించనున్న మండలంలోని కాస్బాగ్ తండా గ్రామపంచాయతీ భవనానికి గురువారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ.. రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన పథకాల వల్లే గ్రామాల్లో ప్రజలు కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించారని గుర్తుచేశారు. పేదోడి సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చుతోందని, ఒక్కో ఇందిరమ్మ లబ్ధిదారుడికి రూ.5లక్షలు ఇస్తుందని తెలిపారు. పదేళ్లలో బీఆర్ఎస్ ఒక్క ఇల్లు, రేషన్కార్డు ఇవ్వలేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో 25లక్షలకుపైనే రేషన్కార్డులు మంజూరు చేసిందన్నారు. గ్రామాల్లో ఏమైనా సమస్యలుంటే ఎమ్మెల్యే భూపతిరెడ్డి దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ సదాసింగ్, ఉపసర్పంచ్ కమలాజీ, ఎంపీడీవో రాములు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు యెల్లోళ్ల సాయిరెడ్డి, నాయకులు సద్మల రాములు, పంచాయతీరాజ్ ఏఈ, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు. -
బలమైన విప్లవోద్యమాలను నిర్మిద్దాం
సిరికొండ: విప్లవపంథా కోసం చివరిదాకా పోరాడిన రవన్న స్ఫూర్తితో బలమైన విప్లవోద్యమాలను నిర్మిద్దామని సీపీఐఎంఎల్ మాస్లైన్(ప్రజాపంథా) రాష్ట్ర సెక్రెటేరియట్ సభ్యుడు వీ ప్రభాకర్ అన్నారు. మండలంలోని గడ్కోల్ గ్రామంలో రాయల రవన్న 10వ వర్ధంతి సభ వాల్ పోస్టర్లను పార్టీ నాయకులతో కలిసి ప్రభాకర్ గురువారం ఆవిష్కరించారు. ఈనెల 10న హైదరాబాద్లో నిర్వహించే 10వ వర్ధంతి సభను విజయవంతం చేయాలని కోరారు. రవన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ నాయకుడిగా సుదీర్ఘకాలం రహస్యంగా పని చేసి మృతి చెందాడన్నారు. 40 ఏళ్లు అజ్ఞాత జీవితం గడిపి దేశ భౌతిక పరిస్థితులకు అనుగుణంగా విప్లవపంథా ఉండాలని, విప్లవకారులు ఐక్యంగా పని చేయాలని, తన ఊపిరి ఉన్నంత వరకు విప్లవోద్యమ నాయకుడిగా పని చేశారని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు పిట్ల రామకృష్ణ, జిల్లా నాయకులు ఆర్ రమేశ్, ఆర్ దామోదర్, బాబన్న, కిశోర్, అనీస్, సాయారెడ్డి, లింబాద్రి, నారాగౌడ్, రమేశ్, బాల్రెడ్డి, రమ, పుష్పలత, స్వప్న, కిశోర్, నరేశ్, ఆశీష్, ఆశన్న, పోశన్న తదితరులు పాల్గొన్నారు. -
కూలేందుకు సిద్ధంగా..
సిరికొండ: మండలంలో ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరింది. సిరికొండ మండల కేంద్రం నుంచి కామారెడ్డి వెళ్లే మార్గంలో ఉన్న గోప్య తండా వద్ద కొండాపూర్ ఊర చెరువు అలుగు వాగుపై నుంచి ప్రధాన రహదారి వెళ్తుంది. ఈ వాగుపై సుమారు 35 ఏళ్ల క్రితం బండ రాళ్లతో వంతెనను నిర్మించారు. వంతెన నుంచి వాగు బాగా లోతుగా ఉంటుంది. వంతెన నిర్మించి చాలా ఏళ్లు గడుస్తుండటంతో వాగు ప్రవాహానికి వంతెన అడుగు భాగం దెబ్బతింటోంది. వంతెనను నాటి సాంకేతికతకు అనుగుణంగా బండ రాళ్లతో నిర్మించారు. వరద ఉధృతికి ప్రతి ఏటా వంతెన అడుగు భాగంలో కోతకు గురవుతు రాళ్లు పడిపోతున్నాయి. వంతెన పైభాగంలో కూడా స్లాబ్ ధ్వంసమైంది. సిరికొండ మండలంతో పాటు మోర్తాడ్, కమ్మర్పల్లి, భీంగల్ మండలాలకు చెందిన ప్రజలు హైదరాబాద్ వెళ్లేందుకు ఈ మార్గాన్నే వినియోగిస్తారు. ఈ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చడంతో నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా మారింది. రోడ్డు డబుల్గా ఉండి వంతెన సింగిల్ రోడ్డుతో ఉండటంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వంతెనకు ఇరు పక్కల ఉన్న రెయిలింగ్ కూడా దెబ్బతింది. రెయిలింగ్ లేకపోవడంతో రాత్రి వేళలో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారిపై శిథిలావస్థకు చేరిన వంతెన స్థానంలో నూతన వంతెన నిర్మాణం చేపట్టాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు. కామారెడ్డికి వెళ్లే రోడ్డులో కొండాపూర్ వాగుపై ఉన్న వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరింది. వంతెనపై స్లాబ్ ధ్వంసమై గుంతలు ఏర్పడ్డాయి. రెయిలింగ్ విరిగిపోయింది. వంతెన పైనుంచి ప్రయాణం ప్రమాదకరంగా మారింది. వంతెన శిథిలావస్థకు చేరడంతో ఇబ్బందులు పడుతున్నాం. – కిరణ్, గ్రామస్తుడు, గడ్కోల్ వంతెనను చాలా ఏళ్ల క్రితం ని ర్మించారు. వంతెన అడుగు భా గంలో రాళ్లు ఊడిపోతున్నా యి. ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితిగా మారింది. ఈ రోడ్డును డబుల్ రోడ్డుగా చేయడంతో రద్దీ ఎక్కువైంది. శిథిలావస్థకు చేరిన వంతెన స్థానంలో నూతన వంతెన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి. – రహీం, గ్రామస్తుడు, కొండాపూర్ శిథిలావస్థకు చేరిన కొండాపూర్ వంతెనతో అవస్థలు గోప్యతండా వద్ద కొన్నేళ్ల క్రితం నిర్మాణం దెబ్బతిన్న వంతెన అడుగుభాగం పట్టించుకోని అధికారులు -
సంక్షిప్తం
నియామకం సుభాష్నగర్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్ రాష్ట్ర కో చైర్మన్గా డాక్టర్ విశాల్ ఆకుల నియమితులయ్యారు. ఆయన ఏడాదిపాటు కో చైర్మన్గా కొనసాగనున్నారు. డాక్టర్ విశాల్ రాష్ట్రంలో వైద్యరంగాభివృద్ధి, యువ వైద్యుల ప్రోత్సాహం, ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వైద్య సమాజానికి సేవలందిస్తున్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పీ కిషన్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వీ అశోక్, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి డాక్టర్ టీ దయాల్సింగ్కు విశాల్ కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఎల్లప్పుడూ మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందిస్తున్న డాక్టర్ ఈ రవీంద్రరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తోటి వైద్యులు, మిత్రులు విశాల్ను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 26 మందికి జరిమానా నిజామాబాద్ అర్బన్: మద్యం తాగి వాహనాలు నడిపిన 26 మందికి జరిమానా, ముగ్గురికి జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్అలీ గురువారం తెలిపారు. ఇటీవల నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో వారు పట్టుబడ్డగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చినట్లు పేర్కొన్నారు. విచారణ చేపట్టిన జడ్జి 26 మందికి రూ.10వేల చొప్పున జరిమానా విధించగా, ముగ్గురికి జైలుశిక్ష విధించినట్లు ఏసీపీ తెలిపారు. ట్రంప్ దిష్టిబొమ్మ దహనం నిజామాబాద్ రూరల్: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ (ప్రజాపంథా) జిల్లా కమిటీ నాయకులు గురువారం ధర్నా చౌక్ వద్ద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ.. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎం నరేందర్, ఎం వెంకన్న, డీ రాజేశ్వర్, ఎం సుధాకర్, కే గంగాధర్, బీ మల్లేశ్, బీ మురళి, సంధ్యారాణి, గణేశ్, సాయిబాబా, సాయారెడ్డి, లక్ష్మణ్, విఠల్, మోహన్, చరణ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. పరీక్ష అట్టల పంపిణీ మోపాల్: తెలంగాణ టీచర్స్ యూనియన్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో మండలంలోని మంచిప్ప, మోపాల్, సిర్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదోతరగతి చదువున్న విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులను గురువారం పంపిణీ చేశారు. ఈసందర్భంగా టీటీయూ జిల్లా అధ్యక్షుడు లాటికర్ రాము మాట్లాడుతూ.. విద్యార్థులు ఉపాధ్యాయులు అందించే సలహాలు, సూచనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఎంలు గేమ్సింగ్, ప్రసాద్, సత్యనారాయణ, టీటీయూ జిల్లా కార్యదర్శులు గంగాప్రసాద్, అక్బర్ బాషా, ఉపాధ్యాయులు కాసర్ల నరేశ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
సిరికొండ: ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సిరికొండ సర్పంచ్ మల్లెల సాయిలు సూచించారు. మండల కేంద్రంలోని వివిధ వార్డుల్లో పాలకవర్గంతో కలిసి సర్పంచ్ గురువారం పర్యటించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్ల యజమానులను కలిసి మరమ్మతులు చేసుకోవాలని సూచించారు. ఉపసర్పంచ్ శోభన్, వార్డు సభ్యులు కనగందుల మురళి, అల్లిపురం శంకర్, జీపీ కార్యదర్శి వినీల్, కారొబార్ ప్రవీణ్ పాల్గొన్నారు. మోపాల్: మండలంలోని ముదక్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున పలు పరికరాలను గురువారం వితరణ చేశారు. లేబర్ రూమ్ టేబుల్, వెయిటింగ్ కుర్చీలు, ఐరన్ రాక్స్, స్ట్రక్చర్, వీల్ చైర్, ఆఫీస్ టేబుల్, ఇంజక్షన్ ట్రాలీ, వాటర్ ఫ్యూరిఫైయర్, బేబీ వార్మర్, వేయింగ్, నెబులైజర్ మిషన్, తదితర వస్తువులను ఎస్బీఐ అధికారులు వైద్యులు, సిబ్బందికి అందజేశారు. పీహెచ్సీకి అవసరమైన పరికరాలు అందజేయడంపై మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజ్మల్ ఎస్బీఐ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఎస్బీఐ అధికారులు పాల్గొన్నారు. సిరికొండ: రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు సిరికొండ సత్యశోధక్ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ ఆర్ నర్సయ్య గురువారం తెలిపారు. మహబూబాబాద్లో ఈ నెల 7 నుంచి 9 వరకు ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్(అండర్–14) సాఫ్ట్బాల్ పోటీల్లో పాఠశాల విద్యార్థులు ఎ అజయ్, బి వర్షిత్ పాల్గొంటారని తెలిపారు. తొర్లికొండలో గత నెలలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. పోటీలకు ఎంపికై న విద్యార్థులకు పాఠశాలలో జ్ఞాపికలు అందజేసి ప్రిన్సిపాల్ అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగారెడ్డి, లింగం, సాహెబ్రావు, వ్యాయామ ఉపాధ్యాయులు అనిల్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఖలీల్వాడి: మాక్లూర్ మండలం చిన్నాపూర్లో ఉన్న అరణ్య అర్బన్ పార్క్లో ఈకో క్లబ్ వారు నిర్వహించిన నేచర్ క్యాంప్లో నగరంలోని గిరిరాజ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. నేచర్ క్యాంపుల నిర్వహణతో విద్యార్థుల్లో ప్రకృతి వనరుల పరిరక్షణ బాధ్యత పెరుగుతుందని తెలిపారు. బీట్ ఆఫీసర్ రాజేందర్ పర్యావరణ పరిరక్షణలో యువత పాత్ర గురించి వలంటీర్లకు వివరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రంగరత్నం, ఈకో క్లబ్ కన్వీనర్ నరేశ్, సభ్యులు డాక్టర్ రంజిత, డాక్టర్ చంద్రశేఖర్, రజిత, విజయ, డాక్టర్ అనూష, వలంటీర్లను తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లి:మండలంలోని ధర్మారం(బి), యా నంపల్లి తండా, మిట్టాపల్లి తండా, నక్కలగుట్ట తండా గ్రామాల్లో గురువారం గ్రామ మహిళా సమాఖ్య భవనాల నిర్మాణ పనులకు ఆయా గ్రామాల సర్పంచులు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మారం(బి) సర్పంచ్ గొట్టిపాటి వాసుబాబు మాట్లాడుతూ.. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆదేశాల మేరకు ఉపాధి హామీ నిధులు రూ.10లక్షల వ్యయంతో ఒక్కో గ్రామ మహిళా సమాఖ్య భవనం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమాల్లో ఆయా గ్రామాల సర్పంచులు గొట్టి పాటి వాసుబాబు, నీల బలరాం, బుక్య సేవంతనవుసి, లకావత్ దేవీసింగ్, ఉప సర్పంచ్ మహమ్మద్ సల్మాన్, వార్డు సభ్యులు, పీఆర్ ఏఈ శ్రీధర్, గ్రామ మహిళా సమాఖ్యల అధ్యక్షురాళ్లు, ఐకేపీ సీసీలు పాల్గొన్నారు. -
విద్యాకమిషన్ సిఫార్సులతో ప్రభుత్వ పాఠశాలలకు నష్టం
ఖలీల్వాడి: విద్యాకమిషన్ ఆకునూరి మురళి సమర్పించిన సిఫార్సులతో భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల మనుగడ కష్టమని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మోహన్రెడ్డి, కిషన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్లో ఉన్న పీఆర్టీ యూ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. టీచర్ల వేతనాలు ఎక్కువగా ఉన్నాయని, పర్మినెంట్ టీచర్లు వద్దని, పదోన్నతులు ఇవ్వొదని అనడం సరైంది కాదన్నారు. ప్రతి మండలంలో ఒకటి నుంచి రెండు పబ్లిక్ పాఠశాలల స్థాపనతో మిగతా గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ స్కూళ్లు మూతపడతాయని అన్నారు. ప్రాథమిక విద్యకు పూర్వ విద్యను మిళితం చేయడం, బడ్జెట్లో విద్యకు 18 శాతం నిధులు కేటాయించడం మధ్యాహ్న భోజనాన్ని రెట్టింపు చేయడం అంశాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు అంకం నరేశ్, సోషల్ మీడియా కన్వీనర్ గోపిడి రవీందర్రెడ్డి, నాయకులు నరేశ్, అబ్దుల్లా తదితరులు ఉన్నారు. -
వేం నరేందర్రెడ్డికి సన్మానం
సుభాష్నగర్: తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై న వేం నరేందర్రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాట్పల్లి నరేందర్రెడ్డి గురువారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఖలీల్వాడి: ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం సభ్యులు గురువారం డీఈవో అశోక్ను కలిశారు. రాష్ట్ర ప్రైమరీ స్కూల్స్ హె డ్మాస్టర్స్ అసోసియేషన్ డైరీని డీఈవో ఆవిష్కరించారు. రచ్చ మురళి, అంకం నరేశ్, కొట్టూరు దేవదాసు, సురేశ్రెడ్డి, కళ్లెం మల్లారెడ్డి పాల్గొన్నారు. -
ప్రైవేట్కు దీటుగా సీవోఈ కస్తూర్బాలు
ఖలీల్వాడి : కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ఇక నుంచి పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వనున్నారు. విద్యారంగంలో వెనుకబడిన ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, పేద కుటుంబాల విద్యార్థినులకు విద్యనందించే లక్ష్యంతో కొనసాగుతున్న ఈ స్కూళ్ల విద్యార్థినులు రెగ్యులర్ పరీక్షల్లో ప్రతిభ కనబరుస్తున్నప్పటికీ పోటీ పరీక్షల్లో వెనుకబడకుండా ప్రైవేట్కు దీటుగా తీర్చిదిద్దనున్నారు. జేఈఈ, నీట్, ఎప్సెట్, క్లాట్(కామన్ లా అడ్మిషన్ టెస్ట్) పరీక్షలకు విద్యార్థినులను సన్నద్ధం చేయనున్నారు. ఇందుకోసం జిల్లాలోని డిచ్పల్లి, మాక్లూర్, నిజామాబాద్ కస్తూర్బాలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ(సీవోఈ)లుగా అప్గ్రేడ్ చేశారు. అయితే ఒక్కో పాఠశాలలో ఒక్కో పోటీ పరీక్షకు సంబంధించి శిక్షణను ఉచితంగా ఇవ్వనున్నారు. ఇందుకోసం జిల్లా అధికారుల నుంచి విద్యాశాఖ వివరాలు సేకరించింది. జిల్లాలో మొత్తం 27 కస్తూర్బా పాఠశాలలు/కళాశాలలు ఉన్నాయి. 2,331 మంది ఇంటర్ విద్యను అభ్యసిస్తుండగా అందులో ప్రథమ సంవత్సరం విద్యార్థినులు 1799 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు 532 మంది ఉన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలుగా అప్గ్రేడ్ అయిన డిచ్పల్లి, మాక్లూర్, నిజామాబాద్ కస్తూర్బాలకు ప్రభుత్వం గ్రంథాలయాలు, ఫర్నిచర్, పుస్తకాలతోపాటు ఇతర సామగ్రిని అందుబాటులోకి తెచ్చింది. సెకండియర్ చదువుతున్న విద్యార్థినులకు గతేడాది నవంబర్, డిసెంబర్లో, ఈ ఏడాది జనవరిలో నీట్, జేఈఈ, ఐఐటీ, క్లాట్ పరీక్షలకు ఆన్లైన్లో తరగతులు నిర్వహించారు. పరీక్షలు ముగిసిన తరువాత విద్యార్థినులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయనున్నారు. పేద విద్యార్థులకు కేజీబీవీలో పూర్తి ఉచితంగా నాణ్యమైన విద్యనందిస్తున్నాం. అలాగే విద్యార్ధినిలను జేఈఈ, ఐఐటీ, నీట్, క్లాట్ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు విద్యాశాఖ జిల్లాలోని పాఠశాలల వివరాలను అడిగింది. ఇంటర్ సెకండియర్ పరీక్షలు ముగిసిన తరువాత దీనిపై స్పష్టత వస్తుంది. జిల్లాలోని మూడు ఎంపిక చేసిన కేజీబీవీల్లో అన్ని సౌకర్యాలు కల్పించాం. – భాగ్యలక్ష్మి, జీసీడీవో, నిజామాబాద్ ప్రవేశ పరీక్ష ద్వారా.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాత పరీక్ష ద్వారా సీవోఈ పాఠశాలల్లో విద్యార్థులకు సీట్లను కేటాయించనున్నారు. ఆరో తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 40 సీట్ల చొప్పున కేటాయించారు. పోటీ పరీక్షల శిక్షణ కోసం నలుగురు బోధకులను నియమించడంతోపాటు మానసిక వైద్యులనూ నియమిస్తారు. జిల్లాలో మూడు పాఠశాలల ఎంపిక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ స్కూళ్లలో పోటీ పరీక్షలకు శిక్షణ వచ్చే ఏడాది నుంచి రాత పరీక్ష ద్వారా ప్రవేశాలు -
జిల్లాలోనే పెద్దపులి
నిజామాబాద్మార్కెట్ యార్డుకు పోటెత్తిన పసుపుఇస్రో ఆహ్వానం.. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందు కు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘యువికా’ కార్యక్రమాన్ని చేపడుతోంది. శుక్రవారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2026– 10లో uసాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల నుంచి నిజామాబాద్ జిల్లాలోకి వచ్చిన పెద్ద పులి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితం జిల్లాలోని కమ్మర్పల్లి అటవీ క్షేత్రం పరిధిలోకి వచ్చిన ఈ పెద్ద పులి అదే రేంజ్లో తిరుగుతున్నట్లు అటవీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. కోనాపూర్ సెక్షన్లోని ఇనాయత్నగర్ బీట్ పరిధిలో ఉన్న గట్టుపొడిచిన వాగు ప్రాజెక్టు సమీపంలో జలాశయం ప్రాంతంలో ఈ పులి తిష్ట వేసుకుని ఉంది. గురువారం తెల్లవారుజామున అటవీ శాఖ అమర్చిన ట్రాప్ కెమెరాకు పెద్ద పులి కదలికలు చిక్కడంతో కచ్చితమైన నిర్ధారణ అయింది. హారాష్ట్రలోని తాడోబా అడవి నుంచి వచ్చిన ఈ పులి గత కొన్ని నెలలుగా ఆదిలాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో సంచరిస్తూ వచ్చింది. యాదాద్రి జిల్లా అటవీ ప్రాంతం వరకు వెళ్లి మళ్లీ తిరుగు ప్రయాణంలో ఉన్న ఈ పులి జగిత్యాల జిల్లా మీదుగా నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి రేంజ్లోకి వచ్చింది. ప్రస్తుతం కమ్మర్పల్లి అటవీ రేంజ్ అధికారి రవీందర్ ఆధ్వర్యంలో 18 మంది మూడు బృందాలుగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. 30 మీటర్ల దూరంలో.. ఆరుగురితో కూడిన అటవీ అధికారుల బృందం గట్టుపొడిచిన వాగు బ్యాక్వాటర్ ప్రాంతంలో గురువారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సందర్భంలో బీట్ అధికారి శ్రీదేవికి అలసట రావడంతో అక్కడే ఉన్న కల్వర్టు మీద కూర్చుంది. బృందంలోని మిగిలిన సభ్యులు కొంత మేర ముందుకు వెళ్లారు. ఇదే సమయంలో వెనుక వైపు 30 మీటర్ల దూరంలో ఆకుల అలికిడి వినిపించడంతో శ్రీదేవి ఆవైపు చూసింది. పెద్ద పులి నడిచి వెళుతూ కనిపించింది. దీంతో ఆమె అక్కడికక్కడే మూర్ఛపోయింది. కల్వర్టుకు ఇవతలివైపు పడిపోయింది. శ్రీదేవి కనిపించకపోవడంతో అధికారుల బృందం తిరిగి వచ్చి చూడగా ఆమె మూర్చపోయి ఉంది. తక్షణమే శ్రీదేవిని ఆస్పత్రికి తరలించారు. ఆమె పులిని మధ్యాహ్నం సమయంలో చూడగా రాత్రి అయినప్పటికీ షాక్ నుంచి కోలుకోలేదు. కల్వర్టుకు అవతలివైపు పడిపోయి ఉంటే పులికి ఆహారం అయ్యేదానినని శ్రీదేవి ఏడుస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ ఘటనతో ఇతర అధికారులు సైతం భయాందోళనలకు గురవుతున్నారు. టైగర్ రిలాక్స్! నెలల తరబడి వివిధ జిల్లాల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో తిరుగుతూ వచ్చిన ఈ మగ పెద్ద పులి ఆడ పులి తోడు కోసం తిరుగుతోంది. వందల కిలోమీటర్ల మేర తిరుగుతూ వచ్చిన ఈ పులి కమ్మర్పల్లి రేంజ్ పరిధిలోని గట్టుపొడిచినవాగు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతంలో తిష్ట వేసుకుని ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. నెలలపాటు తిరిగిన పులి ఇక్కడ రిలాక్స్ అవుతున్నట్లు అంచనా. మూ డు రోజుల క్రితం ఇక్కడకు వచ్చిన ఈ పులి ఇదే చోట వన్యప్రాణని చంపి తిని, ఇక్కడే దాహార్తిని తీర్చుకుని విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ● వన్యప్రాణుల దాహార్తి తీర్చడంలో భాగంగా ఉమ్మడి ఏపీలో జలయజ్ఞం కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో నిర్మించిన మొదటి ప్రాజెక్టు గట్టుపొడిచినవాగు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు జలాశయంలోని నీరు సాగునీటికి సైతం ఉపయోగపడుతున్నాయి. ఇందుకోసం ఎత్తిపోతల పథకం, కాలువలు నిర్మించారు. ● జిల్లాలోకి ఈ నెల 3న ప్రవేశించిన పెద్ద పులి పాద ముద్రలను గట్టుపొడిచినవాగు సమీపంలోని అటవీ ప్రాంతంలో అధికారులు గుర్తించారు. ఈ పులి పాద ముద్రలు 19 సెంటీమీటర్ల మేర ఉండడంతో మగపులిగా అధికారులు నిర్ధారించారు. ఇదే ప్రాంతంలో పలుచోట్ల పులి పాద ముద్రలు కనిపించడం గమనార్హం. అటవీ అధికారులు, సిబ్బంది నిరంతరం పెట్రోలింగ్ చేస్తూ వస్తున్నారు. సమీప ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పెద్ద పులి కచ్చితంగా గట్టుపొడిచినవాగు ప్రాజెక్టు బ్యాక్వాటర్ ప్రాంతంలోనే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఆహారం కోసం వన్యప్రాణుల లభ్యత, వేసవి కావడంతో దాహార్తిని తీర్చుకునేందుకు పుష్కలంగా నీటి సౌకర్యం ఉండడంతో పులి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నట్లు భావిస్తున్నారు.వేం నరేందర్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన నగేష్రెడ్డి సుభాష్నగర్: తెలంగాణ నుంచి కాంగ్రె స్ అభ్యర్థిగా రాజ్యసభ స భ్యత్వానికి నా మినేషన్ వేసి న వేం నరేందర్రెడ్డికి డీసీసీ అధ్యక్షుడు కాట్పల్లి నగేష్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గు రువారం హైదరాబాద్లోని తన నివాసంలో నరేందర్రెడ్డిని నగేష్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్ఫగుచ్ఛం అందజేశారు. ఈసందర్భంగా నగేష్రెడ్డి మాట్లాడుతూ.. వేం న రేందర్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికకానుండడం హర్షణీయమని అన్నారు. రంజాన్ ఉపవాసాలతో సహనం, క్రమశిక్షణ నిజామాబాద్ అర్బన్: రంజాన్ ఉపవాసాల తో నియమం, సహనం, క్రమశిక్షణ పెంపొందుతాయని సీపీ సాయిచైతన్య అన్నా రు. నగరంలోని కచ్చియాన్ మసీద్లో గురువారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ కేవలం ఉపవాసాల నెల మా త్రమే కాకుండా, మనస్సును పరిశుభ్రం చే సుకునే ఆత్మపరిశీలన కాలమని అన్నారు. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సీఐ ప్రసాద్, వన్టౌన్ ఎస్హెచ్వో రఘుపతి, కచ్చియాన్ మసీద్ ప్రెసిడెంట్ యాసీన్ పాల్గొన్నారు. నేడు బీజేపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు అభినందన సభ సుభాష్నగర్: నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో గెలుపొందిన బీజేపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు శుక్రవారం నగరశివారులోని కమ్మసంఘంలో అభినందన సభ ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పార్లమెంట్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యఅతిథులుగా మల్కాజిగిరి, నిజామాబాద్ ఎంపీలు ఈట ల రాజేందర్, అర్వింద్ ధర్మపురి, ఎమ్మె ల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్రెడ్డి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, జిల్లా ప్రభారి కాంతారావు హాజరవుతారని తెలిపారు. జిల్లా పదాధికారులు, రాష్ట్ర, జిల్లా నాయకులు, మోర్చాల జిల్లా పదాధికారులు, మండలాల అధ్యక్షులు, మండల పదాధికారులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సకాలంలో హాజరై విజయవంతం చేయాలని దినేశ్ కోరారు. పెద్ద పులి కదలికలు కనిపెట్టడంతో పాటు అది ఎటువైపు వెళ్తుందో గమనించేందుకు గాను అ టవీ శాఖ అధికారులు పలు చోట్ల ట్రాప్ కెమెరా లు ఏర్పాటు చేశారు. గట్టుపొడిచినవాగు ప్రాంతంలో కనిపించడంతో అటవీ యంత్రాంగం మరింత అలర్ట్ అయింది. మహారాష్ట్ర నుంచి మొదటగా ఆదిలాబాద్ జిల్లా ద్వారానే తెలంగాణలోని వివిధ జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో సంచరిస్తూ వచ్చిన ఈ పులి ఇక్కడ తిష్ట వేసి నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి సైతం అటవీ అధికారుల బృందాలు జిల్లాకు వచ్చాయి. డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసి పెద్ద పులి కదలికలను పూర్తి స్థా యిలో గుర్తించేందుకు అటవీ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. డీఎఫ్వో వికాస్మీనా నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి తెప్పించిన డ్రోన్ కెమె రా ద్వారా రెండు కిలోమీటర్ల రేడియస్లో పరిశీలించారు. అయితే పులి జాడ కనిపించలేదు.నేడు జిల్లాస్థాయి ఆర్చరీ పోటీలు మోపాల్: మండలకేంద్రం శివారులోని ఏకలవ్య ఆర్చరీ అకాడమీలో జిల్లాస్థాయి ఆర్చరీ పోటీలను శుక్రవారం నిర్వహించనున్నట్లు ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు ఈగ సంజీవ్రెడ్డి, జిల్లా కార్యదర్శి గంగరాజు, కోచ్ ఎన్ రవీందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో ఎంపికై న వారు 8వ తేదీన జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. అండర్ – 10, 13, 15 విభాగాల నుంచి ఉమ్మడి జిల్లా క్రీడాకారులు పాల్గొనవచ్చన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు జిల్లాస్థాయి పోటీలకు హాజరుకావాలని, ఉదయం 8 గంటల లోగా ఏకలవ్య ఆర్చరీ అకాడమీలో క్రీడాకారులు రిపోర్ట్ చేయాలని కోరారు.సుభాష్నగర్: నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్యార్డుకు పసుపు పోటెత్తింది. వరుస సెలవుల తర్వాత ప్రారంభమైన శ్రద్ధానంద్ గంజ్కు గురువారం ఒక్కరోజే దాదాపు 60 వేల బస్తాల వరకు పసుపు పంట వచ్చినట్లు అధికారులు తెలిపారు. సీజన్ మొదలైన రెండు నెలల్లో మార్కెట్కు పసుపు రావడం ఇదే అత్యధికమని అన్నారు. రెండు నెలల్లో గంజ్కు సుమారు 2 లక్షల క్వింటాళ్ల పసుపు వచ్చిందని తెలిపారు. ఈ సీజన్లో క్వింటాల్కు రూ.15,650కు పైచిలుకు ధర పలికిందన్నారు. తేమశాతం 12 ఉండేలా నాణ్యమైన పసుపు తీసుకురావాలని రైతులు వారు సూచించారు. గట్టుపొడిచిన వాగు వద్ద తిష్ట జంతువులను వేటాడి చంపి తిని విశ్రాంతి డ్రోన్ కెమెరాలతో పులి కదలికలను గుర్తించేందుకు అటవీశాఖ ప్రయత్నాలు పులిని చూసి కళ్లు తిరిగి మూర్చపోయిన బీట్ అధికారి శ్రీదేవి -
సెంటర్లలో వసతుల లేమిపై కలెక్టర్ అసహనం
బోధన్టౌన్(బోధన్) : బోధన్ పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాల్లో సరైన వసతులు లే వని కలెక్టర్ ఇలా త్రిపాఠి అసహనం వ్యక్తం చేశారు. పట్టణంలోని విజేత, విద్యావికాస్, ఉషోదయ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఎగ్జామినేషన్ సెంటర్లను కలెక్టర్ గు రువారం తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరుశాతాన్ని తెలుసుకున్నారు. సెంటర్లలో సీసీ కెమెరాలు ఉన్నాయా, లేదా అని పరిశీలించారు. సెంటర్లలో విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడాన్ని గమనించిన కలెక్టర్.. వివరాలు అందించాలని డీఐఈవో రవికుమార్ను ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మాల్ ప్రాక్టీస్కు తావులేకుండా పరీక్షలు నిర్వహించాలని, ప్రశాంత వాతావ రణంలో విద్యార్థులు పరీక్షలు రాసే వి ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి సెంటర్లోకి అ నుమతించాలన్నారు.షోరూం ప్రారంభించిన అనంతరం అభిమానులను ఉత్సాహ పరుస్తూ స్టెప్పులేస్తున్న నిధి అగర్వాల్ -
వేరే దారి చూసుకోండి..!
మోర్తాడ్(బాల్కొండ): గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లకు వేతనాల చెల్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. జీపీలకు వచ్చే జనరల్ ఫండ్ లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి వేతనాలు చెల్లించుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ డి దివ్య రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని 545 గ్రామ పంచాయతీల్లో కారోబార్లు, బిల్కలెక్టర్లు, వాటర్మెన్లు, పారిశుద్ధ్య కార్మికులు మొత్తం 3054 మంది ఉండగా, వారందరికీ ప్రతి నెలా రూ.9,500 చొప్పున వేతనం చెల్లించేందుకు ప్రభుత్వం గతంలోనే అంగీకరించింది. ఇందుకోసం టీఎస్బీపాస్ను తీసుకువచ్చింది. గతేడాది నవంబర్ 2025 వరకు మల్టీపర్పస్ వర్కర్లకు వేతనాలను చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు తమకు సంబంధం లేదనడంతో సర్పంచ్లు తలలుపట్టుకుంటున్నారు. కేంద్రం నుంచి రాలేదు.. రాష్ట్రం ఇవ్వలేదు వాస్తవానికి జిల్లాలోని గ్రామ పంచాయతీలకు ప్రతినెలా కేంద్రం, రాష్ట్ర నుంచి రూ.10.30 కోట్ల చొప్పున రూ.20.60 కోట్లు విడుదల కావాలి. అయితే గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిన కాలానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. పాలకవర్గాలు లేకపోవడమే దీనికి కారణం. ఎస్ఎఫ్సీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా ప్రతి నెలా రూ.10.30 కోట్లు విడుదల చేయలేదు. టీఎస్బీపాస్ ద్వారా మల్టీపర్పస్ వర్కర్ల వేతనాల కోసం రూ.2,90,13,000 నిధులను విడుదల చేసింది. ఈ లెక్కన రూ.7,39,87,000 చొప్పున నిధుల జాడ లేకుండా పోయింది. పాలకవర్గాలు లేకపోవడంతో నిధుల అంశాన్ని లేవనెత్తేవారు కరువయ్యారు. నిధుల విషయంలో చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కొత్త సమస్య ఆదాయం అంతంతే.. వేతనాలు చెల్లించేదెలా.. ప్రభుత్వ నిర్ణయం సరికాదు పంచాయతీ కార్మికుల వేతనాల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదు. పంచాయతీలకు ఆదాయం ఎంతో తక్కువగా ఉంది. ప్రభుత్వం వేతనాలను చెల్లించి పంచాయతీలకు భారం తప్పించాలి. – పావని, సర్పంచ్, తొర్తి -
ఆశల ముడుపులు
కోరిన కోరికలు నెరవేరాలని పరమేశ్వరుడిని వేడుకుంటూ ఎన్నో ఆశలతో కట్టిన ముడుపులు ఇవి. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం శివలింగేశ్వరస్వామి మర్రిచెట్టు దేవస్థానానికి వచ్చే భక్తులు స్వామి తమ కోరికలను నెరవేరుస్తాడని, కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని విశ్వాసంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే అక్కడే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇనుప రాడ్లకు కొబ్బరికాయ ముడుపులు కడుతారు. భక్తుల కడుతున్న ముడుపుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
వ్యవసాయ సమాచారం
● బహుబాగు.. పాప్కార్న్ మక్క సాగు డొంకేశ్వర్(ఆర్మూర్): వ్యవసాయం చేస్తున్న డొంకేశ్వర్ మండల రైతులు కొత్త రకాల పంటలను పండిస్తున్నారు. మండలంలోని తొండాకూర్ గ్రామాని కి చెందిన అల్లారి గంగాధర్ (సక్కర్ రెడ్డి) ప్రస్తుతం ఊరి సర్పంచ్గా పని చేస్తుండగా, మొక్కజొన్నలో పాప్కార్న్ రకాన్ని సాగు చేస్తున్నాడు. కంకితో క్వింటాలుకు రూ.2,200 చొప్పున వ్యాపారితో ముందస్తు ఒప్పందం చేసుకుని రెండెకరాల్లో పాప్కార్న్ మక్కను వేశాడు. యాసంగిలో 90 రోజుల పాటు సాగయ్యే ఈ పంట ఎకరానికి 30–40 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని సక్కర్ రెడ్డి పేర్కొంటున్నారు. త్వరలోనే పంటకోత చేయనున్నట్లు వెల్లడించారు. ● డ్రమ్సీడర్పై అవగాహన రుద్రూర్: కోటగిరి మండలం రాంపూర్ గ్రామంలో గురువారం డా. రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోధన్ క్లస్టర్ పరిధిలో డ్రమ్ సీడర్ ఫీల్డ్ ఎక్స్పోజర్ రైతు సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కేవీకే శాస్త్రవేత్త ఇందుదార్ రెడ్డి, డిప్యూటీ మేనేజర్ వీరస్వామి, ఏరియా మేనేజర్ అరుణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు డ్రమ్ సీడర్ వినియోగం ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. రైతులు పరికరాన్ని పరిశీలించి పలు సందేహాలను శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. ● సేంద్రియ ఆహార ఉత్పత్తులు ఆరోగ్యకరం బోధన్: ప్రకృతి సిద్ధమైన పద్ధతుల్లో పండించిన సేంద్రియ ఆహార ఉత్పత్తులు ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆలిండియా భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ అధ్యక్షుడు కొండెల సాయరెడ్డి అన్నారు. ఎడపల్లి మండలం జైతాపూర్లో ఆదర్శ రైతు కరుటూరు పాపరావు సొంత ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో రసాయన రహితంగా పండించిన వివిధ రకాల ఆహార ఉత్పత్తులు వినియోగదారుల అందుబాటులో ఉంచారు. సాయరెడ్డి గురువారం పాపారావు ఇంట్లో ఉన్న సేంద్రియ ఆహార ఉత్పత్తులను పరిశీలించి, ఆయనను అభినందించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మాజీ అధికారి దశరథ్ రెడ్డి పాల్గొన్నారు. -
నగరంలో ఆర్ఎస్ బ్రదర్స్ షోరూం ప్రారంభం
● ముఖ్య అతిథులుగా హాజరైన సినీనటి నిధి అగర్వాల్, నగర మేయర్ ఉమారాణి ● భారీగా తరలివచ్చిన జనం నిజామాబాద్ రూరల్: నగరంలోని ఆర్పీ రోడ్డులో ఆర్ఎస్ బ్రదర్స్ షోరూం గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి ప్రముఖ సినీనటి నిధిఅగర్వాల్, నగర్ మేయర్ ఉమారాణి ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేశారు. ఈసందర్భంగా నటి నిధి అగర్వాల్ మట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో ఆర్ఎస్ బ్రదర్స్ సరికొత్త షోరూ మ్ను ప్రారంభించడం ద్వారా ఆర్ఎస్ బ్రదర్స్ మరో మైలురాయిని సగర్వంగా చేరుకుందన్నారు. సౌత్ ఇండియాలో కుటుంబ షాపింగ్ అవసరాలను తీర్చే విశ్వసనీయ సంస్థగా, ఏకై క గమ్యంగా, ఆర్ఎస్ బ్రదర్స్ షోరూంను నిజామాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేయడంతో విజయకేతనం ఎగురవేస్తోందన్నారు. చైర్పర్సన్ హోల్ టైం–డైరెక్టర్ పొట్టి వెంకటేశ్వర్లు, మేనేజింగ్ డైరెక్టర్ సీర్ణ రాజమౌళి, హోల్ టైం డైరెక్టర్ తిరువీధుల ప్రసాదరావు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాషన్లను సేకరించి జిల్లా కస్టమర్లకు అందిస్తున్నామన్నారు. అలాగే ఒక సమగ్రమైన లైఫ్స్టైల్ విభాగాన్ని కూడా పరిచయం చేస్తోందన్నారు. కుటుంబానికి అవసరమైన ప్రతి వస్తువు ఒకేచోట దొరికే ఒక పరిపూర్ణమైన గమ్యస్థానం ‘ఆర్ఎస్ బ్రదర్స్’ అన్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున్న ప్రజలు పాల్గొన్నారు. -
విద్యార్హతలతోపాటు నైపుణ్యాలు అవసరం
తెయూ(డిచ్పల్లి): నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు కేవలం విద్యార్హతలే కాకుండా సాఫ్ట్ స్కిల్స్ ఎంతో అవసరమని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రా ర్ యాదగిరి అన్నారు. తెయూలో గురువారం యూనివర్సిటీ ప్లేస్మెంట్ సెల్, రిలయన్స్ ఫౌండేషన్, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ‘కనెక్ట్ విత్ వర్క్: ఎంప్లాయిబిలిటీ అండ్ లైఫ్ స్కిల్స్’ పై వారం రోజుల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి యాదగిరి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. యూనివర్సిటీలకు ప్రభుత్వం ఇచ్చిన 100 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ట్రైనింగ్ ఆఫీసర్లు పవన్రెడ్డి, అంజలి, రోహిణి పటేల్ వివిధ నైపుణ్యాలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ప్లేస్మెంట్ డైరెక్టర్ పాతనాగరాజు, ప్రిన్సిపాల్ రాంబాబు, అంజనేయులు, వాసం చంద్రశేఖర్, నాగరాజు, శ్రీనివాస్, కిరణ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్: భారతీయ వాయు సేన నందు అగ్నివీర్ వాయు ఉద్యోగాల కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతీయువకులకు ఈనెల 8 నుంచి 18 వరకు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వింగ్ కమాండర్ షేక్ యాకుబ్అలీ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులోగల ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 17 నుంచి 21 సంవత్సరాలలోపు వారు, పెళ్లికాని పురుషులు, మహిళలు అర్హులన్నారు. ధర్పల్లి: మండల కేంద్రంలో తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ధర్పల్లి కొత్త బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్న మంచి కంటి రామచందర్ ఇంటికి కొన్ని రోజులుగా తాళం వేసి ఉంది. ఈక్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం పగలగొట్టి కొంత నగదుతో పాటు, ఒక తులం బంగారం ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై శ్రీనివాస్ ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ఇస్రో ఆహ్వానం.. బాలలకు అవకాశం..
