breaking news
Nizamabad District Latest News
-
కాళేశ్వరం నీటిని వినియోగించుకోవాలి
క్లిష్టమైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటలను మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో వరి ఎక్కువగా పండుతున్నందున గన్నీ బ్యాగులకు విపరీతమైన డిమాండ్ ఉంది. కానీ ఇక్కడ జనపనార సాగు లేదు. మనకు 22 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం. ఇందుకు అనుగుణంగా జ్యూట్ పరిశ్రమను ఏర్పాటుచేసి, పంటలను ప్రోత్సహిస్తే రైతులకు మేలు జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో నీరు నిల్వ చేయకపోవడంతో నీరంతా సముద్రంలో కలుస్తోంది. ఆ నీటిని ఒడిసి పట్టి శ్రీరామ్సాగర్, నిజాంసాగర్, హల్దీ వాగువరకు పంపింగ్చేస్తే జిల్లావాసులకు మేలు జరుగుతుంది. – పైడి రాకేశ్రెడ్డి, ఎమ్మెల్యే, ఆర్మూర్ -
ట్రాన్స్కో ఏఈ ఇంట్లో చోరీ
కామారెడ్డి క్రైం : తాళం వేసి ఉన్న విద్యుత్శాఖ ఏఈ ఇంట్లో చోరీ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డిలోని కాకతీయనగర్ కాలనీలో నివాసం ఉంటున్న గంగాధర్ సదాశివనగర్ ట్రాన్స్కో ఏఈగా పని చేస్తున్నారు. బంధువుల ఇంట్లో శుభకార్యం ఉందని ఆదివారం ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి గంభీరావుపేటకు వెళ్లారు. దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. సోమవారం ఉదయం తిరిగి వచ్చిన గంగాధర్ కుటుంబం ఇంట్లో దొంగలు పడినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్, దేవునిపల్లి ఎస్సై రంజిత్, సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. క్లూస్టీం బృందం ఆధారాలు సేకరించింది. బీరువాలో దాచి ఉంచిన 3 తులాల బంగారం, 20 తులాల వెండి అపహరణకు గురైనట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ● 3 తులాల బంగారం, 20 తులాల వెండి అపహరణ -
ప్రయివేటు పాఠశాల గుర్తింపు రద్దు
ఆర్మూర్: ఆర్మూర్ పట్టణం కొటార్మూర్–పెర్కిట్ లోని భవిష్య దర్శిని ప్రాథమికోన్నత పాఠశాల గు ర్తింపును రద్దు చేస్తూ విద్యాశాఖ అధికారులు సో మవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పాఠశాల ప్రి న్సిపల్, ఉపాధ్యాయురాలు కలిసి ఉర్దూ, మతపరమైన అంశాలు బోధించడంపై తల్లిదండ్రులు, బీజే పీ నాయకులతో కలిసి యాజమాన్యాన్ని నిలదీసిన విషయం తెలిసిందే. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పోలీసు కేసులు సైతం నమోదయ్యాయి. తాజాగా విద్యాశాఖ అధికారులు పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. నచ్చిన పాఠశాలలో విద్యార్థులను చేర్పించుకోవాలని సూచించారు. పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ బాళోజీ, ఆర్మూర్ ఎంఈవో రాజగంగారాం నేతృత్వంలో పాఠశాలను సీజ్ చేశారు. -
ప్రత్యామ్నాయ పంటలకూ బోనస్ ఇవ్వాలి
ప్రభుత్వం వరికే కాకుండా ప్రత్యామ్నాయ పంటలకు సైతం బోనస్ ఇచ్చి ప్రోత్సహించాలి. రాష్ట్రంలో పీఎం ఫసల్ బీమా యోజన అమలు చేయాలి. ఈ పథకం అమలులో లేకపోవడం కారణంగా పంటలు నష్టపోతున్న రైతులకు కనీసం పెట్టుబడులు కూడా మిగలడం లేదు. ప్రభుత్వం సీజన్కు ముందే రైతులను అప్రమత్తం చేయాల్సింది. మెజార్టీ రైతులు పంటలు వేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నీటిని ఎస్సారెస్పీ, హల్దీ ప్రాజెక్టుల్లో నీటి నిల్వకు వినియోగించాలి. – ధన్పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్యే, అర్బన్ -
చిన్నారిపై తండ్రి, సవతి తల్లి హత్యాయత్నం
● ప్రమాదంలా చిత్రీకరించి, విఫలం ● సాంకేతిక ఆధారాలతో నిజాలు వెలికితీసిన పోలీసులు ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ విఠల్రెడ్డి బాన్సువాడ : చిన్నారిపై హత్యాయత్నం చేసిన ఘటనలో తండ్రి, సవతి తల్లిని పోలీసులు రిమాండ్కు తరలించారు. సోమవారం బాన్సువాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ విఠల్రెడ్డి వివరాలు వెల్లడించారు. బీర్కూర్కు చెందిన టేకు సతీశ్కు ఇద్దరు భార్యలు. సతీశ్ మొదట శైలజను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. ఆ తర్వాత శైలజ చెల్లి సంధ్యను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో వైష్ణవి జన్మించింది. వైష్ణవి పుట్టినప్పటి నుంచి సతీశ్, శైలజతో గొడవలు జరగడంతో సంధ్య పుట్టింటికి వెళ్లిపోయింది. వైష్ణవిని మాత్రం సతీశ్ తన వద్దనే పెంచుకుంటున్నాడు. ఈ నెల 15న ఉదయం చిన్నారి వైష్ణవి పొదల్లో రక్తమడుగుల్లో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్ ఆస్పత్రికి అక్కడి నుంచి హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం విషమంగానే ఉంది. అయితే, అక్క శైలజ తన కుమార్తెను హత్య చేయాలనే ఉద్దేశంతో బ్లేడ్తో దాడికి పాల్పడినట్లు సంధ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య, బీర్కూర్, పిట్లం ఎస్సైలు రాములు, ఆంజనేయులు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి శాసీ్త్రయ దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిపారు. వైష్ణవిని పోశించడం భారంగా మారడంతోపాటు కుటుంబంలో విభేదాల నేపథ్యంలో చిన్నారిని అడ్డు తొలగించాలని సతీశ్, శైలజ కుట్ర పన్నారు. 14న రాత్రి నిద్రిస్తున్న చిన్నారి వైష్ణవిని ఇద్దరూ కలిసి సీసీ రోడ్డుపై ఈడ్చుకుంటూ కొంతదూరం తీసుకెళ్లి గడ్డి ఉన్న ప్రదేశంలో పడుకోబెట్టి వెంట తెచ్చుకున్న బ్లేడ్తో గాయపర్చారు. చిన్నారి ఏడుపు ఆగిపోవడంతో చనిపోయిందని భావించి అక్కడే వదిలేసి తిరిగి ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం చిన్నారి కనిపించడం లేదని, గ్రామపెద్దలకు సమాచారం ఇచ్చి వారితో కలిసి వెతుకుతున్నట్లు నటించారు. చిన్నారి ఉన్న ప్రదేశం ముందుగానే తెలిసి కూడా అక్కడికి వెళ్లి కనిపించినట్లు చెప్పి ఎలాంటి అనుమానం రాకుండా బంధువులతో కలిసి చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. చిన్నారిని కుక్కలు ఎత్తుకెళ్లి గాయపరిచినట్లు గ్రామస్తులు, బంధువులు, పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశారు. సాంకేతిక ఆధారాలు, శాసీ్త్రయ పరిశీలన, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా నిందితులు విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితులు సతీశ్, శైలజ వద్ద రెండ్లు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసును ఛేదించిన బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య, బీర్కూర్, పిట్లం ఎస్సైలు రాములు, ఆంజనేయులులను ఎస్పీ అభినందించారని ఆయన పేర్కొన్నారు. -
ఎల్నినో ముప్పు ఇలా ఉంటుంది!
● తగ్గనున్న వర్షపాతం, నీటి లభ్యత ● పంటల మార్పిడే ప్రత్యామ్నాయ మార్గం ● ఉన్నతస్థాయి సమావేశంలో సుదీర్ఘ చర్చ నిజామాబాద్ అర్బన్ : జిల్లాపై ఎల్నినో ముప్పు తప్పేలా లేదు. ఇప్పటికే వాన జాడ కరువైంది. లోటు వర్షపాతం నమోదవుతోంది. ఎన్నినో ప్రభావంతోనే సరైన వర్షాలు కురవడం లేదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో అధికార యంత్రాంగం కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తోంది. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో సోమవా రం జిల్లా ప్రత్యేకాధికారిణి, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వాతావరణ పరిస్థితులు, పంటల సాగు, నేలల రకాలు, నీటి లభ్యత తదితర అంశా లపై సుదీర్ఘంగా చర్చించారు. కొందరు రైతుల అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ క్రమంలో జిల్లా ఉన్నతాధికారులు ఎల్నినో ప్రభావం జిల్లాపై ఏ విధంగా ఉంటుంది.. వర్షపాతం నమోదు, నీటి ల భ్యత, భూగర్భజలాల, ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, వ ర్షాభావ పరిస్థితులకు అనుకూలమైన పంటలు తదితర అంశాలతో కూడిన నివేదిక రూపొందించారు. ఎల్నినో పసిఫిక్ మహాసముద్రం మధ్య, తూర్పు భాగంలోని సముద్ర ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువ పెరుగుతాయి. దీంతో పసిఫిక్ మహాసముద్రంలోని నీరు అసాధారణంగా వేడెక్కుతుంది. ఈ వేడిగాలులు భారతదేశం వైపు వీస్తాయి. దీంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడి వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయి. 42 గ్రామాలపై తీవ్ర ప్రభావం ఎల్నినోతో జిల్లాలో 42 గ్రామాలు తీవ్ర ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంది. 383 గ్రామాలు మధ్యస్థ, 35 గ్రామాలు తక్కువ ప్రభావమయ్యే అవకాశం ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. జలాశయాలు వెలవెల ఎల్నినో ప్రభావంతో జలాశయాలు నీరు లేక వెలవెలబోనున్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుత నీటిమట్టం 6.54 టీఎంసీలు ఉండగా వర్షభావ పరిస్థితులతో 0.63 టీఎంసీలకు చేరుకోనున్నది. శ్రీరాంసాగర్లో 15.05 టీఎంసీలు ఉండగా, ఎల్నినో ఎఫెక్ట్తో 0.28 టీఎంసీలకు పడిపోనున్నది. రామడుగు ప్రాజెక్టులో 0.164 టీఎంసీలు ఉండగా వర్షాభావ పరిస్థితులతో 0.10 టీఎంసీలు చేరుకుంటుందని నివేదికలో తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలే మేలు వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయడమే మంచిదని వ్యవసాయ శాఖ తన నివేదికలో పేర్కొంది. జిల్లాలోని నేలలు, వాటి రకాల మేరకు పంటలను వేయాలని సూచించింది. జూలై, ఆగస్టు నెలలో వేసే పంటల వివరాలను వెల్లడించింది. 8 మండలాల్లో అత్యధిక లోటు వర్షపాతంజిల్లాలో 274.5 మి.మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, ఇప్పటి వరకు 144.0 వర్షపాతం నమోదైంది. 48 శాతం లోటువర్షపాతం నమోదైంది. ప్రస్తుతం ఒక్క మండలంలోనే అధిక వర్షపాతం నమోదు కా గా, మరొక్క మండలంలో సాధారణ వర్షపాతం, 23 మండలాల్లో లోటు వర్షపాతం, 8 మండలాల్లో అత్యధిక లోటు వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదవుతుంది. జూలై, ఆగస్టు నెలల్లో బలహీనం నుంచి మధ్యస్థ ఎల్నినో, సెప్టెంబర్లో బలమైన ఎల్నినోగా మారే అవకాశం ఉంది. నేల రకం జూలై 31 వరకు ఆగస్టు 15 వరకు వేసే పంటలు వేసే పంటలు తేలికపాటి నేలలు పత్తి, కందులు కందులు సజ్జలు+కందులు(2:1) కొర్రలు+ కందులు (4:1) మధ్యస్థ నుంచి పత్తి, కందులు కందులు భారీ నేలలు సజ్జలు+కందులు (4:1) కందులు+కొర్రలు(4:1) జిల్లాలో వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలమట్టం తగ్గే పడిపోనున్నది. 2025 జూన్లో నీటిమట్టం సగటు లోతు 11.49(ఎంబీజీల్) భూమి మట్టానికి దిగువన ఉంది. 2026 జూన్లో 12.61, లోటు వర్షపాతంతో జూలైలో 13.52, ఆగస్టులో 14.6 వరకు నీటిమట్టం పడిపోనుంది. ఈ ఏడాది జూన్లో –0.75 , జూలైలో –1.66, ఆగస్టులో –2.74 శాతం నీటి మట్టం పడిపోతుందని నివేదికలో పేర్కొన్నారు. -
ప్రారంభమైన ఇంటిగ్రేటెడ్ పీజీ పరీక్షలు
