breaking news
Nizamabad District Latest News
-
అధిక ధరలకు ఎరువులు విక్రయించొద్దు
● డీఏవో గోవింద్ రుద్రూర్: అఽధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏవో) ఎం. గోవింద్ హెచ్చరించారు. కోటగిరి, పోతంగల్ మండలాల్లో మంగళవారం ఎరువుల, పెస్టిసైడ్ దుకాణాలను ఆయన ఆకస్మికంగా తని ఖీ చేశారు. ఫర్టిలైజర్ స్టాక్, స్టాక్ రిజిష్టర్లు, బిల్ బుక్కులను పరిశీలించారు. ఎరువులతోపాటు ఇతర మందులను లింక్ చేసి విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. రైతులు యూరియా తక్కువ మోతా దు వాడాలని, అవసరం మేరకు కాంప్లెక్స్ ఫర్టిలైజర్ను వాడుకోవాలని సూచించారు. సమస్యలుంటే స్థానిక వ్యవసాయాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. డీఏవో వెంట కోటగిరి, పోతంగల్ వ్యవసాయాధికారులు టీ రాజు, బీ నిశిత, ఏఈవోలు ఉన్నారు. ఆయకట్టుకు నీటిని వదలాలి ● ఎమ్మెల్యే వేముల డిమాండ్ బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి లక్ష్మి, కాకతీయ కాలువల ద్వారా నీటి విడుదల చేపట్టి బాల్కొండ నియోజకవర్గ ఆ యకట్టు రైతులను ఆదుకోవాలని స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చే శారు. మంగళవారం ప్రాజెక్ట్ ఎస్ఈ శ్రీనివా స్రావు గుప్తాతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడారు. ప్రసుత్తం వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కాకతీయ కాలువ ద్వారా కొంత నీటిని వదిలితే కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ శివారులో గేట్లు దించి నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం స్పందించి నీటి విడుదల చేసి ఆయకట్టు రైతులను ఆదుకోవాలని కోరారు. రుణాలకు పట్టాపాస్ పుస్తకాలు పెట్టుకోవద్దు ● బ్యాంకర్లకు కలెక్టర్ సూచన నిజామాబాద్ అర్బన్: రైతులకు డిజిటల్ రి కార్డుల ఆధారంగా రుణాలు మంజూరు చే యాలని అన్ని బ్యాంకులకు సూచించినట్లు కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రుణాల మంజూ రు కోసం బ్యాంకులు రైతుల పట్టాదార్ పా స్ పుస్తకాలను తమ వద్ద పెట్టుకోవాల్సిన అవసరం లేదని, పాస్బుక్ పేరిట రుణాల ను తిరస్కరించకూడదని పేర్కొన్నారు. భూ భారతి చట్టం–2025లోని సెక్షన్ 10(6), సెక్షన్ 10(7) ల ప్రకారం భూములపై రుణా లను మంజూరు చేసే సందర్భంలో భూ హక్కుల రికార్డులను ఉపయోగించి రుణాలను ప్రాసెస్ చేయాలన్నారు. ఆదేశాలను అత్యవసరంగా పరిగణిస్తూ వెంటనే అమలు చేయాలని బ్యాంకర్లకు ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. -
పాముల బస్తీలో వ్యక్తిగత మరుగుదొడ్లు
ఖలీల్వాడి: నిజామాబాద్ నగరంలోని పాములబస్తీలో సామూహిక మరుగుదొడ్ల కూల్చివేతపై ఈ నెల 21న ‘సాక్షి’లో ‘కూల్చిందెవరు?’ శీర్షికన ప్రచురితమైన కథనానికి నగర పాలక సంస్థ అధికారులు, నుడా చైర్మన్ స్పందించారు. మంగళవారం ఉదయం నుడా చైర్మన్ కేశ వేణు, మున్సిపల్ డీఈ రషీద్, పంచాయతీరాజ్ ఏఈలు మురళీమోహన్, నరేశ్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పాముల బస్తీని సందర్శించారు. స్థానికులతో మాట్లాడి సామూహిక మరుగుదొడ్లను వెంటనే నిర్మించాలని మున్సిపల్ అధికారులకు నుడా చైర్మన్ సూచించారు. శాశ్వత పరిష్కారం దిశగా.. పాముల బస్తీలో సుమారు 300 మంది వరకు నివసిస్తుంటారు. సుమారు 25 వరకు ఇళ్లు ఉండగా, అన్నీ ఉమ్మడి కుటుంబాలే ఉన్నాయి. ఒక్కో ఇంట్లో ముగ్గురు, నలుగురు అన్మదమ్ముల కుటుంబాలు ఉంటాయి. వీరికి స్వచ్ఛ భారత్ పథకం ద్వారా మాజీ మేయర్ ఆకుల సుజాత హయాంలో నాలుగు సామూహిక మరుగుదొడ్లను నిర్మించారు. అప్పటి నుంచి ఈ మరుగుదొడ్లను కాలనీవాసులు ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల ఈ మరుగుదొడ్లను కూల్చివేయడంతో ఇబ్బందులు పడ్డారు. స్థానికంగా నిర్మాణమవుతున్న ఓ కార్పొరేట్ విద్యాసంస్థకు మద్దతుగా మున్సిపల్ అధికారులే సామూహిక మరుగుదొడ్లను కూల్చివేసినట్లు కాలనీ వాసులు ఆరోపించారు. సామూహిక మరుగు దొడ్ల కూల్చివేత తర్వాత మొబైల్ మరుగుదొడ్ల వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితులపై ‘సాక్షి’లో వచ్చిన కథనానికి స్పందించిన నుడా చైర్మన్ కేశవేణు, మున్సిపల్ అధికారులు కాలనీని సందర్శించి మరుగు దొడ్లులేని 13 ఇళ్లకు వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించేందుకు నిర్ణయించారు. అందుకోసం ఎస్జీఎఫ్ ద్వారా రూ. 5 లక్షలు, ఇతర నిధుల నుంచి మరో రూ. 5 లక్షలు కేటాయించి పనులు చేపట్టాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. బుధవారం మరుగుదొడ్లకు ముగ్గుపోసి, రెండ్రోజుల్లో పనులు చేపట్టానున్నామని తెలిపారు. రెండ్రోజుల్లో పనులు ప్రారంభం నిర్మాణానికి రూ.10 లక్షల నిధులు కేటాయింపు కాలనీలో పర్యటించిన నుడా చైర్మన్, మున్సిపల్ అధికారులు సామూహిక మరుగుదొడ్ల కూల్చివేతపై చర్యలెప్పుడో? చర్యలతోనే రక్షణ! స్వచ్ఛ భారత్ పథకంలో భాగంగా నిర్మించిన మరుగుదొడ్లను కూల్చివేసిన అంశంపై ఉన్నత అధికారులు స్పందించలేదు. కూల్చిన వారిపై చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వ ఆస్తులకు రక్షణ ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దీనిపై సంబంధిత మున్సిపల్ ఉన్నతాధి కారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. -
కూల్చివేతలపై కమిషనర్ ఆగ్రహం
నిజామాబాద్ సిటీ: జిల్లా కేంద్రంలోని పాములబస్తీ వాసుల కోసం స్వచ్ఛ భారత్ కింద నిర్మించిన పబ్లిక్ టాయ్లెట్ల కూల్చివేతపై మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం మున్సిపల్ ఈఈ మురళీఽ మోహన్రెడ్డి, డీఈ రషీద్, ఏసీపీ శ్రీనివాస్లతో కలిసి పాములబస్తీని సందర్శించారు. కూల్చివేసిన మరుగుదొడ్లపై స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మరుగుదొడ్ల సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న భవన అనుమతులపై ఆరా తీశారు. వాస్తవ పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఏసీపీ శ్రీనివాస్ను ఆదేశించారు. పాముల బస్తీవాసుల సౌకర్యార్థం మొబైల్ టాయిలెట్ వాహనం అందుబాటులో ఉంచాలని సూచించారు. ● నివేదిక ఇవ్వాలని ఏసీపీకి ఆదేశం -
ప్రభుత్వ పథకాల అమలులో కలెక్టర్లే కీలకం
నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు లో కలెక్టర్లు కీలకంగా వ్యవహరించాలని, సంక్షేమ ఫలాలు పేదలకు చేరేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర స చివాలయం నుంచి సీఎస్ రామకృష్ణారావు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభా గాధిపతులతో కలిసి కలెక్టర్లతో మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందని, క్షేత్రస్థాయిలో వాటి అమలుకు కలెక్టర్లు, అధికారు లు ముఖ్య పాత్ర పోషించాలన్నారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా సంక్షేమ రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్ల నిర్వాహణపై తనిఖీలు నిర్వహిస్తూ, వారంలో ఒకరోజు అక్కడే బస చేయాలని ఆదేశించారు. నెలకోసారి పేరెంట్స్ కమిటీ మీటింగ్లను ఏర్పాటు చేయాలన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా రేప టికి 200 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్ర యాణం చేశారని, ఈ సందర్భంగా 97 బస్సు డిపో లు, 321 బస్స్టేషన్లలో వేడుకలను నిర్వహించాలని సూచించారు. సీఎస్ రామకృష్ణారావు జిల్లా కలెక్టర్ల నిర్వహణ తీరుపై పలు సూచనలు చేశారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు.. ప్రభుత్వ లక్ష్యాల మేరకు అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కలెక్టర్లకు సూచించారు. ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయించాలని ఆదేశించారు. భూభారతిలో నమోదైన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. వనమహోత్సవంలో భాగంగా క్షేత్రస్థాయిలో విరివి గా మొక్కలు నాటాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. వీసీలో కలెక్టర్ టీ వినయ్కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్, డీఆర్డీవో సాయాగౌడ్, అధికారులు పాల్గొన్నారు. వీసీలో మంత్రుల స్పష్టీకరణపురోగతి సాధించాలి నిజామాబాద్ అర్బన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి కనిపించేలా క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో కృషిచేయాలని కలెక్టర్ టీ వి నయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, వన మహోత్సవం, సీజనల్ వ్యా ధులు తదితర అంశాలపై మంగళవారం ఆయన కలెక్టరేట్ నుంచి సంబంధిత శాఖల అధికారుల తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల విషయంలో అలస త్వం వహిస్తున్న ఎంపీడీవోలపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని మున్సిపల్, గ్రామ పంచాయతీలలో లబ్ధిదారుల వివరాలను రెండ్రోజుల్లోగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలకు సుముఖంగా లేని లబ్ధిదారుల నుంచి లిఖిత పూర్వక లేఖలు తీసుకోవాలని, వారి స్థానంలో అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేసేందుకు జాబితా రూపొందించాలని సూచించారు. వన మహోత్సవం నూటికి నూరు శాతం విజయవంతం చేసేలా ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని కలెక్టర్ హితవు పలికారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగానే కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీసీలో అదనపు కలెక్టర్ అంకిత్, డీఆర్డీవో సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీ ప్ కుమార్, అధికారులు పాల్గొన్నారు. -
ముడుపులిస్తేనే చెరువుల లీజు!
డొంకేశ్వర్(ఆర్మూర్): మత్స్యశాఖలో అవినీతి పెరిగిపోయింది. పనికో రేటు అన్నట్లుగా మారింది. మత్స్యకారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అందినకాడికి దండుకుంటున్నారు. మొన్న బైలా రిజిస్ట్రేషన్లలో వసూళ్లకు పాల్పడిన సంగతి రాష్ట్ర శాఖకు, గత కలెక్టర్ దృష్టికి వెళ్లిన విషయం మరచిపోకముందే చెరువుల లీజులో ముడుపులు తీసుకున్నట్లుగా ఆరోపణలు బయటకు వస్తున్నాయి. ఏకంగా శాఖలోని ఉద్యోగులే దీనిపై చర్చించుకోవడం గమనార్హం. జిల్లాలో చెరువులు, కుంటలు కలిపి 1,037 ఉండగా, మత్స్య సహకార సంఘాలు 350 పైగా ఉన్నాయి. చెరువుల్లో చేపలు పట్టుకునేందుకు సొసైటీల్లో సభ్యత్వం కలిగిన మత్స్యకారులకే అధికారం ఉంటుంది. అయితే చెరువులు, కుంటలు ప్రభుత్వానికి సంబంధించినవి కావడంతో చేపలు పట్టుకున్నందుకు గాను ప్రతి ఏడాది తాసీల్ (పన్ను) కట్టాల్సి ఉంటుంది. దీనిని మత్స్య శాఖ అధికారులు చెరువు లీజు అంటారు. ఏడాదికోసారి మత్స్యకార సొసైటీలు మత్స్యశాఖతో లీజు అగ్రిమెంట్ చేసుకునేందుకు డివిజన్ స్థాయిలో ఎఫ్డీవోల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఏడాది కూడా 2024 సెప్టెంబర్ నుంచి 2025 జూన్ వరకు చెరువులకు లీజు అగ్రిమెంట్ చేశారు. చెరువుల విస్తీర్ణం ప్రకారం పెద్ద చెరువైతే రూ.400, మధ్యస్థ చెరువైతే రూ.200, పూర్తిగా ఎండిపోయే చెరువైతే రూ.60 ఫీజును మీ సేవ కేంద్రాల్లోనే కట్టాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ప్రభుత్వానికి లీజు ఫీజు కట్టినా కూడా ఎఫ్డీవోలకు ముడుపులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని మత్స్యకారులు వాపోతున్నారు. ఒక్కో సొసైటీ నుంచి రూ.1,500 నుంచి రూ.2వేలు వసూలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అడిగినంత ఇస్తేనే లీజు అగ్రిమెంట్ బాండ్పై సంతకాలు చేసి ఇస్తున్నారని, ఇది ఆనవాయితీగా మారిందని శాఖలోని కొందరు ఉద్యోగులే బహిరంగంగా చెప్తున్నారు. ఈ అదనపు వసూళ్లపై శాఖ ఉన్నతాధికారులకు ఇటీవల ఫిర్యాదులు వచ్చినా మందలించి వదిలేశారే తప్ప చర్యలు తీసుకోలేదు. దీంతో ఏడీపై విమర్శలు వస్తున్నాయి.ఓ మత్స్యకార సొసైటీ సభ్యులు చెరువు లీజు అగ్రిమెంట్ చేసుకునేందుకు డివిజన్ ఎఫ్డీవో వద్దకు వెళ్లారు. మీ సేవ కేంద్రంలో చెల్లించిన ఫీజు చూపించారు. లీజు అగ్రిమెంట్ బాండ్ ఇచ్చినందుకు ఆనవాయితీగా సదరు ఎఫ్డీవోకు కొన్ని డబ్బులు ఇవ్వగా, ఇంత తక్కువ నేనేం చేసుకోవాలంటూ వారిపైనే విసిరేసినట్లు తెలిసింది. రూ.2 వేలకు తక్కువ తీసుకోనంటూ చెప్పడంతో అడిగినంత ఇచ్చి వచ్చారంటా! ప్రస్తుతం ఇదే విషయంపై శాఖలోని కొందరు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఇలా ప్రతి ఎఫ్డీవో స్థాయిలో చెరువుల లీజుకు అదనపు వసూళ్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. మత్స్యశాఖలో నిలువు దోపిడీ ఎఫ్డీవోలపై ఆరోపణలు మీ సేవలో ఫీజు చెల్లించినా, అధికారుల చేతులు తడపాల్సిందే ఫిర్యాదులు వచ్చినా చర్యలు శూన్యం మత్స్యకార సొసైటీల ఆవేదన -
ప్రైవేటు దోపిడీ
డెంగీ బూచీ..నిజామాబాద్ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న జ్వర పీడితులునిజామాబాద్నాగారం: నిజామాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, చికున్గున్యా పీడితులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. కాగా, డెంగీ ఫీవర్ను నిర్ధారించే ఎలీసా టెస్ట్ కేవలం వైద్యారోగ్యశాఖ పరిధిలోని టీ–హబ్లోనే ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చే డెంగీ అనుమానిత లక్షణాలు గల రోగి రక్త నమూనాలను టీ–హబ్కే పంపించాలనే నిబంధన ఉంది. వీరే సదరు రోగికి ఉన్నది డెంగీ ఫీవర్ అవునో? కాదో? నిర్ధారిస్తారు. కానీ, వీటన్నింటిని బేఖాతరు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల వారే స్వయంగా ర్యాపిడ్ టెస్టులు చేస్తూ చికిత్స చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ నగరంలోని సుమారు 250, బోధన్ డివిజన్లో 30, ఆర్మూర్ డివిజన్లోని 40 వరకు ప్రైవేటు ఆస్పత్రుల్లో డెంగీ ఫీవర్ ట్రీట్మెంట్ జరుగుతోంది. జూన్, జూలై నెలలో సుమారు 200 వరకు డెంగీ ర్యాపిడ్ టెస్ట్లు చేసి పాజిటీవ్ అంటూ చికిత్స చేసినట్లు సమాచారం. వేలల్లో ఫీజులు.. జిల్లాలోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులకు వర్షాకాలంలో డెంగీ ఫీవర్ కాసుల పంటగా మారింది. జ్వరంతో రోగి వస్తే మొదట అడ్మిషన్ ఫీజుతోపాటు సీబీపీ, డెంగీ, మలేరియా తదితర రకాల పేర్లతో సుమారు రూ. 6 వేల ఖర్చుతో టెస్టులు చేస్తారు. ఆ తర్వాతా మూడు నుంచి నాలుగు రోజులు ఆస్పత్రిలో అడ్మిట్ అయితే తగ్గిపోతుందని చెప్తారు. నిత్యం ఉదయం, సాయంత్రం టెస్ట్లు చేస్తూ అదనంగా రూ. 2 వేల నుంచి 4 వేలకు వసూలు చేస్తారు. రోగికి రక్త కణాలు (ప్లేట్లెట్స్) తక్కువ ఉంటే అదనంగా రూ. 1000 వరకు బిల్లు వేస్తారు. ఒక్క రోజుకు వాడే మందులకు రూ. 4వేలకు పైనే ఖర్చు అవుతోంది. వైద్యుల ఫీజు, రూమ్ల ఫీజు అదనం. ఇలా ఒక్కో రోగి నాలుగు రోజులుండి డిశ్చార్జి అయితే రూ. 40 వేలకు పైనే ఫీజు, వారం రోజులు ఉంటే రూ. 60 వేలకు పైనే ఖర్చవుతోంది. ఇక మల్టీ, సూపర్ స్పెషాలిటీల పేరిట ఉన్న ఆస్పత్రుల ఫీజులు మరింత ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అంతంత మాత్రమే..పల్లెలు, తండాల్లో సీజనల్ వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జిల్లాలోని జీజీహెచ్లో రోజుకు 50, ఆర్మూర్ ఏరియా ఆస్పత్రిలో 10, బోధన్ జిల్లా ఆస్పత్రిలో 15 మంది వైరల్ ఫీవర్ తో చికిత్స పొందుతున్నారు. మిగతా సీహెచ్సీ, అర్బన్ హెల్త్ సెంటర్లల్లో మాత్రం ఒకరు లేదా ఇద్దరు చొప్పున రోగులకు వైద్య సేవలు అందుతున్నాయి. కాగా, నిత్యం ఒక్కో ప్రైవేటు ఆస్పత్రిలో పదుల సంఖ్యలో రోగులు చేరడం గమనార్హం. అందుకు గ్రామాల్లోని పీఎంపీ, ఆర్ఎంపీల సహకారం ఉంటోంది. ఇదంతా తెలిసినా వైద్యశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదులు వస్తేనే చర్యలు తీసుకుంటామనే ధోరణిలో ఉన్నారు.డెంగీ ఫీవర్ పేరిట కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు రోగులను దోచేస్తున్నాయి. సాధారణ జ్వరంతో ఆస్పత్రిలో అడుగు పెట్టినా.. ఏవేవో వైద్య పరీక్షలు చేస్తూ రోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ర్యాపిడ్ టెస్టుతోనే డెంగీ ఫీవర్గా నిర్ధారిస్తూ ఒక్కో రోగి నుంచి వేలల్లో వసూలు చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్న ‘డెంగీ’ తంతు తెలిసినా సంబంధిత వైద్యశాఖ తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జ్వరంతో వస్తే అడ్మిట్ ర్యాపిడ్ టెస్ట్తోనే పాజిటీవ్ అంటూ చికిత్స చేస్తున్న వైనం ఒక్కో రోగికి రూ. 40 వేల నుంచి రూ.80 వేలకు పైగా ఖర్చు ప్రైవేటు ఆస్పత్రుల్లో బాదుడు షురూ కొరవడిన వైద్యశాఖ పర్యవేక్షణతనిఖీలకు ఆదేశాలు.. ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేయాలని డిప్యూటీ డీఎంహెచ్వోలకు ఆదేశాలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఏం జరుగుతుందో పరిశీలించి నివేదికలు ఇవ్వాలని చెప్పాం. ఎక్కడైనా రోగులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తీసుకునే అధికారం ఉంది. డెంగీ విషయంలో మరింత సీరియస్గా తీసుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. – రాజశ్రీ, జిల్లా వైద్యాధికారి -
విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
నిజామాబాద్ అర్బన్/మోపాల్: విద్యాలయాల్లో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా, తగిన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అన్నారు. జిల్లాలోని సంక్షేమ వసతిగృహాలు, గురుకుల పాఠశాలు, కళాశాలల పరిస్థితిపై మంగళవారం సాక్షి దినపత్రికలో కథనం వెలువడింది. దీనికి స్పందించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడారు. అంతేకాకుండా కంజర జ్యోతిబాపూలే పాఠశాలను మంగళవారం తనిఖీ చేశారు. నూతనంగా నిర్మించిన డార్మెటరీ బ్లాక్ను అందుబాటులోకి తీసుకరాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రేపటిలోగా భవనం ఆధీనంలో తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.. పాఠశాల నిర్వహణను చక్కదిద్దాలని, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులకు ఆయా సబ్జెక్టులపై ప్రశ్నలు వేసి, వారి సామర్థ్యాన్ని అంచనా వేశారు. విద్యార్థులకు పలు అంశాలపై సూచనలు, సలహాలు చేశారు. ప్రభుత్వం అందించే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డిచ్పల్లి మండలంలో.. డిచ్పల్లి: మండలంలోని ఖిల్లా డిచ్పల్లి గ్రామంలో గల సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం రాత్రి తనిఖీ చేశారు. విద్యార్థులు, హాస్టల్ అధికారితో ఆయన మాట్లాడి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి కంజర జ్యోతిబాపూలే విద్యాలయం తనిఖీ -
చిన్నారి కిడ్నాప్– హత్యకు కుట్ర
కామారెడ్డి క్రైమ్: పట్టణంలో మంగళవారం ఓ బాలిక కిడ్నాప్నకు గురికాగా, పోలీసులు 12 గంటల్లోగా కేసును ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. వివరాలు ఇలా.. అశోక్ నగర్ కాలనీలో చిత్తు కాగితాలు ఏరుకునే మమత అనే వివాహిత మహిళకు రెండున్నర ఏళ్ల కుమార్తె కీర్తిక ఉంది. ఆమె తన భర్త చనిపోగా కుమార్తెతో కలిసి ఫుట్పాత్పైనే జీవనం సాగిస్తోంది. ఇటీవల ఆమెకు అశోక్ నగర్ కాల నీలోని కల్లు దుకాణంలో పనిచేసే పిల్లి రాజుతో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజుల క్రితమే వారిద్దరూ ఆలయంలో పెళ్లి చేసుకుని కలిసి ఉంటున్నారు. కానీ మమత మరో వ్యక్తితో చనువుగా ఉండటంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో వారు వేర్వేరుగా ఉంటున్నారు. ఈక్రమంలో మమత సోమవారం రాత్రి తన కుమార్తెతో కలిసి అశోక్నగర్ కాలనీ ఫుట్పాత్పై నిద్రించింది. మంగళవారం ఉదయం ఆమె లేచి చూసేసరికి కుమార్తె కనబడకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు సాయంత్రం మున్సిపల్ కార్యాలయం సమీపంలోని వైన్స్ వద్ద చిన్నారితో ఉన్న రాజును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా మద్యం సేవించిన అనంతరం పట్టణ శివారులోని చెట్ల పొదల్లోకి తీసుకువెళ్లి చిన్నారిని చంపేయాలని కిడ్నాప్ చేసినట్లు పేర్కొన్నాడు. మమతపై కక్ష పెంచుకున్న అతడు ఆమెను మనోవేదనకు గురి చేయాలని భావించి కీర్తికను చంపాలని పథకం వేసినట్లు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు పట్టణ ఎస్హెచ్వో నరహరి తెలిపారు. చిన్నారిని తల్లి మమతకు అప్పగించారు. నిందితుడిని పట్టుకున్న పోలీసులు బాలిక తల్లి మరోవ్యక్తితో చనువుగా ఉండటంతో కక్ష పెంచుకొని పథకం పన్నిన రెండో భర్త -
తాళం వేసిన ఇంట్లో చోరీ
వర్ని: మండలంలోని జాకోర గ్రామంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగినట్లు వర్ని ఎస్సై మహేష్ తెలిపారు. గ్రామానికి చెందిన తేజస్విని మంగళవారం ఉదయం ఇంటికి తాళం వేసి, బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లింది. సాయంత్రం ఆమె ఇంటికి తిరిగి రాగా, ఇంటి తాళంతోపాటు బీరువా తాళాలు పగలగొట్టి ఉండటం చూసి, చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటనస్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి రూ.15వేల నగదు, రెండు తులాల బంగారు గొలుసు చోరీ చేసినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అటవీ భూమిని చదును చేస్తున్న ట్రాక్టర్లు సీజ్ ఇందల్వాయి: ధర్పల్లి మండలం గోవింద్పల్లి శివారులో అటవీ భూమిని చదును చేస్తున్న రెండు ట్రాక్టర్లను మంగళవారం సీజ్ చేసి ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు ఎఫ్ఆర్వో రవి మోహన్ భట్ తెలిపారు. ట్రాక్టర్లను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన డిప్యూటీ రేంజ్ అధికారి తుకారం రాథోడ్, సెక్షన్ అధికారి అబ్దుల్ అతిఖ్, బీట్ అధికారులు నవీన్, ఖదీర్లను ఎఫ్ఆర్వో అభినందించారు. -
వేతన వెతలు తీరేదెన్నడు?
మోర్తాడ్(బాల్కొండ): మిషన్ భగీరథ పథకం కింద పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు రాకపోవడంతో పస్తులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. సకాలంలో వేతనాలను చెల్లించకుండా ఏజెన్సీ నిర్వాహకులు మొండికేయడంతో లైన్మెన్లు, సూపర్వైజర్లు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయినా తమను ఎవరూ పట్టించుకోవడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 600మంది ఉద్యోగులు.. మిషన్ భగీరథ పథకం కింద ఏర్పాటు చేసిన పంప్హౌజ్లు, సంప్హౌజ్లు ప్రభుత్వం పరిధిలోనే ఉన్నా నీటి సరఫరాను మాత్రం ఏజెన్సీలకు గత ప్రభుత్వం అప్పగించింది. సదరు ఏజెన్సీలు లైన్మెన్లను, సూపర్వైజర్లను నియమించుకుని వారి ద్వారా నీటి సరఫరా నిర్వహిస్తున్నాయి. జిల్లాలోని జలాల్పూర్లో ప్రధాన పంప్హౌజ్ ఉండగా ఇక్కడి నుంచి మన జిల్లాలోని కొన్ని మండలాలతో పాటు కామారెడ్డి జిల్లాకు నీటి సరఫరా కొనసాగుతుంది. రెండు జిల్లాల ఏజెన్సీ పరిధిలో 600 మంది వరకు ఉద్యోగులు వివిధ హోదాలలో పని చేస్తున్నారు. లైన్మెన్లకు వారి సీనియారిటీ ప్రకారం రూ.8వేల నుంచి రూ.10వేల వరకూ వేతనం ఇస్తుండగా, సూపర్వైజర్లకు రూ.12వేల చొప్పున వేతనం చెల్లించాల్సి ఉంది. ఏజెన్సీలకు వారు పొందిన టెండర్ ప్రకారం బిల్లులను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఏజెన్సీలు మాత్రం తమ పరిధిలో పని చేసే సిబ్బందికి వేతనాలను ప్రతి నెలా చెల్లిస్తూ పీఎఫ్ను జమ చేయాల్సి ఉంటుంది. కానీ ఐదు నెలలుగా ఏజెన్సీ నిర్వాహకులు తమ పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులకు వేతనాలను చెల్లించడం లేదు. అలాగే 2022 సంవత్సరానికి సంబంధించి మరో రెండు నెలల వేతనం ఏజెన్సీ ఉద్యోగులకు బకాయి ఉంది. ఆందోళనలు నిర్వహించినా.. మిషన్ భగీరథ పథకం కింద పని చేస్తున్న తమకు సకాలంలో వేతనాలు చెల్లించక అవస్థలు పెడుతున్నారని నిరసిస్తూ గతంలో అనేక మార్లు ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఒక దశలో నీటి సరఫరాను నిలపివేసినప్పటికీ ఏజెన్సీల నిర్వాహకులు మాత్రం తమ తీరు మార్చుకోలేదు. మార్చిలో పంప్హౌజ్ల ముందు ధర్నా నిర్వహించగా అప్పట్లో బకాయి ఉన్న వేతనం చెల్లించారు. మళ్లీ అప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా ఐదు నెలల వేతనం నిలిచిపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఏజెన్సీ నిర్వాహకులు, అధికారులు స్పందించి తమకు సకాలంలో వేతనాలు చెల్లించాలని సిబ్బంది కోరుతున్నారు. మిషన్ భగీరథ సిబ్బందికి ఐదు నెలలుగా జీతాలు కరువు పట్టించుకోని ఏజెన్సీ నిర్వాహకులువేతనాలు చెల్లించాలని సూచించాం.. ఏజెన్సీలు సకాలంలోనే కిందిస్థాయి ఉద్యోగులకు వేతనాలను చెల్లించాలని సూచించాం. ఫిబ్రవరి నెల వేతనం విడుదలైంది. మిగిలిన నెలలకు సంబంధించి వేతనాలను తొందరలోనే చెల్లించనున్నారు. ఏజెన్సీ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – అమీర్ఖాన్, డిప్యూటీ ఇంజినీర్, మిషన్ భగీరథ -
నాణ్యమైన పోస్టల్ సేవలు అందిస్తాం
నిజామాబాద్ లీగల్: పోస్టల్ డిపార్ట్మెంట్ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేశామని, దీనిద్వారా నాణ్యమైన సేవలను అందిస్తామని పోస్టల్ ఎస్ఎస్పీవో ఎస్ జనార్ధన్రెడ్డి అన్నారు. నగరంలోని జిల్లా పోస్టాఫీస్లో మంగళవారం ఆయన సాఫ్ట్వేర్ అప్డేట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నూతన సాఫ్ట్వేర్పై సిబ్బందికి గత నెల 15 రోజులుగా శిక్షణ ఇచ్చామని, నూతన సాఫ్ట్వేర్, శిక్షణ కార్యక్రమాలనతో తమ సిబ్బంది పనితీరు మెరుగుపడుతుందని అన్నారు. ఏఎస్పీ సురేఖ, ఐపీపీజీ శ్రావణ్, అసిస్టెంట్ పోస్టుమాస్టర్ అజయ్ కుమార్, పోస్టుమాస్టర్ రాజేశ్వర్గౌడ్ పాల్గొన్నారు. -
గంజాయి నిర్మూలనకు పటిష్ట నిఘా
ధర్పల్లి: జిల్లాలో గంజాయి నిర్మూలనకు పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. ధర్పల్లి పోలీస్ స్టేషన్ను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలను చేశారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల చేదనకై ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని సూచించారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ గేమింగ్ యాప్స్పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అన్ని గ్రామాలలో విలేజ్ పోలీస్ ఆఫీసర్లు విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని సూచించారు. నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ధర్పల్లి సీఐ భిక్షపతి, ధర్పల్లి ఎస్సై కల్యాణి, సిరికొండ ఎస్సై రామకృష్ణ, సిబ్బంది ఉన్నారు. టోల్ప్లాజా వద్ద అప్రమత్తంగా ఉండాలి ఇందల్వాయి: టోల్ ప్లాజా వద్ద పోలీసులు అప్రమ త్తంగా ఉండాలని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. ఇందల్వాయి వద్ద జాతీయ రహదారిపై ఉన్న టో ల్ప్లాజాని మంగళవారం ఆయన సందర్శించారు. ఎన్నో రాష్ట్రాల నుంచి వాహనాలు రాకపోకలు సా గించే వీలున్నందున టోల్ప్లాజా వద్ద పోలీసులు నిత్యం తనిఖీలు చేపట్టాలని సూచించారు. హైవేపై బ్లాక్స్పాట్ల చుట్టు పక్కల గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. -
‘ఓపెన్ యూనివర్సిటీ’లో కొత్త కోర్సులు
నిజామాబాద్ అర్బన్: నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ఆవరణలోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ(ఆర్సీసీ)లో 2025–26 సంవత్సరంలో కొత్త కోర్సులు ప్రారంభిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రా మ్మోహన్రావు, ఆర్సీసీ కోఆర్డినేటర్ రంజిత తెలిపారు. కళాశాలలో మంగళవారం నిర్వహించిన విలే కరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. ప్రస్తుత సంవత్సరం నుంచి పీజీలో బీఎస్సీ–బాటనీ, కెమెస్ట్రీ, ఫిజిక్స్, బయోలాజీలతోపాటు బీఎల్ఐఎ స్సీ కోర్సులు అందుబాటులో ఉంటాయని తెలిపా రు. వీటితోపాటు విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం నుంచి ఎస్టీఈపీ–(స్టైపెండ్ బేసెడ్ ఎడ్యుకేషన్ ప్రో గ్రాం– నెలకు రూ.7000 నుంచి రూ.24000) ప్రా రంభించినట్లు తెలిపారు. మహిళల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం, అత్యంత వెనుకబడిన వర్గాలైన కోయ, గోండు, ఎరుకల, ట్రాన్స్జెండర్ మొదలైన వారికి ఉచిత విద్య అందిస్తుందని ఆర్సీసీ కోఆర్డినేటర్ రంజిత తెలిపారు. ఆసక్తిగల వారు ఆన్లైన్లో యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని, సంబంధిత ధ్రువపత్రాలతో ఆర్సీసీని సంప్రదించాలని తెలిపారు. అనంతరం వాల్పోస్టర్లను ఆవిష్క రించారు. కళాశాల సీవోఈ భరత్రాజ్, ఆకాడమిక్ కోఆర్డినేటర్ నసీదాబేగం, అదనపు కంట్రోలర్లు వినయ్కుమార్, రాహుల్, ఆర్సీసీ సిబ్బంది ఉన్నారు. -
గంజాయి తరలిస్తున్న నలుగురి అరెస్ట్
ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలో గంజాయి తరలిస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు సోమవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మూడో టౌన్ పీఎస్ పరిధిలోని రైల్వే వంతెన వద్ద ఎస్సై కిరణ్పౌల్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఓ కారు అనుమానాస్పదంగా తిరుగుతుండడాన్ని గమనించారు. వెంటనే కారును ఆపి అందులో తనిఖీ చేయగా 40 గ్రాముల ఎండు గంజాయి పట్టుబడిందని ఎస్సై తెలిపారు. ఇందులో మహ్మద్ అబూకర్ సిద్ధిఖీ, సయ్యద్ సమీర్, షేక్ సైఫ్, నారిపోగు జాన్ పట్టుబడగా మరో ముగ్గురు కాషిఫ్, సన్నీ, బాబీ ఇర్ఫాన్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. తమ ఖర్చులు, విలాసవంతమైన ఖర్చుల కోసం సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతోనే గంజాయిని విక్రయిస్తున్నట్లు పట్టుబడ్డ నిందితులు ఒప్పుకున్నారని ఎస్సై తెలిపారు. ఇందులో ఇర్ఫాన్ తక్కువ ధరకు తెలియని వ్యక్తుల నుంచి గంజాయి కొనుగోలు చేసి, కొంత భాగం వినియోగించి, మిగిలిన గంజాయిని నిజామాబాద్, నిర్మల్ ప్రాంతాల్లో అధిక ధరలకు ఇతరులకు అమ్ముతుంటాడని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
డెంగీ పంజా..