కమ్మర్పల్లి: శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన అంశాలపై విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. బాలలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్(వైఎస్పీ, యువ విజ్ఞాన్ కార్యక్రమం) ‘యువికా’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. క్యాచ్ దెమ్ యంగ్ పేరిట రెండు వారాల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అంతరిక్ష సాంకేతిక విజ్ఞానం, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్, తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. తద్వారా వారిని పరిశోధనల వైపు దృష్టి మళ్లించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. అర్హులు–దరఖాస్తులు.. ● ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన ఇస్రో మేటి ప్రయోగాలు చేస్తూ, దేశంలోని బాల మేధావులను ప్రోత్సహించే క్రమంలో యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్(యువికా) కార్యక్రమం నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్(దరఖాస్తు) ప్రక్రియ ఫిబ్రవరి 27న ప్రారంభం కాగా, మార్చి 31న ముగుస్తుంది. ● 2025–26 విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. 8వ తరగతి వార్షిక పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా 50 శాతం, ఆన్లైన్ క్విజ్ ప్రతిభకు, సైన్స్ ఫెయిర్లో పాల్గొన్న వారికి 10 శాతం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ చేసిన వారికి 5 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న వారికి 15 శాతం వెయిటేజీ మార్కులు కేటాయించి అనుమతిస్తారు. –ఆసక్తిగల విద్యార్థులు ఇస్రో అధికారిక వెబ్సైట్ ఠీఠీఠీ. జీటటౌ. జౌఠి. జీుఽ లో లాగిన్ అయి, యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. అందులో విద్యార్థుల వివరాలను నమోదు చేయాలి. ● ఇస్రో చేపట్టిన యువ విజ్ఞాన కార్యక్రమానికి ఎంపికై న విద్యార్థులతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరిని వెంట అనుమతిస్తారు. ఇస్రోకు చెందిన అహ్మదాబాద్, డెహ్రాడూన్, శ్రీహరికోట, హైదరాబాద్, బెంగళూర్, షిల్లాంగ్, తిరువనంతపురంలో విద్యార్థులకు ప్రముఖ శాస్త్రవేత్తలతో ముఖాముఖి చర్చా వేదికలు, ప్రయోగశాలల సందర్శన, ముఖ్యులతో సమావేశాల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తారు. అంతరిక్ష శాస్త్రం, రాకెట్ ప్రయోగాలకు సంబంధించిన అంశాలపై ప్రాథమిక అవగాహన కల్పిస్తారు. ● మే 11న యువ విజ్ఞాన కార్యక్రమం.. ఈనెల 31 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏప్రిల్లో రెండు సార్లు జాబితాను ప్రకటిస్తారు. ఎంపికై న విద్యార్థులు మే 10న ఇస్రో కేంద్రాల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. 11 నుంచి 22 వరకు యువ విజ్ఞాన కార్యక్రమం నిర్వహిస్తారు. యువ శాస్త్రవేత్తలుగా ఎదగాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు యువికా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. స్కూల్ హెచ్ఎంలు, సైన్స్ టీచర్లు చొరవ తీసుకొని 9వ తరగతి విద్యార్థులకు ఈ విషయాలను తెలియజేసి, దరఖాస్తు చేసుకునే విధంగా ప్రోత్సహించాలి. విద్యార్థుల్లో ఉన్న శాసీ్త్రయ జిజ్ఞాసను మేల్కొల్పడం, అంతరిక్ష రహస్యాల పట్ల ఆసక్తిని పెంపొందించాల్సిన అవసరం ఉంది. –కె. గంగాకిషన్, జిల్లా సైన్స్ అధికారి, నిజామాబాద్ఇస్రో చేపట్టిన యువ విజ్ఞాన్ కార్యక్రమం(యువికా)కు ప్రచారం కరువైంది. జిల్లాలో ఐదేళ్లలో కేవలం 150 మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కలిపి 26415 మంది విద్యార్థులు 9వ తరగతి చదువుతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి నోటిఫికేషన్, దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్ ద్వారానే చేపడుతున్నారు. యువికా కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కూడా చాలా పాఠశాలలకు తెలియడం లేదు. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు తెలియజేసే విధంగా ఇస్రో చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. బాల శాస్త్రవేత్తల తయారీకి ‘యువికా’ ప్రత్యేక కార్యక్రమం ‘క్యాచ్ దెమ్ యంగ్’ పేరిట యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ దరఖాస్తుల స్వీకరణకు మార్చి 31వరకు గడువు -
క్రైం కార్నర్
గొంతులో రొట్టె అడ్డు తగిలి ఒకరి మృతి! నస్రుల్లాబాద్: గోధుమ రొట్టె గొంతులో అడ్డు తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై రాఘవేంద్ర తెలిపిన వివరాలు ఇలా.. దుర్కి గ్రామానికి చెందిన గరుగళ్ల చిన్న మొగులయ్య (45) బుధవారం రాత్రి ఓ పురాతన ఇంటి వద్ద అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా మృతుడి నోటిలో గోధుమ రొట్టెలు ఉన్నాయి. గోధుమ రొట్టెలను ప్లాస్టిక్ కవర్లో తీసుకుని వచ్చి తింటుండగా గొంతులో అడ్డు తగిలి ఊపిరి ఆడక మరణించి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వాడిలో ఒకరి ఆత్మహత్య నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని వాడి గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన పోల్కంపేట అంజయ్య(42)కు 15ఏళ్ల క్రితం నింగసానిపల్లి గ్రామానికి చెందిన జ్యోతితో వివాహామయింది. కాగా గత కొంతకాలంగా దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. ఈక్రమంలో గత నెల 17న ఇరువురి మధ్య గొడవ జరగడంతో జ్యోతి తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అంజయ్య జీవితంపై విరక్తి చెంది బుధవారం ఇంటి పక్కన ఉన్న రేకులషెడ్డులోకి వెళ్లి చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి శ్యామల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. కామారెడ్డి క్రైం: మద్నూర్ డిప్యూటీ తహసీల్దార్గా పని చేస్తున్న శరత్ కుమార్ బస్సు దిగుతుండగా ప్రమాదవశాత్తు కింద పడటంతో గాయపడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి కొత్త బస్టాండ్లో గురువారం ఉదయం చోటు చేసుకుంది. శరత్ కుమార్ గౌడ్ ఉదయం బస్టాండ్లో బస్సు దిగే క్రమంలో అదుపుతప్పి కింద పడ్డాడు. దీంతో అదే బస్సు టైర్ అతడి కుడి కాలు పైనుంచి వెళ్లింది. కాలు మడమ నుంచి కింద భాగం మొత్తం నుజ్జునుజ్జయింది. స్థానికులు, పోలీసులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. -
కారు బోల్తా : భార్యాభర్తలు మృతి
నలుగురికి తీవ్ర గాయాలు డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మాధవనగర్ బైపాస్ రోడ్డులో గురువారం తెల్లవారు ఝామున కారు బోల్తా పడిన ఘటనలో భార్యాభర్తలు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా దోమకొండకు చెందిన ఇటుకబట్టి యజమాని చింతల శ్రీనివాస్, అదే గ్రామానికి చెందిన సాయిలు, ఐదుగురు బట్టీ కార్మికులతో కలిసి కారులో బుధవారం రాత్రి మహారాష్ట్రలోని నాందేడ్కు వెళ్లారు. తిరిగి గురువారం తెల్లవారుఝామున నాందేడ్ నుంచి దోమకొండకు బయలుదేరారు. ఉదయం సుమారు 6.30 గంటలకు నిజామాబాద్ బైపాస్ రోడ్డుపై సత్యనారాయణ క్రాకర్స్ షాపు దాటిన తర్వాత కారు అతివేగం వల్ల అదుపుతప్పి కల్వర్టు వద్ద రోడ్డు కిందకు దిగిపోయి మూడు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న శోభ వాగ్మరే (42) అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన ఆమె భర్త సత్వ తుకారాం వాగ్మరే (నాందేడ్ జిల్లా ముథ్ఖేడ్) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కారులో ఉన్న చింతల శ్రీనివాస్, అనిత, సాహెబ్రావు, నగరం సాయిలు తీవ్రంగా గాయపడ్డారు. కారు డ్రైవర్ సీతారాం, మృతుడి కుమారుడు బాలాజీ సత్వ వాగ్మరే (2 వతరగతి విద్యార్థి) స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తల్లిదండ్రులిద్దరూ ప్రమాదంలో మృతి చెందడంతో చిన్నారి బాలాజీ సత్వ అనాథగా మారాడు. ప్రమాదం జరిగిన వెంటనే వచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న డిచ్పల్లి, నిజామాబాద్ రూరల్ పోలీసులు క్షతగాత్రులను 108 అంబులెన్స్లో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన సీపీ పోలీస్ కమిషనర్ పి సాయిచైతన్య ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితి సమీక్షించారు. సీపీ మాట్లాడుతూ కారు డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, ముఖ్యంగా బైపాస్ రోడ్డులో అతివేగంగా వాహనాలు నడపరాదని హెచ్చరించారు. సీపీ వెంట డిచ్పల్లి ఎస్సై ఎండీ అరిఫ్, నిజామాబాద్ రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్ ఉన్నారు. -
‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ సిద్ధం చేశాం
● డీఎంహెచ్వో రాజశ్రీ ● ‘టెలీ మానస్’ కరపత్రాల ఆవిష్కరణ సుభాష్నగర్: రాష్ట్ర ప్రభుత్వం 99 రోజులపాటు నిర్వహించనున్న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య కార్యక్రమాల ప్రణాళికను సిద్ధం చేశామని డీఎంహెచ్వో రాజశ్రీ అన్నారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో గురువారం ఆమె డిప్యూటీ డీఎంహెచ్వోలు, ప్రోగ్రాం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రాజశ్రీ మాట్లాడుతూ.. 99 రోజుల కార్యక్రమాల్లో భాగంగా ఏప్రిల్ 6 నుంచి 11 వరకు ఆరోగ్యవారం నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని 38 పీహెచ్సీల్లో రోగులకు ఉచిత వైద్య ఆరోగ్య సేవలు అందిస్తారని తెలిపారు. సర్వైకల్ క్యాన్సర్ రాకుండా కిషోర బాలికలకు హెచ్పీవీ టీకాలను మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా జీజీహెచ్లో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. మాతా శిశు మరణాలతోపాటు నెలలోపు శిశువుల మరణాల సంఖ్య తగ్గించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. వైద్య పరీక్షలు, శిబిరాలు నిర్వహిస్తామన్నారు. అలాగే మానసిక ఒత్తిడిలో పరీక్షలంటే భయపడుతూ ఇతర సమస్యలతో బాధపడే విద్యార్థులు, యువకులను దృష్టిలో ఉంచుకుని మానసిక నిపుణుల ద్వారా ఉచిత కౌన్సిలింగ్ కోసం నిర్వహించే టెలి మానస్ కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. విద్యార్థులకు ఎలాంటి మానసిక సమస్యలున్నా.. 14416 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించి ఉచిత కౌన్సిలింగ్ పొందవచ్చన్నారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి అశోక్, ఏవో సుమంత్ కుమార్, ఉప వైద్యాధికారులు రవీందర్, సమత, అశ్విని, ప్రోగ్రాం అధికారులు శ్వేత, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
వేతన కష్టాలు..
సుభాష్నగర్: వేతనాలు అందక గ్రామ పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఈ–పంచాయతీ ఆపరేటర్లు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఐదు నెలలుగా జీతాలు రాకపోవడం.. అవుట్సోర్సింగ్ సిబ్బందిని తొలగింపునకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండటంతో ఈ–పంచాయతీ ఆపరేటర్లలో మరింత ఆందోళన మొదలైంది. అదనపు పనిభారం, ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు పడుతున్నారు. వేతనాలు చెల్లించాలని పంచాయతీరాజ్ మంత్రి సహా ఆ శాఖ ఉన్నతాధికారులకు, డీపీవోలకు వినతిపత్రాలు అందజేసినా ఆశించిన ఫలితం రావడంలేదని వారు వాపోతున్నారు. సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించే ఉద్ధేశంతో ఈ–పంచాయతీ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇందుకోసం 2014–15లో క్లస్టర్ వారీగా గ్రామ పంచాయతీ స్థాయిలో 94 మంది ఆపరేటర్లను నియమించింది. మండలానికి ముగ్గురు, నలుగురు చొప్పున మండల పరిషత్ కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా పరిపాలన వ్యయం నుంచి 10 శాతం నిధులతో ఒక్కో ఆపరేటర్కు రూ.19,500 వేతనం చెల్లించేవారు. సర్పంచుల పదవీకాలం ముగియడంతో కేంద్రం గ్రాంట్లు నిలిపేసింది. ఐదు నెలల క్రితం వరకు మల్టీపర్పస్ వర్కర్లకు కేటాయించిన నిధుల్లోని మిగులు బడ్జెట్ నుంచి చెల్లించారు. ప్రస్తుతం ఐదు నెలలుగా చెల్లించడంలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన సమాచారాన్ని ఆపరేటర్లు ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో ఆన్లైన్ చేస్తున్నారు. దశాబ్ద కాలంగా విధులు నిర్వర్తిస్తున్నా తమకు గుర్తింపు లేదని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాగా వేతనాల చెల్లింపు విషయమై డీపీవో శ్రీనివాస్రావు వివరణ కోరగా.. ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టిలో ఉందని, ట్రెజరీలో పెండింగ్లో ఉన్నట్లు తెలిసిందని సమాధానమిచ్చారు. అదనపు పనిభారంతో సతమతం గ్రామపంచాయతీ పనులతోపాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించి అన్నిరకాల పనులను ప్రభుత్వం ఈ–ఆపరేటర్లతో చేయిస్తోంది. ప్రజాపాలన, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతుభరోసా, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, భవన నిర్మాణ అనుమతులు, ఆస్తి మార్పిడి, వ్యాపార లైసెన్సు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు, ఎన్నికల పనులు, పంచాయతీల ఆదాయ, వ్యయాలతో పాటు ఇతరత్రా పనులు కంప్యూటీకరిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం వేతనాలు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. వేతనాలు, డిమాండ్ల పరిష్కారం కోసం డీపీవోను కలిసి వినతిపత్రం అందజేశాం. మేము ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు అసోసియేషన్ రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్తున్నాం. ఉద్యోగ భద్రత, డిమాండ్లపై రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు భవిష్యత్ కార్యాచరణతో ముందుకు సాగుతాం. – సురేశ్, ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు.. ఐదు నెలలుగా ఈ–పంచాయతీ ఆపరేటర్లకు అందని జీతాలు ‘అవుట్సోర్సింగ్’ సిబ్బంది తొలగింపుతో ఆందోళన సమస్య పరిష్కరించాలని ఉన్నతాధికారులకు వినతి -
పీజీ పరీక్షలకు 107 మంది గైర్హాజరు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న పీజీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ రెగ్యులర్ మొదటి, 7వ సెమిస్టర్ పరీక్షల్లో బుధవారం 107 మంది గైర్హాజరైనట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. వర్సిటీ పరిధిలో నిజామాబాద్లోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బోధన్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆర్మూర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బాన్సువాడలోని ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల, యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల, భిక్కనూర్ సౌత్క్యాంపస్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలకు 1,905 మందికి 1,798 మంది హాజరు కాగా 107 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ పీవీ రాజేశ్వర్రావు సుభాష్నగర్: పిల్లల భవిష్యత్తుకు వెలుగులు నింపే అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడంలో ఎన్పీడీసీఎల్ కీలకపాత్ర పోషిస్తోందని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ పీవీ రాజేశ్వర్రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్కిల్ పరిధిలో నేటికీ విద్యుత్ కనెక్షన్ లేని అంగన్వాడీ కేంద్రాలకు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 378 అంగన్వాడీలకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశామన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం లేని కేంద్రాలను గుర్తించి కనెక్షన్లు మంజూరు చేస్తున్నామన్నారు. కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించే పనుల దిశగా విద్యుత్ కనెక్షన్లు, అంతర్గత వైరింగ్, ఇతర సదుపాయాలు వేగవంతంగా పనులు కొనసాగుతున్నాయని, ఇది పూర్తిగా ఉచితమని తెలిపారు. విద్యుత్ వెలుగులతో అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి మోటర్లు, తదితర పరికరాలు సక్రమంగా పనిచేయడంతో పిల్లలు సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యను అభ్యసించగలుగుతున్నారని ఎస్ఈ తెలిపారు. పెర్కిట్(ఆర్మూర్): మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఎంహెచ్వో రా జశ్రీ సూచించారు. ఆలూర్ మండలం మచ్చర్ల గ్రామంలో బుధవారం అధికారులు గ్రామాభివృద్ధిలో మహిళల పాత్రపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి డీఎంహెచ్వో హాజరై మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు విధిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ కట్ల మల్లవ్వ, ఉప సర్పంచ్ కట్ట నర్సయ్య, ఎంపీడీవో గంగాధర్, ఎంఈవో నరేందర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ సమతా, ఎస్సై అప్పారావు, కార్యదర్శి నసీర్, మహిళ సంఘాల సభ్యులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య సబ్ సెంటర్ తనిఖీ మాక్లూర్: ఆలూర్ మండలం కల్లెడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న గుత్ప ఆరోగ్య కేంద్ర సబ్ సెంటర్ను డీఎంహెచ్వో రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలకు వేస్తున్న టీకాలు, గర్భిణులకు అందిస్తున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే సెంటర్లోని రికార్డులను పరిశీలించారు. అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
జాతీయ స్థాయి అవార్డుకు అవంతి ఎంపిక
బోధన్: హైదరాబాద్కు చెందిన గ్లోబల్ ఫౌండేషన్, వసుంధర విజ్ఞాన వికాస మండలి ఆధ్వర్యంలో ప్రతి ఏటా వివిధ రంగాల్లోని ప్రతిభావంతులకు జాతీయ స్థాయి అవార్డును అందిస్తుంది. చిత్ర కళలో రాణిస్తున్న బోధన్ పట్టణం తట్టికోట కాలనీకి చెందిన చిత్రకారిణి ఎర్రోల్ల అవంతి ‘బాపు చిత్ర కళారత్న’ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ నెల 26న హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించే అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో నిర్వాహకుల చేతుల మీదుగా అవంతి అవార్డును అందుకోనున్నారు. సాలూర మండల కేంద్రానికి చెందిన ప్రముఖ ఆర్టిస్ట్ లింబూరి లక్ష్మణ్ ప్రోత్సాహంతో ఇంటర్ చదువుకుంటూనే అవంతి డ్రాయింగ్ డిప్లొమాలో లోయర్, హయ్యర్ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. ఇటీవల ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా 15 అడుగుల ఎత్తు గల క్లాథ్ బ్యానర్పై శివాజీ చిత్రం గీశానని పేర్కొంది. -
మస్కట్లో ఆలూర్ వాసి మృతి
పెర్కిట్: ఆలూర్ మండల కేంద్రానికి చెందిన అండ్రాసి మల్లయ్య(45) మస్కట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు గ్రామస్తులు బుధవారం తెలిపారు. ఆలూర్ మండల కేంద్రానికి చెందిన మల్లయ్య ఉపాధి కోసం గల్ఫ్ దేశమైన మస్కట్ వెళ్లాడు. మంగళవారం పని ముగించుకుని రోడ్డు దాటుతుండగా కారు వేగంగా వచ్చి ఢీకొన్నది. దీంతో మల్లయ్య ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయ్యాడు. మల్లయ్యకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కేసు నమోదు మోపాల్: మండలంలోని ముదక్పల్లి గ్రామశివారులో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జాడె సుస్మిత గురువారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మంచిప్ప గ్రామానికిచెందిన కమ్మరి రాజు ఈనెల 2న సాయంత్రం ఆటోను నిర్లక్ష్యంగా నడిపి అదేసమయంలో బైక్పై వస్తున్న కొండెంగల శ్యామ్ను ఢీకొన్నాడు. ప్రమాదంలో శ్యామ్ కులి కాలి వేళ్లు, మోకాలి వద్ద గాయాలయ్యాయి. శ్యామ్ సోదరుడు వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కమ్మరి రాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. 304.70 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత డిచ్పల్లి: మండలంలోని ధర్మారం(బి) గ్రామంలో ఉన్న శ్రీగణేశ్ రైస్మిల్ లో అక్రమంగా నిర్వహించిన 304.70 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీ నం చేసుకొని కేసు నమోదు చేసినట్టు డిచ్పల్లి ఎస్సై ఆరిఫ్ తెలిపారు. ఎ స్సై తెలిపిన వివరాల ప్రకారం.. గణేష్ రైస్ మిల్లు రేషన్ బియ్యాన్ని అక్ర మంగా రవాణా చేస్తున్నారని అందిన సమాచారం మేరకు పోలీస్, సివిల్ సప్లై డీటీ రాథోడ్ రవికుమార్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది మంగళవారం రా త్రి దాడి నిర్వహించారు. రైస్ మిల్ యజమాని గందె నాగరాజును విచారించగా రేషన్ బియ్యానికి సంబంధించిన ఎలాంటి పత్రాలు చూయించ లేదు. ఈ దాడిలో 304.70 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకోగా వీటి విలువ రూ.11,57,860 ఉంటుందని తెలిపారు. డీటీ రవికుమార్ ఫిర్యాదు మేరకు రైస్ మిల్ యజమాని నాగరాజు, చీల రోహిత్, సీహెచ్ కిరణ్ కుమార్, ఆటో డ్రైవర్లు షేక్ రఫీ, షేక్ అన్సర్, షేక్ గౌస్పై కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
సౌత్క్యాంపస్లో విద్యార్థుల మధ్య ఘర్షణ
● ఏడుగురి విద్యార్థుల సస్పెండ్ ● హోలీ సంబరాల్లో చోటు చేసుకున్న ఘటన భిక్కనూర్: తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్క్యాంపస్లో సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య మంగళవారం అర్ధరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. హోలీ సంబరాల్లో పాల్గొన్న విద్యార్థులు డీజే సౌండ్ పెట్టుకుని నృత్యాలు చేస్తుండగా వివాదం తలెత్తింది. ఒకరి నుంచి మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో హిస్టరీ విభాగానికి చెందిన జూనియర్ విద్యార్థి రాజు తలకు గాయమైంది. విద్యార్థి రాజును దోమకొండ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అనంతరం జూనియర్ విద్యార్థులు బాలుర వసతి గృహం ప్రాంగణంలో ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఆంజనేయులు బాలుర హాస్టల్ వార్డెన్ యాలాద్రి సౌత్క్యాంపస్నకు చేరుకొని విద్యార్థులను సముదాయించి నిరసనను విరమింపజేశారు. బుధవారం ఉద యం విషయం తెలుసుకున్న రాజు కుటుంబ సభ్యులు సౌత్ క్యాంపస్కు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మరోమారు సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నెలకొంది. జూనియర్ విద్యార్థులు ప్రిన్సిపాల్ చాంబర్ ఎదుట ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఆంజనేయులు, ప్రిన్సిపాల్ సుధాకర్గౌడ్ సీనియర్, జూనియర్ విద్యార్థులతో మాట్లాడి కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రిన్సిపాల్ సుధాకర్గౌడ్ మాట్లాడుతూ.. ఘర్షణకు కారకులైన ఏడుగురు సీనియర్ విద్యార్థులను బాలుర వసతి గృహం నుంచి తాత్కాలింకగా సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఈ విషయమై కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ వివరించారు. తలుపులు మూసేసి దాడి? హోలీ సందర్భంగా సంబరాల్లో పాల్గొన్న విద్యార్థులు రెండు గ్రూపులుగా సీనియర్, జూనియర్లుగా విడిపోయి ఘర్షణ పడ్డారు. కొంత మంది జూనియర్ విద్యార్థులను సీనియర్లు మెస్ రూంలోకి తీసుకెళ్లి తలుపులు మూసి దాడులకు పాల్పడినట్లు జూనియర్లు ఆరోపించారు. -
రూ.151కే సీతారాముల కల్యాణ తలంబ్రాలు
సుభాష్నగర్: భద్రాచలంలో ఈ నెల 27న నిర్వహించే సీతారాముల వారి కల్యాణానికి వెళ్లలేని భక్తులకు కేవలం రూ.151కే కల్యాణ తలంబ్రాలు ఇంటి వద్దకే అందించే ఏర్పాట్లు ఆర్టీస చేపట్టిందని నిజామాబాద్ డిపో–1 మేనేజర్ ఆనంద్ తెలిపారు. ఈమేరకు బుధవారం నగరంలోని డిపో కార్యాలయంలో కల్యాణ తలంబ్రాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కల్యాణ తలంబ్రాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు ఆర్మూర్ డిపో– 73968 89496 బోధన్ డిపో – 91542 98729 నిజామాబాద్ – 1 91542 98727 నిజామాబాద్ – 2 73968 89496 బాన్సువాడ – 91542 98729 కామారెడ్డి డిపో – 91542 98729 ఆర్ఎం ఆఫీస్ – 86399 69647 ● ఇంటిపన్ను చెల్లించిన వారికి లక్కీ డ్రా ద్వారా బహుమతులు కమ్మర్పల్లి: మండలంలోని బషీరాబాద్లో సకాలంలో ఇంటి పన్ను చెల్లించిన వారికి లక్కీ డ్రా ద్వారా బహుమతులు అందజేశారు. జీపీ నూతన పాలకవర్గం కొలువుదీరిన సమయంలో సర్పంచ్ బైకానీ జమున, అధికారులు కలిసి 2025–26 సంవత్సరానికి గాను సకాలంలో ఇంటి పన్ను, పన్ను బకాయిలు చెల్లించిన వారికి లక్కీ డ్రా ద్వారా బహుమతులు అందజేస్తామని ప్రకటించారు. బుధవారం జీపీ ఆవరణలో గ్రామసభ నిర్వహించిన అనంతరం గ్రామస్తుల సమక్షంలో ఇంటి పన్ను చెల్లించిన 534 మంది చెల్లింపుదారుల ఇంటి నంబరు, పేరుతో కలిసి డ్రా పద్ధతిన విజేతలను ఎంపిక చేశారు. డ్రా లో సుంకెట చిన్న గంగారాం సీలింగ్ ఫ్యాన్, బొక్కెన శోభ హెల్మెట్, సుంకెట పెద్ద ముత్తెన్న రైస్ కుక్కర్ గెలుపొందారు. తహసీల్దార్ జీ ప్రసాద్, ఆర్ఐ శరత్, ఉపసర్పంచ్ చిలివేరి భూమేశ్వర్, కార్యదర్శి నరేందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న ఎల్ఎల్బీ ఐదో సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన ఈ పరీక్షకు 28 మందికి 27 మంది హాజరు కాగా ఒక విద్యార్థి గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. -
పెద్దపులి అలజడి
నిజామాబాద్విద్యార్థుల మధ్య ఘర్షణ హోలీ సంబరాలు తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్క్యాంపస్ విద్యార్థుల మధ్య ఘర్షణకు దారి తీశాయి. గురువారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2026– 8లో uసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఊహించిన విధంగానే జిల్లాలోకి పెద్ద పులి రావడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లోని జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల అటవీ ప్రాంతం నుంచి పెద్ద పులి వచ్చే అవకాశాలున్నట్లు అటవీ అధికారులు గత పది రోజులుగా భావిస్తూ వచ్చారు. అనుకున్నట్లుగానే పెద్ద పులి జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి రేంజ్ పరిధిలోకి వచ్చింది. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించారు. ఇందులో భాగంగా పులి అడుగులను గుర్తించారు. పాదముద్రల కొలతలను సేకరించారు. అయితే ఈ పులి ఎటు వెళ్లిందనే విషయమై అధికారులు ఒక అంచనాకు రాలేదు. కమ్మర్పల్లి రేంజ్ అధికారి రవీందర్ ఆధ్వర్యంలో ఆరుగురు సిబ్బంది కలిగిన మూడు బృందాలు బుధవారం ఆయా అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 3న కమ్మర్పల్లి రేంజ్లోని కోనాపూర్ సెక్షన్లోని ఇనాయత్నగర్ బీట్ పరిధిలో గట్టుపొడిచినవాగు సమీపంలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి పాద ముద్రలను గుర్తించారు. అయితే తాజాగా బుధ వారం పెట్రోలింగ్ చేసిన అటవీ సిబ్బందికి సమీప అడవుల్లో మరోచోట పెద్ద పులి పాద ముద్ర కనిపించింది. దీంతో పెద్దపులి కిలోమీటరు పరిధిలోనే ఉండవచ్చనే అంచనాకు వచ్చారు. కాగా పక్కనే సరిహద్దుల్లో ఉన్న సిరిసిల్ల జిల్లా మానాల అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు మరింత అలర్ట్ అయ్యారు. ● పెద్ద పులి కదలికలు కనిపెట్టడంతో పాటు అది ఎటువైపు వెళ్తుందో గమనించేందుకు గాను అటవీ శాఖ అధికారులు గట్టుపొడిచినవాగు సమీపంలో పలు చోట్ల ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. పులి దాహం తీర్చుకునేందుకు నీటి కుంటల వద్దకు వచ్చే అవకాశం ఉండడంతో దాని కదలికలు గుర్తించేందుకు అవకాశాలు ఉన్నాయి. ట్రాప్ కెమెరాల్లో పెద్ద పులి కదలికలు రికార్డు అయితే కమ్మర్పల్లి రేంజ్లోనే సంచరిస్తున్నట్లుగా అధికారులు స్పష్టమైన ప్రకటన చేస్తారు. ఒకవేళ రికార్డు కాకపోతే మాత్రం అది వేరే చోటికి వెళ్లినట్లుగా భావించాల్సి ఉంటుందని అంటున్నారు. జిల్లాలోని ఆయా రేంజ్ల పరిధిలోని గ్రామాల ప్రజలకు పెద్దపులి సంచారంపై హెచ్చరికలు జారీ చేశారు. జత కోసం.. జత కోసం వెదుకుతూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గత కొన్ని వారాలుగా తిరుగుతున్న పులి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు రెండు వారాల క్రితమే భావించిన అధికారులు తగినవిధంగా అప్రమత్తమయ్యారు. పది రోజుల కిందటే కమ్మర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ అధికారులను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. మహారాష్ట్రలోని తాడోబా అడవుల నుంచి అదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని జన్నారం మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లాకు వెళ్లి, తిరిగి మళ్లీ సిద్దిపేట జిల్లా, సిరిసిల్ల జిల్లా మీదుగా జగిత్యాల జిల్లాలోకి పులి ప్రవేశించింది. వేములవాడ ప్రాంతంలో ఒక ఆవును చంపేసింది. అయితే తాజాగా గుర్తించిన పులి పాదముద్రలను బట్టి ఇది 300 కిలోలకు పైగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. మేకల మందపై చిరుత దాడి వర్ని: మండలంలోని కూనిపూర్ అటవీ ప్రాంతంలో బుధవారం సాయంత్రం మేకల మందపై చిరుత దాడి చేసింది. గ్రామానికి చెందిన కుక్కలి సాయిలు మేకల మందను అటవీ ప్రాంతంలోకి మేత కోసం తీసుకువెళ్లగా చిరుత మందపై దాడి చేసి ఓ మేకను చంపేసింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. చిరుతల సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతాల్లోకి ఒంటరిగా వెళ్లొద్దని వర్ని అటవీ రేంజ్ అధికారి గంగారాం సూచించారు. 369 మంది విద్యార్థుల గైర్హాజరు ఖలీల్వాడి : జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్ర శాంత వాతావరణంలో కొనసాగుతున్నా యి. బుధవారం నిర్వహించిన సెకండియర్ మ్యాథ్స్–2 ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. మొత్తం 16,899 మంది విద్యార్థులకు గాను 16,530 (97.8 శాతం) మంది హాజరుకాగా, 369 మంది గైర్హాజరయ్యారని వివరించారు. 58 సెంటర్లలో ఎగ్జామ్స్ కొనసాగుతుండగా.. 54 సెంటర్లను తనిఖీ చేశామన్నారు. పుష్కరాల వేళ పటిష్ట బందోబస్తు రెంజల్(బోధన్): గోదావరి పుష్కరాలకు (2027 జూన్ – జూలై)పటిష్ట బందోబస్తు ఏ ర్పాటు చేస్తామని సీపీ సాయి చైతన్య అన్నా రు. కందకుర్తి పుష్కర క్షేత్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. 2015 పుష్కరాల నిర్వహణ, లోటుపాట్ల వివరాలను స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు. గతంలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. భక్తు లు రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా రూట్మ్యాప్ను రూపొందించాలని బోధన్ ఏసీపీ శ్రీనివాస్కు సూచించారు. వాహనాల పార్కింగ్కు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఘాట్లను పరిశీలించిన సీపీ.. పరిశుభ్రంగా ఉంచాలని స్థానిక సర్పంచ్ గయాసుద్దీన్కు సూచించారు. సీపీ వెంట బోధన్ రూరల్ సీఐ విజయ్బాబు, ఎస్సై చంద్రమోహన్ ఉన్నారు. ఇనాయత్నగర్ అడవిలో పెద్దపులి పాదముద్రల కోసం గాలిస్తున్న అటవీ సిబ్బంది ఇనాయత్నగర్ అటవీ ప్రాంతంలో అధికారులు గుర్తించిన పులి పాదముద్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. కోనాపూర్, ఇనాయత్నగర్, కొత్త చెరువు తండా, మానాల, నర్సాపూర్ గ్రామాలతో పాటు సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ క్షేత్ర అధికారి రవీందర్ హెచ్చరించారు. గ్రామస్తులు ఎవరూ ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లకూదన్నారు. రైతులు పంట చుట్టూ విద్యుత్ తీగలు ఏర్పాటు చేయవద్దని సూచించారు. మేకలు, గొర్రెలు, పశువుల కాపర్లు అడవిలో అప్రమత్తంగా ఉండాలన్నారు. కమ్మర్పల్లి: పెద్దపులి అడుగుల గుర్తింపు కోసం అటవీ అధికారులు కాలినడకన గా లింపు చర్యలు చేపట్టారు. కమ్మర్పల్లి రేంజ్ అధికారు లు గట్టు పొడిచిన వాగు ప్రా జెక్ట్ బ్యాక్ వాటర్ ఏరియా కాంపార్ట్మెంట్ నంబర్ 14 లో తిరిగారు. మెట్పల్లి రేంజ్, సిరిసిల్ల జిల్లా మ ల్యాల, చందుర్తి రేంజ్ల అటవీ అధికారులు కో నాపూర్ రాళ్లవాగు ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ప్రదేశం కాంపార్ట్మెంట్ 24లో గాలించారు. కమ్మ ర్పల్లి రేంజ్ ఇనాయత్నగర్ పరిధిలోని కాంపార్ట్మెంట్ 14లో పెద్దపులి వంద మీటర్ల వరకు సంచరించినట్లు పాదముద్రలను గుర్తించారు. పెద్ద పులి సంచరించిన చోట ఒక్కో అడుగు 17 నుంచి 19 సెంటీమీటర్లు ఉన్నట్లు కమ్మర్పల్లి అట వీ క్షేత్ర పరిధి అధికారి రవీందర్ తెలిపా రు. అడుగులను బట్టి మగపులిగా గుర్తించామన్నారు. జగిత్యాల, సిరిసిల్ల సరిహద్దుల్లో సంచరించి జిల్లాలోకి వచ్చినట్లు పేర్కొన్నారు. కమ్మర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి రేంజ్లలో టెన్షన్ పులి రాక నిర్ధారణ.. ఎటు వెళ్లిందో అంచనాకు రాలేకపోతున్న అధికారులు ట్రాప్ కెమెరాల ఏర్పాటు, పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అటవీశాఖ క్రమంగా అడుగంటుతున్న భూగర్భ జలాలు రెండు నెలల్లో 3.36 మీటర్లు తగ్గిన వైనం జిల్లాలో ప్రస్తుత నీటి మట్టం 11 మీటర్లు -
ఎత్తిపోతున్న బోర్లు..!