తెయూ(డిచ్పల్లి):తెలంగాణ యూనివర్సిటీలోని ఐ దు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ (ఏపీఈ, ఐపీ సీహెచ్, ఐఎంబీఏ) 4, 5వ సెమిస్టర్లు, ఏపీఈ, ఐపీసీహెచ్ 7, 9వ సె మిస్టర్ల బ్యాక్లాగ్ థియరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమైనట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు ఐదుగురు విద్యార్థులకు గాను నలుగురు హాజరుకాగా ఒకరు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. మధ్యా హ్నం జరిగిన పరీక్షలకు 12 మంది విద్యార్థులకు 10 మంది హాజరుకాగా ఇద్దరు గైర్హాజరైనట్లు తెలిపారు. 25 నుంచి బీపెడ్ ప్రాక్టికల్స్.. తెలంగాణ వర్సిటీ పరిధిలోని బీపెడ్ 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్, 1, 3వ సెమిస్టర్ బ్యాక్లాగ్ ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 25, 26వ తేదీల్లో నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ప్రొఫెసర్ కే.సంపత్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 25 నుంచి బీఈడీ సెమిస్టర్ పరీక్షలు.. తెలంగాణ వర్సిటీ పరిధిలోని బీఈడీ 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్, 1, 2, 3, 4వ సెమిస్టర్ బ్యాక్లాగ్ ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 25 నుంచి ఆగస్ట్ 14 వరకు నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ప్రొఫెసర్ కే.సంపత్కుమార్ తెలిపారు. ఆగస్టు 3 నుంచి బీటెక్ సెమిస్టర్ పరీక్షలు.. తెయూ ఇంజినీరింగ్ కళాశాలలోని బీటెక్ (సీఎస్ఈ, ఏఐ) 2వ సెమిస్టర్ రెగ్యులర్, 1వ సెమిస్టర్ బ్యాక్లాగ్ థియరీ పరీక్షలు ఆగస్టు 3 నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్ ప్రొఫెసర్ కే.సంపత్కుమార్ తెలిపారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్సైట్ www. telanganauniversity. ac. in ను సందర్శించాలని ఆయన సూచించారు. కొనసాగుతున్న ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పరీక్షలు తెయూ పరిధిలో కొనసాగుతున్న ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం రెగ్యులర్, బ్యాక్లాగ్ సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు 39 మంది విద్యార్థులకు గానూ 35 మంది హాజరుకాగా నలుగురు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు ఏడుగురు విద్యార్థులకు గానూ ఆరుగురు హాజరు కాగా ఒకరు గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. డిగ్రీ వన్టైం చాన్స్ పరీక్షలకు 28 మంది గైర్హాజరు తెయూ పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ 1, 2, 3, 4, 5, 6వ సెమిస్టర్ల బ్యాక్లాగ్ వన్టైం చాన్స్ పరీక్షల్లో సోమవారం 28 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అకడమిక్ ఆడిట్సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు 94 మంది విద్యార్థులకు గానూ 73 మంది హాజరుకాగా 21 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 90 మంది విద్యార్థులకు గానూ 83 మంది హాజరుకాగా ఏడుగురు గైర్హాజరైనట్లు తెలిపారు. బీఈడీ, బీపెడ్ సెమిస్టర్ పరీక్షలు తెయూ పరిధిలో కొనసాగుతున్న బీఈడీ 2వ సెమిస్టర్ రెగ్యులర్, బీపెడ్ 1, 2, 3, 4వ సెమిసర్ల బ్యాక్లాగ్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు 50 మంది విద్యార్థులకు గానూ 41 మంది హాజరుకాగా తొమ్మిది మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 1,499 మంది విద్యార్థులకు గానూ 1,433 మంది హాజరుకాగా 66 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. -
అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ హౌస్ అరెస్ట్
● అంకాపూర్ వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులుసుభాష్నగర్ : అంకాపూర్లో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డికి మద్దతు తెలిపేందుకు బయల్దేరిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణను పోలీసులు సోమవారం హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో ఎమ్మెల్యే స్వల్ప వాగ్వాదానికి దిగారు. శాంతియుతంగా మద్దతు తెలిపేందుకు వెళ్తే ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులపై మండిపడ్డారు. అనంతరం ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం అనవసర వ్యాఖ్యలతో ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రెండున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అందించిన నిధులు, అభివృద్ధి కార్యక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేసిన అభివృద్ధిని వివరించే ధైర్యం కాంగ్రెస్ నాయకత్వానికి ఉందా అని ప్రశ్నించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. 5వ డివిజన్ కార్పొరేటర్ ముందస్తు అరెస్టు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డికి మద్దతుగా అంకాపూర్ వెళ్లకుండా 5వ డివిజన్ కార్పొరేటర్ యాదల నరేశ్ను 4వ టౌన్ పోలీసులు సోమవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. -
భోజనం చేస్తుండగా గుండెపోటు..
పెద్దకొడప్గల్(జుక్కల్): భోజనం చేస్తుండగా గుండెపోటుతో ఒకరు మృతి చెందిన ఘటన పెద్దకొడప్గల్ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జుక్కల్ మండలం నాగల్గావ్ గ్రామానికి చెందిన కాంబ్లే భీంరావ్ (35) హైదరాబాద్లో తాపీ మేస్త్రి పని చేస్తూ జీవించేవాడు. వారానికోసారి ఇంటికి వచ్చేవాడు. ఆదివారం తన బావ సాయిలుతో కలిసి ఇంటికి వస్తుండగా ఆకలి వేయడంతో పెద్దకొడప్గల్ మండల కేంద్రంలోని దాబా వద్ద ఆగారు. దాబాలో భోజనం చేస్తుండగా భీంరావ్ కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వారు బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. అదే సమయంలో 108 అంబులెన్స్ ఆస్పత్రికి చేరుకొని భీంరావ్కు సీపీఆర్ చేసినా ఫలితం దక్కలేదు. బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య కాంబ్లే జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్లు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తెలిపారు. మృతుడికి కూతురు, కుమారుడు ఉన్నారు. ● పెద్దకొడప్గల్లో నాగల్గావ్ వాసి మృతి -
బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా వంశీగౌడ్
జక్రాన్పల్లి: భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా మండలంలోని తొర్లికొండ గ్రామానికి చెందిన వంశీగౌడ్ నియమితులయ్యారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్కుమార్ సోమవారం నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వంశీగౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బీజేవైఎం జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యేలు రాకేశ్రెడ్డి , ధన్పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి , జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ ప్రజావాణికి 25 ఫిర్యాదులు నిజామాబాద్ అర్బన్: నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం ని ర్వహించిన పోలీస్ ప్రజావాణికి 28 ఫిర్యాదులు వచ్చారు. అదనపు డీసీపీ శుభం ప్రకాశ్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులను చట్ట ప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. నిజామాబాద్ అర్బన్ : సీసీఎస్ పోలీస్స్టేషన్ నుంచి నిందితుడు పరారైన ఘటన కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తా వద్ద గత శనివారం ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీలు చేపడుతున్నారు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తు లు నంబర్ ప్లేట్లేని బైక్పై వస్తూ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. అందు లో ఒకరిని పట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు.. నిందితుడి నుంచి బంగారు గొలుసులు, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకొని, విచారణ కోసం సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. సీసీఎస్ పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు సోమవారం తప్పించుకున్నాడు. నిందితుడు ఎలా తప్పించుకున్నాడనే దానిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందం గాలింపు చేపట్టింది. కాగా,ఈ ఘటనపై సీపీ సాయిచైతన్య ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. నిజామాబాద్ రూరల్: నగరంలోని శ్రద్ధానంద్ గంజ్లో ఉన్న ఉమామహేశ్వరాలయంలో పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని పరమేశ్వరుడిని ప్రార్థించినట్లు మహేశ్గౌడ్ తెలిపారు. ఆయనవెంట మేయర్ ఉమారాణి, జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు. నిజామాబాద్ అర్బన్: సబ్ రిజిస్ట్రార్ను బెదిరించిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఐదో టౌన్ ఎస్సై సునీల్ తెలిపారు. నగరంలోని కవితా కాంప్లెక్స్లో ఉండే రిజిస్ట్రార్ కార్యాలయంలో ఓ సబ్ రిజిస్ట్రార్ భూమిని రి జిస్ట్రేషన్ చేశారు. అయితే, ఆ భూమి అసైన్డ్ల్యాండ్ అని, ఈ విషయంలో తమకు డబ్బులు ఇవ్వాలని ఆకాశ్, గణేశ్ అనే వ్యక్తులు సబ్ రిజిస్ట్రార్ను బెదిరించారు. సబ్ రిజిస్ట్రార్ ఫిర్యాదు తో కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ఆర్మూర్టౌన్: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన ఆర్మూర్ పట్టణం సిద్దులగుట్ట వెనకాల ఆదివారం చోటు చేసుకున్నది. ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ప ట్టణానికి చెందిన చౌల్ దినేశ్చంద్ర(54) స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో స్టాఫ్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆదివారం రాత్రి దినేశ్ సిద్దులగుట్ట వెనుక నుంచి ఇంటికి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో అంబులెన్స్లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దినేశ్ మృతి చెందాడన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.మాక్లూర్: వాహనంతో ఢీ కొట్టి ఒకరి మృతికి కారణమైన ఒకరికి సంవత్సరంపాటు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చినట్లు ఎస్సై అనిల్ రెడ్డి సోమవారం తెలిపారు. 2017లో నిజామాబాద్కు చెందిన షేక్ ఖాసిం అతడి స్నేహితుడు షేక్ అఫ్జల్, షేక్ సర్వర్లతో కలిసి బైక్పై వస్తుండగా అడవి మామిడిపల్లి శివారులో టైర్ పంక్చర్ అయ్యింది. దీంతో వారు బైక్ను నెట్టుకుంటూ నిజామాబాద్ వైపు వస్తుండగా దాస్నగర్లోని ఓ ప్రయివేటు పాఠశాల ఎదుట వెనుక నుంచి వచ్చిన టాటాక్వాలిస్ వాహనం ఢీకొట్టింది. దీంతో షేక్ అఫ్జల్ తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందగా షేక్ ఖాసీం, షేక్ సర్వర్లకు గాయాలయ్యాయి. పోలీసులు డ్రైవర్ మోబీన్ పటాన్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసు విచారణ అనంతరం సాక్ష్యాధారాలు పరిశీలించిన జడ్జి.. అజాగ్రత్త డ్రైవింగ్తో ఒకరి మృతికి కారణమైన నిందితుడికి ఏడాది జైలు శిక్ష, రూ. రెండు వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. -
రాకేశ్రెడ్డి ఇంటి ముట్టడికి కాంగ్రెస్ యత్నం
ఆర్మూర్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ఇటీవల జిల్లా కేంద్రంలో బీజేపీ నిర్వహించిన రణభేరిలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి చేసిన వ్యా ఖ్యలు జిల్లా రాజకీయాల్లో దుమారం రేపాయి. ఎ మ్మెల్యే వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడిన కాంగ్రెస్ నేతలు.. ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. వారి హెచ్చరికకు స్పందించిన ఎమ్మెల్యే తా ను యుద్ధానికి సిద్ధమని, అంకాపూర్ వేదికగా తన కు సమఉజ్జీ అయిన కాంగ్రెస్ నాయకుడు చర్చకు రావాలని సవాల్ విసిరారు. దీంతో ఆర్మూర్ మండలం అంకాపూర్లో సోమవారం ఉద్రిక్త పరిస్థి తులు నెలకొన్నాయి. ఇరు పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉండడంతో సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు పోలీసులు ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో బీఎన్ఎస్ 163 సెక్షన్ను అమలు చేశారు. ఆర్మూర్ పట్టణంతో పాటు ఆర్మూర్, నందిపేట, మాక్లూర్, ఆలూర్, డొంకేశ్వర్ మండలాల్లో కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుందని ఊహించిన పోలీసులు.. ఎమ్మెల్యే పైడి రాకేష్రెడ్డిని అంకాపూర్లోని తన నివాసంలో, కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్రెడ్డిని ఆర్మూర్లో గృహనిర్బంధం చేశారు. రాకేశ్రెడ్డి బయటికి వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. మరో వైపు వివిధ మార్గాల ద్వారా పలువురు కాంగ్రెస్ నాయకులు అంకాపూర్లోని ఎమ్మెల్యే ఇంటి సమీపానికి చేరుకోగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తన ఇంట్లోనే నిరసన తెలిపిన వినయ్రెడ్డి.. ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ముందస్తు వ్యూహంతో పరిస్థితి అదుపులో ఉంది. ఆర్మూర్ నియోజకవర్గంలో ఉద్రిక్తత ఆయా చోట్ల నాయకుల ముందస్తు అరెస్టు అంకాపూర్లో ఎమ్మెల్యే పైడి.. పెర్కిట్లో కాంగ్రెస్ ఇన్చార్జి వినయ్రెడ్డి గృహనిర్బంధం బీఎన్ఎస్ 163 అమలు చేసిన పోలీసులు -
అప్రమత్తతే కీలకం..