నిజామాబాద్వే బిల్లు లేకుండా.. వే బిల్లు లేకుండా సరుకు రవాణా చేస్తున్న ట్రక్కును వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పట్టుకుని డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో ఉంచారు.మంగళవారం శ్రీ 22 శ్రీ జూలై శ్రీ 2025– 8లో u● జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు ● హైరిస్క్ పీహెచ్సీలుగా ముదక్పల్లి, పోతంగల్, మోస్రా గుర్తింపు ● ప్రత్యేక వైద్య శిబిరాల ద్వారా అవగాహన, చికిత్సలు నిజామాబాద్ నాగారం: జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ కేసులు పెరుగుతున్నాయి. వైద్యశాఖ అధికారులు ఫీవర్ సర్వే చేపడుతూ బాధితులను గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ఎక్కడైనా డెంగీ పాజిటివ్ ఉంటే చుట్టూ 100 కుటుంబాల్లో ప్రత్యేక సర్వేతో పాటు, ఆరోగ్య అవగాహన శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. అయినా కొన్ని పీహెచ్సీ, గ్రామాల పరిధిలో డెంగీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న కేసులు.. జిల్లాలోని 27 పీహెచ్సీలు, 7 సీహెచ్సీ, 10 అర్బన్ హెల్త్ సెంటర్లు, ఆర్మూర్ ఏరియా ఆస్పత్రి, బోధన్ జిల్లా ఆస్పత్రితో పాటు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో క్రమంగా వైరల్ ఫీవర్తోపాటు డెంగీ కేసులు పెరుగుతున్నాయి. చిన్నాపెద్ద తేడా లేకుండా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో ప్రతి ఇంట్లో ఒకరు జ్వర బాధితులున్నారు. ముఖ్యంగా వైరల్ ఫీవర్తో బాధపడే వారి సంఖ్య ఎక్కువైంది. దీనికి తోడు డెంగీ పంజా విసురుతోంది. జ్వరం రెండు, మూడు రోజులుగా తగ్గకపోవడంతో టెస్టులు చేస్తే డెంగీ కేసులుగా నమోదు అవుతున్నాయి. ‘ప్రయివేట్’ దోపిడీ.. జిల్లాలోని పలు ప్రయివేట్ ఆస్పత్రుల్లో నిబంధనలకు విరుద్ధంగా డెంగీ ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారు. డెంగీ అనేది కేవలం ఎలీసా టెస్ట్ ద్వారానే నిర్ధారణ అవుతుంది. ఎలీసా టెస్ట్ కేవలం జీజీహెచ్ ఆవరణలోని టీ–హబ్లో మాత్రమే ఉంది. కానీ ప్రయివేట్ ఆస్పత్రులు కేవలం డబ్బులు దండుకోవడానికే ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారు. డెంగీ పాజిటివ్ వచ్చినట్లు చూపి రోగులను అడ్మిట్ చేసుకొని చికిత్స అందిస్తున్నారు. న్యూస్రీల్హైరిస్క్ పీహెచ్సీలు.. జిల్లాలో డెంగీ కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేసులున్న గ్రామాలను హైరిస్క్ పీహెచ్సీలుగా గుర్తించి ప్రత్యేక చికిత్స అందిస్తారు. ప్రస్తుతం జిల్లాలో ముదక్పల్లి, పోతంగల్, మోస్రా, నగరంలోని చంద్రశేఖర్కాలనీ పీహెచ్సీల పరిధిలో డెంగీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఒక్క మోపాల్ మండలంలోని ముదక్పల్లి పీహెచ్సీ పరిధిలో జూన్లో 07, జూలైలో 09, పోతంగల్ పరిధిలో జూన్లో 2, జూలైలో 5, మోస్రా పరిధిలో జూన్లో 3, జూలైలో 03, నగరంలోని చంద్రశేఖర్కాలనీ పరిధిలో జూలైలో 4 కేసులు నమోదు అయ్యాయి. ముదక్పల్లి పీహెచ్ పరిధిలోని కాల్పోల్ గ్రామంలో 7 డెంగీ కేసులు నమోదు కావడం మరింత కలవర పెడుతోంది. జిల్లాలో ఎక్కడ డెంగీ పాజిటివ్ కేసులు నమోదైనా వెంటనే వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రత్యేకంగా ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలకు అవసరమైన పరీక్షలు చేసి మందులు ఇస్తున్నామని చెబుతున్నారు. చర్యలు తీసుకుంటున్నాం.. జిల్లాలో గత నెలతో పోలిస్తే ఈ నెలలో డెంగీ పాజిటివ్ కేసులు పెరిగాయి. ఎక్కడ డెంగీ నమోదు అయినా ఆ ప్రాంతంలో ప్రత్యేక సర్వేతో పాటు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. ప్రయివేట్ ఆస్పత్రుల్లో డెంగీ ర్యాపిడ్ టెస్ట్ చేసి డెంగీ పేరుతో చికిత్స చేస్తున్నట్లు తెలిసినా, ఫిర్యాదులు వచ్చినా చర్యలు ఉంటాయి. టీహబ్లో మాత్రమే ఎలీసా టెస్ట్ ద్వారా డెంగీ పాజిటివ్ నిర్ధారణ అవుతుంది. ప్రజలు కూడా అవగాహనతో ఉండి ప్రశ్నించాలి. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయిస్తున్నాం. వైద్య సిబ్బంది అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందే. – డాక్టర్ రాజశ్రీ, డీఎంహెచ్వో, నిజామాబాద్ -
అప్పుల బాధతో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
డిచ్పల్లి: మండలంలోని వెస్లీనగర్ తండాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ రాథోడ్ రమేశ్ కుమార్ (46) ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఎండీ షరీఫ్ సోమవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ ఆర్టీసీ డిపో–1లో రమేశ్కుమార్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతడికి భార్య సరోజ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆదివారం సరోజ తీజ్ పండుగ కోసం తల్లిగారి ఊరు యాచారం తండాకు వెళ్లింది. రాత్రి భోజనం చేసిన తర్వాత రమేశ్ బెడ్ రూం కు వెళ్లి నిద్రపోయాడు. సోమవారం ఉదయం 8 గంటలైనా కొడుకు బయటకు రాకపోవడంతో తల్లి కమల వెళ్లి చూడగా ఫ్యాన్కు ఉరేసుకొని కనిపించాడు. కుటుంబీకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు తండాకు చేరుకుని వివరాలు సేకరించారు. తన ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్లు చేయడం, పొలంలో నీళ్ల కోసం ఐదు బోర్లు వేయగా అవి ఫెయిల్ కావడంతో సుమారు రూ.10 లక్షల వరకు అప్పులయ్యాయి. అప్పుల బాధతో మనస్తాపానికి గురైన రమేశ్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి కమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో మరొకరు..కామారెడ్డి క్రైం: ఆర్థిక ఇబ్బందులతో ఒకరు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు దేవునిపల్లి ఎస్సై రంజిత్ సోమవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. రాజంపేటకు చెందిన గొడుగు సుధాకర్(30) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. వ్యవసాయం, కుటుంబ అవసరాలకు కొంత కాలంగా చేసిన అప్పులు పెరిగాయి. దీంతో మనస్థాపంతో ఆదివారం సాయంత్రం కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
దారిదోపిడీకి పాల్పడిన నిందితుల అరెస్ట్
కామారెడ్డి క్రైం: బైక్పై ఇంటికి వెళ్తున్న ఓ వక్తిని లిఫ్ట్ అడిగి దారి దోపిడీకి పాల్పడిన కేసులో నిందితులను పోలీసులు సోమవారం పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కామారెడ్డి ఏఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు వెల్లడించారు. దోమకొండ మండలం చింతమాన్పల్లి గ్రామానికి చెందిన సార్ల చిన్న గంగయ్య శుక్రవారం సాయంత్రం వ్యక్తిగత పనులపై కామారెడ్డికి వచ్చాడు. ఓ కల్లు దుకాణంలో కల్లు సేవించిన సమయంలో అక్కడే ఉన్న ఓ మహిళ అతనితో మాటలు కలిపి చింతమాన్పల్లి వెళ్లే దారిలో క్యాసంపల్లి వరకు తనకు లిఫ్ట్ ఇవ్వమని అడిగింది. చిన్న గంగయ్య సరేనని ఆమెను బైక్పై ఎక్కించుకుని పట్టణ శివారు దాటగానే ఓ చోట బైక్ ఆపమని అడిగింది. వెంటనే ఇద్దరు వ్యక్తులు అక్కడకు వచ్చి గంగయ్యను బెదిరించి అతని వద్ద ఉన్న రూ.28 వేలు లాక్కుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానం, ఇతర ఆధారాలతో నిందితులను పట్టణంలోని షబ్బీర్ అలీ కాలనీలో నివాసం ఉండే కడమంచి లక్ష్మి, షేక్ జావేద్, షేక్ అబ్బు లుగా గుర్తించారు. సోమవారం వారిని ఓ కాలనీ వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు ఏఎస్పీ తెలిపారు. నిందితులు గతంలోనూ మేడ్చల్, దేవునిపల్లి, తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇలాంటి దారి దోపిడీ ఘటనలకు పాల్పడినట్లు పలు కేసులు ఉన్నాయని వెల్లడించారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నామని అన్నారు. కేసు చేధనలో చాకచక్యంగా వ్యవహరించిన పట్టణ ఎస్హెచ్వో నరహరి, సీసీఎస్ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు ఉస్మాన్, వినయ్ సాగర్, సిబ్బంది రాజేందర్, గణపతి, నరేశ్, రాజు, భాస్కర్, కిషన్, శ్రావణ్, కమలాకర్ మైసయ్య లను ఏఎస్సీ అభినందించారు. -
చికిత్స పొందుతూ ఒకరి మృతి
భిక్కనూరు: మండల కేంద్రంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రాజవేణి రాజేందర్(53) సోమవారం వేకువజామున మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రాజేందర్ను కుటుంబీకులు మొదట కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సాయంత్రం భిక్కనూరులో అంత్యక్రియలు నిర్వహించారు.యువకుడి అదృశ్యం నవీపేట: మండలంలోని పాల్ద గ్రామానికి చెందిన చిన్నోళ్ల గణేశ్(35) అనే యువకుడు అదృశ్యమైనట్లు ఎస్సై వినయ్ సోమవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గణేశ్ బతుకుదెరువు నిమిత్తం దుబాయికి వెళ్లగా గత నెలలో అతని తండ్రి మృతి చెందడంతో స్వగ్రామానికి వచ్చాడు. ఈ నెల 4న తాను గల్ఫ్కు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. 15 రోజుల నుంచి ఎలాంటి ఫోన్ లేకపోవడంతో భార్య స్రవంతి జిల్లా కేంద్రంలోని ట్రావెల్స్ యజమానులను సంప్రదించింది. వారు సౌదీకి వెళ్లలేదని తెలుపడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. పెద్దమ్మతల్లి ఆలయంలో చోరీ లింగంపేట: మండలంలోని పోతాయిపల్లి శివారులో ఉన్న పెద్దమ్మతల్లి ఆలయంలో ఆదివారం రాత్రి చోరీ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. పెద్దమ్మతల్లి మెడల ఉన్న మూడు బంగారు పుస్తెలు, హుండీలోని నగదును దుండగులు అపహరించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. చోరీ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.వే బిల్లు లేని సరుకు రవాణా ట్రక్కు పట్టివేతడిచ్పల్లి: వే బిల్లు లేకుండా సరుకు రవాణా చేస్తున్న ట్రక్కును నిజామాబాద్ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పట్టుకుని డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఏసీటీవో కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు కామారెడ్డి నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ట్రక్కును డిచ్పల్లి మండలం బీబీపూర్ శివారు జాతీయ రహదారిపై వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మూడు రోజుల క్రితం పట్టుకున్నారు. డ్రైవర్ వద్ద వే బిల్లు లేకపోవడంతో ట్రక్కుతో పాటు అతడిని డిచ్పల్లి పీఎస్కు తీసుకెళ్లి వారి కస్టడీలో ఉంచారు. సోమవారం వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర కమిషనర్ ఆదేశాల మేరకు డిచ్పల్లి పీఎస్లో తమ సిబ్బందితో చేరుకున్న ఏసీటీవో ట్రక్కు సీల్ను తెరిచి అందులో రవాణా చేస్తున్న సరుకును తనిఖీ చేయగా రాజ్ నివాస్ పాన్ మసాల ప్యాకెట్లు బయటపడ్డాయి. సుమారు 200 బస్తాల్లో ఉన్న పాన్ మసాల ప్యాకెట్ల విలువను లెక్కించి వాటికి ఎంత మేరకు జీఎస్టీ అవుతుందో నిర్ధారిస్తామన్నారు. అనంతరం జీఎస్టీ ఎగవేయడానికి వే బిల్లు లేకుండా సరుకు అక్రమ రవాణా చేస్తున్నందున జరిమానాగా సుమారు 200 శాతం జీఎస్టీ వసూలు చేస్తామని తెలిపారు. డబ్బులు చెల్లించేంత వరకు సరుకుతో పాటు ట్రక్కు డిచ్పల్లి పోలీసుల కస్టడీలోనే ఉంటుందన్నారు. డ్రైవర్ను ప్రశ్నించగా మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ నుంచి ఆదిలాబాద్కు వెళ్తున్నట్లు చెప్పాడని ఏసీటీవో పేర్కొన్నాడు. అయితే ఇండోర్ నుంచి నాగ్పూర్ మీదుగా నేరుగా ఆదిలాబాద్కు చేరుకునే అవకాశం ఉండగా హైదరాబాద్ మీదుగా ట్రక్కును ఆదిలాబాద్ కు తరలించడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
పోగొట్టుకున్న డబ్బులు అందజేత
నందిపేట్: మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో రూ. 20 వేలు పోగొట్టుకున్న వృద్ధురాలికి పోలీసుల సమక్షంలో ఆ నగదును అందించిన ఆర్టీసీ అధికారులు ఆదర్శంగా నిలిచారు. వివరాలిలా ఉన్నాయి. నందిపేట మండలం లక్కంపల్లికి చెందిన షాపురం సాయమ్మ డొంకేశ్వర్ మండలం దత్తపూర్లో ఉండే తన కుమార్తె వద్దకు వెళ్లి వ్యక్తిగత పనుల కోసం ఆమె నుంచి రూ. 20 వేలు డబ్బులు తీసుకొని సోమవారం మధ్యాహ్నం బయలు దేరింది. నందిపేట్ బస్టాండ్లో బస్సు దిగుతున్న సమయంలో సంచిలో నుంచి డబ్బులు పడిపోయాయి. ఇది గమనించని ఆమె నడుచుకుంటూ వెళ్లి లక్కంపల్లి బస్సు కోసం బస్టాండ్లో కూర్చుంది. కాగా అదే సమయంలో బస్టాండ్లోకి వచ్చిన మాయపూర్ గ్రామానికి చెందిన గొల్ల చిన్నక్కకు ఆ డబ్బులు దొరికాయి. ఈ విషయాన్ని అక్కడే ఉండి గమనిస్తున్న మరో మహిళ డబ్బులు నావి అంటు గుంజుకునే ప్రయత్నం చేసింది. వెంటనే గొల్ల చిన్నక్క ఆ డబ్బులను ఆర్టీసీ కంట్రోలర్ హనుమ దాస్కు ఇచ్చింది. దీంతో కంట్రోలర్ డబ్బులు దొరికిన విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు అక్కడున్న ప్రయాణికులతో విచారించారు. విషయం తెలుసుకున్న వృద్ధురాలు పోసాని ఆ డబ్బులు తనవే అంటూ పోలీసులకు చెప్పింది. పోలీసులు ఆమె కుమార్తెకు సమాచారం ఇవ్వడంతో ఆర్టీసీ అధికారులు వృద్ధురాలికి ఆ నగదును అందజేశారు. -
సాటిలేని మహాకవి దాశరథి
నిజామాబాద్ రూరల్: ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న దాశరథి మాట జిల్లా జైలు గోడలు దాటి బయటి ప్రపంచాన్ని చైతన్యపరిచి విశ్వవ్యాప్తమైందని, ఆయన సాటిలేని మహాకవి అని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల అన్నారు. నగరంలోని న్యూ అంబేడ్కర్ భవన్లో సోమవారం సాయంత్రం నిర్వహించిన దాశరథి శతజయంత్యుత్సవాలకు ఆమె హాజరయ్యారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో మహాకవి దాశరథి నిజాం నిరంకుశానికి ఎదురోడి పోరాటం చేశారన్నారు. తాళం, గానంతో ప్రజల గుండెలను చైతన్యపరిచే వాడే నిజమైన కవి అని అన్నారు. కవులు ఎప్పుడూ ప్రజల కన్నీళ్లు తుడిచేలా ఉండాలన్నారు. తెలంగాణ యుద్ధనౌక, తన తండ్రి అయిన గద్దర్కు ఇచ్చిన మాట కోసం తాను సమసమాజ స్థాపన, ఓటు హక్కు విప్లవం కోసం అంతర్గతంగా పోరాడతానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కవులు, కళాకారులకు పేరు, ప్రతిష్టలు వచ్చాయన్నారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని అందులో సామాజిక న్యాయం అనే పదం లేకుండా కొన్ని రాజకీయ శక్తులు చూస్తున్నాయని, దీనికోసం తాను నిశబ్ధ విప్లవం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ మలి దశ ఉద్యమంలో పనిచేసిన వారికి ఉద్యోగాలు ఇప్పించాలని కళాకారులు చైర్పర్సన్ వెన్నెలకు వినతిపత్రం అందజేశారు. దాశరథి జిల్లా అవార్డును ప్రముఖ కవి బీఎంబీకి అందజేశారు. వెన్నెలను డాక్టర్ కవితారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత సన్మానించారు. చివరగా వెన్నెల పాడిన విప్లవ గీతం ఆహుతులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో డీఈవో అశోక్, ప్రొఫెసర్ కనకయ్య, హెచ్ఎం సీతయ్య, కమిటీ సభ్యులు సిర్ప లింగం, కోనేరు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక న్యాయం కోసం కవులు పోరాడాలి తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల -
మొరం టిప్పర్ల పట్టివేత
డిచ్పల్లి: అక్రమంగా మొరం తరలిస్తున్న రెండు టిప్పర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు డిచ్పల్లి ఎస్సై ఎండీ షరీఫ్ సోమవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు డిచ్పల్లి మండలం సుద్దపల్లి శివారులోని సీఎంసీ మెడికల్ కాలేజ్ సమీపంలో ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా మొరం తరలిస్తున్న రెండు టిప్పర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అనంతరం టిప్పర్లను డిచ్పల్లి పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అధికార పార్టీకి చెందిన వాహనాల యజమాని టిప్పర్లను విడిపించుకునేందుకు జిల్లా స్థాయి నాయకులతో ఫైరవీలు చేసినా ఫలితం లేకుండా పోయిందని సమాచారం. స్థానిక పోలీసులకు బదులు పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలోని టాస్క్ఫోర్స్ పోలీసులు టిప్పర్లను పట్టుకోవడంతో వాటిని విడిపించుకోలేక పోయినట్లు తెలుస్తోంది. -
విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి
మోపాల్: విద్యార్థినులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నిర్వాహకులకు సూచించారు. మోపాల్ మండలంలోని కంజర్ శివారులో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ కళాశాలను కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని విభాగాలను పరిశీలించారు. విద్యార్థినుల కోసం తయారు చేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. స్టోర్ రూంలో నిల్వ ఉన్న బియ్యం, పప్పు, వంట నూనె ఇతర వంట సామాగ్రిని పరిశీలించారు. విద్యార్థినుల ఆరోగ్య స్థితిగతులు, వారికి అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. అల్పాహారం, భోజనం రుచికరంగా ఉంటుందా లేదా అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. కళాశాల తరగతి గదులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి -
అలరించిన దాశరథి సంగీత విభావరి
నిజామాబాద్ రూరల్: సుమధుర పాటల కోవెల దాశరథి అని ప్రముఖ కవి వీపీ చందన్రావు అన్నారు. సోమవారం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న గీతా భవన్లో స్వర సౌరభం ఆధ్వర్యంలో దాశరథి లలిత సినీ సంగీత విభావరి నిర్వహించారు. దాశరథి శతజయంతి వేడుకల్లో భాగంగా ఆయన రచించిన సుమారు 28 సినీ పాటలను గాయకులు ఆలపించినట్లు స్వర సౌరభం అధ్యక్షుడు అయాచితం నాగరాజు శర్మ తెలిపారు. అనంతరం పలువురు కవులకు పురస్కారాలు అందించి సన్మానించారు. కార్యక్రమంలో కాసర్ల నరేశ్ రావు, ప్రకాశ్, సముద్రాల రాంలు, వేముల శేఖర్, అనసూయ తదితరులు పాల్గొన్నారు. -
జెండా బాలాజీ ఆలయంలో పూజలు
ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో సర్యసమాజ్ ప్రజా ఐక్య సమితి సభ్యులు సోమవారం జెండా జాతరకు సంబంధించిన బట్ట పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సర్వ సమాజ్ సభ్యులు మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా వస్తున్న ఆచారం ప్రకారం జెండా బాలాజీ ఆలయంలో జెండా జాతరకు సంబంధించిన బట్టపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 26న చిన్న జెండా, 27న పెద్ద జెండాను ఆలయ ఆవరణలో ప్రతిష్టించి తొమ్మిది రోజుల పాటు పూజలు చేస్తామన్నారు. కార్యక్రమంలో సర్వసమాజ్ అధ్యక్ష, కార్యదర్శులు కొట్టాల సుమన్, కర్తన్ దినేశ్, సర్వసమాజ్ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించాలి
మోపాల్ (నిజామాబాద్ రూరల్): పరిసరాల శు భ్రత పాటించేలా ప్రజలకు అవగాహన క ల్పించాలని, ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే ప క్కాగా అమలయ్యేలా చూడాలని అధికారుల ను కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ఆదేశించారు. జి ల్లాలో ఎక్కడ కూడా జ్వరాలు, సీజనల్ వ్యా ధులు ప్రబలకుండా ముందస్తుగానే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. మండలంలో ని కాల్పోల్ తండాను కలెక్టర్ సోమవారం సందర్శించారు. తండాలో పలువురికి జ్వరా లు సోకిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యే క వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. జ్వరాలు, ఇతర అనారోగ్య కారణాలతో అస్వస్థతకు గురైన వారికి మెరుగైన చికిత్సలు అందించాలని సూచించారు. జ్వరం వచ్చిన వెంటనే స్థానికులు వైద్య శిబిరంలో తగిన చికిత్సలు పొందేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా తండాలోని ఆయా నివాస ప్రాంతాలను సందర్శిస్తూ, స్థానికంగా నెలకొని ఉన్న పరిస్థితులను పరిశీలించారు. పరిసరా లను శుభ్రంగా ఉంచుకోవాలని స్థా నికులకు సూచించారు. జిల్లా మలేరియా నియంత్రణ అధికారి తుకారాం, డీపీవో శ్రీనివాస్, మోపాల్ ఎంపీడీవో రాములు, ఎంపీవో కిరణ్ తదితరులు ఉన్నారు.● కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ● కాల్పోల్ తండాలో పర్యటన -
వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించాలి
● ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఆర్మూర్: చదువులతో ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ పాఠశాలకు చెందిన గడ్డం సంతోష్ అనే ఇంటర్ విద్యార్థి రెండు రోజుల క్రితం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో సోమవారం ఎమ్మెల్యే వసతి గృహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలను ఉపాధ్యాయులు, సిబ్బంది, తోటి విద్యార్థులను అడిగి తెలుసుకొన్నారు. ఉపాధ్యాయుల అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలించి వసతి గృహంలోని సౌకర్యాలను, విద్యార్థులకు అందించే ఆహార నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట గురుకుల పాఠశాల సిబ్బంది ఉన్నారు. -
ప్రాణాలు పోతున్నా పట్టింపేది..
నగరంలోని ఖలీల్వాడి, కోటగల్లి, పూసలగల్లి, గాయత్రినగర్, సాయిప్రియనగర్, శివాజీనగర్, ఆనంద్నగర్ కాలనీ, గాజుల్పేట్, వినాయక్నగర్, 100 ఫీట్ల రోడ్డు, దుబ్బ, అరుందతీనగర్ తదితర కాలనీల్లో ఎక్కువగా కుక్కలు సంచరిస్తున్నాయి. రాత్రి వేళ కుక్కలు గుంపులు గుంపులుగా చేరి రోడ్లుమీదకు వస్తున్నాయి. వాహనదారులు వెంటపడటంతో ప్రమాదాల బారిన పడుతున్నారు.ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలపై దాడులు చేస్తున్నాయి. గత నెలలో మాలపల్లిలో కుక్కకాటుకు గురైన ఐదేళ్ల బాలుడు నెల తర్వాత మృతిచెందడం కలచి వేసింది .ప్రాణాలు పోతున్నా బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. రోజుకు 6 నుంచి ఏడు కుక్క కాటు కేసులు జీజీహెచ్కు వస్తున్నట్లు తెలుస్తోంది. -
సోయా తగ్గింది.. మొక్కజొన్న పెరిగింది
మోర్తాడ్(బాల్కొండ): జిల్లాలో సోయా పంట సాగు విస్తీర్ణం తగ్గించిన రైతులు మొక్కజొన్నకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. సోయా కంటే మొక్కజొన్న 15 వేల ఎకరాల్లో అదనంగా సాగు అవుతుండటమే ఇందుకు నిదర్శనం. ఈ వర్షాకాలం సీజన్ లో మొక్కజొన్న 47 వేల ఎకరాల్లో సాగు అవుతుండగా సోయా మాత్రం 32 వేల ఎకరాలకు పరిమి తమైంది. సోయా గింజలకు గత సీజనులో ఆశించిన ధర లభించలేదు. క్వింటాలుకు రూ.5 వేలకు మించి ధర దక్కకపోవడంతో సోయా సాగు విస్తీర్ణంను రైతులు తగ్గించారు. మక్కలకు క్వింటాలుకు రూ.2వేల నుంచి రూ.2,300ల వరకు ధర లభించడం మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరగడానికి కారణమైంది. మక్కకు మనచోట డిమాండ్.. సోయా పరిశ్రమలు మన రాష్ట్రంలో ఎక్కువగా లేకపోవడంతో పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేయా ల్సి ఉంది. మక్కలను పౌల్ట్రీ పరిశ్రమ, బిస్కెట్ల తయారీలో విరివిగా వినియోగిస్తారు. మక్కలకు మన చోటనే డిమాండ్ ఉండటంతో మొక్కజొన్న సాగు విస్తీర్ణం గతంలో కంటే పెరగడానికి అవకాశం ఏర్పడింది. ఒక ఎకరానికి మొక్కజొన్న దిగుబడి 25 క్వింటాళ్ల వరకు వస్తుండగా, సోయా మాత్రం 10 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాళ్లే లభిస్తుంది. మక్కలకు మార్కెట్లో డిమాండ్ ఎప్పుడూ ఉండటంతో మొక్కజొన్న సాగుకే రైతులు మొగ్గుచూపుతున్నారు. గత సీజన్లో సోయా ధర తగ్గడంతో పంట సాగు విస్తీర్ణం తగ్గించిన రైతులు 15 వేల ఎకరాలు ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్న మొక్కజొన్న సోయా ధర తగ్గడంతోనే.. సోయా పంటకు గతంలో కంటే తక్కువ ధర లభిస్తుంది. ధర తగ్గిపోవడంతో సోయా సాగు చేయడంపై రైతులు ఆసక్తి చూపడం లేదు. సో యా కంటే మక్కలకు డి మాండ్ ఏర్పడటంతో మొక్కజొన్న సాగుకే రైతులు ఇష్టపడుతున్నారు. – రొక్కం మురళి, విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్, తిమ్మాపూర్ -
రేపటి విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలి
నిజామాబాద్ అర్బన్: ఫీజుల నియంత్రణ చట్టాన్ని తేవాలని డిమాండ్ చేస్తూ బుధవారం చేపట్టే విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలని ఏఐఎస్బీ జిల్లా అధ్యక్షులు నాగరాజ్ అన్నారు. సోమవారం వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలన్నారు. ఈ నిరసనలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు హైమాస్ట్ లైట్ల ప్రారంభం సిరికొండ: మండలంలోని రావుట్ల గ్రామంలో ఎమ్మెల్సీ కవిత మంజూరు చేసిన నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను బీఆర్ఎస్ నాయకులు ప్రారంభించారు. మాజీ వైస్ ఎంపీపీ తోట రాజన్న, మాజీ ఉపసర్పంచ్ రఘువాస్, వీడీసీ చైర్మన్ భూమయ్య, శ్రీనివాస్, రాజేందర్, పెద్ద భూమయ్య, మైసి సాయన్న,బాలరాజు, సాయిలు, తాహెర్ తదితరులు పాల్గొన్నారు. మత్తు పదార్థాలపై నిఘా పెంచాలి సిరికొండ: మండల కేంద్రంలో మత్తు పదార్థాల విక్రయంపై నిఘా పెంచాలని ఎస్సై రామకృష్ణను సిరికొండ వీడీసీ సభ్యులు కోరారు. ఎస్సైని వారు సోమవారం కలిసి వినతి పత్రం అందజేశారు. వాహనాల తనిఖీల్లో స్థానికులకు మినహాయింపు ఇవ్వాలని, పొలం వద్దకు వెళ్లే వారికి హెల్మెట్ లేదని జరిమానాలు విధిస్తున్నారని వీడీసీ సభ్యులు ఎస్సైకి తెలిపారు. వీడీసీ చైర్మన్ స్వామి, వైస్ చైర్మన్ రామస్వామి, మంగళి మోహన్, భూమరెడ్డి, లక్ష్మణ్, రాజలింగం, గంగాధర్, సంజీవ్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. చర్యలు తీసుకోవాలి నిజామాబాద్ అర్బన్ : ఒడిస్సాలో అత్యాచారానికి పాల్పడిన ఎన్ఎస్యూఐ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు శివ డిమాండ్ చేశారు. నగరంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒడిస్సాలో ఎఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు ఉదిత్ ప్రధాన్ ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి పోలీసులకు లొంగిపోయాడన్నారు. ఈవిషయం సిగ్గ చేటన్నారు. ఈ సమావేశంలో ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అమృత చారి, తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షులు సాయికుమార్, దినేష్, అల్తాఫ్, ఆకాష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 10 నుంచి జలాల్ బుకారి దర్గా ఉర్సు బోధన్టౌన్(బోధన్): పట్టణంలోని రెంజల్ బేస్లోగల జలాల్ బుకారి దర్గ ఉర్సు ఉత్సవాలు ఆగస్టు 10వతేదీ నుంచి సజ్జదే నశీ ముక్తెదార్, ఉర్సు కమిటీ ప్రధాన కార్యదర్శి యూనుస్ పటేల్ తెలిపారు. సోమవారం ఉర్సు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ ఉర్సు ఉత్సవాలు 10,11,12 మూడు రోజుల పాటు సాగుతాయని పేర్కొన్నారు. -
సన్నబియ్యంతో రేషన్ కార్డుకు డిమాండ్
నిజామాబాద్ అర్బన్: గతంలో రేషన్ షాపులు, సరుకులపై ప్రజల్లో అంతగా ఆసక్తి ఉండేది కాదని, ప్రస్తుతం సన్న బియ్యం పంపిణీతో రేషన్ కార్డులకు విపరీతమైన డిమాండ్ పెరిగిందని రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి కీ రేషన్ కార్డులు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 25 నుంచి వచ్చే నెల ఆగస్టు 10 వరకు అన్ని మండల కేంద్రాల్లో అధికారికంగా రేషన్ కార్డుల పంపిణీ కా ర్యక్రమం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సోమవారం ఆయన, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి తదితరులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష జరిపారు. వ ర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రేషన్ కార్డుల పంపిణీ, సాగునీటి వనరులు, ఎరువుల పంపిణీ పర్యవేక్షణ, సీజనల్ వ్యాధుల నియంత్రణ తదితర అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. సీఎం మాట్లాడుతూ.. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాల్లో శాసనసభ్యులు, జిల్లా ఇన్చార్జి మంత్రులు విధిగా పాల్గొనాలని సూచించారు. అలాగే ప్రతి మండలంలో కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు పాల్గొనాలన్నారు. వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాతావరణ సూచనలకు అనుగుణంగా రైతులను, వివిధ వర్గాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలన్నారు. పోలీస్ కమిషనరేట్లకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా క్షేత్రస్థాయిలో ఉంటూ పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించారు. జిల్లాల్లో పిడుగుపాటుతో జరిగే నష్టాల వివరాలు సత్వరమే నమోదు చేస్తూ, బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా చూడాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యులు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్లకు సూచించారు. పశువులకు సంబంధించి వెటర్నరీ విభాగం కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆస్పత్రులను కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశించారు. గత సీజన్లో 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్గా నిలిచిందని, ఈసారి కూడా రైతులకు సాగునీరు ఇతర సౌకర్యాలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. యూరియా నిల్వలకు సంబంధించి ప్రతి ఎరువుల దుకాణం దగ్గర స్టాక్ వివరాలను బోర్డుపై తప్పనిసరిగా ప్రదర్శించేలా చర్యలు తీ సుకోవాలన్నారు. ఎరువుల కొరత ఉన్నట్లు కొంద రు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, నిజానికి రాష్ట్రంలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా సహా ఇతర ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. యూరియా నిల్వలను ఇతర వ్యాపార అవసరాలకు మళ్లించకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎరువుల పంపిణీకి సంబంధించి ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలన్నారు. వీసీలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 25 నుంచి అన్ని మండల కేంద్రాల్లో పంపిణీ చేపట్టాలి యూరియా నిల్వలు పక్కదారి పట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలి భారీ వర్షాలపై అప్రమత్తంగా వ్యవహరించాలి కలెక్టర్లతో వీసీలో సీఎం రేవంత్రెడ్డి -
శిథిలావస్థలో వెటర్నరీ సబ్ సెంటర్
● గొట్టిముక్కలలో భయంగా విధులు నిర్వహిస్తున్న పశువైద్యులు ● నూతన భవనం మంజూరు చేయాలని వినతిమాక్లూర్ : మండలంలోని గొట్టిముక్కల వెటర్నరీ సబ్సెంటర్ శిథిలావస్థకు చేరింది. ఏళ్లు గడుస్తున్న పాలకులు పట్టించుకోవడంలేదు. సబ్సెంటర్ ఎప్పుడు కూలుతుందో తెలియని దుస్థితిలో ఉండటంతో పశువైద్యులు భయం భయంగా విధులు నిర్వహిస్తున్నారు. సమీపంలోని 10 గ్రామాల రైతులు తమ పశువులను వైద్యం కోసం ఇక్కడికే తీసుకువస్తారు. ఈసబ్సెంటర్లో జూనియర్ పశువైద్యులు కల్యాణి, ఆఫీస్ సబార్డినేట్ శ్యామలలు పశువులకు వైద్యం అందిస్తున్నారు. సబ్సెంటర్ చుట్టూ పెద్ద చెట్లు, ముళ్లపొదలు, గడ్డిపెరిగిపోయి పాములు వస్తున్నాయి. గ్రామంలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో మురుగునీరు వచ్చి ఆస్పత్రి ప్రాంగణంలో నిలుస్తోంది. దీంతో దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని పశువైద్య సిబ్బంది వాపోతున్నారు. వర్షకాలంలో మరిన్ని ఇబ్బందులు పడాల్సి ఉంటుందని పశువైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు స్పందించి నూతన భవనం లేదా ఉన్న భవనానికి మరమ్మతులు చేయించాలని స్థానిక రైతులు, పశుపెంపకందారులు కోరుతున్నారు.కొత్త భవనం నిర్మించాలి సబ్సెంటర్ శిథిలావస్థకు చేరింది. నూతన భవనం నిర్మించడానికి ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి నిధులు మంజూరు చేయించాలి. నూతన భవనం నిర్మించాలి. – గంగాధర్, రైతు, రాంపూర్ -
కాన్షీరాం అడుగుజాడల్లో నడవాలి
నిజామాబాద్ నాగారం : బహుజనులు కాన్షీరాం అడుగుజాడల్లో నడవాలని రూరల్ నియోజకవర్గ బీఎస్పీ ఇన్చార్జి నీరడి లక్ష్మణ్ పేర్కొన్నారు. సోమవారం ఆర్అండ్బీ అతిథి గృహంలో నిర్వహించిన బహుజన సమాజ్వాదీ పార్టీ నిజామాబాద్ మండల కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రూరల్ నియోజకవర్గం లో పార్టీని బలోపేతం చేయడానికి మండల కమిటీలు, గ్రామ కమిటీలు, సెక్టార్ కమిటీలు, బూత్ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అధ్యక్షులు పోతే ప్రవీణ్, నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి సున్నం నరేష్, నియోజకవర్గం కార్యదర్శి ప్రభుదాస్, నిజామాబాద్ మండల అధ్యక్షులు గడ్డం రవి, బీఎస్పీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
మహిళ ఫిర్యాదుపై స్పందించిన సీపీ
ఖలీల్వాడి: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం గేటు వద్ద ఓ మహిళ ఉండగా, సీపీ గమనించి ఆమె వద్దకు వచ్చి సమస్యను అడిగి తెలుసుకున్నారు. నగరంలోని రెండో పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన భామని సవి త తన సమస్యను విన్నవించడానికి సోమ వారం సీపీ కార్యాలయానికి వచ్చి గేటు వద్దనే వేచిఉంది. గమనించిన సీపీ సాయిచైతన్య ఆమె వద్దకు వచ్చి సమస్యను అడిగి తె లుసుకున్నారు. అదనపు కట్నం కోసం తన ను భర్త వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె సీపీకి తెలిపింది. సీసీ స్పందించి, సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని మహిళా పోలీస్ స్టేషన్కు ఆదేశాలు జారీ చేశారు. నిలకడగా ఎస్సారెస్పీ నీటి మట్టం బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఇన్ఫ్లో, ప్రాజెక్ట్ నుంచి ఔట్ఫ్లో సమానంగా ఉండటంతో ప్రాజెక్ట్ నీటి మట్టం నిలకడగా ఉంది. ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి 608 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 100 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231, ఆవిరి రూపంలో 277 క్యూసెక్కుల నీరుపోతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో 1068.60(21.02 టీఎంసీలు) అడుగుల నీటి నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొన్నారు. ఖర్గేకు శుభాకాంక్షలు తెలిపిన షబ్బీర్ అలీ కామారెడ్డి టౌన్ : అఖిల భారత కాంగ్రెస్ క మిటీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జన్మదిన శుభాకాంక్ష లు తెలిపారు. ఖర్గేను సోమవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో షబ్బీర్ మర్యాదపూర్వ కంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగు చ్ఛం అందజేశారు. -
నీరు నిల్వ ఉండకుండా చూడాలి
డిచ్పల్లి: వానకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని మండల వైద్యాధికారిణి డాక్టర్ క్రిస్టినా సూచించారు. ఇందల్వాయి పీహెచ్ సీ ఆధ్వర్యంలో సోమవారం నడిపల్లి తండాలో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు. జ్వరానికి సంబంధించి రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేశారు. తండాలో ఇంటింటికి తిరిగి నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి నీటిని తొలగించారు. ఈ సందర్భంగా డాక్టర్ క్రిస్టినా మాట్లాడుతూ.. నీరు నిల్వ ఉంటే దోమలు పెరిగి తద్వారా మలేరియా, డెంగీ, చికున్ గున్యా, ఫైలేరియా, మెదపువాపు తదితర వ్యాధులు వ్యాపిస్తాయన్నారు. దోమలను నివారించేందుకు నిల్వ ఉన్న నీటిని తొలగించి ఇళ్ల చుట్టూ, పరిసర ప్రాంతాల్లో డెమో పాస్ స్ప్రే చేశామన్నారు. ఆశాకార్యకర్తలు అన్ని గ్రామాల్లో జ్వర సర్వే నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో శ్రీనివాస్ గౌడ్, ఆరోగ్య విస్తీర్ణాధికారి శంకర్, పంచాయతీ కార్యదర్శి జయశ్రీ, ఆరోగ్య పర్యవేక్షకులు అక్బర్అలీ, ఆరోగ్య కార్యకర్తలు వెంకట్ రెడ్డి, సుజాత, శోభ, మహాలక్ష్మీ, ఆశా కార్యకర్తలు సునీత, లత, విజయ తదితరులున్నారు. -
అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తాం
ఇందల్వాయి: అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి అన్నారు. మండలంలోని తిర్మన్పల్లి గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 23,177 నూతన కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు లు ఇవ్వకుండా పేదలను మోసం చేసిందని విమర్శించారు. రేషన్ కార్డుల కోసం దళారులను ఆశ్రయించి డబ్బులు ఇవ్వవద్దని, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే పారదర్శకంగా విచారణ చేసి కార్డులు జారీ చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జరుగుతుండటమే నిదర్శనమన్నారు. కార్యక్రమంలో డీసీవో శ్రీనివాస్, తహసీల్దార్ వెంకట్రావు, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్ గౌడ్, ఇమ్మడి గోపి, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హడలెత్తిస్తున్న శునకాలు
నిజామాబాద్ సిటీ: బల్దియా పరిధిలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రజలను హడలెత్తిస్తున్నాయి. నగరంలో 20 వేల వరకు శునకాలున్నాయి. ఏబీసీ సెంటర్ నెలకొల్పినా అది నామమాత్రంగానే పనిచేస్తోంది. ప్రతి రోజు వీధుల్లో హల్చల్ చేస్తున్న కుక్కల్ని పట్టి వాటికి కు.ని. చేయాలి. కానీ, శానిటేషన్ అధికారులు ఆ ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వెంటనే వాక్సిన్ వేయించాలి.. కుక్కలు కాటువేసినా, గీరినా, వాటిగోళ్లు మన చర్మం మీద పడి రక్తం వచ్చినా వెంటనే ఏఆర్బీ వాక్సీన్ (యాంటీ రేబిస్ వాక్సిన్) వేయించాలి. ప్రభుత్వ ఆస్పత్రిలో నాలుగుసార్లు ఈవాక్సిన్ ఉచితంగా వేస్తారు. సరియైన చికిత్స తీసుకోకుంటే ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడే ప్రమాదముంది. ఏబీసీ సెంటర్.. బల్దియా అధికారులు కుక్కల నియంత్రణకు యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) సెంటర్ను ఏర్పాటుచేశారు. దానికి శానిటరి ఇన్స్పెక్టర్ సాల్మన్రాజును ఇన్చార్జిగా నియమించారు. కుక్కలను బంధించే పనులను బజ్రంగ్ జవాన్కు అప్పగించారు. ప్రతి రోజు కుక్కలను బంధించి తీసుకువచ్చి వాటికి సంతానం కలగకుండా కుటుంబ నియంత్రణచేయడంలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు. కు.ని కోసం ఓ ఏజెన్సీ టెండర్లు దక్కించుకుంది. కు.ని కార్యక్రమం మాత్రం సాఫీగా సాగడం లేదు. ఇప్పటివరకు వెయ్యికి పైగా కుక్కలకు కు.ని చేసినట్లు లెక్కల్లో ఉన్నా.. చాలా వాటికి కు.ని చేయలేదనే ఆరోపణలున్నాయి. సాయినగర్లో తిరుగుతున్న కుక్కలు వెంటపడుతున్నాయి డ్యూటీ ముగించుకుని ఇంటకి వస్తుంటే కుక్కలు వెంటపడుతున్నాయి. గుంపులు గుంపులుగా రావడంతో కొన్నిసార్లు భయం అవుతోంది. బల్దియా అధికారులు వీధి కుక్కలను తీసుకెళ్లాలి. టోల్ఫ్రీ నెంబర్ ఇస్తే చాలా మంది ఫోన్లు చేసి సమాచారం అందిస్తారు. – గట్ల రాజు, శివాజీనగర్ త్వరలోనే ఏబీసీని పునరుద్ధరిస్తాం కుక్కలను పట్టే కార్యక్రమం సాఫీగా సాగుతోంది. రోజు రాత్రి రెండు బృందాలు వెళ్లి కుక్కలను పట్టుకొస్తున్నాయి. జవాన్ బజ్రంగ్ ఈ పనులు పర్యవేక్షిస్తున్నారు. కుక్క కరిచినా, వాటిగోళ్లు మనకు పడినా వెంటనే వా క్సిన్ తీసుకోవాలి. అశ్రద్ధఽ చేయవద్దు. – సాల్మన్రాజు, శానిటరి ఇన్స్పెక్టర్, ఏబీసీ ఇన్చార్జి నగరంలో గుంపులుగా తిరుగుతున్న పరిస్థితి రాత్రివేళ వెంటపడటంతో ప్రమాదాలబారిన పడుతున్న వాహనదారులు సాఫీగా సాగని కుక్కల పట్టివేత దృష్టిసారించని బల్దియా అధికారులు -
తెలంగాణ సంస్కృతికి నిదర్శనం బోనాలు
నిజామాబాద్ సిటీ : నగరంలోని బహుజన కాలనీలో బండ పోచమ్మ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. సోమవారం నిర్వహించిన ఈ వేడుకలకు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, నుడా చైర్మన్ కేశ వేణు హాజరయ్యారు. బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ట్రానన్స్జెండర్స్ అసోసియేషన్ నాయకులు గంగ, జరీనా, రక్షలు బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. బోనాల ఊరేగింపు సందర్భంగా జోగిని సుచిత్ర విన్యాసాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా నుడా చైర్మన్ కేశ వేణు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి బోనాలు నిదర్శనమన్నారు. ఆషాఢమాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడం ద్వారా ప్రజలు సుఖశాంతులతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు రామర్తి గోపికృష్ణ, వేణురాజ్, పార్థసారథి, రాజేష్, మల్యాల గోవర్ధన్లతోపాటు బహుజన కాలనీవాసులు గంగ, జరీనా, రక్ష, మారుతి, అలీ, లక్ష్మీ, షాదుల్ ఖాన్లు పాల్గొన్నారు. -
ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలి
నిజామాబాద్ సిటీ : అమెరికా యుద్ధోన్మాదం మానవాళికి చాలా ప్రమాదకరమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు అబ్బాస్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. యుద్ధోన్మాదుల చర్యలను ప్రతిఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ఇటీవల సంగారెడ్డి వద్ద సిగాచీ పరిశ్రమలో చోటుచేసుకున్న ప్రమాదంలో కార్మికుల కుటుంబాలు రోడ్డునపడ్డాయన్నారు. ఆన్ స్కిల్డ్ కార్మికులతో పనులు చేయించడం దుర్మార్గమన్నారు. ప్రజా ఉద్యమాలకు శ్రీకా రం చుట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలను చైతన్యంచేసి నడిపించేందుకు నిరంతరం అధ్యయనం చేస్తుండాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు రమేష్ బాబు, పెద్దివెంకట్రములు, నూర్జహాన్, పల్లపు వెంకటేశ్, శంకర్ గౌడ్, జంగం గంగాధర్, నన్నేసాబ్, కొండ గంగాధర్, సుజాత, విఘ్నేష్ పాల్గొన్నారు. -
గురువులు మార్గదర్శకులు
నిజామాబాద్ రూరల్ : నగరంలోని సంస్కార భారతి ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలలో సోమవారం ఘనంగా గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గురువులను, కళాకారులను సన్మానించారు. అనంతరం జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డిరాజిరెడ్డి మాట్లాడుతూ ప్రతి మనిషికి మార్గదర్శకులుగా గురువులు ఉంటారని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల తీర్మానాన్ని స్వాగతిస్తున్నాం నిజామాబాద్ అర్బన్ : బీసీ రిజర్వేషన్లపై తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని, ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్ల పెంపు అభినందనీయమని బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు మాడవీటి వినోద్ కుమార్ అన్నారు. సోమవారం నగరంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీలు పోరాటం చేస్తేనే ఫలితం దక్కిందన్నారు. ఆగస్టు 7న గోవాలో 10,000 మంది బీసీ ప్రతినిధులతో ఓబీసీ మహాసభ నిర్వహిస్తున్నారని, ఈసభలో బీసీలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, అసోసియేటెడ్ అధ్యక్షులు మోహన్, గౌరవాధ్యక్షులు బాబు తదితరులు పాల్గొన్నారు. -
మత్తుపదార్థాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
నవీపేట: నవీపేట పోలీస్ స్టేషన్ను సీపీ సాయి చైతన్య సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. కంప్యూటర్ సెక్షన్, వాహనాల పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటుపై వీడీసీలకు అవగాహన కల్పించాలని నార్త్రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై వినయ్లకు సూచించారు. గ్రామ పోలీస్ అధికారులు విధులను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. గంజాయి, మత్తుపదార్థాలపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. -
వసతి గృహాలు, గురుకులాల్లో అభద్రతా భావం
ఇన్చార్జి బాధ్యతలతో ఇక్కట్లు ఒక్క వార్డెన్ రెండు కంటే ఎక్కువ వసతి గృహాలకు ఇన్చార్జిగా ఉంచడం వల్ల కూడా పర్యవేక్షణ లోపిస్తోంది. ప్రస్తుతం అర్గుల్ వసతిగృహం అధికారి భీంగల్ వసతిగృహం ఇన్చార్జిగా కొనసాగిస్తున్నారు. ఇతను ఈ రెండు ప్రాంతాలను సమన్వయం చేసుకొని వెళ్లిరావడం ఇబ్బందికరంగా ఉండడంతో సక్రమంగా విధులు నిర్వహించలేకపోతున్నారు. ఆర్మూర్లో ఇద్దరు వార్డెన్లు ఒక్కొక్కరు మూడు చొప్పున వసతి గృహాలకు ఇన్చార్జులుగా కొనసాగుతున్నారు. జిల్లా కేంద్రంలోనూ ఇద్దరు వార్డెన్లు రెండేసి వసతి గృహాలకు ఇన్చార్జి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. దీనివల్ల ఇరువైపులా పర్యవేక్షణ చేయకలేక ఇబ్బంది పడుతున్నారు. దాడులు.. ర్యాగింగ్లు.. ఆత్మహత్యలు.. ● తరుచూ చోటుచేసుకుంటున్న ఘటనలు ● విద్యార్థులపై కొరవడిన పర్యవేక్షణ ● ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల క్షేమం, భద్రత కన్నా, ప్రమాదకర పరిస్థితులే చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడమే కాకుండా మానసిక ఒత్తిడి, ర్యాగింగ్ వల్ల ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు దాపురిస్తున్నాయి. నిత్యం పర్యవేక్షణ చేయాల్సిన వార్డెన్లు, అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యహరించడంతోనే ఇలాంటి పరిస్థితి నెలకొందని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు పేర్కొంటున్నారు. నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ వసతి గృహాలు, గురుకుల విద్యాలయాలతో పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతోంది. అయితే అక్కడక్కడా చోటుచేసుకుంటున్న అవాంఛనీయ ఘటనలతో విద్యార్థుల్లో అభద్రతాభావం నెలకొంటోంది. విద్యాబోధన, పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు గొడవలు పడుతూ ప్రాణాలు తీసుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో వసతి గృహ అధికారులపై దాడులు చేసిన ఘటనలు జిల్లాలో వెలుగుచూస్తున్నాయి. వీటన్నింటికీ వసతి గృహాలపై సరైన పర్యవేక్షణ లేకపోవడం, సంబంధిత అధికారులు స్థానికంగా ఉండకపోవడమే ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. అందుబాటులో ఉండని వార్డెన్లు జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు పూర్తిగా అదుపుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు వసతి కల్పించి విద్యాబోధన అందించడం వీటి ముఖ్య ఉద్దేశం. కాగా ప్రస్తుతం వీటి నిర్వహణ తీరు అనేక విమర్శలకు దారితీస్తోంది. చాలా ప్రాంతాలలో వార్డెన్లు నిత్యం అందుబాటులో ఉండక, హాస్టల్లోని సీనియర్ వంటమనిషి లేదా సీనియర్ విద్యార్థికి బాధ్యతలు అప్పజెప్తూ గైర్హాజరవుతున్నారు. అలాగే జిల్లాలోని గురుకుల విద్యాలయాల్లో పర్యవేక్షణ లేక ర్యాగింగ్లు, జూనియర్ విద్యార్థులను సీనియర్లు వేధింపులకు గురిచేయడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. -
కరుణించవా.. వరుణదేవా
మోర్తాడ్(బాల్కొండ): ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటున్నా.. వర్షం కురిపించడంలో వరుణదేవుడు దోబుచులాడుతున్నాడు. చినుకు జాడ లేక పంట భూములు తడారి పోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరుణుడి కరుణ కోసం వివిధ గ్రామాలలో ప్రజలు గ్రామ దేవతలు, ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దేవతా విగ్రహాలకు జలాభిషేకం చేస్తున్నారు. మరోవైపు జూన్ నెల నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 299 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 222 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 25 శాతం వర్షపాతం లోటు ఉందని వాతావరణ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇంకిపోతున్న బోరుబావులు వర్షాలు సమృద్ధిగా కురువకపోవడంతో భూగర్భ జ లాలు ఇంకిపోతున్నాయి. ఫలితంగా బోరుబావుల నుంచి గతంలో మాదిరి నీరు రావడం లేదు. చాలా చోట్ల కొత్త బోరుబావులు తవ్వించే పరిస్థితి ఉంది. అల్పపీడనం వంటిది ఏర్పడితే తప్ప భారీ వర్షాలకు అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.4.59లక్షల ఎకరాల్లో సాగు వాతావరణం అనుకూలంగా ఉంటుందనే నమ్మకంతో రైతులు జిల్లా వ్యాప్తంగా 4,59,865 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. ఇందులో వరి 3.26లక్షలు, మొక్కజొన్న 47వేలు, సోయా 32వేలు, పసుపు 23వేల ఎకరాల్లో సాగు అవుతుంది. ఆయిల్పాం 11వందల ఎకరాలు, ఇతర రకాల పంటలు 30వేల ఎకరాల్లో సాగవుతున్నాయి. గత సీజన్ కంటే ఈసారి వరి సాగు విస్తీర్ణం 79వేల ఎకరాలు పెరిగింది. ముందస్తు వర్షాలు కురువడంతో వరి సాగుకు ఆసక్తి చూపిన రైతులు.. ప్రస్తుతం వర్షాలు లేక ఆకాశం వైపు చూస్తున్నారు. మురిపిస్తున్న మేఘాలు.. కురవని వర్షాలు సాగునీటి కోసం రైతుల ఇబ్బందులు పంటల రక్షణకు తంటాలు వర్షాల కోసం ఆలయాల్లో పూజలు -
యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి
ఆర్మూర్టౌన్: యువత చెడు వ్యసనాలు వీడి మంచి మార్గంలో నడవాలని స్వేరోస్ చైర్మన్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్హాల్ ఉమ్మడి జిల్లా స్వేరోస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు వైపు వెళుతున్న ఈ రోజుల్లో మనం కూడా వాటిని అందిపుచ్చుకొని గొప్పస్థాయికి రావాలని విద్యార్థులకు సూచించారు. ఆరోగ్య పరిరక్షణపై చిట్కాలు, ఆత్మహత్య నివారణ, అక్షరం, ఆర్థికం, ఆరోగ్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్వేరోస్ చీఫ్ కన్వీనర్ బలుగురి దుర్గయ్య, వైస్ చైర్మన్ బాలప్రసాద్, స్వేరోస్ రాష్ట్ర అధ్యక్షుడు వీరయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయి, దేవన్న, జైపాల్, లక్ష్మణ్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు. -
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి
● డీఎంహెచ్వో రాజశ్రీ మోపాల్(నిజామాబాద్రూరల్) : ప్రజలు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని డీఎంహెచ్వో రాజశ్రీ సూచించారు. మండలంలోని కాల్పోల్ గ్రామాన్ని ఆదివారం ఆమె సందర్శించారు. డెంగీ కేసులు నమోదైన నేపథ్యంలో రెండో రోజు కొనసాగుతున్న వైద్యశిబిరాన్ని పరిశీలించారు. ప్రజల ఆరోగ్యం కుదుటపడే వరకు వైద్య శిబిరం కొనసాగుతుందని ఆమె తెలిపారు. అనంతరం గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పాటించాల్సిన జాగ్రత్తలను ప్రజలకు సూచించారు. దోమల లార్వా నిర్మూలనకు మందులను పిచికారీ చేయాలని, డ్రై డే పాటించాలని పంచాయతీ, వైద్య సిబ్బందిని ఆదేశించారు. గ్రామంలో మురుగు కాల్వలు శుభ్రంగా ఉంచాలని, గుంతలను పూడ్చేయాలని సూచించారు. డీఎంహెచ్వో వెంట డీఎల్పీవో శ్రీనివాస్, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, ఎంపీవో కిరణ్కుమార్, వైద్యాధికారులు నాగరాజు, వెంకటేశ్, ప్రత్యూష, అజ్మల్ తదితరులు ఉన్నారు. ధాన్యం డబ్బుల కోసం రైతుల తిప్పలు ● వడ్ల వ్యాపారులపై కేసు నమోదు బోధన్రూరల్: దళారులను నమ్మి ధాన్యం అమ్మిన రైతులు డబ్బులు అందక తిప్పలు పడుతున్నారు. గత యాసంగి సీజన్లో బోధన్ మండలం రాంపూర్, కల్దుర్కి, బండర్పల్లి, మావందికుర్దు, మావందికలాన్, సాలూర మండలం జాడిజమాల్పూర్ గ్రామాలకు చెందిన పలువురు రైతులు దళారుల ద్వారా నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారులు గౌర రాజేశ్, గౌర వెంకటేశ్వర్లుకు ధాన్యం విక్రయించారు. మొత్తం రూ.6.80 కోట్ల విలువజేసే ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారులు రైతులకు మొదట రూ.5.20 కోట్లు చెల్లించారు. మిగతా రూ.1.60 కోట్లు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఎన్నిసార్లు అడిగినా డబ్బులు చెల్లించకపోవడంతో రాంపూర్ గ్రామానికి చెందిన దేవదాస్ అనే రైతు బోధన్ రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అటవీ భూమి చదును చేసిన 17 మందిపై కేసు నిజామాబాద్ రూరల్: అటవీ భూమిని చదును చేసిన 17 మందిపై కేసులు నమోదు చేసినట్లు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో మహ్మద్ ఆరీఫ్ ఆదివారం తెలిపారు. మల్కాపూర్ తండా శివారులో శనివారం అటవీ భూమిని చదును చేసిన వారిపై కేసులు నమోదయ్యాయన్నారు. అటవీ ప్రాంతంలో ట్రాక్టర్ సహాయంతో 8 ఎకరాల భూమిని అక్రమంగా చదును చేస్తున్న విషయం తెలుసుకొని అటవీ సెక్షన్ అధికారి బాషిద్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లారని, అటవీ భూమిని చదును చేస్తున్న 17 మందిని పట్టుకొని స్టేషన్లో అప్పగించారన్నారు. అటవీ సంపదను కొల్లగొడితే కఠిన చర్యలు తప్పవని ఎస్హెచ్వో హెచ్చరించారు. -
కూల్చిందెవరు?