డొంకేశ్వర్(ఆర్మూర్): వేసవి ప్రారంభంలోనే జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. గడిచిన రెండు నెలల్లో ఏకంగా 3.36 మీటర్ల లోతులోకి వెళ్లాయి. జనవరిలో 2.36 మీటర్లు, ఫిబ్రవరిలో 1 మీటరు మేర తగ్గిపోవడం నీటి వినియోగ తీవ్రతను తెలుపుతోంది. వరినాట్లు పూర్తి కావడంతో వ్యవసాయ బోర్ల వాడకం పెరిగింది. దీంతో పలు ప్రాంతాల్లో మోటార్లకు నీరందక ఎత్తిపోతున్నాయి. పంట పొలాలకు నీరు అందించడానికి రైతులకు ఇబ్బందులు ఇప్పుడే మొదలయ్యాయి. కొన్ని చోట్ల వ్యవసాయ, గృహవసర బోర్లు సన్న ధార పోస్తున్నాయి. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే మూడు నెలలు ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జనవరిలో 9.56 మీటర్లలో ఉన్న భూగర్భ జలాలు ఫిబ్రవరి ముగిసే నాటికి 11 మీటర్ల లోతులోకి చేరాయి. ఇది 2025 ఫిబ్రవరి నెలతో (11.94 మీటర్లు) పోలిస్తే కొంచెం మెరుగైన పరిస్థితి అయినప్పటికీ భూరగ్భ జలాలు వేగంగా కిందికి వెళ్తున్నాయి. ఇటీవల గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారులు జిల్లాలో 82 పరిశీలక బోరు బావులు (ఫీజో మీటర్లు) ద్వారా జనవరి మాసానికి సంబంధించిన నీటి లెక్కలను తీశారు. ఇందులో 45 ఫీజో మీటర్లలో 10 మీటర్ల లోపు నీటి మట్టాలున్నాయి. అలాగే 30 ఫీజో మీటర్లలో 10 నుంచి 20 మీటర్ల లోపు భూగర్భ జలాలున్నాయి. అదే విధంగా 7 ఫీజో మీటర్లలో 20 మీటర్ల లోతులో ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఆరోగ్యకర నీటి మట్టాలు 54.87శాతం విస్తీర్ణంలో ఉన్నాయి. భీమ్గల్, సిరికొండ, డిచ్పల్లి, మోపాల్, నవీపేట్ మండలాల్లో కొన్ని ప్రాంతాల్లో వేగంగా నీటి మట్టాలు తగ్గుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. నీటిని పొదుపుగా వాడుకోవాలి వేసవిలో ఎల్నినో ప్రభావం ఉండొచ్చని ప్రపంచ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లా ప్రజలు, రైతులు భూగర్భ జలాలు తగు మోతాదులో వాడుకోవాలి. రానున్న రోజుల్లో నీటి ఎద్దటి రాకుండా ఉండాలంటే నీటిని వృథా చేయకూడదు. వృథా నీరు భూమిలోకి చేరేలా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి. – శ్రీనివాస్బాబు, జిల్లా భూగర్భ జల శాఖ అధికారి -
విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి
● పీడీఎస్యూ డిమాండ్ డిచ్పల్లి: ఇందల్వాయి మండల పరిధిలోని ఏకలవ్య గురుకుల పాఠశాల విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు కర్క గణేష్ డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం విద్యార్థి మృతి పై వివరాలు సేకరించడానికి పీడీఎస్యూ నాయకులు ఏకలవ్య పాఠశాలకు చేరుకున్నారు. అధికారులు వారిని అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కర్క గణేశ్ మాట్లాడుతూ విద్యార్థి రామ్చరణ్ మంగళవారం ఉరి వేసుకుని మృతి చెందిన ఘటనలపై అనుమానాలున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు మున్నా, జీవన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి:బీజేవైఎం ఏకలవ్య గురుకుల పాఠశాలలో విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమైన విషయమని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పానుగంటి సతీష్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన డిచ్పల్లిలో విలేకరులతో మాట్లాడుతూ ఈ దుర్ఘటనకు పాఠశాల ప్రిన్సిపాల్, కొంతమంది ఉపాధ్యాయుల మానసిక ఒత్తిడి కారణమని తోటి విద్యార్థులు వెల్లడించడం ఆందోళన కలిగించే విషయమన్నారు. బీజేవైఎం ప్రధాన కార్యదర్శి అమంద్ విజయ్ కృష్ణ పాల్గొన్నారు. బాధ్యులను శిక్షించాలి: ఎస్ఎఫ్ఐ ఖలీల్వాడి: ఏకలవ్య గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతి అనుమానాలున్నాయని, బాధ్యులు శిక్షించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి విఘ్నేష్ అన్నారు.ఈమేరకు బుధవారం విఘ్నేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు. న్యాయం జరిగే వరకు పోరాడుతాం: ఏబీవీపీ ఖలీల్వాడి: ఇందల్వాయి ఏకలవ్య గురుకుల పాఠశాలలో మృతి చెందిన విద్యార్థికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ అమృతచారి ఆన్నారు. బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు.ఇందూరు జిల్లా కన్వీనర్ అక్షయ్, జిల్లా హాస్టల్ కన్వీనర్ సమీర్, విద్యార్థి నాయకులు అశోక్, శివ, లెనిన్, కార్తీక్, నితిన్ పాల్గొన్నారు. -
వాల్పోస్టర్ల ఆవిష్కరణ
నిజామాబాద్ రూరల్: నగరంలోని నీలం రామచంద్రయ్య భవన్లో ఈనెల 8న మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు ప్రగతిశీల మహిళా సంఘం నగర అధ్యక్ష, కార్యదర్శులు నీలం లక్ష్మీ, గొంట్యాల సంజన తెలిపారు.బుధవారం పోచమ్మగల్లిలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని కోరారు.మహిళల హక్కుల కోసం ఉద్యమాలు నిర్మిద్దామని పిలుపునిచ్చారు.పీవోడబ్ల్యూ నాయకులు జమున రాధా నర్సు బాయి, కళావతి, పోచమ్మ గల్లీ కాలనీవాసులు పాల్గొన్నారు. ధర్పల్లి: మండల కేంద్రంలోని లిటిల్ హార్ట్స్ పాఠశాలలో బుధవారం విద్యార్థులకు నాలెడ్జ్ టెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో విద్యార్థుల నైపుణ్యం పెంపొందించే విధంగా వివిధ మోడల్స్ రూపంలో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ప్రి న్సిపల్ అల్లాడి శ్రీకాంత్, డైరెక్టర్ ప్రశాంత్, స్పందన ఉపాధ్యాయులు తదితరులున్నారు. విద్యార్థులు సంస్కారాన్ని పెంచుకోవాలి నిజామాబాద్ రూరల్: విద్యార్థులు చదువుతోపాటు సంస్కారాన్ని పెంచుకోవాలని నిజామాబాద్ రూరల్ మండల విద్యాశాఖ అధికారి సేవులా అన్నారు. బుధవారం సారంగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల సాంస్కతిక ప్రదర్శనలు అలరించాయి. పాఠశాల హెచ్ఎం పోశన్న, ఉపాధ్యాయులు లలిత, డాక్టర్ సత్యనారాయణ, గోపాల్, మొహమ్మద్ జావిద్, విద్యాసాగర్, గంగాధర్, ఘనపురం దేవేందర్, స్వరూప, లలిత, శ్రీలత, సుజాత, సునంద, కృష్ణంరాజు తదితరులున్నారు. -
కాంగ్రెస్కు కుల, మత భేదాల్లేవ్
సుభాష్నగర్: కాంగ్రెస్కు కుల, మత భేదాల్లేవని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు పార్టీకి మూల స్తంభాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ భవన్లో కార్పొరేషన్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 21 నుంచి పది రోజుల పాటు వికారాబాద్లో జరిగిన సంఘటన్ శ్రీజన్ అభియాన్ డీసీసీ అధ్యక్షుల శిక్షణ అనుభవాలను మీడియాతో నగేష్రెడ్డి పంచుకున్నారు. అంటరాని తనం, ప్రజల్లో అంతరాలకు కాంగ్రెస్ వ్యతిరేకమని, గరీబీ హఠావో ఇందిరాగాంధీ నినాదమని గుర్తు చేశారు. కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదని, ఎందరో ప్రాణత్యాగాలు చేశారన్నారు. మేధావులు, యువకులు, విద్యార్థులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందన్నారు. కేసీఆర్ దొంగ నిరాహార దీక్ష చేశారని, దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మాట తప్పారని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్ర అప్పు రూ.64 వేల కోట్లు ఉంటే, కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ అప్పు రూ.8 లక్షల కోట్లకు చేరిందన్నారు. కాంగ్రెస్ పాలనలోనే ప్రాజెక్టులు కట్టారని, రోడ్లు వేశామని, పేదలకు ఇండ్లు, పింఛన్లు, ఎయిర్ పోర్టులు, విశ్వ విద్యాలయాలు, ట్రిపు ల్ ఐటీలు, ఆస్పత్రులు నిర్మించారన్నారు. సీ ఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమా ర్గౌడ్ సారథ్యంలో జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. పనిచేసే వారికే ప్రాధాన్యత.. కాంగ్రెస్ కార్పొరేషన్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి రా మకృష్ణ మాట్లాడుతూ శిక్షణా శిబిరంలో ఏఐసీసీ నా యకులు, రాష్ట్ర మంత్రులు, మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, మేధావు లు, ప్రొఫెసర్లు వివిధ అంశాలపై శిక్షణనిచ్చారని తెలిపారు. ఏఐసీసీ నాయకులు, మంత్రులు పార్టీని బలోపే తం చేయడంపై దిశానిర్దేశం చేశారన్నారు. పార్టీ జిల్లా, మండల, బూత్ కమిటీలను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. కాంగ్రెస్లో పనిచేసే వారికి ప్రాధాన్యత ఉంటుందని, ఆర్గనైజేషన్ విషయంలో ఎవరి పరిధిలో వారు పని చేసుకోవాలని అధిష్టానం సూచించిందని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారందరికీ సర్టిఫికెట్తోపాటు చరఖాను ప్రదానం చేశారని, రాహుల్ గాంధీ నా లుగు గంటలపాటు ఆత్మీయంగా కుటుంబ సభ్యులందరితో ఫొటో సెషన్కు అవకాశమివ్వ డం మరుపురాని సంఘటన అని, ఆయనకు రుణప డి ఉంటామన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజరెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, సీని యర్ నాయకులు జావిద్ అక్రమ్, నరాల రత్నాకర్, ఘన్రాజ్, విఫుల్ గౌడ్, గడీల రాములు, వైశాక్షి సంతోష్, రాజా నరేందర్ గౌడ్, కెతావత్ యాదగిరి, సు భాష్ జాదవ్, మల్యాల గోవర్ధన్ పాల్గొన్నారు. రాహుల్గాంధీని ప్రధానిని చేసి తీరుతాం.. ప్రజలు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేశారని, ఈ అవకాశాన్ని ప్రజలు, పార్టీ కోసం పని చేసి సద్వినియోగం చేసుకోవాలని రాహుల్గాంధీ చెప్పారని నగేష్ రెడ్డి పేర్కొన్నారు. ఎవరికీ గులాంగిరి చేయొద్దని, పార్టీకి, కార్యకర్తలకు, ప్రజలకు మాత్రమే గులాంగిరి చేయాలని సూచించారన్నారు. 2029 ఎన్నికల్లో జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు. రాహుల్గాంధీని ప్రధానిని చేసి తీరుతామన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ అని, మతం ఆధారంగా రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మూలస్తంభాలు అందరి సమన్వయంతో పార్టీని మరింత బలోపేతం చేస్తాం డీసీసీ అధ్యక్షుడు కాట్పల్లి నగేష్రెడ్డి -
బాధిత కుటుంబం ఆందోళన
సుభాష్నగర్/ఇందల్వాయి: ఆత్మహత్య చేసుకున్న ఏకలవ్య ఆదర్శ గురుకులం విద్యార్థి రామచరణ్ కుటుంబ సభ్యులు బుధవారం పాఠశాల ఎదుట, జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ జనరల్ ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న ట్రైబల్ వెల్ఫేర్ ఆర్సీవో గంగారాం నాయక్ పాఠశాలకు చేరుకొని విచారణ చేపట్టారు. పాఠశాల వద్ద పోలీసులు బందబోస్తు నిర్వహించారు. ఉపాధ్యాయుల ఒత్తిడి కారణంగానే రామ్చరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపించారు. విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు అక్కడికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను సముదాయించి పంపించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఇందల్వాయి ఎస్సై సందీప్ తెలిపారు. ఇందల్వాయిలో మాట్లాడుతున్న బాధితులుజీజీహెచ్ ఎదుట బైఠాయించిన బాధిత కుటుంబం -
ఏకలవ్య సిబ్బందిపై వేటు
● విద్యార్థి ఆత్మహత్య ఘటనపై కలెక్టర్ సీరియస్ ● ప్రిన్సిపాల్తోపాటు నలుగురి సస్పెన్షన్ డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): ఇందల్వాయి మండలం మాక్లూర్ తండాలోని ఏకలవ్య ఆదర్శ గురుకులం విద్యార్థి ఆత్మహత్యఘటనను కలెక్టర్ ఇలా త్రిపాఠి తీవ్రంగా పరిగణించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల ఆర్సీవో గంగారాం నాయక్ నేతృత్వంలో ఇతర జిల్లాల ఏకలవ్య గురుకులాల ప్రిన్సిపాల్లు శ్రీనివాస్స్వామి, డాక్టర్ సైదా జైనబ్, ఫణికుమార్, డాక్టర్ జ్యోతి ప్రాథమిక విచారణ చేపట్టి నివేదిక సమర్పించారు. వారి నివేదిక ఆధారంగా ప్రిన్సిపాల్ రమేశ్కుమార్, హౌజ్ మాస్టర్ కుల్దీప్యాదవ్, హాస్టల్ వార్డెన్ విశ్వంబర్, మెస్ ఇన్చార్జి ఆకాశ్యాదవ్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ త్రిపాఠి బుధవారం పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి తొమ్మిదో తరగతి విద్యార్థి రామ్చరణ్ ఆత్మహత్య ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు, సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రామ్చరణ్ బలవన్మరణానికి పాల్పడడం ఎంతో బాధ కలిగించిందని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో అనేక సమస్యలు వస్తుంటాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. క్రమశిక్షణతో ముందుకెళ్తే మంచి భవిష్యత్ సొంతమవుతుందన్నారు. తప్పుడు నిర్ణయాలతో నిండు జీవితాన్ని బలవంతంగా అంతం చేసుకోవద్దని, తల్లిదండ్రులకు కడుపు కోత మిగల్చవద్దని సూచించారు. ఆత్మహత్య ఆలోచనలు దరి చేరకుండా, ఏకాగ్రతతో చదువుపై దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికారు. కలెక్టర్ వెంట ఆర్సీవో గంగారాం నాయక్ తదితరులు ఉన్నారు. -
స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లాలి
నిజామాబాద్ అర్బన్: ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ విజయవంతానికి కృషి చేయాలని, ఐదు దశల్లో నిర్వహించనున్న కార్యక్రమాలపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోందన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం సాయంత్రం నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఐదు దశల్లో చేపట్టనున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలన్నారు. ఈనెల 6న జిల్లా ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికపై సన్నాహక సమావేశం ఉంటుందని, అన్ని శాఖల అధికారులు సమగ్ర వివరాలతో హాజరు కావాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు కిరణ్కుమార్, దిలీప్కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక విజయవంతానికి కృషి చేయండి 6న ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం సమీక్షా సమావేశంలో అధికారులతో కలెక్టర్ ఇలా త్రిపాఠి -
లైన్మన్ల సేవలు అభినందనీయం
● ఘనంగా లైన్మన్ దివస్ ● సిబ్బందికి ప్రశంసాపత్రాల అందజేతసుభాష్నగర్/సిరికొండ : ఎన్పీడీసీఎల్ సంస్థలో క్షేత్రస్థాయిలో లైన్మన్ల సేవలు అభినందనీయమని డీఈలు అల్జాపూర్ రమేశ్, వెంకటరమణ కొనియాడారు. బుధవారం నగరంలోని ఎంఆర్టీ కన్స్ట్రక్షన్ డివిజన్, డీ–2, 3, 5, 9, బోర్గాం(పి) సెక్షన్లో టెస్టర్ గ్రేడ్–1, 2, జూనియర్ లైన్మన్, ఆర్టిజన్లను పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. అనంతరం ప్రశంసాపత్రాలతో సన్మానించారు. అనంతరం వారితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏడీఈలు తోట రాజశేఖర్, ప్రదీప్రెడ్డి, ఏఈలు గయాస్ అహ్మద్, బాబా శ్రీనివాస్, జాకీర్ అలీ, మౌనిక రెడ్డి, రజిని, ఫోర్మెన్లు, లైన్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. సిరికొండ విద్యుత్ శాఖ కార్యాలయంలో లైన్మన్లను మేన్లను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాకారం రవి, సిరికొండ సెక్షన్ ఏఈ చంద్రశేఖర్ ఘనంగా సన్మానించారు.సబ్ ఇంజనీర్ గంగారాం సిబ్బంది పాల్గొన్నారు. ఎంఆర్టీలో లైన్మన్లను సన్మానించిన డీఈ, ఏడీఈ, ఏఈలుడీ–5 సెక్షన్లో లైన్మన్లను సత్కరించి ప్రశంసాపత్రాలు అందజేసిన డీఈ, ఏడీఈ, ఏఈలు -
అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠా అరెస్ట్
● జైలులో కలిసి ముఠాగా ఏర్పడి చోరీలు ● నిందితులపై పాత కేసులు ● వివరాలు వెల్లడించిన సీపీ సాయి చైతన్య నిజామాబాద్అర్బన్: ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి, కాపర్ కాయిల్స్ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకొని అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ నగరంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ముఠాలో మొత్తం 10 మంది ఉన్నారు. ఏడుగురిని అరెస్టు చేయగా, ముగ్గురు పరారీలో ఉన్నారు. నిందితులు గత మూడు నెలలుగా నిజామాబాద్ జిల్లాలోని నవీపేట, నందిపేట, బోధన్ ఎడపల్లి, ప్రాంతాలతో పాటు నిర్మల్ జిల్లా బాసర, ముధోల్, తానూరు, బైంసా, కుంటాల, నర్సాపూర్ జి మండలాలలో ట్రాన్స్ఫార్మర్ల రాగి తీగలను దొంగతనం చేస్తున్నారు. విద్యుత్ అధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయగా కేసులు నమోదయ్యాయి. ప్రధాన నిందితుడు నిజామాబాద్లోని ఆటోనగర్కు చెందిన అఫ్జల్ ఖాన్ను, ముఠా సభ్యులు రెంజల్కు చెందిన సిద్ధిఖాన్, ధర్మపురి హిల్స్కు చెందిన అర్వాజ్ ఖాన్, భైంసాకు చెందిన మెహబూబ్ ఖాన్, అర్సపల్లికి చెందిన బోర్గే బాలాజీ, నాందేడ్కు చెందిన ఆరిఫ్, వెంగళరావు కాలనీకి చెందిన మహమ్మద్ రాజాలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రెంజల్కు చెందిన హుస్సేన్ ఖాన్, జిల్లా కేంద్రంలోని సాగర్హిల్స్కు చెందిన షేక్ తహేర్, భైంసాకు చెందిన మహమ్మద్ అప్సర్ పరారీలో ఉన్నారు. నిందితుల్లో కొందరు గతంలో ఆవుల దొంగతనం, బైకుల చోరీ కేసుల్లో జైలుకు వెళ్లగా, అక్కడ పరిచయమై, ముఠాగా ఏర్పడ్డారు. పగలు రెక్కి నిర్వహించి రాత్రికి బైకులపై వచ్చి దొంగతనానికి పాల్పడుతున్నారు. 34 చోట్ల సుమారు 8 నుంచి 10 క్వింటాళ్ల రాగి తీగలను చోరీ చేసి, నిజామాబాదులోని ఏపీహెచ్బీ కాలనీలో ఒక రూమును అద్దెకు తీసుకొని దాచిపెట్టేవారు. అక్కడ నుంచి సమయానుకూలంగా కిలోకి రూ. 800 చొప్పున విక్రయించేవారు. వచ్చిన డబ్బులతో జల్సాలకు పాల్పడేవారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఈ గ్యాంగ్ను పట్టుకున్నట్లు సీపీ సాయి చైతన్య వివరించారు. నిందితుల నుంచి 20 క్వింటాళ్ల కాపర్ కాయిల్స్, రూ.2,75,000 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, చోరీకి వినియోగించే పనిముట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఏసీపీ ప్రకాష్, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, నవీపేట ఎస్సై శ్రీకాంత్, యాదగిరి గౌడ్, మాక్లూర్ ఎస్సై రాజశేఖర్, ఐదో టౌన్ ఎస్సై గంగాధర్, ఏఎస్ఐ గఫార్ హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్, రాజారెడ్డి, సందీప్, అబ్బులు, శ్రీకాంత్ గౌడ్, నాగరాజ్ శంకర్, సాయిలు, రామకృష్ణ, సచిన్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ స్తంభాల ఏర్పాటుపై వివాదం
రెంజల్: ఓ ప్రజాప్రతినిధి తన సొంత పొలానికి విద్యుత్ లైన్ను వేసుకునేందుకు యత్నించగా, గ్రామస్తులు అడ్డుకున్నారు. వివరాలు ఇలా.. మండలంలోని కళ్యాపూర్ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధికి గ్రామంలోని శ్మశాన వాటిక పక్కన పట్టా భూమి ఉంది. పొలంలో విద్యుత్ కనెక్షన్ కోసం ఇటీవల విద్యుత్ శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకోగా, ఎస్టిమేషన్ వేసి అందుకు అవసరమైన నిధులు డీడీ రూపంలో చెల్లించాలని ట్రాన్స్కో వారు సూచించారు. కానీ సదరు ప్రజాప్రతినిధి ఇవేమి పట్టించుకోకుండా సోమవారం గ్రామ చెరువు సమీపంలో వృథాగా ఉన్న 6 విద్యుత్ స్తంభాలను తీసుకొని తన పొలం పక్కన ఉన్న శ్మశాన వాటిక దగ్గర పాతించారు. విషయం తెలుసుకున్న స్థానికులు ట్రాన్స్కో అధికారులకు సమాచారం అందించారు. అధికారుల నుంచి ఒత్తిడి రావడంతో అతడు వాటిని యథాస్థానంలో పెట్టాడు. మళ్లీ మంగళవారం విద్యుత్ స్తంభాలను తిరిగి శ్మశానవాటిక దగ్గర పాతించారు. ఈ విషయమై ఇన్చార్జి లైన్మన్ విచారణ చేశారు. సమస్యను తమ ఉన్నతాధికారులకు నివేదించినట్లు ఆయన తెలిపారు. తదుపరి చర్యలు వారు తీసుకుంటారని ఇన్చార్జి ఏఈ కిశోర్ వివరించారు. శ్మశాన వాటికకు కరెంట్ లేకపోవడంతో గతంలో పలువురు ప్రమాదాలకు గురయ్యారు. స్థానికుల సూచన మేరకు చెరువు కట్ట వద్ద నిరుపయోగంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తీసుకొచ్చి పాతించాను. ఇందులో ఎలాంటి దురుద్దేశంలేదు. కావాలనే కొందరు తనపై కక్ష పెంచుకుని రాద్ధాంతం చేస్తున్నారు. – భానుచందర్, సర్పంచ్, కళ్యాపూర్ 15 ఏళ్ల క్రితం గ్రామంలోని చెరువు కట్ట పక్కన విద్యుత్ అధికారులు స్తంభాలను ఏర్పాటు చేశారు. అధికారులకు సమాచారం లేకుండా సర్పంచ్ 6 స్తంభాలతోపాటు విద్యుత్ తీగలను తీసుకుని శ్మశాన వాటిక పేరుతో తన సొంత పొలం వద్దకు తీసుకెళ్తున్నాడు. ట్రాన్స్కో అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. – కాశం సాయిలు, వీడీసీ చైర్మన్ కళ్యాపూర్లో సొంత పొలానికి విద్యుత్ లైన్ తీసుకునేందుకు ఓ ప్రజాప్రతినిధి ప్రయత్నం! అడ్డుకున్న గ్రామస్తులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని ట్రాన్స్కో అధికారులు -
గంజాయి విక్రేతల అరెస్టు
నిజామాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ముస్తాయిద్పుర కాలనీలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ శాఖ ఎస్హెచ్వో స్వప్న మంగళవారం తెలిపారు. వివరాలు ఇలా.. ముస్తాయిద్ పురకు చెందిన షేక్ అబ్దుల్ కై సర్ అనే వ్యక్తి తన ఇంటిలో గంజాయి కలిగి ఉండి విక్రయిస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు నిందితుడి ఇంటిపై దాడి చేయగా, 1.6 కిలోల గంజాయి లభించిందన్నారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. వేల్పూర్ మండలంలో.. వేల్పూర్: వేల్పూర్ క్రాస్రోడ్డు 63 నంబరు జాతీయ రహదారిపై మంగళవారం గంజాయిని సరఫరా చేయడానికి వచ్చిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై సంజీవ్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు వేల్పూర్ క్రాస్రోడ్డు వద్ద నిఘా ఉంచగా భీమ్గల్కు చెందిన శ్రీరామ్ అఖిల్, సయ్యద్ సోహైల్, నాందేడ్కు చెందిన షేక్ అర్బాజ్, నాందేడ్కు చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేశామన్నారు. వారి వద్ద 47 గ్రాముల చరస్(గంజాయి పదార్థం), 29 గ్రాముల ఎండు గంజాయి లభించినట్లు వెల్లడించారు. వీరంతా వేల్పూర్ మండలంలోని ఒక వ్యక్తికి గంజాయి సరఫరా చేస్తున్నట్లు తెలిసి, నిఘా ఉంచగా పట్టుబడ్డట్లు వెల్లడించారు. వీరి వద్ద నుంచి ఒక ద్విచక్రవాహనం, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. డిచ్పల్లి(ఇందల్వాయి): పోలీసుల విధులకు అడ్డంకి కలిగించిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఇందల్వాయి ఎస్సై సందీప్ తెలిపారు. వివరాలు ఇలా.. ఇందల్వాయి పోలీస్ స్టేషన్కు సంబంధించి సోమవారం రాత్రి విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు పోతుల ప్రతాప్, తిరుపతిలకు అర్ధరాత్రి మెగ్యానాయక్ తండాలో గొడవ జరుగుతున్నట్లు డయల్ 100 ద్వారా సమాచారం అందింది. వెంటనే వారు తండాకు చేరుకుని పరిశీలించగా లకావత్ నరేష్, లకావత్ బంతిలాల్, దెగావత్ పీర్సింగ్ అలియాస్ చందు మద్యం మత్తులో గొడవ పడుతూ అల్లర్లు సృష్టిస్తున్నట్లు గుర్తించారు. వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించగా పోలీసులను దూషిస్తూ విధినిర్వహణకు అడ్డంకి కలిగించారు. కానిస్టేబుళ్ల ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసి మంగళవారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. నిజామాబాద్అర్బన్: గ్రామస్తులను బెదిరింపులకు గురిచేస్తు న్న కానిస్టేబుల్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని నందిపే ట మండలం లక్కంపల్లి సర్పంచ్ సంతోష్గౌడు మంగళవా రం సీపీ సాయి చైతన్యకు ఫిర్యాదు చేశారు. హోలీ రోజున కామదహనాన్ని డప్పులతో ర్యా లీగా తీసుకురాలేదని గ్రామ కమిటీతో తనపై రూ.5000 జరిమానా వేయించారన్నారు. అ లాగే గ్రామంలో తరచు అనేక వివాదాలు సృష్టించడం గొడ వలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాడని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన స్థాని క సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయా ల్లో పా ల్గొంటూ గొడవలకు కారణం అవుతున్నాడని పేర్కొన్నారు. వెంటనే ఉన్నతాధికారులు విచారణ జరిపిచర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కొరియర్ సిబ్బందిపై.. నిజామాబాద్అర్బన్: కొరియర్ సిబ్బంది తన వస్తువులను మాయం చేశాడని వెంకటరమణ అనే వ్యక్తి మంగళవారం రెండవ టౌన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా.. ఇటీవల ఓ ప్రయివేట్ కొరియర్ ద్వారా తాను పార్సిల్ పంపానని, అందులో నాలుగు ట్యాబ్లు ప్యాకింగ్ చేసి కొరియర్ యజమానికి అందజేశానన్నారు. అయితే పా ర్సిల్ చేరాల్సిన స్థలానికి వెళ్లలేదన్నారు. తాము విచారిస్తే స దరు కొరియర్ సిబ్బంది తన పార్సిళ్లను మాయం చేసినట్లు తెలిసిందన్నారు. హైదరాబాద్లోని సదరు కొరియర్ బ్రాంచ్ ను సంప్రదించగా సరైన సమాధానం ఇవ్వలేదన్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
తీవ్ర జాప్యం.. యువతలో నైరాశ్యం
మోర్తాడ్(బాల్కొండ): రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతీయువకులకు స్వయం ఉపాధిని కల్పించడానికి ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈపథకం ద్వారా యువతకు రాయితీ రుణాలను అందించడమే లక్ష్యంగా దరఖాస్తులను సైతం స్వీకరించింది. కానీ నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రుణాలను అందించకపోవడంతో దరఖాస్తులు చేసుకున్న యువతలో నైరాశ్యం నెలకొంది. జిల్లాలో 58వేలకు పైగా దరఖాస్తులు.. గత ప్రభుత్వాలు ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ఆయా సామాజిక వర్గాల యువతకు రాయితీపై రుణాలను పంపిణీ చేసేవారు. సామాజిక వర్గాల వారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా రాయితీని లబ్ధిదారులు పొందేవారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధు, బీసీబంధు పథకాల పేరిట కొంత మందికే లబ్ధి చేకూర్చి ముఖం చాటేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కార్పొరేషన్లను అన్నింటిని ఒకే గొడుగు కిందకు తీసుకవచ్చి ‘రాజీవ్ యువ వికాసం’ కార్యక్రమం కింద రాయితీ రుణాలు ఇవ్వడానికి పెద్ద ఎత్తున దరఖాస్తులను స్వీకరించింది. ఇందులో భాగంగా జిల్లాలో సుమారు 58వేల మంది తొమ్మిది నెలల కింద దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ఏ ఒక్క దరఖాస్తుకు కూడా రుణం పంపిణీ చేయలేదు. రాజీవ్ యువ వికాసం పేరిట అన్ని కార్పొరేషన్ల ద్వారా ఆయా సామాజిక వర్గాల నిరుద్యోగులకు రుణాలు అందించి వారి స్వయం ఉపాధికి బాటలు వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆచరణలో మాత్రం విఫలం కావడంతో యువతకు నిరాశే మిగిలింది. దీంతో రాయితీ రుణాల పంపిణీ లక్ష్యంకు ప్రభుత్వం గండికొడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్న రుణాలకు వంద శాతం రాయితీ.. రాజీవ్ యువ వికాసం కార్యక్రమంలో భాగంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా రూ.50వేల వరకూ రుణ సదుపాయం కల్పిస్తే వంద శాతం రాయితీని ప్రకటించారు. రూ.లక్ష వరకు రుణం పొందితే 90 శాతం రాయితీ, రూ.2లక్షల వరకు రుణం పొందితే రూ.80శాతం రాయితీని రూ.2లక్షల నుంచి రూ.4లక్షల వరకు రుణం పొందినవారికి 70 శాతం రాయితీని అందిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఎక్కువ మంది రూ.4లక్షల వరకు రుణాలు పొందాలని దరఖాస్తు చేసుకున్నారు. బ్యాంకులు కూడా సమ్మతించినా ప్రభుత్వం రాయితీ నిధులను విడుదల చేయకపోవడంతో బ్యాంకర్లు ఏమీ చేయలేకపోయారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా యువతీయువకులకు రాయితీ రుణాలు అందిస్తామని అప్పట్లో ప్రకటించగా ఇప్పటి వరకూ ఊసెత్తేవారు కరువయ్యారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రాయితీ రుణాలను పంపిణి చేసే విషయంలో పునరాలోచన చేసి పథకాలను పునరుద్దరించాలని పలువురు కోరుతున్నారు. యువతకు ఉపాధిని కల్పించడానికి, రాయితీ రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. కానీ ఆ దరఖాస్తులను చెత్తబుట్ట దాఖలు చేయడం ఎంత వరకూ సమంజసం. ప్రభుత్వం స్పందించి నిరుద్యోగులకు రుణాల పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలి. – ఉమేష్, ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు, మోర్తాడ్ స్వయం ఉపాధి కోసం ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం భారీగా దరఖాస్తు చేసిన నిరుద్యోగులు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రాని రాయితీ రుణాలు -
వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి
● చెరువుల్లో పడి ఇద్దరు.. ● రోడ్డు ప్రమాదాల్లో మరో ఇద్దరు ధర్మారెడ్డిలో వివాహిత.. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ధర్మారెడ్డిలో ఓ వివాహిత కలకృత్యాలు తీర్చుకునేందుకు ఊరచెరువుకు వెళ్లి, ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందింది. వివరాలు ఇలా.. ధర్మారెడ్డి గ్రామానికి చెందిన జోడు పోచమ్మ(46) అనే వివాహిత సోమవారం సాయంత్రం కాలకృత్యాలు తీర్చుకునేందుకు గ్రామశివారులోని ఊరచెరువుకు వెళ్లింది. ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో భర్త నారాయణ, గ్రామస్తులతో కలిసి మంగళవారం గ్రామశివారులోని ఊరచెరువులో గాలించారు. దీంతో పోచమ్మ మృతదేహం చెరువులో లభ్యమయింది. కాగా పోచమ్మ గత ఆరునెలలుగా పక్షపాతానికి గురై ఒక కాలు, ఒక చేయి పనిచేయక అనారోగ్యంతో బాధపడుతుందని ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. బైక్ అదుపుతప్పడంతో.. నవీపేట: మండలంలోని నాగేపూర్ గ్రామ శివారు లోని బాసర రహదారి మూల మలుపు సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీ వ్రంగా గాయపడ్డారని ఎ స్సై శ్రీకాంత్ తెలిపారు. వివరాలు ఇలా.. మహారాష్ట్రలో ని నాందేడ్ జిల్లా బోకర్ తా లూక పరిధిలోని హనుమాన్ నగర్కు చెందిన సుదో ధన్(22) నాలుగు నెలల నుంచి నిర్మల్ జిల్లా దిలా వర్ పూర్లో నివాసం ఉంటున్నారు. సుదోధన్ సో దరి శివాని నవీపేటలో ఉండడంతో సోమవారం స్నేహితుడు సతీష్ వాగ్మారేతో కలిసి బైక్పై నవీపేటకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో బైక్పై వెళ్తుండగా వాహనం అదుపుతప్పి నాగేపూర్ శివారులోని రహదారి డివైడర్ను ఢీకొట్టారు. ఈ ఘటనలో బైక్ నడుతుపున్న సతీష్తో పాటు సుదోధన్ కింద కిందపడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో ఇరువురిని జి ల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సుదోధన్ మంగళవారం ఉదయం చికిత్స పొందు తూ మృతి చెందాడు. సతీష్ వాగ్మారే చికిత్స పొందుతున్నాడు. మృతుడి తండ్రి మనోహర్ తేజారావ్ సోన్ కాంబ్లే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.కోమట్పల్లిలో యువకుడు.. లింగంపేట(ఎల్లారెడ్డి) : మండలంలోని కోమట్పల్లి గ్రామంలో మతి స్థిమితం లేని ఓ యువకు డు చెరువులో పడి మృతిచెందాడు. వివరాలు ఇ లా.. కోమట్పల్లి గ్రామానికి చెందిన ధరణి బా లమల్లు–సాయవ్వల కుమారుడు నవీన్(18) మతి స్థిమితం కోల్పోయి ఇంటి వద్దనే ఉంటున్నాడు. తండ్రి బాలమల్లు 11 సంవత్సరాల క్రి తం కరెంటు షాక్తో మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లి సాయవ్వ కుమారుడిని పోషించు కుంటూ జీవనం కొనసాగిస్తుంది. సోమవారం సాయవ్వ కామారెడ్డికి వెళ్లి పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి చేరుకుంది. ఇంట్లో కుమారుడు లేకపోవడంతో ఆచూకీ కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా అతడు కనిపించలేడు. మంగళవారం ఉదయం గ్రామ శివారులోని ఊర చెరువు కట్టపై కుమారుడి చెప్పులు కనిపించడంతో చెరువులో గాలించారు. కొద్దిసేపటికీ నవీన్ మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మతి స్థిమితం కోల్పోయి చెరువులో కాలుజారి పడి మృతి చెందినట్లు ఎస్సై దీపక్కుమార్ తెలిపారు. తల్లి సాయవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన పలు ఘటనల్లో నలుగురు మృతిచెందారు. వారిలో ఇద్దరు ప్రమాదవశాత్తు చెరువుల్లో పడి ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాతపడ్డారు. భిక్కనూరు: మండలంలోని బస్వాపూర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక్రూ మృతి చెందినట్లు భిక్కనూరు ఎస్సై అంజనేయులు మంగళవారం తెలిపారు. వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన గడ్డమీది చంద్రం (43) స్థానిక దాభా హోటల్లో వంటమనిషిగా పనిచేస్తు జీవిస్తున్నాడు. సోమవారం రాత్రి వ్యక్తిగత పనుల నిమిత్తం చంద్రం బస్వాపూర్ గ్రామానికి వెళ్లాడు. తిరిగి భిక్కనూరు వచ్చేందుకు బస్వాపూర్ శివారులో రోడ్డు దాటుతుండగా కామారెడ్డి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటెయినర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. -
వన్య ప్రాణులపై అవగాహన
సిరికొండ : మండల కేంద్రంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు వన్యప్రాణులపై అవగాహన కల్పించారు. సిరికొండ ఎఫ్ఆర్వో నర్సింగ్రావు మాట్లాడుతూ.. అడవులను సంరక్షించడం ద్వారా వన్యప్రాణులను కాపాడవచ్చని తెలిపారు. అడవులు తరగిపోతే వన్యప్రాణుల మనుగడ కష్టమన్నారు. వన్యప్రాణులను జాతీయ సంపదగా భావించి ప్రతి పౌరుడు వాటిని కాపాడాలని తెలిపారు. పై విషయాలను తల్లిదండ్రులకు వివరించాలని విద్యార్థులకు సూచించారు. సమావేశంలో డీఆర్వో గంగారాం, రావుట్ల సెక్షన్ అధికారి లచ్చయ్య, బీట్ అధికారులు, బేస్ క్యాంపు సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
లా పుస్తకాల పంపిణీ
నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ బార్ అసోసియేషన్లో నూతనంగా చేరిన న్యాయవాదులకు సీనియర్ న్యాయవాది తులసీదాస్ అందించిన న్యాయశాస్త్ర పుస్తకాలను బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయిరెడ్డి మంగళవారం అందించారు. జూనియర్ న్యాయవాదులు ఈ పుస్తకాలను చదవాలని, సీనియర్ న్యాయవాదుల వాదనలు విని కోర్టు ప్రొసీడింగ్స్ అర్థం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కోర్టు పీపీ రాజేశ్వర్రెడ్డి, జీపీ ఆమిదాల సుదర్శన్, జగదీశ్వర్రావు, జే వెంకటేశ్వర్, పిట్లం శ్రీనివాస్, సుదర్శన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, కార్యదర్శి ఝాన్సీరాణి, శ్రీమాన్, మద్దెపల్లి శంకర్, ఆశనారాయణ, ప్రభాకార్రెడ్డి, సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
ఉగాది ఉత్సవాలను విజయవంతం చేయాలి
నిజామాబాద్ రూరల్ : ఉగాది ఉత్సవాలను విజయవంతం చేయాలని వ్యాసపురి కన్యకా పరమేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు మూడ నాగభూషణం గుప్తా అన్నారు. మంగళవారం ట్రస్ట్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ సంస్థ ఇందూరు యజ్ఞ సమితి వ్యాసపురి కన్యకా పరమేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది నిఖిల్ సాయి హోటల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, సాహిత్య పురస్కారాలు, అతిథుల సత్కారాలు ఉంటాయన్నారు. తెలుగు సాహిత్య అభిమానులు, కవులు, కళాకారులు, నగర పురప్రముఖులు పెద్ద ఎత్తున హాజరై వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సభ్యులు దారం గంగాధర్, డాక్టర్ కాసర్ల నరేశ్ రావు, డాక్టర్ గంట్యాల ప్రసాద్, తొగర్ల సురేశ్, డాక్టర్ మద్దుకూరి సాయిబాబు పాల్గొన్నారు. -
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
నిజామాబాద్ రూరల్: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్ అన్నారు. ఒకటో డివిజన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో మత్తు పదార్థాలు, రోడ్డు భద్రతపై కాలనీవాసులకు మంగళవారం అవ గాహన కల్పించారు. యువత మత్తు పదార్థాల కు దూరంగా ఉండాలని అన్నారు. ఎవరైనా మ త్తు పదార్థాలు విక్రయిస్తే పోలీసులకు సమాచా రం అందించాలని వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో కాలనీవాసు లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్: బీడీ కార్మికులకు పెరిగిన కరువు భత్యాన్ని యాజమాన్యాలు చెల్లించాలని తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధిరాములు అన్నారు. నగరంలోని శివాజీనగర్లో ఉన్న కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెరిగిన కరువు భత్యాన్ని బీడీ యాజమాన్యాలు ఏప్రిల్ ఒకటి నుంచి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కరువు భత్యాన్ని చెల్లించకుంటే కార్మికులతో కలిసి పోరాటాలు చేస్తామని అన్నారు. సమావేశంలో నాయకులు రాములు, రేణుకా, వనజ, గంగామణి, బీడీ కార్మికులు పాల్గొన్నారు. పీసీసీ చీఫ్ను కలిసిన యువజన నాయకుడు కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ పట్టణానికి చెందిన యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆరెపల్లి నాగేంద్రబాబు టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డిలను మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో నాగేంద్రబాబు సతీమణి శ్రీజ 1వ వార్డు కౌన్సిలర్గా ఎన్నికై ంది. ఈ నేపథ్యంలో టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్కుమార్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డితో కలిసి మంగళవారం హైదరాబాద్లో వారిని కలిసి సత్కరించారు. భీమ్గల్ పట్టణాభివృద్ధికి కృషి చేస్తామని మహేశ్కుమార్గౌడ్, సుదర్శన్రెడ్డి హామీ ఇచ్చినట్లు నాగేంద్రబాబు తెలిపారు. ట్రంప్ దిష్టిబొమ్మ దహనం బోధన్: ఇరాన్ దేశంపై అమెరికా, ఇజ్రాయిల్ దేశా ల దాడిని ఖండిస్తూ మంగళవారం ఎడపల్లి మండల కేంద్రంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు గుమ్ముల గంగాధర్ మాట్లాడుతూ.. ఇరాన్ పై యుద్ధం వెంటనే ఆపాల ని డిమాండ్ చేశారు. పశ్చిమ ఆసియాలో ఆయిల్ పై ఆధిపత్యం కోసమే ఇరాన్పై అమెరికా యుద్ధానికి దిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ దేశ అధ్యక్షుడు అయతొల్లా అలీ ఖమేనీని క్షిపణులతో దాడి చేసి హత్య చేసిందని పేర్కొన్నారు. ప్రపంచం వాణిజ్యం, రాజకీయ ఆధిపత్యం కోసం అమెరికా చిన్న దేశాలపై దురాక్రమణకు పాల్పడుతుందని ఆరోపించారు. నాయకులు సుల్తాన్ సాయిలు, రవి, పోశెట్టి, హన్మాండ్లు, సుదర్శన్, గంగాధర్, భూమయ్య తదితరులు పాల్గొన్నారు. -
సింగంపల్లిలో కుస్తీ పోటీలు
మోపాల్: మండలంలోని సింగంపల్లిలో హోలీ పండుగను పురస్కరించుకుని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. పోటీల్లో ఉమ్మడి జిల్లాలోని మద్నూర్, జుక్కల్, బోధన్, బాన్సువాడతోపాటు సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి మల్లయోధులు తరలివచ్చారు. పోటీల్లో గెలుపొందిన మల్లయోధుడు ప్రభులాల్కు వీడీసీ ప్రతినిధులు రూ.4100 నగదు బహుమతిని అందజేశారు. అలాగే కుస్తీ పోటీల్లో పాల్గొన్న వారికి ప్రోత్సాహక బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అరికెల సవిత ప్రవీణ్రెడ్డి, ఉపసర్పంచ్ గోర్కంటి విజయ్రావు, వీడీసీ ప్రతినిధులు మేక మోహన్రెడ్డి, గోర్కంటి జయ్, జినిగాల శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
మధుసూదన్కు సన్మానం
నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రానికి చెందిన సా మాజిక సేవాతత్పరుడు మధుసూదన్ దంపతుల ను ఎం–థ్రిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జాదూ యుగంధర్ రంగనాథ్ ఆధ్వర్యంలో పలువురు మంగళవారం ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు. తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర శా ఖ సభ్యుడు కే రామ్మోహన్రావు, తపాలా శాఖ వి శ్రాంత ఉద్యోగి కేవీ కృష్ణారావు, రైల్వే మెయిల్ స ర్వీస్ ఉద్యోగి అజయ్ పాల్గొన్నారు. చిరంజీవాచార్యులకు.. నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రానికి చెందిన చి రంజీవాచార్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా లో రామలింగేశ్వర ఆలయం సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రంలో వారం రోజుల పాటు నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హరికథగా నం, ద్రౌపది స్వయంవరం వినిపించారు. అనంత రం నిర్వాహకులు చిరంజీవాచార్యులను ఘనంగా సన్మానించారు. -
హోలీ.. ఆనందకేళి
● అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో ఘనంగా వేడుకలు ● నృత్యాలు చేసిన యువకులు, చిన్నారులుసుభాష్నగర్/ డిచ్పల్లి/ నిజామాబాద్ రూరల్/ సిరికొండ/ జక్రాన్పల్లి: ఇందూరులో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎక్కడ చూసినా రంగులు చల్లుకుంటూ చిన్నా, పెద్దా సందడి చేశారు. ఆనందంతో కేరింతలు కొట్టారు. దీంతో వీధులన్నీ రంగులమయంగా మారాయి. సోమవారం రాత్రి కామదహన కార్యక్రమాన్ని చేపట్టారు. మంగళవారం ఉదయం నుంచి అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో ప్రజలు హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఒకరిపై మరొకరు రంగులు చల్లుకున్నారు. యువత, చిన్నారులు, మహిళలు రంగులు పూసుకుని.. నృత్యాలతో హోరెత్తించారు. ఆర్ఎస్ఎస్ ఇందూరు నగర స్వయంసేవకులు ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకొన్నారు. నగరంలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ప్రార్థన చేసిన అనంతరం నగరంలోని జేష్ఠ కార్యకర్తల ఇంటికి వెళ్లి సహజ రంగులతో వారికి వారి కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. దశాబ్దాల కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న పద్ధతిని ఈ ఏడాది కూడా కొనసాగించినట్లు నగర కార్యవాహ అర్గుల సత్యం తెలిపారు. డిచ్పల్లి మండలంలోని పలు గ్రామాల్లోని ప్రజలు హోలీ వేడుకలను జరుపుకొన్నారు. మండల కేంద్రంలోని బంజారా భవన్ వద్ద బంజారా నాయకులు హోలీ వేడుకలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్రెడ్డి స్వగ్రామమైన ముల్లంగి(ఐ)లో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంతో పాటు గడ్కోల్, కొండూర్ తదితర గ్రామాల్లో హోలీ పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు. గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు. రంగుల దుకాణలు ప్రజలతో కిటకిటలాడాయి. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కాకతీయ కళాశాలలో నృత్యం చేస్తున్న విద్యార్థిని -
‘పులి సంచరిస్తే సమాచారమివ్వండి..’
సిరికొండ: పులి సంచరించినట్లు ఆనవాళ్లు కనిపిస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సిరికొండ ఫారెస్ట్ రేంజర్ నర్సింగ్రావు మంగళవారం ఒక ప్రకటనలో ప్రజలను కోరారు. జిల్లాలోని సిరికొండ మండలానికి ఆనుకొని ఉన్న కమ్మర్పల్లి రేంజ్లో పెద్దపులి సంచారం ఉన్నందున ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పొలాల వద్ద విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయొద్దని, రాత్రి వేళల్లో అటవీప్రాంతంలోకి ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు. నిజాంసాగర్: పంటలకు సాగునీరందించేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. నిజాంసాగర్ ప్రధాన కాలువకు బాన్సువాడ మండల పరిధిలో బుంగపడడంతో పది రోజుల నుంచి సాగు నీరు లేక పొలాలు ఎండుతున్నాయి. బుంగకు మరమ్మతు పనుల నేపథ్యంలో లీకేజీ నీటిని మంజీర నదిలోకి మళ్లించడంతో జలాలు వృథా అవుతున్నాయి. అయితే మహమ్మద్నగర్ మండలం గాలీపూర్ గ్రామ రైతులు ఈ నీటిని తమ పంటలకు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. మంగళవారం ప్రధాన కాలువలో అడ్డుకట్ట వేసి నీటిని డిస్ట్రిబ్యూటరీకి మళ్లించారు. బుంగ మరమ్మతులు పూర్తయిన తర్వాత ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు సాగు నీటిని విడుదల చేస్తామని నిజాంసాగర్ ప్రాజెక్టు ఈఈ సోలొమన్ తెలిపారు. కామారెడ్డి అర్బన్: జిల్లా కేంద్రంలోని శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠం వైదిక స్మార్త ఆగ మ వేదపాఠశాలలోని 12 మంది విద్యార్థులకు సామూహిక ఉపనయన ఉత్సవం నిర్వహించనున్నారు. ఈనెల 8న దేవునిపల్లి బ్రహ్మంగారి ఆలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. ధర్మ పీఠం అధిపతి శీర్లవంచ కృష్ణామాచార్యులు, వేద విద్యార్థులు మంగళవారం స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని కలిసి కార్యక్రమానికి రావాలంటూ ఆహ్వానించారు. -
చెత్త పనికి సెంటిమెంట్తో చెక్
● సమస్య పరిష్కారానికి సర్పంచ్ వినూత్న ఆలోచన ● గోడలపై దేవుళ్ల వాల్పెయింటింగ్ మోర్తాడ్(బాల్కొండ): ఇళ్లలోని చెత్తను ఎక్కడపడితే అక్కడ రోడ్లపక్కన పారవేస్తుండడంతో పరిసరాలు అధ్వానంగా మారుతున్నాయి. ఎంత అవగాహన కల్పిస్తున్నా ఫలితం కనిపించకపోవడంతో మెండోరా మండల కేంద్రం సర్పంచ్ బుట్టడి ప్రమోద్కుమార్ వినూత్న ఆలోచన చేశారు. గ్రామంలోని ప్రధాన రోడ్లు, కూడళ్లను పరిశుభ్రం చేయించి అక్కడి గోడలపై దేవుళ్ల చిత్రాలను పెయింట్ వేయించారు. దీంతో అక్కడ చెత్త వేయలేక తమ ఇళ్లలోనే ఉంచి చెత్త సేకరణ వాహనానికి అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్పంచ్ వినూత్నంగా ఆలోచించి ‘చెత్త పనులకు’ చెక్ పెట్టారని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని పలు వీధుల్లో గోడలపై దేవుళ్ల చిత్రాలతో పెయింటింగ్తోపాటు ‘చెత్త వేయరాదు’ అంటూ అవగాహన కల్పిస్తూ రాయించారు.పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని.. చెత్తను ఎక్కడపడితే అక్కడ పారవేయకుండా, చెత్త సే కరణ వాహనానికి అందించా లి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్నాం. వాహనం రావడం లేదని కొందరు చెత్తను వీధుల్లో పారబోస్తున్నారు. దీంతో పరిసరాలు కంపుకొడుతున్నాయి. చెత్తను సేకరించడం కూడా కష్టంగా ఉంది. అందుకే ఇలా ఆలోచన చేశాం. ప్రజలు సహకరిస్తారని ఆశిస్తున్నాం. – బుట్టడి ప్రమోద్కుమార్, సర్పంచ్, మెండోరా -
6 నుంచి ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక
నిజామాబాద్అర్బన్: ఈనెల 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ నిర్వహించనున్నారు. ఐదు దశల్లో 99 రోజులపాటు వివి ధ శాఖలకు సంబంధించి పది ముఖ్యమైన అంశాల వారీగా కార్యక్రమాలు కొనసాగనున్నాయి. దీనిని ప్రణాళిక శాఖ పర్యవేక్షించనుంది. దీనికోసం ప్రత్యే క యాప్ను రూపొందించారు. మంత్రి ఆధ్వర్యంలో ఈనెల 6న ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్ర ణాళిక’ నిర్వహించనున్న నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి మంగళవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశానికి జిల్లా నుంచి ప్రభుత్వ సుదర్శన్రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి హాజరయ్యారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’పై సీఎం దిశానిర్దేశం చేశారు. కార్యక్రమాల నిర్వహణ ఇలా.. ఈనెల 6వ తేదీన గ్రామస్థాయిలో గ్రామస భల నిర్వహణ, 16న మండల స్థాయిలో కార్యక్రమాలు, మే 2న నియోజకవర్గస్థాయిలో, 22న జిల్లాస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గ్రామస్థా యి నుంచి రాష్ట్రస్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, అరైవ్ అలైవ్, సంక్షేమం, పిల్లల భద్రత.. డ్రగ్స్కు అడ్డుకట్ట, రైతు సంక్షేమం.. వ్యవసాయం, విద్య, యువత.. క్రీడలు, మహిళలు, పర్యావరణం పది అంశాలతో 99 రోజులపాటు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఐదు దశల్లో 99 రోజులపాటు కార్యక్రమాలు పర్యవేక్షించనున్న ప్రణాళిక శాఖ మొదటిరోజు ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం -
భర్తీకి కసరత్తు
సంస్థాగత పదవుల ● ఏర్పాటు కానున్న డీసీసీ కార్యవర్గం ● ప్రాధాన్య పోస్టులకు పెరుగుతున్న డిమాండ్ ● ఆశలు పెంచుకున్న ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అధికార పార్టీ కాంగ్రెస్లో సంస్థాగత పదవుల కేటాయింపుల్లో భాగంగా జిల్లాలో డీసీసీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు పార్టీ నాయకత్వం కసరత్తులు మొదలుపెట్టింది. పరిషత్ ఎన్నికలు మినహా స్థానిక సంస్థలైన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు పూర్తి కావడంతో కాంగ్రెస్ పార్టీ వచ్చే రెండు వారాల్లో సంస్థాగత పదవుల భర్తీ ప్రక్రియను షురూ చేయనుంది. అయితే పార్టీ పదవుల్లో ఉండి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసినవారికి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పిస్తామని పార్టీ అధినాయకత్వం చెబుతోంది. దీంతో ఈ పదవుల కోసం ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, ఆయా నియోజకవర్గాల్లో కీలక పాత్ర పోషిస్తున్న నాయకులు ఆశలు పెట్టుకున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లాలో పదిరోజుల పాటు నిర్వహించిన జిల్లా అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ డీసీసీ అధ్యక్షులు, కార్యవర్గమే ప్రధానమని చెప్పడంతో మరింత డిమాండ్ పెరిగింది. ఇటీవల డీసీసీ అధ్యక్షుల ఎంపికలోనూ జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలను వన్ టు వన్ అభిప్రాయాలు సేకరించి ఏఐసీసీ ప్రక్రియ నిర్వహించింది. ఈ క్రమంలో పార్టీ పదవులకు తిరుగులేని ప్రాధాన్యత ఉన్నట్లు పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ పదవులకు డిమాండ్ పెరుగుతోంది. పైగా గత ఏడాదిలో యూత్ కాంగ్రెస్ పదవుల విషయంలో పోటాపోటీ నెలకొన్న విషయాన్ని కార్యకర్తలు ప్రస్తావిస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలే నిత్యం ప్రజల్లోకి వెళ్లాలని, తద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకత్వం చెబుతోంది. అందువల్ల భవిష్యత్తులో ఉన్నత పదవులకు, ప్రజాప్రతినిధులుగా పోటీ చేసేందుకు మంచి ప్రాధాన్యత దక్కుతుందని నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ముందే పార్టీ పదవుల నియామకాల్లో భాగంగా డీసీసీ కార్యవర్గం విస్తరణ చేసేందుకు రంగం సిద్ధం అవుతుండడంతో శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. -
దవాఖానా నిర్వహణ ఎలా?
● సామాజిక ఆస్పత్రులకు విడుదల కాని నిధులు ● రెండేళ్లుగా నిలిచిపోయిన వైనం మోర్తాడ్(బాల్కొండ): వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలోని సామాజిక ఆస్పత్రుల(కమ్యూనిటీ హెల్త్ సెంటర్)కు నిధులు విడుదల కాకపోవడంతో నిర్వ హణ భారమవుతోంది. జిల్లాలో మోర్తాడ్, బాల్కొండ, ధర్పల్లి, డిచ్పల్లి, నవీపేట్, వర్నిలో 30 పడకల, ఆర్మూర్, బోధన్లో వంద పడకల ఆస్పత్రులు కొనసాగుతున్నాయి. భీమ్గల్లో వంద పడకల ఆస్పత్రి నిర్మాణ దశలోనే ఉంది. ఒక్కో ఆస్పత్రికి ప్రతి ఏటా రూ.2.50 లక్షల చొప్పున నిధులు కేటాయించేవా రు. రెండేళ్లుగా నిధులు విడుదల కావడంలేదు. ఆస్పత్రికి గతంలో సలహా కమిటీలు కొనసాగాయి. ఆ కమిటీల ఆధ్వర్యంలోనే ని ధులను వినియోగించేవారు. ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కా లం ముగిసిపోవడంతో సలహా కమిటీలు నామమా త్రమయ్యాయి. ఎమ్మెల్యేలు సలహా కమిటీకి బాధ్య త వహించాల్సి ఉంది. నిధులు విడుదల చేయకపోవడంతో కమిటీల పని తీరు అంతంత మాత్రంగానే ఉంది. ఆస్పత్రుల నిర్వహణకు నిధులను కేటాయించాలని ప్రభుత్వాన్ని పలువురు కోరుతున్నారు. నిధుల కోసం విన్నవించాం ఆస్పత్రుల నిర్వహణకు నిధులు విడుదల కావాల్సి ఉంది. ప్రభుత్వం నిధులను విడుదల చేస్తేనే నిర్వహణకు ఇబ్బంది ఉండదు. నిధుల మంజూరు కోసం విన్నవించాం. త్వరలోనే విడుదల కావొచ్చు. – డాక్టర్ వివేక్, కమ్యూనిటీ ఆస్పత్రి వైద్యాధికారి -
ఆడా.. ఈడా ఓటేశారు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని 38 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ టికెట్టు కోసం రంగ మాధవితో పాటు ఇప్ప ఉమారాణి ప్రయత్నించారు. అయితే పార్టీ మాధవికి టికెట్టు కేటాయించడంతో ఉమారాణి ఇండిపెండెంట్గా బరిలో నిలిచారు. ఈ పోరులో మాధవిపై మూడు ఓట్ల ఆధిక్యతతో ఉమారాణి గెలిచారు. ఓటమిపై సమీక్ష నిర్వహించగా ఆసక్తికర విషయం తెలిసింది. 40 వ వార్డులో ఓటేసినవారిలో చాలామంది 38 వ వార్డులోనూ ఓటు హక్కు వినియోగించుకున్నారని, అలాగే రాజంపేట మండల కేంద్రంలో పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన వారు కామారెడ్డి పట్టణంలోని 38 వ వార్డులో ఓటు వేశారని గుర్తించారు. తన ఓటమికి దొంగ ఓట్లే కారణమంటూ మాధవి కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, కొందరు ఓటర్లు రెండు వార్డులలో ఓటు హక్కు వినియోగించుకున్నారని, ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థి ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ కామారెడ్డిలోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జీ కోర్టులో మంగళవారం పిటిషన్ వేశారు. రెండు వార్డులలో ఓటేసిన వారి వివరాలతోపాటు పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారు, మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయడంపై పిటిషన్లో వివరించినట్టు సమాచారం. రెండు వార్డులలో ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు ఓటర్లు కోర్టు మెట్లెక్కిన కామారెడ్డి 38వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికను రద్దు చేయాలంటూ పిటిషన్కామారెడ్డి 38వ వార్డునుంచి పోటీ చేసి మూడు ఓట్ల తేడాతో ఓటమి పాలైన రంగ మాధవి దాఖలు చేసిన పిటిషన్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. ఎన్నికల ప్రక్రియలో జరిగిన లోపాలు, నిబంధనల ఉల్లంఘనను పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం తదుపరి విచారణను న్యాయమూర్తి వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేశారు. -
రంగు పడింది
కాకతీయ బాయ్స్ హాస్టల్లో హోలీ సంబరాల్లో విద్యార్థులు విద్యార్థినికి రంగులు చల్లుతున్న స్నేహితులు... డ్యాన్స్ చేస్తున్న విద్యార్థినిరంగుల కేళీ హోలీ సంబురాలు జిల్లాలో అంబరాన్నంటాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం హోలీ వేడుకలను నిర్వహించారు. నిజామాబాద్ నగరంలో సోమవారం రాత్రి కామదహనం చేశారు. అర్సపల్లి, గాయత్రినగర్, వినాయక్నగర్, మహాలక్ష్మినగర్ తదితర ప్రాంతాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల హాస్టళ్లలో హోలీని ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు డీజేలు ఏర్పాటు చేసుకుని డ్యాన్స్లు చేస్తూ ఉత్సాహంగా రంగులు చల్లుకున్నారు. – నిజామాబాద్ రూరల్ -
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ప్రాధాన్యం : కాటిపల్లి నగేష్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు
పార్టీ పదవుల్లో బీసీలకు చెప్పినదానికంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం. అగ్రనేత రాహుల్గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, సీఎం రేవంత్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తాం. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ప్రజలతో మరింతగా మమేకమ య్యే లక్ష్యంతోనే తాజాగా శిక్షణ తరగతులను అధినాయకత్వం నిర్వహించింది. ఆ మేరకు తక్షణమే ముందుకు వెళ్లేందుకు కసరత్తులు చేస్తున్నాం. ఇక బీసీలకు 42 శాతం పదవులు ఇస్తామని చెప్పగా, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలో 53 శాతం పదవులను పార్టీ కేటాయించింది. చెప్పినదానికంటే ఎక్కువగా ఇచ్చాము. పరిషత్ ఎన్నికల్లోనూ ఇదే ఫార్ములాతో ముందుకెళ్లనున్నాం. కీలకమైన పార్టీ పదవుల్లోనూ బీసీలకు 42 శాతానికి మించి ఇస్తాం తప్ప తక్కువ ఏమాత్రం ఇచ్చేది లేదు. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చేలా ఆయా నియోజకవర్గాల వారీగా కసరత్తులు చేస్తున్నాం. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లాలో పార్టీ మరింత బలోపేతానికి ప్రణాళికలు వేసుకుంటున్నాం. -
గ్రహణం ఎఫెక్ట్.. ఆలయాల మూసివేత
● నేడు శుద్ధి తరువాత తెరుచుకోనున్న ఆలయాలు నిజామాబాద్ రూరల్: చంద్రగ్రహణం కారణంగా మంగళవారం జిల్లాలోని ఆలయాలను మూసివేశారు. బుధవారం ఉదయం శుద్ధి అనంతరం ఆలయాలు తిరిగి తెరుచుకోనున్నాయి. గ్రహణం మధ్యాహ్నం 3.22 నుంచి సాయంత్రం 6.49 గంటల వరకు కొనసాగింది. ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, జపం, ధ్యానం చేస్తూ దైవ చింతనలో గడిపారు. 6.49 గంటల తరువాత ఇళ్లను శుద్ధి చేసుకుని స్నానాల అనంతరం భోజనాలు చేశారు. జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వ, శంభులిగేశ్వర, సారంగాపూర్ హనూమాన్ ఆయాలతోపాటు నామ్దేవాడ సాయిబాబా ఆలయం, సంతోషిమాత, వేంకటేశ్వర తదితర ఆలయాలన్నింటినీ మూసి ఉంచారు. -
గిరిజన ఆవాసాల్లో సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు
మోపాల్(నిజామాబాద్రూరల్): దర్తీ అభజాన్ జా తీయ గ్రామీణ ఉత్కర్షఅభియాన్ (డీఏజేజీయూఏ) ద్వారా గిరిజన ఆవాసాల్లో సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫా ర్మర్లు ఏర్పాటు చేసి విద్యుత్ వెలుగులు నింపుతున్న ట్లు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ పీవీ రాజేశ్వర్రావు తెలిపారు. మండలంలోని అమ్రాబాద్ గ్రామంలో సో మవారం సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్, ఎల్టీ లైన్లతోపాటు 13 గిరిజన కుటుంబాలకు విద్యుత్ మీటర్లను సర్పంచ్ ప్రియాంక ప్రేమ్సింగ్తో కలిసి ఎస్ ఈ ప్రారంభించారు. ఈసందర్భంగా ఎస్ఈ మా ట్లాడుతూ.. జిల్లాలో విద్యుత్ సౌకర్యం లేని ప్రతి గిరిజన ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి డీఏజేజీయూఏ ప థకాన్ని ప్రవేశపెట్టాయని పేర్కొన్నారు. ఈపథకంలో భాగంగా జిల్లాలో రూ.80 లక్షల వ్యయంతో 80 మంది గిరిజనుల ఇళ్లకు, 380 అంగన్వాడీ కేంద్రా లకు విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. కార్యక్ర మంలో డీఈ (కన్స్ట్రక్షన్) వెంకట రమణ, ఏడీఈలు తోట రాజశేఖర్, బాలేశ్ కుమార్, ఏఈ (కన్స్ట్రక్షన్) కాశీనాథ్, ఉపసర్పంచ్ ఏ ప్రకాశ్, విద్యుత్ సిబ్బంది జహీర్ఖాన్, మోహన్, గ్రామస్తులు పాల్గొన్నారు. బోధన్రూరల్: సాలూర మండలం జాడిజమాల్పూర్ గ్రామంలో ఓ వ్యక్తి చెట్టు పైనుంచి పడి గాయపడగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన సిరిగిరి నాగ్ గొండ (48) ఆదివారం గ్రామంలోని చింత చెట్టు చింతకాయలు తెంపుతుండగా కాలు జారి కిందపడ్డాడు. దీంతో అతడు తీవ్ర గాయాల పాయ్యాడు. స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సోమవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
రాష్ట్రంలో అరాచక పాలన
కామారెడ్డి టౌన్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అరాచక పాలన సాగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి అడ్డాగా మారింద ని, ఏఐసీసీకి డబ్బు మూటలు పంపేందుకే ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి తాపత్రయ పడుతున్నారని పేర్కొన్నారు. సోమవారం ఆయన కామారెడ్డిలోని బీజేపీ కార్యాలయానికి వచ్చారు. ఇటీవల బాన్సువాడలో చోటు చేసుకున్న ఘటనలో అరైస్టె జైలు పాలైన బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారికి కిరాణా సామగ్రిని అందించి, పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అనంతరం మీడియా తో మాట్లాడారు. రాహుల్ గాంధీకి తెలంగాణ ప్రజ లపై నిజమైన ప్రేమ ఉంటే హైడ్రా బాధితులను, ఖ మ్మం నిర్వాసితులను, దాడులకు గురైన దేవాలయాలను సందర్శించాలని సవాల్ విసిరారు. బా న్సువాడ ఘటనలో పోలీసుల తీరుపై సంజయ్ మండిపడ్డారు. ఏ పాపం తెలియని వ్యక్తులను, కేవ లం కిరాణా సామగ్రి కొనేందుకు వెళ్లిన వారిని కూ డా వీడియోలో ఉన్నారనే సాకుతో అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. హోం శాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్నా, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఆయనకు సమాచారం అందడం లేదా అని నిలదీశారు. ఎంఐఎం, ఒవైసీ సోదరుల మెప్పు కోసమే 17 మంది అ మాయక హిందువులపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. హైడ్రా, ఎఫ్టీఎల్ పేరుతో ప్రభుత్వం పేదల ఇళ్లను టార్గెట్ చేస్తోందని సంజయ్ ధ్వజమెత్తారు. పేదల ఇళ్ల జోలికి వస్తే, అదే పొక్లెయిన్లతో కాంగ్రెస్ నేతల ఇళ్లను కూలుస్తామని, అప్పుడు శాంతిభద్రతల సమస్య తలెత్తితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అనేక దేవాలయాలపై దాడు లు జరిగాయన్నారు. హిందూ దేవాలయాలపై దా డులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేమని పేర్కొన్నారు. హిందూ సమాజం ఇకనైనా జాగృతం కావా లని పిలుపునిచ్చారు. జెండాలు పక్కన పెట్టి హిందూ ధర్మం కోసం ప్రజలు కాషాయ జెండా పట్టి ఏకం కావాలన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, నాయకులు పైడి ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంఐఎం మెప్పు కోసమే బాన్సువాడలో అక్రమ అరెస్టులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపణలు బాన్సువాడ ఘటన బాధిత కుటుంబాలకు పరామర్శ -
జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు
నిజామాబాద్ అర్బన్: హోలీ పండుగను పురస్కరించుకుని కలెక్టర్ ఇ లా ట్రిపాఠి జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రా గద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ హోలీ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషపు వెలుగులు నింపాలని ఆమె ఒక ప్రకటనలో ఆకాంక్షించా రు. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో వేడుక జరుపుకోవాలని అభిలాషించారు. సహజ రంగులను వినియోగిస్తూ సంప్రదాయబద్ధంగా పండుగను నిర్వహించుకోవాలన్నారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఎల్ఎల్బీ ఐదవ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఒక విద్యార్థి పరీక్షకు గైర్హాజరైనట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 28 మంది విద్యార్థులకు గానూ 27 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న పీజీ పరీక్షల్లో ఒకరు డిబార్ అయినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. నిజామాబాద్లోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలు, యూనివర్సిటీ మెయి న్ క్యాంపస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల, భిక్కనూర్ సౌత్క్యాంపస్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో పీజీ, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ, రెగ్యులర్ మొదటి, 7వ సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 1,905 మంది విద్యార్థులకు గానూ 1,798 మంది హాజరు అయ్యారు. 107 మంది గైర్హాజరయ్యారు. ఆర్మూర్లోని పరీక్షా కేంద్రంలో ఒక విద్యార్థి మాల్ ప్రాక్టీస్కు పాల్పడటంతో డిబార్కు గురయ్యారు. మాచారెడ్డి: కోళ్లకు సాధరణంగా రెండు కాళ్లు మాత్రమే ఉంటాయి. అయితే మాచారెడ్డి మండలం గజ్యనాయక్ తండా చౌరస్తాలోని ఎజాజ్ అనే యువకుడి చికెన్ సెంటర్లో నాలుగు కాళ్ల కోడి ఽసోమవారం కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు చికెన్ సెంటర్ వద్దకు భారీగా తరలివచ్చి వింత కోడిని చూశారు. జన్యులోపంతో అప్పుడప్పుడు ఈ విధంగా జరుగుతుందని పలువురు విదావంతులు తెలిపారు. -
ప్రజావాణికి అధికారులందరూ రావాలి
● కలెక్టర్ ఇలా త్రిపాఠి ● ప్రజల నుంచి వినతుల స్వీకరణ నిజామాబాద్అర్బన్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. కలెక్టరేట్లో సోమవారం ఆమె అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఇన్చార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్తో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. 83 వినతులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు. కార్యక్రమానికి పలు శాఖల అధికారులు గైర్హాజరు కావడంతో, ప్రజావాణికి హాజరుకాని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు అంకితభావంతో కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. సీబీఎస్సీ పాఠశాల పేరుతో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అడ్మిషన్లు చేపడుతున్నాయని వీటిపై చర్యలు తీసుకోవాలని టీజీవీపీ నాయకులు అఖిల్ ప్రజావాణిలో ఫిర్యాదు చే శారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద బోర్గాం(కె) గ్రామానికి చెందిన కొందరు గేదెలను కట్టేస్తున్నారని వాటి ని తొలగించడం లేదని గ్రామానికి చెందిన మాల కులస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నగరంలోని కంఠేశ్వర్లోని మహా దేవ్ హైట్స్ భవన నిర్మాణం నిబందనలకు విరద్ధుంగా ఉండడంతో తుమ్మ శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. గతంలో సాక్షి దినపత్రికలో వచ్చిన కథనాలను కలెక్టర్కు వివరించా రు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి ము న్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ విచారణ చేయా లని ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆర్టీసీ అధికారులు వేధిస్తున్నారంటూ.. కలెక్టరేట్ వద్దకు సందీప్ అనే వ్యక్తి తన ఆర్టీసీ అద్దె బస్సును తీసుకవచ్చి తనను అధికారులు వేధిస్తున్నారని నిరసన చేపట్టారు. బస్సును ఐదు రోజులు నడపకుండా, డిపోలోనే ఉంచి తనకు ఆర్థికంగా నష్టపరిచారని ఆర్ఎం జ్యోత్స్న, డిపో మేనేజర్ ఆనంద్పై ఫిర్యాదు చేశారు. -
నేలపై సప్తవర్ణాల హరివిల్లు