ఎల్నినో ప్రభావం నేపథ్యంలో పంటల మార్పు అవసరం● మహేశ్కుమార్గౌడ్, ఎమ్మెల్సీసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎల్నినో ప్రభావం నేపథ్యంలో పంటల సాగులో మార్పులు అనివార్యమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పి సుదర్శన్రెడ్డి అన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల్లో రైతులు వేసే పంటల విషయంలో ఆలోచన చేయాల్సి ఉందన్నారు. ఎల్నినో ప్రభావం, నష్ట నివారణ చర్యలపై సోమవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా ప్రత్యేకాధికారిణి, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్, నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు ఇలా త్రిపాఠి, ఆశిష్ సంగ్వాన్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, భూపతిరెడ్డి, రాకేశ్రెడ్డి, లక్ష్మీకాంతరావుతో కలసి ఉ మ్మడి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, ఉద్యానవన, విద్యుత్, డీఆర్డీఏ, మున్సిపల్, ఇంజినీరింగ్ తదితర శాఖల అధికారులతో సమగ్రంగా చర్చించడంతోపాటు పలువురు రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన సలహాదారు సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని శ్రీ రాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులతో పాటు అలీసాగర్, మాసాని ట్యాంక్, మంచిప్ప రిజర్వాయర్ల నీటినిల్వను తాగునీటి అవసరాలకే వినియోగించాలని చెప్పారు. ప్రాజెక్టులు ఈ సీజన్లో నిండే అవకాశం లేదని, రైతులు ప్రత్యామ్నయ పంటల సాగు ద్వారా నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తక్కువ నీటి అవసరాలు ఉన్న పంటలపై దృష్టిపెట్టాలని, అధికారులు సైతం ఆ యా పంటల సాగు కోసం ప్రోత్సాహం అందించాలన్నారు. ఆయిల్పామ్, జొన్నలు, రాగులు, కంది, కొర్రలు తదితర ప్రత్యామ్నయ పంటల సాగు తో ఎల్నినో లాంటి విపత్కర పరిస్థితులను సైతం రైతులు అధిగమించే అవకాశం ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ రూపకల్పన నాటి నుంచే లోపాలు ఉన్నాయని, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సైతం ప్రాజెక్ట్లో నీటిని నిల్వచేస్తే సమస్యలు వస్తాయని చెప్పిందన్నారు. ఆ ప్రాజెక్ట్ నుంచి నీటిని వినియోగించుకునే వీలులేకుండా పోయిందన్నారు. మొత్తానికి పనికిరాని ప్రాజెక్టుగా కాళేశ్వరం మిగిలిందని వ్యాఖ్యానించారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ఇండియన్ ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ చైర్పర్సన్ కవితా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ నాటికి మరింత నీటి ఎద్దడి ఈ ఏడాది జూన్ ప్రారంభం నుంచే అతి తక్కువ వర్షపా తం నమోదైందని జిల్లా ప్ర త్యేక అధికారిణి డాక్టర్ యో గితా రాణా అన్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు సాధారణం కన్నా 48 శాతం తక్కువ వర్షం కురిసిందన్నారు. సెప్టెంబర్ నాటికి నీటి ఎద్దడి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసిందని తెలిపారు. ఇలాంటి ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలని సూచించారు. రైతులు పంటల మార్పిడికి సిద్ధంగా ఉండా లన్నారు. ఇప్పటికే జిల్లాలో 72 శాతం పంటల సా గు పూర్తికాగా, మిగితా పంటల సాగుకోసం స్వల్పకాలిక రకాలను ఎంపికచేసుకోవాలని కోరా రు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. తా గునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక యాక్షన్ప్లాన్ను పకడ్బందీగా అమలు చేయనున్నట్టు చెప్పారు. సమీక్షా సమావేశంలో పాల్గొన్న కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు మునిపల్లి సాయిరెడ్డి, అన్వేష్రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి, ఉమ్మడి జిల్లా అధికారులు ప్రాజెక్టులు, రిజర్వాయర్లలోని నీరు ప్రస్తుతానికి తాగు అవసరాలకే.. ప్రాజెక్టులు నిండే అవకాశాలు లేవు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టిపెట్టాలి ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు సుదర్శన్రెడ్డి హాజరైన ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ప్రత్యామ్నాయం తప్పదు ఎల్నినో ప్రభావం తీవ్రమవుతున్న నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలి. జిల్లాలో చెరుకు సా గును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటాం. షుగర్ ఫ్యాక్టరీ సహకార సంఘం పునరుజ్జీవనానికి కృషిచేస్తాం. ఆయిల్పామ్, కూరగాయలు, కందులు, పెసర్లు, జొన్నలు వంటి ప్రత్యామ్నాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత ప్రభు త్వం తీసుకుంటుంది. ఛత్తీస్గఢ్ తరహాలో ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం అందించే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. ఎల్నినో అనేది ఒక మార్పు.. ఈ మార్పుకు అనుగుణంగా రైతులు పంటల్లో మార్పులు చేసుకోవాలి. ‘‘ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులను ఇప్పటికే అప్రమత్తం చేశాం. క్షేత్రస్థాయిలో రైతులకు ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నాం. తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం.’’ – నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి ‘‘ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆయిల్పామ్ వంటి పంటల సాగుపై దృష్టి పెట్టాలి. నాలుగేళ్ల తర్వాత ఈ పంటల రైతుల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కూరగాయలు, పప్పు దినుసులు, మిల్లెట్స్ సాగుకు రైతులు మొగ్గుచూపాలి.’’ – కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
ప్రైమరీ విద్యకు దృఢమైన పునాది ‘ఇగ్నైట్’
● మైనార్టీ రెసిడెన్షియల్స్లో అమలు ● విద్యార్థి సమగ్ర వికాసమే లక్ష్యం ● అభ్యసన లోపాలకు చెక్ డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): పుస్తకంలోని పాఠాలను కంఠస్థం చేయడమే విద్య కాదని, జీవితాన్ని అర్థం చేసుకునే ఆలోచనా శక్తే నిజమైన అభ్యసనమనే భావనతో తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్) ‘ఇగ్నైట్’ కార్యక్రమానికి శ్రీకారం చు ట్టింది. ప్రకృతిని పాఠ్యాంశంగా, అనుభవాన్ని గు రువుగా, పరిశీలనను సాధనంగా మార్చే వినూత్న విద్యా విధానంగా దీనిని విద్యావేత్తలు అభివర్ణిస్తు న్నారు. ఐదో తరగతి విద్యార్థుల్లో ప్రాథమిక అభ్య సన సామర్థ్యాలను బలోపేతం చేసి, భవిష్యత్ విద్యాభ్యాసానికి దృఢమైన పునాది వేయడమే కా ర్యక్రమ ప్రధాన ఉద్దేశం. హావభావాలు, చేతి సంకేతాలు, ఆటలు, ప్రయోగాలు, చర్చలు, నిజజీవిత ఉదాహరణలతో బోధనను సజీవంగా మార్చాలని మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. ప్రతి చిన్నారిని సమర్థుడిగా తీర్చిదిద్దే దిశగా ‘ఇగ్నైట్’ ఆశాజ్యోతిగా మారనుంది. ప్రకృతిని ఆధారం చేసుకుని.. ప్రకృతిని ఆధారంగా చేసుకుని పరిశీలన, అన్వేషణ, శిక్షణ, విద్య ద్వారా విద్యార్థుల సమగ్ర వికా సాన్ని సాధించడమే ‘ఇగ్నైట్’ ప్రత్యేకత. ముందుగా భావనను అర్థమయ్యేలా చేసి, తరువాత భాషను పరిచయం చేయడం, పరిశీలన నుంచి నిర్ధారణకు తీసుకెళ్లడం, ముందుగా అనుభవాన్ని అందించి ఆ తరువాత రచన చేయించడం వంటి మూడు బోధ నా సూత్రాలను ఈ కార్యక్రమంలో అమలు చేయ నున్నారు. గత విద్యా సంవత్సరంలో ఆరు, ఏడో తరగతుల కోసం నిర్వహించిన కాన్సెప్ట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ (సీఈపీ) విశేష ఫలితాలు ఇవ్వ డంతో అదే అనుభవాన్ని ఐదో తరగతి విద్యార్థులకు విస్తరించారు. పుస్తక జ్ఞానాన్ని అనుభవ జ్ఞా నంతో మేళవించి పిల్లలలో స్వతంత్ర ఆలోచనలను పెంపొందించడమే దీని అసలు ఉద్దేశ్యం. ఇగ్నైట్ విధానంలో విద్యార్థుల సాధనవిద్యార్థులకు టీచింగ్ లర్నింగ్ మెథడ్లో బోధిస్తున్న ఉపాధ్యాయుడు రవికుమార్ప్రతి చిన్నారికి ప్రత్యేక అభ్యసన మార్గం ప్రతి విద్యార్థి ఒకే స్థాయిలో ఉండడని గుర్తించిన టీఎంఆర్ఐఎస్ వారిని బిలో బేసిక్, ఫౌండేషన్, డెవలపింగ్, అడ్వాన్స్డ్ అనే నాలుగు వర్గాలుగా విభజించి బోధన చేపట్టనుంది. అభ్యసన లోపాలను గుర్తించి వాటిని అధిగమించే దిశగా ‘ఇగ్నైట్’ ఒక సమగ్ర విద్యావేదిక. చదవడం, రాయడం, భావాన్ని వ్యక్తీకరించడం, నేర్చుకున్న అంశాలను అన్వయించడంలో ఉన్న సామర్థ్యాన్ని బట్టి ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. వారాంతపు రిమీడియల్ తరగతులు, మౌఖిక పునరుద్ఘాటన, చిత్రాల ఆధారిత బోధన, సహ విద్యార్థుల సహకారంతో అభ్యసనం, ముఖ్య నిర్వచనాల పునరావృతం వంటి ప్రత్యేక వ్యూహాలతో వెనుక బడిన విద్యార్థులను ప్రధాన స్రవంతిలోకి తీసుకు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వినూత్నం, స్ఫూర్తిదాయకం ప్రభుత్వ గురుకుల విద్యా వ్యవస్థలో ఇది ఒక వినూత్నమైన, స్ఫూర్తిదాయకమైన విద్యా కార్యక్రమంగా నిలుస్తుంది. ప్రతి సబ్జెక్టు ఉపాధ్యాయులకు ఈనెల 13 నుంచి 18 వరకు హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్ల ద్వారా ప్రత్యేక శిక్షణ నిర్వహించడంతో పాటు ఇప్పటికే జూమ్ వేదికగా కూడా శిక్షణ అందించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థి అభ్యసనంలో కొత్త వెలుగులు నింపి, మైనార్టీ గురుకుల విద్యను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందనే నమ్మకం ఉంది. – రవికుమార్, తెలుగు ఉపాధ్యాయులు -
‘గర్భిణీకి ఎక్స్పైరీ టాబ్లెట్స్’పై అధికారులు సీరియస్
● స్టాఫ్ నర్సుకు మెమోరుద్రూర్: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణికి ఎక్స్పైరీ టాబ్లెట్లు ఇచ్చిన ఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. ఈనెల 17న సాక్షిలో ‘గర్భిణికి ఎక్స్పైరీ టాబ్లెట్స్’ శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన సంబంధిత అధికారులు స్టాఫ్ నర్సుకు మెమో జారీ చేశారు. బాధితురాలికి బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రిలో స్కానింగ్ నిర్వహించడంతోపాటు టీ–హబ్ ద్వారా రక్త పరీక్షలు చేయించారు. స్కానింగ్, రక్త పరీక్షల నివేదికలు సాధారణంగా రావడంతో వైద్య సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్లో పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని, ఈ మేరకు జిల్లా కలెక్టర్కు లిఖితపూర్వకంగా నివేదిక సమర్పించినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. -