నేలమట్టమైన స్వచ్ఛభారత్ మరుగుదొడ్లు ఖలీల్వాడి: స్వచ్ఛభారత్ లక్ష్యం జిల్లా కేంద్రంలోనే నీరుగారుతోంది. బహిరంగ మల విసర్జన రహిత నగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నగరంలోని పలుచోట్ల సామూహిక మరుగుదొడ్లను నిర్మించారు. అయితే నిజామాబాద్ నగరంలోని పాములబస్తీలో నిర్మించిన సామూహిక మరుగుదొడ్లను కొందరు వ్యక్తులు కూల్చివేశారు. ఇదేమిటని స్థానికులు ప్రశ్నిస్తే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సరైన సమాధానం రావడం లేదు. కానీ స్థానికుల సౌకర్యార్థమని ప్రతిరోజూ మొబైల్ టాయిలెట్ను తీసుకొచ్చి నిలుపుతున్నారు. సామూహిక మరుగుదొడ్లను అసలు ఎందుకు కూల్చివేశారో అర్థం కావడం లేదని కొందరు వాపోతుండగా, స్థానికంగా ఓ కార్పొరేట్ కళాశాల ఏర్పాటు కానుండడమే కూల్చివేతకు కారణమని మరికొందరు ఆరోపిస్తున్నారు. స్వచ్ఛభారత్ ద్వారా కేటాయించిన నిధులతో నిజామాబాద్ నగరంలో సామూహిక మరుగుదొడ్లను నిర్మించారు. పాములబస్తీలో 90 నుంచి 100 కుటుంబాలకు చెందిన సుమారు 300 మందికి ఈ సామూహిక మరుగుదొడ్లే దిక్కు. సామూహిక మరుగుదొడ్లు నిర్మించిన తరువాత ఈ ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణ చాలా వరకు మెరుగుపడిందని అంతా అనుకున్నారు. కానీ ఇటీవల సామూహిక మరుగుదొడ్లను కొందరు వ్యక్తులు కూల్చివేశారు. వాటిని మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల అనుమతితో కూల్చారా లేక ప్రైవేట్ వ్యక్తుల పనా అనేది తేలలేదు. నాటి నుంచి స్థానికులు మలవిసర్జనకు ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడ్డారు. దీనిపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల వద్దకు వెళ్లి తాము ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దాటవేసి మొబైల్ టాయిలెట్ తీసుకువచ్చి జిల్లా పరిషత్ వద్ద మెయిన్రోడ్డుపై నిలుపుతున్నారని స్థానికులు అంటున్నారు. మహిళలు, ఆడ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు మొబైల్ టాయిలెట్ ఉంటోందని, సాయంత్రం తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో అధికారులకే అర్థం కావాలని అంటున్నారు. ఆ రోజుల్లో మొబైల్ టాయిలెట్ కనిపించదు జిల్లా కేంద్రం కావడంతో నగరానికి వీఐపీల రాకపోకలు, పెద్ద కార్యక్రమాల నిర్వహణ మామూలే. దీంతో మొబైల్ టాయిల్ వాహనాన్ని కార్యక్రమాలు నిర్వహించే ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. ఆ రోజు ల్లో పాములబస్తీవాసులకు మొబైల్ టాయిలెట్ వాహనం అందుబాటులో ఉండడం లేదు.మరుగుదొడ్లను నిర్మించాలి ప్రైవేట్ కాలేజీ కోసం భవనం నిర్మిస్తున్న వారిని మ రుగుదొడ్లను కూల్చివేతపై నిలదీస్తే మొబైల్ టాయిలెట్ వస్తోంది కదా అని అంటున్నారు. కొన్ని సంద ర్భాల్లో మొబైల్ టాయిలైట్ వాహనం రాకపోవడంతో మహిళలు, యువతులు ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో సామూహిక మరుగుదొడ్లను య థావిధిగా నిర్మించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – లక్ష్మణ్సింగ్, పాములబస్తీకలెక్టర్ చొరవ చూపాలి స్వచ్ఛ భారత్ మరుగుదొడ్లను కాలనీవాసులందరం ఉపయోగించుకునేవారిమి. వాటిని కూల్చివేయడంతో ఇబ్బందిగా మారింది. మహిళలు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు, నాయకులను కలిసినా ఎవరూ స్పందించడం లేదు. కలెక్టర్ స్పందించి సామూహిక మరుగుదొడ్లు నిర్మించేలా కృషి చేయాలి. – మహేందర్సింగ్, పాములబస్తీఆ కార్పొరేట్ కళాశాల కోసమేనా?ఓ కార్పొరేట్ కళాశాల కోసం భవన నిర్మాణ పనులు పాములబస్తీలో కొనసాగుతున్నాయి. అయితే భవన నిర్మాణం కొనసాగుతున్న ప్రాంతంలోనే సామూహిక మరుగుదొడ్లు ఉండడంతో వాటిని కూల్చివేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మరుగుదొడ్లను కూలుస్తున్న సమయంలో స్థానికులు కొందరు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. దీంతో మున్సిపల్ అధికారులు, వివిధ పార్టీల నాయకుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదు. కళాశాల కోసం నిర్మిస్తున్న భవనం వద్దకు కాలనీ వాసులు వెళ్లి నిలదీశారు. జిల్లా కేంద్రంలోని పాములబస్తీలో సామూహిక మరుగుదొడ్లు నేలమట్టం మహిళలు, యువతులకు ఆత్మగౌరవం అందించడం ఇలాగేనా..? నీరుగారుతున్న స్వచ్ఛ భారత్ లక్ష్యం కార్పొరేట్ కాలేజీ కోసమేనని స్థానికుల ఆరోపణ తీవ్ర ఇబ్బందులు పడుతున్న సుమారు 300 మంది పట్టించుకోని మున్సిపల్ అధికారులు తాత్కాలికంగా మొబైల్ టాయిలెట్ ఏర్పాటు -
ఇందిరమ్మ ఇళ్లకు ఐకేపీ రుణం
డొంకేశ్వర్(ఆర్మూర్) : ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోలేని స్థితిలో ఉన్న లబ్ధిదారులకు గ్రామీణాభివృద్ధి శాఖ రుణాలందించి ప్రోత్సహిస్తోంది. బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి పథకాల ద్వారా కావాల్సినంత రుణం ఇచ్చి మహిళలకు ఆర్థిక తోడ్పాటును అందిస్తోంది. దీంతో జిల్లాలోని పలు మండలాల్లో ఇందిరమ్మ ఇళ్లను వారు ధైర్యంగా నిర్మించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతిళ్లు కల నెరవేర్చాలనే లక్ష్యంతో అర్హులను గుర్తించింది. ఇందులో మహిళలనే లబ్ధిదారులుగా చేసింది. ప్రభుత్వం రూపొందించిన నిబంధనల మేరకు ఇళ్లు నిర్మించుకునే వారికి రూ.5 లక్షలు విడతల వారీగా ఇస్తామని చెప్పడంతో చేతిలో డబ్బులున్న కొంతమంది నిర్మాణ పనులను ప్రారంభించారు. అయితే చేతిలో డబ్బుల్లేక చాలామంది ముగ్గు కూడా పోయడానికి ముందుకురాలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు లబ్ధిదారులకు ఐకేపీ ద్వారా రుణాలు అందించాలని అధికారులకు సూచించింది. లబ్ధిదారుల్లో 99శాతం మంది మహిళా సంఘంలో సభ్యులుగా ఉన్నారు. వీరికి బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి ద్వారా రుణాలు తీసుకునేలా మహిళలకు అవగాహన కల్పించి ప్రోత్సహించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1,927 మంది లబ్ధిదారులకు రూ.21.82 కోట్లకు పైగా రుణాలను అందజేసి ఇళ్ల నిర్మాణాలకు తోడ్పాటును అందించారు. రూ.50 వేల నుంచి రూ.3 లక్షల దాకా రుణాలు ఇచ్చారు. అత్యధికంగా సిరికొండలో 113 మందికి, కమ్మర్పల్లిలో 116 మందికి, నందిపేట్, ముప్కాల్, ఎడపల్లి, సిరికొండ, వేల్పూర్ మండలాల్లో కూడా వంద మందికి పైగానే రుణాలిచ్చారు. ఇందిరమ్మ ఇళ్లకు రుణాలివ్వడంతో బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి లక్ష్యాల సాధన కూడా తమకు సులభం అవుతోందని అధికారులు పేర్కొంటున్నారు.నియోజకవర్గం లబ్ధిదారులు పొందిన రుణాలు ఆర్మూర్ 346 3.77 బాల్కొండ 490 4.83 బాన్సువాడ 192 2.10 బోధన్ 370 4.76 నిజామాబాద్రూరల్ 529 6.36 మొత్తం 1,927 21.82నియోజకవర్గాల వారీగా అందించిన రుణాలు (కోట్లలో) బ్యాంకు లింకేజీ ద్వారా ఆర్థిక తోడ్పాటు జిల్లాలో 1,927మందికి రుణాలు మంజూరు -
వెలవెలబోతున్న వాగులు
ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడంతో వాగులు, వొర్రెలు నీరు లేక వెలవెలబోతున్నాయి. చెరువులలోనూ నీరు లేక సాగునీటిని అందించని దుస్థితి ఏర్పడింది. మే నెలలో వర్షాలు కురిసినా వేసవి తీవ్రతకు ఆ నీరు భూమిలో ఇంకలేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వర్షాకాలం ఆరంభమై 45 రోజులు గడచినా భారీ వర్షపాతం నమోదు కాకపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి తక్కువ వర్షాలే కురిశాయని తెలుస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సరైన ఇన్ఫ్లో లేకపోవడంతో నీటి విడుదల షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. షెడ్యూల్ ఖరారు చేసి ఉంటే లక్ష్మి కాలువ ద్వారా నీటి విడుదల జరిగేది. వేంపల్లి, చౌట్పల్లి హన్మంత్రెడ్డి ఎత్తిపోతల పథకాలకు సాగునీరు అందించేందుకు అవకాశం ఏర్పడేది. -
ఫోన్మిత్ర.. తల్లిదండ్రులకు నిశ్చింత
ఆర్మూర్ టౌన్: ఇంటికి దూరంగా ఉంటూ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాలలో చదివే వి ద్యార్థుల బెంగ తీరింది. తల్లిదండ్రులకు తమ పిల్ల లు ఎలా ఉన్నారన్న ఆందోళనా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో ‘ఫోన్ మిత్ర’ కార్యక్రమం ప్రారంభించింది. జిల్లాలోని తొమ్మిది సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఫోన్ మిత్ర సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా బాక్సులు.. జిల్లాలో ఆరు బాలికల, మూడు బాలుర సాంఘిక సంక్షేమ పాఠశాలలు, కళాశాలలు, సుమారు 5,500 మంది విద్యార్థులు చదువుతున్నారు. ‘ఫోన్ మి త్ర’ లో భాగంగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఫోన్ బాక్సులను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ల నుంచి తల్లిదండ్రులు, సంరక్షకులకు మాత్రమే కాల్స్ వెళ్లే లా స్మార్ట్కార్డులను తయారు చేశారు. స్మార్ట్ కార్డు ను ఫోన్ బాక్స్లో స్వైప్ చేసి విద్యారులు తమకు ఇచ్చిన సంఖ్యను నొక్కితే నేరుగా తల్లిదండ్రులకు కాల్ వెళ్తుంది. గురుకులంలో ఉన్న సమస్యలు, ఇ బ్బందులను నేరుగా అధికారులు, సొసైటీ కార్యాలయానికి తెలిపేందుకు ఇతర అంకెలను ఫోన్బాక్సులో పొందుపర్చారు. నలుగురు విద్యార్థులకో స్మార్ట్ కార్డును అందజేశారు. రోజులో 25 నిమిషా లపాటు మాట్లాడే వీలు కల్పించారు. దీంతో సులభంగా యోగక్షేమాలు తెలుసుకునే అవకాశం ఏర్పడింది. కాగా, ఇంటికి దూరంగా ఉన్న పిల్లల్లో మానసిక స్థైర్యం పెరుగుదలకు ఫోన్మిత్ర దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫోన్బాక్స్ ద్వారా తమ తల్లిదండ్రులతో మాట్లాడుతున్న విద్యార్థులు ఎస్సీ గురుకులాల్లో ఫోన్ బాక్సులు తల్లిదండ్రులతో మాట్లాడే వెసులుబాటు పిల్లల్లో మానసిక స్థైర్యం పెంపునకు దోహదం ఆరు ఫోన్ల ఏర్పాటు ఈ నెల మొదటివారంలో ‘ఫోన్మిత్ర’ ప్రారంభమైంది. 6 ఫోన్ బాక్సులు ఏర్పాటు చేశారు. ఫోన్ మిత్ర ద్వారా విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. బాగో గులు తెలుసుకుంటున్నారు. – జి.సుదర్శన్, ప్రిన్సిపల్, ఎస్సీ గురుకుల బాలుర పాఠశాల, వేల్పూర్ సంతోషంగా ఉంది.. ‘ఫోన్మిత్ర’ ద్వారా తలిదండ్రులతో మా ట్లాడటం సంతోషంగా ఉంది. గతంలో టీచర్లు, ఇతర విద్యార్థుల తల్లిదండ్రు ల ఫోన్లతో కుటుంబసభ్యులతో మాట్లాడేవాళ్లం. ఇప్పుడు రోజూ మాట్లాడే అవకాశం కల్పించారు. – రాజు, విద్యార్థి -
కొట్టుకుపోయిన తాత్కాలిక రోడ్డు
సిరికొండ: మండలంలోని గడ్కోల్ వద్ద కప్పలవాగుపై తాత్కాలికంగా వేసిన రోడ్డు వరద ప్రవాహానికి కొట్టుకు పోయింది. వాగుపై భారీ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 12 కోట్లు మంజూరు చేసింది. పనులు ప్రారంభించి ఏడాదిన్నర అవుతుండగా, పిల్లర్ల వరకు మాత్రమే పూర్తయింది. రాకపోకలకు వాగులో తాత్కాలికంగా మట్టిరోడ్డు వేశారు. శనివారం రాత్రి కురిసిన వర్షానికి వాగు ప్రవహించడంతో తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో గ్రామానికి భారీ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వాగు అవతల పంట పొలాలు ఉన్న రైతులు వంతెన వద్ద నిర్మించిన చెక్డ్యాం పైనుంచి రాకపోకలు సాగిస్తున్నారు. -
ఇసుక టిప్పర్ల పట్టివేత
రుద్రూర్: అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న మూడు ఇసుక టిప్పర్లను పట్టుకున్నట్లు తహసీల్దార్ గంగాధర్ తెలిపారు. రెవెన్యూ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం రాత్రి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పొతంగల్ శివారులో ఒక టిప్పర్, కోటగిరి మండలం వల్లాభాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద రెండు టిప్పర్లను పట్టుకొని కోటగిరి పీఎస్కు తరలించారు. రుద్రూర్: పొతంగల్ మండలం హెగ్డోలి గ్రామ శివారులో అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఆదివారం సాయంత్రం రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ఈ ట్రాక్టర్లను కోటగిరి పోలీస్స్టేషన్కు తరలించినట్లు తహసీల్దార్ గంగాధర్ పేర్కొన్నారు. ఇసుక డంపు స్వాధీనం పొతంగల్ మండలం సోంపూర్ శివారులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపును రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఇసుక 15 ట్రాక్టర్ల వరకు ఉంటుందని తహసీల్దార్ గంగాధర్ తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక తరలించిన, డంపు చేసిన కేసు నమోదు చేయడంతో పాటు వాహనాలు సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. -
అ‘పూర్వ’ సమ్మేళనం
కామారెడ్డి టౌన్/ భిక్కనూరు: జిల్లా కేంద్రంలోని ప్రగతి హైస్కూల్లో పదో తరగతి చదివిన 1996–97 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అలాగే గర్గుల్ ఉన్నత పాఠశాల 1980–81 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం చేపట్టారు. చిన్ననాటి స్నేహితులు ఒకేచోట చేరడంతో సంతోషం వ్యక్తం చేశారు. భిక్కనూరు మండలంలోని పెద్దమల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1990–91 పదో తరగతి పూర్వ విద్యార్థులు సమ్మేళనం నిర్వహించారు. నాటి గురువులను సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, గురువులు పాల్గొన్నారు. గర్గుల్ 1980–81 పూర్వ విద్యార్థులు పెద్దమల్లారెడ్డిలో 1990–91 పూర్వ విద్యార్థులు -
బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని కలుషితం చేయొద్దు
డొంకేశ్వర్: పచ్చికబయళ్లతో ఆహ్లాదాన్ని పంచుతున్న ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని ప్లాస్టిక్ వ్యర్థాలతో కలుషితం చేయొద్దని ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్లైఫ్ సొసైటీ ప్రతినిధులు పర్యాటకులను కోరారు. ఆదివారం నవ్యభారతి గ్లోబాల్ స్కూల్ విద్యార్థులతో కలిసి డొంకేశ్వర్ మండలం చిన్నయానం బ్యాక్ వాటర్ వద్ద పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. బ్యాక్ వాటర్ ప్రాంతానికి సందర్శకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని, ప్లాస్టిక్ వ్యర్థాలు, మద్యం సీసాలతో ప్రకృతిని పాడు చేయొద్దని కోరారు. ఈ సందర్భంగా చెత్త డబ్బాల ద్వారా చెత్తను సేకరించారు. పర్యాటకులకు ట్రాష్ బ్యాగులు అందజేసి అందులో వేయాలని సూచించారు. మాజీ ఎంపీటీసీ చిన్నారెడ్డి, సొసైటీ కార్యదర్శి సంతోష్ కుమార్, హీతెన్ భీమాని, స్కూల్ ప్రిన్సిపాల్ ఆంతోని, విద్యార్థులు పాల్గొన్నారు. సాహిత్యంలో వరలక్ష్మికి డాక్టరేట్ డొంకేశ్వర్(ఆర్మూర్): సాహిత్యంలో రాణిస్తున్న డొంకేశ్వర్ మండలం తొండాకూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సీహెచ్ వరలక్ష్మికి డాక్టరేట్ లభించింది. కరీంనగర్లో ఆదివారం జరిగిన జాతీయస్థాయి భారత్ విభూషణ్–2025 అవార్డుల ప్రదానోత్సవంలో డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ డాక్టరేట్ను అందజేసింది. డాక్టరేట్ను అందజేసి ప్రోత్సహించిన యూనివర్సిటీకి ఈ సందర్భంగా వరలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. నిధులు మంజూరు చేయండిమోర్తాడ్: బాల్కొండ నియోజకవర్గంలో అత్యవసరంగా చేపట్టబోయే పనులకు నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్రెడ్డిని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి సునీల్రెడ్డి కోరారు. సీఎం హైదరాబాద్లోని తన నివాసంలో సునీల్రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని మండలాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని జాబితా అందించారు. దీనికి స్పందించిన సీఎం నిధుల మంజూరుకు హామీ ఇచ్చారు -
కార్యకర్తలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
నిజామాబాద్ రూరల్: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. గూపన్పల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లింగన్న అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. సాయంత్రం నిర్వహించిన ఆయన అంత్యక్రియలకు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్గౌడ్ హాజరై పాడె మోశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. లింగన్న అకాల మృతి పార్టీకి తీరని లోటు అని ఎమ్మెల్యే అన్నారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు విశేష కృషి చేశారని ఎమ్మెల్యే అన్నారు. అంత్యక్రియల్లో పార్టీ జిల్లా నాయకులు బాగిర్తి బాగారెడ్డి, లింగం, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదుపుతప్పి బోల్తాపడిన లారీ పెద్దకొడప్గల్: మండలంలోని బేగంపూర్ చౌరస్తా సమీపంలోని జాతీయ రహదారిపై ఓ లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఆదివారం ఉదయం వేకువజామున హైదరాబాద్ నుంచి నాందేడ్ వైపు వెళ్తున్న లారీ బేగంపూర్ చౌరస్తాలో ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. నల్లా నీటిలో జలగలు నిజాంసాగర్(జుక్కల్): ఒడ్డేపల్లిలో నల్లా నీటిలో జలగలు వస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కుళాయిల ద్వారా జలగలు రావడంతో నీటిని తాగేది ఎలా అంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. రెండు రోజులుగా జలగలు వస్తున్నాయని పంచాయ తీ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి కుళాయి జలగలు రాకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
రైల్వే సేవలు ఒకే యాప్లో..
మీకు తెలుసా? ఖలీల్వాడి: గతంలో రైల్వేశాఖ ద్వారా అందిస్తున్న సేవల కోసం వివిధ యాప్లు అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు వాటిని తొలిగించి వాటి స్థానంలో రైల్ వన్ అనే యాప్ను రైల్వేశాఖ అందుబాటులోకి తెచ్చింది. జూలై 1 నుంచి ఈ యాప్ అమలులోకి వచ్చింది. ఈ యాప్లో రైలు టికెట్ రిజర్వేషన్ తోపాటు అన్ని రకాల టికెట్లను ఈ యాప్ ద్వారా పొందవచ్చు. రైళ్ల రాకపోకలకు సంబంధించిన వివరాలు, రైలు ఎక్కడున్నదనే అంశాలు స్పష్టంగా తెలుస్తుంది. రైలు సమయపాలన తోపాటు ఏ ఫ్లాట్ఫారంపై ఆగుతుంది, కోచ్ ఎక్కడ, పీఎన్ఆర్ స్థితి, రైలెక్కడ ప్రయాణిస్తుందో.. రైలు రిజర్వేషన్ రద్దు లాంటి తదితర అంశాలు అన్నీ ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. రైలులో ప్రయాణం చేసేటప్పుడు అవసరమైతే ఫుడ్ను ఆర్డర్ చేసుకుంటే మనం ప్రయాణిస్తున్న స్థానానికి తీసుకొచ్చి ఇస్తారు. ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్ ద్వారా, ఐవోస్ యాపిల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెయిల్ ఐడీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని పాస్వర్డ్ పెట్టుకోవడం ద్వారా వినియోగించుకోవచ్చు. -
గంజాయి పట్టివేత
బోధన్ టౌన్: పట్టణంలోని ఆచన్పల్లి బైపాస్రోడ్లో ఆదివారం రాత్రి కార్తిక్ అనే యువకుడి నుంచి 19 గ్రాముల గంజాయిని పట్టుకున్నట్లు బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు. బైపాస్ రోడ్లో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడి చేశామన్నారు. యువకుడి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకొని విచారించగా రెంజల్ బేస్ ప్రాంతంలో ఉండే ఓ వ్యక్తి నుంచి గంజాయిని కొనుగోలు చేశాడన్నారు. యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. వృద్ధుడి అదృశ్యం ఖలీల్వాడి: నగరంలోని శివాజీనగర్కు చెందిన దాసరికిషన్(60) అనే వృద్ధుడు అదృశ్యమైనట్లు రెండో టౌన్ ఎస్సై సయ్యద్ ముజాహిద్ ఆదివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. శివాజీనగర్కు చెందిన దాసరి కిషన్ ఈనెల 18న మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలు చోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. కిషన్ కుమారుడు బాలకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ముళ్లపొదల్లో మోడల్రూం..!
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద కాకతీయ కాలువ దిగువన, గోదావరి గట్టున నిర్మించిన మోడల్ రూం ముళ్లపొదల్లో మగ్గుతోంది. భవిష్యత్తు తరాలకు ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వివరించుట కోసం దీనిని నిర్మించారు. ప్రస్తుతం దీనిని పట్టించుకునే ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ మోడల్ రూంను ప్రాజెక్ట్ నిర్మాణ కాలంలోనే నాటి ప్రధాని జవహార్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. 1983లో భారీ వరదలు వచ్చిన సమయంలో మోడ ల్ కల చెదిరి పోయింది. అప్పటి వరకు ప్రాజెక్ట్ నిర్మాణ చిత్రపటాలను మోడల్ రూంలో భద్రపరిచారు. కానీ వరదలతో కొట్టుకుపోయే పరిస్థితి ఏర్ప డటంతో వాటిని అతిథి గృహం పక్కన వేరే గదిలోకి మార్చారు. నాటి నుంచి మోడల్ రూం ముళ్ల పొదల్లోనే ఉంటోంది. కొందరు ఆకతాయిలు భవ నం పై పిచ్చి పిచ్చి బొమ్మలు వేస్తూ రాతలు రాస్తున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతోంది. భవిష్యత్తు తరాలకు ప్రాజెక్ట్ చరిత్ర తెలియా లంటే మోడల్ రూంకు పూర్వ వైభవం తీసుకురావాలని పర్యాటకులు కోరుతున్నారు. ప్రా జెక్ట్ నిర్మాణ కాలంలోని చిత్ర పటాలను మళ్లీ మో డల్ రూంకు తరలిస్తే భవిష్యత్తు తరాలకు ప్రాజెక్ట్ గురించి కొంత మేర తెలిసే అవకాశం ఉంటుంది. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ముళ్ల పొదలను తొలిగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్తో పాటే నిర్మాణం పట్టించుకోని అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం మోడల్ రూం పునరుద్ధరణకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ముళ్ల పొదలను వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. మోడల్ రూం పూర్వ వైభవం తీసుకురావాడానికి కృషి చేస్తాం. – అక్తర్, ఏఈఈ, ప్రాజెక్ట్క్యాంప్, పోచంపాడ్ -
బోనమెత్తిన ఇందూరు
నిజామాబాద్ రూరల్/ నిజామాబాద్ సిటీ/ మోపాల్/ మాక్లూర్/ రుద్రూర్: ఇందూరులో బోనాల పండుగను ప్రజలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆషాఢమాసంలో చివరి ఆదివారం కావడంతో పల్లెల్లో, మండలాల్లో, జిల్లా కేంద్రంలో ఎటు చూసినా ప్రజలు బోనాలను ఎత్తుకొని స్థానిక అమ్మవార్లకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని కోటమైసమ్మ, చంద్రనగర్లో ఉన్న పుట్టమైసమ్మ ఆలయాల్లో స్థానికులు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోటగల్లిలో ఉన్న మైసమ్మవీధిలో భక్తులు ఊరేగించిన బోనాలు, నైవేద్యాలను అమ్మవారికి సమర్పించారు. నగరంలోని సిర్నాపల్లిగడిలోని పట్టణ గాండ్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు, నుడా చైర్మన్ కేశ వేణు పాల్గొన్నారు. బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు. మోపాల్ మండలం మంచిప్పలో గ్రామస్తులను బోనాల ఊరేగింపు చేపట్టారు. మాక్లూర్ మండల కేంద్రంలో గౌడ కులస్తులు బోనాల పండుగను నిర్వహించారు. రుద్రూర్ మండలం బొప్పాపూర్లో గ్రామస్తులను బోనాలతో ఊరేగించారు. స్థానిక గ్రామదేవలకు బోనాలను సమర్పించి పూజలు చేశారు. -
భూమి దక్కదేమోనని రైతు ఆత్మహత్య
కామారెడ్డి టౌన్: అప్పుల బాధతోపాటు భూమి కబ్జాకు గురైందన్న ఆవేదనతో ఓ రైతు సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. శాబ్ధిపూర్లో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రేకులపల్లి కృష్ణారెడ్డి(56)కి 26 గుంటల భూమి ఉంది. అయితే ఈ భూమిని గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కబ్జా చేశారు. సర్వే అధికారులు వచ్చి ఆ భూమి ముగ్గురు వ్యక్తుల కబ్జాలో ఉందని తేల్చారు. ఈ విషయంలో న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఓవైపు అప్పుల బాధలు.. మరోవైపు కబ్జాకు గురైన తన భూమి దక్కుతుందో లేదోనన్న ఆందోళనతో మానసికంగా కుంగిపోయాడు. శనివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు. సూసైడ్ నోట్లో.. రైతు కృష్ణారెడ్డి సూసైడ్ నోట్ రాశాడు. ఐదేళ్ల క్రితం రూ. 80 వేలు అప్పు తీసుకున్నానని, అది వడ్డీతో కలిపి రెట్టింపు అయ్యిందని తెలిపాడు. బాకీలు కట్టలేని పరిస్థితిలో ఉన్నానని, ఉన్న భూమి అమ్మి అప్పులు కడుదామంటే ముగ్గురు వ్యక్తులు(వారి పేర్లు రాశాడు) అమ్మనివ్వకుండా పోలీస్ స్టేషన్లో, కోర్టులో కేసు పెట్టారని పేర్కొన్నాడు. ఎస్సై, ఎస్పీ, తహసీల్దార్ దయతలచి తన కుటుంబానికి భూమి ఇప్పించాలని కోరాడు. భూమి గురించి భార్యతో రోజూ లొల్లి అవుతోందని, బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నాడు. తనను క్షమించాలని భార్య లక్ష్మిని సూసైడ్ నోట్లో కోరాడు. అప్పులు, భూ వివాదాలే కారణమని సూసైడ్ నోట్ శాబ్ధిపూర్లో ఘటన -
అధ్వానంగా గ్రామీణ రహదారులు
జక్రాన్పల్లి: మండలంలోని జక్రాన్పల్లి నుంచి నల్లగుట్ట తండాకు వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జక్రాన్పల్లి నుంచి నల్లగుట్ట తండాకు వెళ్లే రోడ్డులోనే మోడల్ స్కూల్, కేజీబీవీలు ఉన్నాయి. రోడ్డు బాగా లేకపోవడంతో మోడల్, కేజీబీవీలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోడల్ స్కూల్కు విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఆటోలోనే ప్రయాణిస్తుంటారు. కానీ రోడ్డు గుంతలమయంగా మారడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇరు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, నల్లగుట్ట తండావాసులు, అటువైపు పంట పొలాలు ఉన్న రైతులు అనేక అవస్థలు పడాల్సి వస్తోంది. వాహనదారులు ఈ రోడ్డు వెంట ప్రయాణించాలంటేనే జంకుతున్నారు. ఈ రోడ్డులో ఎక్కువగా మూలమలుపులు ఉండడంతో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గుంతలమయంగా మారిన జక్రాన్పల్లి–నల్లగుట్ట తండా రోడ్డు ఇబ్బందిపడుతున్న వాహనదారులు -
పాఠశాలల్లో వైభవంగా బోనాల పండుగ
మోపాల్: మండలంలోని సిర్పూర్, మంచిప్ప జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో శనివారం బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. మంచిప్పలో జెడ్పీహెచ్ఎస్ నుంచి బోనాలను పెద్దమ్మ గుడి వరకు ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. అలాగే సిర్పూర్లో పిల్లలు బోనాలు, మంగళహారతులతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కలు చెల్లించారు. కార్యక్రమాల్లో హెచ్ఎంలు సత్యనారాయణ, బి సాయిలు, ఉపాధ్యాయులు శ్రావణి, అపర్ణ, సంధ్య, రాజేశ్వరి, పీఈటీ దేవేందర్, శ్యామల, వందన, హజారే శ్రీనివాస్, లలిత, కాసర్ల నరేశ్, రాము, అనురాధ, వసంత పాల్గొన్నారు. ఖలీల్వాడి: నగరంలోని న్యాల్కల్ రోడ్డులో ఉన్న వీఎన్ఆర్ స్కూల్లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ యాదేశ్గౌడ్, సిబ్బంది వీణా, ప్రసన్న, శ్రీహరి ఉన్నారు. జక్రాన్పల్లి: మండలంలోని కొలిప్యాక్ జెడ్పీ ఉన్నత పాఠశాల, కలిగోట్ సిద్ధార్థ పాఠశాలల్లో విద్యార్థులు బోనాల పండుగ నిర్వహించారు. ఉపాధ్యాయులు సిరిల్రావు, సిద్ధార్థ కరస్పాండెంట్ గంగారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. -
రైతు వేదికలకు నిలిచిన నిధులు
ధర్పల్లి: రైతులు నిరంతరంగా సమావేశాలు నిర్వహించుకొని పంటల సాగు, వ్యవసాయంలో కొత్త విధానాలు, అధికారుల సూచనలు తెలుసుకునేందుకు వీలుగా రైతు వేదికలను గత ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. వ్యవసాయ క్లస్టర్ల వారీగా వీటిని నిర్మించింది. వ్యవసాయశాఖతోపాటు అనుబంధ విభాగాలు, ఇతర శాఖలకు సంబంధించి అవసరమైన సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొన్ని గ్రామానికి దూరంగా, కొన్ని దగ్గరగా నిర్మించారు. కార్యాలయాలు ఏర్పాటు చేసింది. కానీ వాటి నిర్వహణకు నిధులు కేటాయించడంలేదు. ప్రతివారం రైతు నేస్తం కార్యక్రమాల నిర్వహణతో పాటుతో పంటల సాగులో మెలకువలు కోసం ఏర్పాటు చేసే అవగాహన సదస్సులు, పలు ప్రభుత్వ పథకాలను ప్రజలకు, రైతులకు చేరవేసేందుకు నిర్వహించే భారం అంతా వ్యవసాయ శాఖ అధికారులపైనే పడుతోంది. ఏఈవోలకు కష్టాలు ధర్పల్లి మండలంలో 22 గ్రామ పంచాయతీలు ఉండగా రామడుగు, దుబ్బాక, ధర్పల్లి, హోన్నాజీపేట్ పంచాయతీల్లో రైతు వేదికలను గత ప్రభుత్వంలో సంబంధిత అధికారులు నిర్మించారు. ప్రస్తుతం రైతు వేదికల నిర్వహణకు ప్రభుత్వం తగిన నిధులు విడుదల చేయకపోవడంతో ఏఈవోలు ఇబ్బంది పడుతున్నారు. కొందరు సొంత డబ్బులు నిర్వహణకు ఖర్చు చేస్తున్నారు. శిక్షణ కార్యక్రమాలు–సమావేశాలు వ్యవసాయ విస్తరణాధికారులు, రైతులకు అందుబాటులో ఉండేందుకు వీలుగా వేదికలో వసతి కల్పించారు. ప్రత్యేకంగా ఫర్నిచర్ కూడా సమకూర్చారు. శిక్షణ కార్యక్రమాలకు అవసరమైన కుర్చీలు, మైకు వంటివి ఏర్పాటు చేశారు. సీజన్ల వారీగా పంటల సాగుపై అవసరమైన వారికి సలహాలు, సూచనలు ఇస్తుంటారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వ్యవసాయ, రైతు సమావేశాలు నిర్వహించారు. వీటిని ఇతర శాఖలు కూడా వినియోగించుకుంటున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే గ్రామాల్లో మినీ వేడుక మందిరంగా కూడా ఉపయోగపడుతుంది. భారంగా నిర్వహణ రైతు వేదిక నిర్వహణ కోసం ప్రభుత్వం నెలకు రూ.9 వేలు విడుదల చేసేది. గత కొంతకాలంగా నిధులు ఆగిపోవడంతో రైతు వేదికల నిర్వహణ అధికారులకు భారంగా మారింది. రైతు వేదికల విద్యుత్ బిల్లులు రూ. వేలల్లో పేరుకు పోతున్నాయి. స్వీపర్, తాగునీటి ఖర్చు తదితర ఖర్చులను కొన్నిచోట్ల ఏఈవోలే భరిస్తున్నారు. దుబ్బాకలోని రైతు వేదిక వ్యవసాయ అధికారులపైనే నిర్వహణ భారం పేరుకు పోయిన బకాయిలు -
ప్రధాన రోడ్డుపై నీటి గుంతలు
నేటి చిత్రంప్రధాన రోడ్డులో నిలిచిన నీరు జక్రాన్పల్లి: మండలంలోని సికింద్రాపూర్లో ప్రధాన రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. వర్షపు నీళ్లు అందులో నిల్వ ఉంటున్నాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు వాహనదారులు ఆ ప్రాంతంలో అదుపు తప్పి కిందపడిపోతున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి. – అప్పాల అరుణ్, సికింద్రాపూర్ మీ ప్రాంతంలో నెలకొన్న సమస్యను, ఫొటోను మాకు వాట్సాప్లో పంపించండి. ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. పంపిన వారి పేరు, ఫొటో ప్రచురిస్తాము. నిజామాబాద్ రూరల్ – 97053 46541 నిజామాబాద్ అర్బన్ – 95531 30597 మాకు ఫొటో పంపండి -
‘మీ–సేవ’ల్లో అధిక డబ్బులు వసూలు చేయొద్దు
నిజామాబాద్అర్బన్: జిల్లాలోని అన్ని మీ–సేవ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే నిర్వాహకుల పై చర్యలు తప్పవని ఆర్డీవో రాజేంద్రకుమార్ హెచ్చరించారు. నగరంలోని న్యూఅంబేడ్కర్ భవన్లో నిజామాబాద్ ఉత్తర, దక్షిణ మండలాల పరిధిలోకి వచ్చే మీసేవ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. కేంద్రాల్లో ఉన్న ధరల పట్టిక ప్రకారమే డబ్బులు తీసుకోవాలని, రేషన్కార్డుల జారీకి ఎవరైనా మధ్యవర్తులు ఉంటే చర్యలు తప్పవన్నారు. సమావేశంలో తహసీల్దార్లు విజయకాంత్రావు, బాలరాజ్, మీసేవ నిర్వాహకులు పాల్గొన్నారు. సిబ్బందికి సమాచారం ఇవ్వాలి సిరికొండ: విద్యుత్ సరఫరాలో ఏదైనా సమస్య తలెత్తితే రైతులు మరమ్మతులు చేయకుండా ట్రాన్స్కో సిబ్బందికి సమాచారం అందించాలని నిజామాబాద్ రూరల్ డీఈ అల్జాపూర్ రమేశ్ సూచించారు. మండలంలోని మైలారం గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పొలం బాట కార్యక్రమంలో డీఈ పాల్గొని మాట్లాడారు. విద్యుత్ సేవలపై అవగాహన కల్పించారు. లైన్ ఇన్స్పెక్టర్ బాలచంద్రం, లైన్మన్లు జగన్, సుభాష్, రైతులు నాగరాజు, చిన్నదా సు, విష్ణు, జనార్దన్రెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు. మహరాజ్కు భగవద్గీత అందజేత సుభాష్నగర్: నగరంలో పర్యటిస్తున్న పూజ్య స్వామి అవదేశానంద గిరి మహరాజ్ను మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ శనివారం మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆశీర్వాదాలు పొందారు. అనంతరం మహరాజ్కు భగవద్గీతను అందజేశారు. నగరంలోని అమ్మ వెంచర్లో నిర్మిస్తు న్న వారాహి ఆలయాన్ని సందర్శించాలని మహరాజ్ను ఆయన కోరారు. ఆయన వెంట వైశ్య సంఘం ప్రతినిధులు లాభిశెట్టి శ్రీనివాస్, మాదాని శ్రీధర్ తదితరులు ఉన్నారు. హైమాస్ట్ లైట్లు ప్రారంభం సిరికొండ: మండలంలోని న్యావనంది గ్రామంలో ఎమ్మెల్సీ కవిత నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను బీఆర్ఎస్ నాయకులు శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ తోట రాజన్న, మాజీ సర్పంచ్ కన్క శ్రీనివాస్, తెలంగాణ జాగృతి రూరల్ కన్వీనర్ సాయిచరణ్, గ్రామ శాఖ అధ్యక్షుడు సురేందర్రెడ్డి, రమేశ్రెడ్డి, వహీద్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం నిజామాబాద్అర్బన్: నగరంలోని గిరిరాజ్ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రాంమోహన్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పొలిటికల్ సైన్స్, కామర్స్, గణితం, హిస్టరి, బ్యాచ్లర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్, స్టాటిస్టిక్స్, ఇంగ్లిష్, బీబీఏ లాజిస్టిక్, బిజినెస్ అనాలిటిక్స్, కంప్యూటర్ సైన్స్, తెలుగు, ఫైనాన్స్, బీసీఏ టాక్సిషన్, డేటా సైన్స్, బయోటెక్నాలాజి సబ్జెక్టుల్లో బోధించేందుకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నెట్, పీహెచ్డీ ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈనెల 23 లోపు అభ్యర్థులు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ధర్పల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ సబ్జెక్టుల్లో బోధించేందుకు అతిథి అధ్యాపక పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జ్యోతి శనివారం పేర్కొన్నారు. అభ్యర్థులు ఈనెల 23 లోపు కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. 21న సినీ సంగీత విభావరి నిజామాబాద్ రూరల్: నగరంలోని గీతా భవనములో ఈ నెల 21న శ్రీ దాశరధి లలిత, సినీగీతాలతో సంగీత విభా వరి నిర్వహించనున్నట్లు స్వర సౌరభం అధ్యక్షుడు నాగారాజు శనివారం తెలిపారు. దాశరథి శత జయంతి పురస్కరించుకొని స్థానిక సాంసృతిక కళా సంస్థ స్వరసౌరభం, గీతాంజలి గి ల్డ్ సహకారంతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. చలో సెక్రటేరియట్ను విజయవంతం చేయాలి నిజామాబాద్అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని దీనికి నిరసనగా ఈ నెల 23న చేపట్టే చలో సెక్రటేరియట్ ముట్టడిని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని యూఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్ది సూరి కోరారు. శనివారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించా రు. పిప్రి శివారులోని గురుకులంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మృతిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పోషమైన మహేశ్, మారుతి, వేణు, శివ, సంతోష్, బాబు, విశాల్ పాల్గొన్నారు. -
గల్ఫ్ బాధితులను ఆదుకుంది కాంగ్రెస్ ప్రభుత్వమే..