● జిల్లాలో రంగురంగుల పంటలు పండిస్తున్న రైతులు ● నేడు హోలీ పండుగ ఆర్మూర్: హోలీ పండుగ అంటే కేవలం రంగులు చల్లుకోవడమే కాదు. మానవ జీవితంలో రంగులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మనుషుల భావోద్వేగాలపై, పర్యావరణంపై లోతైన ప్రభావం చూపుతాయి. జిల్లా రైతాంగం వివిధ రంగులలో ఉన్న పంటలను పండిస్తూ ఆకాశంలోని సప్తవర్ణాల హరివిల్లును నేలపై ఉండేలా మారుస్తున్నారు. ● జిల్లాలో ఇందల్వాయి, సిరికొండ, వర్ని, మాక్లూర్ మండలాల్లో సుమారు 86 వేల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. జిల్లాలో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంతో పాటు పల్లె గట్లపై వేసవి కాలంలో మోదుగ పూల చెట్టు విరగబూస్తుంది. ఈ పువ్వులతో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పువ్వులను నీళ్లలో ఉడకబెట్టి తయారు చేసిన రంగును హోలీ రోజున ప్రత్యేకంగా ఉపయోగిస్తుంటారు. ● అదేవిధంగా విత్తన వ్యాపారానికి కేరాఫ్గా మారిన ఆర్మూర్ ప్రాంతంలో పండించే ఎర్ర జొన్నలు కోతకు వచ్చిన తర్వాత కల్లాల్లో ఆరబెట్టిన ఎర్రజొన్నలతో గ్రామాలు ఎరుపు మయంగా మారుతాయి. ● జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో జూన్ నెలలో ప సుప పంట విత్తుకుంటారు. తొమ్మిది నెలల్లో పంట చేతికి వస్తుంది.దీంతో జనవరి, ఫిబ్రవ రి నెలల్లో పసుపు కల్లాలు అమ్మవారిని మరిపించేలా పసుపుమయంగా మారుతాయి. ● జిల్లాలో వరి తరువాత మొక్కజొన్న పంటను విస్తారంగా పండిస్తారు. రోహిణీ కార్తె, వర్షాకాలం, వేసవి కాలాల్లో మూడు పంటలను తీస్తారు. ఈ మొక్కజొన్న పంట కోతలు పూర్తయిన తరువాత రైతుల ఇంటి ముందర పోసిన మక్కల రాసులతో నారింజ (ఆరెంజ్) రంగు శోభితమవుతుంది. ● వరి పంట నారు పో సిన నాటి నుంచి కో తలు పూర్తయ్యే వర కు వేల హెక్టార్లలోని పొలాలు భూమాతకు పచ్చ ని చీర కట్టుకున్నట్లుగా కనువిందు చేస్తుంది. ● ఉమ్మడి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లోని నీరు నీలం రంగును పులుముకొని కనువిందు చేస్తాయి. ● జిల్లాలోని బోధన్, భీమ్గల్ తదితర ప్రాంతాల్లో నల్ల రేగడి నేలలు ఉండటంతో పత్తి పంటను పండిస్తున్నారు. మరో వైపు విత్తన వ్యాపారం అభివృద్ధి చెందిన ఆర్మూర్ ప్రాంతంలో తెల్లజొన్నలను సైతం పండించి ఉత్తర భారత దేశంతో పాటు దేశ విదేశాలకు పశువుల దాణా కోసం ఎగుమతి చేస్తున్నారు. రేపు హున్సాలో పిడిగుద్దులాట బోధన్రూరల్(బోధన్): తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని మంజీర తీరంలోగల హున్సా గ్రామం ‘పిడిగుద్దులాట’తో ప్రత్యేకతను చాటుకుంటుంది. దేశంలో ఎక్కడలేని విధంగా దశాబ్ధాల కాలం నుంచి హోలీ పండుగ రోజు పిడిగుద్దులాట నిర్వహించడం సాలూర మండలంలోని హున్సా గ్రామ ఆనవాయితీగా కొనసాగుతోంది. ప్రతి ఏటా కామదహనం చేసిన మరుసటి రోజు గ్రామంలో పిడిగుద్దులాట నిర్వహిస్తారు. సోమవారం గ్రామంలో కామదహనం నిర్వహించారు. నేడు (మంగళవారం) సంపూర్ణ చంద్ర గ్రహణం కారణంగా రేపు (బుధవారం) పిడిగుద్దులాటను నిర్వహించేందుకు గ్రామపెద్దలు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామం సుభిక్షంగా ఉండలానే ఆకాంక్షతో కుల, మత, వయోబేధం లేకుండా ఐక్యతతో పిడిగుద్దులాటను ఆడుతూ పూర్వీకుల నుంచి వచ్చిన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పిడిగుద్దులాట నిర్వహణపై పోలిస్ శాఖ నుంచి అభ్యంతరం వస్తున్నా గ్రామస్తులంతా ఐకమత్యంతో అధికారులను ఒప్పంచి ఆటను ఆడుతున్నారు. గతంలో ఒక ఏడాది పిడిగుద్దులాటను నిలిపివేయగా తమ గ్రామానికి అనేక విధాలుగా నష్టం వాటిల్లిందని అప్పటినుంచి తప్పనిసరిగా ఈ పిడిగుద్దులాటను నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు అంటున్నారు. -
ఎఫ్ఎల్ఎన్ పరీక్షకు ఆన్లైన్ గండం
కమ్మర్పల్లి: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో మూడో తరగతి విద్యార్థులకు నిర్వహించనున్న ఎఫ్ఎల్ఎన్ ఆన్లైన్ మాక్ పరీక్షకు గండాలు వెంటాడుతున్నాయి. దీంతో సోమవారం (మార్చి 2) నిర్వహించిన ఆన్లైన్ మాక్ టెస్ట్ విఫలమైంది. విద్యార్థులకు కనీస అభ్యసన సామర్థ్యాల కోసం ఎన్సీఈఆర్టీ ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్య శాస్త్రం(ఫౌండేషన్ లిట్రసీ అండ్ న్యూమరసీ–ఎఫ్ఎల్ఎన్)ను 2021–22 నుంచి నిర్వహిస్తోంది. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా నిపుణ భారత్ కార్యక్రమం కింద మూడో తరగతి విద్యార్థులలో అభ్యసన సామర్థ్యాలు తెలుసుకునేందుకు ఎన్సీఈఆర్టీ మార్చి 12, 13న దేశమంతటా సామర్థ్యాల పరీక్ష నిర్వహించనుంది. ఈక్రమంలో రాష్ట్రస్థాయిలో మూడవ తరగతి విద్యార్థులకు 3వ నమునా పరీక్షను మార్చి 2, 4 తేదీలలో ఆన్లైన్లో నిర్వహించాలని రాష్ట్రవిద్యాశాఖ అధికారులు, ఎస్సీఈఆర్టీ అధికారులు నిర్ణయించారు. మూడు నమూనా పరీక్షలు.. జిల్లావ్యాప్తంగా 719 ప్రాథమిక, 127 ప్రాథమికోన్నత పాఠశాలల్లో కలిపి మొత్తం 15600 మంది విద్యార్థులు మూడవ తరగతి చదువుతున్నారు. రాష్టస్థాయిలో ఎస్సీఈఆర్టీ మూడో తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ఇదివరకు రెండు నమూనా పరీక్షలు ఆఫ్లైన్లో నిర్వహించారు. కానీ మూడో మాక్ టెస్ట్ను ఆన్లైన్ నిర్వహించగా, సాంకేతిక కారణాలతో ఫెయిల్ అయింది. చాలా చోట్ల సైట్ ఓపెన్ కాలేదు. కొందరికి సైట్ ఓపెన్ అయినా పరీక్ష ప్రశ్న పత్రం రాలేదు. దీంతో జిల్లాలో సుమారు 90 శాతం పాఠశాలల్లో 3వ నమూనా పరీక్ష నిర్వహించలేదు. ఎస్సీఈఆర్టీ అధికారుల తొందరపాటు చర్య వల్ల ఆన్లైన్ మాక్ టెస్ట్ విఫలమైందని పలు ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా మూడో మాక్ టెస్ట్ను కూడా ఆఫ్లైన్లోనే నిర్వహించాలని ఆదేశాలు జారీచేశారు. అలాగే ఈనెల 4న జరుగనున్న మరో పరీక్షను సైతం ఆఫ్లైన్లోనే నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఎన్సీఈఆర్టీ నిర్వహించనున్న ఎఫ్ఎల్ఎన్ పరీక్ష కోసం రాష్ట్ర విద్యాశాఖ, ఎస్సీఈఆర్టీ సంయుక్తంగా డిసెంబర్ నుంచి విద్యార్థులను సంసిద్ధులను చేస్తున్నాయి. విద్యార్థులకు ప్రతిరోజు ఒక పీరియడ్లో 45 నిమిషాలు పాఠ్యంశాలు, మిగిలిన 45 నిమిషాలు ఎఫ్ఎల్ఎన్పై తర్పీదు ఇస్తున్నారు. కానీ జిల్లాలో దాదాపుగా 280 పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలు ఒకరిద్దరూ ఉపాధ్యాయులతో నడుస్తున్నాయి. ఇటువంటి పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్ ప్రిపరేషన్లో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకరిద్దరూ ఉన్న బడుల్లో ఎఫ్ఎల్ఎన్ సంసిద్ధతలో తీవ్ర ఇ బ్బందులు ఎదురవుతున్నా యి. ఇతర తరగతుల విద్యా ర్థులను పక్కన పెట్ట వీరికి బోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. –వేంకటేశ్వర్గౌడ్, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మూడో తరగతి విద్యార్థుల సామర్థ్యాల కోసం ఎఫ్ఎల్ఎన్ పరీక్ష నిర్వహించడం శుభపరిణామం. కానీ ప్రాథమిక స్థాయిలో 5వ తరగతికి కూడా నిర్వహించాలి. 3వ నమూనా పరీక్ష ఆఫ్లైన్లో నిర్వహిస్తే బాగుంటుంది. –ప్రవీణ్కుమార్, ఎస్జీటీ ఎస్సీఈఆర్టీ అధ్వర్యంలో విద్యార్థులకు మాక్టెస్టులు ఇప్పటికే 2 నమూనా పరీక్షలు ఆఫ్లైన్లో పూర్తి 3వ పరీక్షకు సాంకేతిక ఆటంకాలు -
పీఎం రాహత్ స్కీమ్ను వినియోగించుకోవాలి
సుభాష్నగర్: కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభం కానున్న పీఎం రాహత్ స్కీమ్ను యాక్సిడెంట్ బాధితులు వినియోగించుకోవాలని డీఎంహెచ్వో రాజశ్రీ, అదనపు డీసీపీ బస్వారెడ్డి అన్నారు. నగరంలోని కలెక్టరేట్లో గల ఎన్ఐసీ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం పీఎం రాహత్ స్కీమ్పై ఆరోగ్య శ్రీ మిత్రలు, ఆపరేటర్లకు ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. పీఎం రాహత్ స్కీమ్లో భాగంగా యాక్సిడెంట్ జరిగిన బాధితులకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1.50లక్షల వరకు లేదా, ఏడు రోజుల వరకు ఉచిత చికిత్స ఉంటుందని తెలిపారు. ఇందుకు ఆరోగ్యమిత్రల సహకారం ఉండాలని, ఎలాంటి పొరపాట్లు చేయకుండా బాధితులకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని సూచించారు. ఈదార్ మేనేజర్ వర్షాని హందు మాట్లాడుతూ.. త్వరలోనే జిల్లాలో ఈ స్కీమ్ ప్రారంభం కానుందని తెలిపారు. పోలీస్, వైద్యారోగ్య శాఖలు సమన్వయంతో పని చేయాల్సి ఉంటుందన్నారు. వర్క్షాప్లో జిల్లా ఇన్ఫర్మేటిక్ అధికారి మధు, జిల్లా ఆరోగ్యశ్రీ మేనేజర్ శశాంక్రెడ్డి, సూపరింటెండెంట్ భాస్కర్, ఆరోగ్యశ్రీ మిత్రలు, ఆపరేటర్లు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
డిచ్పల్లి(ఇందల్వాయి): ఇందల్వాయి పోలీస్స్టేషన్ పరిధిలోని గంగారాం తండా శివారులోగల 44వ నెంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఎస్సై సందీప్ తెలిపిన వివరాలు ఇలా.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రవిపాఠక్ (38) అనే వ్యక్తి డిచ్పల్లి మండలం బీబీపూర్ తండా శివారులోని బబ్లు యూపీ దాబాలో పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి దాబా నుంచి బయలుదేరిన రవిపాఠక్ హైవేపై నడుచుకుంటూ వెళుతున్నాడు. ఈక్రమంలో గంగారాం తండా శివారులోని హైవేపై అతడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈఘటనలో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దాబా యజమాని పరమేశ్వర్పాండే ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చేపల వేటకు వెళ్లి ఒకరు.. బోధన్: ఎడపల్లి మండలం అంబం గ్రామంలో ఓ వ్యక్తి చెరువులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటమునిగి మృతిచెందాడు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన డప్పు మహేష్ (40) ఆదివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేడు. దీంతో అతడి ఎడపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సోమవారం గ్రామంలోని చెరువులో మహేష్ మృతదేహం లభ్యమైంది. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతుడు కాలకృత్యాలకు వెళ్లిన అనంతరం, చెరువులో చేపల వేటకు వెళ్లాడు. నీటిలో వల వేయగా ప్రమాదవశాత్తు వల కాళ్లకు చుట్టుకుని నీటిలో మునిగి చనిపోయాడు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై ముత్యాల రమ తెలిపారు. బ్రాహ్మణపల్లిలో.. జక్రాన్పల్లి: మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామ శివారులోని చెరువులో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఆర్మూర్ పట్టణానికి చెందిన చనమతుల శివ(30) కొంతకాలంగా బ్రాహ్మణపల్లి గ్రామంలోని కానున్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ప్లాస్టిక్ డ్రమ్ములు అమ్ముతూ జీవిస్తున్నాడు. కొన్ని సంవత్సరాలుగా అతడు ఫిట్స్ వ్యాధితో బాదపడుతున్నాడు. కాగా ఈ నెల 1న శివ కాలకృత్యాల కోసం పక్కన ఉన్న చెరువు దగ్గరకి వెళ్లగా, అదే సమయంలో ఫిట్స్ రావడంతో చెరువులో పడి, మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వరద కాలువలోకి రివర్స్ పంపింగ్
● కాళేశ్వరం నుంచి నీటిని విడుదల చేసిన అధికారులు ● రెండు మీటర్ల మేర నీటిని నిలువ ఉంచేందుకు చర్యలు మోర్తాడ్(బాల్కొండ): కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని వరద కాలువకు విడుదల చేస్తున్నారు. యాసంగి పంటలను గట్టెక్కించే ఉద్దేశంతో రివర్స్ పంపింగ్ను సోమవారం ప్రారంభించారు. కాలువలో రెండు మీటర్ల మేర నీరు నిల్వ ఉంచేందుకు నాలుగైదు రోజులపాటు రివర్స్ పంపింగ్ కొనసాగనుంది. గాండ్లపేట్ వద్ద వరద కాలువకు గండికి మరమ్మతులు కొనసాగుతుండగా.. పనులు జరిగే చోటుకు కొద్ది దూరంలో నీటిని నిలువ ఉంచితే ఆయకట్టు భూములకు సాగునీరందుతుందని గతంలోనే రైతులు విన్నవించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న పంప్హౌజ్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో నీటి విడుదలకు ఆటంకం ఏర్పడింది. ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నా గండికి మరమ్మతులు ఇంకా పూర్తి కాలేదు. పాలెం, మోర్తాడ్, గాండ్లపేట్, తిమ్మాపూర్, కమ్మర్పల్లి, నాగాపూర్, ఉప్లూర్ రైతులకు చెందిన దాదాపు 2,600 ఎకరాల భూములకు సాగునీటిని అందించాల్సి ఉంది. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ముత్యాల సునీల్రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో ఫోన్లో మాట్లాడి నీటిని విడుదల చేయాలని విన్నవించారు. జనవరిలో ఒక దఫా రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని విడుదల చేసినా పూర్తి స్థాయిలో నీరు నిలువ ఉంచలేదు. మరోసారి నీటిని విడుదల చేసి వరద కాలువలో నిలువ ఉంచితే కాలువకు ఇరువైపులా ఉన్న భూములకు సాగునీటి సమస్య తీరుతుందని రైతులు కోరారు. మరోసారి నీటిని విడుదల చేస్తుండడంతో పాలెం శివారు వరకు నీరు నిలువ ఉంచే అవకాశం ఏర్పడింది. యాసంగి సీజన్లో రైతులు వరి, మొక్కజొన్న, నువ్వులు, సజ్జ పంటలను సాగు చేశారు. వరద కాలువలోకి నీరు వచ్చి చేరడంతో పంటలను గట్టెక్కించే అవకాశం ఏర్పడిందని రైతులు అంటున్నారు. ప్రభుత్వం స్పందించింది వరద కాలువలో వేసవి ముగిసేవరకు నీటిని నిలువ ఉంచాలని కోరగా ప్రభుత్వం స్పందించింది. నీటిని విడుదల చేయడంతో పంటల సాగుకు ఇబ్బంది తొలగిపోనుంది. యాసంగి సీజన్ పంటలు సాగు చేస్తున్న రైతులకు ఊరట లభించింది. – రొక్కం మురళి, సీడ్ కార్పొరేషన్ డైరెక్టర్, తిమ్మాపూర్ -
రెడ్ నోటీసులు!
మొండి బకాయిలపైసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్తి పన్ను బకాయిల వ సూళ్లకు అధికార యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ నెలాఖరు వరకు పూర్తి స్థాయిలో బకాయిలు రాబట్టేందుకు నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్ ఆధ్వర్యంలో బల్దియా అధికారులు ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. నగరంలో మొత్తం 89 వేల అసెస్మెంట్లు ఉన్నాయి. ఇందులో రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షి యల్ కేటగిరీలు ఉన్నాయి. అన్నింటికీ కలిపి రూ.95 కోట్ల ఆస్తి పన్ను డిమాండ్ ఉంది. డబుల్ అసెస్మెంట్లు, కూల్చేసిన, శిథిల దశలో ఉన్న భవనాలను మినహాయిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.75 కోట్ల ఆస్తి పన్నులు రావాల్సి ఉంది. అయితే ఇందులో ఇప్పటికే రూ.33.5 కోట్లు వసూలు అయ్యాయి. మిగిలిన రూ.41.5 కోట్లు వసూలు చేసేందుకు గాను అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుని ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగారు. చెల్లించనివారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా రూ.41.5 కోట్ల బకాయిలలో సుమారు రూ.15 కోట్ల వరకు నలుగురైదుగురు మాత్రమే చెల్లించాల్సి ఉండడం విశేషం. వీటిపై అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. బకాయిల వసూలు కోసం స్పెషల్ డ్రైవ్లో భాగంగా అన్ని జోన్లలో ప్రత్యేకంగా నోడల్ అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డిప్యూటీ కమిషనర్లను నియమించారు. అదేవిధంగా 60 వార్డులకు గాను సూపర్వైజర్లు, మరో ముగ్గురు చొప్పున అధికారులను బృందాలుగా ఏర్పాటు చేశారు. డబుల్ అసెస్మెంట్లు, శిథిల, కూల్చేసిన భవనాలను శాసీ్త్రయ విధానంలో క్షేత్ర స్థాయి పరిశీలన చేయనున్నారు. డాక్యుమెంట్ వారీగా ఫైల్ను నిర్వహించి వాటిని తొలగించనున్నారు. మిగిలిన వాటికి సంబంధించి వసూళ్లకు కచ్చితమైన ప్రణాళికలను తయారు చేశారు. డిఫాల్టర్లకు వారంరోజుల గడువు 30 వేల మందికి నోటీసులిచ్చేందుకు రంగం సిద్ధం.. ఇప్పటికే 9 వేల మందికి అందించిన కార్పొరేషన్ రావాల్సిన బకాయిలు రూ.41.5 కోట్లు.. నాలుగైదు పెద్ద ప్రాపర్టీల బకాయిలే రూ.15 కోట్లు చట్టపరమైన చర్యలకు రంగం సిద్ధంబకాయిలకు సంబంధించి 30 వేల మందికి రెడ్ నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో ఇప్పటికే 9 వేల మందికి నోటీసులు జారీ చేశారు. మిగిలినవాళ్లకు సైతం జారీ చేసేందుకు యంత్రాంగం యుద్ధప్రాతిపదికన ముందుకెళుతోంది. ముఖ్యంగా మొండి బకాయిదారులను గుర్తించి ప్రత్యేకంగా జాబితా రూపొందించారు. వీటిలో హోటల్స్, కమర్షియల్ కాంప్లెక్స్లను ప్రత్యేకంగా గుర్తించి రెడ్ నోటీసులు జారీ చేశారు. వీటికి సంబంధించిన పాత బకాయిల ను సైతం ఏడు రోజుల్లో చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, డిప్యూటీ కమిషనర్లను క్షేత్రస్థాయిలోకి పంపుతున్నారు. ఇందూరులో ఆస్తి పన్నుల వసూలుకు నెలాఖరు వరకు స్పెషల్ డ్రైవ్ వాట్సాప్ గ్రూపు ఏర్పాటు బకాయిల వసూళ్లకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. నలుగురైదుగురు మొండి బకాయిదారులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాం. మొత్తం ఇంకా రావాల్సిన 41.5 కోట్లలో ఈ నలుగురైదుగురే రూ.15 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. అందరికీ ముందుగానే సమాచారం ఇస్తుండడంతో పాటు రెడ్ నోటీసులు జారీ చేస్తున్నాం. వసూళ్లకు సంబంధించి ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశాం. ప్రతి రోజూ ఉదయం సంబంధిత బృందాల్లోని అధికారులు నగరపాలక సంస్థ కార్యాలయంలో రిపోర్ట్ చేసి క్షేత్రస్థాయికి వెళ్లాలి. ముందురోజు రాత్రే వసూళ్ల ప్రణాళిక వివరాలను వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేసేలా నిర్ణయించాం. బకాయిలు పూర్తిస్థాయిలో వసూలు అయితే నగర అభివృద్ధికి ఉపయోగపడతాయి. – దిలీప్కుమార్, కమిషనర్ -
ఇన్చార్జి అదనపు కలెక్టర్గా దిలీప్కుమార్
సుభాష్నగర్: జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్గా (స్థానిక సంస్థలు) దిలీప్కుమార్ సోమ వారం బాధ్యతలు స్వీకరించారు. అదనపు కలెక్టర్ అంకిత్ పదోన్నతిపై భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్గా వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్గా నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ను నియమించారు. సోమవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మర్యాద పూర్వకంగా కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసి పుష్ఫగుచ్ఛం అందజేశారు. దిలీప్ కుమార్ను పలువురు జిల్లా అధికారులు కలిసి పుష్ఫగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నేడు, రేపు మద్యం దుకాణాలు బంద్ నిజామాబాద్ అర్బన్: హోలీ పండుగ నేప థ్యంలో మంగళ, బుధవారాలు రెండు రోజులపాటు కమిషనరేట్ పరిధిలో మద్యం దు కాణాలు బంద్ ఉంటాయని పోలీస్ కమిషన ర్ సాయిచైతన్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. శాంతిభద్రతల దృష్ట్యా మద్యం దుకాణాలు, కల్లుడిపోలు, బార్లు బంద్ పాటించాలని పేర్కొన్నారు. 5వ తేదీన ఉదయం 10 గంటలకు మద్యం దుకాణాలు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు. 687 మంది విద్యార్థుల గైర్హాజరు ఖలీల్వాడి: ఇంటర్ పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. సో మవారం ఫస్టియర్ మ్యాథ్స్–1 ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు జరగగా, 96.8 శాతం విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. మొత్తం 21,473 మంది విద్యార్థులకు గాను 20,786 మంది హాజరు కాగా, 687 మంది గైర్హాజరయ్యారని వివరించారు. జిల్లాలోని మొత్తం 58 పరీక్షాల కేంద్రాలకుగాను తాను ఆరు జూనియర్ కళాశాలలను తనిఖీ చేయగా, 56 కేంద్రాలను పరీక్షల అధికారులు పర్యవేక్షించారన్నారు. పోలీస్ ప్రజావాణికి 34 ఫిర్యాదులు నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణిలో 34 ఫి ర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ సా యి చైతన్య ఫిర్యాదులు స్వీకరించారు. ఫి ర్యాదుదారుల సమస్యలను పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ల బాధ్యులను ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా తమ సమస్యలను పోలీసులకు విన్నవించుకోవాలని ఆయన సూచించారు. -
వచ్చిన బస్తాలు వచ్చినట్లుగా..
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో యూరియా విక్రయాలు అసాధారణ స్థితికి చేరాయి. సొసైటీలకు వచ్చిన బస్తాలను వచ్చినట్లుగా రైతులు తీసుకెళ్తుండడంతో గోదాములు వేగంగా ఖాళీ అవుతున్నాయి. జిల్లా కోటా ముగిసిన కూడా రైతులు ఇంకా యూరియా బస్తాలను కొనుగోలు చేయ డం వ్యవసాయాధికారులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎంత స్టాక్ తెప్పించినా సరిపోవడం లే దని తలలు ప ట్టుకుంటున్నారు. యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా 5లక్షల ఎకరాలకుపైగా వివిధ పంటలు సాగవుతున్నాయి. అత్యధికంగా వరి 4.25లక్షల ఎకరాలు, మొక్కజొన్న 32,754 ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాకు 78వేల మెట్రిక్ టన్నుల యూరి యా సరిపోతుందని భావించిన వ్యవసాయశాఖ బ ఫర్ స్టాక్తో కలిపి మొత్తం 82వేల మెట్రిక్ టన్నులు అవసరమని రాష్ట్ర శాఖకు ఇండెంట్ పంపింది. రైతులు వరికి మూడో డోసు యూరియా తీసుకునే సమయంలోనే ప్రభుత్వం ఫర్టిలైజర్ బుకింగ్ యా ప్ను తీసుకొచ్చింది. అప్పటికే పాత పద్ధతిలో ఒక టి, రెండు డోసుల యూరియాను తీసుకున్న రైతు లు రానున్న రోజుల్లో కొరత రావచ్చనే ఉద్దేశంతో యాప్ ద్వారా మరింత యూరియా కొనుగోలు చేస్తున్నారు. పెద్ద రైతులు ఎక్కువ బస్తాలను తీసుకెళ్లడంతో చిన్న రైతులకు సమయానికి దొరకడం లేదు. ఇప్పటి వరకు 79వేల మెట్రిక్ టన్నుల యూ రియా అమ్ముడుపోగా, సోమవారం మరో వెయ్యి మెట్రిక్ టన్నులు తెప్పించారు. ఇది కూడా సరి పోదని జిల్లాకు మరింత కావాలని వ్యవసాయ శాఖ ఇండెంట్ పంపింది. పోయిన ఏడాది యాసంగిలో 79,615 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం దానిని మించి కొనుగోళ్లు జరుగుతాయని వ్యవసాయాధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ విధానం కారణంగా కొన్ని చోట్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. స్మార్ట్ ఫోన్ లేని రైతులు బుకింగ్ చేసుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో సొసైటీల ముందు, రోడ్లపై ధర్నా లు చేస్తున్నారు. యాప్ అలవాటైన రైతులు మా త్రం చకచక యూరియాను బుకింగ్ చేసేస్తున్నా రు. స్టాక్ వచ్చిందని తెలియగానే స్టాక్ ఎక్కడ అ యిపోతుందేమోనని పొద్దున్నే సొసైటీ గోదాము ల వద్ద మొబైల్ ఫోన్లతో కుస్తీ పడుతున్నారు. రైతులు అవసరం మేరకే తీసుకోవాలి యాసంగి సీజన్కు అవసరమయ్యే యూరియా కోటా ఇప్పటికే పూర్తయ్యింది. ఇంకా రైతుల నుంచి డిమాండ్ ఉండడంతో ఉన్నతాధికారులతో మాట్లాడి జిల్లాకు ఎప్పటికప్పుడు యూరియాను తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నాం. రైతులు సహకరించి అవసరం మేరకే బస్తాలను తీసుకెళ్లాలి. యాప్ను అందరూ అలవాటు చేసుకుంటే రానున్న రోజుల్లో ఇబ్బందులు ఉండవు. – వీరాస్వామి, జిల్లా వ్యవసాయాధికారి జిల్లాలో అసాధారణంగా యూరియా విక్రయాలు యాసంగిలో ఇప్పటి వరకు 79వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిన రైతులు జిల్లా కోటా ముగిసినా.. మరింత తెప్పిస్తున్న వ్యవసాయ శాఖ -
నిజామాబాద్
పేదల సంక్షేమమే.. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2026– 8లో uఏ పని ఉన్నా కాంప్లెక్స్ హెచ్ఎం చుట్టూ తిరగాల్సి వస్తోందని సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీలు), ఎల్ఎఫ్ఎం హెచ్ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మండల పరిధిలో అధికారాలన్నీ ఎంఈవోలకే ఉండగా.. 2019లో అప్పటి ప్రభుత్వం ఎంఈవోల అధికారాలను వికేంద్రీకరిస్తూ, కొన్నింటిని కాంప్లెక్స్ హెచ్ఎంలకు అప్పగించింది. ఎస్జీటీలకు -
జోరందుకున్న ప్లాట్ఫారాల నిర్మాణాలు
వేల్పూర్: వేల్పూర్ క్రాస్రోడ్డు సమీపంలోని పసుపుపార్కులో పసుపు ఆర బెట్టుకునే ప్లాట్ఫారాల ని ర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. సుమా రు పదేళ్ల కింద బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 63 నంబరు జాతీయ రహదారికి సమీపంలో, పడగల్ రైల్వే స్టేషన్ పక్కన సుమారు 42 ఎకరాల స్థలాన్ని పసుపు పార్కు కోసం కేటాయించింది. చుట్టుపక్కల మండలాల రైతుల నుంచి తీసుకునే పసుపు తో అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్ర ణాళికలు రూపొందించారు. కానీ పరిశ్రమలు, వ్యా పారులు ముందుకు రాకపోవడంతో ఎటువంటి కార్యకలాపాలు మొదలు కాలేదు. ఇటీవల రాష్ట్ర ప్ర భుత్వం సుగంధ ద్రవ్యాల బోర్డు ద్వారా రూ.1.38 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో పసుపు పార్కులో మరుగుదొడ్లు, మూత్రశాలలు, 580 మీటర్ల వెడల్పు కొలత గలిగిన నాలుగు ప్లాట్ ఫారాలను నిర్మిస్తున్నారు. తిరిగి నిధులు కేటాయించి, ప్లాట్ ఫారాల నిర్మాణం చేపడుతుండటంతో పసుపు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దశల వారీగా ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పే అవకాశం ఏర్పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. -
4 నుంచి దూరవిద్య రెండో సెమిస్టర్ పరీక్షలు
ఖలీల్వాడి: ఈనెల 4 నుంచి 12వ తేదీ వరకు అంబేడ్కర్ దూరవిద్య ఏంబీఏ రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జీజీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్మోహన్రెడ్డి, రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ రంజిత ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు జీజీ కాలేజీలో కొనసాగుతాయని, పూర్తి వివరాలకు అంబేడ్కర్ యూనివర్సిటీకి వెబ్సైట్ www.braouonline.in ను సంప్రదించాలని సూచించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు నిజామాబాద్అర్బన్: హోలీ వేళ ప్రజలు నిబంధనలు పాటించాలని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య స్పష్టం చేశారు. కమిషనరేట్ పరిధిలో హోలీ వేడుకలను సంతోషంగా నిర్వహించుకోవాలని కోరారు. బహిరంగ ప్రదేశాల్లో ఇష్టంలేని వారికి రంగులు చల్లడం, వాహనాలపై గుంపులుగా తిరగడం చేయొద్దని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సేవా కార్యక్రమాల్లో ముందుండాలి నిజామాబాద్ రూరల్: సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ ముందుండాలని అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి అన్నారు. నగరంలోని పెన్షనర్స్ భవన్లో ఆదివారం ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వార్షిక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సంస్థ చేసే కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ఈ సమావేశంలో ప్రకటించారు. అంతకుముందు ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థకి సహకరిస్తూ సేవల్లో పాల్గొంటున్న వారికి సేవా స్ఫూర్తి–2026 పేరిట అవార్డులను ఆయన అందజేశారు. అందించారు. అలాగే అన్నదానం, అనాథ శవాల అంతిమ సంస్కారాల గురించి 2 పాటల సీడీలను ఆవిష్కరణ చేశారు. బస్వారెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ శాఖ తరుపున సంస్థకు సహకారం ఎపుడు ఉంటుందన్నారు. 20వ డివిజన్ కార్పొరేటర్ న్యాలం రాజు, ప్రవీణ్ యాదవ్, 38వ డివిజన్ కార్పొరేటర్ సతీష్ కుమార్, వినోద్, సంస్థ ప్రతినిధులు సుజాతరెడ్డి, పుష్పవతి, నాగమణి, హనుమండ్లు పాల్గొన్నారు. -
ఫర్టిలైజర్ యాప్ను రద్దు చేయాలి
డొంకేశ్వర్(ఆర్మూర్): ఫర్టిలైజర్ (యరియా) యా ప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మండలం లోని గాదేపల్లి సొసైటీ గోదాము వద్ద రైతులు ఆది వారం ధర్నా చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన యా ప్ విధానం కారణంగా సమయానికి యూరియా దొరకడం లేదని, ఇబ్బందులు పడుతున్నామన్నా రు. మొబైల్ ఫోన్ లేని రైతులు ఏవిధంగా యూరి యా బుక్ చేసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించా రు. యాప్ను రద్దు చేసి పాత పద్ధతిలోనే యూరి యా అందించాలని రైతులు డిమాండ్ చేశారు. రెంజల్ మండలంలో..రెంజల్(బోధన్): మండలంలోని దూపల్లి, రెంజల్ గ్రామాల రైతుల మధ్య యూరియా కోసం స్వల్ప వివాదం చోటు చేసుకుంది. దూపల్లి, రెంజల్ విండోలకు యూరియా బస్తాలు వచ్చాయని ఆయా విండోల కార్యదర్శులు వాట్సాప్, ప్రచార మాధ్యమాల్లో ఆదివారం ప్రకటించారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న రెంజల్ రైతులు దూపల్లి విండో ద్వార యూరియా తీసుకోవాలని సమాచారం వచ్చింది. ఈ మేరకు రెంజల్కు చెందిన పలువురు రైతులు పలువురు దూపల్లి విండోకు వెళ్లగా ఆ గ్రామ రైతులు అడ్డుకున్నారు. తమ గ్రామంలోని రైతులకు అందించకుండా పక్క గ్రామాల రైతులకు ఎలా అందిస్తారని ప్రశ్నించారు. తమ విండోలో పక్క గ్రామా ల రైతులకు ఆన్లైన్లో యూరియా బుక్ అయ్యిందని రెంజల్కు చెందిన రైతులు సర్దిచెప్పారు. చివరకు అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు దూ పల్లి గ్రామానికి చేరుకుని రెండు గ్రామాల రైతులను సముదాయించారు. రెంజల్ గ్రామ రైతులు సాయంత్రం వరకు దూపల్లిలోనే వేచి ఉండి అధికారులు అందించిన యూరియా బస్తాలను తీసుకున్నారు. -
కరాటే, తైక్వాండో క్రీడలతో ఆత్మరక్షణ
నిజామాబాద్ అర్బన్: కరాటే, తైక్వాండో వంటి క్రీడలు ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగపడతాయని, విద్యార్థి దశ నుంచే శిక్షణ తీసుకుంటే శారీరక ధృడత్వం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని మేయర్ కూరగాయల ఉమారాణి అన్నారు. నగరంలోని తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం 2వ తైక్వాండో జిల్లా ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి మేయర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టోర్నమెంట్లను సద్వి ని యోగం చేసుకుంటే క్రీడాకారులు భవిష్యత్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించే అవకాశాలు ఉంటాయన్నారు. అనంతరం అసోసియేషన్ చైర్మన్ రమేశ్ పవర్ మాట్లాడుతూ.. జిల్లాలో తైక్వాండో అభివృద్ధి కోసం మరిన్ని శిక్షణ శిబిరాలు, ప్రతిభావంతుల ఎంపిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా క్రీడాకారులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. -
ఆర్ఎస్ఎస్ ఆత్మ స్వరూపమే నిత్యశాఖ
సుభాష్నగర్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆత్మ స్వరూపమే నిత్య శాఖ అని ఆ సంస్థ తెలంగాణ సహ ప్రాంత ప్రచారక్ కల్పగురి ప్రభుకుమార్ అ న్నారు. ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఒకే సమయంలో.. ఒకే చోట స్వయం సేవకులు అందరూ సామూహికంగా చేసే తపస్సు వంటిందని, ఆర్ఎస్ఎస్ కార్యపద్ధతి మొత్తానికి మూలమంత్రం నిత్య శాఖ మాత్రమేనని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ ఇందూరు నగర శాఖల సంగమం కార్యక్రమాన్ని ఆదివారం నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల మై దానంలో నిర్వహించారు. ప్రధాన వక్తగా హాజరైన ప్రభుకుమార్ మాట్లాడుతూ.. వందేళ్ల ఆర్ఎస్ఎస్ ప్రయాణానికి ప్రాణం నిత్యశాఖ అని అన్నారు. శా ఖలో తయారైన కోట్లాదిమంది స్వయం సేవకులు దేశభక్తితో వివిధ రంగాల్లో దేశం కోసం పని చేస్తున్నారని, వారందరి హృదయాల్లో స్ఫూర్తిని రగిలింపజేస్తోంది నిత్యశాఖ అని పేర్కొన్నారు. సంఘ్ కార్యం ఆవశ్యకతను ఎంతోమంది దేశభక్తులు, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వారు గుర్తించి ప్రశంసించారన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శాఖ లేని బస్తీల్లో వెంటనే శాఖలు ప్రారంభించాలని, శాఖ లేని బస్తీ ఉండకూడదని ప్రభుకూమార్ సూచించారు. రాబోయే రోజుల్లో బస్తీల్లో హిందూ సమ్మేళనాలను నిర్వహించాలని, వేలాదిమంది హిందువులను ఒకచోట చేర్చి హిందూ ధర్మ పరిరక్షణే మన జీవన సంకల్పమనే విషయాన్ని అర్థం చేయించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగర కార్యవాహ అర్గుల సత్యం, సహ కార్యవాహలు సుమిత్ కుమార్, వెంకటేశ్, స్వయం సేవకులు పాల్గొన్నారు. ఇందూరు శాఖకు 75 ఏళ్లు సంఘ్ ప్రారంభమై వందేళ్లు పూర్తి కావడం, ఇందూరులో మొట్టమొదటి సంఘ శాఖ ప్రారంభమై 75ఏళ్లు పూర్తి కావడం ఎంతో ప్రత్యేకమైన సందర్భంగా ప్రభుకుమార్ వర్ణించారు. ఇందూరు నగరం ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన నగరమని, ఇక్కడి హిందువులు ఎంతో విశేషమైన ధర్మ నిష్ఠ కలిగిన వారిని ప్రశంసించారు. క్రమశిక్షణ, సమయపాలన, దేశభక్తి, ధర్మ నిష్ట, వ్యక్తిగత శీలము, జాతీయ శీలము, సంస్కారము, సంస్కృతి పరిరక్షణ అనే ఎన్నో సుగుణాలను సంఘ్ శాఖ ఆధారంగా స్వయం సేవకులు ఉపాసన చేస్తున్నారని, చిన్నచిన్న కార్యక్రమాల ద్వారా విశేషమైన సుగుణాలను స్వయం సేవకులు నిత్య శాఖ అనే సాధన యజ్ఞంలో పొందుతున్నారని తెలిపారు. ఆర్ఎస్ఎస్ శాఖ అంటే సమాజం యొక్క సంస్కారాలకు కేంద్ర బిందువు అని, సంఘానికి ఏ రాజకీయ అవసరాలు లేవని ఆయన స్పష్టం చేశారు. శాఖ లేని బస్తీల్లో వెంటనే ప్రారంభించాలి ఆర్ఎస్ఎస్ తెలంగాణ సహ ప్రాంత ప్రచారక్ కల్పగురి ప్రభుకుమార్ ఘనంగా ఇందూరు నగర శాఖల సంగమం -
క్షణక్షణం.. భయంభయం
నిజామాబాద్అర్బన్: గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడుల నేపథ్యంలో వలస కార్మికుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పొట్ట చేతపట్టుకుని వెళ్లిన త మ వారు అక్కడ ఎలా ఉంటున్నారోనని క్షణక్షణం భయపడుతున్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటూ గత రెండు రోజులుగా గంటగంటకూ వాట్సా ప్ వీడియో, ఆడియోకాల్స్ చేస్తూ క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. దుబాయి, ఇజ్రాయి ల్, సౌదీ అరేబియా, ఖతర్, బహ్రెయిన్, కువైట్, యూఏఈ తదితర దేశాల్లో జిల్లాకు చెందిన 20వేల మందికిపైగా కార్మికులు, విద్యార్థులు ఉన్నారు. యుద్ధ వాతావరణం నెలకొనడంతో వలసకార్మికుల కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. దుబాయిలో ఉన్నవారు డ్రోన్ దాడుల వీడియోలను ఇక్కడున్న తమ బంధువులకు పంపిస్తున్నారు. అక్కడి నుంచి వచ్చేయాలని ఉన్నా ఎయిర్పోర్టులు మూసివేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న వారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు వలస కార్మికుల కుటుంబాల్లో ఆందోళన తమవారి క్షేమ సమాచారం కోసం గంటగంటకూ ఫోన్లు మిడిల్ ఈస్ట్లోని పలు దేశాల్లో 20వేల మందికిపైగా జిల్లావాసులు -
మహిళల నైపుణ్యానికి వేదిక!