ప్రత్యామ్నాయమే మిగిలింది..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎల్నినో ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో కరువు కోరలు చాచే పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ముందుజాగ్రత్త చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎల్నినో ప్రభావం, చేపట్టాల్సిన చర్యలపై జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సాగునీరు, తాగునీరు, విద్యుత్ అవసరాలను తీర్చేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించనున్నారు. ఈ మేరకు చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై అధికారులతో చర్చించి ప్రత్యేక కార్యాచరణను అమలు చేయనున్నారు. అట్టడుగుకి జలాశయాల నీటిమట్టం ఉమ్మడి జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు శ్రీరామ్సాగర్, నిజాంసాగర్తోపాటు ఇతర ఎత్తిపోతల పథకాలు, జలాశయాలు నీరు లేక వెలవెలబోతున్నాయి. ప్రాజెక్టుల్లో ప్రస్తుతం ఉన్న నీటితో సాగునీరందించడం పక్కన పెడితే తాగునీటి అవసరాలూ తీర్చడం సైతం కష్టంగా మారింది. శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 15.149 టీఎంసీల నీరుంది. గతేడాది ఇదే సమయానికి 20.902 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 6.516 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎలాంటి చర్యలు తీసుకుంటారో.. ఇప్పటికే ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాలు, చెరువుల్లో నీరు లేక పరిస్థితి దయనీయంగా మారింది. ప్రాజెక్టుల ఆయకట్టు కింద పంటలు సాగుచేసిన రైతులు వాటిని కాపాడుకునేందుకు అపసోపాలు పడుతున్నారు. అయితే పంటల రక్షణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న దానిపై ఆశలు నెలకొన్నాయి. ఇప్పటికే విత్తనాలు, సాగుకోసం రూ. వేలల్లో ఖర్చుచేసిన రైతులు పంటల ఎదుగుదల, దిగుబడిపై ఆందోళన చెందుతున్నారు. ఈసారి పెట్టుబడులు సైతం కోల్పోయి తీవ్రంగా నష్టపోతామన్న గుబులు రైతుల్లో నెలకొంది. ఆరుతడి పంటలకై నా అందిస్తారా?గతేడాదితో పోలిస్తే ఈసారి పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కరువు ఛాయలు అలుముకున్న నేపథ్యంలో వరికి సాగునీరందించే పరిస్థితి కనిపించడం లేదు. సాగునీటి ప్రాజెక్టుల ఆయకట్టు పరిధితోపాటు బోర్లపై ఆధారపడి వేసిన పంటలు సైతం ఎండిపోతున్నాయి. భూగర్భజలాలు రోజురోజుకీ మరింత అట్టడుగు స్థాయిలోకి పడిపోతుండటంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆరుతడి పంటలకై నా నీరందించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్న డిమాండ్ నెలకొంది. పంటలకు నీరందించేందుకు కీలకమైన విద్యుత్ సరఫరాలో కోతలను నివారించాలని రైతులు కోరుతున్నారు. సిరికొండ మండలం ముషీర్నగర్ గ్రామానికి చెందిన రైతు బట్టు లింబాకు చెందిన పొలం పరిస్థితి ఇది. ఆయనకు ఉన్న మూడున్నర ఎకరాల్లో వరి సాగుచేస్తున్నాడు. పంట సాగు కోసం లింబ బోరు నీటిపై ఆధారపడగా.. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా 15 రోజుల కిందటే బోరు వట్టిపోయింది. చేసేదేమీ లేకపోవడంతో ఇప్పటికే పొలం సగానికి పైగా ఎండిపోయింది. ఇప్పుడు వర్షాలు కురిసినా పొలం చేతికొస్తుందా.. లేదా.. అనే ఆందోళనలో లింబా ఉన్నాడు. జిల్లాలో ఇప్పటివరకు సాగైన పంటలు 20 రోజుల నుంచి వర్షమే లేదు ఈసారి వరి, మొక్కజొన్న పంటలు సాగుచేశాను. గుత్ప ఎత్తిపోతల పథకం కింద నీళ్లు వస్తాయన్న ఆశతో పంటలు వేసిన. ఈసారి మొదటినుంచి వర్షాలు లేక ప్రాజెక్టులు, చెరువులు ఎండిపోయి కనిపిస్తున్నాయి. మొక్కజొన్న పంట వేసిననాటి నుంచి ఇప్పటివరకు గత 20 రోజులుగా వర్షమే పడలేదు. ఇంకా రెండు, మూడు రోజుల్లోనైనా వర్షం పడకుంటే పంటపై ఆశ వదులుకోవాల్సిందే. – మొగులాజీ, బజార్కొత్తూరు, నందిపేట మండలం ప్రభుత్వం ఆదుకుంటేనే బతుకు ఈ సీజన్లో ఇప్పటివరకు వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటివరకు గుత్ప ఎత్తిపోతల పథకం కింద వచ్చే నీటితో పంటలు పండించుకున్నాం. ఈసారి నీరు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే పంటలసాగుకు సమయం మించిపోయింది. ప్రభు త్వం ప్రత్యామ్నాయ చర్యలతోపాటు పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. – శిలారి సుధాకర్, వల్లభాపూర్, మాక్లూర్ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు వట్టిపోతున్న బోర్లు.. ఎండుతున్న పంటలు భవిష్యత్లో తాగునీటి అవసరాలకూ తిప్పలే ! ఎల్నినో ప్రభావం కారణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆశలు ఉమ్మడి జిల్లాలో పరిస్థితులపై నేడు సమీక్షించనున్న ఇన్చార్జి మంత్రి సీతక్క -
వాన లేదు.. వరద రాలేదు
తాగునీటి అవసరాలకే..! ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 15 టీఎంసీల నీరు మా త్రమే నిల్వ ఉంది. ఇందులో 5 టీఎంసీలు డెడ్ స్టోరేజీ, 5 టీఎంసీలు తాగునీటి అవసరాలకు, మరో 5 టీఎంసీల నీరు ఆవిరిరూపంలో పో తుంది. అంటే ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ తాగునీటి అసరరాలకు మాత్రమే సరిపోతుంది. వేల్పూర్(బాల్కొండ): మన దగ్గర వర్షాలు కురవడం లేదు.. ఎగువ ప్రాంతం నుంచి వరద రావడం లేదు. ఫలితంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వెలవెలబోతోంది. గతేడాది జూలై రెండో వారం నాటికి ప్రాజెక్టులోకి భారీగా వరద చేరగా.. ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది. పంటల సాగుపై ఆయకట్టు రైతులు ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఎస్సారెస్పీ నీటిపై ఆధారపడి సుమారు 18 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. కాకతీయ, లక్ష్మి, సరస్వతి కాలువల ద్వారా నీటి విడుదల చేపడుతారు. అయితే ఈ ఏడాది ఆశించిన మేర నీరు లేకపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్లో ఆయకట్టుకు నీరందించాలంటే ప్రాజెక్ట్లో కనీసం 56 టీఎంసీల నీరు నిల్వ ఉండాలి. ప్రస్తుతం 15 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. బోసిపోయిన వరదకాలువ ఎస్సారెస్పీ వరదకాలువ సైతం బోసిపోయింది. శ్రీరాంసాగర్ మొదలుకొని బాల్కొండ, వేల్పూర్, మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల మీదుగా జగిత్యాల జిల్లాలోకి ఈ కాలువ ప్రవేశిస్తుంది. వరదకాలువలో గతంలో ఏడాదిపొడుగునా నీరు నిల్వ ఉండేది. దీంతో వరద కాలువకు ఇరువైపులా ఉన్న గ్రామాల పరిధిలో భూగర్భ జల మట్టం పెరిగి బోరుబావుల్లో పుష్కలంగా నీరుండేది. అలాగే చాలా గ్రామాల చెరువులు వరద కాలువ ద్వారా నింపేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరదకాలువకు తూములు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎస్సారెస్పీ నిండి వరదకాలువకు నీటిని వదిలితే తప్ప వరదకాలువ ద్వారా పరోక్షంగా బోరుబావులకు, ప్రత్యక్షంగా చెరువులకు నీరందే అవకాశం లేదు. అడుగంటుతున్న బోరుబావులు వివిధ మండలాల్లో బోరుబావుల కింద రైతులు వరి, మొక్కజొన్న, పసుపు, సోయాబీన్ సాగుచేస్తున్నారు. వర్షాలు లేకపోవడంతో బోరుబావుల ద్వారా పంటలకు వంతుల వారీగా నీటి తడి అందిస్తున్నారు. బోరుబావుల్లో భూగర్భజలాలు రోజు రోజుకూ తగ్గుతుండడంతో పంటల పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు. వెలవెలబోతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ మన దగ్గర వర్షాభావ పరిస్థితులు జూలై మూడో వారానికొచ్చినా ఎగువ నుంచి మొదలుకాని వరద ఆందోళన చెందుతున్న ఆయకట్టు రైతులు -
మరోసారి మౌంట్ ఎల్బ్రస్ను అధిరోహించిన పూర్ణ
సిరికొండ(నిజామాబాద్రూరల్): యూరప్లోని అ త్యున్నత శిఖరమైన మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని జిల్లాకు చెందిన మాలావత్ పూర్ణ మరోసారి అధిరోహించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని చిన్న వయస్సులో అధిరోహించిన సిరికొండ మండలం పాకాలకు చెందిన పూర్ణ.. ప్రము ఖ పర్వతారోహణ సంస్థ ట్రాన్స్సెంట్ అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో మౌంట్ ఎల్బ్రస్ను అధిరోహించిన బృందానికి ఎక్స్పెడిషన్ లీడర్గా వ్యవహరించారు. పూర్ణ నాయకత్వంలో భారతీయ బృందం ఈనెల 18వ తేదీన ఉదయం 9 గంటలకు (రష్యా కాలమానం) మౌంట్ ఎల్బ్రస్ను అధిరోహించింది. రష్యా లోని కాకసస్ పర్వత శ్రేణిలో ఉన్న మౌంట్ ఎల్బ్రస్ యూరప్లోని అత్యున్నత శిఖరం మాత్రమే కాకుండా ప్రపంచ ప్రఖ్యాత సెవెన్ సమిట్స్లో ఒకటి. తీవ్రమైన చలి, బలమైన గాలులు ఉంటాయి. -
చినుకు లేక చిన్నబోతున్న గుంతలు
డొంకేశ్వర్(ఆర్మూర్): వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు తవ్విన గుంతలు చినుకు లేక చిన్నబోతున్నాయి. మొక్కలు నాటాల్సిన లక్ష్యం పెద్దదే అయినప్పటికీ జిల్లాలో ఇప్పటి వరకు తవ్విన గుంతల్లో నుంచి సగం గుంతల్లో కూడా మొక్కలు నాటలేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా తీవ్ర వర్షభావ పరిస్థితుల కారణంగా మొక్కలు నాటే కార్యక్రమానికి బ్రేక్ పడింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 26.11లక్షల మొక్కలు నాటాలని భారీ లక్ష్యాన్ని నిర్థేశించుకోగా.. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల ఇప్పటి వరకు కేవలం 6.50లక్షల మొక్కలను మాత్రమే నాటారు. కూలీలతో మాత్రం పెద్ద సంఖ్యలో 11 లక్షల గుంతలను తవ్వించి సిద్ధంగా ఉంచారు. అవి ఇప్పుడు పూడుకుపోతున్నాయి. వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మిగిలిన 19.61లక్షల మొక్కలు నాటే లక్ష్యం పూర్తి కావడం కష్టంగా మారనుంది. నర్సరీల్లోనే పెరుగుతున్న మొక్కలు వనమహోత్సవం కోసం జిల్లా వ్యాప్తంగా 530 గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో 42 లక్షల మొక్కలను అధికారులు పెంచారు. వర్షాలు లేని కారణంగా పెంచిన మొక్కలన్నీ నర్సరీల్లోనే ఉన్నాయి. అవి అక్కడే పెరిగి పెద్దవిగా మారుతున్నాయి. ప్రస్తుతం మొక్కలు నాటితే వాటి సంరక్షణ ఒక సమస్య, నాటకపోతే నర్సరీల్లోనే ఉండిపోతాయనే మరో సమస్య ఏర్పడింది. దీనిపై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయన్నను ‘సాక్షి’ సంప్రదించగా... తవ్వించిన గుంతలు సిద్ధంగా ఉన్నందునా వర్షాలు కురవగానే మొక్కలను వేగంగా నాటించి లక్ష్యాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. మారంపల్లిలో మొక్కలు నాటేందుకు తవ్విన గుంతలు లక్ష్యానికి దూరంగా వనమహోత్సవం గుంతలు తవ్వి వదిలేసిన ‘ఉపాధి’ కూలీలు లక్ష్యం 26.11 లక్షల మొక్కలు ఇప్పటి వరకు నాటింది 6.50 లక్షలు.. -
కేజీబీవీల్లో ఎక్సలెన్స్ కోచింగ్
ఆర్మూర్: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయల్లో విద్యార్థినులను ఆరో తరగతి నుంచే నీట్, జేఈఈ, ఎప్సెట్, క్లాట్ వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయనున్నారు. యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ (వైఐఐఏఈ)లుగా జిల్లాలో మొత్తం 27 కేజీబీలు ఉండగా, నిజామాబాద్ (మోపాల్), మాక్లూర్, డిచ్పల్లి కేజీబీవీలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే వైఐఐఏఈల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి 272 మంది ఐదో తరగతి పూర్తి చేసుకున్న బాలికలు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. ప్రతిభ ఆధారంగా విద్యార్థినులను ఎంపిక చేయనున్నారు. ప్రతి తరగతి గదిలో 20 మంది విద్యార్థినులు మాత్రమే ఉండేలా చిన్న బ్యాచ్లుగా విభజించారు. బోధన కోసం నిష్ణాతులైన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా నియమించనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుండే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చివరి దశకు చేరుకున్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారులు ఇచ్చిన సమాచా రం ప్రకారం నిజామాబాద్ (మోపాల్) కేజీబీవీలో సీఈసీ గ్రూప్ విద్యార్థినులకు క్లాట్ (సీఎల్ఏటీ), మాక్లూర్ కేజీబీవీలో బైపీసీ గ్రూప్ విద్యార్థినులకు నీట్ (ఎన్ఈఈటీ), డిచ్పల్లి కేజీబీవీలో ఎంపీసీ గ్రూప్ విద్యార్థినులకు జేఈఈ మెయిన్స్ (ఐఐటీ) ప్రవేశ పరీక్ష కోసం ఆరోగ తరగతి నుంచే సన్నద్ధం చేయనున్నారు. ఆరో తరగతి నుంచే నీట్, జేఈఈ, ఎప్సెట్, క్లాట్కు సన్నద్ధత జిల్లాలో మూడు కేజీబీవీల ఎంపిక.. ప్రవేశ పరీక్ష పూర్తి ప్రతిభ ఆధారంగా విద్యార్థినుల ఎంపిక -
● ప్రకృతి శోభ
శ్రీరాంసాగర్ సాగర్ (ఎస్సారెస్పీ) బ్యాక్ వాటర్ ప్రాంతం సరికొత్త ప్రకృతి శోభతో అలరారుతోంది. ప్రశాంతమైన జలాలు, చుట్టూ పరుచుకున్న పచ్చని గడ్డి మైదానాలు, సుదూర తీరాన వరుసగా ఉన్న తాటి చెట్లు.. వంటి దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో నీటిపై సూర్య కిరణాల ప్రతిబింబం ఈ ప్రాంత సౌందర్యాన్ని మరింత పెంచుతోంది. డొంకేశ్వర్ మండలం జీజీ నడ్కుడ బ్యాక్ వాటర్ వద్ద ఈ మనోహర దృశ్యాన్ని ‘సాక్షి’ తన కెమెరాలో క్లిక్మనిపించింది. – డొంకేశ్వర్(ఆర్మూర్) -