ఖలీల్వాడి: గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చింది కాంగ్రెస్పార్టే అని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు రామర్తి గోపి అన్నారు. శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొస్తామని చెప్పి తీసుకురాలేదని అన్నారు. ఇటీవల వేల్పూర్లో ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బాధితులను ఆదుకోవడం లేదని మాట్లాడడం సబబుకాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సహాయ వివరాలను తెలిపేందుకు వెళ్లిన తమ పార్టీ నాయకుడు దేవేందర్రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు దాడి చేయడం సరైందని కాదని దీనిని తాము ఖండిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్కు దాడి చేసే సంస్కృతి లేదన్నారు. రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు ఎన్ఆర్ఐ పాలసీపై అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్, విక్కీ యాదవ్, ప్రీతం, ప్రమోద్, శోభన్, జిల్లెల రమేశ్, అవిన్, బోటి వినోద్ కుమార్, నరేంద్ర సింగ్, సుంకెట విశాల్ తదితరులు పాల్గొన్నారు. -
నిజామాబాద్
వాతావరణం ఉదయం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆకాశం మేఘావృతమవుతుంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నాయి.చదువులో వెనకబడిన..చదువులో వెనుకబడిన వారిని గుర్తించి ప్ర త్యేక బోధన అందించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు.ఆదివారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2025– 8లో uచందమామ రావే.. అంటూ చిన్నారికి గోరు ముద్దలు తినిపించాల్సిన తల్లి పని త్వరగా అయిపోవాలనే ఆతృతతో స్మార్ట్ఫోన్లో కార్టూన్లను చూపుతోంది. ఫలితంగా సెల్ఫోన్ చేతిలో లేనిదే ఆ చిన్నారి అన్నం తినలేని పరిస్థితి వస్తోంది. ఆన్లైన్ క్లాస్లు వింటారని సెల్ఫోన్ కొనిచ్చిన తల్లిదండ్రులు చివరకు తమ పిల్లలు వాటికి బానిసలు కావడాన్ని చూసి తలలు పట్టుకుంటున్నారు. సెల్ఫోన్ల పుణ్యమాని పిల్లలకు మాటలు రావాల్సిన వయస్సులో మాటలు రావడం లేదు.. స్కూల్కి వెళ్లే పిల్లలకు కనీసం వ్యాయామం అంటే తెలియడం లేదు. కూర్చున్న చోటు నుంచి గంటలపాటు కదలకుండా సెల్ఫోన్లు పట్టుకుంటున్నారు. ఈ పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. – నిజామాబాద్అర్బన్ఈ–పాస్ ద్వారానే యూరియా విక్రయించాలి డొంకేశ్వర్(ఆర్మూర్): ఈ–పాస్ యంత్రాల ద్వారానే రైతులకు యూరియా విక్రయించా లని జిల్లా వ్యవసాయాధికారి మేకల గోవింద్ అన్నారు. కృత్రిమ కొరత సృష్టించినా, ఎక్కువ ధరలకు విక్రయించినా డీలర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని పలు ఎరువుల దుకాణా లు, గోదాములను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, అమ్మకాల్లో తే డాలు రావొద్దన్నారు. రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. రైతులు తమ అవసరం మేరకు ద ఫాల వారీగా తీసుకెళ్లాలని సూచించారు. మోతాదులోనే పంటలకు యూరియా వేయాలని లేదంటే చీడపీడలు పెరిగి దిగుబడి తగ్గే అవకాశం ఉందన్నారు. డీఏవో వెంట నిజామాబాద్ అర్బన్ ఏడీఏ వీరాస్వామి, ఎంఏవో మహేందర్రెడ్డి, ఏఈవో చక్రపాణి ఉన్నారు. 25, 26 తేదీల్లో అథ్లెటిక్స్ ఎంపికలు నిజామాబాద్నాగారం: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 25, 26వ తేదీల్లో నాగారంలోని రాజారాం స్టేడియంలో అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు నరాల రత్నాకర్, రాజాగౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 25న అండర్– 8, 10, 12, 14, 16 బాలబాలికలకు, 26న అండర్ 18, 20, బాలబాలికలు, సీ్త్ర, పురుషుల విభాగాల్లో పోటీలు నిర్వహించి రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామన్నారు. 40 మంది బాల బాలికలను ఆగస్టు 3, 4 తేదీల్లో జేఎన్ స్టేడియం హనుమకొండలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామన్నారు. జనగామ జిల్లాలో ఆగస్టు 7న నిర్వహించే రెండవ రాష్ట్రస్థాయి పోటీలకు 20 మంది బాల బాలికలను పంపుతామని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 2 గంటల్లోపు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 99890 40776 నంబర్లో సంప్రదించాలన్నారు. జీరో యాక్సిడెంట్ లక్ష్యంలో భాగస్వాములు కావాలి సుభాష్నగర్: జీరో యాక్సిడెంట్ లక్ష్యంలో విద్యుత్ వినియోగదారులు, రైతులు భాగస్వాములు కావాలని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ ఆర్ రవీందర్ శనివారం ఒక ప్రకటనలో పి లుపునిచ్చారు. ప్రమాదభరితంగా, వదులు గా ఉన్న విద్యుత్ తీగలు, తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ గద్దెలు, వంగిన స్తంభా లు, రోడ్డు మీదుగా తక్కువ ఎత్తులో ఉన్న లైన్ క్రాసింగ్ వంటి ప్రమాదకరంగా ఉన్న వాటిని గమనించిన వెంటనే సెక్షన్ ఆఫీసర్ (అసిస్టెంట్ ఇంజినీర్ ఆపరేషన్), గ్రామస్థాయిలో ఉండే లైన్మెన్కు తెలియజేయాలని సూచించారు. తమ దృష్టికి వచ్చిన విద్యుత్ సమస్యలను సిబ్బంది పరిష్కరిస్తారని, త ద్వారా విద్యుత్ ప్రమాదాలను నివారించొచ్చన్నారు. పశువులు విద్యుత్ ట్రాన్స్ఫా ర్మర్లు, లైన్ల వద్దకు వెళ్లకుండా చూడాలని కా పర్లకు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సమస్యలు తలెత్తితే టీజీఎన్పీడీసీఎల్ టోల్ ఫ్రీ నంబర్ 1912ను సంప్రదించాలని ఎస్ఈ కోరారు. ● తొమ్మిదో తరగతి చదివే కొ డుకు స్మార్ట్ ఫోన్ను బాగా ఆపరేట్ చేస్తున్నాడని, ఆన్లైన్ చెల్లింపులను పక్కాగా చేస్తున్నా డని మురిసిపోయింది జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ ప్రభుత్వ టీచర్. ఎప్పు డూ ఫోన్ పట్టుకుని కూర్చుంటున్న కొడుకు పబ్జీ గేమ్కి అలవాటు పడి తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.60వే లు ఖర్చు చేశాడని గుర్తించి విస్తుపోయింది. ఈ విషయంలో మందలించడంతో పక్క గదిలోకి వెళ్లిన ఆ బాలుడు ఉరేసుకొనే ప్రయత్నం చే యగా ఆ తల్లి అడ్డుకుని ఆస్పత్రికి తీసుకెళ్లింది. ● బోధన్లోని ఓ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బా లుడు ప్రతి రోజూ తరగతి గదిలో నిద్రపోతున్నాడు. విషయాన్ని టీచర్లు బాలుడి తల్లిదండ్రులకు తెలుపగా.. తాము నిద్రించిన తరు వాత అర్ధరాత్రి నిద్రలేస్తున్న బాలుడు 2 గంటల నుంచి తెల్లవారుజా ము 5గంటల వరకు యూ ట్యూబ్ చూస్తున్నట్లు గుర్తించారు. ● ధర్పల్లికి చెందిన ఓ మహిళ ఇటీవల జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రికి తన ఏడేళ్ల కొడుకును తీ సుకొచ్చింది. ఫోన్ లేకుండా ఒక్క క్షణం ఉండడం లేదని, యూట్యూబ్ పెడితే తప్ప అన్నం తినడంలేదని, ఫోన్ ఇవ్వకపోతే తమను ఎదిరిస్తున్నాడని వాపోయింది. ఆస్పత్రిలో ఉంచి ఒక్క రోజు ఫోన్ ఇవ్వకపోవడంతో ఆ బాలు డు వస్తువులను పగులగొట్టాడు. ● మహారాష్ట్రలోని ధర్మాబాద్కు చెందిన ఓ జంట తమ కూతురు మాట్లాడే భాష అర్థం కాక ఓ మానసిక వైద్యుడి వద్దకు తీసుకొచ్చింది. ఆమెను పరీక్షించి పూర్తి వివరాలు తెలుసుకున్న వైద్యుడు.. ఆ తల్లి ప్రతి రోజూ తన కూతురికి అన్నం తినిపించేందుకు ఫోన్ అలవాటు చేసిందని, ఇతర భాషల కార్టూన్ లు చూడడంతోనే ఈ పరిస్థితి అని గుర్తించాడు. ప్రపంచాన్ని అర చేతిలో చూయించే సెల్ఫోన్ అన్ని వయస్సుల వారిపై చూపుతున్న ప్రభావం అంతాఇంతా కాదు. అందివచ్చిన టెక్నాలజీని అవకాశంగా మల్చుకుంటున్న కొంత మంది వి ద్యార్థులు, యు వత బంగారు బాట వేసుకుంటుండగా.. మరెంతో మంది తమ భవిష్యత్ను చేజేతులారా అంధకారంలోకి నెట్టేసుకుంటున్నారు. స్మార్ట్ఫోన్కు అలవాటు పడిన విద్యార్థుల మానసిక స్థితిలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సెల్ఫోన్ వాడకం తీవ్ర ప్రభావం చూపుతోందని మానసిక వైద్యనిపుణులు అంటున్నారు. చదువుపై ధ్యాస తక్కువ.. ఫోన్ ఎక్కువగా అలవాటు పడిన వారిలో చదువులపై ధ్యాస తగ్గిపోతోంది. చరవాణి వ్యసనంగా మారితే పిల్లలు ఒంటరిగా ఉండడానికి మాత్రమే ఇష్టపడతారు. ఇంట్లో అందరూ ఉంటే పడకగదిలో తలుపులు వేసుకొని మరి ఫోన్కి పరిమితం అవుతారు. సోషల్ మీడియా వినియోగంతో చెడు వ్యసనాలకు అలవాటు పడే ప్రమాదం ఉంది. ఎప్పుడు చూసినా.. పిల్లలకు అసలు వ్యాయామం అంటే ఏమిటో తెలియని పరిస్థితి ఉంది. ఉదయం లేచింది మొదలు స్కూల్ సమయం వరకు, స్కూల్ నుంచి వ చ్చీరాగానే పడుకునే వరకు చేతుల్లో సెల్ఫోన్ ఉండడంతో పిల్లలకు అస లు బయటి ప్రపంచం తెలియకుండాపోతోంది. ఫోన్ల కారణంగా ఆటలాడేందుకు ఇష్టపడడం లేదు. దుష్ప్రభావాలు అనేకం.. బద్ధకం, మతిమరుపు, మొండితనం ప్రతి చిన్న విషయానికి కోపగించుకోవడం, గొడవపడడం ఇంట్లోని పెద్దలను ఎదురించడం స్నేహితులు లేకపోవడం, బంధుత్వాలు తెలియకపోవడం నేర ఘటనలను చూడడం కారణంగా నేరప్రవృత్తి వైపు వెళ్లే ప్రమాదం మానసిక ఒత్తిడి పెరిగి అఘాయిత్యాలకు పాల్పడే అవకాశంన్యూస్రీల్సైకియాట్రిస్ట్ల వద్ద పెరుగుతున్న కేసులు.. నెలకు వంద వరకు మానసిక స్థితిని ప్రభావితం చేస్తున్న సెల్ఫోన్ గ్రౌండ్ తెలీదు.. క్రీడలపై ఆస్తకి లేదు శారీరక వ్యాయామమూ లేదు ఆన్లైన్ క్లాసుల పేరిట..పెరుగుతున్న కేసులు..సెల్ఫోన్లకు బానిసలుగా మారిన పిల్లల కేసులు మానసిక వైద్యుల వద్దకు నెలకు సుమారు వంద వరకు వస్తున్నాయని ప్రముఖ మానసిక వైద్యనిపుణుడు విశాల్ తెలిపారు. జిల్లా కేంద్రంతోపాటు వివిధ ప్రాంతాల్లో సుమారు 10 మంది మానసిక వైద్యులు ఉ న్నారని, ఒక్కొకరికి వద్దకు నెలలో పది వరకు కేసులు వస్తున్నాయంటున్నారు. ఇదిలా ఉండగా కొందరు అవగాహన లేకపోవడంతో వైద్యుల వద్దకు రావడం లేదని పేర్కొన్నారు. చిన్న పిల్లలో రోజురోజుకూ మానసిక సమ స్యలు పెరుగుతున్నాయని, సెల్ఫోన్ లేనిదే ఉండలేకపోతున్నారని అంటున్నారు. నరాల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చిన్న పిల్లలౖపై ఫోన్ ప్రభా వం తీవ్ర దుష్పరిణామాలకు దారితీస్తుంది. ముఖ్యంగా పిల్లలు ఎదిగే సమయంలో నరాలపై ఒత్తిడి పడుతుంది. నిద్ర సమస్యలు వస్తాయి. అదే పనిగా ఫోన్ చూస్తుంటే నరాలు దెబ్బతింటాయి. మానసిక ఎదుగుదల ఉండదు. ఫోన్కు దూరంగా ఉండడమే ఉత్తమం. ప్రస్తుతం సెల్ ఫోన్ కారణంగా తలెత్తుతున్న అనర్థాలకు సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి. – సాయిశ్రీపాదరావు, న్యూరో ఫిజీషియన్ సెల్ఫోన్ ఆట వస్తువు కాదు సెల్ఫోన్ ఆట వస్తువు కాదని తల్లిదండ్రులు గుర్తించాలి. స్మార్ట్ ఫోన్ వాడకం క్రమంగా పిల్లల్లో వ్యసనంగా మా రుతోంది. ఫలితంగా పిల్లల వ్యవహార శైలిపై తీవ్ర ప్రభా వం చూపుతోంది. చాలామందిలో చురుకుదనం తగ్గి సోమరితనం పెరుగుతోంది. రాత్రి 9 గంటలలోపు నిద్ర పోవాల్సిన పిల్లలు అర్ధరాత్రి వరకు ఫోన్లు వాడుతున్నారు. ఇది ఆందోళనకర విషయం. పిల్లలను సెల్ఫోన్లకు దూరంగా ఉంచాలి. – విశాల్, మానసిక వైద్య నిపుణలు ఆన్లైన్ క్లాస్లు, ప్రాజెక్ట్ వర్క్ల కోసమని స్కూల్కి వెళ్లే 8 నుంచి 15 ఏళ్ల పిల్లలకు తల్లిదండ్రులు సెల్ఫోన్లు, ట్యాబ్లు కొనిస్తున్నారు. ఇంటర్నెట్ కోసం డాటా ప్యాకేజీ రీచార్జి చేయడం లేదంటే ఇంట్లోనే వైఫై పెట్టిస్తున్నారు. ఇక్కడే చాలా మంది పిల్లలు పక్క దారి పడుతున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసే, వ్యాపారాల్లో బిజీగా ఉండే వారి ఇళ్లలో పర్యవేక్షణ, నియంత్రణ లేకపోవడంతో సుమారు 60 నుంచి 80 శాతం పిల్లలు సెల్ఫోన్లకు బానిసలవుతున్నారు. వీరి వద్ద అత్యంత ఖరీదైన సెల్ఫోన్లు, ట్యాబ్లు ఉంటున్నాయి. 12 ఏళ్లలోపు పిల్లలు 20 శాతం మందికి ఫేస్బుక్ ఖాతా ఉంటోంది. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ వినియోగం ఎక్కువగా పెరిగింది. పిల్లలు ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వాట్సాప్నూ వినియోగిస్తున్నారు. సో షల్ మీడియా ప్రభావం పెరగడంతో 15 ఏళ్ల వ యస్సున్న పిల్లలు ప్రేమలో పడుతున్నారు. 18 ఏళ్ల వయస్సు వచ్చే సరికి పరిస్థితి చేయిదాటుతోంది. -
టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించాలి
ఖలీల్వాడి: ప్రతి కేసులో సంబంధిత వ్యక్తులకు సమయానుగుణంగా ఈ–సమన్లు జారీ చేయాలని, పారదర్శకత, వేగవంతమైన సేవలకు టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించాలని సీపీ సాయిచైతన్య అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ హాల్లో కోర్ట్ డ్యూటీ ఆఫీసర్లకు ఈ–సమన్లపై శిక్షణ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఈ–సమన్ల జారీకి సంబంధిత డిజిటల్ ప్లాట్ ఫామ్ను వాడడంలో శిక్షణ తీసుకొని, ప్రతి ఆదేశాన్ని రికార్డు చేయాలని సూచించారు. కోర్టుల నుంచి జారీ అయ్యే సమన్లను త్వరితగతిన సర్వ్ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ శ్యాం కుమార్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని కోర్టు డ్యూటీ ఆఫీసర్లు, ఐటీ కోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. సీపీ సాయి చైతన్య కోర్టు డ్యూటీ ఆఫీసర్లకు ఈ–సమన్లపై శిక్షణ -
ఒత్తిడి జయించలేక..
నిజాంసాగర్/ఆర్మూర్ టౌన్ : పదో తరగతి వరకు తెలుగు మీడియం చదువుల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థి ఇంటర్లో ఆంగ్లమాధ్యమ చదు వు అర్థంకాక తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. చివరికి అనంతలోకాలకు వెళ్లిన విషాద ఘటన ఇది. వివ రాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నిజాంసాగ ర్ మండలం ఆరేడ్ గ్రామానికి చెందిన గడ్డం నిర్మ ల, నాగయ్య దంపతులకు ముగ్గురు కుమారులు. రెక్కల కష్టాన్ని నమ్ముకొని పిల్లలను చదివిస్తున్నా రు. చిన్న కుమారుడైన సంతోష్ (17) ఐదో తరగతి నుంచి 10 వ తరగతి వరకు అచ్చంపేట ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉంటూ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించాడు. తెలుగుమీడియం చదువుల్లో ఉత్తమ మార్కులు సాధించాడు. ఇంటర్మీడియట్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా వేల్పూర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో సీటు వచ్చింది. పదో తరగతి వరకు తెలుగు మీడి యం చదివి ఇంటర్లో ఇంగ్లిష్ మీడియం కావడంతో ఒత్తిడికి గురయ్యాడు. ఇంట ర్మీడియట్ మొదటి సంవత్సరంలో నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. సప్లిమెంటరీలో ఒకటి మాత్రమే పాస్ కావడంతో మానసికంగా ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. శనివారం వేకువ జామున సంతోష్ తాను చదువుతున్న గురుకుల పాఠశాలలో తోటి విద్యార్థులతో కలిసి మైదానంలో వ్యాయామం చేశాడు. అనంతరం సంతోష్ తువ్వాలు తీసుకుని కళాశాల గోడ దూకి బయటకు వెళ్లినట్లు సమాచారం. కొద్ది సేపటి తర్వాత డిగ్రీ కళాశాల వెనుక ఉన్న నర్సరీలో చెట్టుకు ఉరేసుకుని కనపడ్డాడు. ఇదిలా ఉండగా సంతోష్ ఆత్మహత్యపై అతడి సోదరుడు శ్రీకాంత్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలో చాలామంది ఫెయిల్ అయ్యారని పేర్కొన్నారు. సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు వచ్చి రెండు నెలలవుతోందని, ఇప్పుడెందుకు ఆత్మహత్య చేసుకుంటాడని ప్రశ్నిస్తున్నారు. కళాశాలలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి విచారణ జరిపించాలని కోరా రు. సంతోష్ ఆత్మహత్యతో ఆరేడ్ గ్రామంలో విషా దఛాయలు అలుముకున్నాయి. తనువు చాలించిన ఇంటర్ విద్యార్థి అర్థం కాని ఆంగ్లమాధ్యమ చదువు పదో తరగతి వరకు తెలుగు మీడియంలో విద్యాభ్యాసం -
ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించాలి
నిజామాబాద్అర్బన్: గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యమని, ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల మెరుగుదలకు స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రా జయ్య అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్హాల్లో శనివారం ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల అధికారులతో ఆర్థిక సంఘం సభ్యులు ఎం రమేశ్, సంకెపల్లి సుధీర్రెడ్డితో కలిసి చైర్మన్ రాజయ్య సమీక్ష నిర్వహించారు. నిజామా బాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు టి.వినయ్ కృష్ణారెడ్డి, ఆశిష్ సంగ్వాన్లు ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల పనితీరును చైర్మన్కు వివరించారు. మున్సిపల్ పట్టణాలు, గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం, తా గునీటి సరఫరా, వీధి దీపాలు, తడి, పొడి చెత్త సేకరణ, పచ్చదనం పెంపు, పన్ను వసూళ్లు, స్వయం ఉపాధి పథకాల అమలు, ప్రజల జీవన ప్రమా ణాల పెంపు కోసం కొనసాగుతున్న కార్యక్రమాలు, గ్రాంట్స్ రూపంలో సమకూరుతున్న ఆదాయం, ఇ తర మార్గాల ద్వారా స్థానిక సంస్థలకు అందుతున్న రాబడి తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా విడుదల అయిన నిధులు, వాటి వెచ్చింపు వివరాలను గణాంకాల ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. ఆదాయ వనరులను అభివృద్ధి చేసుకుని, పల్లె, పట్టణ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం శాసీ్త్రయ దృక్పథంతో పని చేయాలని అన్నారు. చైతన్యవంతమైన సమాజ నిర్మాణంతో అన్ని వర్గాల వారు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నదే ఆర్థిక సంఘం ధ్యేయమని స్పష్టం చేశారు. కొత్త గ్రామ పంచాయతీలుగా మారిన తండాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వీధి దీపాలకు సోలార్ విద్యుత్ను వినియోగిస్తే బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని అన్నారు. ప్రయోగాత్మకంగా చిన్న గ్రామ పంచాయతీల్లో సోలార్ విద్యుత్ విధానాన్ని అమలు చేస్తూ, క్రమంగా అన్ని స్థానిక సంస్థలకు విస్తరిస్తూ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాను ఆదర్శంగా నిలపాలని సూచించారు. అదేవిధంగా నిధుల కోసం పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పైనే ఆధారపడకుండా ఆదాయం సమకూర్చే అన్ని వనరులను సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. స్థానిక సంస్థల్లో ఆదాయ వనరులు పెంపొందించుకునేందుకు ఉన్న అవకాశాలపై అధికారుల నుంచి సలహాలు స్వీకరించారు. వాటన్నింటినీ క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని అన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ఉమ్మడి జిల్లా అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, చందర్ రాథోడ్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్, డీపీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు, జెడ్పీ సీఈవోలు, డీఎల్పీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. స్వాగతం.. ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్యకు ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు టి.వినయ్ కృష్ణారెడ్డి, ఆశిష్ సంగ్వాన్, నిజామాబాద్ సీపీ సాయి చైతన్య పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. గ్రామస్వరాజ్యమే దేశ స్వరాజ్యం సామాజిక, ఆర్థిక స్థితిగతుల మెరుగుదలకు స్థానిక సంస్థలు కృషి చేయాలి రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల అధికారులతో సమీక్ష -
ఆర్టీసీ బస్సు, ఇసుక లారీ ఢీ
లింగంపేట: ఎదురెదురుగా వస్తున్న ఇసుక లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికులు, స్థానికులు తెలి పిన వివరాలిలా ఉన్నాయి. శనివారం సాయంత్రం లింగంపేటవైపు నుంచి కామారెడ్డి వైపు ఆర్టీసీ బ స్సు వెళ్తోంది. బస్సులో 102 మంది ప్రయాణికులున్నారు. అదే సమయంలో కామారెడ్డి వైపు నుంచి లింగంపేట వైపు ఇసుక లారీ వస్తోంది. లింగంపేట మండలం ఎల్లమ్మతండా సమీపంలో రెండు వా హనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సు రోడ్డు కిందికి దూసుకుపోయింది. ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. లారీ డ్రైవర్ లింగంపేట మండ లం పర్మళ్ల గ్రామానికి చెందిన బద్ద నాగరాజు క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. అతడి కుడి కాలు విరిగింది. బస్సు డ్రైవర్ వడ్ల శ్రావణ్కుమార్కూ గాయాలయ్యాయి. ఆయన స్వస్థలం లింగంపేట మండలం కొర్పోల్ గ్రామం. కండక్టర్ శంకర్రావుతోపాటు ప్రయాణికులు బూక్య మంజుల(అన్నారం), ఉంట గంగారెడ్డి(మర్కంటి), కుంట బాలరాజవ్వ(మర్కంటి), పురుషోత్తం(డిచ్పల్లి), పోచయ్య(కన్కల్), లింగమోల్ల రాజు(శెట్పల్లిసంగారెడ్డి), స్రవంతి(పోతారం), సత్తవ్వ(శెట్పల్లిసంగారెడ్డి), చాకలి రాజేష్(కుప్రియాల్), నక్క రాజమణి(దూస్గావ్), బ్రహ్మణపల్లి లక్ష్మి(తాడ్వాయి), అల్లిపురం అంజవ్వ(కాళోజీవాడి), పడమటి సుశీల(ఆరెపల్లి)లకు గాయాలయ్యాయని ప్రయాణికులు తెలిపారు. వీరిని సదాశివనగర్, దోమకొండ, రాజంపేట మండలాలకు చెందిన 108 అంబులెన్సులలో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్రావు, లింగంపేట ఎస్సై దీపక్కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై తెలిపారు. రోడ్డు కిందికి దూసుకెళ్లిన బస్సు పలువురికి తీవ్ర గాయాలు భయాందోళనలకు గురైన ప్రయాణికులు -
విద్యారంగ సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో గుర్తించిన క్షేత్రస్థాయి ఉన్నత విద్యారంగ సమస్యలను వివరిస్తూ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని రాష్ట్ర విద్యా కమిషన్ ఛైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి అన్నారు. కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ ఎల్.విశ్వేశ్వరరావుతో కలిసి యూనివర్సిటీని మురళి శనివారం సందర్శించారు. బాలికల, బాలుర వసతి గృహాలు, సెంట్రల్ లైబ్రరీ, వివిధ కళాశాలల తరగతి గదులు, ప్రయోగశాలలను పరిశీలించారు. అనంతరం తెయూ వీసీ ప్రొఫెసర్ టీ.యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి, కమిషన్ సభ్యులు విశ్వేశ్వరరావుతో కలిసి చైర్మన్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. తెయూకు ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలు మంజూరు చేయించాలని, నిర్మల్, ఆదిలాబాద్ జి ల్లాలను తెయూ పరిధిలోకి తేవాలని ఈ సందర్భంగా విద్యార్థులు విన్నవించారు. ముఖ్యంగా ఒకటే బాలికల హాస్టల్ ఉందని, మౌళిక వసతులు, గదు లు సరిపోక ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే నూతన బాలికల హాస్టల్ నిర్మించాలని విద్యార్థినులు కోరారు. ప్రయోగశాలు, గ్రంథాలయంలో పుస్తకాల కొరత తదితర అంశాలను మురళి దృష్టికి తీసుకెళ్లారు. సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని విన్నవించారు. తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టూటా) అధ్యక్షులు ఏ.పున్నయ్య మాట్లాడుతూ.. ఉన్నత విద్యారంగంలో క్షేత్రస్థాయిలో అనేక సమస్యలున్నాయన్నారు. దశాబ్ద కాలంగా యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియామకం జరగడంలేదన్నారు. తెయూ అనుబంధ కళాశాలల రాష్ట్ర సహాయ కార్యదర్శి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, దీంతో కళాశాలలు నిర్వహించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దోస్త్, బకెట్ సిస్టం వంటి అడ్మిషన్స్ నిబంధనలతో ప్రైవేటు కళాశాలలు మూతపడే స్థితికి చేరుకున్నాయని తెలిపారు. ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్, కంట్రోలర్ ప్రొఫెసర్ కే.సంపత్కుమార్, ఆడిట్ సెల్ డైరక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్, ప్రొఫెసర్ కనకయ్య, వివిధ విభాగాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తెయూలో ప్రజావాణి నిర్వహణ సమస్యలు వివరించిన విద్యార్థులు, అధ్యాపకులు -
ఎస్సారెస్పీలోకి స్వల్ప ఇన్ఫ్లో
బాల్కొండ: స్థానిక ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి స్వల్ప ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్లోకి 2,078 క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 100, ఆవిరి రూపంలో 277, తాగునీటి అవసరాలకు మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా శనివారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో 1068.6(21.02 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం నిజామాబాద్అర్బన్: జిల్లాలోని మైనార్టీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల/కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గణితం(2), బోటనీ(2) జూనియర్ లెక్చరర్ల పోస్టులు ఖాళీ ఉన్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెస్సీ, బీఈడీ విద్యార్హత కలిగి, బోధనలో మూడేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను ఈ నెల 23వ తేదీలోపు నాగారంలోని మైనార్టీ రెసిడెన్షియల్ గురుకుల కళాశాలలో సమర్పించాలన్నారు. మిగతా వివరాలకు 98494 19469 నంబర్ను సంప్రదించాలని తెలిపారు. ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువు పెంపు నిజామాబాద్అర్బన్: ఉపకార వేతనాల కోసం దరఖాస్తు గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిణి రజిత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు నూతన ఉపకార వేతనాలు, రెన్యువల్కు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. బాలికల కళాశాల తనిఖీ నిజామాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను డీఐఈవో రవికుమార్ శనివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో తరగతుల ని ర్వహణ, అధ్యాపకుల పనితీరును స్వయంగా పరిశీలించారు. జిల్లాలోనే అత్యధికంగా అడ్మిషన్లను చేయడంపై ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. విద్యార్థులు వందశాతం ఫలితాలు సా ధించేందుకు ప్రణాళికాబద్ధంగా ఇప్పటి నుంచే అన్ని సబ్జెక్ట్ల అధ్యాపకులు సమన్వయంతో పని చేయాలన్నారు. నాన్ టీచింగ్ సిబ్బంది అడ్మిషన్ల పనిని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ను కలిసిన సీపీ ఖలీల్వాడి: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్యను సీపీ సాయిచైతన్య మర్యాద పూర్వకంగా కలిశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో రాజయ్యకు పుష్పగుచ్ఛం అందజేశారు. -
బకాయి వేతనాలు చెల్లించాలి
● ఎన్డీఎస్ఎల్ ఎదుట కార్మిక సంఘాల నిరసన బోధన్: పదేళ్ల బకాయి వేతనాలు చెల్లించి ఆదుకోవాలని పట్టణ కేంద్రంలోని శక్కర్నగర్ ఎన్డీఎస్ఎల్ (నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్) ఎదుట కార్మిక సంఘాలు, రైతు నాయకులు శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ 2015 డిసెంబర్ 23న అక్రమంగా లేఆఫ్ ప్రకటించి షుగర్ ఫ్యాక్టరీని మూసివేయడంతో ఉపాధి కోల్పోయామని, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం కారణాలతో దుర్భర జీవితాలు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, పిల్లల పోషణకు నరకయాతన పడుతున్నామని పేర్కొన్నారు. బకాయివేతనాలు చెల్లించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ కాలయాపన కమిటీగా ఉందని ఆరోపించారు. ఫ్యాక్టరీని పున: ప్రారంభించాలని తెలిపారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు ఉపేందర్, రవిశంకర్గౌడ్, సత్యనారాయణ, శ్రీనివాస్, భిక్షపతి, రైతు నాయకుడు కేపీ శ్రీనివాస్ రెడ్డి, ఫయాజ్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్ల మరమ్మతులు చేయించాలి
● పీసీసీ చీఫ్ను కలిసిన నాయకులు నిజామాబాద్ సిటీ: జిల్లా కేంద్రంలో అంతర్గత కొత్త రోడ్లతోపాటు పాడైపోయిన రోడ్లకు మరమ్మతులు చేయించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ను హైదరాబాద్లోని ఆయన నివాసంలో శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా కేంద్రంలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. మాజీ ఎంపీ అజారుద్దీన్, కాంగ్రెస్ నాయకులు బాడ్సి శేఖర్గౌడ్, డీ రాజేంద్రప్రసాద్, బట్టు బలరాం, శివప్రసాద్, రాజేశ్ ఉన్నారు. -
వర్సిటీ సమస్యలు పరిష్కరించాలి
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళికి వర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు విన్నవించారు. శనివారం తె యూను సందర్శించిన విద్యా కమిషన్ చైర్మన్ మురళి, సభ్యులు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావును వేర్వేరుగా కలిసిన ఎన్ఎస్యూఐ, పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ సంఘాల నాయకులు సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. వర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాల, ఐ దు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు, ఫార్మసీ క ళాశాల ఏర్పాటు, ఆడిటోరియం, నూతన బాలికల హాస్టల్ నిర్మాణం, బోధ న, బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బానోత్ సాగర్నాయక్, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజ్కుమార్, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి గణేశ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్కు విద్యార్థి సంఘాల వినతి -
క్రైం కార్నర్
రెండు గ్రామాల్లో దొంగల బీభత్సం సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని ధర్మారావ్పేట్, మర్కల్ గ్రామాల్లో శనివారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ధర్మారావ్పేట్ గ్రామానికి చెందిన షహరీ బేగం, ఉరుసు పుష్ప, ఒడ్డె రాములు ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. దీంతో దుండగులు ఇంటి తాళాలను పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ముగ్గురు ఇళ్లలో నగదు, బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు బాధితులు పేర్కొన్నారు. మర్కల్ గ్రామానికి చెందిన గుర్రం పుష్ప, శాంత ఇళ్లకు తాళం వేసి ఉండడంతో దుండగులు చోరీకి పాల్పడ్డారు. కాగా, మర్కల్లో అర్ధరాత్రి ఓ కాలనీలో తిరుగుతున్న ఐదుగురు వ్యక్తుల దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. మర్కల్, ధర్మారావ్పేట్లో చోరీకి పాల్పడింది ఒకే ముఠానా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం వేలిముద్రలను సేకరించారు. చోరీకి గురైన నగదు, బంగారం విలువ విచారణలో తెలుస్తుందని ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. ఘటనా స్థలాన్ని సీఐ సంతోష్కుమార్ పరిశీలించారు. ఆయన వెంట సీసీఎస్ ఎస్సై ఉస్మాన్, సిబ్బంది ఉన్నారు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్ ధర్మారావ్పేట్, మర్కల్లో చోరీకి పాల్పడ్డ దుండగులు -
పరిసరాల శుభ్రతతోనే ఆరోగ్యం
● కాల్పోల్లో వైద్యుల బృందం పర్యటన మోపాల్(నిజామాబాద్రూరల్): గ్రామీణ ప్రాంతాల్లోని పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు బృందం సూచించింది. మండలంలోని కాల్పోల్లో డెంగీ కేసులు నమోదైన నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వైద్య బృందాలను శనివారం గ్రామానికి పంపింది. దీంతో వైద్య బృందాలు గ్రామంలో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించాయి. ప్రధానంగా వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేస్తూ, దోమల లార్వా నిర్మూలనకు మందును స్ప్రే చేశారు. గ్రామంలో ఆరోగ్య శిబిరం నిర్వహించి జ్వర పీడితులను పరీక్షించి మందులను అందజేశారు. మెరుగైన చికిత్స అవసరమున్న వారిని జీజీహెచ్కు సిఫారసు చేశారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకా రాం రాథోడ్, వైద్యులు ప్రత్యేష, అజ్మల్, హెచ్ఈవో గోవర్ధన్,సూపరింటెండెంట్లు,ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. మదన్పల్లిలో ఒకరికి డెంగీ మాక్లూర్: మండలంలోని మదన్పల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ డెంగీ బారినపడింది. విషయం తెలుసుకున్న కల్లెడి పీహెచ్సీ వైద్యుడు ప్రకాశ్ అప్రమత్తమై ఆరోగ్య సిబ్బందితో కలిసి శనివారం మదన్పల్లిలో వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 20 మందికి రక్త పరీక్షలు నిర్వహించగా, జ్వరం, డెంగీ లక్షణాలు కనిపించలేదు. కాగా, 15 రోజుల క్రితం సదరు మహిళ బోధన్లో ఉండే తన తల్లి వద్దకు వెళ్లింది. తిరిగి మదన్పల్లి వచ్చిన తర్వాత విపరీతమైన జ్వరం, తలనొప్పి రావటంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ జరిపిన రక్త పరీక్షలో డెంగీ పాజిటీవ్ రావడంతో చికిత్స పొంది మదన్పల్లి చేరుకుంది. విషయం తెలియడంతో డాక్టర్ ప్రకాశ్ వెంటనే గ్రామంలో ఉన్న డ్రెయినేజీలను శుభ్రం చేయించారు. బోధన్లో దోమ కుట్టడంతోనే డెంగీ వచ్చినట్టు డాక్టర్ అ నుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం డెంగీ తగ్గడంతో విశ్రాంతి తీసుకుంటున్న మహిళను ఎంపీడీవో బ్రహ్మానందం పరామర్శించారు. -
విద్యార్థులు కావలెను
మోర్తాడ్: ఎస్సీ విద్యార్థి వసతి గృహాలలో సీట్లు భర్తీ కాక వెలవెలబోతున్నాయి. గురుకుల పాఠశాలల్లో చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపడంతో వసతి గృహాలలో సీట్లు నిండటం లేదు. ఆర్మూర్ డివిజన్లోని పలు వసతి గృహాలలో సీట్లు ఖాళీగా ఉండటంతో వాటిని భర్తీ చేసేందుకు ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు అవస్థలు పడుతున్నారు. ఒక్కో హాస్టల్లో వంద మంది విద్యార్థులకు వసతి కల్పించే వీలు ఉంది. కొన్ని హాస్టళ్లలో సీట్లు నిండిపోగా, ఎక్కువ వసతి గృహాలలో ఖాళీలే దర్శనం ఇస్తున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతోపాటు దుస్తులు, దుప్పట్లు, ఉచిత నోట్ పుస్తకాలు అందిస్తూ కాస్మెటిక్ చార్జీలను చెల్లిస్తున్నారు. మోర్తాడ్లోని బాలుర, బాలికల వసతి గృహాలతోపాటు వేల్పూర్, తొర్లికొండ, కోనసముందర్, ఆర్మూర్లోని బాలుర వసతి గృహాలలో సీట్లు భర్తీ అయ్యాయి. కాగా, ఏర్గట్లలో(30), చౌట్పల్లి(30), భీమ్గల్ బాలికల వసతి గృహంలో(35), బాలుర(50), ఆర్మూర్లోని బాలికల వసతి గృహంలో(50) సీట్లు ఖాళీగా ఉన్నాయి. ● ఎస్సీ వసతి గృహాలలో భారీగా ఖాళీలు ● గురుకులాల్లో చేరికకు ఉత్సాహం చూపడంతో భర్తీకాని సీట్లు మెరుగైన వసతులున్నాయి.. ఎస్సీ విద్యార్థి వసతి గృహాలలో మెరుగైన వసతులు కల్పిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎస్సీ, బీసీ, ఎస్టీ విద్యార్థులు అందుబాటులో ఉన్న ఎస్సీ వసతి గృహాలలో చేరితే ఉపయోగంగా ఉంటుంది.ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ప్రయత్నిస్తున్నాం. – రాజగంగారాం, ఏఎస్డబ్ల్యూ, ఎస్సీ సంక్షేమ శాఖ -
గుర్తు తెలియని వాహనం ఢీ.. యువకుడి మృతి
కమ్మర్పల్లి: కమ్మర్పల్లి మండల కేంద్రంలోని శుక్రవారం దేవీ ఆలయం సమీపంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. హసకొత్తూర్ గ్రామానికి చెందిన ఇరగదిండ్ల శంకర్(27) ద్విచక్ర వాహనంపై కమ్మర్పల్లికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో శుక్రవారం దేవీ ఆలయం సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు నిజామాబాద్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్రెడ్డి తెలిపారు. -
ఐక్య పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
నిజామాబాద్ సిటీ: ఐక్య పోరాటాలతోనే ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, భవిష్యత్కు బాటలు వేసేందుకు మహాసభలు దోహదపడుతాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో సీపీఐ 22వ జిల్లా మహాసభలను శనివారం నిర్వహించగా వెంకట్రెడ్డితోపాటు పశ్య పద్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. అన్ని పార్టీలకు తల్లి పార్టీలు ఉన్నట్లు కమ్యూనిష్టు పార్టీలకు సీపీఐ తల్లివంటిదన్నారు. దేశంలో బలమైన పార్టీ సీపీఐ అని, దేశ స్వాతంత్యం కోసం పోరాడిన ఏకై న పార్టీ అని అన్నారు. యంత్రాలు లేని సమాజం కావాలని, శ్రమకు తగ్గ ఫలితం రావాలని, దోపిడీకి గురయ్యే వర్గానికి వెన్ను దన్నుగా గత 76 ఏళ్లుగా పేద ప్రజల కోసం పోరాడుతున్నామన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగిస్తోందని, కార్మిక, పేద వర్గాల నడ్డి విరుస్తోందని విమర్శించారు. ప్రశ్నించినవారి గొంతునొక్కుతూ, అక్రమకేసులు బనాయించి జైళ్లలో వేస్తున్నారన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక ఆదివాసీలను చంపుతున్నారని, వెంటనే ఆపరేషన్ కగార్ను ఆపివేయాలని డిమాండ్ చేశారు. కేవలం అటవీసంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మావోయిస్టులను చంపగలరు కానీ సిద్ధాంతాన్ని చంపగలరా అని ప్రశ్నించారు. బీజేపీ – ఎన్డీఏ ప్రభుత్వానికి చెక్ పెట్టేందుకు సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. సభలో నాయకులు ఓమయ్య, సుధాకర్, వేల్పూర్ భూమయ్య, సిర్ప లింగయ్య తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మోదీ పాలన ఆపరేషన్ కగార్పేరుతో ఆదివాసీలను చంపుతున్నారు సీపీఐ జాతీయకార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి -
కార్మిక శాఖ విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా మాణిక్ రాజు
నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, సీనియర్ న్యాయవాది బీ మాణిక్రాజును జిల్లా కార్మిక శాఖ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యునిగా నియమిస్తూ కలెక్టర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా న్యాయసేవాధికార సంస్థ తరపున న్యాయవాది మాణిక్రాజును సభ్యునిగా నియమించారు. భవన నిర్మాణ కార్మిక సంఘాలతో కలిసి సంక్షేమ పథకాలు కార్మికులకు చేరేలా మాణిక్ రాజు కృషి చేశారు. కార్మిక చట్టాలు వాటి ప్రయోజనాలపై న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించారు. పదుల సంఖ్యలో కార్మికులకు తన సొంత డబ్బుతో బీమా సౌకర్యం కల్పించారు. విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా నియామకమైన మాణిక్ రాజును న్యాయవాదులు అభినందించారు. -
వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధన అందించాలి
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): ఆయా సబ్జెక్టులలో చదువులో వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక బోధన అందిస్తూ మెరుగైన ఫలితాలు వచ్చే లా ఉపాధ్యాయులు అంకితభావంతో కృషి చే యాలని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. శనివారం డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలోని మహాత్మా జ్యోతీబా పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాల/కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్, డార్మెటరీలను పరిశీలించారు. స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశా రు. డైట్ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కొత్త మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని వివరాలు తెలుసుకున్నారు. ఆహార పదార్థాలను భద్రపరిచే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేయాలని నిర్వాహకుల కు సూచించారు. మెనూ ప్రకారం ప్రతిరోజూ ఉడకబెట్టిన కోడిగుడ్లు అందిస్తున్నారా, టెండర్ ప్రక్రియ పూర్తయిందా అని ఆరా తీశారు. భోజనం తయారు చేసేందుకు వినియోగించే ఆహార పదార్థాలు, సరుకులు, కూరగాయలు కలుషితం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నాసిరకమై న ఆహార పదార్థాలు, కూరగాయలు సరఫరా చేసిన సమయంలో అధికారులకు సమాచారం అందించాలన్నారు. నిర్లక్ష్యానికి తావివ్వకుండా, మెనూ ప్రకా రం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. అంతకుముందు ఆఫీస్ రూంలో పాఠశా ల, కళాశాల ప్రిన్సిపాల్స్ ఎన్ దివ్యరాణి, ఎన్ లక్ష్మీల తో సమావేశమై, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పర్యవేక్షణ అధికారి ఎ ల్లవేళలా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. పాఠశాల నిర్వహణను పక్కాగా పర్యవేక్షించాలని, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. సిబ్బంది అటెండెన్స్, ఇతర రికార్డులను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థుల రోజువారీ దినచర్య గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, డిచ్పల్లి తహసీల్దార్ సతీష్ రెడ్డి తదితరులున్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేయాలి జ్యోతీబాపూలే పాఠశాల/కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ -
పెద్దాసుపత్రికి సుస్తీ
● సమస్యల వలయంలో జీజీహెచ్ ● పని చేయని ఫ్యాన్లు ● ఇబ్బంది పడుతున్న రోగులు ● కనిపించని హెల్ప్డెస్క్, ఆరోగ్యమిత్ర సిబ్బందినిజామాబాద్నాగారం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్) సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. పేరుకు పెద్దాసుపత్రి అయి నా కనీస సౌకర్యాలు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాలు, అధికారులు మారుతున్నా జీజీహెచ్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. ఆస్పత్రికి వచ్చే రోగులకు సమాచారం అందించాల్సిన హెల్ప్డెస్క్, ఆరోగ్యమిత్ర కౌంటర్లు సిబ్బంది లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నడవలేని స్థితిలో ఉండే రోగులను తీసుకెళ్లేందుకూ సిబ్బంది లేకపోవడంతో బంధువులే స్ట్రెచర్లపై తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిత్యం 1,800 నుంచి 1,900 వరకు ఓపీ నమోదవుతోంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ సేవలు అందించాల్సి ఉంటుంది. జిల్లా నుంచే కాకుండా నిర్మల్, కామారెడ్డి, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా వైద్య సేవల కోసం పేద లు జీజీహెచ్కు వస్తుంటారు. రోగాలతో బాధపడు తూ దవాఖానాకు వచ్చేవారు డాక్టర్ వద్దకు వెళ్లాలంటే కచ్చితంగా ఓపీ చీటీ ఉండాల్సిందే. ఓపీ చీటీ కోసం ఆరు కౌంటర్లు ఉన్నాయి. ఇందులో ఓ కౌంటర్ ఎప్పటికీ మూసి ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచే ఓపీ చీటీ కోసం రోగులు, వారి బంధువులు క్యూలో నిలబడాల్సి వస్తుంది. క్యూ లైన్లపై పేరుకే 8 ఫ్యాన్లు ఉన్నా ఒక్కటీ పనిచేయదు. రోగాలు నయం చేసుకునేందుకు వస్తే క్యూలైన్లో నిలబడి అవస్థలు పడాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూర్చోవడానికి సైతం సరిపడా కుర్చీలు లేవని వాపోతున్నారు. ● జీజీహెచ్కు వచ్చే రోగుల సహాయం కోసం హెల్ప్డెస్క్, ఆరోగ్య శ్రీ ట్రస్ట్ మిత్ర టేబుల్స్ ఉన్నా లేనట్టే. పేరుకు టేబుల్స్ ఉన్నా సిబ్బంది అందుబాటులో ఉండడం లేదు. నిత్యం కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ● అనారోగ్యంతో నడవలేని రోగులు, కాళ్లు, చేతులు విరిగిన క్షతగాత్రులను వీల్చైర్, స్ట్రెచర్లపై బంధువులే వైద్యుల వద్దకు తీసుకెళ్తున్నారు. సిబ్బంది ఉన్నా పట్టించుకోవడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. -
వన్య ప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత
రామారెడ్డి: మండలంలోని స్కూల్తండాతోపాటు ఇందల్వాయి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తోందని రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఏలుసింగ్ మేరు స్పష్టం చేశారు. పులి కోసం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నా జాడ కనిపించలేదని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన స్కూల్ తండా పరిధిలోని అటవీ ప్రాంతంలో పర్యటించారు. ఆవుపై పెద్దపులి దాడి చేసిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ అటవీ ప్రాంత సమీపంలో ని గ్రామాల్లో చాటింపు వేయించి పెద్దపులి సంచరిస్తున్న విషయాన్ని తెలియజేశామన్నా రు. వారం రోజులుగా అటవీ సిబ్బంది పె ట్రోలింగ్ చేస్తున్నారన్నారు. అటవీ జంతువులకు హాని కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే చ ర్యలు తీసుకుంటామని డీఎఫ్వో నిఖిత హెచ్చరించారు. పులిపై విషప్రయోగం జరి పిన ఘటనలో ఇప్పటికే నలుగురిపై కేసు న మోదు చేసి రిమాండ్కు తరలించిన విషయా న్ని తెలిపారు. క్రూరమృగాలు కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచా రం అందిస్తే తొందరగా వాటిని పట్టుకునేందుకు వీలవుతుందన్నారు. వారం రోజులు గా వెతుకుతున్నా పులి కనిపించడం లేదంటే అది వెళ్లిపోయినట్లు కాదన్నారు. ప్రజలు అ ప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్య క్రమంలో అసిస్టెంట్ ఎస్పీ చైతన్యరెడ్డి, అట వీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పెన్షన్ల హామీ మరిచిన కాంగ్రెస్ సర్కారు● మందకృష్ణ మాదిగ నిజామాబాద్అర్బన్: అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎ న్నికల్లో ఇచ్చిన ఆసరా పెన్షన్ల హామీని విస్మరించిందని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. నగరంలోని లక్ష్మి కల్యాణ మండపంలో శుక్రవారం పెన్షన్దారుల దివ్యాంగుల సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీలో భాగంగా ఆసరా పెన్షన్ రూ.2వేల నుంచి రూ. 4వేలకు, దివ్యాంగులకు రూ.6వేల చేయూ త పెన్షన్ ఇస్తామని ప్రకటించి, అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్రెడ్డి మరిచిపోయారని విమర్శించారు. సమావేశంలో దివ్యాంగుల హక్కుల సమితి నాయకులు బీరప్ప, సుజాత సూర్యవంశీ, మాదిగ రిజర్వేషన్ జిల్లా అధ్యక్షుడు పోశెట్టి, కనక ప్రమోదు, మైలారం బాలు పాల్గొన్నారు. జూనియర్ అసిస్టెంట్లకు ముగిసిన శిక్షణ నిజామాద్ రూరల్: కారుణ్య నియామకాల్లో భాగంగా కొత్తగా వచ్చిన జూనియర్ అసిస్టెంట్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. పది రోజులపాటు వివిధ అంశాలపై అధికారులు శిక్షణ ఇచ్చా రు. జిల్లా పరిషత్ డీపీఆర్సీ భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ముగింపు సమావేశంలో జెడ్పీ ఇన్చార్జి సీఈవో సాయన్న మాట్లాడారు. ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వర్తిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. అనంతరం ఎస్టాబ్లిష్మెంట్, అకౌంట్స్పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు శ్రీనివాసరావు, సునీత దేవి, భరత్, లింగన్న, శ్రీనివాస్, పంచాయతీరాజ్ జిల్లా మినిస్టేరియల్ సంఘ జిల్లా అధ్యక్షుడు గడ్డం భాస్కర్, సెక్రెటరీ ప్రదీప్కుమార్, ట్రెజరర్ విఠల్ పాల్గొన్నారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం సుభాష్నగర్: నగరంలోని పలు సబ్స్టేషన్ల పరిధిలో 3వ శనివారం నిర్వహణ కారణంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరా యం ఏర్పడుతుందని టౌన్ –1, 2 ఏడీఈ లు ఆర్ చంద్రశేఖర్, ఆర్ ప్రసాద్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముబారక్నగర్, తిలక్గార్డెన్, పవర్ హౌస్, మిర్చి కాంపౌండ్, అర్సపల్లి సబ్స్టేషన్ల పరిధిలో సరఫరా నిలిపేస్తున్నట్లు పేర్కొన్నారు. -
విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించాలి
నిజామాబాద్అర్బన్: ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దోహదపడేలా విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సాంకేతిక విద్యాభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని రా ష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల పాలిటెక్నిక్ కళాశాలలను శుక్రవారం ఎమ్మెల్యే, కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట ప్రిన్సిపాల్స్, అధ్యాపకులతో సమావేశమై, ఒక్కో విభాగం వారీగా నమోదైన ఫలితాలు, అధ్యాపకుల ఖాళీలు, అవసరమైన మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై స మీక్షించారు. అనంతరం తరగతి గదులు, వర్క్షాప్లను సందర్శించి, పనితీరును పరిశీలించారు. వి ద్యార్థులతో భేటీ అయ్యి, వారికి అందిస్తున్న శిక్షణ తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ ప్ర భుత్వ సంకల్పానికి అనుగుణంగా వివిధ డిప్లొమా కోర్సులలో సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తే విద్యార్థులు చక్కటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందడానికి ఆస్కారం ఉంటుందన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా బోధనా సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. పాలిటెక్ని క్ కాలేజీలకు మౌలిక సదుపాయాలు, అవసరమైన బోధనా సిబ్బందిని నియమించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలం ఉత్తీర్ణత సాధిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని, ప్రతిభను కొలమానంగా గుర్తిస్తూ ఆయా సంస్థలు ఉపాధి కల్పిస్తున్నాయని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి గుర్తుచేశారు. ప్రభుత్వ ఉద్యోగాల పో టీ పరీక్షలలో నెగ్గుకురావాలంటే ప్రతిభను చాటాల్సిన ఆవశ్యకత నెలకొని ఉందన్నారు. వీరి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేశ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాల్స్, బోధనా సిబ్బంది ఉన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సాంకేతిక విద్యాభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ప్రాధాన్యం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల తనిఖీ -
స్థానికమే పరమార్థం
శనివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2025– 8లో uరంగం సిద్ధం చేసుకుంటున్న బీజేపీ జిల్లాలో ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ సైతం స్థానిక ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకునేందుకు ఎంపీ అర్వింద్ ఆధ్వర్యంలో రంగం సిద్ధం చేసుకుంటోంది. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసేందుకు అర్వింద్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో బలంగా ఉన్న బీజేపీ, అధికార కాంగ్రెస్ను బలంగా ఢీకొట్టేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. దీంతో ఇక్కడ సైతం రెండు జాతీయ పార్టీల మధ్య నువ్వా నేనా అనేలా పోటీ నెలకొనే పరిస్థితి ఉందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ముందుకెళుతోంది. ఇందులో భాగంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ను గవర్నర్కు పంపింది. ఈ ఆర్డినెన్స్ను గవర్నర్ న్యాయ సలహాకు పంపేందుకు నిర్ణయించారు. ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పొలిటికల్ హీట్తో కూడిన సందడి నెలకొంది. బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠగా ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. స్థానిక ఎన్నికల వేడి మెల్లిగా మొదలై ఎన్నికల కోడ్ వచ్చే సమయానికి తారాస్థాయికి చేరుకుంటుందని అంతా అనుకుంటున్న నేపథ్యంలో పరిస్థితి మరోలా తయారవుతోంది. ఆర్డినెన్స్పై గవర్నర్ నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం ఉన్నప్పటికీ జిల్లాలో మాత్రం రాజకీయంగా గరంగరం వాతావరణం నెలకొంది. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్, వేల్పూర్ మండలాల్లో వరుసగా చోటుచేసుకున్న పరిణామాలు ఘర్షణ వాతావరణానికి బీజాలు వేశాయి. భీమ్గల్లో మంత్రి జూపల్లి పర్యటన నేపథ్యంలో నెలకొన్న ఘర్షణ, తాజాగా డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మధ్య మాటల యుద్ధం వల్ల వేల్పూర్లో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు 163 బీఎన్ఎస్ఎస్ యాక్టు అమలు చేసే వరకు వెళ్లింది. కాంగ్రెస్, బీఆర్ఎస్కు చెందిన వందలాది మంది నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా నిర్బంధించడంతోపాటు నిబంధనలు ఉల్లంఘించిన పలువురిని అరెస్టు చేశారు. ఈ రగడ ఇప్పటికీ చల్లారడం లేదు. గల్ఫ్ కార్మికుల అంశం కాస్తా అన్ని విషయాలపై ఇరుపార్టీలు పోటాపోటీగా ఎంచుకునే వరకు వచ్చింది. ● వేల్పూర్ ఘటన నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ స్పందించారు. అధికారం ఉంది కదా అని దాడులకు రావడం సరికాదన్నారు. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొంటామని బాజిరెడ్డి స్పష్టం చేశారు. గల్ఫ్ కార్మికులకు ఏమీ చేయలేదని, అడిగితే దాడులకు దిగడమేమిటన్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా, ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డిని పరామర్శించారు. దాడుల సంస్కృతి సరికాదన్నారు. ● డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి శుక్రవారం మరో ప్రకటన చేశారు. దీంతో మరింత కాక రేగుతోంది. గల్ఫ్ కార్మికుల విషయంలో ప్రశాంత్రెడ్డి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా గల్ఫ్ కార్మిక కుటుంబాలకు పరిహారం ఇచ్చిన విషయాన్ని రుజువు చేసే ప్రయత్నం చేశామన్నారు. ప్రతిపక్షం విమర్శలు చేయొచ్చు కానీ గూండాలను దాడికి సిద్ధంగా ఇంట్లో ఉంచడమేమిటన్నారు. ప్రశాంత్రెడ్డి కంటే తనకు ఎక్కువ రాజకీయ అనుభవముందని మానాల అన్నారు. ప్రశాంత్రెడ్డి తమ్ముడు ఏం చేస్తున్నాడో, గతంలో మానాలలో ప్రశాంత్రెడ్డి అక్రమ కేసులు పెట్టించిన విషయాలు అందరికీ తెలుసన్నారు. అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడితే నంగి దేవేందర్రెడ్డిపై దాడి చేసేవాళ్లా అన్నారు. ప్రతిపక్షాల స్వేచ్ఛను హరిస్తే తాను గృహనిర్బంధంలో ఉంటానా అని మానాల ప్రశ్నించారు. ● ఇదిలా ఉండగా కమ్మర్పల్లిలో బాల్కొండ నియోజకవర్గానికి చెందిన అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రెస్మీట్ పెట్టి ప్రశాంత్రెడ్డిపై విమర్శలు గుప్పించారు. జిల్లావ్యాప్తంగా ఇరు పార్టీల నాయకులు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. న్యూస్రీల్ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పొలిటికల్ హీట్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పల్లెల్లో సందడి బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్పై ఉత్కంఠ కాక పుట్టిస్తున్న నేతల మాటలు బాల్కొండ నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల ప్రకటనలతో ఇతర ప్రాంతాల్లోనూ వేడి జిల్లాలో రాజకీయం వేడెక్కింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగానే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అది అక్కడితో ఆగకుండా ఘర్షణ వాతావరణానికి దారి తీసింది. గల్ఫ్ కార్మికుల అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య రగడ జరుగుతోంది. నిజామాబాద్అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల అమలుపై ప్రశ్నిస్తే దాడులు, అక్రమ కేసులు బనాయిస్తున్నారని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మె ల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. నగరంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ఎన్నారై సెల్పై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నిలదీశారన్నారు. ఇచ్చిన హామీని ప్రశ్నించినందుకే వేల్పూర్ ఘటన చోటుచేసుకుందన్నారు. ఎమ్మెల్యే ఇంట్లోకి కాంగ్రెస్ నాయకుడు అక్రమంగా ప్రవేశించడమే కాకుండా వీడియోలు తీయడం సమంజసం కాదన్నారు. కాంగ్రెస్ నా యకుడిని వదిలేసి తమ కార్యకర్తలపై కేసులు వేయడం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ నాయకు ల ఒత్తిళ్లతో పోలీసులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రెండు జాతీయ పార్టీలు దేశ, రాష్ట్ర అభివృద్ధిపై కాకుండా నాయకుల అభివృద్ధికి పాటుపడుతున్నాయని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కలిసి అవినీతికి పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ విఠల్రావు, మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మొురాయించిన రైల్వే గేటు
మాధవనగర్ వద్ద పూర్తిగా పడని గేటు.. అలాగే వెళ్తున్న రైలునిజామాబాద్ రూరల్: నగర శివారులోని మాధ వనగర్ వద్ద రైల్వే గేటు మొరాయించడంతో అరగంటపాటు ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందిపడ్డారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ వైపు (అకోలా– కాచిగూడ) రైలు వ స్తోంది. దీంతో గేట్మన్ గేటు వేస్తుండగా మధ్య లోనే ఆగిపోయింది. ఒకవైపు రైలు వస్తుండడం, మరోవైపు గేటు పూర్తిగా కిందికి దిగకపోవడంతో ప్రయాణికులు, వాహనదారులను ఆపేందుకు గేట్మన్ ముప్పుతిప్పలు పడ్డాడు. చివరకు తాత్కాలిక గేటును వేశాడు. కొందరు వాహనదారులు గేట్లకు మధ్యలోనే నిలిచిపోయారు. గమనించిన లోకో పైలట్ రైలును నెమ్మది చేశాడు. వెంటనే రైల్వే సిబ్బంది మాధవనగర్ చేరుకొని గేటు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. పూర్తిగా పడని గేటు -
ఉపాధి ఉద్యోగులకు వేతనాల తిప్పలు
మోర్తాడ్(బాల్కొండ): జిల్లాలో ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వేతనాలందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు నాలుగు నెలలు, ఇతర ఉద్యోగులకు మూడు నెలల నుంచి వేతనాలు జమ కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం అమలు కోసం ఇచ్చే నిధుల నుంచే రాష్ట్ర ప్రభుత్వం వేతనాలను చెల్లించాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి నిధులు మంజూరైనా ఉద్యోగులకు వేతనాలు చెల్లించడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్థం కావడం లేదని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో పేదరిక నిర్మూలన సంస్థ, ఉపాధి హామీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. రెండు విభాగాల ఉద్యోగులు కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలను పర్యవేక్షిస్తున్నారు. పేదరిక నిర్మూలన సంస్థ ఉద్యోగులకు క్రమం తప్పకుండా వేతనాలను చెల్లిస్తున్నారు. ఉపాధి చూపే ఉద్యోగులకు మాత్రం నెలల తరబడి వేతనాలు చెల్లించడం లేదు. ఉద్యోగుల వేతన చెల్లింపులపై ‘సాక్షి’ ఉన్నతాధికారులను వివరణ కోరగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య ఉందని వెల్లడించారు. ఉద్యోగులు పడుతున్న ఆర్థిక ఇబ్బందుల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా త్వరలో వేతనాలను చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. జిల్లాలో ఉపాధి ఉద్యోగులు నెలల తరబడి నిలిచిన జీతాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉద్యోగులు ప్రభుత్వం స్పందించాలని వేడుకోలు -
అభివృద్ధిపై చర్చకు ఎప్పుడైనా సిద్ధమే
నిజామాబాద్ సిటీ: అభివృద్ధిపై చర్చించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి అన్నారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి తనపై నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేయడం తగదని సూచించారు. ఇటీవల జరిగిన వేల్పూరు ఘటనపై శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రశాంత్రెడ్డి స్వగ్రామమైన వేల్పూర్లో గురువారం జరిగిన ఘటనలకు ప్రశాంత్రెడ్డే బాధ్యత వహించాలన్నారు. గల్ఫ్ బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై ప్రశాంత్రెడ్డి, హరీష్రావు, కేటీఆర్లు అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు. ఈ విషయం చర్చించేందుకు ప్రశాంత్రెడ్డికి కనువిప్పు కలిగిద్దామనుకుంటే ఆయన రాకుండా హైదరాబాద్లో దాక్కున్నాడని విమర్శించారు. దాడులు చేసే సంస్కృతి కాంగ్రెస్కు లేదన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో ఆయనన ప్రశ్నించినవారిపై ప్రశాంత్రెడ్డి అక్రమ కేసులు బనాయించారని గుర్తుచేశారు. నంగి దేవేందర్ రెడ్డిపై దాడికి పరోక్షంగా పురిగొల్పింది ప్రశాంత్రెడ్డే అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే మాత్రం చేతులు ముడుచుకొని కూర్చోను అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై గాని, తనపైగాని నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రశాంత్రెడ్డీ..! నాపై తప్పుడు ఆరోపణలు మానుకో డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార సంఘాల చైర్మన్ మానాల మోహన్రెడ్డి -
‘జెడ్పీ’పై బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయం
సుభాష్నగర్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని, జెడ్పీపై బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని అన్ని సర్వేలు చెప్పాయని తెలిపారు. స్థానిక సమస్యలను గుర్తిస్తూ మండలస్థాయిలో పాదయాత్రలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. జూలై 29, 30 తేదీల్లో మహా సంపర్క్ అభియాన్, ఆగస్ట్ 1, 2, 3 తేదీల్లో మండలాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి బైక్ ర్యాలీ చేపట్టాలని, అనంతరం మండల అధికారులకు వినతిపత్రం సమర్పించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ, పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డి, జిల్లా ప్రభారి కాంతారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాశ్రెడ్డి, మల్లికార్జున్రెడ్డి, బస్వా లక్ష్మీనర్సయ్య, పెద్దోళ్ల గంగారెడ్డి, వడ్డే మోహన్రెడ్డి, లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, స్రవంతి రెడ్డి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
మురుగునీరు.. కెమికల్ నురగలు..
మాక్లూర్: మండలంలోని మాణిక్భండార్ సమీపం నుంచి ప్రవహించే పులాంగ్ వాగు పూర్తిగా కలు షితమవుతోంది. దీంతో ఆ నీటిని సమీప గ్రామాల్లోని పశువులు తాగుతుండటంతో పశుపెంపకం దారులు ఆందోళళన చెందుతున్నారు. కలు షిత వాగు నీటిని పశువులు తాగి మృతి చెందే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. ఇదీ పరిస్థితి.. నిజామాబాద్ పులాంగ్ నుంచి మొదలైన వాగు మాక్లూర్ మండలంలోని మాణిక్భండార్, బొర్గాం(కె), కృష్ణనగర్, ముల్లంగి (బి), బొంకన్పల్లి, వల్లభాపూర్, జన్నేపల్లి, చిక్లి ద్వారా ప్రవహించి నవీపేట, నందిపేట మండలాల సరిహద్దులో ఉన్న గోదావరి నదిలో కలుస్తుంది. సుమారు 30 కిలోమీటర్ల పొడువునా ప్రవహించే ఈ వాగులో నగరంలోని మురుగుతోపాటు, సమీప గ్రామాల నుంచి వ్యర్థాలు చేరడంతో కలుషితమవుతోంది. అలాగే వాగు సమీపంలోని పలు రైస్మిల్లుల నుంచి కెమికల్స్ను వాగులోని వదలడంతో వాగు నీరంత విషపూరితంగా మారుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికెన్ సెంటర్ల నిర్వాహకులు రాత్రి సమయాల్లో వ్యర్థాలను తెచ్చి ఆకుల కొండూర్, పూలాంగ్, జన్నేపల్లి వంతెనల వద్ద పారవేస్తుండటంతో నీరు మరింత కలుషితం అవుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. పొరపాటున వాగు నీటిని తాకితేనే శరీరం మొత్తం దద్దుర్లు ఏర్పడుతున్నాయని వాపోతున్నారు. అలాంటి నీటిని పశువులు తాగితే మృతిచెందే అవకాశం ఉంటుందంటున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి వాగులో వ్యర్థాలు కలువకుండా, నీరు కలుషితం కాకుండ తగినచర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కలుషితమవుతున్న పులాంగ్ వాగు ఆందోళన చెందుతున్న పశుపెంపకందారులుకలుషిత నీటిని ఇవ్వొద్దు కెమికల్, వ్యర్థాలతో కూడిన నీరు పశువులు తాగటం వల్ల పాడిగేదె కడుపు అంత విషపూరితం అవుతుంది. మేత కూడ తినదు. పశువులను అట్టి కలుషిత నీరు తాగకుండా చూసుకోవటమే ఉత్తమం. వల్లభాపూర్లో కుర్మ బీరయ్య పాడి గేదె కలుషితనీరు తాగి మృతి చెందింది. ఆ గేదెకు వైద్యం అందించినా ఫలితం లేకుండా పోయింది. – కిరణ్దేశ్పాండే, పశువైద్యాధికారి, మాక్లూర్నా పాడి గేదె చనిపోయింది.. నాకు 10కి పైగా పాడిగేదెలు ఉన్నాయి. రోజూ పులాంగ్ వాగు పరిసర ప్రాంతాల్లోనే వాటిని మేపుతుంటాను. ఎంత దాహం వేసినా మురికి నీటిని గేదెలు తాగవు. కానీ రెండు నెలల క్రితం ఓ గేదె అధిక దాహంతో వాగులోని మురికి నీరు తాగి చనిపోయింది. అధికారులు స్పందించి, వాగును కలుషితం నుంచి కాపాడాలి. – కుర్మ బీరయ్య, పశుపెంపకందారు, వల్లభాపూర్ -
‘నిజాంసాగర్’ నీటిని విడుదల చేయాలి
బోధన్: నిజాంసాగర్ ప్రాజెక్టు డి–46 కాలువకు నీరు విడుదల చేసి ఎండుతున్న పంటలను కాపాడాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం ఎడపల్లి మండలంలోని సాటాపూర్ గేట్ వద్ద నిజామాబాద్ వెళ్లే ప్రధాన రోడ్డుపై ఎడపల్లి, బోధన్ మండలాల్లోని ఆయకట్టు రైతులు రాస్తారోకో నిర్వహించారు. డి–46 కాలువ ఎడపల్లి, బోధన్, రెంజల్ మండలాల్లో విస్తరించి ఉండగా, ఈ కాలువ కింద సుమారు 600 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. రైతులు ఈ ఏడాది వానాకాలం సీజన్లో వరి నాట్లు వేశారు. వర్షాలు పడకపోవడం వల్ల కాలువ నీటి ఆధారంగా సాగు చేసిన వరి పైరు ఎండిపోయే పరిస్థితికి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు కోరారు. సమాచారం అందుకున్న ఎడపల్లి ఎస్సై రమా, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని రైతులను సముదాయించారు. నీటిపారుదల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని రైతులకు తెలిపారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. -
క్రమశిక్షణ, సమయ పాలనే ప్రధానం
బోధన్: ఎన్సీసీ విద్యార్థులకు క్రమ శిక్షణ, సమయపాలన అత్యంత ప్రాధాన్యమని నిజామాబాద్ ఎన్సీసీ బెటాలియన్ కమాండెంట్ కల్నల్ విష్ణు నాయర్ అన్నారు. బోధన్ శివారులోని ఆచన్పల్లి ప్రాంతంలోగల ఇందూర్ హైస్కూల్లో శుక్రవారం ఎన్సీసీ ‘ఏ’ కాడెట్లకు సర్టిఫికెట్ల ప్రదానోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. విద్యార్థులు ఎన్సీసీ శిక్షణలో నైపుణ్యం సాధించి సైనికులుగా దేశానికి సేవలందించే అవకాశం ఉంటుందన్నారు. పాఠశాల కరస్పాండెంట్ కొడాలి కిషోర్ మాట్లాడుతూ.. తమ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్సీసీ యూనిట్ ద్వారా అనేక విద్యార్థులు శిక్షణ పొంది ఆర్మీలోని వివిధ హోదాల్లో పని చేస్తున్నారన్నారు. 44 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. 50 మంది విద్యార్థులను కొత్తగా నమోదు చేసుకున్నారు. హెచ్ఎం రామారావు, ఎన్సీసీ సిబ్బంది సుబేదార్ అనూజ్రాణ, బీహెచ్ఎం సతీంధర్జీత్, హవల్దార్ శ్రీకాంత్,ఏఎన్వో సాయిలు, పీఈటీ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
నవీపేట: మండలంలోని నాళేశ్వర్ వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై వినయ్ శుక్రవారం తెలిపారు. గురువారం రాత్రి వాగు నుంచి ఇసుకను తోడి జన్నెపల్లి వైపు వెళ్తున్న నాలుగు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే శుక్రవారం వేకువ జామున వాగు నుంచి ఇసుకతో బయటకు వస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. మాక్లూర్ మండలంలో.. మాక్లూర్: మండలంలోని మాణిక్భండార్ చౌరస్తా వద్ద అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్ను శుక్రవారం తెల్లవారుజామున టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకుని మాక్లూర్ పోలీసులకు అప్పగించారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు నిఘా ఉంచి, టిప్పర్ను పట్టుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఇసుకతో ఉన్న టిప్పర్ తమ ఆధీనంలో ఉందని తదుపరి చర్యల కోసం విచారణ చేపట్టినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఫారెస్ట్ అధికారుల అడ్డగింత వర్ని: వర్ని ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని సిద్ధాపూర్ అ టవీ ప్రాంతంలో గిరిజనులు వేసిన మొక్కజొన్న పంటను శుక్రవారం అటవీశాఖ అధికారులు ధ్వంసం చేయడానికి యత్నించారు. విషయం తెలుసుకున్న గిరిజనులు వెంటనే వారిని అడ్డుకున్నారు. సుమారు 15 ఎకరాల స్థలంలో గిరిజనులు మొక్కజొన్న పంట వేయగా అటవీ భూమిని కబ్జా చేస్తున్నారని అధికారులు పేర్కొంటూ, ధ్వంసం చేయడానికి యత్నించారు. -
పథకం ప్రకారమే కోనాపూర్ దారి దోపిడీ
కమ్మర్పల్లి: మండలంలోని కోనాపూర్ గ్రామ శివారులో బుధవారం జరిగిన దారి దోపిడీ అంతా పథకం ప్రకారమే జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటనలో బాధితుడి వెంట వచ్చిన వ్యక్తే కుట్రదారుడు కాగా, మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి కుట్ర పన్ని దోపిడీకి పాల్పడ్డారు. నిందితులను అరె స్టు చేశారు. కమ్మర్పల్లి పోలీస్స్టేషన్లో శుక్రవారం భీమ్గల్ సీఐ పొన్నం సత్యనారాయణ వివరాలను వెల్లడించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగినపల్లికి చెందిన కొమ్ము లక్ష్మీనారాయణ అనే వ్యక్తి వరికోత యంత్రం కొనుగోలు చేయడానికి రూ. 3.50 లక్షల నగదుతో భీమ్గల్ మండలం పల్లికొండకు ఈనెల 16న బయలుదేరాడు. అతడికి తోడుగా తెలిసిన వ్యక్తి బోదాసు జలంధర్ను వెంట తీసుకెళ్లాడు. జలంధర్ ఆ డబ్బులను కాజేయాలని కుట్ర పన్ని ఈ విషయాన్ని కొన్ని రోజులకు ముందే గుంటూర్ జిల్లా సత్తెనపల్లెలో ఉండే వరుసకు అన్నయ్య అయ్యే బోదాసు రాజశేఖర్కు ఫోన్లో సమాచారం అందించాడు. ఈ విషయం రాజశేఖర్ తన బావమరిది ప్రసాద్కు చెప్పి కుట్రపన్నారు. ఈక్రమంలో జలంధర్ వారిని కోరుట్ల ప్రాంతానికి రప్పించాడు. అనంతరం జలంధర్ లక్ష్మీనారాయణతో కలిసి బైక్పై పల్లికొండకు బయలుదేరారు. కోనాపూర్ శివారులోని అటవీ ప్రాంతానికి చేరుకోగానే, అక్కడే మాటు వేసి ఉన్న రాజశేఖర్, ప్రసాద్లు స్కూటీపై వచ్చి వారి బైక్ను అడ్డగించారు. కత్తులు చూపి బెదిరించి లక్ష్మీనారాయణ వద్ద నుంచి రూ. 3.50 లక్షల నగదు, రెండు మొబైల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు. జలంధర్పై అనుమానంతో దర్యాప్తు చేసిన పోలీసులు సాంకేతిక సహాయంతో సమాచారం సేకరించారు. మెట్పల్లి లాడ్జీలో ఉన్న జలంధర్, బోదాసు రాజశేఖర్, ప్రసాద్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రూ. 3.45 లక్షల నగదు, కత్తి, స్కూటీ, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దోపిడీకి పాల్పడింది తామేనని నిందితులు అంగీకరించనట్లు సీఐ పేర్కొన్నారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై అనిల్రెడ్డిని, ఐడీ పార్టీ కానిస్టేబుళ్లను సీఐ అభినందించారు. ముగ్గురు నిందితుల అరెస్ట్ నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం -
భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు
నిజామాబాద్ లీగల్: భార్యను చంపిన కేసులో భర్తకు నిజామాబాద్ మొదటి అదనపు జిల్లా కోర్టు జీవితఖైదు శిక్ష విధించింది. వివరాలు ఇలా.. జక్రాన్పల్లి మండలం గన్యాతండాకు చెందిన కేలోత్ శ్రీనివాస్, భార్య సరిత పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. మద్యానికి బానిసైన శ్రీనివాస్ తరచు భార్యతో గొడవ పడుతుండే వాడు. ఈక్రమంలో మార్చి 1, 2025న కుటుంబ పోషణ విషయంలో సరిత తన భర్తతో గొడవ పడింది. అనంతరం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను వెంటనే స్థానికులు అడ్డుకోగా, కొద్దిసేపటికే ఇంటికి వచ్చిన శ్రీనివాస్కు తన కూతురు ఈ ఘటనను వివరించింది. అనంతరం భార్యతో అతడు గొడవపడి గొడ్డలి కామతో కొట్టి చంపి, పరారయ్యాడు. మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, శ్రీనివాస్ను అరెస్టు చేసి, కోర్టు లో హాజరుపర్చారు. విచారణ చేపట్టిన జడ్జి జివిఎన్ భరతలక్ష్మి నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ. 5000 జరిమానా విధించింది. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ వాదించారు. బైక్ చోరీ కేసులో నిందితుడికి 8నెలల జైలు ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలో బైక్ చోరీకి పాల్పడిన నిందితుడికి 8 నెలల జైలు శిక్ష విధిస్తు ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి సుష్మ శుక్రవారం తీర్పు వెలువరించినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. వివరాలు ఇలా.. లింగంపేట మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన బాబు తన బైక్ను గత ఏడాది జనవరి 4న ఎల్లారెడ్డిలోని వెంకటేశ్వర హాస్పిటల్ ఆవరణ ఉంచాడు. పెద్దకొడప్గల్ మండలంలోని బేగంపూర్తండాకు చెందిన చవాన్ సుభాష్ సదరు బైక్ను చోరీ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకున్నారు. అతడిని కోర్టులో హాజరుపర్చగా, సాక్షులను విచారించిన అనంతరం సుభాష్కు న్యాయమూర్తి 8 నెలల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తు తీర్పు వెలువరించారు. గంజాయి విక్రయిస్తున్న వృద్ధురాలు అరెస్టు ఖలీల్వాడి: నగరంలోని ద్వారకనగర్ గంజాయి విక్రయిస్తున్న ఖాజీబీ అహ్మదీబేగం అనే వృద్ధురాలిని అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏడీ స్వప్న తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం ఖాజీబీ ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టగా 450 గ్రామలు ఎండు గంజాయిను పట్టుకున్నారు. అలాగే 2 ఫోన్లను స్వాధీనం చేసుకొని, ఆమెను అరెస్టు చేశారు. నిందితురాలిపై గతంలో పలు కేసులు ఉన్యాయని, కొన్ని సంవత్సరాలుగా రహస్యంగా ఎండు గంజాయి విక్రయిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎస్సై నర్సింహాచారి, సిబ్బంది రాజన్న, భూమన్న, శ్రీనివాస్, ప్రసాద్ శ్యామ్ సుందర్, కానిస్టేబుళ్లు భోజన్న, సమీర్, శివ, గంగారమ్, శ్యామ్ తదితరులు ఉన్నారు. ఆలయంలో చోరీ నిజామాబాద్ రూరల్: మండలంలోని కేశాపూర్ గ్రామంలోగల మహలక్ష్మి అమ్మవారి ఆలయంలో చోరీ జరిగినట్లు రూరల్ ఎస్హెచ్వో ఆరీఫ్ తెలిపారు. ఆలయంలో గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు చొరబడి రూ.15 వేలు, రెండు గ్రాములు బంగారం, రెండు తులాల వెండి అభరణాలను ఎత్తుకెళ్లారన్నారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయినట్లు వివరించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వాటర్ ట్యాంకర్ బోల్తా నస్రుల్లాబాద్: మండలంలోని జాతీయ రహదారి పనులకు ఉపయోగిస్తున్న వాటర్ ట్యాంకర్ శుక్రవారం అదుపు తప్పి బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. నీటిని సరఫరా చేసి మళ్లీ నింపుకోవడానికి వెళుతుండగా కామిశెట్టిపల్లి నీలం కట్ట ప్రాంతంలో వాహనం అదుపు తప్పిందన్నారు. డ్రైవర్ చాకచక్యంతో దూకేయడంతో ప్రమాదం తప్పిందన్నారు. -
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
నిజామాబాద్ రూరల్: ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సీపీ సాయి చైతన్య అన్నారు. క్యాన్సర్ను ఎదుర్కోవాలంటే ముందుస్తు వైద్య పరీక్షలతోనే గుర్తించి, చికిత్స తీసుకుంటేనే వ్యాధిని నయం చేసుకోవచ్చన్నారు. మాధవనగర్లోని క్యాన్సర్ ఆస్పత్రిలో శుక్రవారం ‘క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగాం నిర్వహించారు. అలాగే అమెరికాలో నివసిస్తున్న భారత సంతతి వైద్య విద్యార్థుల కోసం రూపొందించిన ప్రత్యేక ఇంటర్షిప్ ప్రోగ్రాం ‘‘బ్రిడ్జింగ్ బోర్డర్స్’’ను ప్రారంభించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ముందస్తు వైద్య పరీక్షలు మన జీవితాల నాణ్యతను పెంపొందించగలవన్నారు. అంకాలజీ వైద్యుడు చిన్నబాబు మాట్లాడుతూ.. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, బ్రిడ్జ్ గ్యాప్ హాస్పిటల్స్ సంయుక్తంగా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం కమిషనర్ 8వ ఎడిషన్ గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్– 2025 పోస్టర్ను ఆవిష్కరించారు. శ్రీ రామ్ అయ్యర్, రచయిత, ప్రభుత్వ పాలసీ సలహాదారు వర్మ జంపానా, డాక్టర్ జీవన్రావు, ప్రతిమరాజ్ పాల్గొన్నారు. ప్రశాంత్రెడ్డిని కలిసిన బిగాల వేల్పూర్: హైదరాబాద్లో ఉన్న బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డిని శుక్రవారం నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా కలిశారు. వేల్పూర్లో గురువారం ప్రశాంత్రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడుల సంస్కృతికి తెరలేపవద్దన్నారు. ప్రశాంత్రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని పోలీసులు అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలినిజామాబాద్అర్బన్: మైనార్టీ విద్యార్థులు ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని మై నార్టీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్, ఫైనా న్స్, సర్వీసెస్, ఇన్సూరెన్స్ సెక్టార్లలో ఉచిత శిక్షణ ఇస్తుందన్నారు. శిక్షణ కార్యక్రమం హైదరాబాద్లో మాత్రమే ఉంటుందని తెలిపారు. డిగ్రీలో కనీసం 50శాతం మార్కులు, 26 సంవత్సరాలలోపు తక్కువ వయసు, తల్లిదండ్రుల ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉండాలని పేర్కొన్నారు. వచ్చే నెల 18వ తేదీ వరకు దరఖాస్తులను గూగుల్ ఫా రం ద్వారా సంబంధిత జిల్లా మైనార్టీ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి● డీఈవో అశోక్ డిచ్పల్లి: మారుతున్న కాలానికనుగుణంగా విద్యార్థులు ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ను పెంపొందించుకోవాలని డీఈవో అశోక్ సూచించారు. డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం కాకతీయ సాండ్ బాక్స్ దేశ్ పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్కిల్ ఇన్ విలేజ్ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంగ్లిష్, లైఫ్ స్కిల్స్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రైమరీ, హైస్కూల్ హెచ్ఎంలు సంధ్యనాయక్, సూర్యకుమారి, ఉపాధ్యాయులు, వి ద్యార్థులు, కాకతీయ సాండ్ బాక్స్ దేశ్పాండే ఫౌండేషన్ ప్రతినిధులు సాహితీ మేడూరి, మధు ఎడ్ల, గంగాప్రసాద్, భానుప్రసాద్, రూప, భాగ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
అహ్మదీ బజార్లో ఆక్రమణల తొలగింపు
ఖలీల్వాడి: నగరంలోని ఆహ్మదీబజారులోని శంభునిగుడి ప్రాంతంలో రోడ్డును అక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలను శుక్రవారం సాయంత్రం ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. అంతకుముందు రోడ్డుపైన షాపులు, తోపుడు బండ్లను ఏర్పాటు చేస్తే వాహనాదారులకు ఇబ్బందులు ఏర్పడతాయని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ ఆలీ, సీఐ ప్రసాద్, సిబ్బంది దుకాణాదారులకు సూచించారు. అనంతరం ఆక్రమణల తొలగింపు చేపట్టారు. ఈక్రమంలో అధికారులను కొందరు స్థానికులు చుట్టుముట్టి బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షెహబాజ్, హర్షద్, మజీద్తోపాటు కొంత మంది పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఏసీపీ రాజావెంకట్రెడ్డి దృష్టికి వెళ్లడంతో వెంటనే అదనపు బలగాలను పంపించి వారి చెదరగొట్టారు. రెండో టౌన్ ఎస్సై సయ్యద్ ముజాహిద్ ఘటన స్థలానికి చేరుకొని నలుగురిని అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. దీనిపై ట్రాఫిక్ పోలీసులు రెండో టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే కుమార్ గల్లీలోనూ రోడ్డుపై ఉన్న ఆక్రమణలను పోలీసులు తొలగించగా దుకాణాదారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దుకాణాదారులతో అధికారులు మాట్లాడి, రోడ్డుకు అడ్డంగా ఉన్న వాటిని తొలిగించారు. అంతుచూస్తామంటూ పోలీసులకు స్థానికుల బెదిరింపు -
మేకల కొట్టంపై చిరుత పులి దాడి