డొంకేశ్వర్(ఆర్మూర్): స్వయం సహాయ సంఘాల (ఎస్హెచ్జీ) మహిళల నైపుణ్యాన్ని చాటి చెప్పేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా కేంద్రంలో ‘మినీ సరస్ మేళా’ను నిర్వహిస్తోంది. పాత కలెక్టరేట్ (స్పోర్ట్స్) గ్రౌండ్లో నిజామాబా ద్, కామారెడ్డి జిల్లాలకు కలిపి ఈ నెల 6నుంచి 12వ తేదీ వరకు మేళాను నిర్వహించనున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను నేరుగా నగర వినియోగదారులకు పరిచయం చేయడం మేళా ప్రధాన ఉద్దేశం. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొలిసారిగా జరుగుతున్న మేళాను విజయవంతం చేయడానికి గ్రామీణాభివృద్ధి శాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మేళాలో వస్తువులు, ఉత్పత్తులతో ప్రదర్శనకు వచ్చిన ఎస్హెచ్జీ మహిళలకు వారం రోజులపాటు ఉచితంగా వసతి, భోజన సౌకర్యాలు కల్పించనున్నారు. స్టాళ్లలో విభిన్న ఉత్పత్తులు, వస్తువుల ప్రదర్శన... మేళాలో మొత్తం 30 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కేవలం ఎస్హెచ్జీ మహిళలు తమ చేతులతో తయారు చేసిన చేనేత వస్త్రాలు, జ్యూట్ బ్యాగులు, మట్టి పాత్రలు, గృహ అలంకరణ వస్తువులు, హస్తకళా రూపాలను స్టాళ్ల ద్వారా విక్రయిస్తారు. అలాగే గ్రామీణ వంటకాలు, ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసిన పిండి వంటలు, ఊరగాయలు, మసాలా దినుసులు కూడా ప్రదర్శనలో అమ్మకానికి ఉంచుతారు. ఎస్హెచ్జీ మహిళలకు వ్యాపార పరిచయం, ఆర్థిక స్వావలంబనకు, కళాకారులకు ప్రోత్సాహానికి ఇదో గొప్ప వేదికని చెప్పొచ్చు. దళారుల ప్రమేయం లేకుండా మహిళలు తమ ఉత్పత్తులకు సరైన ధర పొందేలా ఉపయోగపడుతుంది. విభిన్న వస్తువుల కొనుగోలుకు నగర ప్రజలకు ఈ మేళా మంచి అవకాఽశం కూడా. మేళాను గొప్పగా నిర్వహిస్తాం మినీ సరస్ మేళాను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లో నిర్వహించడం ఇదే మొదటిసారి. మహిళా సంఘాలకు మాత్రమే వా రు తయారు చేసిన వస్తువులు, ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించే అవకాశం ఉంటుంది. ఇది మంచి అవకాశం. ఉత్పత్తులతో పాల్గొనే వారికి నివాస, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నాం. గుర్తుండిపోయేలా మేళాను నిర్వహిస్తాం. నగర ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలి. – సాయాగౌడ్, డీఆర్డీవో, నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ‘మినీ సరస్ మేళా’ ఈ నెల 6న పాత కలెక్టరేట్ గ్రౌండ్లో ప్రారంభం సొంత ఉత్పత్తులు, హస్త కళలను ప్రదర్శించనున్న ఎస్హెచ్జీ మహిళలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్న గ్రామీణాభివృద్ధి శాఖ -
మాదిగ అమరవీరుల స్ఫూర్తితో ఎస్సీ వర్గీకరణ
నిజామాబాద్ రూరల్: మాదిగ అమర వీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నగరంలోని టీఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బాబూ జగ్జీవన్ రామ్ చౌరస్తా లో మాదిగ అమర వీరులకు ఘనంగా నివాలులు అర్పించారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ మాదిగ అమరవీరుల స్ఫూర్తితోనే సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేసిందన్నారు.మంత్రి దామోదర రాజనర్సింహ అమర వీరుల కుటుంబాల ఇళ్లకు వెళ్లి వారి పాదాలు కడిగి రూ. ఐదు లక్షలు అందజేసి, వారి కుటుంబాలకు అండగా నిలిచారన్నారు.ఈసందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ అధ్యక్షులు మల్లేష్ మాదిగ, మాదిగ మహిళా సమైక్య నగర అధ్యక్షురాలు బంటు జ్యోతి ,మాదిగ ఉద్యోగస్తుల సంఘం మైసయ్య , రాములు,రమేశ్, నాయకులు తెడ్డు గంగారం తదితరులు పాల్గొన్నారు -
ఖాళీ కుర్చీలకు సన్మానం
సన్మాన కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీకి చెందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు హాజరు కాలేదు.దీంతో వారికి కేటాయించిన కుర్చీలకు సన్మానించారు. రాజకీయాలకతీతంగా మున్నూరు కాపు కులస్తులను కలుపుకొని పోవాలనేది తమ ఉద్దేశమని సంజయ్ పేర్కొన్నారు. కొందరు తమ మధ్య చిచ్చు పెట్టడం సమంజసం కాదన్నారు. కార్యక్రమానికి రావాలని ఉన్నా కొన్ని అరాచక శక్తుల వల్ల వారు రాలేకపోయారని ఆరోపించారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
రోగులకు మెరుగైన సేవలందించాలి
సిరికొండ: ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్ సూచించారు. మండల కేంద్రంలో జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రైవేటు ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. తాహెర్ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఆస్పత్రికి చెందిన వైద్యులు రోగులను పరీక్షించి ఉచితంగా మందులను అందజేశారు. సర్పంచ్ సాయిలు, ఉపసర్పంచ్ శోభన్, వైద్యులు పాల్గొన్నారు. ఖలీల్వాడి: నగరంలోని ఎల్లమ్మగుట్టలోని అమ్మనగర్లోని నిశిత ఇంటర్నేషనల్ స్కూల్లో ఆధునిక బోధన విధానాలు, అనుభవాత్మక విద్య అందించాలనే లక్ష్యంతో ‘స్కిల్ ఫియెస్టా’ వర్క్షాప్ నిర్వహించినట్లు ప్రిన్సిపల్ దియా బెనర్జీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వర్క్షాప్లో విద్యార్థులు వివిధ ప్రాక్టికల్, ఇంటరాక్టివ్ సెషన్ల ద్వారా తమ ప్రతిభను గుర్తించే అవకాశాన్ని పొందారు. సంప్రదాయ తరగతి బోధనకు భిన్నంగా, పిల్లలు కార్యాచరణల ద్వారా నేర్చుకుంటూ వివిధ అంశాలు, సామర్థ్యాలను వర్క్షాప్లో తెలిసుకున్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.కార్యక్రమంలో నిశితా ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం చీఫ్ ప్యాట్రన్ చౌదవరమ్ వినయ్ కుమార్, చైర్మన్ మిస్టర్ చౌదవరమ్ నిఖిల్, డైరెక్టర్ చౌదవరమ్ పూజ, టీచర్లు సిబ్బంది పాల్గొన్నారు. సిరికొండ: మండలంలోని రావుట్ల గ్రామానికి చెందిన మేతరి రాజారాం అనే వ్యక్తి అనారోగ్యంతో నాలుగు రోజుల క్రితం మృతి చెందారు. నిరుపేద కుటుంబం కావడంతో గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మృతుడి కుటుంబ సభ్యులకు రూ. 21 వేల నగదును అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజ్కుమార్, వీడీసీ చైర్మన్ భూమన్న, తోట రాజన్న, రాజేందర్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ: మండలంలోని న్యావనంది గ్రామంలో మల్లన్న ఆలయం వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన హైమాస్ట్ లైట్ను సర్పంచ్ మామిడికింది దీపనరేందర్తో కలిసి కాంగ్రెస్ యువ నాయకులు ఉమ్మాజీ నరేశ్ ఆదివారం ప్రారంబించారు. ఆలయం వద్ద ఎమ్మెల్యే భూపతిరెడ్డి లైట్ను ఏర్పాటు చేయించారని నరేశ్ తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ రిక్క ముత్తెన్న, మాజీ ఎంపీటీసీ ముష్కీల్ నరేందర్, నేల్ల దాసు తదితరులు పాల్గొన్నారు. ిసరికొండ:మండలంలోని గడ్కోల్ గ్రామంలో ఆదివాసీ నాయక్పోడు సేవా సంఘం కులస్తుల మండల ఆత్మీయ సమ్మేళనం సోమవారం నిర్వహిస్తున్నట్లు ముషీర్నగర్ ఉపసర్పంచ్ ధోని మోహన్, కర్నాల ప్రభు, కళ్లెం నర్సయ్య, దుంపల సాయిలు, రమేశ్లు తెలిపారు. సమ్మేళనానికి సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు గాండ్ల రాంచందర్ ముఖ్య అతిథిగా వస్తున్నట్లు తెలిపారు. మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్లు వారు తెలిపారు. -
పంచ పరివర్తనను గ్రామాలకు తీసుకెళ్లాలి
డిచ్పల్లి: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ డిచ్పల్లి ఖండ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని శ్రీకాశీ విశ్వనాథ ఆలయం ఆవరణలో ఆదివారం ఆర్ఎస్ఎస్ శాఖల సంగమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సేవా ప్రముఖ్ దాసరి గంగాధర్ మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ ప్రారంభమై నేటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. ఆర్ఎస్ఎస్కు ప్రతిరోజు గంటసేపు జరిగే ‘నిత్యశాఖ’ ప్రాణమని, శాఖలో చేసే వ్యాయామం, సూర్య నమస్కారాలు, సమత, దేశభక్తి గీతాల ద్వారా స్ఫూర్తి పొందిన అనేకమంది స్వయం సేవకులు దేశం కోసం నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు. క్రమశిక్షణ, సమయపాలన, దేశభక్తి, ధర్మనిష్ట, వ్యక్తిగత శీలం, జాతీయ శీలం, సంస్కారం, సంస్కృతి పరిరక్షణ అనే ఎన్నో సుగుణాలను శాఖ ఆధారంగా స్వయంసేవకులు ఉపాసన చేస్తున్నారని పేర్కొన్నారు. స్వయం సేవకులు సేవా కార్యక్రమాలను అందిస్తున్నారని తెలిపారు. సంఘ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పంచ పరివర్తన (సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన్, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ భావన నిర్మాణం చేయడం, పౌర నియమాలు నిరంతరం పాటించేలా చైతన్యం చేయడం) కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. పంచ పరివర్తనను గ్రామ గ్రామానికి తీసుకెళ్లి ప్రజలను చైతన్యం చేసి దేశాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లడం కోసం సంఘ్ పనిచేస్తుందని దాసరి గంగాధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖండ కార్యవాహ ఎల్.సంతోష్, బండి సోమనాథ్, హరీష్, బొద్దుల చక్రపాణి, సత్యనారాయణ, ప్రభాకర్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
మున్నూరు కాపులు ఐక్యంగా ఉండాలి
● అభివృద్ధి కోసం పాటుపడాలి ● మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ నిజామాబాద్ రూరల్: మున్నూరు కాపు కులస్తులంతా ఐక్యంగా ఉండి అభివృద్ధి కోసం పాటుపడాలని మాజీ మేయర్, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘంలో జిల్లా మున్నూరు కాపు, కార్పొరేటర్లను, కౌన్సిలర్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులస్తులందరూ ఒక తాటిపైకి వచ్చి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడమే ఈకార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. డీఎస్ అడుగుజాడల్లో అందరిని కలుపుకుపోతామన్నారు. కొందరి నాయకుల స్వార్థ రాజకీయాలకు అమాయకులు బలవుతున్నారన్నారు. -
ప్రమాదాల ప్రయాణాలు
ఇందల్వాయి: ఇందల్వాయి– ధర్పల్లి రోడ్డు మార్గంలో వంతెన పనులతో పాటు, రోడ్డు పనులు అసంపూర్తిగా ఉన్నాయి. దీంతో వాహనదారులు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈమార్గంలో నిత్యం వేలాది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. లింగాపూర్ వాగుపై నూతనంగా నిర్మించిన వంతెన పూర్తయినా ఇరువైపులా సమాంతరంగా రోడ్డు వేయకపోవడంతో వాహనాలు నిటారుగా వంతెనపైకి ఎక్కాల్సి వస్తుంది. ఈక్రమంలో వాహనాలు పట్టు తప్పితే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. అన్సాన్పల్లి వద్ద అటవీ ప్రాంతంలో నిలిచిపోయిన రోడ్డు పనులు కూడా ప్రయాణికులను ప్రమాదాలబారిన పడేలా చేస్తున్నాయి. భారీ గుంతలతో ఈ ప్రాంతంలో ఇదివరకే ఇద్దరు చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటి వరకు సంబంధిత అధికారులు స్పందించకపోవడం గమనార్హం. పనుల్లో జాప్యం ఇందుకే.. లింగాపూర్ వంతెన నిర్మించిన కాంట్రాక్టర్కు సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడంతో పనుల్లో వేగం తగ్గింది. వంతెన పనులు పూర్తయినా ఇరువైపులా సమాంతరంగా రోడ్డు వేయడం మిగిలిపోయింది. అన్సాన్పల్లి శివారులోని అటవీ ప్రాంతంలో రోడ్డు పనులు నిలిచి మూడేళ్లు అవుతుంది. అటవీ శాఖకు సమకూర్చాల్సిన నిధుల లేమి కారణంగానే అనుమతులు నిలిపివేసింది. లింగాపూర్ వంతెన పనులతో పాటు ఎల్లారెడ్డిపల్లె–అన్సాన్పల్లి గ్రామాల మధ్య రోడ్డును బాగు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలి. నాలుగు మండలాలకు చెందిన వేల సంఖ్యలో వాహనాలు నిత్యం ఈ రోడ్డు వెంట ప్రయాణిస్తాయి. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి. –సక్కి శ్రీనివాస్, ఎల్లారెడ్డిపల్లెఅవసరమైన నిధుల కోసం నివేదికలు పంపించాం. నిధులు సమకూరగానే రోడ్డు పనులు ప్రారంభమవుతాయి. వర్షాకాలం లోపే పనులు పూర్తవుతాయి. అప్పటివరకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి తగిన చర్యలు చేపడుతున్నాం. –గంగాధర్, ఆర్అండ్బీ ఏఈ, ఇందల్వాయి ఇందల్వాయి– ధర్పల్లి మార్గంలో అసంపూర్తిగా రోడ్డు పనులు అన్సాన్పల్లి అటవీప్రాంతంలో భారీగుంతలు గతంలో ఇద్దరి మృతి.. పలువురికి తీవ్రగాయాలు పట్టించుకోని అధికారులు -
సంపన్న వర్గాలకు అనుకూలంగా కేంద్ర బడ్జెట్
నిజామాబాద్ రూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంపన్నవర్గాలకు అనుకూలంగా ఉందని సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు అన్నారు. ఆదివారం నగరంలో సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. పెరుగుతున్న ధరల్ని నియంత్రించడానికి పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్,జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, జిల్లా కోశాధికారి ఈవీఎల్ నారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు జంగం గంగాధర్, పి.స్వర్ణ జిల్లా సహాయ కార్యదర్శి నన్నే సాబ్, సుకన్య, నరేశ్, తదితరులు పాల్గొన్నారు. -
సేవలోనే అసలైన సంతృప్తి
సుభాష్నగర్: సేవలోనే అసలైన సంతృప్తి ఉందని, ప్రతిఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు హజారి మనోజ, ఘటాడి రామ్ దంపతులు పేర్కొన్నారు. ఆదివారం నగరంతోపాటు శివారు ప్రాంతాల్లోని నిరుపేదలు, నిరాశ్రయులు, అనాథలు, యాచకులు, వృద్ధులు, దివ్యాంగులకు చికెన్తో తయారుచేసిన భోజనాన్ని అందజేశారు. భోజనాన్ని పంపిణీ చేయడంపై వారు సంతృప్తి, సంతోషం వ్యక్తంచేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదరికం నుంచి ఈస్థాయికి చేరుకోవడంలో ఎంతో కష్టం దాగి ఉందన్నారు. 15 ఏళ్లుగా నిరుపేదలు, నిరాశ్రయులకు తోచిన సాయం చేస్తున్నామని తెలిపారు. -
చెత్తశుద్ధిపై చిత్తశుద్ధి కరువు
● సెగ్రిగేషన్యార్డులు అలంకార ప్రాయం..అసాంఘిక కార్యకలాపాలకు నిలయం ● పల్లెల్లో సేంద్రియం సుదూరం ● పట్టింపులేని పాలకులు రెంజల్(బోధన్): పల్లెప్రగతిలో భాగంగా గత ప్రభుత్వం గ్రామాల వికాసం కోసం చెత్త సేకరణకు ట్రాక్టర్లు ఏర్పాటు చేసింది. తడి పొడి చెత్తను వేరు చేసేందుకు రూ. లక్షలు వెచ్చించి ప్రతి గ్రామ పంచాయతీలో సెగ్రిగేషన్ షెడ్లను నిర్మించింది. సేంద్రియ ఎరువును తయారు చేసి జీపీలను ఆర్థికంగా బలోపేతంగా మార్చాలనే ఆలోచనకు తగినట్లుగా నిర్వహణ, ఏర్పాట్లు లేకపోవడంతో పల్లెల్లో సంపద తగలబడిపోతుంది. ఆదాయానికి నిప్పు.. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచి పంచాయతీలకు ఆదాయం పెంచే లక్ష్యంతో జిల్లాలోని ప్రతీ పంచాయతీలో ఉపాధి హామీ పథకం ద్వారా ఒక్కో సెగ్రిగేషన్షెడ్డుకు నిధులు మంజూరు చేసి నిర్మాణాలను పూర్తి చేశారు. తడి పొడి చెత్త సేకరణకు ప్రతి ఇంటికి రెండు చెత్తబుట్టలను పంపిణీ చేశారు. ట్రాక్టర్ల ద్వారా సిబ్బంది గ్రామంలో సేకరించిన తడి, పొడి చెత్తతో పాటు ప్లాస్టిక్, గాజు బాటిళ్లు, పేపర్లు, అట్టలు, మెటల్, ఎలక్ట్రానిక్ పరికరాలు, చెప్పులు, పనికిరాని పాత బట్టలు, సంచులు, బ్యాగులు తదితర వస్తువులను తీసుకవచ్చి సెగ్రిగేషన్ షెడ్డులోని వేర్వేరు గదుల్లో వేరుగా చేసి తద్వారా సేంద్రియ ఎరువుగా తయారు చేసి రైతులకు విక్రయించి పంచాయతీలు ఆదాయం పెంపొందించుకోవాలి. జిల్లాలో ఈ ప్రక్రియ అమలవుతున్న దాఖలాలు కనిపించడంలేదు. అధికారుల నిర్లక్ష్యంతో సేకరించిన చెత్తను రొడ్లు, చెరువులు, కుంటలు, వాగులు, ఖాళీ ప్రదేశాల్లో పారేసి వారానికి ఒక రోజు తగులబెట్టడంతో ప్రయాణికులు, గ్రామస్తులు పొగతో ఊపిరి తీసుకునేందుకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలో 545 జీపీలు ఉండగా.. అన్ని జీపీల్లో ఇదే పరిస్థితి ఉంది. సేంద్రియ ఎరువు తయారు చేయాలి గ్రామాల్లో సేకరించిన తడి, పొడి చెత్తను వేరుచేసి సేంద్రీయ ఎరువు తయారు చేయాలని కార్యదర్శులకు ఆదేశాలు అందించాం. నూతన పంచాయతీ పాలక వర్గాలకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో సైతం సర్పంచ్లకు సూచించడం జరుగుతుంది. తప్పనిసరిగా పంచాయతీలకు లాభాలను అందించే సేంద్రియ ఎరువుపై ఇప్పటి నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. – నాగరాజు, డీఎల్పీవో బోధన్ కుంటుపడుతున్న ప్రగతి పనులు.. గ్రామాలకు దూరంగా నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నాయి. వ్యర్థం స్వచ్ఛ స్ఫూర్తిగా విరుద్ధంగా చెత్తగా చెత్త నిర్వహణ చేస్తుండగా కనీసం సెగ్రిగేషన్ షెడ్ల వైపు అధికారులు కన్నెత్తి చూడటంలేదు. పల్లె ప్రగతి పనులు గ్రామాల్లో కుంటుపడుతున్నాయి. ప్రస్తుత పాలకులైనా పట్టించుకోల్సిన అవసరం ఉంది. -
‘సాగర్’కు పర్యాటక శోభ
నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ ప్రాజెక్టు పర్యాటక శోభను సంతరించుకుంటోంది. టూరిజం పనులు జోరుగా సాగుతున్నాయి. 1923–31 మధ్యకాలంలో నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మించారు. ‘ఎన్’ ఆకారంలో ప్రాజెక్టు నిర్మించగా ప్రధాన ఇంజినీర్తో పాటు ఇంజినీర్లు, కూలీలు సేద తీరేందుకు గోల్బంగ్లా, ఛత్రిబంగ్లా, రెస్ట్హౌస్, గెస్ట్హౌస్, స్విమ్మింగ్ పూల్, వాటర్ ఫౌంటెయిన్, సమ్మర్బాగ్ ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు నిర్మించి వందేళ్లు కావస్తున్నా ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉంది. ప్రాజెక్టు పరిసరాల్లో నిర్మించిన కట్టడాలు మాత్రం నిర్వహణ లేక మూలనపడ్డాయి. అయితే 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన సమయంలో నిజాంసాగర్ను బృందావనంలా మారుస్తానని పేర్కొన్నారు. ప్రాజెక్టు వద్ద పర్యాటక అభివృద్ధి కోసం అప్పట్లో ఇంజినీర్లు సర్వే చేసి 500 ఎకరాల భూములు గుర్తించారు. అయితే వైఎస్సార్ అకాల మరణంతో పట్టించుకునేవారు లేకుండాపోయారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తుత జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు నిజాంసాగర్ ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ప్రభుత్వం స్పందించి రూ. 10 కోట్లు మంజూరు చేసింది. 12 ఎకరాల్లో పనులు.. నిజాంసాగర్ ప్రాజెక్టు గోల్ బంగ్లా వద్ద ఎకో టూరిజం పనుల కోసం 12 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. రూ.7.7 కోట్ల నిధులతో గుల్దస్తా వద్ద టూరిజం పనులు చేపట్టారు. 17 కాటేజీలు, 7 సూట్లు, 2 రెస్టారెంట్లు, డార్మెట్ రూం, యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్, గార్డెన్ వంటి పనులు చేపడుతున్నారు. అంతేకాకుండా ప్రాజెక్టు 16 గేట్ల వద్ద పర్యాటకుల కోసం బోటింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. పనులన్నీ పూర్తయితే ప్రాజెక్టు మరింత పర్యాటక శోభను సంతరించుకుంటుందన్న ఆశాభావాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.వెనకబడిన ప్రాంతంగా పేరున్న జుక్కల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఎకో టూరిజం పనులు చేపట్టాం. నియోజకవర్గంలోని కౌలాస్కోట, కౌలాస్ ప్రాజెక్టు, ఎల్లమ్మ ఆలయాలను సైతం పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. – లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్యే, జుక్కల్ అందుబాటులోకి బోటింగ్ సదుపాయం ఊపందుకున్న కాటేజీలు, రెస్టారెంట్ల నిర్మాణం జోరుగా సాగుతున్న అభివృద్ధి పనులు -
వృద్ధుడి ఆత్మహత్య
డిచ్పల్లి: మండలంలోని ఘన్పూర్ గ్రామానికి చెందిన మచ్చ బుచ్చయ్య(70) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు డిచ్పల్లి ఎస్సై ఎండీ ఆరిఫ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. కొంతకాలంగా బుచ్చయ్య మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. అప్పుడప్పుడు ఇంటి నుంచి వెళ్లి మూడు రోజులకు తిరిగి వచ్చేవాడు. అలాగే శనివారం ఉదయం ఇంటి నుంచి నుంచి బయటకు వెళ్లిన అతను రాత్రయినా తిరిగి రాలేదు. ఆదివారం ఉదయం చెరువులో బుచ్చయ్య మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు, కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండగా గతేడాది పెద్ద కుమారుడు చనిపోయాడు. చిన్న కుమారుడు ఇటీవలే బతుకుదెరువు కోసం గల్ఫ్దేశానికి వెళ్లాడు. ప్రస్తుతం గల్ఫ్లో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల విమాన రాకపోకలు నిలిచిపోవడంతో గ్రామానికి రాలేకపోతున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రామారెడ్డి: వ్యక్తిగత కారణాలతో ఓ వ్యక్తి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డిపేటకు చెందిన చాకలి శంకర్(42) కొంతకాలంగా వ్యక్తిగత కారణాలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి గంగవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆదివాసీ నాయక్పోడ్ కులస్తులు గ్రామస్థాయిలో ఏకం కావాలి
డిచ్పల్లి: మండలంలోని ధర్మారం(బి) శివారులో ఆదివారం ఆదివాసీ నాయక్పోడ్ రాష్ట్రస్థాయి ముఖ్య నాయకుల అత్యవసర సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా గౌరవ అధ్యక్షుడు బండారి భోజన్న, జిల్లా అధ్యక్షుడు గాండ్ల రాంచందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలు చర్చించి తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయక్పోడ్ రాష్ట్ర ఉద్యోగుల సేవా సంఘం అధ్యక్షుడు కూన దయానంద్, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు మెసిలేని రాజన్న, పళ్ల సత్యనారాయణ మాట్లాడుతూ.. నూతన రాష్ట్రస్థాయి కమిటీని త్వరలో ఎన్నుకోవాలన్నారు. ఖమ్మం వాస్తవ్యులు ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు పసుల బుచ్చయ్య సంఘాన్ని బలోపేతం చేయడం లేదని, ఈ విషయమై రాష్ట్ర గిరిజన కమిషనర్ను కలిసి రాష్ట్ర కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకోవాల్సి ఉందన్నారు. రాష్ట్ర, జిల్లా, గ్రామ స్థాయిల్లో ఆదివాసీ నాయక్పోడ్ కులస్తులను ఏకం చేయడం, ప్రభుత్వం నుంచి వచ్చే ఫలితాలను అందరికీ అందేలా నూతనంగా ఏర్పడే రాష్ట్రస్థాయి కమిటీ కృషి చేయాలన్నారు. నూతన రాష్ట్ర కమిటీ ఏర్పడే వరకు 13 జిల్లాల నుంచి ఒక్కో సభ్యుడిని తీసుకుని తాత్కాలికంగా అడ్హక్ కమిటీని ఎన్నుకున్నారు. సమావేశంలో ఆదివాసీ నాయక్పోడ్ సంఘం రాష్ట్రస్థాయి నాయకులు, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి, జగిత్యాల్, కరీంనగర్, మహబూబాబాద్ తదితర జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి ఇందల్వాయి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి గ్రామానికి చెందిన చెవుల చిన్నయ్య(50) ఆదివారం ఉదయం జాతీయ రహదారి గుండా తన పొలానికి నడుచుకుంటు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొన్నది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ చిన్నయ్యను స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య సాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. భిక్కనూరు: మండలంలోని జంగంపల్లి గ్రామంలో కరెంట్ షాక్తో పెయింటర్ ఆదివారం మృతి చెందాడు. కామారెడ్డి పట్టణానికి చెందిన అజీజ్ జంగంపల్లి గ్రామంలో ఓ ఇంటికి పెయింటిగ్ వేసేందుకు కూలి కుదుర్చుకుని వచ్చాడు. ఇంటి పైన పెయింటింగ్ వేస్తుండగా పైన ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లింగంపేట: చిరుత దాడిలో లేగదూడ మృతి చెందింది. లింగంపేట మండలం నల్లమడుగు సేవాలాల్ తండాకు చెందిన గుగులోత్ సంగ్యానాయక్ రామలక్ష్మణ్పల్లి శివారులో ఉన్న వ్యవసాయ పొలం వద్ద ఆవు, లేగదూడలను పశువుల కొట్టంలో రోజులాగే కట్టేశాడు. శనివారం రాత్రి కొట్టంలోకి ప్రవేశించిన చిరుత దూడపై దాడి చేసి చంపేసింది. మరో ఆవు తాడు తెంపుకొని ఇంటికి రావడంతో అనుమానం వచ్చిన సంగ్యానాయక్ పొలం వద్దకు వెళ్లి చూడగా దూడ మృతి చెంది ఉండటాన్ని గమనించారు. వారు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా బీట్ ఆఫీసర్ లింగయ్య, చంద్రశేఖర్, శేఖర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. లేగదూడ చిరుతదాడిలో మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. మృతి చెందిన దూడ విలువ రూ. 30వేలు ఉంటుందని అధికారులు స్పందించి నష్టపరిహారం అందించాలని బాధితుడు కోరాడు. -
ఘనంగా కామదహనం
● నేడు దోమకొండలో హోలీ పండుగ దోమకొండ: మండల కేంద్రంలో కామ దహన కార్యక్రమం ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. స్థానిక బురుజు వద్ద, మార్కండేయ మందిరం వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి కామదహనం చేశారు. సర్పంచ్ ఐరేని నర్సయ్య, ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, వార్డు సభ్యులు పాలకుర్తి శేఖర్, బీసు సతీష్, నాయకులు బత్తిని సిద్ధరాములు, కూర సంతోష్, ఐరేని రాజేందర్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు మ్యాక నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొమ్మెర గంగాధర్, క్యాషియర్ గణేష్ పాల్గొన్నారు. సోమవారం దోమకొండ మండల కేంద్రంలో హోలీ పండుగ ఉంటుందని పండితులు తెలిపారు. -
అ‘పూర్వ’ సమ్మేళనం
రుద్రూర్/ వేల్పూర్: రుద్రూర్ మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 1978–79 పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. విద్యార్థులందరూ ఒకేచోట చేరడంతో సంతోషం వ్యక్తం చేశారు. నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. గురువులను ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంఈవో కట్ట శ్రీనివాస్, పీఆర్టీయూ రాష్ట్ర నాయకుడు పీ రవికిరణ్, పూర్వ విద్యార్థులు, గురువులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం పడగల్ హైస్కూల్కు చెందిన 2006–07 పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నాటి గురువులను సన్మానించారు. ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. -
నిరంతరం నిఘా..