క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి నవీపేట: మండలంలోని యంచ గ్రామంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన కారడి జలాబాయి(68) అనే వృద్ధురాలు మృతి చెందినట్లు ఏఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో బాసర రహదారిని దాటుతుండగా బాసర వైపు వేగంగా వెళ్తున్న బైక్ ఢీకొన్నది. మట్టయ్య పారం గ్రామానికి చెందిన తౌడు గంగాధర్ అజాగ్రత్తగా వాహనాన్ని నడిపి ప్రమాదానికి కారకుడయ్యారని పేర్కొన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కుమారుడు ఒడ్డెన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ వివాహిత ..నాగిరెడ్డిపేట: కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ వివాహిత చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగిరెడ్డిపేట మండలం తాండూర్కు చెందిన మునిగెపల్లి జయవ్వ(50) అనే వివాహిత కుటుంబ కలహాలతో ఈ నెల 12న ఇంట్లో విషపదార్థం సేవించింది. గమనించిన కుటుంబీకులు చికిత్స కోసం ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించగా అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. తాళం వేసిన ఇంట్లో చోరీ మాచారెడ్డి: పాల్వంచ మండలం ఎల్పుగొండలో తాళం వేసిన ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. మాచారెడ్డి ఎస్సై విజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చెందిన ఎడ్ల శిరీష ఈనెల 17న ఆస్పత్రికి వెళ్లారు. మరునాడు రాత్రి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగుల గొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించింది. బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ. 30వేల నగదు చోరీకి గురైనట్లు బాధితురాలు తెలిపింది. ఘటనా స్థలాన్ని పరిశీలించి, క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
తెలంగాణ సంస్కృతికి ప్రతీక ‘బోనం’
● అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ రూరల్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ బోనాలు అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఆదివారం నగరంలోని కోటగల్లిలో ఉన్న కట్ట మైసమ్మ ఆలయం, నాందేవ్ వాడ గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగలలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆషాఢ మాసం తెలంగాణకు ప్రత్యేక మాసం అన్నారు. గ్రామ దేవతలను పూజిస్తూ.. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పశువులు ఆరోగ్యంగా ఉండాలని కొలిచే పండుగ అన్నారు. బోనాలు కేవలం పండుగ మాత్రమే కాదని, ఇది మన పూర్వీకుల సంప్రదాయాన్ని.. గ్రామదేవతలపై ఉన్న విశ్వాసాన్ని తరతరాలకు అందించే ఆధ్యాత్మిక వేడుక అన్నారు. బోనం అంటే అమ్మవారికి సమర్పించే నైవేద్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు చింతకాయల రాజేందర్, జ్యోతి మురళి, బంటు ప్రీతి ప్రవీణ్, కోటగల్లి మైసమ్మ ఆలయ ప్రతినిధులు దేవేందర్, గౌడ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉండాలి
నిజామాబాద్ రూరల్: ఆర్యవైశ్యులంతా ఐక్యంగా ఉండి రాజకీయంగా ఎదగాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఉత్తర తిరుమల క్షేత్రంలో వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. ఆషాఢ మాసంలో ప్రతి ఏడాది వనభోజనాలను ఆనవాయితీగా నిర్వహించడం అభినందనీయమన్నారు. అంతకుముందు వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని పూజలు చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా, ఇల్లెందుల ప్రభాకర్, కోశాధికారి గాలి నాగరాజు, కార్యవర్గ సభ్యులు, ఆలయ ధర్మకర్త సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
నాటిన మొక్కలు ధ్వంసం
లింగంపేట: లింగంపేట మండలం పర్మళ్ల జీపీ పరిధిలోని అటవీ భూమిలో ఏర్పాటు చేసిన ప్లాంటేషన్లో నాటిన మొక్కలను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం ధ్వంసం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇటీవల ఉపాధి హామీ పథకం నిధులతో ఎనిమిది ఎకరాల్లో సుమారు వెయ్యి మొక్కలు నాటారు. ఇందు కోసం వారం రోజులు శ్రమించి గుంతలు తవ్వించారు. మండల ప్రత్యేకాధికారి, జడ్పీ డిప్యూటీ సీఈవో సురేందర్, సర్పంచ్ బాబాయి నరేశ్, క్షేత్రసహయకుడు లక్ష్మణ్, కార్యదర్శి నరేశ్, గ్రామస్తులు కలిసి ఈ నెల 14వ తేదీన మొక్కలు నాటారు. నాటిన మూడు రోజులకే సుమారు 350 మొక్కలను కొందరు ట్రాక్టర్తో రాత్రివేళ ధ్వంసం చేశారు. కొందరు వ్యక్తులు అటవీ భూమిని ఆక్రమించుకోడానికే ఈ చర్యలకు పాల్పడినట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయమై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ రూరల్: సువర్ణ అధ్యాయన పుస్తక పరిచయ కార్యక్రమం జిల్లా కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్సీఆర్టీ రిటైర్డ్ బాధ్యుడు సువర్ణ వినాయక్ హాజరై మాట్లాడారు. ఎస్సీఆర్టీలో ఆయన నాలుగు దశాబ్దాలుగా అందించిన విద్యారంగ సేవలను కొనియాడారు. బుక్ రచయిత, డీఆర్పీ గంట్యాల ప్రసాద్ను పలువురు రచయితలు సన్మానించారు. కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి శారద హనుమాన్లు, నాయకులు వినోద్, కిషన్, రమణాచారి, హెచ్ఎం ఇందూర్ బాబు, శ్రీనివాస్, గోపాలకృష్ణ, సేనాపతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బోధన్: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ ఆదివారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఎడపల్లి మండలం ఎమ్మెస్సీఫారం గ్రామంలో శనివారం రాత్రి రాకం స్వప్న(44) అనే వివాహిత కొంత కాలంగా గుండెనొప్పితో బాధపడుతోంది. పలు ఆస్పత్రుల్లో చూయించినా నయం కాలేదు. దీంతో ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఘనంగా జగన్నాథ రథయాత్ర
బోధన్రూరల్: పట్టణంలో ఇస్కాన్ బోధన్ ఆధ్వర్యంలో ఆదివారం జగన్నాథ స్వామివారి రథయాత్ర వైభవంగా నిర్వహించారు. పుష్పాలతో సుందరంగా అలంకరించిన రథంపై జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఉంచి పట్టణంలో రథయాత్ర చేపట్టారు. శక్కర్నగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్, అంబేడ్కర్ చౌరస్తా, పాత బస్టాండ్, రైల్వే గేట్మీదుగా కొనసాగి టీటీడీ కల్యాణ మండపం వద్ద ముగిసింది. రథయాత్రకు పట్టణంతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ‘జై జగన్నాథ‘ నామస్మరణలతో రథాన్ని లాగుతూ రథయాత్రతో పాల్గొన్నారు. రథయాత్ర సందర్భంగా నిర్వాహకులు భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. రథయాత్ర మార్గమంతా భజనలు, హరినామ సంకీర్తనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నిర్వాహకులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
డిచ్పల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యాసంవత్సరానికి గానూ మంజూరైన 13 గెస్ట్ ఫ్యాకల్టీ (అతిథి అధ్యాపకులు) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రామ్మోహన్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22వరకు ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంటర్వూలు ఈ నెల 23న ఉంటుందని అన్నారు. బోటనీ 1, కెమిస్ట్రీ 1, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్టికేషన్స్ 1, మాథ్స్ 1, ఫిజిక్స్ 2, జువాలజీ 1, ఎకనామిక్స్ 1, హిస్టరీ 1, పొలిటికల్ సైన్స్ 1, కామర్స్ 2, ఇంగ్లిష్ 1, తెలుగు 1 మొత్తం 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. రుద్రూర్: పొతంగల్ మండలం సుంకిని శివారులో కుక్కల దాడిలో ఓ కృష్ణజింక మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వి వరాల ప్రకారం.. సుంకిని శివారులో సంచరిస్తున్న కృష్ణజింకపై కుక్కలు దాడి చేశాయి. దీనిని గమనించిన ఓ రైతు కుక్కలను తరిమికొట్టి జింకను గ్రా మంలోకి తీసుకొచ్చాడు. అయితే అప్పటికే జింకకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సురేశ్ గ్రామానికి చేరుకుని జింకను పరిశీలించారు. తీవ్రగాయాల కారణంగా కృష్ణజింక మృతి చెందినట్లు ఆయన నిర్ధారించారు. అనంతరం అటవీశాఖ సిబ్బంది జింక కళేబరాన్ని అటవీ ప్రాంతంలో దహనం చేశారు. అటవీ ప్రాంతాల్లో సంచరించే వన్యప్రాణులపై కుక్కల దాడులు పెరుగుతున్నాయని, వాటి సంరక్షణకు తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు అధికారులను కోరారు. బాన్సువాడ: రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ సభ్యులు, టీఎస్ఎంఐడీసీ ఈఈ నరేందర్ రెడ్డి ఆదివారం బాన్సువాడ ఎంసీహెచ్ను సందర్శించారు. ఇటీవల బాన్సువాడ ఎంసీహెచ్లో ఆపరేషన్ చేసుకు న్న ఐదుగురు బాలింతలను హైదరాబాద్లోని నిమ్స్ కు తరలించిన విషయం తెలిసిందే. బాలింతలకు అలా కావడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. కమిటీ సభ్యులు బాన్సువాడ ఎంసీహెచ్లోని ఆపరేషన్ గదిని పరిశీలించి, రికార్డులు తనిఖీ చేశారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని అన్నారు. వారి వెంట సూపరింటెండెంట్ భాస్కర్ ఉన్నారు. -
స్వగ్రామానికి చేరిన మృతదేహం
వేల్పూర్: మండలంలోని కొత్తపల్లి ఎన్ గ్రామానికి చెందిన కమ్మరి బాలగంగాధర్(48) ఈనెల 8న గుండెపోటుతో దుబాయిలో మరణించగా ఆయన మృతదేహం ఆదివారం స్వగ్రామానికి చేరింది. సుమారు పదిహేనేళ్లుగా కుటుంబ పోషణకు దుబాయికి వెళ్లి వస్తున్నాడు.నెల రోజుల క్రితం ఇంటికి వచ్చి దుబాయికి వెళ్లినట్లు గ్రా మస్తులు తెలిపారు. ఈనెల 8న దుబాయిలో బస్సులో ప్రయాణి స్తూ గుండెపోటుతో మరణించినట్లు పేర్కొన్నారు. గంగాధర్ చిన్నప్పుడే తండ్రి మర ణించగా ఉపాధికోసం గల్ఫ్ వెళ్లాడు. ఆయనకు భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. -
ఇందూరులో ఉద్యమకారుల భారీ బహిరంగ సభ
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో త్వరలోనే జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యెండల ప్రదీప్ పేర్కొన్నారు. ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఆవరణలో తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సంఘం రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. యెండల ప్రదీప్ మాట్లాడుతూ.. ఉద్యమకారులకు 250 గజాలతో పాటు కేటగిరి వైజ్గా రూ.25 వేల నుంచి రూ.50వేల వరకు పెన్షన్ ఇవ్వాలని తీర్మానించారు. అలాగే తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, విద్యార్థుల అర్హతలను బట్టి ప్రభుత్వ జీవో ద్వారా పర్మినెంట్ ఉద్యోగాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థి ఉద్యమకారులకు యూనివర్సిటీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, వివిధ రంగాల్లో ఉద్యమకారుల కోటా ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో విద్యార్థి ఉద్యమకారుల సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పిడమర్తి రవి, నాయకులు సాంబశివరావు గౌడ్, శంకర్ నాయక్, రాస వెంకట్, వేల్పుల కుమార్, తెయూ సంఘం అధికార ప్రతినిధి బట్టు సురేశ్, రవి నాయక్, బీకోజీ, స్వప్న, ఎల్లన్న, అంజిబాబు, ప్రశాంత్, సంపత్, జగన్, సంజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎల్లారెడ్డిలో పోలీసుల కార్డెన్ సెర్చ్
ఎల్లారెడ్డి: పట్టణంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ఆదివారం ఉదయం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాస్రావు ఆధ్వర్యంలో పట్టణంలోని ఎర్రమన్ను కుచ్చ, పన్నాలాల్ కాలనీ, బీసీ కాలనీలలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తెల్లవారు జాము 4 నుంచి 7 గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని, చలాన్లు ఉన్న 135 ద్విచక్ర వాహనాలను, 8 ఆటోలను, నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ మాట్లాడూతూ.. సరైన పత్రాలు లేకుండా వాహనాలను నడిపించకూడదని, చలాన్లను బకాయి లేకుండా చూడాలని సూచించారు. తమ ప్రాంతంలో ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి సీఐ రాజిరెడ్డి, సదాశివనగర్ సీఐ సంతోష్, ఎల్లారెడ్డి ఎస్సై రాజు, సబ్ డివిజన్ పరిధిలోని ఎస్సైలు, పోలీసు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. -