బోధన్: ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివారులో మేకల కొట్టంపై బుధవారం రాత్రి చిరుత పులి దాడి చేసి ఒక మేకను తీసుకెళ్లింది. వివరాలు ఇలా.. జానకంపేట గ్రామానికి చెందిన వెల్మలా సందీప్కు గ్రామ శివారులోని నవీపేట–బాసర రైల్వేగేట్ అవతల మేకల కొట్టం ఉంది. ఈ కొట్టంలో అతడు మేకలతోపాటు కొన్ని గేదెలను సంరక్షిస్తున్నాడు. కొట్టంపై బుధవారం రాత్రి చిరుత పులి దాడి చేసి ఒక మేకను తీసుకెళ్లింది. వెంటనే ఈ విషయాన్ని అతడు అటవీశాఖ అధికారులకు తెలిపాడు. గురువారం అటవీశాఖ నవీపేట సెక్షన్ బీట్ ఆఫీసర్ సుధీర్ ఘటన స్థలానికి వెళ్లి పరిసరాలను పరిశీలించారు. చిరుత పులిదాడి ఘటన వాస్తవమేనని ధ్రువీకరించారు. ఎడపల్లి మండలం ఠాణాకలాన్ గ్రామ శివారులో మూడు నెలల క్రితం చిరుత పులి సంచరించింది. నవీపేట మండలంలోని అటవీ ప్రాంత గ్రామాల్లో చిరుత పులుల సంచారం ఉందని జిల్లా అటవీశాఖ అధికారి సంజయ్గౌడ్ తెలిపారు. చిరుత సంచారంతో జానకంపేటతోపాటు పోచారం, దూపల్లి గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. -
1962 యాప్ను సద్వినియోగం చేసుకోవాలి
బోధన్రూరల్: పాడి రైతులు 1962 (భారత్ పశుదాన్) యాప్ను సద్వినియోగం చేసుకోవా లని పశుసంవర్ధక శాఖ కేంద్ర కార్యాలయం హైదరాబాద్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆఫీసర్ ఎండీ అజారుద్దీన్ అన్నారు.మండలంలోని పలు గ్రామాల్లో గురువా రం ఆయన పర్యటించి, పశుసంవర్ధక శాఖ అధికారులు, గోపాల మిత్ర సభ్యులు అందిస్తున్న సేవల ను పరిశీలించారు. పాడి రైతులతో మాట్లాడి, గోపా ల మిత్ర, పశుసంవర్ధక శాఖ సేవలను ఆరా తీశా రు. పాడి రైతులు ప్రతి ఒక్కరూ 1962 (భారత్ పశుదాన్) యాప్లో తమ పశువుల వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన సూ చించారు. ఈ యాప్ ద్వారా పశువుల లింగనిర్ధారిత, కృతిమ గర్భాధారణ సిమెన్, ప్రభుత్వ వ్యాక్సినేషన్లు, పశువుల అమ్మకాలు, కొనుగొలు వంటి సేవలను పొందవచ్చన్నారు. గోపాల మిత్ర సభ్యులు ఆ రీఫ్, ఆజ్మత్, పాడి రైతులు పాల్గొన్నారు. -
ఘనంగా బోనాల ఉత్సవం
నిజామాబాద్ అర్బన్: నగరంలోని పాత కలెక్టరేట్ ఆవరణలో గురువారం తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు ఘ నంగా జరిగాయి. మహిళలు, అధికారులు బోనాల తో పాత కలెక్టరేట్ వద్ద ఉన్న అమ్మవారి ఆలయా నికి ఊరేగింపుగా చేరుకొని, బోనాలు, సారే సమర్పించారు. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశా రు. ప్రతి ఏడాది ఆషాడమాసంలో టీజీవో ఆధ్వ ర్యంలో బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు అలుక కిషన్ అన్నారు. వేడుకల్లో అ ర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య బోనా లు ఎత్తుకొని పాల్గొన్నారు. ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. టీజీవో ప్రతినిధులు శ్రీనివాస్ గౌడ్, సత్యనారాయణ ఉన్నారు. -
జిట్టపులి దాడిలో లేగదూడ మృతి
సిరికొండ: మండలంలోని పాకాల శివారులో జిట్ట పులి (లియోపార్డ్) దాడిలో లేగ దూడ మృతి చెందినట్లు అటవీశాఖ అధికారి సాయికిరణ్ తెలిపారు. మృతి చెందిన లేగ దూడ పాకాల గ్రామానికి చెందిన తేజావత్ బాబుకు చెందినదన్నారు. ఉమ్మడి జిల్లా అడవుల్లో పెద్దపులి సంచారం నేపథ్యంలో ఘటన స్థలాన్ని డీఎఫ్వో నిఖిత, ఆర్మూర్ ఎఫ్డీవో భవాని శంకర్, యానిమల్ ట్రాకర్స్, రేంజ్ సిబ్బంది సందర్శించారు. లేగ దూడను పెద్దపులి కాదని జిట్ట పులి చంపినట్లు నిర్దారించారు. లేగ దూడ కళేబరానికి పశు వైద్య శాఖ అసిస్టెంట్ సర్జన్ పోస్టు మార్టం చేశారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం పాడి రైతుకు అటవీ శాఖ ద్వారా నష్ట పరిహారం చెల్లిస్తామని డీఎఫ్వో తెలిపారు. అటవీ ప్రాంతాలకు ఆనుకొని ఉన్న ప్రజలు అనుమతి లేకుండా అడవుల్లోకి వెళ్లవద్దని ఆమె సూచించారు. పశువుల కాపరులు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపే అడవిలోకి కొద్ది దూరం మాత్రమే వెళ్లి తిరిగి రావాలన్నారు. పొలాల్లో పనులకు వెళ్లేటప్పుడు గుంపులుగా, పెద్ద శబ్దాలు చేస్తు వెళ్లాలన్నారు. ఎవరైనా ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గాని వన్యప్రాణులకు ప్రాణహాని కలిగించినచో కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. -
పీఈటీల సేవలు అభినందనీయం
నిజామాబాద్నాగారం: జిల్లాలోని ప్రయివేట్ బడుల్లో సౌకర్యాలు అంతంత మాత్రమే ఉన్నా పీఈటీ(ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్)లు క్రీడాకారుల అభివృద్ధికి కృషిచేస్తుండటం అభినందనీయమని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి(డీవైఎస్వో) పవన్ కుమార్ అన్నారు. డీవైఎస్వోగా పవన్ కుమార్ ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గురువారం నగరంలోని టీఎన్జీవోస్ భవనంలో జిల్లా ప్రయివేట్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా పవన్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లా లో క్రీడల అభివృద్ధికి మీ అందరి సహకారం కావాలని కోరారు. ఒలింపిక్ సంఘం జిల్లా కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు నాగమణి, విద్యాసాగర్ రె డ్డి, మల్లేష్ గౌడ్, గోపిరెడ్డి, శ్రీనివాస్, కృష్ణంరాజు, పశాంత్, మురళి, మధుబాబు, నాగరాజు, నిఖిల్, వినోద్ తదితరుల పాల్గొన్నారు. ప్రభంజన్కు ఘన నివాళి తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో గురువారం సామాజిక విప్లవకారుడు, రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు, బీసీ పోరా ట యోధుడు ప్రొఫెసర్ ప్రభంజన్ కుమార్ యాదవ్ సంతాప సభలు నిర్వహించారు. తె యూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, మాస్ కమ్యూనికేషన్ విభాగాలు వేర్వేరుగా నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రభంజన్ చిత్రపటానికి అధ్యాపకులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది పూ లమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా తెయూ రిజిస్ట్రార్ యాదగిరి, సోషల్ సైన్స్ డీన్ ఘంటా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రభంజన్ కుమార్ అకాల మరణం బహుజనవాదానికి తీరని లోటని అన్నారు. మాస్ కమ్యూనికేషన్ విభాగంలో మూడు రో జులు సంతాపదినాలుగా ప్రకటించారు. టూ టా అధ్యక్షుడు పున్నయ్య, ప్రధాన కార్యదర్శి మోహన్బాబు, ప్రొఫెసర్ కనక య్య, అధ్యాపకులు జమీల్ అహ్మద్, అడికె నాగరాజు, రమణాచారి, సత్యనారాయణ రెడ్డి, రాజేశ్వరి, రాంబాబు, కిరణ్మయి పాల్గొన్నారు. నంగి దేవేందర్ రెడ్డికి పరామర్శ నిజామాబాద్ సిటీ: వేల్పూరులో బీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడ్డ టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కో–కన్వీనర్ నంగి దేవేందర్రెడ్డి జిల్లాకేంద్రంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికి త్స పొందుతున్నాడు. గురువారం రాత్రి డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి, ఈరవత్రి అ నిల్ ఆస్పత్రికి వచ్చి దేవేందర్ రెడ్డిని పరామ ర్శించారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని అతడికి భరోసా కల్పించారు. దా డులు చేయడం కాంగ్రెస్ సంస్కృతి కాదని, ఇ లాంటి ఘటనలు పునరావృతం అయితే కాంగ్రెస్ శ్రేణులు చేతులు ముడుచుకొని కూర్చోరన్న విషయం గుర్తుంచుకోవాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డికి సూచించారు. -
నీటిని ఎత్తిపోసేదెలా?
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో 1045 అడుగులు నీటి మట్టం వద్ద నిర్మించిన లక్ష్మి ఎత్తిపోతల పథకం సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్లు నెలరోజుల క్రితం చోరీకి గురయ్యాయి. గుర్తుతెలియని దుండగులు ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్, ఆయిల్ను ఎత్తుకెళ్లారు. అయినా ఇప్పటికీ వాటి స్థానంలో కొత్త వాటిని అధికారులు ఏర్పాటు చేయలేదు. నీటి విడుదలకు డిమాండ్.. లక్ష్మి హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రాజెక్ట్ నీటి మట్టం 1064 వరకే సరఫరా జరుగుతుంది. తర్వాత ప్రాజెక్ట్ నుంచి నీటిని లక్ష్మి లిప్ట్ ద్వారా లిప్టు చేసి కాలువ హెడ్ రెగ్యులేటర్ వరకు సరఫరా చేయాలి. కానీ విద్యుత్ సరఫరా కోసం ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లు లేకపోవడంతో విద్యుత్ సరఫరా లేకుండా పోయింది. ప్రస్తుతం వర్షభావ పరిస్థితుల వలన ప్రాజెక్ట్ నుంచి లక్ష్మి కాలువ ద్వారా నీటి విడుదలకు డిమాండ్ పెరుగుతుంది. ఈనేపథ్యంలో నీటి విడుదలకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. లక్ష్మి లిప్టును నిర్మాణం చేపట్టిన కంపెనీ ఇప్పటికీ ప్రాజెక్ట్ అధికారులకు అప్పగించలేదు. దీంతో ప్రస్తుతం ట్రాన్స్ఫార్మర్లను బిగించే బాధ్యత కంపెనీ వారే చూసుకోవాలి. రికవరీ కోసం అధికారులు కంపెనీ ప్రతినిధులకు లేఖలు రాశారు. కానీ ఇంకా అమలులోకి రావడం లేదు. ప్రాజెక్ట్ అధికారులు ఆ లిఫ్ట్ను మైనర్ ఇరిగేషన్ బాల్కొండకు అప్పగించారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి వెంటనే ట్రాన్స్ఫార్మర్లు బిగించేలా చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. లక్ష్మి ఎత్తిపోతల పథకం విద్యుత్ సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ల చోరీ నెలరోజులు గడిచినా కొత్తవాటిని ఏర్పాటు చేయని వైనం ట్రాన్స్ఫార్మర్ వెంటనే బిగించాలి.. లక్ష్మి లిఫ్ట్ సబ్స్టేషన్లో చోరీకి గురైన ట్రాన్స్ఫార్మర్ స్థానంలో వెంటనే కొత్త వాటిని బిగించాలి. ప్రస్తుతం వర్షాలు పడకపోవడంతో నారు మడులు ఎండిపోతున్నాయి. ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి, నీటి విడుదల చేపడితే నారు మడులను కాపాడుకుంటాం. – గంగారెడ్డి, ఆయకట్టు రైతు, ముప్కాల్ త్వరలోనే బిగిస్తారు.. సబ్స్టేషన్ నుంచి ట్రాన్స్ఫార్మర్ల చోరీ విషయాన్ని నిర్మించిన కంపెనీకి తెలియజేశాం. అంతేకాకుండ రికవరీ కోసం లెటర్ పెట్టాం. కంపెనీ వారు త్వరలోనే బిగిస్తామని తెలిపారు. లేదా ఓఅండ్ఎం నిధుల నుంచైన పనులు చేపిస్తాం. – ప్రవీణ్రెడ్డి, ఏఈఈ, మైనర్ ఇరిగేషన్, బాల్కొండ. -
కేంద్రం వాటా కోసం తంటాలు
మోర్తాడ్(బాల్కొండ): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం కింద లబ్ధిదారులుగా ఎంపికై న వారి వివరాలను మరోమారు సేకరించడానికి పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ వార్డు అధికారులు సర్వేను ముమ్మరం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలంటే మరోమారు సర్వే నిర్వహించాల్సి ఉందని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. ఈసారి ఆవాస్ ప్లస్ 2024 యాప్లో.. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి అంతే మొత్తంలో ఇళ్ల నిర్మాణంకు ఆమోదం తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షల సాయం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో కేంద్రం వాటా కూడా ఉండాలంటే ఆ ప్రభుత్వం సూచించిన విధంగా లబ్ధిదారుల ఎంపిక నిర్వహించాలి. గతంలో అధికారులు ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్లో లబ్ధిదారుల వివరాలను నమోదు చేయగా, ఈసారి ఆవాస్ ప్లస్ 2024 యాప్ ద్వారా పీఎంఏవై–జీలో నమోదు చేయాల్సి ఉంది. మూడు రోజులుగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల వద్దకు వెళ్లి కేంద్రం వాటా కోసం ఉద్యోగులు వివరాలను నమోదు చేస్తున్నారు. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాగా వాటా నిధుల కోసం పీఎంఏవై సర్వే తప్పనిసరి అయ్యింది. ప్రతి కార్యదర్శి, వార్డు అధికారి లబ్ధిదారు ఇంటికి వెళ్లి 15 అంశాలపై వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంది.బ్యాంకుల వివరాల్లో గందరగోళం..రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి డబ్బులు జమ చేయడానికి లబ్ధిదారుల ఖాతాల నంబర్లు గతంలో సేకరించారు. ఏ బ్యాంకు ఖాతా అయినా లబ్ధిదారులకు విడతల వారిగా సొమ్ము జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. పీఎంఏవైకి సంబంధించి కొన్ని బ్యాంకు ఖాతాల నంబర్లు ఆన్లైన్లో నమోదు చేస్తే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని సర్వే నిర్వహిస్తున్న ఉద్యోగులు చెబుతున్నారు. ఒకటి, రెండు జాతీయ బ్యాంకుల ఖాతాల వివరాలను మాత్రమే యాప్లో అప్లోడ్ చేయగలుగుతున్నామని గ్రామీణ, సహకార, ఇతర బ్యాంకుల ఖాతాల నంబర్లు నమోదు చేస్తే సర్వే పూర్తి కావడానికి ఇబ్బంది కలుగుతుందని సిబ్బంది వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ బ్యాంకు ఖాతా అయినా అంగీకరించగా, కేంద్రం మాత్రం కొన్ని జాతీయ బ్యాంకుల ఖాతాల వివరాలనే ఆమోదించడం గమనార్హం. ఈ సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తేనే కేంద్రం వాటా కోసం నిర్ధేశించిన సర్వే పూర్తవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై మరోమారు సర్వే పీఎం ఆవాస్ యోజన పథకం నిధుల కోసమేనంటున్న అధికార యంత్రాంగంఎలాంటి ఆటంకం లేకుండా సర్వే కేంద్రం వాటా రాబట్టుకోవడానికి మరోసారి సర్వే నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రస్తుతం ఈ సర్వే కొనసాగుతుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా సర్వే జరుగుతుంది. లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకుంటే విడతల వారీగా డబ్బులు జమ చేయడానికి బిల్లులు తయారు చేస్తున్నాం. – నర్సింహా రావు, డీఈ, గృహ నిర్మాణ సంస్థ -
మూర్చ వ్యాధితో గుర్తుతెలియని వ్యక్తి మృతి
నందిపేట్(ఆర్మూర్): మండలంలోని కంఠం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి మూర్చవ్యాధితో మృతి చెందాడు. వివరాలు ఇలా.. గ్రామంలో గురువారం సుమారు 25ఏళ్ల నుంచి 30ఏళ్ల వయస్సు ఉన్న ఓ వ్యక్తి కత్తెరలు సానబెట్టేందుకు వచ్చాడు. ఇంటింటికీ తిరుగుతూ కత్తెరలు సానబెడుతుండగా అకస్మాత్తుగా మూర్చవ్యాధి వచ్చి కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. గ్రామ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్యాంరాజ్ తెలిపారు. చికిత్స పొందుతూ ఒకరు.. మోపాల్: ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై సుస్మిత తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని గుండ్యానాయక్ తండాకు చెందిన ప్రకాశ్ (40) గతంలో ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్లి వచ్చాడు. కొన్నిరోజులుగా అతడి ఇంట్లో కుటుంబ కలహాలు నెలకొన్నాయి. ఈక్రమంలో ఇటీవల ప్రకాశ్ గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. గురువారం పరిస్థితి విషమించి ప్రకాశ్ మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
మత్స ్యశాఖలో వసూళ్ల పర్వం!
● బైలా పేరిట అందినకాడికి దండుకున్న వైనం ● జిల్లా అధికారితోపాటు ఉద్యోగులపై ఆరోపణలు ● ఇద్దరు ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లిన మత్స్యకారులు ● రాష్ట్ర శాఖకూ వెళ్లిన ఫిర్యాదులు ● మందలించిన ఉన్నతాధికారులుడొంకేశ్వర్(ఆర్మూర్) : జిల్లా మత్స్యశాఖలో వసూళ్ల పర్వం నడుస్తోంది. చేయి తడపనిదే ఏ పనీ జరగడం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. బైలా లేని మత్స్య సహకార సంఘాల నుంచి అందినకాడికి దండుకున్నారని ప్రచారం జరుగుతోంది. జిల్లా అధికారితోపాటు శాఖలోని కొందరు ఉద్యోగులపై తీవ్ర ఆరోపణలు రాగా, ఇటీవల జిల్లాలోని ఓ ఇద్దరు ఎమ్మెల్యేలకు మత్స్య సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర శాఖకు సైతం ఫిర్యాదులు వెళ్లడంతో అక్కడి ఉన్నతాధికారులు జిల్లా అధికారితోపాటు ఉద్యోగులను మందలించినట్లు తెలిసింది. జిల్లాలో 350కిపైగా మత్స్య సహకార సంఘాలున్నాయి. వీరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు మత్స్యశాఖ పని చేస్తోంది. కానీ, పథకాలు అందాలన్నా.. ఇతర పనులు జరగాలన్నా..చివరికి కొత్త సంఘాలు ఏర్పాటు కావాలన్నా.. ముడుపులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వ ‘ఎన్ఎఫ్డీబీ’ పథకం కింద పలు మత్స్యకార సంఘాలు ఇటీవల రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. రుణాలు పొందాలంటే మత్స్య సొసైటీలకు బైలా కచ్చితంగా ఉండాలి. బైలా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు కేవలం రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. కానీ, నిబంధనలు సాకుగా చూపెట్టి ఒక్కో సొసైటీ నుంచి రూ.10వేల నుంచి రూ.15వేల వరకు తీసుకున్నట్లు మత్స్యకారులు బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు. దాదాపు 50 సంఘాలకు బైలా చేసిచ్చారు. వసూలైన డబ్బులను డిపార్ట్మెంట్లో వాటాలుగా పంచుకున్నట్లు తెలిసింది. అలాగే ఇటీవల కొత్తగా మత్స్యకార సంఘాలను ఏర్పాటు చేయగా వారి నుంచి డబ్బులు రూ.వేలల్లో దండుకున్నట్లు సమాచారం. ఇందులో మహిళా సొసైటీలు సైతం బాధితులుగా ఉన్నారు. మరోవైపు చెరువులకు తహసీల్ కట్టించుకునే విషయంలో సైతం అడ్డగోలుగా డబ్బులు తీసుకున్నట్లుగా కొందరు మత్స్యకారులు చెప్తున్నారు. మత్స్య శాఖలో జరుగుతున్న వసూళ్ల బాగోతంపై ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు జిల్లా అధికారిపై మండిపడినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర ఫిషరీష్ చైర్మన్తోపాటు మొన్నటి వరకు కలెక్టర్గా పనిచేసిన రాజీవ్గాంధీ హనుమంతు కూడా ఈ విషయమై ఆరా తీశారు. తమకు జిల్లా అధికారి వద్దని, అవినీతికి పాల్పడుతున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని మత్స్యకార సంఘాల నాయకులు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులను కోరారు. దీంతో సదరు ఉద్యోగులపై చర్యలకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఉద్యోగులపైనే ఆరోపణలు వచ్చాయి శాఖలోని కొందరు ఉద్యోగులు మత్స్య సహకార సంఘాల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. వారిని నెల క్రితమే మందలించాను. ఇందులో నాకు కూడా భాగముందని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. బైలా చేయాలంటే సొసైటీలు రూ.500 ఇస్తే సరిపోతుంది. – ఆంజనేయస్వామి, జిల్లా మత్స్యశాఖ అధికారి● డొంకేశ్వర్ మండలంలో ఓ గ్రామానికి చెందిన మత్స్య సహకార సంఘానికి బైలా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. వాస్తవానికి బైలా చేయడానికి రూ.500 చలానా కడితే సరిపోతుంది. బైలా కాపీలను బైండింగ్ చేసినందుకు మరో రూ.500 కలిపి మొత్తం రూ.1000 వరకు ఖర్చు అవుతుంది. కానీ, మత్స్యశాఖ అధికారులు సదరు సంఘం వద్ద రూ.10 వేల వరకు వసూలు చేశారు. ఇదే విధానంలో చాలా మత్స్య సంఘాల వద్ద వసూలు చేసినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. -
ఇంటి మీదికి పోవడం సభ్యతా?
వేల్పూర్: రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ, వేల్పూర్ మండల కేంద్రంలో నా ఇంటిమీదికి కొందరు కాంగ్రెస్ నాయకులు వచ్చి దాడి చేయడం సభ్యతనా? అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన హైదరాబాద్ నుంచి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. మానాల మోహన్రెడ్డి ఐడెంటిటీ కోసం నా ఇంటి మీదికి దాడికి వస్తే ప్రజలకు జరిగే లాభం ఏమిటని ప్రశ్నించారు. గల్ఫ్లో చనిపోయిన కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి కొందరికి ఇచ్చారు, ఇంకా రానివారు నియోజకవర్గంలో ఉన్నారు. వారికి ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడిగానని స్పష్టం చేశారు. ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన అడగడం నా బాధ్యత అని, ఇందులో తప్పేముందని పేర్కొన్నారు. మీరు మా ఇంటికి దాడికి రావడమో, మావాళ్లు మీ ఇంటికి రావడమో, రాజకీయ సన్యాసం తీసుకోవడం లాంటివి టైంపాస్ డ్రామా కార్యక్రమాలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. అధికార పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన నిలదీసే హక్కు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తనకు ఉంటుందని పేర్కొన్నారు. బాల్కొండ ప్రజలు ఆలోచించాలి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి -
ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపిన మాజీ మంత్రి
వేల్పూర్: ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో అలజడులు సృష్టించి లబ్ధి పొందా లనే దురాశతో మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపారని రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ సుంకెట అన్వేష్రెడ్డి ఆరోపించా రు. గురువారం ఆయన హైదరాబాద్ నుంచి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం రేవంత్రెడ్డిపై ప్రశాంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ నంబి దేవేందర్రెడ్డి, మాజీ మంత్రి ప్రశాంత్రెడ్డి ఇంటికి వెళ్లారన్నారు. కానీ, ప్రశాంత్రెడ్డి అనుచరులు రౌడీల్లా ఆయనపై దాడికి తెగబడడం అత్యంత దారుణమన్నారు. గల్ఫ్ బాధితులను ప్రభుత్వం ఎలా ఆదుకుంటుందో వివరించే కార్యక్రమాన్ని తాము తీసుకుంటే, ముందస్తుగానే రౌడీలను ఇంట్లో పెట్టుకొని దేవేందర్రెడ్డిపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇలాంటి చర్యలను ప్రజలు ఏమాత్రం హర్షించరని పేర్కొన్నారు.రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్రెడ్డి -
వేల్పూర్లో ఉద్రిక్తత
మోర్తాడ్/వేల్పూర్ : ‘కనువిప్పు’ పేరిట కాంగ్రెస్, పరిచయం పేరిట బీఆర్ఎస్ పార్టీలు గురువారం చేపట్టిన కార్యక్రమాలు వేల్పూర్లో ఉద్రిక్తతకు దారి తీశాయి. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు బల ప్రదర్శనకు సిద్ధం కావడంతో పోలీసులు 163 బీఎన్ఎస్ఎస్ యాక్టు అమలు చేస్తూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గల్ఫ్ వలస కార్మికులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని మాజీ మంత్రి ప్రశాంత్రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన రాష్ట్ర సహకార సంఘాల అసోసియేషన్ కార్పొరేషన్ చైర్మన్ మానా ల మోహన్రెడ్డి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలను ప్రశాంత్రెడ్డికి ఇంటికి తీసుకువస్తామని ప్రకటించారు. మానాల ప్రకటనకు స్పందించిన బీఆర్ఎస్ నాయకులు లబ్ధి పొందని వారితో వేల్పూర్లోని గాంధీ విగ్ర హం వద్ద నిరసన తెలుపుతామని వెల్లడించా రు. ప్రశాంత్రెడ్డి నివాసంలో ఉన్న బీఆర్ఎస్ నాయకుడు రేగుళ్ల రాములు, మరో నాయకుడు పోలీసుల కళ్లుగప్పి గాంధీ విగ్రహం వద్దకు వ చ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతలోనే పోలీసులు వచ్చి వారిని స్టేషన్కు తరలించారు. మరోవైపు ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చేందుకు ర్యాలీగా వచ్చారు. పోలీసులు వారిని నిలువరించి స్టేషన్కు తరలించారు. నాయకులను బయటకు పంపిన పోలీసులు వేల్పూర్లో బల ప్రదర్శన కోసం వచ్చిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులను పోలీసులు బయటకు పంపించారు. వేల్పూర్లో ఉంటే కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బల ప్రదర్శనకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల పోటాపోటీ పలువురు నాయకులు, కార్యకర్తల అరెస్టు 163 బీఎన్ఎస్ఎస్ యాక్టు అమలు చేస్తూ పోలీసుల భారీ బందోబస్తు ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్లిన నంగి దేవేందర్రెడ్డి.. ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి ఇంటివైపు కాంగ్రెస్ నాయకులెవరూ వెళ్లకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కో కన్వీనర్ నంగి దేవేందర్రెడ్డి ఒక్కరే పోలీసుల కళ్లుగప్పి ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్లారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు దేవేందర్రెడ్డిని ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చారు. కొందరు నాయకులు ఆయనపై దాడి చేసి చొక్కా చింపారు. పోలీసులు కలుగజేసుకొని ఆయన్ని స్టేషన్కు తరలించారు. -
ప్రశాంత్రెడ్డి.. దమ్ముంటే చర్చకు రావాలి
నిజామాబాద్ సిటీ: కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డిపై నిత్యం అసత్య ప్ర చారాలు చేస్తున్న మాజీ మంత్రి ప్రశాంత్రెడ్డికి కనువిప్పు కలిగిస్తామంటే హైదరాబాద్లో దాక్కున్నాడ ని, వేల్పూర్ రాకుండా పారిపోయాడని డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులకు అధికారం కోల్పోయిన తర్వాత సోయి తప్పిందని, కేటీఆర్, హరీశ్ రావుతోపాటు ప్రశాంత్రెడ్డి కూడా మతి తప్పి మాట్లాడుతున్నారని అన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానిస్తూ, ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. శాంతియుతంగా జరిపే కార్య క్రమంలో పా ల్గొనకుండా పోలీసులు తనను అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగా నే ఎన్నారై సె ల్ ఏర్పాటు చేసి 55 మందికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం అందించామని, కేవలం బాల్కొండ నియోజకవర్గంలోనే 18 మందికి పరిహారం ఇప్పించామని గుర్తుచేశారు. కాంగ్రెస్ నాయకులు కేతావత్ యాదగిరి, బోర్గం శ్రీనివాస్, గడుగు రోహిత్, వేణురాజ్, పంచరెడ్డి చరణ్, ప్రీతం పాల్గొన్నారు. సవాల్ విసిరితే పట్నంలో దాక్కున్నాడు డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి -
ప్రశాంత్రెడ్డి పతనం మొదలైంది
మోర్తాడ్/వేల్పూర్: బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి పతనం మొదలైందని టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కో కన్వీనర్ నంగి దేవేందర్రెడ్డి అన్నారు. పదవులు ఎప్పటికీ శాశ్వతం కావని ఆయన చెప్పారు. గురువారం వేల్పూర్ పోలీసు స్టేషన్ ఆవరణలో విలేకరులతో దేవేందర్రెడ్డి మాట్లాడారు. గల్ఫ్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సంక్షేమం అమలు చేస్తుందో వివరించడానికి తాను ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులను ఉసిగొలిపి దాడి చేయించారని ఆరోపించారు. గల్ఫ్ కార్మికుల కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రవాసీ ప్రజావాణి నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు. జిల్లాలో 55 మంది కుటుంబాలకు పరిహారం అందించినట్లు గుర్తు చేశారు. వేల్పూర్లో జరిగిన ఘటనపై సీఎం రేవంత్రెడ్డిని స్వయంగా కలిసి వివరిస్తానని చెప్పారు. టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కో కన్వీనర్ నంగి దేవేందర్రెడ్డి -
రాజకీయ రగడ
● స్థానిక వేడి..● వేల్పూర్లో ఉద్రిక్త వాతావరణానికి పునాది వేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ● బాల్కొండ నియోజకవర్గంలో దూకుడు ప్రదర్శించిన ఇరుపార్టీలు ● ఫ్యాక్షన్ మాదిరిగా రాజకీయాలు చేసే ప్రయత్నాలంటూ పరస్పర విమర్శలు ● పోలీసుల పకడ్బందీ చర్యలతో రగడకు విరామం ● మరోసారి పరస్పర విమర్శలు చేసుకున్న మానాల, వేములసాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : స్థానిక ఎన్నికల వాతావరణం సమీపిస్తున్న నేపథ్యంలో పసుపు నేలగా వెలుగొందుతున్న బాల్కొండ నియోజకవర్గంలో సై అంటే సై అంటూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ఢీకొట్టుకుంటున్నాయి. ఎవరికివారు తగ్గేదే లేదంటూ మాటల మంటలతో చెలరేగుతుండడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేతలు నిప్పులు చెరిగేలా మాటలు మాట్లాడుతుండడంతో ఇరు పార్టీల శ్రేణులు మాత్రం చేతల వరకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో గురువారం బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ కేంద్రంగా ఇరుపార్టీల కార్యకర్తలు చేపట్టిన కార్యక్రమాలు కాక పుట్టించాయి. పోటాపోటీ ప్రకటనలు, చర్యలతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు పార్టీల సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులను గమనించిన పోలీసులు ఒకరోజు ముందు నుంచే పకడ్బందీ చర్యలు చేపట్టాల్సి వచ్చింది. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మాహన్రెడ్డిల వ్యాఖ్యల నేపథ్యంలో ఉద్రిక్తతలు నెలకొనడంతో ఇరు పార్టీల ద్వితీయ శ్రేణులు వేల్పూర్ మండల కేంద్రంలో గుమిగూడొద్దని, 163 బీఎన్ఎస్ఎస్ యాక్టు అమలు చేస్తూ పోలీసు కమిషనర్ సాయిచైతన్య ఉత్తర్వులు జారీ చేశారు. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డిని నిజామాబాద్లోనే తన ఇంట్లో పోలీసులు కట్టడి చేశారు. ఈ క్రమంలో నిజామాబాద్లోనూ కొద్దిసేపు అలజడి వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్రెడ్డిని మోర్తాడ్లో గృహనిర్బంధం చేశారు. పోలీసుల పకడ్బందీ చర్యలతో రాజకీయ రగడకు ప్రస్తుతానికి విరామం ఇచ్చినట్లైంది. ఇతర నియోజకవర్గాలకు.. బాల్కొండ నియోజకవర్గంలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జిల్లాలో బీఆర్ఎస్ నుంచి ఉన్న ఏకై క ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి మాత్రమే కావడంతో జిల్లాలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలన్నీ ప్రశాంత్రెడ్డి మాత్రమే నిర్వహిస్తున్నారు. గతంలో మంత్రి జూపల్లి కృష్ణారావు భీంగల్లో పర్యటించిన సందర్భంలోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ నెలకొంది. పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. మళ్లీ తాజాగా మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా అలజడి వాతావరణం బాల్కొండ నియోజకవర్గంలో రోజురోజుకూ పెరుగుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న సమయంలో ఈ సెగ ఇతర నియోజకవర్గాలకు సైతం పాకే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.మరోసారి మాటల మంటలు..వేల్పూర్ కేంద్రంగా నెలకొన్న ఉద్రిక్తతల సెగను పోలీసులు చల్లార్చినప్పటికీ నేతల మాటల యుద్ధం మాత్రం మరోసారి సాగింది. రాజకీ యాలన్నాక విమర్శలు ప్రతివిమర్శలు సహజమని, అధికార పార్టీ వైఫల్యాలను ప్రతిపక్షంగా ఎత్తిచూపితే దాడులకు దిగే పరిస్థితి సరికాదని ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి తాజాగా ప్రకటన చేశారు. మానాల మోహన్రెడ్డి సవాల్ విసరడంతో పా టు దాడులకు దిగితే ప్రజలకు వచ్చే ప్రయోజనమేమిటని ప్రశాంత్రెడ్డి విమర్శించారు. గత పదేళ్లలో మానాల మోహన్రెడ్డి కేసీఆర్ను, తనను అనరాని మాటలన్నప్పటికీ ఇలాంటి దాడులకు దిగలేదని వేముల వ్యాఖ్యానించారు. మరోవైపు మానాల మోహన్రెడ్డి సైతం నిజామాబాద్లో ప్రెస్మీట్ పెట్టి ఎమ్మెల్యే వేముల, బీఆర్ఎస్పై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతురుణమాఫీ, రైతుభరోసా, సన్నధాన్యం బోనస్, ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్న విషయమై చర్చకు పిలిస్తే ప్రశాంత్రెడ్డి హైదరాబాద్ పారిపోయారన్నారు. ప్రభుత్వంపై త ప్పుడు ఆరోపణలు చేయడమేమిటన్నారు. మేము అమలు చేస్తున్న పథకాలు, గల్ఫ్ కార్మిక కుటుంబాలకు ఇస్తున్న పరిహారం విషయమై మేము చెప్పేవి అబద్ధమైతే ముక్కు నేలకు రాస్తానని, నిజమైతే ప్రశాంత్రెడ్డి ముక్కు నేలకు రాయాలన్నారు. కేటీఆర్, హరీశ్రావుల లాగే ప్రశాంత్రెడ్డి తుచ్ఛమైన మాటలు మాట్లాడుతున్నారని మానాల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా మళ్లీ మరోసారి మాటల మంటలు రేపడంతో ఉద్రిక్తత చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. -
ప్రముఖులతో గవర్నర్ ఇష్టాగోష్టి
● కలెక్టరేట్లో ఫొటో ఎగ్జిబిషన్ తిలకించిన జిష్ణుదేవ్ వర్మ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బుధవారం నిజామాబాద్ సమీకృత కలెక్టరేట్లో జిల్లాకు చెందిన ప్రఖ్యాత కవులు, కళాకారులు, రచయితలు, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందిన క్రీడాకారులు, సామాజిక కార్యకర్తలు, ఆదర్శ రైతులు, ఇతర ప్రముఖులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. తెలంగాణ యూనివర్సిటీ స్నాతకోత్సవం అనంతరం కలెక్టరేట్కు వచ్చిన గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యేలు పొద్దుటూరి సుదర్శన్రెడ్డి, డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్ రెడ్డి, కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ గవర్నర్కు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై తెలిపేందుకు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను గవర్నర్ తిలకించారు. కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి ఫొటో ఎగ్జిబిషన్ ఆధారంగా ఆయా శాఖల కార్యక్రమాల వివరాలను తెలిపారు. అనంతరం కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాకు చెందిన ప్రముఖులతో ముచ్చటించారు. ఆయా రంగాల్లో సేవలందిస్తున్న వారి గురించి గవర్నర్ పేరుపేరున వివరాలు తెలుసుకొని అభినందించారు. అనంతరం గవర్నర్ ఆయా రంగాల వారితోపాటు జిల్లా అధికారులతో కలిసి ఫొటో సెషన్లో పాల్గొన్నారు. గవర్నర్తో ఇష్టాగోష్టిలో పాల్గొన్నది వీరే.. పిన్న వయసులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణ, అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారిణి గుగులోత్ సౌమ్య, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రమేశ్ కార్తీక్ నాయక్, బల్లాష్టు మల్లేశ్ (థియేటర్ ఆర్టిస్ట్), కందకుర్తి యాదవరావు (చరిత్రకారులు), చిన్ని కృష్ణుడు (ఆదర్శ రైతు), అమృతలత (ప్రముఖ రచయిత), నాళేశ్వరం శంకరం (కవి), వీపీ. చందన్ రావు (కవి, రచయిత), అష్ట గంగాధర్ (జానపద కళాకారులు), పాయల్ కోట్గిర్కర్ (ప్రముఖ తబలా వాయిద్యకారులు), పంచరెడ్డి లక్ష్మణ్ (ప్రముఖ కవి), గణపతి అశోక శర్మ (అష్టావధాని), తల్లావజ్జల మహేశ్బాబు (ప్రముఖ కవి), కాసర్ల నరేశ్ రావు ( కవి, రచయిత), ఘనపురం దేవేందర్ (కవి, వ్యాఖ్యాత), డాక్టర్ డి.శారద (ప్రముఖ విద్యావేత్త, రచయిత), గంట్యాల ప్రసాద్ (సాహితీవేత్త), తిరుమల శ్రీనివాస్ ఆర్య (ప్రముఖ కవి), కత్తి గంగాధర్ (సాంస్కృతిక విభాగం విలేకరి), బోచ్కర్ ఓంప్రకాశ్ (కవి, అష్టావధాని), ఆరుట్ల శ్రీదేవి (సాహితీ పరిశోధకులు), శ్రీమన్నారాయణ చారి (కవి, ప్రముఖ వ్యాఖ్యాత), కళా లలిత (ప్రముఖ యాంకర్), బి.కళా గోపాల్ (కవి, రచయిత), మద్దుకూరి సాయిబాబు (సామాజిక సేవా కార్యకర్త, రచయిత), చింతల గంగాదాస్ (కవి, వ్యాఖ్యాత), చింతల శ్రీనివాస్ గుప్తా (ప్రముఖ కవి), డాక్టర్ అన్నందాస్ జ్యోతి (విద్యావేత్త, రచయిత), కై రకొండ బాబు (ప్రముఖ చిత్రకారులు), సిర్ప లింగం (ప్రముఖ కళాకారులు), చిందు బాబయ్య (కళాకారులు), మహమ్మద్ రషీద్ (రేలా రే రేలా ఫేం కళాకారుడు), సాయి లవోలా (జానపద కళాకారులు), జయలక్ష్మి (నాట్య గురువు), గంగాదేవి (జానపద గాయని), పసునూరి వినయ్ కుమార్ (కొరియోగ్రఫర్), టీ స్వప్నరాణి (మ్యూజిక్ అధ్యాపకురాలు), కే సంతోష్ కుమార్ (వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్), అష్ఫాక్ ఆస్పీ (ఉర్దూ కవి, వ్యాఖ్యాత), దారం గంగాధర్ (రచయిత) తదితరులున్నారు. -
బెటాలియన్ను సందర్శించిన గవర్నర్
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): తెలంగాణ యూ నివర్సిటీ రెండో స్నాతకోత్సవంలో పాల్గొనేందు కు బుధవారం జిల్లాకు వచ్చిన వర్సిటీ చాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముందుగా డిచ్పల్లిలోని టీజీఎస్పీ ఏడో బెటాలియన్ను సందర్శించారు. గవర్నర్కు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య, వీసీ యాదగిరి రావు, బెటాలియ న్ కమాండెంట్ పీ సత్యనారాయణ, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, విద్యార్థినులు పు ష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ బెటాలియన్ ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. కాసేపు విశ్రాంతి అనంతరం గవర్నర్ యూనివర్సిటీకి బయలుదేరి వెళ్లారు. కా న్వొకేషన్ ముగిసిన తర్వాత గవర్నర్ తిరిగి బెటాలియన్కు చేరుకొని భోజనం చేసి కొద్దిసేపు వి శ్రాంతి తీసుకున్నారు. అనంతరం నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. అసిస్టెంట్ కమాండెంట్లు శరత్కుమార్, కేపీ సత్యనారాయణ, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
యువకుడి దారుణ హత్య
● ఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ విఠల్రెడ్డి బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద మండల కేంద్రంలో బుధవారం ఓ యువకుడి దారుణ హత్య కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బిచ్కుందలోని ఊరడమ్మ గల్లీకి చెందిన అడికె రమేశ్(35)కు పదేళ్ల క్రితం మహాదేవితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. గత సంవత్సరం నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో మహాదేవి పుట్టింటికి వెళ్లింది. దీంతో అప్పటి నుంచి రమేశ్ మారేడు గుడి వద్ద ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ జీవిస్తున్నాడు. కాగా, పెద్ద దేవాడకు చెందిన సమీప బంధువు కాశీనాథ్ బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి వచ్చి రమేశ్ ఇంటి తలుపు కొట్టాడు. రమేశ్ తలుపు తీయడంతో వెంటనే కాశీనాథ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో రమేశ్ అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న బాన్సువాడ డీఎస్పీ విఠల్రెడ్డి, సీఐ రవికుమార్, ఎస్సై మోహన్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కాశీనాథ్ భార్యతో వివాహేతర సంబంధం ఉందనే కారణంతోనే తన కొడుకును హత్య చేసినట్లు రమేశ్ తల్లి గంగామణి ఫిర్యాదు చేసినట్లు ఎస్సై మోహన్రెడ్డి తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. -
తెయూ విజయాలు ఆదర్శం
గురువారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2025– 8లో uతెయూ(డిచ్పల్లి): రాష్ట్రం పేరుతో ఏర్పడిన తెలంగాణ యూనివర్సిటీకి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని వర్సిటీ చాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. తెయూ రెండో స్నాతకోత్సవాన్ని(కాన్వొకేషన్) బుధవారం అట్టహాసంగా నిర్వహించా రు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. 2006లో ఆరు కోర్సులతో ప్రారంభమైన తెయూ.. నేడు ఏడు విభాగాలు, 24 ఉప విభాగాలుగా 31 కోర్సులతో కొనసాగుతోందన్నారు. డిచ్పల్లి మెయి న్ క్యాంపస్తోపాటు కామారెడ్డి జిల్లా భిక్కనూరు సౌత్ క్యాంపస్, సారంగపూర్ ఎడ్యుకేషన్ క్యాంపస్లలో విద్యా వికాసం చెందడం ఆనందంగా ఉందన్నారు. చైతన్యవంతమైన ఈ మట్టిలోని ప్రజల ఆకాంక్షలు, సామర్థ్యాలు యూనివర్సిటీ అభివృద్ధిలో స్ఫూర్తినిస్తున్నాయన్నారు. యూనివర్సిటీ సాధించిన విజయాలు, ప్రగతిపూర్వకమైన సంఘటనలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. గత 19 ఏళ్లలో వర్సిటీ అధికారులు అధ్యా పకులు, విద్యార్థులు, పరిశోధకుల ఉమ్మడి కృషి, అంకితభావం అభివృద్ధిలో ప్రతిబింబిస్తోందన్నారు. 2023 – 24 రాష్ట్ర ఆర్థిక సర్వే ప్రకారం 51 శాతం పట్టభద్రులు దేశానికి నైపుణ్యాల కొరత తీరుస్తూ ఉద్యోగాలు పొందుతున్నారన్నారని గవర్నర్ వివరించారు. తెలంగాణ యూనివర్సిటీ ఆశాజనకమైన పారిశ్రామిక, విద్యాపరమైన సంబంధాలతో ముందుకు పోవడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ చెప్పినట్లు విద్య యొక్క అంతిమ లక్ష్యం సృజనాత్మకమైన మానవున్ని తయారు చేయడంతోపాటు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ చారిత్రాత్మకమైన అభివృద్ధిని స్పృశించడమని పేర్కొన్నారు. కాన్వొకేషన్కు హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ముందుగా బెటాలియన్ పోలీసు లు గౌరవ వందనం సమర్పించారు. కాన్వొకేషన్కు రాజ్యసభ సభ్యుడు సురేశ్రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎ మ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో తెయూ రిజిస్ట్రార్ ఎం.యాదగిరి, డీన్స్ ఘంటా చంద్రశేఖర్, కే.అపర్ణ, జి.రాంబాబు, కే.లావణ్య, ఎం.శ్రీనివాస్, కే.సంపత్కుమార్, ప్రిన్సిపాల్ ప్రవీ ణ్ మామిడాల, ప్రొఫెసర్లు ఆరతి, కనకయ్య, వి ద్యావర్ధిని, అరుణ, ఆంజనేయులు, నాగరాజు, పీ ఆర్వో పున్నయ్య, ఏపీఆర్వో అబ్దుల్ ఖవి, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, పరిశోధకులు తదితరులు పాల్గొన్నారు. బంగారు పతకాలు.. డాక్టరేట్ పట్టాలు 2014 నుంచి 2023 వరకు 15 విభాగాల్లో 130 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపగా, దరఖాస్తు చేసుకున్న 113 మందికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యఅతిథి ప్రొఫెసర్ చంద్రశేఖర్ చేతుల మీ దుగా స్నాతకోత్సవంలో బంగారు పతకాలు అందజేశారు. అలాగే 2017 నుంచి 2025 జూన్ వరకు ఏడు విభాగాల్లో పరిశోధనలు పూర్తి చేసుకున్న 157 మంది పరిశోధకులకు పీహెచ్డీ (డాక్టరేట్) పట్టాలను అందజేశారు. క్షుణ్ణంగా తనిఖీలు తెయూ క్రీడామైదానం లో ఏర్పాటు చేసిన కాన్వొకేషన్ ప్రాంగణంలో పోలీస్ కమిషనర్ సాయిచైతన్య ఆధ్వర్యంలో స్నిఫర్ డాగ్ బృందం, బాంబు డిస్పోజబుల్ టీం, ఇంటిలిజెన్స్ అధికారులు బందోబస్తు నిర్వహించారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి నిర్వహించిన లోనికి అనుమతించారు. ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల ఏర్పాటుకు కృషి తెయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ టీ.యాదగిరిరావు మాట్లాడుతూ.. వర్సిటీలో ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నూతనంగా పరిపాలనా భవనం, 500 మంది విద్యార్థినులకు సరిపడా అన్ని రకాల వసతులు ఉండే బాలికల వసతి గృహం, వేయి మంది సామర్ధ్యం కలిగిన ఆడిటోరియం, క్రీడామైదానం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తెయూ పరిధిని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు విస్తరించే విధంగా కృషి చేస్తున్నామన్నారు. యూనివర్సిటీ అభివృద్ధి, జిల్లా ప్రజాప్రతినిధులతోపాటు బోధన, బోధనేతర సిబ్బంది సమష్టి కృషిపైనే ఆధారపడుతుందని అన్నారు. న్యూస్రీల్ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు పొందిన తెలంగాణ యూనివర్సిటీ ఇక్కడి ప్రజల ఆకాంక్షలు, సామర్థ్యాలు వర్సిటీ అభివృద్ధిలో స్ఫూర్తినిస్తున్నాయి రెండో స్నాతకోత్సవంలో వర్సిటీ చాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరైన ఐఐసీటీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ 113 మందికి గోల్డ్ మెడల్స్.. 157 మందికి డాక్టరేట్లు అందజేత -
టీబీ ముక్త్ భారత్లో భాగస్వాములు కావాలి
నిజామాబాద్అర్బన్: క్షయ రహితంగా దేశాన్ని తీ ర్చిదిద్దాలనే బృహత్తర సంకల్పంతో ప్రభుత్వం ప్ర తిష్టాత్మకంగా అమలు చేస్తున్న టీబీ ముక్త్ భారత్ అ భియాన్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావా లని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో బుధవారం టీబీ ముక్త్ భారత్ అభియాన్పై కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, అధికారులతో కలిసి గవర్నర్ సమీక్షించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, సమష్టి కృషితోనే సమగ్ర ప్రగతి కల సాకారమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రతిభ కలిగి ఉంటారని, దానిని సమాజ ప్రగతికి వినియోగించాలని కోరారు. సామాజిక, సాహితీ, సేవా, క్రీడా తదితర అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న వారు, తమతమ రంగాల ద్వారా ఆయా మాధ్యమాలను ఉపయోగిస్తూ క్షయ నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందిన జిల్లాకు చెందిన మాలావత్ పూర్ణ, గుగులోత్ సౌమ్యను ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’కు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని గవర్నర్ కోరారు. కవులు, రచయితలు తమ రచనల ద్వారా, కళాకా రులు ప్రదర్శనల ద్వారా ప్రజలను టీబీ నిర్మూలన దిశగా చైతన్యపర్చాలని పిలుపునిచ్చారు. జిల్లా యంత్రాంగం, రెడ్ క్రాస్ సొసైటీ సమన్వయం ఏర్పర్చుకుని, పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. టీబీ నిర్ధారణ అయిన పేషెంట్లకు దాతల ద్వారా పోషక ఆహార కిట్లను అందించాలన్నారు. జిల్లా భౌగోళిక స్వరూపం, స్థితిగతులు, ప్రాముఖ్యతను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ముందుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్ దృష్టికి తెచ్చారు. క్షయ నిర్మూలన చర్యల్లో భాగంగా హై రిస్క్ గ్రూప్లో ఉన్న వారందరికీ స్క్రీనింగ్, ఎక్స్ రే చేయిస్తున్నామని, వ్యాధి లక్షణాలు ఉన్నవారికి తెమడ పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. క్షయ నిర్మూలన కోసం చేసిన విశేష కృషికి గాను 2022–23 సంవత్సరానికిగాను జిల్లాకు గోల్డ్ మెడల్ దక్కిందని అన్నారు. తలసేమియా బాధితులకు అవసరమైన బ్లడ్ యూనిట్లను రెడ్ క్రాస్ ద్వారా సమకూరుస్తున్నామని, వృద్ధుల కోసం రెడ్ క్రాస్, జిల్లా యంత్రాంగంల సంయుక్త ఆధ్వర్యంలో వద్ధాశ్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్రెడ్డి, పోలీస్ కమిషనర్ సాయిచైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. సమష్టి కృషితోనే క్షయ నిర్మూలన టీబీపై ప్రజల్లో అవగాహన కల్పించాలి దాతల సహకారంతో పేషెంట్లకు పోషకాహార కిట్లను అందజేయాలి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపు -
ఆందోళన చెందొద్దు.. అవకాశాలను అందిపుచ్చుకోవాలి
కాన్వొకేషన్కు ముఖ్యఅతిథిగా హాజరైన భారత రసాయన శాస్త్ర సాంకేతిక సంస్థ (ఐఐసీటీ) మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీవారి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. యనివర్సిటీ నుంచి బయటకు వెళ్లిన ప్రతి విద్యార్థికి ఆందోళనతో పాటు అవకాశాలు కలిగిన ఎన్నో దారులు కనిపిస్తాయన్నారు. ఆందోళన చెందకుండా అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. వారి వారి శక్తి సామర్థ్యాలు, అభిరుచి మేరకు కొందరు పరిశోధకులుగా మరికొందరు పారిశ్రామికవేత్తలుగా, వ్యవస్థాపకులుగా, ప్రజాసేవకులుగా, విద్యావేత్తలుగా ఉన్నతంగా స్థిరపడుతున్నారన్నారు. విద్యార్థులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది జీవితమనేది పందెం లాంటిది కాదని ఇది ఒక ప్రయాణం మాత్రమేనని వివరించారు. ప్రయాణానికి సమయస్ఫూర్తితో తీసుకునే నిర్ణయాల మీద భవిష్యత్ ఆధారపడుతుందన్నారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అన్ని రంగాలపై ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. -
నేడు వేల్పూర్లో దంగల్!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బాల్కొండ నియోజకవర్గంలో రాజకీయంగా వాతావరణం వేడెక్కింది. గురువారం వేల్పూర్లో కాంగ్రెస్ పార్టీ ‘ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డికి కనువిప్పు’ పేరిట గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన కార్యక్రమం వేడి పుట్టిస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు సై అంటే సై అంటూ కత్తులు దూసుకుంటున్నాయి. దీంతో ఒక్కసారిగా కాక రేగి.. పసుపు నేలలో సెగలు రగులుతున్నాయి. గల్ఫ్ కార్మికుల సంక్షేమం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి విమర్శలు చేసిన నేపథ్యంలో రగడ మొదలైంది. దీంతో స్పందించిన డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి ప్రశాంత్రెడ్డి విమర్శలను సవాల్గా తీసుకున్నారు. ఏడాదిన్నర కాలంలో తమ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి ఏమిటో చూపిస్తామని చెబుతున్నారు. గల్ఫ్ కార్మికుల కోసం ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేయడంతో పాటు చనిపోయిన 56 మంది గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించినట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. బాల్కొండ నియోజకవర్గానికి చెందిన పరిహారం అందిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలను తోలుకొస్తామని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. వేల్పూర్ గాంధీ విగ్రహం వద్ద ‘ప్రశాంత్రెడ్డికి కనువిప్పు’ పేరిట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డితో పాటు నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్రెడ్డి, రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ సుంకేట అన్వేష్రెడ్డి పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. పథకాలు రానివారిని తీసుకొస్తాం.. బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ పార్టీ సంక్షేమం విషయంలో విఫలమైందని, తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమానికి ప్రతిగా కార్యక్రమం చేస్తామ ని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. సై అంటే సై అంటూ సవాల్ను స్వీకరిస్తున్నామని చెబుతున్నా రు. పరిహారం అందని గల్ఫ్ బాధిత కుటుంబాల ను, రుణమాఫీ, రైతుభరోసా రాని రైతులను తీసు కొస్తామన్నారు. బోనస్ రాని రైతులను పిలిస్తే భారీ గా వస్తారంటున్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరులో నెగ్గే లక్ష్యంతోనే డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు గులాబీ కార్యకర్తలు అంటున్నారు. హామీలు నెరవేర్చలేక, ప్రజల దృష్టిని మరల్చేందుకే వేల్పూర్ కార్యక్రమం చేపట్టారంటున్నారు. అమలు కాని హామీల విషయంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రశాంత్రెడ్డి నిలదీస్తే తట్టుకోలేకపోవడం ఏమిటన్నారు. తాము తీసుకొచ్చినవారికి పథకాలు ఇచ్చినట్లు నిరూపించలేకపోతే మానాల మోహన్రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు చేస్తామని అంటున్నారు. ఈ నేపథ్యంలో వేల్పూర్లో గరంగరం వాతావరణం నెలకొంది. ప్రశాంత్రెడ్డి ఇల్లు ముట్టడిస్తాం..: మానాల కాంగ్రెస్ పార్టీ అన్నివర్గాల్లో అర్హులైనవారికి సంక్షేమ పథకాలు అందిస్తోంది. గల్ఫ్ కార్మికులకు ఇప్పటికే పరిహారం చెల్లించడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్లు వేగంగా నిర్మాణం అవుతున్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశాంత్రెడ్డి మాటలు గుడ్డిగా నమ్మి మోసపోవద్దు. ప్రశాంత్రెడ్డి పిలుపునకు స్పందించి వచ్చి న బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా కళ్లు తెరిపిస్తాం. ఎమ్మెల్యే ప్రతి విమర్శను చూసి బీఆర్ఎస్ వాళ్లు గు డ్డిగా అనుసరించొద్దు.గాంధీ విగ్రహం వద్ద ప్రశాంత్రెడ్డి కోసం ఎదురుచూస్తాం. అవసరమైతే ప్రశాంత్రెడ్డి ఇంటివద్దకొస్తాం. కనువిప్పు కలిగిస్తాం.పోలీసుశాఖ ఆంక్షలు వేల్పూర్: శాంతిభద్రతలకు విఘాతం కలకుండా వేల్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో ఆంక్షలు విధిస్తూ సీపీ సాయిచైతన్య గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్లు వేల్పూర్ ఎస్సై సంజీవ్ బుధవారం రాత్రి తెలిపారు. ఎక్కడ కూడా నలుగురు కన్నా ఎక్కువ సంఖ్యలో గుమిగూడొద్దని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను అధిగమించిన వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు. కాగా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చి న ఆరు గ్యారంటీలు పొందని లబ్ధిదారులతో కలిసి నిర్వహించే పరిచయ కార్యక్రమానికి అనుమతించాలని వేల్పూర్ మండల బీఆర్ఎస్ నాయకులు వేల్పూర్ ఎస్సై సంజీవ్కు వినతి పత్రం అందజేశారు. మాటల కత్తులు దూసుకుంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి విమర్శల నేపథ్యంలో కనువిప్పు పేరిట కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ తాము సిద్ధమేనని.. పథకాలు అందని రైతులను తీసుకొస్తామంటున్న బీఆర్ఎస్ ప్రశాంత్రెడ్డితోపాటు బీఆర్ఎస్ కార్యకర్తలకు కనువిప్పు కలిగిస్తాం..: డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి -
మొరం ట్రాక్టర్, పొక్లెయిన్ సీజ్
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని బాణాపూర్ గ్రామ శివారులోని దండ్ల గుట్టపైన అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతున్నందున సోమవారం రాత్రి మొరం ట్రాక్టర్, పొక్లెయిన్ పట్టుకున్నట్లు ఎస్సై దీపక్కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి, వాటిని లింగంపేట పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. గ్రామాల్లో, మండల కేంద్రంలో అనుమతులు లేకుండా ఎవరైనా అక్రమంగా మొరం తవ్వకాలు చేపడితే చట్టరిత్యా చర్యలు తీసుకుంటామన్నారు. డోంగ్లీ మండలంలో మూడు మొరం ట్రాక్టర్లు.. మద్నూర్(జుక్కల్): డోంగ్లీ మండలంలోని మొగా–డోంగ్లీ ప్రధాన రహదారిపై అక్రమంగా తరులుతున్న మూడు మొరం ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసినట్లు డోంగ్లీ ఆర్ఐ సాయిబాబా తెలిపారు. సాక్షి దినపత్రికలో మంగళవారం ప్రచురితమైన ‘మొరం అక్రమ తరలింపుపై చర్యలేవి?’ అనే వార్త కథనానికి డోంగ్లీ రెవెన్యూ అధికారులు స్పందించారు. ఉమ్మడి మండలంలో అక్రమంగా మొరం, మట్టిని తరలిస్తుండటంతో మొగా గ్రామ శివారులో దాడులు నిర్వహించామని ఆయన తెలిపారు. మండలంలో ఎక్కడైన అక్రమంగా మొరం, మట్టి తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆయనతో పాటు రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. -
బొలెరో వాహనం బోల్తా
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని నాందేడ్–సంగారెడ్డి జాతీయ రహదారిపై మంగళవారం సిమెంట్ లోడ్తో వెళ్తున్న బొలెరో వాహనం ప్రమాదవశాత్తు బోల్తాపడింది. సంగారెడ్డి జిల్లా బాచేపల్లి నుంచి సిమెంట్ లోడ్ వస్తున్న బొలెరో వాహనం మండలంలోని వెల్గనూర్ గ్రామ శివారులోని జాతీయ రహదారిపై అదుపుతప్పి, రోడ్డు కిందకు వెళ్లి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో వాహన డ్రైవర్తోపాటు మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయని హైవే సిబ్బంది తెలిపారు. సిమెంట్ దుకాణంలో అగ్ని ప్రమాదం బాల్కొండ: మండల కేంద్రంలోని శాంభవి సిమెంట్ దుకాణంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత షార్ట్ సర్క్యుట్తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. అర్ధరాత్రి దుకాణం నుంచి మంటలు వ్యాపించడంతో స్థానికులు గమనించి ఫైర్ స్టేషన్కు సమాచారమందించారు. వెంటనే ఫైర్సిబ్బంది ఫైర్ ఇంజిన్తో వచ్చి మంటలను ఆర్పివేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. చేనులో మూర్చతో రైతు మృతి లింగంపేట(ఎల్లారెడ్డి): పంట చేనులో పనులు చేస్తుండగా ఓ రైతు మూర్ఛ వ్యాధితో మృతిచెందిన ఘటన మండలంలోని శెట్పల్లిసంగారెడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై దీపక్కుమార్ తెలిపిన వివరాలు ఇలా.. శెట్పల్లిసంగారెడ్డి గ్రామానికి చెందిన మార్గ రాజు(38) అనే రైతు సోమవారం తన పంట చేనులో పొలం దున్నడానికి వెళ్లాడు. రాత్రి వరకు అతడు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లి, వెతకసాగారు. పొలంలో రాజు మూర్చతో బోర్లా పడిఉన్నట్లు గమనించారు. అతడిని లేపి చూడగా అప్పటికే ప్రాణాలు పోయినట్లు గుర్తించారు. మృతుడి కుటుంబసభ్యులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. తన భర్త మరణంలో ఎలాంటి అనుమానాలు లేవని అతడి భార్య ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. తాళం వేసిన ఇంట్లో చోరీ వర్ని: మండలంలోని శంకోరా గ్రామంలో తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరిగింది. వర్ని ఎస్సై మహేష్ తెలిపిన వివరాలు ఇలా.. శంకోరా గ్రామానికి చెందిన పాల్త్య రవీందర్ ఈనెల 13న ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి మంగళవారం ఇంటికి రాగా, ఇంటి తాళాలతోపాటు బీరువా తాళాలు పగలగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రెండు తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.18 వేల నగదును ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
న్యూట్రిషన్ కిట్ల పంపిణీ
నిజామాబాద్ నాగారం: నగరంలోని ఐడీఓసీలో మంగళవారం క్షయ వ్యాధిగ్రస్తులకు డీఎంహెచ్వో రాజ్యశ్రీ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా రాజ్యశ్రీ మాట్లాడుతూ.. క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహారం నిమిత్తం న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయడం చాలా హర్షించదగ్గ విషయమని రెడ్ క్రాస్ సభ్యులను అభినందించారు. రెడ్క్రాస్ చైర్మన్ బుస ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, జిల్లా కోశాధికారి కరిపే రవీందర్, డాక్టర్ సుప్రియ, ఘన్పూర్ వెంకటేశ్వర్లు, శ్యామల, నాగరాజు, తదితరులున్నారు. రౌడీషీటర్ అరెస్ట్ ఖలీల్వాడి: నగరంలోని ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఆటో డ్రైవర్ను కొట్టి కత్తులతో బెదిరించి రూ. 400 ఎత్తుకెళ్లిన కేసులో ప్రధాన నిందితుడు రౌడీషీటర్ బర్సాత్ ఆమీర్తోపాటు షాబాజ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్వో రఘుపతి మంగళవారం తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి, రిమాండ్ చేశారు. రౌడీషీటర్లు బెదిరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. -
అట్టహాసంగా బోనాల పండుగ
నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ఆవరణలో మంగళవారం టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో బోనాల కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈసందర్భంగా మహిళలతోపాటు అధికారులు బోనమెత్తి అమ్మవారిని కొలిచారు. వేడుకల్లో ఆయా శాఖల మహిళ ఉద్యోగులు బోనాలతో హాజరయ్యారు. బోనాల ఊరేగింపులో నాని యాదవ్ మాతంగి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అమ్మవారి బోనంతో విన్యాసాలు చేస్తూ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు క్షేమంగా ఉండాలని, అమ్మదయ అందరిపై ఉండాలని కోరారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య, నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్, రాష్ట్ర కోశాధికారి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు నరసింహరెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుమన్, శేఖర్, అసోసియేట్ ప్రెసిడెంట్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
నారుమడి తడి కోసం తంటాలు
లింగంపేట/సిరికొండ: తీవ్ర వర్షాభావం వల్ల వరి నార్లు ఎండిపోతుండడంతో రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో ఆశించిన వర్షాలు పడకపోవడంతో బోరు బావులు వట్టిపోతున్నాయి. జూన్లో అడపాదడపా వర్షాలు కురిసినా జూలైలో వర్షాలు కురవక పంటల సాగు ఇబ్బందికరంగా మారింది. రైతులు తుకాలు పోసిన నుంచి వర్షాలు పడక ఎండిపోతున్నాయి. దీంతో తుకాలు కాపాడుకోవడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. లింగంపేట మండలంలోని భవానీపేట గ్రామానికి చెందిన బ్యాగరి సాయిలు, ఆర్ల బాల సాయిలు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను కిరాయికి తీసుకొని నారుమడికి నీరు పెడుతున్నారు. వీరు గ్రామ శివారులోని పంట చేను కౌలుకు తీసుకొని పంటలు సాగు చేస్తున్నారు. అలాగే సిరికొండ మండలం తాళ్లరామడుగు వడ్డెర కాలనీకి చెందిన రైతు రాజకిషన్ తన బోరు పోయక వరి నారుమడి ఎండిపోతుండటంతో ట్యాంకర్ ద్వారా నీళ్లు పోసి బతికించుకుంటున్నాడు. రాబోయే రోజుల్లో వర్షాలు కురిస్తే పంటలు సాగు చేయడానికి వరినారు కాపాడుకుంటున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు కురవకపోతే పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల కోసం ప్రతీరోజు ఆకాశం వైపు చూస్తూ వరుణ దేవుడిని వేడుకుంటున్నామని వాపోయారు. -
ఇసుక క్వారీ పనుల అడ్డగింత
రుద్రూర్: పోతంగల్ మండలం సుంకిని శివారులో ని మంజీరా నదిలో ఇసుక క్వారీ ఏర్పాటు పనులను మంగళవారం స్థానిక రైతులు అడ్డుకున్నారు. గత వారం రోజులుగా కొందరు వ్యక్తులు తమకు క్వారీ ఏర్పాటుకు అనుమతి లభించిందని పేర్కొంటూ ర్యాంపు పనులు ప్రారంభించారు. ఇసుక ర్యాంపు ఏర్పాటు పట్ల స్థానిక రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. క్వారీ ఏర్పాటు చేస్తే మంజీర తీరప్రాంతంలో ఉన్న ఎత్తిపోతల పథకాలు వట్టి పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. క్వారీ నిర్వహణ గూర్చి రెవె న్యూ అధికారులకు, స్థానికులకు కూడా ఎలాంటి సమాచారం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులను నిలిపివేయాలని నినాదాలు చేశారు. అ నుమతులు లేకుండా ఇసుక క్వారీ కోసం ఏర్పాట్లు చేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ గంగాధర్ ఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. మూడు టిప్పర్లను సీజ్ చేసీ కోటగిరి పోలీస్ స్టేషన్ తరలించారు. -
ఎస్పీ నుంచి సీపీగా జిల్లా పోలీస్ బాస్
మీకు తెలుసా? రాష్ట్ర ప్రభుత్వం 2016 అక్టోబర్లో దసరా రోజున ప్రారంభించిన కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలతో పాటు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ను ఏర్పాటు చేసింది.●● నిజామాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాను మెరుగ్గా నిర్వహించడానికి, శాంతిభద్రతల సంక్లిష్టతను పరిష్కరించడానికి నిజామాబాద్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP)ను, కమిషనర్ ఆఫ్ పోలీస్ (CP)గా అప్గ్రేడ్ చేశారు. ● సీపీ నేరుగా రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)కి నివేదిస్తుంది, నిర్ణయం తీసుకోవడాన్ని క్రమబద్ధీకరిస్తుంది. ఒక కమిషనరేట్ నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి ట్రాఫిక్, శాంతిభద్రతలు, నేర శాఖలు వంటి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయవచ్చు. ● సీపీ మార్పుతో జిల్లాలోని పోలీసు అధికారుల హోదాల్లో మార్పు వచ్చింది. జిల్లా పోలీస్ బాస్ను సూపరింటెడెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) నుంచి కమిషనర్ ఆఫ్ పోలీస్ (సీపీ)గా మార్పు చేశారు. ● జిల్లాలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డీఎస్పీల హోదాల్లో సైతం మార్పు వచ్చింది. నాటి నుంచి నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించే డీఎస్పీలను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)గా పిలవడం ప్రారంభించారు. ● జిల్లాలో అదనంగా మెండోర, ముప్కాల్, ఏర్గట్ల, ఆలూర్, డొంకేశ్వర్ పోలీస్ స్టేషన్లు చేర్చబడ్డాయి. సిరికొండ పోలీస్ స్టేషన్ను ధర్పల్లి సర్కిల్లో విలీనం చేసి నిజామాబాద్ సబ్ డివిజన్ పరిధిలోకి తీసుకున్నారు. – ఆర్మూర్ -
నకిలీ ఏజెంట్లను నమ్మొద్దు
● ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలి ● సీపీ సాయి చైతన్యఖలీల్వాడి: ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి మోసం చేసే నకిలీ గల్ఫ్ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని సీపీ పోతరాజు సాయిచైతన్య మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. నిరుద్యోగుల నుంచి పాస్పోర్టు, వీసా, రవాణా, టూరిస్ట్ తదితర సేవలు కల్పిస్తామని చెప్పి చాలా మంది గల్ఫ్ ఏజెంట్లు అనధికార వ్యాపారాలు నిర్వహిస్తూ, అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. గల్ఫ్ ఏజెంట్లకు ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రజలకు సీపీ సూచించారు. ఒక ఇల్లు అద్దెకు ఇవ్వాల్సి వస్తే స్థానిక పోలీస్స్టేషన్లో సమాచారం అందించాలని పేర్కొన్నారు. అలాగే ఈనెల 16 నుంచి 31వ తేదీ వరకు పలు నిబంధనలను కమిషనరేట్పరిధిలో అమలులో ఉంటాయని ప్రకటనలో వివరించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగేలా విగ్రహాలను ప్రతిష్టించొద్దని, విగ్రహాల ఏర్పాటుకు కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ అనుమతులు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. రెసిడెన్షియల్, కమర్షియల్ స్థలాల్లో రాత్రి సమయంలో 55 డెసిబుల్స్ సౌండ్ వాడాలని రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు డీజేల సౌండ్ సిస్టంను నిషేధించినట్లు పేర్కొన్నారు. సభలు, సమావేశాలకు ఏసీపీ అనుమతి తప్పనిసరి అని, 500 కన్నా ఎక్కువ మందితో నిర్వహించే కార్యక్రమానికి 72 గంటల ముందు సీపీ అనుమతి తీసుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తప్పవని, డ్రోన్ల వినియోగానికి పోలీసు, ఏవియేషన్ తదితరశాఖల అధికారుల క్లియరెన్స్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. -
జిల్లా వ్యవసాయ అధికారిగా గోవింద్
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లా వ్యవసాయాధికారిగా మేకల గో వింద్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆయ న జిల్లా కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. గోవింద్ గతంలో జిల్లాలో డీఏవోగా పని చేసి రాష్ట్ర శాఖకు బదిలీ అయ్యారు. ప్ర స్తుతం రిటైర్మెంట్కు దగ్గర్లో ఉండగా, ప్రభు త్వం మళ్లీ జిల్లాకు డీఏవోగా పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం. అయితే మొన్నటి వరకు ఇన్చార్జి డీఏవోగా పని చేసిన వీరాస్వామి నిజామాబాద్ అర్బన్ ఏడీఏగా రెగ్యులర్ పోస్టులో పని చేయనున్నారు. లింబాద్రిగుట్టపై టూరిజం గెస్ట్హౌస్కు రూ.40లక్షలు మోర్తాడ్: భీమ్గల్ మండలంలోని లింబాద్రి గుట్ట (లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయం) వద్ద పర్యాటకుల అతిథి గృహం నిర్మాణం కోసం రూ.40 లక్షలు మంజూరు చేస్తూ రాష్ట్ర పర్యా టక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. భక్తులు, అతిథుల సౌకర్యార్థం గెస్ట్హౌస్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ముత్యాల సునీత్రెడ్డి మంత్రికి విన్నవించగా ఆయన నిధులు మంజూరు చేశారని నాయకులు తెలిపారు. నిధులు మంజూరి చేసిన మంత్రికి, అందుకు కృషి చేసిన నాయకులకు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. సిద్ధులగుట్టపై కాటేజీల నిర్మాణానికి.. ఆర్మూర్టౌన్: పట్టణంలోని నవనాథ సిద్ధు ల గుట్టపై కాటేజీల నిర్మాణానికి రూ.50 ల క్షలు మంజూరైనట్లు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్రెడ్డి తెలిపారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆలయాన్ని సందర్శించిన సమయంలో నిధులు మంజూరు చేయాలని విన్నవించామన్నారు. మంత్రికి వినయ్రెడ్డితోపాటు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఎఫ్పీవోల సంఖ్య పెంచేందుకు చర్యలు సుభాష్నగర్: రాష్ట్రంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్పీవో)ల సంఖ్యను పెంచి ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంగళవారం రైతు ఉత్పత్తిదారుల సంస్థల పెంపునకు సంబంధించి అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రాష్ట్రంలో ఎఫ్పీవోలుగా ఎంపికై న 311 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నిర్వహణ వ్యయాల మొదటి విడత చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రమేశ్రెడ్డి మాట్లాడుతూ.. 311 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా రూపాంతరం చెందాయన్నారు. అందులోభాగంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 34 ( నిజామాబాద్ 12, కామారెడ్డి 22) పీఏసీఎస్లు ఎఫ్పీఓలుగా ఉన్నాయని తెలిపారు. తద్వా రా రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడి సా మూహిక అభివృద్ధి చెందుతారన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్లు, జిల్లా సహకార అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
మరిన్ని పరిశోధనలకు ఆదర్శంగా తీసుకోవాలి
రాకేశ్ శర్మ తరువాత రెండో భారత జాతీయుడు అంతరిక్షంలో పరిశోధన కోసం వెళ్లడం గొప్ప విషయం. శుభాంశు శుక్లా పరిశోధన యాత్రను ఆదర్శంగా తీసుకుని యువత, విద్యార్థులు మరిన్ని పరిశోధనలు చేయడమే ల క్ష్యంగా దూసుకెళ్లాలి. ము ఖ్యంగా భారతీయ యు వత అన్నిరంగాల్లో తమ సత్తా నిరూపించుకుంటు న్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ మొదలు దాదాపు 25 మల్టీ నేషనల్ కంపెనీల కు సీఈవోలుగా భారతీయులు సత్తా చాటుతున్నా రు. పలువురు టెక్నోక్రాట్లు నాసాలో అనేక పరిశోధనలు చేస్తున్నారు. చాలా పశ్చిమ దేశాల్లో భార తీయ వైద్యులు తిరుగులేని సర్జన్లుగా, వైద్య నిపుణులుగా సేవలందిస్తున్నారు. అనేక ఆవిష్కరణలు చేస్తున్నారు. – కాటిపల్లి మహేందర్రెడ్డి, హైకోర్టు న్యాయవాది -
జై భారత్.. జై శుభాంశు
నిజామాబాద్వ్యాపారం, బిట్ కాయిన్.. నిజామాబాద్కు చెందిన మోహిజ్ ఖాన్ వ్యాపారం, బిట్కాయిన్ పేరుతో రూ.8.50 కోట్లు వసూలు చేసి పరారయ్యాడు.బుధవారం శ్రీ 16 శ్రీ జూలై శ్రీ 2025– 10లో uఅంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా తన బృందంతో కలిసి సురక్షితంగా భూమికి చేరుకోవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. భరతమాత కీర్తిని మరింత పెంచేలా శుభాంశు చేసిన అంతరిక్ష యాత్ర విజయవంతం కావడం గర్వకారణమంటున్నారు.న్యూస్రీల్ -
ఎస్సారెస్పీలోకి నిలిచిన ఇన్ఫ్లో
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద (ఇన్ఫ్లో) నిలిచి పోయింది. ప్ర స్తుత సీజన్లో మేలోనే ఎగువ ప్రాంతాల నుంచి వ రద వచ్చి ప్రాజెక్ట్ నీటి మట్టం క్రమంగా పెరిగింది. దీంతో సకాలంలో ప్రాజెక్టు నిండుతుందని రైతులు ఆశించగా, ప్రస్తుతం ఇన్ఫ్లో నిలిచిపోవడంతో రైతు లు ఆందోళనకు గురవుతున్నారు. ఆయకట్టు రైతు లు వర్షాల ఆధారంగా నారు మడులను సిద్ధం చేసుకున్నారు. సకాలంలో వరదలు వస్తే ప్రాజెక్ట్నుంచి కాలువల ద్వారా ఆయకట్టుకు నీరు విడుదలవుతుందని ఆశించారు. కానీ ప్రస్తుత పరిస్థితి వారి ఆశలకు విరుద్ధంగా ఉంది. ఎగువన ఖాళీనే.. ఎస్సారెస్పీలోకి ప్రధానంగా వరద వచ్చే మహారాష్ట్ర ప్రాంతంలోని గైక్వాడ్, విష్ణుపురి ప్రాజెక్టులు కూడా ఖాళీగా ఉన్నాయని ప్రాజెక్టు అధికారులు తెలుపుతున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం వర్షపాతం లేదని, ఇప్పటికిప్పుడు వరదలు వచ్చే అవకాశం లేదని ప్రాజెక్ట్ అధికారులు అంటున్నారు. 2018 నుంచి ప్రాజెక్ట్లోకి ప్రతి ఏడాది జూలై చివరి నాటికి వరద నీరు చేరగా, ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు. నిలకడగా నీటి మట్టం ప్రాజెక్ట్ నీటి మట్టం ప్రస్తుతం నిలకడగా ఉంది. కాకతీయ కాలువ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా ఆవిరి రూపంలో 367 క్యూసెక్కుల నీరు పోతోంది. మిషన్ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థా యి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగు లు కాగా మంగళవారం సాయంత్రానికి 1068.50 (21 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. సీజన్లో వరద రాకపోవడంతో రైతుల్లో ఆందోళననిజాంసాగర్ నీటి విడుదల నిజాంసాగర్: ఆయకట్టు కింద సాగువుతున్న పంటల కోసం మంగళవారం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటి విడుదలను ప్రారంభించారు. ప్రధాన కాలువ కింద 1.4 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. మొదటి ఆయకట్టు ప్రాంతంలో వరినాట్లు వేస్తున్నారు. ఆయకట్టు పంటల కోసం ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు వెయ్యి క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. -
దేశానికి గర్వకారణం
భరతమాత కీర్తిని మరింత పెంచేవిధంగా శుభాంశు శుక్లా చేసిన ఈ అంతరిక్ష యాత్ర విజయవతం కా వ డం మనందరికీ గర్వకారణం. భారతీయ వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల్లో అనేక విజ్ఞానదాయకమైన అంశాలున్నాయి. వీటి ఆధారంగా అనేక పరిశోధనలు చేసి ధన్వంతరి, శుశ్రుతుడు, పతంజలి, వాగ్భటులు, చరకుడు, చాణ క్యుడు, ఆర్యభట్ట లాంటి భారతీ య మునులు, శాస్త్రవేత్తలు, శ్రీనివాస రామాను జన్, సీవీ రామన్, శకుంతలాదేవి, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, జగదీష్ చంద్ర బోస్, హోమీబాబా, సతీష్ ధావన్, నంబినారాయణన్ లాంటి వారు అందించిన విజ్ఞానాన్ని గురించి ప్రతి విద్యార్థి తెలు సుకోవాలి. వీళ్లందరి స్ఫూర్తితో, తాజాగా శుభాంశు శుక్లాను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు అకుంఠిత దీక్షతో చదివి దేశానికి ఉపయోగపడే భావి భారత పౌరులుగా ఎదగాలి. దేశ కీర్తిని సగర్వంగా చాటే లక్ష్యంతో ముందుకెళ్లాలి. – మోతుకూరి రేణుక, హిందీ పండిత్ -
నేడు తెయూ కాన్వొకేషన్
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ రెండో కాన్వొకేషన్ బుధవారం ఘనంగా నిర్వహించనున్నారు. వర్సిటీ చాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కానున్నారని, ఏర్పాట్లను పూర్తి చేశామని వైస్ చాన్స్లర్ టీ.యాదగిరిరావు తెలిపారు. రాజ్భవన్ నుంచి వచ్చిన పోలీసు అధికారులు, నిజామాబాద్ సీపీ సాయిచైతన్య మంగళవారం క్యాంపస్ను సందర్శించి కాన్వొకేషన్ వేదిక వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. స్పిఫర్ డాగ్ స్క్వాడ్ బృందం, బాంబ్ డిస్పొజబుల్ టీం అధికారులు వేదికను నిశితంగా తనిఖీ చేశారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్కు చెందిన సిబ్బంది, బ్యాండ్ టీం గవర్నర్కు గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ హానర్) సమర్పించనున్నారు. రిహార్సల్స్లో భాగంగా ఆర్ఎస్సై కే.శ్రీకాంత్ ఆధ్వర్యంలో తెయూ వీసీ యాదగిరిరావు, సీపీ సాయిచైతన్యకు గౌరవ వందనం సమర్పించారు. వీసీ ప్రొఫెసర్ టీ.యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి, కంట్రోలర్ ప్రొఫెసర్ సంపత్కుమార్, డీన్స్లతో కలిపి మాక్ సెషన్ నిర్వహించారు. మాక్ డ్రిల్లో కాన్వొకేషన్ నిర్వహణ కమిటీల కన్వీనర్లు, ప్రొఫెసర్లు ఘంటా చంద్రశేఖర్, కనకయ్య, అపర్ణ, ఆరతి, రాంబాబు, ఆంజనేయులు, కె.రవీందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రవీణ్ మామిడాల, అసోసియేట్ ప్రొఫెసర్ నాగరాజు, పీఆర్వో ఏ.పున్నయ్య, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. గవర్నర్ పర్యటన సాగుతుందిలా..గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బుధవారం ఉదయం 8.30 గంటలకు రాజ్భవన్ నుంచి రోడ్డుమార్గం ద్వారా బయల్దేరి 11.10 గంటలకు డిచ్పల్లిలోని టీజీఎస్పీ ఏడో బెటాలియన్కు చేరుకుంటారు. బెటాలియన్లో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన తర్వాత 15 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటారు. 11.25 గంటలకు బెటాలియన్ నుంచి బయల్దేరి 11.30 గంటలకు తెలంగాణ యూనివర్సిటీకి చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు తెయూ కాన్వొకేషన్లో పాల్గొంటారు. వర్సిటీ నుంచి 1.05 గంటలకు బయల్దేరి 1.10 గంటలకు బెటాలియన్కు చేరుకుని అక్కడే భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు బెటాలియన్ నుంచి బయల్దేరి 2.50 గంటలకు నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుంటారు. 3 నుంచి 4 గంటల వరకు జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతలైన రచయితలు, కళాకారులతో మాట్లాడుతారు. సాయంత్రం 4 నుంచి 4.30 గంటల వరకు జిల్లా టీబీ అధికారులు, ఐఆర్సీఎస్ ప్రతినిధులతో సమావేశమవుతారు. 4.30 నుంచి 4.45 గంటల వరకు విశ్రాంతి తీసుకుని 4.45 గంటలకు హైదరాబాద్కు బయల్దేరుతారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాక భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీపీ 130 మంది విద్యార్థులు.. 157 మంది పరిశోధకులు 2014 నుంచి 2023 వరకు 15 పోసు్ట్రగాడ్యుయేట్ (పీజీ) విభాగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన 130 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 18 విభాగాల్లో పరిశోధనలు పూర్తి చేసుకున్న 157 మందికి అధికారికంగా పీహెచ్డీ పట్టాలను అందజేస్తారు. బంగారు పతకాలను, పీహెచ్డీ డాక్టరేట్ పట్టాలను గవర్నర్ తో పాటు ముఖ్యఅతిథి చేతుల మీదుగా అందజేసి సత్కరిస్తారు. -
సమన్వయంతో అభివృద్ధి సాధిద్దాం
● కామారెడ్డి జిల్లా సమీక్ష సమావేశంలో ఇన్చార్జి మంత్రి సీతక్క సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క సూచించారు. మంగళవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధ్యక్షతన కలెక్టరేట్ స మావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం ని ర్వహించారు. ఎంపీ సురేశ్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్అలీ, పోచారం శ్రీనివాస్రె డ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రెటరీ అనితా రా మచంద్రన్, ఎమ్మెల్యేలు మదన్మోహన్రావు, లక్ష్మీకాంతారావు తదితరులు పాల్గొన్నారు. పలు శాఖ లపై మంత్రి సీతక్క సమీక్షించారు. వివిధ శాఖల అధికారుల పనితీరుపై ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారులు మనసుపెట్టి పనిచేయాలన్నారు. సమ స్యలను పరిష్కరిస్తూ ప్రజల్లో మంచి పేరు తె చ్చుకోవాలని, మీరు మంచి చేస్తే ప్రభుత్వానికి మంచి పేరొస్తుందని పేర్కొన్నారు. సమస్య ఉందని తెలియగానే దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయాలన్నారు. ఒకవేళ సమస్య తీవ్రమైనదైతే ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రుల దృష్టికి తీసుకురావడం ద్వారా అది జఠిలం కాకుండా చూడవచ్చన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలని సూచించారు. తాగునీరు కలుషితం కాకుండా చూడాలన్నారు. డెంగీ ప్రబలకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు.. లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను వేగంగా నిర్మించుకునేలా అధికారులు చూడాలని మంత్రి సూ చించారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి సెర్ప్, డ్వాక్రాల ద్వారా రుణాలు ఇప్పించి సహకరించాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా మంజూరైన రోడ్ల నిర్మాణాలకు వెంటనే టెండర్లు పిలిచి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మహి ళా శక్తి భవనాలను నవంబర్ 19న ప్రారంభించేందుకు సిద్ధం చేయాలన్నారు. అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్వాడీ భవనాల లెక్కలు తీయాలని, వాటికి సొంత భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. అంగన్వాడీ టీ చర్లు, ఆయాల పోస్టులను భర్తీ చేయడానికి రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్న ట్టు తెలిపారు. ఎస్పీ రాజేశ్ చంద్ర, జిల్లా అటవీ అ ధికారి నిఖిత, సబ్ కలెక్టర్ కిరణ్మయి, అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, ఏఎస్పీ చైతన్య పాల్గొన్నారు. -
విద్యార్థులు స్ఫూర్తి పొందాలి
శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర విజయవంతం కావడంపై ప్రతి భారతీయుడు గర్వపడాలి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వివిధ పరిశోధనలు చేసి విజయవంతంగా తిరిగిరావడం సంతోషకరం. వి ద్యార్థులు శుభాంశు శుక్లాను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలి. కలలు కనండి, వాటిని నిజం చేసుకోండి అని మాజీ రాష్ట్రపతి ఏపీ జే అబ్దుల్ కలాం చెప్పిన సూక్తిని పరిగణనలోకి తీసుకుని విద్యార్థులు స్ఫూర్తి పొందాలి. ఆకాశమే హద్దుగా మానవాళికి ఉపయోగపడేవిధంగా పరిశోధనలు చేసే లక్ష్యంతో విజ్ఞానాన్ని సముపార్జించుకుంటూ గొప్పగా ఎదగాలి. – టి వినయ్ కృష్ణారెడ్డి, కలెక్టర్ -
ఒకటికి ఓర్చుకోవాల్సిందే..
ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు లేక విద్యా ర్థుల సంఖ్య తగ్గుతోంది. పలు బడుల్లో మరుగు దొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆర్మూర్ పట్టణం జిరాయత్నగర్ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (చిప్ప స్కూల్)లో విద్యార్థులు ఒకటికి వెళ్లాలంటే శిథిలమైన టాయిలెట్ల గోడ వెనకకు, రెండుకు వెళ్లాలంటే మాత్రం ఇంటికి పరుగెత్తాల్సిందే. మన ఊరు–మన బడిలో నిధులు మంజూరైనప్పటికీ పనులు అర్ధంతరంగా నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పాఠశాల ప్రాంగణంలో తెలుగు, ఉర్దూ మీడియం కలిపి 120 మంది విద్యార్థులుండగా అందులో బాలికలే 80 మంది ఉన్నారు. బాలికలు గోడ వెనకకు వెళ్లలేక ఇంటికి వెళ్లే వరకు ఓర్చుకుంటూ దయనీయంగా తరగతులకు హాజరవుతున్నారు. ఈ పాఠశాలలో 8 మంది ఉపాధ్యాయులు ఉండగా వారిలో నలుగురు మహిళా ఉపాధ్యాయులకు మాత్రం ఒక టాయిలెట్ అందుబాటులో ఉంది. ఆలూరు మండలం గగ్గుపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మూత్రశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరమ్మతులకు నిధులు మంజూరైనప్పటికీ కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో వెనక్కి వెళ్లాయి. మూత్రశాలలకు నీటి సరఫరా సౌకర్యం లేకపోవడంతో స్కావెంజర్ దూరం నుచి నీటిని మోసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. నలుగురు విద్యార్థులతో మాందాపూర్ బడి మాక్లూర్ మండలం మాందాపూర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కేవలం నలుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. రాంపూర్ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు, 8 మంది విద్యార్థులు మాత్రమే ఉండటంతో ఒక ఉపాధ్యాయుడిని గొట్టుముక్కులకు డిప్యుటేషన్పై పంపించారు. డొంకేశ్వర్ మండలం దత్తాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. ఒకటో తరగతిలో ముగ్గురు, రెండో తరగతిలో ఆరుగురు, మూడులో ఎనిమిది, నాలుగులో ముగ్గురు, ఐదో తరగతిలో పది మంది చదువుతున్నారు. కాలకృత్యాలకు ఇంటికి పరుగెత్తాల్సిన దుస్థితి వసతుల్లేక తగ్గుతున్న విద్యార్థులు ప్రతికూల పరిస్థితుల్లో ప్రభుత్వ బడులు ఆర్మూర్ నియోజకవర్గంలో టాయిలెట్లు లేక ఇక్కట్లు పడుతున్న విద్యార్థులుఇంటికి వెళ్తున్నాం.. ఒకటికి అయితే గోడ వెనకకే వెళ్తున్నాం. రెండుకు అయితే మాత్రం టీచర్ను అడిగి ఇంటికి వెళ్లి వస్తున్నా. చాలా ఇబ్బందిగా ఉంది. మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించాలి. – పూజ, విద్యార్థిని, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, జిరాయత్నగర్, ఆర్మూర్ -
కాన్వొకేషన్కు రండి
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో బుధవారం నిర్వహించనున్న కాన్వొకేషన్కు హాజరుకావాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను వీసీ ప్రొఫెసర్ టీ యాదగిరిరావు ఆహ్వానించారు. సోమవారం కమిషనరేట్ కార్యాలయానికి వెళ్లిన వీసీ, సీపీని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానించారు.నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం సుభాష్నగర్: నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండనున్నట్లు ఏడీఈ టౌన్–1 ఆర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. వినాయక్నగర్లో 33కేవీ కొత్త టవర్ నిర్మాణం కోసం కరెంట్ కోత విధించనున్నట్లు తెలిపారు. దీంతో మహాలక్ష్మీ ఫీడర్ పరిధిలోని అమ్మ వెంచర్, న్యూ హౌసింగ్ బోర్డు, ఆర్యనగర్ (కొంతభాగం), ఎల్జీ స్విమ్మింగ్ పూ ల్, బ్యాంకు కాలనీ, బస్వా గార్డెన్, తుల్జా భవానీ, గూడెం ప్రాంతాల్లో నేడు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అన్నారు. -
అన్నారంలో కారు బోల్తా
డొంకేశ్వర్(ఆర్మూర్): డొంకేశ్వర్ మండలం అన్నారం శివారులో ఆదివారం రాత్రి మారుతి స్విఫ్ట్ కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. నిజామాబాద్కు చెందిన యువకులు ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతానికి వచ్చి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అతి వేగంతో కారును నడపడంతో మూలమలుపు వద్ద రోడ్డు కనిపించక కారు వ్యవసాయ పొలంలోకి దూసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. అందులో ఉన్న యువకులకు స్వల్పగాయాలు కాగా, పొక్లెయిన్ సాయంతో కారును బయటికి తీశారు. అన్నారం వద్ద మూల మలుపు కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. టిప్పర్లు, ఆటోలు బోల్తా పడిన ఘటనలున్నాయి. సంబంధిత అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. మరోవైపు పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టకపోవడంతో పలువురు వాహనాలను అతివేగంగా నడుపుతున్నారు. -
బైక్ అదుపుతప్పి యువకుడి మృతి
డిచ్పల్లి: డిచ్పల్లి మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన ఒడ్డెపల్లి రంజిత్ (29) బైక్పై అదుపుతప్పి పక్కనే ఉన్న డ్రైనేజీలో పడి మృతి చెందినట్లు ఎస్సై ఎండీ షరీఫ్ సోమవారం తెలిపారు. ఒడ్డెపల్లి రాజలింగంకు నలుగురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. కూతురుతోపాటు ఇద్దరు కొడుకులకు గతంలోనే పెళ్లిళ్లు జరిగాయి. మూడో వాడైన రంజిత్ 5 సంవత్సరాలుగా దుబాయ్కు వెళుతున్నాడు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని వారం రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. ఆదివారం సాయంత్రం బైక్పై బయటికి వెళ్లాడు. అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో ఇంటికి తిరిగి వస్తూ గ్రామంలోని సీసీ రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న డ్రైనేజీలో పడిపోయాడు. తీవ్రగాయాలు కావడంతో కుటుంబీకులు రంజిత్ను డిచ్పల్లిలోని ప్రభుత్వ 30 పడకల ఆస్పత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3గంటల సమయంలో మృతి చెందాడు. మృతుడి తండ్రి రాజలింగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పకడ్బందీగా ఓటరు నమోదు చేయాలి
రుద్రూర్: ఓటర్ నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని సమీకృత కార్యాలయ భవనంలో సోమవారం చందూర్, రుద్రూర్ బీఎల్వోలతో నిర్వహించిన శిక్షణను పరిశీలించారు. అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు వివరాలు సక్రమంగా నమోదు చేయాలన్నారు. తప్పులు సరిచేయడంతోపాటు డబుల్ ఓట్లను తొలగించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేందర్ నాయక్, చందూర్ ఉప తహసీల్దార్ ఆసియా ఫాతిమా, బీఎల్వోలు పాల్గొన్నారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి -
జీజీహెచ్ సూపరింటెండెంట్ బాధ్యతలు స్వీకరించేనా?
నిజామాబాద్నాగారం: పదవీ విరమణ వయస్సు లో కొత్త బాధ్యతలు ఎందుకు..? ఉన్నపళంగా హై దరాబాద్ను వదిలి వేరే జిల్లాకు వదిలి వెళ్లడం ఎందుకు? అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ జీజీహెచ్ సూపరింటెండెంట్గా మాల కొండారెడ్డి ఇప్పటికీ విధుల్లో చేరలేదు. అసలు ఆయన వస్తా రా? రారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. నిజామాబాద్ జిల్లా కేంద్ర జనరల్ ఆస్పత్రికి సూపరింటెండెంట్గా మాల కొండారెడ్డిని ప్రభుత్వం నియమించింది. అయితే ఆయన హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి విముఖత చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. పదవీ విరమణ వయస్సు, హైదరాబాద్ను వదిలి వెళ్లడం ఇష్టం లేని ఆయన కోర్టుకు వెళ్లినట్లు తెలిసింది. ఏళ్లుగా ఇన్చార్జీలే.. ప్రభుత్వం ఆదేశించినా మాల కొండారెడ్డి విధుల్లో చేరకపోవడంతో జీజీహెచ్కు మళ్లీ ఇన్చార్జి పాలనకే దిక్కయ్యేలా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. గత 12 ఏళ్లలో డాక్టర్ వాలీయాను మా త్రమే ప్రభుత్వం సూపరింటెండెంట్గా నియమించినా ఆయన ఇటువైపు కన్నెత్తి చూడలేదు. జిల్లా ఆస్పత్రి జీజీహెచ్గా మారిన నాటి నుంచి ఇన్చార్జీలతోనే నెట్టకొస్తున్నారు. దూరం కారణంగా సూపరింటెండెంట్లుగా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేందుకు భయపడుతున్నారని, అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కళాశాలల్లో పోస్టింగ్లను ఇష్టపడుతున్నారని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా జీజీహెచ్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహించడం కత్తి మీద సాము అని, దీంతో రెగ్యులర్ సూపరింటెండెంట్గా జిల్లాకు రావడానికి భయపడుతున్నారని పలువురు అంటున్నారు. ప్రభుత్వం బాధ్యతలు అప్పగించినా ఇప్పటికీ విధుల్లో చేరని వైనం పెద్ద దవాఖానాకు రెగ్యులర్ సూపరింటెండెంట్ రాక కలేనా.. 12 ఏళ్లుగా ఇన్చార్జీల పాలనే దిక్కుసెలవుల్లో ఇన్చార్జి సూపరింటెండెంట్ జీజీహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ వ్యక్తిగత పనుల నిమిత్తం 10 రోజులు సెల వులో వెళ్లారు. ఆర్థో ప్రొఫెసర్ డాక్టర్ రాములు ఇన్చార్జిగా కొనసాగనున్నారు. -
ఆర్ఎంపీ ఆత్మహత్య
నిజాంసాగర్(జుక్కల్): జుక్కల్ మండలం మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన మోరె గణేశ్(38) అనే ఆర్ఎంపీ ఆదివారం ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై నవీన్ చంద్ర తెలిపారు. భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్థలలో మానసిక వేదనకు గురైన గణేశ్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అప్పల బాధతో ఒకరు.. రుద్రూర్: కోటగిరి మండలం వల్లభాపూర్ గ్రామానికి చెందిన మేకల హన్మాండ్లు (30) చికిత్స పొందుతూ జిల్లా ఆస్పత్రిలో మృతి చెందినట్లు ఎస్సై సునీల్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కూలి పనులు చేస్తూ జీవించే హన్మాండ్లు అప్పులు పెరిగి పోవడంతో ఈ నెల 13న సాయంత్రం గుర్తు తెలియని పురుగుల మందు తాగాడు. గుర్తించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం నిజామాబాద్లోని జీజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి భార్య గంగామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యంఆర్మూర్టౌన్: పట్టణంలోని కెనాల్ కట్ట సమీపంలో సోమవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని, దేహంపై తెల్లటి రంగు టీషర్టు, కాకి కలర్ ప్యాంట్ ఉందన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచామని, వ్యక్తి గురించి ఎవరికై నా సమాచారం తెలిస్తే పోలీస్స్టేషన్లో సంప్రదించాలని తెలిపారు. స్నూకర్ షాపుపై పోలీసుల దాడిఖలీల్వాడి: నగరంలోని ఒకటో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో స్నూకర్ షాపుపై ఆదివారం అర్ధరాత్రి సీసీఎస్ పోలీసులు దాడి చేశారు. ఈ షాపు లో గత కొన్ని రోజుల నుంచి బెట్టింగ్ దందా సాగిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నట్లు సమాచారం రావడంతో సీసీఎస్ పోలీసులు దాడులు చేశారు. నలుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ. 2,500 స్వాధీనం చేసుకొని ఒకటో టౌన్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్లో ఒకరికి జైలుబాల్కొండ: మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన మెండోరా మండల కేంద్రానికి చెందిన వేముల సాయిలుకు ఆర్మూర్ కోర్టు మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ సోమవారం రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు బాల్కొండ ఎస్సై శైలెందర్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
పాఠశాలలో ఫర్నిచర్ ధ్వంసం
రుద్రూర్: పోతంగల్ మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం స్కూల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల గది తాళాలు పగులగొట్టి సీలింగ్ ఫ్యాన్లు, వాటర్ బోర్ కేబుల్స్, ట్యూబ్ లైట్లు ధ్వంసం చేశారని హెడ్మాస్టర్ సాయికుమార్ తెలిపారు. సోమవారం ఉదయం పాఠశాలలోకి రాగానే చిందరవందరగా పడి ఉన్న వైర్లను చూసి అవాక్కయ్యారు. వాటర్ బోర్ కేబుల్స్, ట్యూబ్ లైట్లు, స్వీచ్ బోర్డులు, సర్వీస్ వైర్ ధ్వంసమైనట్లు గుర్తించారు. అక్రమ ఇసుక నిల్వల సీజ్రెంజల్(బోధన్): మండలంలోని కందకుర్తి పరిధిలోని మొఘల్పుర శివారులో గోదావరి ఒడ్డుపై అక్రమంగా నిల్వ చేసిన ఇసుక నిల్వలను సోమవారం రెవెన్యూ అధికారులు, పోలీసులు సీజ్ చేశారు. మొఘల్పుర శివారు లో సుమారు 300 ట్రాక్టర్ల ఇసుక నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. సీజ్ చేసిన ఇసుక నిల్వలను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా అందజేస్తామని తహశీల్దార్ శ్రావణ్కుమార్ తెలిపారు. ఆయన వెంట బోధన్ రూరల్ సీఐ విజయ్బాబు, రెంజల్ ఎస్సై చంద్రమోహన్ ఉన్నారు. -
ప్రజావాణికి ప్రాధాన్యమివ్వాలి
నిజామాబాద్అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 94 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అదనపు కలెక్టర్లతోపాటు మెప్మా పీడీ రాజేందర్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్లకు విన్నవించారు. ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని బీసీ, ఎస్సీ, ఏస్టీ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఉచిత బస్సు సౌకర్యంతో విద్యార్థులకు మేలు కలుగుతుందని, పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు మహిపాల్, సుమన్, ప్రేమ్ పాల్గొన్నారు. అధికారులపై చర్యలు తీసుకోవాలి నగరంలోని ఆర్టీసీ– 2 డిపోకు రూ.2కోట్ల మేర నష్టం కలిగించిన మున్సిపల్, విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని న్యాల్కల్ రోడ్కు చెందిన స్థానికులు పలువురు అదనపు కలెక్టర్ కిరణ్కుమార్కు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ డిపోకు 33/11 కేవీ విద్యుత్ లైన్ను ప్రైవేటు ప్లాట్ల స్థలాల గుండా వేయిస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రధాన రోడ్డు గుండా వేయాల్సిన లైన్ను ప్లాట్ల గుండా వేసి ప్రజాధనం రూ.2కోట్లు వృథా చేశారన్నారు. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్ 94 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు -
ఒంటి చేత్తో నిర్మించిన నల్లూరి గుమిటి
మీకు తెలుసా? శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో పాక్షికంగా ముంపునకు గురైన నల్లూర్ గ్రామ శివారులోని నల్లూరి గుమిటి ఒంటో చేత్తో నిర్మించినదిగా ప్రసిద్ధి చెందినది.●● నల్లూర్ గుమిటి, న్యావనంది తూం, కస్పా(బినోలా) నంది, నీల కంఠేశ్వరా ఆలయాన్ని ఒకరే ఒంటి చేత్తో నిర్మించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. ● నల్లూర్ శివారులోని దర్గా నల్లూర్ గుమిటిగా ప్రసిద్ధి చెందినది. ● ప్రాజెక్ట్ నుంచి లక్ష్మి కాలువ నిర్మాణం ఈ ప్రాంతం నుంచే చేపట్టేవారని, కానీ గుమిటి ఉండటంతో నిర్మాణం నిలిపివేసినట్లు గ్రామస్తులు చెప్తున్నారు. ● ప్రస్తుతం లక్ష్మి కాలువ నీటి సరఫరా కోసం గుమిటికి ఎదురుగా ప్రాజెక్ట్లో లక్ష్మి ఎత్తిపోతల పథకం నిర్మించారు. ● నల్లూర్ గుమిటి వద్ద ప్రతి శుక్ర, సోమవారాల్లో భక్తులు అత్యధికంగా పూజలు నిర్వహిస్తారు. – బాల్కొండ -
ఈవ్టీజింగ్కు పాల్పడితే కఠిన చర్యలు
పెర్కిట్/బోధన్ టౌన్ : మహిళలు, విద్యార్థినులపై ఎవరైనా ఈవ్టీజింగ్కు పాల్పడితే పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని షీ టీం సభ్యులు విఘ్నేష్, సుమతి తెలిపారు. ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం షీ టీం ఆధ్వర్యంలో నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షీ టీం సభ్యులు మాట్లాడుతూ పోకిరీల వేధింపులకు గురైన వారు షీ టీవ్ుకు సమాచారం ఇవ్వాలన్నారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యాంటీ డ్రగ్స్, ట్రాఫిక్పై అవగాహన, యాంటీ ర్యాగింగ్, సైబర్ నేరాలపై బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ అవగాహన కల్పించారు. బాధితులు షీ టీం నెంబరు 8712659795, డయల్ 100కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. అనంతరం విద్యార్థినులకు పోలీస్ శాఖ క్యూ ఆర్ కోడ్లను అందజేశారు. ఇన్చార్జి హెచ్ఎం జగదీశ్వర్, ఉపాధ్యాయులు కృష్ణ చైతన్య, రాజేశ్, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆపరేషన్ టైగర్!
నిజామాబాద్ప్రజావాణికి ప్రాధాన్యం.. ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2025– 8లో uసాగునీటి కాలువ పరిశీలన నవీపేట : ‘గిఫ్ట్ కొంత.. కబ్జా మరింత’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మండల కేంద్రంలో కబ్జాకు గురవుతున్న సాగు నీటి కాలువను తహసీల్దార్ వెంకటరమణ, ఇరిగేషన్ ఏ ఈ శ్రీధర్ సోమవారం పరిశీలించారు. సర్వే చేసి హద్దులు నిర్ధారించాలని సర్వేయర్ గోవర్ధన్ను తహసీల్దార్ ఆదేశించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు యత్నిస్తే కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. జాతీయ అవార్డుల దరఖాస్తుకు గడువు పొడిగింపు నిజామాబాద్అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో బోధిస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు 2025 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు డీఈవో అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17వ తేదీ వరకు గడువు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అవార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పోలీస్ ప్రజావాణికి 26 ఫిర్యాదులుఖలీల్వాడి: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సీపీ సాయి చైతన్య సోమవారం ప్ర జావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాలని సంబందధిత అధికారులకు సూచనలు చేశా రు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి న ఫిర్యాదుదారుల అర్జీలను స్వీకరించి తక్షణమే పరిష్కరించాలని సంబంధిత ఎస్సై, సీ ఐలను ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలన్నారు. పోలీస్ ప్రజావాణికి మొత్తం 26 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఎస్సారెస్పీలోకి తగ్గిన ఇన్ఫ్లోబాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతాల్లో వ ర్షాలు తగ్గడంతో ప్రాజెక్ట్లోకి 2,172 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 100, మిషన్ భగీర థ ద్వారా 231, ఆవిరి రూపంలో 359 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి 1068.70(21.2 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు తె లిపారు. గతేడాది ఇదే రోజున 1062.2 (12.90టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. ఉమ్మడి జిల్లా సరిహద్దుల్లో సంచరిస్తున్న పులి జాడ కనుక్కోవడం కోసం అటవీ అధికారులు గాలింపు కొనసాగిస్తున్నారు. రెండు రోజులైనా పులి ఎక్కడుంది, ఎటు వెళ్లిందన్నదానిపై స్పష్టత లేదు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎస్ 12 పులి కోసం కొనసాగుతున్న గాలింపు ● అడవిలో ఆరు ట్రాక్ కెమెరాలు ఏర్పాటు ● రెండు డ్రోన్ కెమెరాలతో కదలికలు కనిపెట్టే ప్రయత్నం ● ఎటువైపు వెళ్లిందన్న దానిపై స్పష్టత కరువు ● పులిపై విష ప్రయోగానికి ప్రయత్నించిన నలుగురిపై కేసు సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఉమ్మడి జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి కోసం అటవీ శాఖ ఆపరేషన్ కొనసాగుతోంది. జిల్లా అట వీ అధికారి నిఖిత ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని మాచారెడ్డి, కామారెడ్డి, సిరికొండ, ఇందల్వాయి, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట రేంజ్లకు చెందిన అటవీ అధికారులు, సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. మూడు బృందాలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రామారెడ్డి, మాచారెడ్డి మండలాల పరిధిలోని రెడ్డిపేట, అన్నారం, ఎల్లంపేట, సిరికొండ మండలంలోని కొండాపూర్, తూంపలి తదితర గ్రామాల పరిధిలోని అటవీ ప్రాంతాలలో గాలిస్తున్నారు. ఆరు ట్రాక్ కెమెరాల ఏర్పాటు పులి కదలికలను కనిపెట్టేందుకు అటవీ ప్రాంతంలో ఆరు ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పులి తిరిగిన ప్రదేశానికి రెండు కిలోమీటర్ల రేడియస్లో అన్నివైపులా కవరయ్యేలా కెమెరాలు బిగించినట్టు సమాచారం. ఆ ప్రాంతంలో పులి ఉంటే కచ్చితంగా కెమెరాలు ట్రాక్ చేస్తాయని అధికారులు చెబుతున్నారు. అలాగే రెండు డ్రోన్ కెమెరాలతో అడవిలో తిరుగుతూ పులి జాడ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాటే దాకా గాలింపు కొనసాగింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు సిబ్బంది అటవీ ప్రాంతంలోనే ఉండి పులి జాడ కోసం ప్రయత్నించారు. అదుపులో ముగ్గురు! రెడ్డిపేట స్కూల్ తండా పరిధిలోని అటవీ ప్రాంతంలో ఇటీవల ఆవుపై పులి దాడి చేసి చంపేసింది. అయితే ఆవు యజమానితో పాటు మరో ముగ్గురు ఆవుపై పురుగుమందులు చల్లి పులిని మట్టుబెట్టే ప్రయత్నం చేశారని అధికారులు గుర్తించి కేసు నమోదు చేశారు. ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. విషప్రయోగం నిర్ధారణ కోసం శాంపిళ్లను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. రాత్రింబవళ్లు రెస్క్యూ ఆపరేషన్ ..● నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ● మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ న్యూస్రీల్రెస్క్యూ ఆపరేషన్కు ఇబ్బందులు వర్షాకాలం కావడంతో అడవి పచ్చబడింది. ముళ్ల పొదలు, చెట్లు పెరిగి అడవిలో తిరగడానికి అటవీ అధికారులు, సిబ్బంది ఇబ్బంది పడుతు న్నారు. పులిని గుర్తించడం కూడా ఇబ్బందికరంగా మారింది. ఎస్ 12 పులిని కాపాడేందుకు ప్రత్యేక బృందాలు అడవుల్లో తిరుగుతూ దాని కదలికలను పసిగట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. పులి ఏ వైపు వెళ్లింది అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. నాలుగైదు దశాబ్దాలుగా జిల్లాలో పులుల సంచారం లేదు. ఇప్పుడు వచ్చిన పులిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ప్రజలు అటవీ ప్రాంతానికి వెళ్లొద్దు. పులిపై విష ప్రయోగం జరిగిందా లేదా అనేది ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వచ్చాకే చెప్పగలం. – నిఖిత, డీఎఫ్వో, కామారెడ్డి ఎస్ 12 నంబరుతో పిలవబడే పులి ఇటీవల జిల్లా సరిహద్దుల్లోని సిరికొండ, మాచారెడ్డి, రామారెడ్డి మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో తిరిగి నట్టు అటవీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. పులి కదలికలను తెలుసుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. దాని జాడ కనిపెట్టేందుకు మాచారెడ్డి, ఇందల్వాయి, కామారెడ్డి, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, సిరికొండ రేంజీలకు చెందిన అటవీ అధికారులు, సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. పులి కదలికలను గుర్తించే క్రమంలో అడవిని జల్లెడ పడుతున్నారు. సోమవారం జిల్లా అటవీ అధికారి నిఖిత కూడా అటవీ ప్రాంతానికి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ను పరిశీలించారు. డ్రోన్ కెమెరాల ద్వారా పులి కదలికలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. -
పెద్దపులి మొదట వచ్చింది సిరికొండకే..
డొంకేశ్వర్(ఆర్మూర్): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి రేంజ్ పరిధిలో ఆవుపై దాడిచేసి చంపిన పెద్దపులి మొదటగా నిజామాబాద్ జిల్లా సిరికొండ రేంజ్కే వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. ఇప్పటికే తాటిపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి పాద ముద్రలను గుర్తించిన విషయం తెలిసిందే. తాటిపల్లి అటవీలోనే కొన్ని రోజులు పెద్దపులి సంచరించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కొండలు, రాళ్ల గుట్టలు ఎక్కువగా ఉండడంతో మాచారెడ్డి అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్లు భావిస్తున్నారు. అయితే మాచారెడ్డి రేంజ్లో పెద్దపులిపై విష ప్రయోగం జరిగిందన్న వార్తలు రావడం, పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో నిజామాబాద్ జిల్లాలో కూడా హాట్ టాపిక్గా మా రింది. పెద్ద పులి మళ్లీ నిజామాబాద్ జిల్లా వైపు రా వొచ్చనే సందేహంతో సిరికొండ, ఇందల్వాయి, నిజామాబాద్ సౌత్ రేంజ్లను అప్రమత్తం చేశారు. అటవీ పరిసర గ్రామాల ప్రజలకు, రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పెద్దపులి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని, ఉచ్చులు, విద్యుత్ తీగలు పెట్టకూదని అధికారులు సూచిస్తున్నారు. అదే విధంగా నిజామాబాద్ నాగారంలో చిరుత సంచారం నేపథ్యంలో అన్ని రేంజ్లలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలిచ్చారు. నిర్ధారించిన అటవీ శాఖ అధికారులు ఇందల్వాయి, నిజామాబాద్ సౌత్ రేంజ్లలోనూ అప్రమత్తం -
పుష్కర కాలం తర్వాత..
తెయూ(డిచ్పల్లి): రాష్ట్రం పేరుతో ఏర్పాటైన తెలంగాణ యూనివర్సిటీలో గత పుష్కర కాలంగా (12 ఏళ్లుగా) విద్యార్థులు, అధ్యాపకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెండో స్నాతకోత్సవాన్ని (కా న్వొకేషన్) బుధవారం నిర్వహించనున్నారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కానుండగా, ముఖ్యఅతిథిగా ఐఐసీటీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీవారి చంద్రశేఖర్ పాల్గొంటారు. కాన్వొకేషన్ కోసం వర్సిటీ ఉన్నతాధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏడాదికోసారి కాన్వొకేషన్ నిర్వహించాల ని యూజీసీ నిబంధనలు చెబుతున్నాయి. 2006లో తెలంగాణ యూనివర్సిటీ ఏర్పడగా తొలి కాన్వొకేషన్ను 13 నవంబర్ 2013లో అ ప్పటి వీసీ అక్బర్ అలీఖాన్ హ యాంలో నిర్వహించారు. ఆ తర్వాత కాన్వొకేషన్ నిర్వహణను మరిచారు. 2018, 2020లో కాన్వొకేషన్ నిర్వహణకు అప్పటి వీసీలు సాంబయ్య, రవీందర్గుప్తా నోటీసులు జారీ చేసినప్పటికీ నిర్వహించలేకపోయారు. అయితే గతేడాది అక్టోబర్లో వీసీగా బాధ్యత లు స్వీకరించిన యాదగిరి రావు కాన్వొకేషన్ నిర్వహ ణకు తొలి ప్రాధాన్యం ఇ వ్వడంతో నవంబర్లో నో టిఫికేషన్ జారీ అయ్యింది. హైదరాబాద్ నుంచి జర్మన్ హ్యాంకర్ వర్సిటీ క్రీడామైదానంలో కాన్వొకేషన్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వానాకాలం కావడంతో వర్షం, ఈదురు గాలులు వస్తే కార్యక్రమ నిర్వహణకు ఆటంకాలు కలగకుండా హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా జర్మన్ హ్యాంకర్ను తెప్పించారు. ఇందులో 500 మంది కూర్చునేందుకు వీలుండగా, రూ.9లక్షలు ఖర్చు చేస్తున్నారు. క్యాంపస్లోని రోడ్లకు మరమ్మతులు చేపట్టారు. సూచిక బోర్డులతోపాటు పరిపాలనా భవనానికి వేళ్లే దారిలో ‘ఐలవ్ టీయూ’ పేరుతో శాశ్వత సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. అన్ని బోర్డుల వద్ద లాన్స్ ఏర్పాటు చేస్తున్నారు. రాజ్భవన్ కార్యాలయం ప్రోటోకాల్ ప్రకారం స్టేజీపై రాష్ట్ర గవర్నర్, ముఖ్యఅతిథి, వీసీ, రిజిస్ట్రార్తోపాటు ఏడుగురు డీన్స్ మాత్రమే కూర్చునే అవకాశం ఉంటుంది. విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేసి లోనికి అనుమతిస్తారు. సెల్ఫోన్లు, బ్యానర్లు, పేపర్లు తీసుకెళ్లే వీలుండదు. పాస్లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు. బెటాలియన్లో గార్డ్ ఆఫ్ హానర్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముందుగా డిచ్పల్లిలోని టీజీఎస్పీ ఏడో బెటాలియన్కు చేరుకుంటారు. గెస్ట్ హౌజ్ వద్ద 104 మంది పోలీసు సిబ్బందితో గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ హానర్) స్వీకరిస్తారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత తెయూకు చేరుకుని వర్సిటీలో సైతం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. జిల్లా కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయిచైతన్య కాన్వొకేషన్కు హాజరు కానున్నారు. వర్సిటీలో ఏర్పాట్లను వీసీ, రిజిస్ట్రార్లతో కలిసి నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్రెడ్డి సోమవారం పరిశీలించారు. గ్రాడ్యుయేట్లుతొ పోస్ట్ గ్రాడ్యుయేట్లు తెయూ పరిధిలో 2014 నుంచి 2023 వరకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ)లో 15,557 మంది విద్యార్థులు, గ్రాడ్యుయేషన్ (యూజీ) లో 60,660 మంది విద్యార్థులు, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) లో 10,079 మంది విద్యార్థులు విద్యాభ్యాసం పూర్తి చేశారు. రూ.33.80 లక్షల విరాళం వర్సిటీలో నిర్వహించే అతి పెద్ద పండుగ కాన్వొకేషన్. యూజీ, పీజీ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు అతిథుల చేతులమీదుగా బంగారు పతకాలు (గోల్డ్ మెడల్స్) అందజేసి సత్కరిస్తారు. పీహెచ్డీ డాక్టరేట్ సాధించిన వారికి అధికారికంగా పట్టాలు అందజేస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖులు, విద్యా సంస్థల అధిపతులు, స్వచ్చంద సేవకులు, రాజకీయ నేతలు, వివిధ రంగాల వారు గోల్డ్ మెడల్స్ కోసం వర్సిటీకి రూ.33.80 లక్షలు విరాళం ఇచ్చారు. ఆ డబ్బును వర్సిటీ ఉన్నతాధికారులు బ్యాంకులో డిపాజిట్ చేశారు. డిపాజిట్ మొత్తంపై వడ్డీ రూపంలో వచ్చే డబ్బులతో విద్యార్థుల అందజేసేందుకు 130 బంగారు పతకాలు తయారు చేయించారు. గోల్డ్ మెడల్స్, పీహెచ్డీ పట్టాలను మాత్రమే గవర్నర్, ముఖ్యఅతిథి చేతుల మీదుగా అందజేస్తారు. రేపు తెయూలో స్నాతకోత్సవం చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాక పాల్గొననున్న కలెక్టర్, సీపీఆరు విభాగాలతో ప్రారంభమై.. 2006లో ఆరు విభాగాలతో ప్రారంభమైన యూనివర్సిటీ ప్రస్తుతం 24 విభాగాల్లో 31 కోర్సులకు విస్తరించింది. డిచ్పల్లిలోని ప్రధాన క్యాంపస్తోపాటు కామారెడ్డి జిల్లా భిక్కనూర్లోని సౌత్క్యాంపస్, నిజామాబాద్ నగరంలోని సారంగపూర్లో ఎడ్యుకేషన్ క్యాంపస్ కొ నసాగుతున్నాయి.ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో 109 అనుబంధ యూజీ, పీజీ కళాశాలలు ఉండగా, 31 కోర్సులకుగాను 19 అ ప్రూవ్డ్ రెగ్యులర్ కోర్సులు, 12 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు, 7 పీహెచ్డీ కోర్సులు ఉన్నాయి. అందరి సహకారంతో.. తెయూ(డిచ్పల్లి): విద్యార్థులు, అధ్యాపకులు, పూ ర్వ విద్యార్థులందరి సహకారంతో ఈనెల 16న ని ర్వహించనున్న తెలంగాణ యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవాన్ని (కాన్వొకేషన్)ను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నామని వైస్ చాన్స్లర్ టీ.యాదగిరిరావు అన్నారు. వర్సిటీ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కాలేజీ సెమినార్ హాలులో సో మవారం ఆయన రిజిస్ట్రార్ ఎం.యాదగిరి, కంట్రోలర్ కే.సంపత్కుమార్తో కలిసి వీసీ మాట్లాడారు. 16 విభాగాల నుంచి మొదటి ర్యాంకు పొందిన 130 మంది విద్యార్థులకు 16 మంది దాతల సహకారంతో కాన్వొకేషన్లో గోల్డ్ మెడ ల్స్ అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే 30 జూన్ 2025 వరకు ఏడు విభాగాల్లో 250 మంది పరిశోధనలు పూర్తి చేశారని, వారిలో 157 మందికి పీహెచ్డీ (డాక్టరేట్) పట్టాలు అందజేస్తామన్నా రు. ముఖ్యఅతిథిగా ఐఐసీటీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీవారి చంద్రశేఖర్ హాజరువుతారని తెలిపారు. ఆయా కమిటీల కన్వీనర్లు, ప్రొఫెస ర్లు ఘంటా చంద్రశేఖర్, కనకయ్య, అపర్ణ, ఆరతి, రాంబాబు, ఆంజనేయులు, రవీందర్ రెడ్డి, ప్రిన్సిపల్ ప్రవీణ్ మామిడాల,అసోసియేట్ ప్రొఫెసర్ నాగరాజు, పీఆర్వో ఏ పున్నయ్య పాల్గొన్నారు. కార్యక్రమ విజయవంతానికి కృషి చేస్తున్నాం వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ యాదగిరిరావు -
మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం
మోపాల్(నిజామాబాద్రూరల్): మహిళా సాధికారత సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నే తృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా పథకాల ను అమలు చేస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి అన్నారు. ఇందిరా మహిళాశక్తి సంబరాలను నగరశివారులోని బోర్గాం(పి)లో ఉన్న భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో సోమవారం అట్టహాసంగా నిర్వహించారు. కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డితో కలిసి మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, లోన్ బీమా, బాధిత కుటుంబాలకు ప్రమాద బీమా పరిహారం చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలను లబ్ధిదారులుగా ఎంపిక చేస్తూ ఇందిరమ్మ ఇళ్లు వారి పేరిట మంజూరు చేస్తున్నామని, రుణ సదుపాయం క ల్పిస్తున్నామని తెలిపారు. మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభు త్వం ఏటా రూ.25 వేల కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తుందని వివరించారు. కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని 20,547 మహిళా సంఘాలకు రూ.21.69 కోట్ల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం మంజూరు చేయగా, రూరల్ నియోజకవర్గంలోని 5781 మహిళా సంఘాలకు రూ.5.91 కోట్ల రుణాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వేడుకల్లో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి, డీఆర్డీవో సాయాగౌడ్, నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్గౌడ్, డీసీసీబీ వైస్ చైర్మన్ నల్ల చంద్రశేఖర్రెడ్డి, నాయకులు గడ్కో ల్ భాస్కర్రెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, కాంగ్రెస్ మండలాల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, సొసైటీల చైర్మన్లు, జి ల్లా, మండల మహిళా సమాఖ్యల ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.