మోర్తాడ్: మండల కేంద్రంలో శివాజీ విగ్రహ ప్రతిష్ఠాపన వివాదం ఇంకా తొలగిపోలేదు. ఫిబ్రవరి 19న శివాజీ జయంతి సందర్భంగా మోర్తాడ్లోని యువజన సంఘాల సభ్యులు మోర్తాడ్లోని సెంట్రల్ లైటింగ్ డివైడర్పై శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. కానీ పోలీసులు వేరే చోట ప్రతిష్ఠించా లని యువజ సంఘాలకు చెప్పగా వారు అంగీకరించలేదు. దీంతో నాటి నుంచి వివాదం కొనసాగుతోంది. శివాజీ విగ్రహం ఎదుట పోలీసులు పెట్రోలింగ్ వాహనాన్ని అడ్డుగా ఉంచుతున్నారు. శాంతియుతంగా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తే ఒకరిద్దరు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదులకు అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారని యువకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బాన్సువాడ : రక్తం ఇచ్చి ప్రతీ హృదయం..మరో ప్రాణానికి కొత్త ఉదయమని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ అన్నారు. ఆదివారం బీర్కూర్ మండల కేంద్రంలోని మున్నురుకాపు సంఘంలో లయన్స్ క్లబ్ బీర్కూర్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. 108 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క చుక్క రక్తం ఎవరో ఒకరి జీవితంలో ఆశగా మారుతుందని, ఒక కుటుంబానికి చిరునవ్వును పంచుతుందన్నారు. సర్పంచ్ ధర్మతేజ, నాయకులు పోగు పాండు, ఎస్సై మహేందర్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు సంతోష్, వెంకటేశ్వర్రావు, రవీందర్ జెట్టి, కిశోర్, కార్తీక్, గాలయ్య తదితరులు ఉన్నారు. ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో గల ప్రజలు వారి ఇంటి పన్నులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ మహేశ్కుమార్ ఆదివారం కోరారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రజలు ఇంటి, కుళాయి పన్నులు, వ్యాపారులు లైసెన్స్ ఫీజులు ఈనెల 31లోగా చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. -
చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
డిచ్పల్లి: మండలంలోని దూస్గాం చెరువులో స్నానం చేయడానికి దిగి గల్లంతైన నందాల జగన్నాథం (48) మృతదేహం ఆదివారం 12 గంటలకు లభ్యమైంది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని గాయత్రినగర్కు చెందిన నందాల జగన్నాథం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం దూస్గాం గ్రామానికి చెందిన వ్యక్తి జగన్నాథం ఆటోను కిరాయికి మాట్లాడుకుని నవీపేట్ సంతలో మేకలు కొనుగోలు చేశాడు. ఆటోలో మేకలను తీసుకుని దూస్గాం గ్రామంలో దింపేసి ఆ వ్యక్తితో కలిసి జగన్నాథం తిరిగి నిజామాబాద్కు బయలుదేరాడు. గ్రామశివారులోని చెరువు కట్టపై ఉన్న హనుమాన్ ఆలయం వద్దకు రాగానే ఆటోను నిలిపివేశాడు. స్నానం చేసి హనుమంతుడిని దర్శించుకుందామని చెప్పి చెరువులో స్నానానికి దిగాడు. చెరువులో మొరం కోసం తవ్విన పెద్ద పెద్ద గుంతల్లో పడి అతను మృతి చెందాడు. ఆటో వద్ద వేచి ఉన్న వ్యక్తి ద్వారా విషయం తెలుసుకున్న గ్రామస్తులు, పోలీసులు జాలర్ల సాయంతో శనివారం రాత్రి వరకు చెరువు నీటిలో గాలించినా మృతదేహం లభించలేదు. ఆదివారం ఉదయం గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు జరపగా మధ్యాహ్నం మృతదేహం లభించింది. మృతుడి భార్య శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఎన్సీసీ ‘బీ’ సర్టిఫికెట్ పరీక్ష
ఖలీల్వాడి: నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ఆదివారం ఎన్సీసీ బీ సర్టిఫికెట్ పరీక్ష నిర్వహించారు. జిల్లా కేంద్రంలో మొత్తం 428 మందికి 418 మంది క్యాడెట్స్ పరీక్ష రాయగా 10 మంది గైర్హాజరైనట్లు ఎన్సీసీ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ రమేశ్ సరియాల్, ఏవో లెఫ్టినెంట్ కల్నల్ రోహిత్ పూరి తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ గ్రూప్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రాజేశ్ కపూర్ మాట్లాడుతూ.. ఎన్సీసీ బీ సర్టిఫికెట్ పరీక్ష అర్హత సాధించిన క్యాడెట్లకు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ వర్తిస్తుందని అన్నారు. క్రమశిక్షణ, ఐక్యత, దేశభక్తి, జాతీయత, వంటి భావాలతో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి ఎన్సీసీ దోహదపడుతుందని అన్నారు. కార్యక్రమంలో సుబేదార్ అనూజ్ రానా, సుబేదార్ షెల్కే మహదేవ్, సుబేదార్ బల్వీందర్ సింగ్, హవల్దర్ సత్యేందర్ జిత్సింగ్, గుర్జిత్ సింగ్, ఎన్సీసీ ఆఫీసర్స్ కెప్టెన్ రాజేశ్వర్, లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి, డాక్టర్ సుధాకర్, డాక్టర్ నవీన్ కుమార్, సీటీవోలు, కార్యాలయ సిబ్బంది శ్రీకాంత్, కృష్ణ, కిశోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మట్టి స్నానం ఆరోగ్యకరం.. ఉల్లాసభరితం
బోధన్: ఆయుర్వేద వైద్యంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన మట్టి స్నానం చేయడం ఆరోగ్యకరమని, మనస్సు ఉల్లాసభరితంగా ఉంటుందని జిల్లా కేంద్రానికి చెందిన యోగాచార్యులు ఎక్కొండా ప్రభాకర్, జిలకర కిషన్ అన్నారు. ఇరువురు యోగాచార్యుల ఆధ్వర్యంలో ఆదివారం ఎడపల్లి మండలంలోని ఠాణాకలాన్ గ్రామ శివారులో ఉన్న అలీసాగర్ రిజర్వాయర్ బోటింగ్ పాయింట్ వద్ద మట్టి స్నానం కార్యక్రమం నిర్వహించారు. మట్టిస్నానం ఆచరించడం వల్ల చర్మ వ్యాధితో పాటు ఇతర రోగాల నివారణకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి 200 మందికి పైగా యోగసాధనకులు తరలి వచ్చి మట్టి స్నానం చేశారు. రుద్రూర్: మండల కేంద్రంలోని మహర్షి పతాంజలి యజ్ఞ సహిత యోగా – ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో మట్టిస్నాన కార్యక్రమం నిర్వహించారు. హోలీ పండుగకు ముందు ప్రతి ఏడాది నిర్వహించే ఈ ప్రత్యేక కార్యక్రమంలో కోటగిరి, బోధన్, పొతంగల్, రెంజల్ మండలాలతో పాటు వివిధ యోగా కేంద్రాల నుంచి మొత్తం 52 మంది యోగాసాధకులు పాల్గొని మట్టి స్నానం చేశారు. రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షుడు డాక్టర్ విశ్వనాథ్ మహజన్, యోగా సమితి సభ్యులు కాసుల శ్రీనివాస్, బెజగం వెంకటేశం, విజయ్, తోట్ల గంగారాం, సాయిబాబా, యోగా శివ, రామరాజు, ప్రసాద్, శ్రీనివాస్, పురుషోత్తం, సాయిలు, అంబం రాములు, తొర్తి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆలయంలో చోరీ
బోధన్టౌన్: పట్టణంలోని 14వ వార్డులో ఉన్న శ్రీరామ లక్ష్మణ ఆలయంలో దుండగులు శనివారం రాత్రి చోరీకి పాల్పడ్డారు.ఆదివారం ఉదయం గమ నించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. దుండగులు ఆలయానికి వే సిన తాళం పగులగొట్టి బీరువాను ధ్వంసం చేశారు. హుండీని పగుల గొట్టి అందులో ఉన్న నగదు, వెండిని దొంగిలించినట్లు గుర్తించారు. కాలనీవాసుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటనారాయణ తెలిపారు. కామారెడ్డి క్రైం: తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరిగిన ఘటన జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో ఆదివా రం ఉదయం వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నా యి. కాలనీకి చెందిన బుజ్జి స్వామి కుటుంబం శుభకార్యానికి హాజరయ్యేందుకు ఇంటికి తాళం వేసి శనివారం సాయంత్రం మాచారెడ్డికి వెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. బీరువాలో దాచి ఉంచిన రెండు తులాల బంగారం, కొంత నగదు చోరీకి గురైనట్లు బాధితుడు స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్మూర్టౌన్: మామిడిపల్లి శివారు బైపాస్ రోడ్డు వద్ద లక్ష్మి అనే మహిళ మెడలో నుంచి ఓ దుండగుడు రెండు తులాల బంగారు గొలుసును తెంపుకొని పారిపోయాడు. వివరాలిలా ఉన్నాయి. జక్రాన్పల్లి మండలం తొర్లికొండ గ్రామానికి చెందిన లక్ష్మి కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ గ్రామానికి వెళ్లి స్వగ్రామానికి వచ్చేందుకు ఆర్మూర్కు చేరుకుంది. ఆపై ఆటోలో తొర్లికొండకు వెళ్తుండగా దుండగుడు బైక్పై వచ్చి ఆటోలో కూర్చున్న లక్ష్మిమెడలో నుంచి బంగారు గొలుసును తెంపుకొని పారిపోతుండగా గమనించిన స్థానికులు వెంబడించారు. కోటార్మూర్ బైపాస్ అప్రోచ్ రోడ్డువద్ద బైక్ అదుపు తప్పి కిందపడిపోయాడు. స్థానికులు దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. బోధన్రూరల్: మండలంలోని పెగడపల్లి శివారులో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను దుండగులు ధ్వంసం చేసి అందులో ఉన్న కాపర్, ఆయిల్ను దొంగిలించినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. విద్యుత్ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
● ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి బాన్సువాడ: పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆదివారం బాన్సువాడలోని తన నివాసంలో బాన్సువాడ పట్టణం, బాన్సువాడ గ్రామీణం, బీర్కూర్, నస్రూల్లాబాద్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చే స్తుందని,ఆడపిల్లలకు పెళ్లి చేయలేక ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న పేదలకుకల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందించి ప్రభుత్వం భరోసా ఇస్తుందని అన్నారు. బాన్సువాడ గ్రామీణంలో 54, బాన్సువాడ పట్టణంలో 30, నస్రుల్లాబాద్లో 74, బీర్కూర్లో 20 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ రేష్మబేగం, కౌన్సిలర్లు రుక్మిణీ, రాజశేఖర్, హకీం, కాంగ్రెస్ నాయకులు కృష్ణారెడ్డి, ఎజాస్, మోహన్నాయక్, గోపాల్ రెడ్డి, నార్ల రవీందర్, నర్సగొండ, సలీం తదితరులున్నారు. -
పీఎంశ్రీ పాఠశాలలు బేష్
● సెంట్రల్ నోడల్ అబ్జర్వర్ దేవేంద్ర కుమార్ రాయ్ నిజామాబాద్అర్బన్: జిల్లాలో పీఎంశ్రీ పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయుల పనితీరు బాగుందని సెంట్రల్ నోడల్ అబ్జర్వర్ దేవేంద్ర కుమార్ రాయ్ అన్నారు. జిల్లాలో పీఎం శ్రీ నిధులు మంజూరైన పాఠశాలలను సెంట్రల్ నోడల్ అబ్జర్వర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పీఎం శ్రీ నిధులతో కంజర, నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయం పాఠశాలలలో చేపడుతున్న పనులు, జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించారు. ఈ నేపథ్యంలో శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి పీఎం శ్రీ నిధులు మంజూరు చేసిన 40 పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. పీఎంశ్రీ పాఠశాలల్లో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి డీఈవో అశోక్ పవర్ పాయింట్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా దేవేంద్ర కుమార్ మాట్లాడుతూ.. పీఎంశ్రీ కార్యక్రమాల అమలుపై పాఠశాలల్లో ఉపాధ్యాయులు శ్రద్ధ కనబరుస్తున్నారని అభినందించారు. విద్యార్థులు కార్యక్రమాలపై ఆకర్షితులై ప్రగతిని కనబరుస్తున్నారని, ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తన పరిశీలనలో గమనించినట్లు పేర్కొన్నారు. పాఠశాలల్లో పరిశుభ్రత, కిచెన్ గార్డెన్ల నిర్వహణ ఎంతో బాగుందని అన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. సెంట్రల్ అబ్జర్వర్ పాఠశాలల్లో కార్యక్రమాల అమలు తీరును పరిశీలించి అభినందించడం సంతోషంగా ఉందని, ఈ స్ఫూర్తిని కొనసాగించడానికి జిల్లా విద్యాశాఖకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తామని అన్నారు. గతేడాది పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలల హెచ్ఎంలను అభినందించారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ విజయలక్ష్మి బాయి, రాష్ట్ర అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ శ్రీనాథ్, ఏడీ నాగజ్యోతి, హెచ్ఎంలు, సమగ్ర శిక్ష కో–ఆర్డినేటర్లు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
లండన్లో జిల్లా వాసి మృతి నిజామాబాద్అర్బన్: నగరంలోని వినాయక్నగర్కు చెందిన యువకుడు లండన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రానికి చెందిన కామినేని సాయి శ్రీకర్ ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో ఇద్దరు కలిసి లండన్లో రూంలో ఉంటున్నారు. సాయిశ్రీకర్ లండన్లో ఎమ్మెస్ చదువుతున్నాడు. స్నేహితులతోనే ఉంటూ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి వారు ఉన్న రూములో ఏసీలో సాంకేతిక సమస్యలతో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు చెందిన అభిషేక్ మృతి చెందగా సాయి శ్రీకర్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. శ్రీకర్ తండ్రి ప్రసాద్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి, తల్లి రేణుక ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. బీటెక్ పూర్తి చేసి ఎమ్మెస్ కోసం లండన్ వెళ్లిన కొడుకు మరణించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని ఇండియాకు తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు ఎంపీ అర్వింద్ను కలిసి కోరారు. సిలిండర్ పేలి గాయపడ్డ వృద్ధురాలు.. వర్ని: మండలంలోని నెహ్రూనగర్ గ్రామంలో సిలిండర్ పేలిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వల్లూరి భూలక్ష్మి(63) అనే వృద్ధురాలు శనివారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందింది. వర్ని ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భూలక్ష్మి శుక్రవారం ఉదయం గ్యాస్ లీక్ అయిన ఘటనలో తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందింది. ప్రమాదంలో నివాసపు ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. నిజామాబాద్ రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని శ్రీనగర్ శివారులో శుక్రవారం రాత్రి డీసీఎం, బైక్ ఢీకొన్న ఘటనలో బైక్పై ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బైక్పై ఉన్న బిహార్కు చెందిన పరశురాం(35) శనివారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతిడి అన్న బల్రాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
పరీక్ష బాగా రాయలేదని విద్యార్థి..
లింగంపేట: పరీక్ష బాగా రాయలేదనే మనస్తాపంతో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన లింగంపేట మండలం శెట్పల్లిసంగారెడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై దీపక్కుమార్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి సంగెపు శివకుమార్(17) మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఈ నెల 26న ప్రారంభమైన తెలుగు పరీక్షను బాగా రాయలేదనే మనస్తాపంతో శుక్రవారం వ్యవసాయ పొలం వద్ద గడ్డి మందు తాగి తన అక్కకు ఫోన్లో సమాచారం అందించాడు. వెంటనే కుటుంబీకులు అక్కడికి చేరుకొని శివకుమార్ను చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతుడి తండ్రి పోచయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వ్యక్తిగత కారణాలతో వివాహిత..రామారెడ్డి: వ్యక్తిగత కారణాలతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన రామారెడ్డి మండలం సింగరాయపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజశేఖర్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తెడ్డు అనిత(22)కు తల్లితండ్రు లు ఎవరూ లేరు. వివాహమై హైదరాబాద్లో ఉంటున్న ఆమె వారం రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది.తాను ఉంటున్న ఇంట్లో వ్యక్తిగత కారణా లతో శుక్రవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పా ల్పడింది. మృతురాలి మేనత్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఆస్తి కోసం అన్నను చంపిన తమ్ముడు బిచ్కుంద: ఆస్తి కోసం అన్నను తమ్ముడు హత్య చేసిన ఘటన బిచ్కుందలో చోటు చేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండ ల కేంద్రానికి చెందిన మెరుగు సాయిలు(50), నారాయణ అన్నాతమ్ముళ్లు. సాయిలు మండల శివారులో ఉన్న శివాలయంలో పూజారిగా పనిచేస్తు న్నాడు. కొన్ని రోజుల నుంచి వీరి మధ్య ఆస్తి గొడ వలు జరుగుతున్నాయి. శనివారం వేకువజామున ఆలయానికి వెళ్లిన సాయిలును నారాయణ రాయి తో తలపై కొట్టి హత్య చేశాడు. ఉదయం ఆలయం వద్ద మృతదేహం ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విచారణ చేపట్టిన పోలీసులు సాయిలును హత్య చేసింది నారాయణ అని గుర్తించారు. విచారణలో నారాయణ తన అన్నను ఆస్తి కోసం హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నారాయణను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
చెరువులో ఆటో డ్రైవర్ గల్లంతు
డిచ్పల్లి: హనుమంతునికి పూజ చేద్దామని వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి గల్లంతైన ఘటన దూస్గాంలో చోటు చేసుకుంది. స్థానికులు, డిచ్పల్లి ఎస్సై మహమ్మద్ ఆరిఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని గాయత్రి నగర్కు చెందిన నందాల జగన్నాథం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం దూస్గాం గ్రామానికి చెందిన వ్యక్తి జగన్నాథం ఆటోను కిరాయికి మాట్లాడుకుని అందులో మేకలను తరలించారు. ఉదయం 10.30 గంటలకు మేకలను గ్రామంలో దింపేసి ఆటో తీసుకుని తిరిగి నిజామాబాద్కు వస్తున్నాడు. దూస్గాం గ్రామ చెరువు కట్టపై హనుమాన్ ఆలయం వద్దకు రాగానే ఆటోను నిలిపివేశాడు. స్నానం చేసి హనుమంతుడిని దర్శించుకుందామని చెప్పి మొదట కొన్ని పూలు తెంపి ఆటోలో ఉంచాడు. అనంతరం స్నానానికి చెరువులోకి దిగాడు. చెరువులో మొరం కోసం తవ్విన గుంతల్లో పడి తిరిగి పైకి రాలేదు. ఆటో వద్ద వేచి ఉన్న వ్యక్తి ఈ విషయాన్ని స్థానికులకు తెలుపడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానిక జాలర్లతో రాత్రి వరకు చెరువులో గాలింపు చేపట్టినా మృతదేహం ఆచూకీ లభించలేదు. కుటుంబసభ్యులు చెరువు వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. జగన్నాథంకు భార్య శైలజ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
కొనసాగుతున్న జూడాల నిరసన
సుభాష్నగర్: ప్రభుత్వ మెడికల్ కళాశాలకు శాశ్వత కళాశాల మైదానం కేటాయించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు, మెడికల్ విద్యార్థుల నిరసన నాలుగో రోజు శనివారం కొనసాగింది. జీజీహెచ్ ఓపీ గేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్ వంటి క్రీడలు ఆడి నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్ కోసం విద్యార్థులు శాంతియుతంగా, క్రమశిక్షణతో నిరసన కొనసాగిస్తున్నారని జూడా అధ్యక్షుడు డాక్టర్ కార్తిక్ తెలిపారు. 13 ఏళ్లుగా కళాశాల కొనసాగుతున్నా.. శాశ్వత గ్రౌండ్ కేటాయించకపోవడం బాధాకరమన్నారు. మెడికల్ విద్యార్థుల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జూడా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయంత్, ప్రతినిధులు డాక్టర్ భవాని, డాక్టర్ జితిన్, డాక్టర్ చంద్రకాంత్, డాక్టర్ శివాణి, మెడికల్ విద్యార్థులు, జూడాలు పాల్గొన్నారు. -
ఆశాజనకంగా నువ్వుల ధర
మోర్తాడ్:యాసంగి సీజన్లో నువ్వుల సాగు రైతు లకు లాభదాయకంగా మారుతోంది. ఎగుమతుల డిమాండ్ కారణంగా క్వింటాలుకు ఆశాజనకంగా ధ ర లభిస్తోంది. తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితో ఎకరాకు నాలుగు నుంచి ఆరు క్వింటాళ్ల దిగుబడితో మంచి ఆదాయం వస్తుండటంతో జిల్లాలో సాగు వి స్తీర్ణం పెరుగుతోంది. ప్రస్తుతం పంట కోత దశ చే రుకోడానికి కొంత సమయం ఉన్నా మార్కెట్లో ధ ర ఎక్కువగా ఉండటంతో రైతుల్లో సంతోషం వ్యక్త మవుతోంది. కోతలు మొదలయ్యే దశలోనూ ఇదే ధర ఉంటే ప్రయోజనమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో దాదాపు 8 వేల ఎకరాల్లో నువ్వుల పంటు సాగు అవుతోంది. గతంలో 5 వేల ఎకరాల వరకే సాగైన ఈ పంట మంచి ఆదాయం వస్తుండడంతో ఈసారి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. క్వింటాలుకు ప్రభుత్వ మద్దతు ధర రూ.8,200 ఉండగా మార్కెట్లో రూ.10వేలు పలుకుతోంది. ఆరేళ్ల క్రితం క్వింటాలు నువ్వులు రూ.16వేల వరకు అమ్ముడు కావడంతో రైతులు ఈ పంట సాగుపై దృష్టి సారించారు. సజ్జలకు సముచితమైన ధర లేక పోవడంతో ఎక్కువ మంది రైతులు నువ్వులను ప్రత్యామ్నాయ పంటగా ఎంచుకున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తేనే నువ్వుల సాగు వల్ల ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందని రైతులు చెబుతున్నారు. గతంలో ఎన్నోమార్లు నువ్వులు కోత దశకు వచ్చిన సమయాల్లో వడగండ్ల వర్షాలు కురిసి నేలకూలిన సందర్భాలు ఉన్నాయి. కరోనా విపత్కర పరిస్థితుల నుంచి నువ్వులకు డిమాండ్ ఏర్పడింది. ఆరోగ్య ప్రదాయనిగా నువ్వులు గుర్తింపు పొందడంతో వీటి వినియోగం పెరిగింది. జిల్లాలో ఎనిమిది వేల ఎకరాలకు పైగా సాగు క్వింటాలు నువ్వులకు రూ. పదివేల వరకు ధర మద్దతు ధర కన్నా ఎక్కువగా ఉండటంతో సాగుకు ఉత్సాహం చూపిన రైతులు -
వైద్యులపై దాడులు సరి కాదు
● ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు విశాల్ ఆకుల సుభాష్నగర్: వైద్యులపై దాడులను నాన్ బెయిలబుల్ నేరాలుగా ప్రకటించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ విశాల్ ఆకుల డిమాండ్ చేశారు. రాష్ట్ర వైద్యుల సంఘం పిలుపు మేరకు వైద్యులపై పెరుగుతున్న హింసాత్మక ఘటనలను తీవ్రంగా ఖండిస్తూ ఐఎంఏ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని ధర్నాచౌక్లో శాంతియుతంగా నిరసన చేపట్టారు. వైద్యులు తమ సేవల సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి హింసకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ విశాల్ ఆకుల, డాక్టర్ హరీశ్ స్వామి మాట్లాడుతూ.. వైద్యులు, వైద్యసిబ్బందిపై భౌతిక దాడులు చేయడం సరికాదన్నారు. తెలంగాణ మెడికల్ సర్వీస్ పర్సన్, మెడికల్ సర్వీస్ ఇన్స్టిట్యూట్స్లో హింస నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైద్యులను రక్షించడమంటే ఆరోగ్య వ్యవస్థను రక్షించడమేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యులు రమణేశ్వర్, కొట్టూరు శ్రీశైలం, అరవింద్రెడ్డి, శైలజ, విక్రమ్రెడ్డి, రాజేందర్ సూరినీడు, అయ్యప్ప చంద్రశేఖర్, సీనియర్ వైద్యులు డాక్టర్ శ్రీహరి, వినోద్కుమార్ గుప్త, కౌలయ్య, నవీన్ మాలు, దీపు మాలు, పార్వతి దేవి, నాగమోహన్, వినయ్కుమార్, వైద్యులు పాల్గొన్నారు. -
సూపర్ బ్రెయిన్ యోగాతో జ్ఞాపకశక్తి మెరుగు
డిచ్పల్లి: సూపర్ బ్రెయిన్ యోగా(గుంజీళ్లు) ఆచరించడం వల్ల విద్యార్థులలో జ్ఞాపకశక్తి పెరుగుతుందని గుంజీళ్ల మాస్టారు అందె జీవన్రావు తెలిపారు. ఈ నెల 27 నుంచి మార్చి 1 వరకు తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలోని వివేకానంద కేంద్రంలో జరుగుతున్న ‘యోగా శాస్త్ర సంగమం–2026’, 9వ అంతర్జాతీయ యోగా ఫిలాసఫీ సదస్సులో జిల్లా నుంచి అందె జీవన్రావు పాల్గొన్నారు. ‘సూపర్ బ్రెయిన్ యోగా–పతంజలి యోగా సూత్రాల మధ్య సారూప్యం’ అనే అంశంపై తన పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. సూపర్ బ్రెయిన్ యోగా, పతంజలి యోగా సూత్రాల మధ్య సారూప్యతలు ఉన్నాయని, వాటిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పతంజలి యోగా సూత్రాలోని ఆసన, ప్రాణాయామ, ధారణ, ధ్యాన వంటి అంశాలు సూపర్ బ్రెయిన్ యోగా తో పోలి ఉన్నాయని తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగాను 14 రౌండ్లు ఆచరించడం ద్వారా ధ్యాన శక్తిని పొందుతామని అందె జీవన్ రావు వివరించారు. -
పింఛన్ డబ్బుల కోసం తల్లి హత్య
● తాగుడికి బానిసైన కుమారుడి ఘాతుకం ● కోటగిరిలో దారుణ ఘటన రుద్రూర్: మద్యానికి బానిసైన కుమారుడు తన తల్లిని హతమార్చిన ఘటన కోటగిరి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటగిరి మండల కేంద్రానికి చెందిన పద్మశాలి మానాజీ మద్యానికి అలవాటుపడి తరచూ తన తల్లి భూమవ్వ(70)తో గొడవ పడేవాడు. ఆమె పింఛన్ డబ్బులు ఇవ్వాలని, ఇల్లు అమ్మాలని ఒత్తిడి తెచ్చేవాడు. అయితే భూమవ్వ ఇందుకు నిరాకరించడంతో వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి మానాజీ కల్లు సీసాతో తల్లి తలపై కొట్టి, అనంతరం రోకలి కర్రతో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో భూమవ్వ అక్కడికక్కడే మృతి చెందింది. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో దీపంలో ఉన్న నూనెను భూమవ్వ ఒంటిపై పోసి నిప్పంటించాడు. దీంతో మెడ భాగం, రెండు కాళ్లు మోకాళ్ల వరకు కాలిన గాయాలు ఏర్పడ్డాయి. శనివారం ఘటన స్థలాన్ని రుద్రూర్ సీఐ కృష్ణకుమార్, ఎస్సై సునీల్ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరంచినట్లు ఎస్సై పేర్కొన్నారు. కుమార్తె మాధవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నట్లు ఎస్సై తెలిపారు. మృతురాలు నిరుపేద కావడంతో జీపీ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. -
ఆదర్శ పాఠశాలను తనిఖీ చేసిన కేంద్ర బృందం
సిరికొండ: మండల కేంద్రంలోని పీఎంశ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాలను కేంద్ర బృందం సభ్యులు శనివారం తనిఖీ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎంశ్రీ పథకం అమలు తీరును పరిశీలించారు. డీఈవో అశోక్తో కలిసి కేంద్ర టెలికమ్యూనికేషన్ జాయింట్ సెక్రెటరీ దేవేంద్ర కుమార్రాయ్, ఎస్ఐఈటీ డైరెక్టర్ విజయలక్ష్మి, స్టేట్ అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ శ్రీనాథ్, ఎఫ్ఏవో నాగజ్యోతి తదితరులు తనిఖీలో పాల్గొన్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు, డిజిటల్ తరగతి గదులు, స్మార్ట్ బోర్డులు, సైన్స్ ప్రయోగశాలను వారు పరిశీలించారు. పీఎంశ్రీ పథకం ద్వారా అందుతున్న నిధుల వినియోగం, డిజిటల్ లెర్నింగ్ అమలు తదితర పథకాలపై సమీక్షించారు. వివిధ అంశాలపై విద్యార్థులతో మాట్లాడి ఆరా తీశారు. మధ్యాహ్న భోజనం, విద్యా సదుపాయాలు, డిజిటల్ లెర్నింగ్ అవకాశాలపై విద్యార్థులతో చర్చించారు. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను పరిశీలించారు. ప్రిన్సిపాల్ గడ్డం రాజేశ్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కళాశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య
బాన్సువాడ రూరల్: కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తున్న షేక్ అహ్మద్ (52) శనివారం కళాశాల భవనం రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కోటగిరి మండలం దోమలెడిగి గ్రామానికి చెందిన షేక్ అహ్మద్ నాలుగేళ్లుగా కళాశాలలో పనిచేస్తున్నాడు. ప్రతి రోజూ కల్లు తాగే అలవాటు ఉన్న ఆయన గత పది రోజులుగా మానేసి రంజాన్ ఉపవాసదీక్షలో ఉంటున్నారు. ఈ క్రమంలో అహ్మద్ రెండు రోజులుగా మతిస్థిమితం కోల్పోయాడు. శనివారం తాను విధులకు రావడం లేదని పోలీస్స్టేషన్కు వెళ్తున్నట్లు చెప్పిన అహ్మద్ ఎప్పటిలాగే విధులకు హాజరయ్యాడని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గులాం ముస్తఫా తెలిపారు. పొంతన లేకుండా మాట్లాడుతుండటంతో ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పి తాము విధి నిర్వహణలో ఉండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుందన్నారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నస్రుల్లాబాద్ ఎస్సై రాఘవేందర్ తెలిపారు. -
ఆధునిక సాంకేతికతతో జీవరసాయన శాస్త్రంలో మార్పులు
తెయూ(డిచ్పల్లి): ఆధునిక సాంకేతికతతో జీవరసాయన శాస్త్రంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ(ఆర్ఎస్సీ) (లండన్) డెక్కన్ ఛాప్టర్ హాననరీ సెక్రెటరీ ప్రొఫెసర్ వీ పీసపాటి పేర్కొన్నారు. శనివారం తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగం, రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ లండన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ విజ్ఞాన దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘అడ్వాన్సెస్ ఇన్ కెమికల్ అండ్ బయోకెమికల్ క్యారెక్టరైజషన్’ అనే అంశంపై వక్తలు ప్రసంగించారు. ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ విద్యార్థులకు కాంపౌండ్ను ఎలా గుర్తించాలి, వేరు చేయాలనే అంశాలపై పీసపాటి అవగాహన కల్పించారు. సీఎస్ఐఆర్–సీఐఎంఏపీ హైదరాబాద్ సీనియర్ ప్రిన్సిపాల్, సైంటిస్టు డాక్టర్ ఉప్మాల కోటేశ్ కుమార్, నిపర్, హైదరాబాద్ ప్రొఫెసర్ ఎన్ శంకరయ్య ఆధునిక స్పెక్ట్రోస్కోపీ, క్రోమాటోగ్రఫీ, బయోకెమికల్ విశ్లేషణ పద్ధతులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జీ రాంబాబు, కన్వీనర్ వాసం చంద్రశేఖర్, ఎం ప్రసన్న శీల, అధ్యాపకులు బోయపాటి శిరీష, కిరణ్మయి, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
పీజీ పరీక్షల్లో ఇద్దరి డిబార్
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న పీజీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ రెగ్యులర్ మొదటి, 7వ సెమిస్టర్ పరీక్షల్లో శనివారం మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన ఇద్దరు విద్యార్థులు డిబార్కు గురైనట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. వర్సిటీ పరిధిలో నిజామాబాద్లోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బోధన్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆర్మూర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బాన్సువాడలోని ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల, యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల, భిక్కనూర్ సౌత్క్యాంపస్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలకు 1,905 మందికి 1,813 మంది హాజరు కాగా 92 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఆర్మూర్లోని డిగ్రీ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు డిబార్ అయినట్లు చంద్రశేఖర్ తెలిపారు. వర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ప్రిన్సిపాల్ జీ రాంబాబు సందర్శించి తనిఖీ చేశారు. రోడ్డు ప్రమాద కారకులపై చర్యలు తీసుకోవాలి రుద్రూర్: మండలంలోని అక్బర్నగర్ శివారు లో వేసిన మొరం కుప్పల వల్ల రోడ్డు ప్రమా దాలు జరుగుతున్నాయని శుక్రవారం రాత్రి స్థా నికులు ఆందోళన చేశారు. రోడ్డు పనుల నిమి త్తం మూల మలుపు వద్ద మొరం కుప్పలు వే యడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటు న్నాయని నిరసన తెలిపారు. ప్రమాదంలో అ క్బర్నగర్కు చెందిన వ్యక్తికి తీవ్రగాయలయ్యాయని, కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఎ స్సై సాయన్న వెళ్లి వివరాలు సేకరించారు. చ ర్యలు తీసుకుంటామనే హామీతో స్థానికులు ఆందోళన విరమించారు.ఈ మేరకు శనివారం ఇద్దరి(టిప్పర్ డ్రైవర్, సైట్ ఇంజినీర్)పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. తెయూ(డిచ్పల్లి): న్యాయ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు దేశానికి వెన్నెముకలా ఉండాలని, లా అండ్ ఆర్డర్కు సంబంధించిన పుస్తకాలను చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సుప్రీంకోర్టు, హైకోర్టు అడ్వకేట్ జయప్రకాశ్ సూచించారు. తెయూ న్యాయ కళాశాల ఆధ్యర్యంలో ‘ప్రొఫెషనల్ లీగల్ టెక్నిక్స్ ఫ్రం ట్రయల్ కోర్ట్స్ టు కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్’ అనే అంశంపై శనివారం నిర్వహించిన వర్క్షాప్లో జయప్రకాశ్ ముఖ్యవక్తగా హాజరై ప్రసంగించారు. మారుతున్న కాలంలో విజ్ఞానాన్ని పెంపొందించుకుంటేనే న్యాయానికి విలువ ఉంటుందని ఆయన వివరించారు. వర్క్షాప్ కన్వీనర్గా జెట్లింగ్ ఎల్లోసా, కో–కన్వీనర్లుగా ప్రసన్న రాణి, బీ స్రవంతి వ్యవహరించారు. లా విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
విధులు ఎగ్గొట్టేవారిపై నిఘా సారించాలి
నిజామాబాద్ రూరల్: కొంతమంది సిబ్బంది విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, విచారణ చేపట్టి చర్యలు తీసుకోవా లని అధికారులకు ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్రెడ్డి సూచించారు. ప్రత్యేకించి బయో మెట్రిక్ హాజరు వేసుకుని వెళ్లిపోతున్న సి బ్బందిపై నిఘా సారించాలన్నారు. జిల్లా కేంద్రంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్), క్రిటికల్ కేర్ యూనిట్ల భవన సముదాయాన్ని పరిశీ లించారు. సుదీర్ఘకాలం నుంచి పలు పనులు పెండింగ్ లోనే ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జీజీహెచ్లో కొనసాగుతున్న ప్రసూ తి సేవల విభాగాన్ని వెంటనే ఎంసీహెచ్లోకి మా ర్చాలని ఆదేశించారు. అనంతరం జీజీహెచ్లో ఆ స్పత్రి పనితీరుపై సంబంధిత వైద్యులతో సమీక్షించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయిచైతన్య పాల్గొన్నారు. ఒక్కో విభాగం వారీగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న డాక్టర్లు, సిబ్బంది ఖాళీలు, కొత్తగా అందుబాటులోకి వచ్చిన సౌకర్యాలు, సమకూర్చాల్సి సదుపాయాలు తదితర వివరాలను ఆయా విభాగాల అధిపతుల ద్వారా సుదర్శన్రెడ్డి తెలుసుకున్నారు. వైద్య సేవలను మరింతగా మెరుగుపర్చాలని, అవసరమైన అన్ని వసతులు సమకూరుస్తామని సూచించారు. వైద్య సేవల కోసం ప్రతిరోజూ 2వేల మంది వరకు అవుట్ పేషంట్లు జీజీహెచ్కు వస్తున్నారని, అన్ని విభాగాల పనితీరు మెరుగుపడాలని అన్నారు. వైద్యులతోపాటు సిబ్బంది, అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలు జీజీహెచ్ సేవలను వినియోగించుకోవాలని సూ చించారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా జీజీహె చ్లో కీలు మార్పిడి శస్త్రచికిత్స చేస్తున్నారన్నారు. వి ద్య, వైద్య రంగాల పని తీరును మరింత మెరుగుపర్చాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు. సమీక్షలో డీఎంహెచ్వో రాజశ్రీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, డాక్టర్ రాము లు, వివిధ విభాగాల వైద్యాధికారులు పాల్గొన్నారు. వైద్య సేవలు మరింత మెరుగుపడాలి జీజీహెచ్లో వైద్యులు, సిబ్బందితోపాటు అధునాతన పరికరాలు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి ఎంసీహెచ్, క్రిటికల్ కేర్ యూనిట్ భవన సముదాయం పరిశీలన జీజీహెచ్లో సమీక్ష -
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
● బోర్గాం(పి)లో ధర్నా, నిరసన ● ఇందల్వాయి సొసైటీ ముట్టడి ● యాప్లో బుకింగ్తో ఇబ్బందులవుతున్నాయని ఆవేదన మోపాల్/డిచ్పల్లి(ఇందల్వాయి): యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. యాప్లో బుకింగ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, స రిపడా యూరియా అందుబాటులో ఉంచాలని డి మాండ్ చేశారు. నిజామాబాద్ నగరశివారులోని బో ర్గాం(పి)లో మంచిప్ప ప్రధాన రోడ్డుపై, ఇందల్వాయి సొసైటీ ఎదుట శనివారం బైఠాయించారు. సకాలంలో యూరియా దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. పంటకాలం దాటిపోతోందని, యూరియా అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. యాప్లో, ఆన్లైన్లో కాకుండా పాత పద్ధతిలోనే అడిగిన ప్రతి రైతు కు యూరియా అందించాలని డిమాండ్ చేశారు. బోర్గాం(పీ)లో సుమారు గంటకుపైగా రైతులు రో డ్డుపై కూర్చోవడంతో వాహనాలు నిలిచిపోయా యి. నాల్గో టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని రై తులను సముదాయించారు. ఒక దశలో పోలీసు లు, రైతులకు తోపులాట చోటుచేసుకుంది. అనంతరం సొసైటీ కార్యాలయం ఎదుట ధర్నా కొనసాగింది. డీఏవో వీరాస్వామి వచ్చి తక్షణమే లోడ్ యూరియా అందిస్తామని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఏవో, ఏఈవోను ఆదేశించడంతో రైతులు శాంతించారు. ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య, రైతు నాయకులు ఈగ సాయిరెడ్డి, రాజేశ్వర్ రైతులు బి హ న్మాండ్లు, సూర్యారెడ్డి, తిరుపతి సంజీవ్, చామకూర గణేశ్, సంజీవ్, తలారి సాగర్, వేల్పూర్ గంగారాం, కిషన్, గుత్ప దశరథ్, మల్కారెడ్డి, భుజేందర్ పాల్గొన్నారు. ఇందల్వాయిలో ఎస్సై సందీప్, మండల వ్యవసాయాధికారి శ్రీకాంత్ సొసైటీ వద్దకు చేరుకుని రైతులను సముదాయించి ధర్నా విరమింపజేశారు. -
మంజీరలో మళ్లీ లొల్లి
బోధన్: తెలంగాణ – మహారాష్ట్ర మధ్య ప్రవహించే మంజీర నది సరిహద్దు వివాదం ఏళ్లు గడుస్తున్నా కొలిక్కి రావడం లేదు. మహారాష్ట్ర అనుమతులతో ఇటీవల మంజీరలో ఇసుక తవ్వకాలు చేపట్టడంతో సరిహద్దు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం వేలంపాటల ద్వారా ఇసుక క్వారీలను విస్తృతంగా అప్పగిస్తోంది. అక్కడి అనుమతులు పొందుతున్న కాంట్రాక్టర్లు మన సరిహద్దులోకి చొచ్చు వచ్చి ఇసుకను తరలించడం మామూలు విషయంగా మారింది. తాజాగా సాలూర మండల కేంద్రానికి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న తగ్గెల్లి గ్రామ శివారులోని మంజీర నుంచి ఇసుక తరలింపు వివాదాస్పదమైంది. అవతలి ఒడ్డున ఉన్న మహారాష్ట్ర ప్రాంతంలోని బిలొలి తాలూకా పరిధి గంజ్గాం గ్రామ శివారులో ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాంట్రాక్టర్లు అనుమతి పొందారు. వాస్తవంగా అనుమతి పొందిన ప్రదేశంలో ఇసుక మేటలు అంతంమాత్రంగానే ఉన్నాయి. అయితే నెల రోజుల క్రితం నుంచి ఇసుక తవ్వకాలు చేపట్టిన కాంట్రాక్టర్లు మన రాష్ట్ర సరిహద్దుల్లోకి చొచ్చుకువచ్చి 10 ఎకరాల విస్తీర్ణం నుంచి రోజుకు వందల సంఖ్యలో లారీలు, టిప్పర్లలో టన్నుల కొద్దీ రూ.కోట్లు విలువ చేసే ఇసుక ఆ ప్రాంతం వైపు తరలించారనే ఆరోపణలున్నాయి. తాము సమాచారం ఇస్తేగానీ మండల రెవెన్యూ అధికారులు స్పందించలేదని గ్రామస్తుల ఆరోపించారు. ఆ తరువాతే సబ్ కలెక్టర్ వికాస్ మహతోకు అధికారులు సమాచారం అందించగా, ఆయన బిలోలి తాలూకా తహసీల్దార్తో మాట్లాడినట్లు తెలిసింది. గత నెల 23న ఇన్చార్జి తహసీల్దార్ అనూష, ఎంఆర్ఐ ఆనంద్, సర్వేయర్లు కలిసి తగ్గేల్లి శివారులోని మంజీరలో రాష్ట్ర సరిహద్దులను గుర్తించేందుకు సర్వే నిర్వహించారు. పలు చోట్ల ఎత్తైన కర్రకు ఎర్రగుడ్డలను కట్టి హద్దులుగా ఏర్పాటు చేశారు. ఎర్రజెండాలే ప్రస్తుతం హద్దు రాళ్లుగా దర్శనమిస్తున్నాయి. సర్వే చేపట్టిన సమయంలో సర్వేయర్లతో కాకుండా బిలోలి తాలూకా తహసీల్దార్ ఒక్కరే అక్కడికి వచ్చారు. జాయింట్ సర్వే నిర్వహించి హద్దులు నిర్దారించుకుందామని సాలూర మండల రెవెన్యూ అధికారులు ప్రతిపాదించగా.. తమ ప్రాంత సర్వేయర్లు మార్చి 1వ తేదీ వరకు సమ్మెలో ఉన్నారని, వారు వచ్చిన వెంటనే చేపడదామని ఆయన సమాధానమిచ్చారు. అప్పటి వరకు ఇసుక తవ్వకాలు ఆపేయాలని మండల రెవెన్యూ అధికారులు ఆయనకు సూచించారు. వాహనాల రాకపోకల కోసం మంజీరలో ఏర్పాటు చేసి తాత్కాలిక దారి పర్యవేక్షణ, నిఘా కరువుహద్దులు గుర్తించాం తగ్గెల్లి గ్రామ శివారులోని మంజీర నదిలో తెలంగాణ ప్రాంత హద్దును సర్వే చేసి గుర్తించాం. మన హద్దుల్లోకి వచ్చి ఇసుక తవ్వకాలు చేపట్టినట్టు సర్వేలో తేలింది. సర్వే సమయంలో అక్కడికి వచ్చిన బిలోలి(మహారాష్ట్ర) తహసీల్దార్కు జాయింట్ సర్వే చేసి హద్దులు నిర్దారించుకుందామని ప్రతిపాదించాం. వాళ్ల సర్వేయర్లు సమ్మెలో ఉన్నారని చెప్పారు. ఇక నుంచి మన హద్దుల్లో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని సూచించగా ఆయన అంగీకరించారు. ప్రస్తుతం ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. – అనూష, ఇన్చార్జి తహసీల్దార్మన హద్దులో ఇసుక తవ్వకాలపై పర్యవేక్షణ కొరవడటమే ఇందుకు కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము ఫిర్యాదు చేసే వరకు రెవెన్యూ శాఖ అధికారులు మేల్కోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. సరిహద్దు గ్రామాల ప్రజలు, అధికారులు ఇసుక అక్రమరవాణాను అడ్డుకోగా ఇసుక మాఫియా ఎదురుదాడులకు దిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. హద్దులను నిర్దారించేందుకు అనేక సార్లు సర్వేలు చేపట్టినా ఇప్పటికీ కొలిక్కిరాలేదు. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం మంజీరలో భారీగా ఇసుక క్వారీలకు అనుమతులు ఇచ్చేందుకు కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. మహారాష్ట్ర అనుమతులతో ఇసుక దోపిడీ తగ్గెల్లి శివార్లలోని రాష్ట్ర సరిహద్దులో భారీగా తవ్వకాలు ఆలస్యంగా స్పందించిన రెవెన్యూశాఖ తేలని సరిహద్దు వివాదం -
గోదాములను సిద్ధం చేయండి
నిజామాబాద్ రూరల్: ధాన్యం నిలువ చేసేందుకు గోదాములను గుర్తించాలని ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్రెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం ఆయాశాఖల అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. శాఖల వారిగా అభివృద్ధి పనుల ప్రగతిని తెలుసుకున్నారు. రైస్మిల్లర్లకు కేటాయించిన ధాన్యం ఎంత, లేవీ రూపంలో వారు ఎఫ్సీఐకి ఎంత పరిమాణంలో బియ్యం నిల్వలు అందించారు, ఇంకా ఎంత లేవీ రావాల్సి ఉంది, ఎన్ని గోదాములు అందుబాటులో ఉన్నాయి తదితర వివరాలపై సివిల్ సప్లయీస్ అధికారుల ద్వారా ఆరా తీశారు. ప్రస్తుత సీజన్ ధాన్యం సేకరణకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. లేవీ అందించడంలో విఫలమైన 57మంది డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి రూ.276 కోట్లు రికవరీ చేసేందుకు నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల ని ఆదేశించారు. గ్రామాల్లో రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి సరఫరా మెరుగుపరిచే పనులు వేగంగా చేపట్టాలన్నారు. భవిత కేంద్రాల నిర్మాణ పనులను యు ద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నిరోధించాలని, క్షేత్రస్థాయిలో గట్టి నిఘా ఉంచాలన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజిరెడ్డి, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, అధికారులు పాల్గొన్నారు. -
ఐదు నిమిషాల్లో ఎకరం..