అభ్యాసానికి చేయూత
● ప్రాథమిక విద్యలో రెమిడియేషన్ ప్రోగ్రాం ● అభ్యాసన లోపాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ ● నేటి నుంచి 25 వరకు ఎస్జీటీలకు శిక్షణకమ్మర్పల్లి: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు వి ద్యాశాఖ రెమిడియేషన్ ప్రోగ్రాం కార్యకమాన్ని చేపట్టింది. చదవడం, రాయడం ప్రాథమిక గణిత నైపు ణ్యాల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక బోధన అందించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ప్రతిరోజు కేటాయించిన ప్రత్యేక సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల సెకండరీ గ్రేడ్ టీచర్లకు (ఎస్జీటీలు) నేటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు దశలవారీగా శిక్షణ నిర్వహించనున్నారు. మండలాల వారీగా ఏ ర్పాటు చేసిన శిక్షణ కేంద్రాల్లో బోధనా విధానాలు, అభ్యాసన లోపాల గుర్తింపు, విద్యార్థుల స్థాయికి అనుగుణంగా బోధించే పద్ధతులు, నిరంతర మూ ల్యాంకనంపై నిపుణులు అవగాహన కల్పిస్తారు. శిక్షణ అనంతరం ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యాస స్థాయిని పరీక్షించి, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక రెమిడీయల్ తరగతులు నిర్వహిస్తారు. విద్యార్థులు తరగతి స్థాయికి తగిన కనీస అభ్యాస నైపుణ్యాలు సాధించేలా ప్రత్యేక కార్యాచరణ చేపడతారు. గత వారం మాక్లూర్ జెడ్పీహెచ్ఎస్లో శిక్షణ పొందిన మండల రిసోర్స్పర్సన్లు సోమవారం నుంచి ఆయా మండలాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. తెలుగు, ఇంగ్లిష్, గణితం విషయాలలో రెమిడియేషన్ కార్యక్రమం ప్రతి సబ్జెక్ట్కు రెండు రోజుల చొప్పున తరగతి గదిలో ఉపాధ్యాయులు నిర్వహించనున్నారు. అభ్యాసంలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించడం చదవడం, రాయడం, గణితంలో ప్రత్యేక బోధన అందించడం. ప్రతి విద్యార్థి స్థాయికి అనుగుణంగా పాఠ్య ప్రణాళిక రూపొందించడం. నిరంతర మూల్యాంకనం ద్వారా పురోగతిని అంచనా వేయడం. కనీస అభ్యాసన సామర్థ్యాలు సాధించే వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం. తొలిమెట్టులో భాగంగా వెనుక బడిన పిల్లల అభ్యాసన మద్ద తుకు రెమిడియేషన్ శిక్షణ ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగపడుతుంది. కానీ విద్యార్థుల సంఖ్య ఆధారంగా కాకుండా, విద్యార్థుల సంఖ్య 40 కంటే ఎక్కువగా ఉన్న చోట తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమిస్తే ఫలితాలు ఇంకా బాగా వస్తాయి. – అంకం నరేశ్, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, రేకులపల్లి, ధర్పల్లి ఎఫ్ఎల్ఎన్ కోసం విద్యాశాఖ ప్రతి కాంప్లెక్స్కు మూడు ఆదర్శ పాఠశాలలకు తగిన కంప్యూటర్లను ఇచ్చి ఏఐ(కృత్రిమ మేధస్సు) బోధనను అమలు చేయాలి. ప్రతి మండల విద్యాశాఖ అధికారి, కాంప్లెక్స్ హెచ్ఎంలు నిరంతర తనిఖీలు చేపట్టి అవసరమైన సహకారం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు అందించాలి. – బోయెడ నర్సయ్య, డీఆర్పీ, నిజామాబాద్ -
వరుణుడి కరుణ కోసం భజన
● ఐదు బృందాలు.. 24 గంటలపాటు కీర్తనలు ● డిచ్పల్లి మండలం రాంపూర్లో భజన సప్తాహండిచ్పల్లి(నిజామాబాద్రూరల్) : వర్షాకాలం ప్రారంభమై నెలన్నర గడిచినా సరైన వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వరుణుడి కరుణ కోసం వరుణ యాగాలు, పూజలు, భజనలు చేస్తున్నారు. డిచ్పల్లి మండలంలోని రాంపూర్లోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వీడీసీ ఆధ్వర్యంలో భజన సప్తాహం నిర్వహిస్తున్నారు. గురువారం ప్రారంభమైన సప్తాహం కొనసాగుతోంది. పాపాయి తిరుపతి, గూండ్ల చిన్నారెడ్డి, కాయితి రాజు, లింగులు రాజారెడ్డి, సూర నరేష్ నేతృత్వంలో ఒక్కో భజన బృందం సభ్యులు 4 గంటలపాటు భజన పాటలు పాడుతున్నారు. విడతల వారీగా 24 గంటలపాటు ఆగకుండా భజన కొనసాగుతోంది. వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులు ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ 15 ఏళ్లుగా ఏటా సప్తాహం నిర్వహిస్తున్నామని వీడీసీ సభ్యులు తెలిపారు. అలాగే పలు గ్రామాల్లో ప్రజలు వరుణదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి కప్పతల్లి ఆటలు, గ్రామదేవతలకు జలాభిషేకాలు, భజనలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. -
గోరింటాకు
ఆషాఢ మాసంలో ముత్తైదువులు, యువతులు గోరింటాకును చేతులకు, పాదాలకు పెట్టుకోవడం వెనుక ఆరోగ్య, శాసీ్త్రయ, ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. గోరింటాకును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల సౌభాగ్యం సిద్ధిస్తుందని, భర్త ఆయురారోగ్యాలతో ఉంటాడని నమ్ముతారు. చేతిలో గోరింటాకు ఎంత ఎర్రగా పండితే, అంత మంచిదని మహిళలు సంతోషిస్తారు. అలాగే వర్షాలు మొదలైన సమయంలో వాతావరణంలో తేమ పెరిగి, ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా మహిళలు నీటిలో ఎక్కువగా పనిచేయడం వల్ల చేతులు, కాళ్ల గోర్లు పాడయ్యే అవకాశం ఉంటుంది. గోరింటాకుకు యాంటీ సెప్టిక్ ఒంటికి చలవ చేసే గుణాలు ఉన్నాయి. ఇది చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. -
పంద్రాగస్టు నాటికి యూనిఫామ్
ఖలీల్వాడి: పాత యూనిఫామ్లతోనే ప్రభుత్వ పా ఠశాలలకు వెళ్తున్న విద్యార్థులకు ఆగస్టు 15 నాటికి కొత్త యూనిఫామ్లు అందనున్నాయి. దీనిపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నుంచి స్పష్టత రాగా, యూనిఫామ్ కుట్టుపనులకు సంబంధించి ఇప్పటికే మండలాల వారీగా ఎంఈవో, ఏపీఎంలు, హెడ్మాస్టర్లకు అవగాహన కల్పించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా జిల్లాలోని విద్యాలయాలకు మొత్తం 3.65 లక్షల మీటర్ల క్లాథ్(బట్ట)ను నేరుగా మండల రిసోర్స్ సెంటర్లకు అందించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారు లు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈనెల 25న మొదటి విడతలో, ఆగస్టు 13 రెండో విడతలో మొత్తం 3.65 లక్షల మీటర్ల క్లాథ్ సరఫరా కానుంది. త్రీమెన్ కమిటీ విద్యార్థులకు యూనిఫామ్స్ అందించేందుకు ఈ ఏడాది మార్చి – ఏప్రిల్లోనే పాఠశాలల్లో కొలతలు తీసుకున్నారు. అయితే ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన తరువాత పాఠశాలల్లో చేరిన సుమారు 6వేల మందికిపైగా విద్యార్థులకు యూనిఫామ్ అందజేయడంపై స్పష్టత రాలేదు. మండల కేంద్రంలోని ఎంఆర్సీ భవనంలో ఎంఈవో, ఏపీఏం, మండల సమాఖ్య అధ్యక్షులతో త్రీమెన్ కమిటీ ఏర్పాటు చేస్తారు. యూనిఫామ్ కట్టు పనులను గ్రామాల వారీగా మహిళ సంఘాలకు అప్పగిస్తారు. కాంప్లెక్స్ హెచ్ఎంలకు గ్రామ మహిళా సంఘాలను అటాచ్ చేస్తారు. మండలాల వారీగా త్రీమెన్ కమిటీ కీలకంగా వ్యవహరించనుంది. కేజీబీవీల్లో.. జిల్లాలోని 27 కేజీబీవీల్లో 7,019 మంది విద్యార్థినులకు గాను 5,190 మందికి యూనిఫామ్లు అందించారు. మిగతా యూనిఫామ్లు వారం రోజుల్లోగా అందించానున్నారు. జిల్లాలోని నవీపేట్, నందిపేట్, బాల్కొండ, మోర్తాడ్, జక్రాన్పల్లి, మోపాల్ కేజీబీవీలకు వైట్ యూనిఫామ్ను సైతం అదనంగా అందిస్తారు.కొత్త మోడల్ యూనిఫామ్స్ స్వయం సహాయక సంఘాలకు.. విద్యార్థులకు యూనిఫామ్లు అందించేందుకు అవసరమైన క్లాథ్ జిల్లాకు రెండు విడతల్లో సరఫరా కానుంది. ఈ క్లాథ్ను స్వయం సహాయక మహిళా సంఘాలకు అప్పగించి, కుట్టు బాధ్యతను ఇస్తారు. పంద్రాగస్టు వరకు విద్యార్థులకు కొత్త యూనిఫాం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా లోని కేజీబీవీల విద్యార్థినులకు యూనిఫామ్లు ఇదివరకే అందించాం. – పార్శి అశోక్, డీఈవో, నిజామాబాద్ఈ విద్యాసంవత్సరం నుంచి యూనిఫామ్ రంగు, డిజైన్లో ప్రభుత్వం మార్పులు చేసింది. బా లురకు నీలం రంగు చొక్కా, లేత నీలంరంగు ని క్కర్ లేదా ప్యాంటు, బాలికలకు లాంగ్ ఫ్రాక్, షర్ట్, స్కర్ట్ తరగతుల వారీగా అందించనున్నా రు. గతంలో ఉన్న ప్యాచ్ వర్క్, అలంకరణను తొలగించిన ప్రభుత్వం సాధారణ నమూనాను ఖరారు చేసింది. తెలంగాణ చేనేత సహకార సంస్థ కేజీబీవీలకు, ప్రభుత్వ పాఠశాలలకు మఫత్లాల్ కంపెనీ క్లాథ్ను సరఫరా చేయనున్నాయి.రెండు విడతల్లో జిల్లాకు 3.65 లక్షల మీటర్ల క్లాథ్ కొత్త డ్రెస్ల కోసం మార్చి – ఏప్రిల్లోనే కొలతల సేకరణ ప్రస్తుతం పాత దుస్తులతోనే బడికెళ్తున్న పిల్లలు జిల్లాలో 1156 స్కూళ్లు.. 83,083 మంది విద్యార్థులు -
బీజేపీది రణభేరి కాదు.. రాద్ధాంత భేరి
● ఫీజు రీయింబర్స్మెంట్ను తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ● ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డిడిచ్పల్లి(నిజామాబాద్రూరల్): బీజేపీ చేపట్టింది ‘రణభేరి‘ కాదని.. అది ‘రాద్ధాంత భేరి‘ అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి విమర్శించారు. నగరంలోని క్యాంప్ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడా రు. విద్యార్థుల సంక్షేమం పేరుతో బీజేపీ, బీఆర్ఎస్లు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. దేశంలో పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఫీజు రీ యింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయక పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టేసే ప్రయత్నం చేయడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు శాశ్వత వైస్ ఛాన్సలర్లను కూడా నియమించని బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే యూనివర్సిటీలకు వీసీ నియామకాలు జరిగి విద్యా వ్యవస్థ గాడిన పడుతోందన్నారు. కాంగ్రెస్ శ్రేణులు గ్రామ గ్రామాన, ఇంటింటికీ వెళ్లి ప్రభు త్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పులను ప్రజలకు వివరించాలని పిలుపుని చ్చారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేసే బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందన్నారు. ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కార్పొరేటర్ అగ్గు భోజన్న తదితరులు పాల్గొన్నారు. -
నిజామాబాద్
జిల్లాను ఎడారిగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు జిల్లాను దశాబ్దాలుగా ఎడారిగా మారుస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ విమర్శించారు. ఆదివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2026– 8లో uనిజామాబాద్ నగరంలోని పోచమ్మ ఆలయం గట్టు, పుట్ట, చెట్టు.. నడి ఊరు, ఊరి శివారు.. అంతటా ఆ తల్లి కొలువుదీరింది. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ పేరు ఏదైనా.. కొత్త కుండలో పాలు, బియ్యం, బెల్లం కలిపి తల్లికి భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించే ఆషాఢం సందడి జిల్లాలో మొదలైంది. డప్పు చప్పుళ్లు, అమ్మవారి సోదరుడైన పోతరాజు విన్యాసాలతో పల్లె, పట్టణం తేడాలేకుండా కళకళలాడుతోంది. జిల్లా కేంద్రంలో దేవీమాత, పోచమ్మ, నందిపేట మండలంలోని కుద్వాన్పూర్ ఎల్లమ్మ, భీమ్గల్ మండలంలోని బడాభీమ్గల్ పెద్దంగంటి ఎల్లమ్మ, బోధన్ పట్టణంలోని రేణుకాఎల్లమ్మ, నల్లపోచమ్మ, పెద్ద పోచమ్మ, మహాలక్ష్మమ్మ, బాల్కొండ మండలంలోని శ్రీరాంపూర్ చిలుకల చినమ్మ తదితర ఆలయాల్లో బోనాల సందడి నెలకొంది. ఆ తల్లి చల్లనిచూపు తమపై ఉండాలని, పిల్లాపాపలతో తాము సంతోషంగా ఉండాలని కోరుతూ జిల్లాలోని అమ్మవార్ల ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. – నిజామాబాద్ రూరల్ -
సల్లంగ కాపాడు తల్లీ..