డొంకేశ్వర్(ఆర్మూర్): వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ దూసుకుపోతోంది. తమ శ్రమను తగ్గించిన పనిని వేగంగాపూర్తి చేసే ఆధునిక పద్ధతులను రైతులు అందిపుచ్చుకుంటున్నారు. నాట్ల నుంచి మొదలుకొని మందులు చల్లడం, పంట కోత వరకు పూర్తిగా యంత్రాలే పని చేస్తున్నాయి. అందులో కేవలం ఐదు నిమిషాల్లోనే ఎకరాన్ని చుట్టి వచ్చే డ్రోన్ల వినియోగం గ్రామీణా ప్రాంతాల్లో చాలా పెరిగింది. జిల్లాలో వివిధ కంపెనీలు, డ్రోన్ల నిర్వాహకులు రైతులకు పరిచయం చేసి అతి తక్కువ ధరకే డ్రోన్ సేవలను అందిస్తున్నారు. డొంకేశ్వర్ మండలంలోని దాదాపు అన్ని గ్రామాల రైతులు డ్రోన్ల వినియోగంపై ఆసక్తి చూపుతున్నారు. వరి, మొక్కజొన్న పంటలకు మందులను డ్రోన్లతోనే స్ప్రే చేయిస్తున్నారు. డ్రోన్ ద్వారా కచ్చితమైన పనితీరు కనిపిస్తోందని రైతులు అంటున్నారు. డ్రోన్తో అన్నీ లాభాలే.. కూలీలతో చేతి పంపు ద్వారా ఎకరం పంటకు మందు పిచికారీ చేయిస్తే గంటకు పైగా సమయం పట్టడంతోపాటు వారికి రూ.500 నుంచి రూ.600 వరకు చెల్లించాల్సి వస్తోంది. మందుల వినియోగం సైతం ఎక్కువగా ఉంటుంది. స్ప్రే చేసిన వారి ఆరోగ్యంపై మందు ప్రభావం పడుతుంది. డ్రోన్ ద్వారా అయితే ఎకరానికి రూ.350 నుంచి 400 ఖర్చుతోనే 5 నుంచి 10నిమిషాల వ్యవధిలోనే స్ప్రే పూర్తి అవుతుంది. మందు వినియోగం కూడా తక్కువగా ఉంటుంది. రైతులు, కూలీలకు విష ప్రభావం ఉండదు. వరికి మందు స్ప్రే చేస్తున్న డ్రోన్ సులభంగా, వేగంగా పంటలకు మందుల స్ప్రే వ్యవసాయంలో పెరిగిన డ్రోన్ల వినియోగం యాంత్రీకరణను సద్వినియోగం చేసుకుంటున్న గ్రామీణ రైతులుశ్రమ తగ్గింది డ్రోన్లు అందుబాటులోకి రావడంతో రైతులకు శ్రమ తగ్గింది. చాలా సులభంగా మందులు స్ప్రే చేయిస్తున్నాం. నేను వినియోగించి మంచి ఫలితాలు పొందాను. దీంతో మండలంలో ఉన్న అన్ని గ్రామాల రైతులకు కూడా డ్రోన్ వాడితే కలిగే లాభాలను వివరిస్తున్నా. – జైడి రాధాకృష్ణారెడ్డి, యువరైతు, నికాల్పూర్ రైతుల్లో అవగాహన పెరిగింది వ్యవసాయ రంగంలో యంత్రాల పాత్ర కీలకంగా మా రింది. ప్రధానంగా కష్టం, ఖ ర్చు లేకుండా సమయాన్ని ఆదా చేసే డ్రోన్ల వి నియోగం గ్రామాల్లో చాలా పెరిగింది. రైతుల్లో అవగాహన కూడా కల్పిస్తున్నాం. తక్కువ ధరకే కిరాయి ఇస్తున్నాం. – సతీశ్యాదవ్, డ్రోన్ నిర్వాహకుడు -
బోధన్ ఆర్టీసీ డిపోలో కలకలం
● డ్యూటీ కేటాయింపులో వివాదం ● డ్రైవర్ ఆత్మహత్యాయత్నం బోధన్: డ్యూటీ కేటాయింపు విషయంలో కంట్రోలర్, డ్రైవర్కు మధ్య వాదన చోటు చేసుకున్న ఘటన బోధన్ ఆర్టీసీ డిపోలో శనివారం చోటు చేసుకుంది. తాను ఆత్మహత్య చేసుకుంటానని డ్రైవర్ తాడు వెంట తీసుకుని డిపో గేటుపైకి ఎక్కాడు. ఈ ఘటన కలకలం రేపింది. ఉదయం డ్యూటీకి వచ్చిన సురేశ్ తనకు వేసిన డ్యూటీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కంట్రోలర్తో వాదనకు దిగాడు. తాను ఆత్మహత్య చేసుకుంటానని డిపో గేటుపైకి ఎక్కగా, అక్కడే ఉన్న తోటి ఉద్యోగులు అతడిని సముదాయించి కిందికి దింపారు. ఈ ఘటనపై డిపో మేనేజర్ విశ్వనాథంను ‘సాక్షి’ వివరణ కోరగా.. డ్రైవర్ సురేశ్కు బోధన్–జేబీఎస్ సర్వీసుకు డ్యూటీ కేటాయించగా, తనకు వరంగల్ రూట్లో డ్యూటీ ఇవ్వాలని కంట్రోలర్తో వాదించాడని, ఈ క్రమంలో ఘటన చోటు చేసుకుందన్నారు. మానసిక ఒత్తిడిలో ఉన్న సురేశ్కు డ్యూటీ ఇవ్వలేదని, ఆదివారం యథావిధిగా డ్యూటీ కేటాయిస్తామన్నారు. డిపో అధికారులు కండక్టర్లు, డ్రైవర్లకు విధుల కేటాయింపులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తమ యూనియన్లు మనుగడలో లేకపోవడంతో అధికారుల తీరును ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోతోందని ఆర్టీసీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మార్కెట్యార్డుకు వరుస సెలవులు
సుభాష్నగర్: నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్యార్డుకు 1వ తేదీన ఆదివారం సెలవు కాగా, హోలీ సందర్భంగా ఈనెల 2 నుంచి 4వ తేదీవరకు బంద్ ఉంచనున్నట్లు సెలక్షన్ గ్రేడ్ సెక్రెటరీ అపర్ణ శనివారం తెలిపారు. 2న కామదహనం, 3న చంద్రగ్రహణం, 4న గ్రహణ కరి, హోలీ పండుగ నేపథ్యంలో మూడు రోజులపాటు గంజ్లో వ్యాపార లావాదేవీలు నిలిపి వేస్తున్నట్లు పేర్కొన్నారు. సెలవు రోజుల్లో యార్డుకు పంట దిగుబడులను తీసుకురావొద్దని రైతులకు సూచించారు. 5వ తేదీ నుంచి మార్కెట్ వ్యాపార కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. -
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
● ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి ● అట్టహాసంగా బాధ్యతల స్వీకరణఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలో నెలకొన్న ప్రతి సమస్యను గుర్తించి పరిష్కరిస్తామని ము న్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి పేర్కొన్నారు. ము న్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ లహరి, వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకట్ రెడ్డితోపాటు కౌన్సిలర్లు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చైర్మన్ పదవి ప్రజల కు సేవ చేసే అద్భుతమైన అవకాశమన్నారు. ప రిశుభ్రత, నీటి సరఫరా, రోడ్డు , డ్రెయినేజీ కనీస సౌకర్యాల విషయంలో రాజీపడకుండా పనిచేస్తామన్నారు. పారదర్శక పాలన అందిస్తామని స్ప ష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వర్రావు, కౌన్సిలర్, సిబ్బంది పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఆయన మీడియాతో మా ట్లాడారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి పను లు జరుగుతున్నాయన్నారు. ఉర్దూ అకాడమీ చై ర్మన్ తాహెర్బిన్ హందాన్, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏబీ చిన్న, నియోజకవర్గ ఇన్చార్జి వినయ్రెడ్డి, తెలంగాణ కో–ఆపరేటివ్ యూని యన్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పసుపు పరిశ్రమ సందర్శన
జక్రాన్పల్లి: జక్రాన్పల్లి మండలంలోని మనోహరాబాద్లో జేఎంకేపీఎం పసుపు ఉత్పత్తిదారుల సంఘాన్ని గురువారం కేరళ స్పైసెస్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ ప్రత్యూష సందర్శించారు. ఆమె మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా పసుపు పరిశ్రమను ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామమని అన్నారు. మున్ముందు స్పైసెస్ బోర్డు ద్వారా పసుపు పరిశ్రమలకు వివిధ రకాలుగా సబ్సిడీలు అందజేస్తామని తెలిపారు. రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పసుపు పరిశ్రమ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట స్పైసెస్ బోర్డు అధికారులు రాజమాణిక్యం, రాణి, మాధవ్, ఎఫ్పీవో రొడ్డ రిత్విక్ తదితరులు పాల్గొన్నారు. -
యూరియా యాప్లో మార్పులు
ఏ మండల రైతులు అదే మండలంలో కొనేలా సదుపాయండొంకేశ్వర్(ఆర్మూర్): యూరియా బుకింగ్ యాప్లో వ్యవసాయ శాఖ మార్పులు చేసింది. మొన్నటి వరకు జిల్లా యూనిట్గా ఉన్న విధానాన్ని తొలగించి మండలం యూనిట్గా చేసింది. దీంతో ఏ మండలానికి చెందిన రైతులు అదే మండలంలోని సొసైటీలు, ప్రయివేటు డీలర్ల వద్ద కొనుగోలు చేసే సదుపాయం ఏర్పడింది. ఈ మార్పును ఈ నెల 25 నుంచి అమల్లోకి తె చ్చారు. జిల్లా యూనిట్ విధానంతో ఇది వరకు రైతులు వేరే మండలాలను ఎంపిక చేసుకొని యూరియాను కొనుగోలు చేశారు. దీంతో ని ల్వలు లేక స్థానిక రైతులు యూరియా బుకింగ్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. పక్క మండలా లు, గ్రామాల రైతులు వచ్చి తమ యూరి యాను కొనుగోలు చేసి తీసుకెళ్లడంపై జిల్లాలో పలు చోట్ల రైతులు ఆందోళన చేశారు. తలెత్తిన ఈ సమస్యకు పరిష్కారం చూపాలని జిల్లా వ్య వసాయాధికారి వీరాస్వామి రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మండలం యూనిట్గా యాప్లో మార్పులు చేస్తే బాగుటుందనే ఆలోచనతో యాప్లో మార్పులు చేశారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో ఒక మండల రైతులు మరో మండలంలో కొనుగోలు చేయడం లేదు. స్థానిక రైతుల డిమాండ్ను బట్టి వ్యవసాయాధికారులు, సొసైటీలు, డీలర్లు యూరియా బస్తాలను తెప్పించి ఇస్తున్నారు. 18 రోజుల్లో 2.10 లక్షల బస్తాలు సేల్ యూరియా బుకింగ్ యాప్ వచ్చి 18 రోజులు అవుతోంది. జిల్లాలో ఏకంగా 2.10 లక్షల బస్తా ల (9,500 మెట్రిక్ టన్నులు) యూరియాను 70 వేల మంది రైతులు కొనుగోలు చేశారు. అ తి తక్కువ సమయంలోనే ఇంత పెద్ద మొత్తంలో యూరియా సేల్ కావడంతో వ్యవసాయాధి కారులు ముక్కున వేలేసుకుంటున్నారు. అలాగే ఈ యాసంగి సీజన్లో ఇప్పటికే 77 వేల మెట్రి క్ టన్నుల యూరియా అమ్ముడైంది. -
కాపీయింగ్కు తావివ్వొద్దు
● కలెక్టర్ ఇలా త్రిపాఠి ● ఇంటర్ పరీక్ష కేంద్రం తనిఖీ బోధన్టౌన్(బోధన్): ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు తావివ్వకుండా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏ ర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఆమె గురువారం త నిఖీ చేశారు. విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును పరిశీలించారు. ద్వితీయ సంవత్సరం మొదటి రో జు హాజరైన విద్యార్థుల సంఖ్య తెలుసుకున్నారు. కేంద్రంలో మౌలిక సదుపాయాలు, కనీస సౌకర్యా లు పరిశీలించారు. పరీక్ష పూర్తయిన వెంటనే జవా బు పత్రాలను పోలీసు బందోబస్తు మధ్య నిర్దేశిత కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాలకు ఇతరులను అనుమతించొద్దని తెలిపారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఉన్నారు. -
గందరగోళం
ఈ–నామ్సుభాష్నగర్ : నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు కొనుగోళ్లు బహిరంగ వేలం (ఓపెన్ ఆక్షన్) ద్వారా గురువారం చేపట్టారు. రెండ్రోజులుగా శ్రద్దానంద్ గంజ్లో పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు నిలిచిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంలోకి దూసుకెళ్లే క్రమంలో తలుపులకు ఉన్న అద్దాలు పగిలిపోయాయి. ఈ–నామ్ 1.0 ను ఈ–నామ్ 2.0 గా మార్చడంతో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. సమస్య పరిష్కారానికి మార్గం కనిపించకపోగా, మరో వైపు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రైతులు, వ్యాపారులతో జాయింట్ మీటింగ్ పెట్టి అందరి సమ్మతితో యార్డులో కొనుగోళ్లను మళ్లీ పాత పద్ధతిలోనే చేపడుతున్నారు. ఈ సీజన్లో మార్కెట్లో ఇప్పటివరకు 1.77 లక్షల క్వింటాళ్ల పసుపును కొనుగోలు చేశారు. ● ‘ఈ–నామ్’ అమల్లో దేశానికే ఆదర్శం.. కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని మార్కెట్లను అనుసంధానం చేస్తూ 2014 ఏప్రిల్లో ఈ–నామ్ 1.0 ను ప్రారంభించారు. ఈ–నామ్ అమల్లో దేశంలోనే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ ఆదర్శంగా నిలిచి ప్రధాని చేతుల మీదుగా అప్పటి సెలక్షన్ గ్రేడ్ సెక్రెటరీ సంగయ్య అవార్డును అందుకున్నారు. అటువంటి మార్కెట్లోనే ఈ–నామ్ 2.0 గా మార్పుతో సాంకేతిక సమస్యలు ఎదురై కొనుగోళ్లు నిలిచిపోయాయి. 2026 ఫిబ్రవరి 25న ఈ–నామ్ 2.0గా మార్పు చేయడం, దీనిపై ఉద్యోగులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లకు శిక్షణ, అవగాహన లేకపోవడం.. అదేసమయంలో పసుపు సీజన్ కావడంతో పరిస్థితి సంకటంగా మారింది. ● ఓపెన్ ఆక్షన్తో రైతులకే నష్టం..! శ్రద్ధానంద్ గంజ్లో పసుపు కొనుగోళ్లు ఓపెన్ ఆక్షన్ ద్వారా చేపట్టడం వల్ల రైతులకు తీవ్రంగా నష్టం జరిగే అవకాశముంది. ఈ పద్ధతిలో కొనుగోళ్లు జరిపితే మూడు నుంచి నాలుగు రోజుల సమయం అవుతుంది. రైతులు మార్కెట్లో ఉండాలన్నా.. రోజూ మార్కెట్కు రావాలన్నా ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేగాకుండా పెద్ద మొత్తంలో పసుపు పంట వస్తుంది. అందువల్ల ఓపెన్ ఆక్షన్లో తక్కువ మంది వ్యాపారులు పాల్గొంటారు. ఈక్రమంలో పసుపు ధరలు పడిపోయే ఆస్కారం ఉంటుంది. ● మార్చి 3లోగా పరిష్కారం సాధ్యమేనా..? నిజామాబాద్ మార్కెట్యార్డులో సుమారు 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఓపెన్ ఆక్షన్కు తెరలేపారు. బుధ, గురువారాల్లో మార్కెట్కు సుమారు 30 వేల బస్తాల పసుపు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ–నామ్ 2.0 మార్పు చేయడంతో ఒక్కో లాట్ ఐడీ ఇవ్వడానికి 10 నుంచి 15 నిమిషాలు అవుతుంది. అలాంటిది నిజామాబాద్ మార్కెట్లో పసుపు సీజన్లో 2 వేల వరకు లాట్ ఐడీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈవిషయాన్ని మార్కెట్ అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, మంత్రులు, ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ–నామ్ 1.0 అమలు చేయాలని, లేకుంటే మార్కెట్లో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయే ఆస్కారముందని తేల్చిచెప్పారు. నిజామాబాద్ మార్కెట్కు ఫిబ్రవరి 28, మార్చి 1, 2, 3 తేదీల్లో సెలవులు ఉన్నాయి. మార్చి 3లోపు ఈ సమస్యకు పరిష్కారం చూపాలి. లేకుంటే ఈ ప్రభావం నాలుగైదు జిల్లాల రైతులపై పడనుంది. కాగా ఓపెన్ ఆక్షన్లో జరుగుతున్న పసుపు కొనుగోళ్లను మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, అధికారులు పరిశీలించారు. మార్కెట్లో ఓపెన్ ఆక్షన్ ద్వారా కొనుగోళ్లు సజావుగా జరిగాయని, శుక్రవారం కూడా అదే పద్ధతిలో కొనుగోలు చేస్తామని సెలక్షన్ గ్రేడ్ సెక్రెటరీ అపర్ణ తెలిపారు. ఈ–నామ్ 2.0లో సాంకేతిక సమస్యల కారణంగా కొనుగోళ్లు చేపట్టలేదని, రైతులు ఈవిషయాన్ని గమనించి మార్కెట్ కమిటీకి సహకరించాలని ఆమె కోరారు.ప్రజాప్రతినిధుల జోక్యంతోనే పరిష్కారం.. కేంద్ర ప్రభుత్వం ఈ–నామ్ 2.0 మార్పు వల్ల జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర మంత్రులతోపాటు కేంద్రంలోని ప్రభుత్వ పెద్దలు జోక్యం తప్పనిసరైంది. ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న అర్వింద్ ధర్మపురి పసుపు బోర్డు ఎలాగైతే సాధించారో.. అంతే పట్టుదలతో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి నేరుగా సమస్యను విన్నవిస్తే తప్ప సమస్య పరిష్కారమయ్యే అవకాశం లేదని మార్కెటింగ్శాఖ వర్గాల ద్వారా తెలిసింది. ఈ–నామ్ 1.0 అమలే ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారం. రైతుల ఆందోళనపై జేడీ ఆరా.. మార్కెట్యార్డులో నెలకొన్న రైతుల ఆందోళన, నిలిచిపోయిన కొనుగోళ్లు, ఇతరత్రా అంశాలపై మార్కెటింగ్శాఖ జాయింట్ డైరెక్టర్ మల్లేశం, సెలక్షన్ గ్రేట్ సెక్రెటరీ అపర్ణ, గ్రేడ్–1 సెక్రెటరీ విజయ్కిషోర్, ఇతర అధికారులతో సమీక్షించారు. ఈ–నామ్ 2.0లో తలెత్తుతున్న సమస్యలు, సాంకేతిక కారణాలు, పరిష్కార మార్గాలు, ఇతర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రితో పాటు ప్రిన్సిపల్ సెక్రెటరీ, కమిషనర్, మార్కెటింగ్శాఖ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. -
అదనపు కలెక్టర్ అంకిత్ బదిలీ
నిజామాబాద్ అర్బన్: జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ బదిలీ అయ్యారు. ఈ మేరకు గురు వారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 45 మంది ఐఏఎ స్లు బదిలీ అయ్యారు. జిల్లా అదనపు కలెక్ట ర్ (స్థానిక సంస్థలు) అంకిత్ను భద్రాది కొత్తగూడెం కలెక్టర్గా బదిలీ చేశారు. 2019 బ్యా చ్కు చెందిన అంకిత్ కొన్నేళ్లుగా జిల్లా అదనపు కలెక్టర్గా పని చేస్తున్నారు. ‘ద్వితీయం’లో 335 మంది గైర్హాజరు ఖలీల్వాడి: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మొత్తం 16,563 మంది విద్యార్థులకు గాను 16,228 మంది విద్యార్థులు హాజరయ్యారు. 335 మంది గైర్హాజరైనట్లు డీఐఈవో రవికుమార్ తెలిపారు. జనరల్లో 14,465 మంది విద్యార్థులకు 14,184 మంది, ఒకేషనల్లో 2,098 మంది విద్యార్థులకు 2,044 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 58 పరీక్ష కేంద్రాలకు 54 కేంద్రాలను ఇంటర్ విద్యా కన్వీనర్తో పాటు జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు, హైపవర్ కమిటీ, సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీ చేశాయి. ఇంటికే సీతారాముల కల్యాణ తలంబ్రాలు ● టీజీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జ్యోత్స్న సుభాష్నగర్: శ్రీరామనవమి పండుగ రోజు జరిగే శ్రీసీతారాముల కల్యాణానికి వెళ్లలేని భక్తులకు కేవలం రూ.151కే కల్యాణ తలంబ్రాలు ఇంటి వద్దకే అందించేలా టీజీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేసిందని రీజినల్ మేనేజర్ జ్యోత్స్న తెలిపారు. నగరంలోని ఆర్ఎం కార్యాలయంలో కల్యాణ తలంబ్రాలకు సంబంధించిన పోస్టర్లను డిపో మేనేజర్లతో కలిసి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజామాబాద్, కామారెడ్డి జిల్లా ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కల్యాణ తలంబ్రాలను టీజీఎస్ఆర్టీసీలాజిస్టిక్.కో.ఇన్ వెబ్సైట్ ద్వారా, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని అన్ని ఆర్టీసీ కార్గో కౌంటర్ల వద్ద కూడా బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. కల్యాణ తలంబ్రాల కోసం సంప్రదించాల్సిన ఫోన్నెంబర్లు ఆర్మూర్ 73968 89496 బోధన్ 91542 98729 నిజామాబాద్–1 91542 98727 నిజామాబాద్–2 73968 89496 బాన్సువాడ 91542 98729 కామారెడ్డి 91542 98729 ఆర్ఎం ఆఫీస్ 86399 69647 రెండో రోజూ జూడాల నిరసన సుభాష్నగర్ : నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు శాశ్వత క్రీడా మైదానం కేటాయించాలని కోరుతూ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (జూడా) ఆధ్వర్యంలో జూని యర్ డాక్టర్లు, విద్యార్థులు గురువారం రెండోరోజు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కొన సాగించారు. ఈ సందర్భంగా జూడాల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కార్తీక్ మాట్లాడుతూ క్రీడా మైదానం లేకపోవడంతో విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. సమస్యను ప్రభుత్వం, జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు గుర్తించి వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో జూడా ప్రధాన కార్యదర్శి జయంత్, జాయింట్ సెక్రెటరీ భావన, హేమంత్, విద్యార్థులు పాల్గొన్నారు. -
అధికారుల తప్పిదం.. రైతుల ఆందోళన
మోపాల్ : మండలంలోని నర్సింగ్పల్లి గ్రామంలో యూరియా కోసం రైతులు గురువారం ఆందోళన చేపట్టారు. ఫర్టిలైజర్ యాప్లో బుకింగ్ చేసుకున్న వారికి యూరియా లేదనడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింగ్పల్లి మా పల్లె ఎఫ్పీవో డీలర్కు 450 బస్తాల లోడ్తో ఉన్న యూరియా వచ్చింది. యాప్లో ఐడీ జనరేట్ చేయకుండానే సదరు డీలర్ యూరియాను రైతులకు విక్రయించారు. యూరియా పూర్తిగా అమ్మిన తర్వాత యాప్లో ఐడీ జనరేట్ చేయడంతో 450 బస్తాలు ఉన్నట్లు చూపించింది. దీంతో రైతులు బుకింగ్ చేసుకున్నారు. యూరియా కోసం వచ్చి చూడగా అక్కడ లేకపోగా, గోదామునకు తాళం వేసి ఉంది. దీంతో ఆగ్రహించిన రైతులు అక్కడే ధర్నా చేపట్టారు. పదిరోజులుగా యూరియా కోసం ఎదురుచూస్తున్నామని, తాము బుకింగ్ చేసుకున్న యూరియాను ఎవరికి విక్రయించారని మండిపడ్డారు. ఎస్సై సుస్మిత అక్కడికి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేయగా, వారు వినిపించుకోలేదు. దీంతో ఇన్చార్జి ఏవో జాదవ్ హీరాతో ఫోన్లో మాట్లాడగా, యాప్లో బుకింగ్ చేసుకున్న రైతులకు శుక్రవారం ఇస్తామని చెప్పడంతో ఆందోళనను విరమించారు. కాగా, మండలంలో అధిక ధరకు యూరియాను విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇన్చార్జి ఏవో, డీలర్ తప్పిదం వల్లే యూరియా సమస్య ఎదురైందని తెలిసింది. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, ఉన్నతాధికారులు స్పందించి మండలానికి పూర్తిస్థాయి ఏవోను కేటాయించాలని రైతులు కోరుతున్నారు. -
నిజామాబాద్
● ఈ–నామ్ 2.0 మార్పుతో సాంకేతిక సమస్యలు.. ● రెండ్రోజులుగా నిలిచిన పసుపు కొనుగోళ్లు ● రైతుల ఆందోళనతో పాత పద్ధతిలోనే.. ● మార్కెట్యార్డులో పరిస్థితిని పరిశీలించిన జాయింట్ డైరెక్టర్శుక్రవారం శ్రీ 27 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026నిజామాబాద్ మార్కెట్లో బహిరంగ వేలంలో పసుపు కొనుగోళ్లు -
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
నిజామాబాద్ రూరల్: యూరియాను పాత పద్ధతిలోనే అందజేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని గాంధీనగర్ వద్ద నిజామాబాద్–వర్ని రోడ్డుపై రైతులు గురువారం ఆందోళన చేపట్టారు. ముత్తకుంట పీఏసీఎస్ పరిధిలోని గాంధీనగర్ గోదాముకు గురువారం ఉదయం యూరియా వచ్చినట్లు తెలుసుకొని రైతులు చేరుకున్నారు. యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్న వారికే యూరియా ఇస్తామని సిబ్బంది స్పష్టం చేశారు. దీంతో తమకు చిన్న ఫోన్లు ఉన్నాయని, బుకింగ్ విధానం తెలియదని, ప్రస్తుతం పంట పొట్టదశకు చేరుకుందని యూరియా ఇవ్వాలని కోరారు. ఆన్లైన్ విధానం ద్వారానే యూరియా పంపిణీ చేస్తున్నట్లు తేల్చిచెప్పడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించారు. -
అతివల ఆర్థిక ప్రగతికి బాటలు
మోర్తాడ్(బాల్కొండ): మహిళా సంఘాల సభ్యులు చిన్న పరిశ్రమలు, వ్యాపారాలను వృద్ధి చేసుకోవడానికి బ్యాంకు లింకేజీ ద్వారా భారీ మొత్తంలో రుణా లు ఇప్పించేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) కృషి చేస్తోంది. జిల్లాలో 200 యూనిట్లను మహిళా సంఘాల సభ్యులతో ఏర్పాటు చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇప్పటికే 60 యూనిట్లను ఏర్పాటు చేయగా మిగిలిన లక్ష్యం పూర్తి చేసేందుకు మహిళ సంఘాల ప్రతినిధులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీం(పీఎంఎఫ్ఎంఈ), ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయీమెంట్ జనరేషన్ ప్రాజెక్టు(పీఎంఈజీపీ) పథకాల కింద బ్యాంకుల నుంచి ఒక్కో యూనిట్కు రూ.10 లక్షల వరకు రుణాలు ఇప్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. రుణం పొందిన మొత్తంలో కేంద్రం 30 శాతం సబ్సిడీని అందించనుంది. రూ.10 లక్షల రుణానికి రూ.3 లక్షల రాయితీ లభిస్తుండటం మహిళలకు ఎంతో కలిసి వచ్చే అంశమని సెర్ప్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది మహిళలు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలతో చిన్న చిన్న వ్యాపారాలను ఏర్పా టు చేసుకొని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు భారీ మొత్తంలో రుణాలు పంపిణి చేస్తే చిన్న తరహా పరి శ్రమలను ఏర్పాటు చేసుకొని వేగంగా ఆర్థిక ప్రగతి సాధిస్తారని అధికారులు భావిస్తున్నారు. పరిశ్రమలతోపాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో ఉపాధి విస్త రణ జరగడంతోపాటు మహిళలు ఆర్థికంగా పటి ష్టం అవుతారని అధికారులు చెబుతున్నారు. రూ.10 లక్షల వరకు రుణాలు రూ.3 లక్షల సబ్సిడీ జిల్లాలో మహిళా సంఘాల సభ్యులకు 200 యూనిట్లు ఇప్పటికే 60 యూనిట్ల ఏర్పాటు పూర్తి రాయితీ రుణాలతో మహిళలకు ఎంతో లబ్ధి చేకూరనుంది. మహిళలు రాయితీ రుణాల పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. పరిశ్రమలు, వ్యాపారాలను విస్తరించడానికి చొరవ తీసుకోవాలి. మహిళలు ఆర్థికంగా వృద్ధి చెందడమే మా లక్ష్యం. – రాచయ్య, డీపీఎం, సెర్ప్ -
వృద్ధురాలిపై దుండగుల దాడి
● బంగారు గొలుసు అపహరణ రుద్రూర్: కోటగిరిలోని వినాయక నగర్లో వృద్ధురాలిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి బంగారు పుస్తెల తాడు అపహరించారు. ఎస్సై సునీల్ తెలిపిన వివరాలు ఇలా.. వినాయక్ నగర్కు చెందిన ఎముల లింగవ్వ (65) తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. బుధవారం రాత్రి ఆరుబయటకు వచ్చిన సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ముఖాలకు మాస్కులు ధరించి ఇంటి గోడ దూకి లోపలికి ప్రవేశించారు. అనంతరం వృద్ధురాలి ముఖాన్ని గుడ్డతో మూసి, ఆమైపె దాడి చేసి మెడలో ఉన్న మూడు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని పరారయ్యారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన లింగవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. నిందితుడి రిమాండ్ గాంధారి(ఎల్లారెడ్డి): పరారీలో ఉన్న నాటుసారా నిందితుడు లకావత్ రామును గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా.. మండల పరిధిలోని రాంలక్ష్మణ్పల్లి తండాలో నాటు సారా తయారు చేసి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఈ నెల మూడో తేదీన దాడి చేసి లకావత్ రాము ఇంటిలో దాడి చేయగా, నాల్గు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడు రాము అప్పటి నుంచి పరారీలో ఉన్నాడన్నారు. గురువారం అరెస్టు చేసిన రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నాటు సారా తయారు చేసినా, విక్రయించినా కేసులు నమోదు చేసి రిమాండ్ చేస్తామని ఎస్సై హెచ్చరించారు.