జిల్లాలో ఆషాఢం బోనాల సందడి కుద్వాన్పూర్ ఎల్లమ్మకొత్త మట్టి కుండ లేదా రాగి పాత్రలో అన్నం, పాలు, బెల్లం వేసి వండిన తరువా త దానిపై నెయ్యి, వేపాకులు వేసి బోనాన్ని అలంకరిస్తారు. కుండకు పసుపు, కుంకుమతో అలంకరించి దానిపై దీపం (జ్యోతి) ఉంచి, తలపై మోస్తూ డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలతో ముందుకు కదులుతూ అమ్మ వద్దకు చేరుకుని నైవేద్యంగా సమర్పిస్తారు. చాలాచోట్ల యాటలు(మేకలు) బలిస్తారు. బోధన్లో ఎల్లమ్మ.. నల్లపోచమ్మబోనం -
భక్తుల కొంగుబంగారం పెద్దంగంటి ఎల్లమ్మ
కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ పట్టణానికి 2 కిలో మీటర్ల దూరంలో బడా భీమ్గల్లో కొలువుదీరిన పెద్దంగంటి ఎల్ల మ్మ భక్తుల కొంగుబంగారం. ఇక్కడి అమ్మవారిని దర్శించుకుంటే చర్మ వ్యాధులు మటు మాయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధు లు రాకుండా నివారిస్తే.. పోచమ్మ పోషణ కలిగిస్తుందని భక్తుల విశ్వాసం. బడా భీమ్గల్లో పచ్చని వాతావరణంలో చెట్ల మధ్య అన్ని వసతులతో కొలువై ఉన్న పెద్దంగంటి ఎల్లమ్మ తల్లిని ప్రతి ఆదివారం, మంగళవారాల్లో జిల్లాకు చెందిన వారితోపాటు జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్ తదితర జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చి దర్శించుకుంటారు. ఆషాఢ మాసం ఆదివారాలు మహిళలు మొక్కులు చెల్లించుకొని బోనాలను సమర్పిస్తారు. ఈ ఆలయానికి 700 ఏళ్ల చరిత్ర ఉందని చరిత్రకారులు తెలిపారు. ఆలయ పరిసరాల్లో 10వ శతాబ్దం నాటి చాళుక్యుల కాలపు రెండంతస్తుల వీరగల్లు లభించడం చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన అంశం. ఇలాంటి అరుదైన శిల్పాలు మన పూర్వీకుల శౌర్యపరాక్రమాలకు, నాటి యుద్ధ నైపుణ్యాలకు ప్రతీకలు. -
ఎల్నినోపై ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించాలి
నిజామాబాద్అర్బన్ : ఎల్నినో కారణంగా రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రణాళికల రూపకల్పనకు చర్య లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. ఆయన శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా స్పెషల్ ఆఫీసర్, కలెక్టర్తో సమీక్షించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తాగు, సాగునీరు, విద్యుత్ రంగాల్లో తీసుకోవాల్సిన చర్య లపై దిశానిర్దేశం చేశారు. ఈ నెల 20న జిల్లా ఇన్చార్జి మంత్రి నేతృత్వంలో నిర్వహించే ఉమ్మడి జిల్లా సమావేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చర్చించి, ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించా లని సూచించారు. ప్రతికూల పరిస్థితుల్లో అవసరమైన చర్యలు తీసుకోవడానికి అన్ని శాఖలు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని అన్నారు. ఎక్కడా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు నుంచి వ చ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సూచించారు. నిరంతరం విద్యుత్ సరఫరా జరిగేలా చర్య లు తీసుకోవాలని పేర్కొన్నారు. వీసీలో కలెక్టర్ ఇ లా త్రిపాఠి, డీఆర్వో గీత, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, జిల్లా వ్యవసాయ అధికారి వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. వీసీలో సీఎస్ సంజయ్ జాజు తాగు, సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలి -
‘దృశ్యం’ చూపించినా.. తప్పని కటకటాలు
భిక్కనూరు : ఓ చోరీ కేసు నుంచి తప్పించుకునేందుకు ‘దృశ్యం’ సినిమా తరహాలో ప్రయత్నించిన నిందితురాలు చివరకు కటకటాలపాలైంది. కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ శనివారం భిక్కనూరు పో లీస్ స్టేషన్లో తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జంగంపల్లికి చెందిన దొడ్ల స్వామి కుటుంబంతో కలిసి ఈనెల 16న వ్యవసాయ పొలానికి వెళ్లాడు. సా యంత్రం ఇంటికి వచ్చి చూడగా ఇంటి బయట తా ళం యథావిధిగా ఉన్నా.. లోపలి గదులు, బీరువా తాళాలు తెరిచి ఉన్నాయి. అందులో భద్రపరిచిన ఆరు తులాల బంగారు ఆభరణాలు, 60 తులాల వెండి ఆభరణాలు, కొంత నగదు కనిపించలేదు. దీంతో స్వామి అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేశా రు. పోలీసులు రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి శాస్త్రీయ పద్ధతుల్లో దర్యాప్తు చేశారు. గ్రామానికి చెందిన దొడ్లె లతను నిందితురాలిగా గుర్తించారు. అయితే ఘటన జరిగిన రోజు తాను షాపింగ్ కోసం కామారెడ్డికి వెళ్లినట్లు బస్సు టికెట్లు, షాపింగ్ బి ల్లులు చూపించి తప్పును కప్పిపుచ్చుకునేందుకు యత్నించింది. దీంతో పోలీసులు మరోసారి సీసీ ఫు టేజీని పరిశీలించి, సాంకేతిక పరిజ్ఞానంతో వాస్తవాలను వెలికితీశారు. నిందితురాలు లత నుంచి చోరీ కి గురైన మొత్తం స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ మధుసూదన్ తెలిపారు. కేసును అత్యంత సమర్థవంతంగా ఛేదించిన భిక్కనూరు సీఐ నరేశ్, ఎస్సై అనిల్, ఏఎస్సై వెంకటరావు, పీసీలు శ్రీకాంత్, కిషన్ గౌడ్, బాలకృష్ణను ఎస్పీ రాజేశ్చంద్ర అభినందించారు. రెండు రోజుల్లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు యత్నించిన నిందితురాలు వివరాలు వెల్లడించిన కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ -
బెయిల్పై వచ్చి.. పేరు మార్చుకుని నేరాలు
● కామారెడ్డిలో మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ మధుసూదన్ కామారెడ్డి క్రైం: హత్య, దోపిడీ కేసుల్లో జైలులో వెళ్లి, బెయిల్పై బయటకు రావడమే కాకుండా పేరు మార్చుకుని తిరుగుతూ మరో హత్యకు పాల్పడిన ఓ నిందితుడిని కామారెడ్డి పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కామారెడ్డి సబ్ డివిజన్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మధుసూదన్ వివరాలు వెల్లడించారు. మాచారెడ్డి మండలం పోతారం గ్రామానికి చెందిన నర్సాపురం రాజం అనే వ్యక్తి తన భార్య శ్యామలతో కలిసి కూలీ పనులు చేసేవారు. గత నెల 31న వారు పని కోసం కామారెడ్డిలోని కూలీల అడ్డాకు వచ్చారు. రాజంకు మాత్రమే పని లభించగా, శ్యామలకు పని దొరకలేదు. దీంతో కూరగాయలు కొనుక్కొని ఇంటికి వెళ్లమని భార్యతో చెప్పి రాజం పనికి పోయాడు. రాత్రయినా భార్య ఇంటికి రాకపోవడంతో చాలాచోట్ల గాలించాడు. ఆచూకీ లభించకపోవడంతో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మూడు రోజుల తర్వాత రైల్వే ట్రాక్ పక్కన శ్యామల మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో గుర్తించారు. పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు, విశ్వసనీయ సమాచారం మేరకు కూలీల అడ్డాలో కొంతకాలంగా ఉంటున్న నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం శిరాన్పల్లి గ్రామానికి చెందిన పిట్టల నర్సింలును అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టగా శ్యామలను హత్య చేసినట్లు అంగీకరించాడు. కూలీ పనులకు వెళ్లేచోట శ్యామలతో నర్సింలుకు పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా శ్యామల మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటంతో నర్సింలు అసూయ పెంచుకున్నాడు. ఈక్రమంలో హత్య రోజు ఆమెను రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి తీసుకువెళ్లాడు. అక్కడ మద్యం సేవించాక వాగ్వాదం జరగడంతో రాయితో శ్యామల తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. నిందితుడిపై గతంలో నిజామాబాద్ 4వ టౌన్లో ఒక దోపిడీ కేసు, బాసర పీఎస్లో హత్య కేసు నమోదై ఉన్నాయి. ఆయా కేసుల్లో జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చి, మామిడి రాజన్నగా పేరు మార్చుకుని కామారెడ్డి కూలీ అడ్డాలో మకాం వేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసు చేధనలో విశేషంగా కృషి చేసిన పట్టణ ఎస్హెచ్వో నరహరి, సిబ్బందిని అభినందించారు. -
గుడి ప్రాంగణంలో మద్యం సేవిస్తే రూ.10వేల జరిమానా
గాదేపల్లి జీపీ తీర్మానం డొంకేశ్వర్(ఆర్మూర్): గ్రామ శివారు ప్రాంతాల్లోని ఆలయాల ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడడంతోపాటు పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా డొంకేశ్వర్ మండలంలోని గాదేపల్లి గ్రామ పంచాయతీ రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈమేరకు నిబంధనలతో కూడిన హెచ్చరిక బోర్డులను గ్రామంలో, ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ తీరంలో ఏర్పాటు చేసింది. పర్యాటకులు బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని ప్లాస్టిక్ వ్యర్థాలు, తాగి పడేసిన మద్యం సిసాలతో కలుషితం చేస్తున్నారని ’పర్యాటకం సరే.. పారిశుద్ధ్యం సంగతేంటి’ అనే కథనాన్ని ఈ నెల 16న ‘సాక్షి’లో ప్రచురించింది. ఇందుకు గాదేపల్లి సర్పంచ్ గడ్డం చిన్నారెడ్డి స్పందించి పోస్టర్లను తయారు చేయించారు. బ్యాక్ వాటర్ వద్ద గల రామలింగేశ్వర స్వామి (శివాలయం) ఆలయం, హనుమాన్ ఆలయాల ప్రాంగణంలో పర్యాటకులు మద్యం సేవించడం, మాంసాహారం తినడంపై నిషేధం విధించింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే వారికి రూ.10వేల జరిమానా విధించనున్నట్లు జీపీ హెచ్చరిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే బ్యాక్ వాటర్ పచ్చిక బయళ్లలో పర్యాటకులు తమ ప్లాస్టిక్ వ్యర్థాలను, బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదని సూచించింది. వీటివల్ల మూగజీవాలతోపాటు తోటి పర్యాటకులకు కూడా ఇబ్బంది కలుగుతుందన్నారు. కాబట్టి ప్లాస్టిక్ వ్యర్థాలు, మద్యం బాటిళ్లను తిరిగి వెంట తీసుకెళ్లాలని పర్యాటకులకు సర్పంచ్ విజ్ఞప్తి చేశారు. -
ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తాం
నిజామాబాద్ రూరల్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇ చ్చిన హామీలను అంచెలంచలుగా నెరవేరుస్తుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను దిగమింగుకుని ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీ అర్వింద్ వారి ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే సహించేది లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కి వచ్చిన రెండున్నరేళ్లలో సుమారు 70వేల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిందన్నా రు. పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తుండగా బీజేపీ నేతలకు కనిపించట్లేదా అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్ర భుత్వం సంవత్సరానికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటికీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో తెలపాలన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చరిత్ర అందరికి తెలుసని, బీజేపీ నాయకులు తమ ఉనికిని కాపాడుకోవటానికి విమర్శలు చేస్తున్నారని వీటిని ప్రజలు, విద్యార్థులు నమ్మవద్దన్నారు. ఇప్పటికయినా బీజేపీ నాయకులు ప్రతిపక్ష పాత్ర వహించి రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలన్నారు. -
నీట్లో పల్లికొండ విద్యార్థి ప్రతిభ
కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ మండలం ప ల్లికొండ గ్రామానికి చెందిన మేకల రితీష్ అనే విద్యార్థి నీట్లో ప్రతిభ చాటాడు. ఆలిండియా లెవెల్లో 18972 ర్యాంక్ సాధించాడు. రితీష్ తండ్రి వినోద్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా, తల్లి ప్రయివేట్ ఉపాధ్యాయురాలిగా పని చే స్తోంది. రితీష్ ఇంటర్ హైదరాబాద్ శ్రీ చైతన్య కాలేజ్లో చదువుగా, అదే కాలేజ్లో నీట్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయి పరీక్ష రాశాడు. ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్లో ప్రతిభ చాటాడు. ఎంబీబీఎస్ పూర్తి కాగానే పీజీలో కార్డియోలాజిస్ట్ స్పెషలైజేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రితీష్ తెలిపారు. పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలందిస్తానని తెలిపాడు. వరంగల్ స్పోర్ట్స్ : హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో తెలంగాణ ట్రాన్స్కో, టీజీఎన్పీడీసీఎల్, టీజీఎస్పీడీసీఎల్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికి నిర్వహించిన ఇంటర్ సర్కిల్ వాలీబాల్, బాల్ బ్యా డ్మింటన్, క్యారం క్రీడా పోటీలు శనివారం ము గిశాయి. టీజీఎన్పీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్) మధుసూదన్, హెచ్ఆర్డీ సి.ప్రభాకర్ ము ఖ్య అతిథులుగా హాజరై వివిధ క్రీడల్లో గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. వివిధ క్రీడల్లో గెలుపొందిన జట్లు.. బాల్ బ్యాడ్మింటన్ విభాగంలో టీజీఎన్పీడీసీఎల్ వరంగల్ ఆపరేషన్ సర్కిల్ జట్టు ప్రథమ బహుమతి, టీజీఎస్పీడీసీఎల్ నల్లగొండ సర్కిల్ జట్టు ద్వితీయ బహుమతి, టీజీఎస్పీడీసీఎల్ మహబూబ్నగర్ సర్కిల్ జట్టు తృతీయ బహుమతి కై వసం చేసుకున్నాయి. వాలీబాల్ విభాగంలో టీజీఎన్న్పీడీసీఎల్ ఖమ్మం ఆపరేషన్ సర్కిల్ జట్టు ప్రథమ బహుమతి, టీజీఎస్పీడీసీఎల్ మహబూబ్నగర్ సర్కిల్ జట్టు ద్వితీయ బహుమతి, టీజీఎస్పీడీసీఎల్ హైదరాబాద్ సౌత్ సర్కిల్ జట్టు తృతీయ బహుమతి సాధించాయి. క్యారం విభాగంలో టీజీఎన్పీడీసీఎల్ నిజామాబాద్ సర్కిల్ ప్రథమ బహుమతి, హైదరాబాద్ విద్యుత్ సౌధ ద్వితీయ బహుమతి, ట్రాన్స్కో వరంగల్ తృతీయ బహుమతి దక్కించుకున్నాయి. జక్రాన్పల్లి: మండలంలోని అర్గుల్ గ్రామంలో ‘సర్’ ప్రక్రియ వందశాతం పూర్తయినట్లు తహసీల్దార్ కిరణ్మయి శనివారం తెలిపారు. ఈసందర్భంగా సర్ ప్రక్రియను పూర్తి చేసిన బీఎల్వోలను ఆమె సత్కరించారు. సర్పంచ్ సాయన్న, ఉప సర్పంచ్ నందు యాదవ్, జీపీవో పృథ్వీరాజ్, వార్డు సభ్యుడు మహేష్, పాల్గొన్నారు. 31లోగా ఈ–కేవైసీ పూర్తి చేయాలి సుభాష్నగర్: జిల్లాలో ఆహారభద్రత కార్డుల్లో ఉన్న సభ్యులందరి ఈ–కేవైసీని ఈనెల 31వ తేదీలోగా వందశాతం పూర్తి చేయాలని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి శ్రీకాంత్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సభ్యులు ఏదైనా రేషన్ షాపులో ఈ–కేవైసీని ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. రేషన్కార్డులు కలిగి ఉన్న వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
జిల్లాను ఎడారిగా మారుస్తున్న ప్రభుత్వాలు
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారిసుభాష్నగర్: గత బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి జిల్లాను 18 ఏళ్లుగా ఎడారిగా మారుస్తున్నా యని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచా రి విమర్శించారు. నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆ యన మాట్లాడారు. జిల్లాలోని శ్రీరామ్ సాగర్, ని జాంసాగర్ ప్రాజెక్టు పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో సాగునీరు విషయంలో నిర్లక్ష్యానికి గురైందన్నారు. అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మంచిప్ప ప్రాజెక్ట్ ప్యాకేజీ పనులను నిర్లక్ష్యం చేసిందన్నారు. మళ్ళీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 30 నెలల నుంచి ఒక తట్టేడు మట్టి ఎత్తింది లేదని, ఒక పైపు వేసింది లేదని ఆరోపించారు. గతంలో బాజిరెడ్డి, కవితల మధ్య కమీషన్ల పోరులో ప్రాజెక్ట్ నలిగిపోయి రైతంగం నష్టపోయిందని, ఇప్పుడు ఎ మ్మెల్యేలు భూపతిరెడ్డి, సుదర్శన్ రెడ్డిల మధ్య కమీ షన్ల కుమ్ములాటల వల్ల ప్రాజెక్టులు మరోసారి బలి అవుతున్నాయన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధికి దూ రమవ్వడానికి గత ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణ మని ఆరోపించారు. రూరల్ ఎమ్మెల్యేకు సవాల్.. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి ప్రా జెక్ట్ ప్యాకేజీ 20, 21, 22 గురించి కనీస అవగాహన కూడా లేదని, ఇటువంటి అజ్ఞానంతో ప్రాజెక్ట్ను ఎ లా ముందుకు తీసుకెళ్తారని ప్రశ్నించారు. ప్యాకేజీ పనులతోపాటు గుత్ప, అలీసాగర్ లిఫ్ట్లపై బహిరంగ చర్చకు రావాలని వారికి సవాల్ విసిరారు. పాత డిజైన్ల పేరుతో మళ్లీ రైతులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తే, రైతులు తిరగబడే రోజులు వస్తాయన్నారు. నాయకులు గద్దె భూమన్న, నక్క రాజేశ్వర్, ఓం సింగ్, ఆనంత్ రెడ్డి, కర్క గంగారెడ్డి, చింత శ్రీనివాస్ రెడ్డి, నరేష్, శంకర్ రెడ్డి, గంగారెడ్డి, శశాంక్, జగన్రెడ్డి పాల్గొన్నారు. డీడీవోపీగా రజిని బాధ్యతల స్వీకరణ నిజామాబాద్ లీగల్ : నిజామాబాద్ ఫ్యామిలీ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియామకమైన యం.రజిని శనివారం ఇన్చార్జి డీడీవోపీ రహీముద్దీన్ నుంచి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ (డీడీవోపీ)గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్లలో రజిని గ్రేడ్ వన్ కేటగిరీ కావడంతో డీడీవోపీగా నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ కోర్టులకు చెందిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు. -
అందని జీతాలు.. ఆందోళనలో జీవితాలు
● ‘ఉపాధి’ ఉద్యోగులకు మూడు నెలలుగా విడుదల కాని వేతనాలు ● ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలు నందిపేట్(ఆర్మూర్): గ్రామాల్లోని పేదలకు ఉపాధి పథకం (‘వీబీ–జీ రామ్జీ’ –వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్) కింద పని కల్పించడంలో సిబ్బందే కీలక పాత్ర పోషిస్తారు. జాబ్ కార్డు కలిగిన కూలీలు వివిధ పనులు చేపట్టి ఉపాధి పొందుతున్నారు. ఈ పథకం సజావుగా కొనసాగేందుకు వివిద స్థాయిలలో సిబ్బంది కృషి చేస్తున్నారు. అలాంటి సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 516 మంది.. జిల్లాలోని 33 రెవెన్యూ మండలాల్లో వీబీ–జీ రామ్ జీ పథకంలో 516 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వారిలో ఏపీవోలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు కీలక ప్రాత పోషిస్తున్నారు. వీరు కూలీలకు పనులను కెటాయించడం, ఆన్లైన్లో వివరాలు నమెదు చేయడం, వేతనాలు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడడం వంటి బాధ్యతలను నిర్వరిస్తారు. ప్రతి నిత్యం ఈ పథకం సజావుగా సాగేందుకు నిరంతరం పనిచేస్తున్న వీరికి వేతన బకాయిలతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఈ సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు (ఏప్రిల్, మే, జూన్) పెండింగ్లో ఉన్నాయి. జులై చివరి వారానికి వచ్చినా జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి పెండింగ్ వేతనాలను విడుదల చేసి, సకాలంలో అందించాలని ‘ఉపాధి’ సిబ్బంది కోరుతున్నారు. -
క్రైం కార్నర్
పాముకాటుతో బాలుడి మృతి భిక్కనూరు: మండలంలోని భాగిర్తిపల్లి గ్రామంలో పాముకాటుకు ఓ బాలుడు మృతిచెందాడు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన గొండ్ర నవీన్ (15) అనే బాలుడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. శనివారం వేకువజామున అతడు నిద్ర నుంచి లేచి, మూత్రవిసర్జనకు ఇంటి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో పాటు అతడి కాలుపై కాటు వేసింది. వెంటనే ఈ విషయాన్ని కుటుంబీకులకు తెలుపగా వారు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. నవీన్ మృతితో గ్రామంలో విషాదఛాయాలు అలుముకున్నాయి. కాలువలో పడి ఒకరు.. బాన్సువాడ: బీర్కూర్ మండల కేంద్రంలోని కాలువలో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. వివరాలు ఇలా.. బీర్కూర్లోని సంగెం విఠల్(39) అనే వ్యక్తి శుక్రవారం రాత్రి కాలకృత్యాలు తీర్చుకునేందుకు డబుల్ బెడ్రూం కాలనీ వద్ద గల కాలువ వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలువలో పడి నీటమునిగి మృతిచెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసే నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైలు నుంచి జారిపడి.. ఇందల్వాయి: మండలంలోని సిర్నాపల్లి–ఇందల్వాయి రైల్వే స్టేషన్ల మధ్య శుక్రవారం అర్ధరాత్రి రైలు నుంచి జారి పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. నిజామాబాద్లోని పూలాంగ్ చౌరస్తాకు చెందిన షేక్ లతీఫ్(40) అనే వ్యక్తి కామారెడ్డి రైల్వే స్టేషన్లో నర్సాపూర్–నాగర్సోల్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కాడు. నిజామాబాద్కు వస్తుండగా సిర్నాపల్లి–ఇందల్వాయి రైల్వే స్టేషన్ల మధ్య లతీఫ్ డోర్ వద్ద అజాగ్రత్తగా ఉండటంతో పట్టుతప్పి కిందపడి తలకు తీవ్ర గాయమై మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువులకు సమాచారం అందించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నవీపేట: మండలంలోని యంచ శివారులోని గోదావరి నదిలో శనివారం గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవని, వయస్సు సుమారు 50 ఏళ్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. చామనఛాయ రంగులో ఉన్నాడని, మెరూన్ రంగు నిక్కర్ ధరించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా ఆచూకీ తెలి స్తే బాసర ఎస్హెచ్వో 8712659540ను సంప్రదించాలని సూచించారు. -
అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలి
● వీసీలో డీజీపీ(లా అండ్ ఆర్డర్) మహేశ్ భగవత్ నిజామాబాద్అర్బన్: పుష్కరాల సందర్భంగా అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని రాష్ట్ర డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేశ్ భగవత్ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సాయిచైతన్యకు సలహాలు, సూచనలు ఇచ్చారు. పుష్కరాల నేపథ్యంలో ఘాట్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణ, క్రౌడ్ మేనేజ్మెంట్, పార్కింగ్ ఏర్పాటు, క్యూ లైన్ వ్యవస్థ, అత్యవసర సేవలు, విపత్తుల నిర్వహణ, డ్రోన్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, కమాండ్ కంట్రోల్ సెంటర్లో పనితీరు తదితర అంశాలపై సమీక్షించారు. అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని, తప్పిపోయిన వారి కోసం సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వీసీలో అదనపు డీసీపీ శుభం ప్రకాశ్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు ప్రకాశ్యాదవ్, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
జయహో జగన్నాథ
నిజామాబాద్ రూరల్ : జై జగన్నాథ్.. జయహో జగన్నాథ నినాదాలతో ఇందూరు పురవీధులు మార్మోగాయి. నిజామాబాద్ ఇస్కాన్ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో జగన్నాథ స్వామి రథ యాత్ర వైభవంగా నిర్వహించారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి, బలరామకృష్ణుడి ప్రతిమలను ప్రత్యేకంగా అలంకరించిన ర థాలపై ఊరేగించారు. వేలాది మంది భక్తులు జై జగన్నాథ్ నినాదాలతో రథాలను లాగుతూ స్వా మివారిని దర్శించుకున్నారు. నగరంలోని గంజ్ కమాన్ వద్ద రథయాత్రను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించి మాట్లాడారు. ఇస్కాన్ చేపడుతున్న కార్యక్రమాలతో హిందువుల్లో ఐక్యత పెరుగుతుందన్నారు. తొ మ్మిది సంవత్సరాలుగా నిజామాబాద్ ఇస్కాన్ నగరంలో రథయాత్ర నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మేయర్ కూరగాయల ఉమారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, నిజామాబాద్ ఇస్కాన్ అధ్యక్షుడు సిద్ధ బలరామయ్య, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఇందూరులో వైభవంగా రథయాత్ర ఇస్కాన్ కార్యక్రమాలతో హిందువుల్లో ఐక్యత ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ -
కు.ని పద్ధతులు పాటించాలి
సుభాష్నగర్ : కుటుంబ నియంత్రణకు శాశ్వత, తాత్కాలిక పద్ధతులను అవలంబించాలని, వాటిపై అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ భుజంగరావు పేర్కొన్నారు. నగరంలోని మాలపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని అదనపు కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాతో కుటుంబానికి పోషణ భారమవుతుందన్నారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. డీఎంహెచ్వో రాజశ్రీ మాట్లాడుతూ పిల్లలకు మధ్య సరైన అంతరంతోనే కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయన్నారు. జీజీహెచ్ గైనకాలజిస్ట్ హెచ్వోడీ లక్ష్మీప్రసన్న, డాక్టర్ అరుణ రేఖ, డీఐవో డాక్టర్ అశోక్, డిప్యూటీ డీఎంహెచ్వోలు పాల్గొన్నారు. రెండు క్లినిక్లు సీజ్ సుభాష్నగర్ : నగరంలో అనుమతులు లేకుండా కొనసాగుతూ కేసులు నమోదైన రెండు క్లినిక్లను డీఎంహెచ్వో రాజశ్రీ ఆదేశాల మేరకు అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. గురువారం నాలుగు క్లినిక్లను సీజ్ చేసిన విషయం తెలిసిందే. డాక్టర్ సుప్రియ, రామకృష్ణ ఆధ్వర్యంలో వీక్లీబజార్లోని చక్రవర్తి క్లినిక్, మాలపల్లిలోని హుదా ఫస్ట్ ఎయిడ్ క్లినిక్లను సీజ్ చేశారు. అధికారులు వేణుగోపాల్, నాలుగో టౌన్ ఎస్సై కరీం, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది తదితరులు ఉన్నారు. కొనసాగుతున్న బీఈడీ, బీపీఈడీ పరీక్షలు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో బీఈడీ 2వ సెమిస్టర్ రెగ్యులర్, బీపీఈడీ 1, 2, 3, 4వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం జరిగిన పరీక్షలకు 64మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అకడమిక్ ఆడిట్సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. పరీక్షలకు 1,484 మంది విద్యార్థులకు గానూ 1,420 హాజరు కాగా 64 మంది గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. డిగ్రీ పరీక్షలు.. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో కొనసాగుతున్న డిగ్రీ వన్టైం ఛాన్స్ 1, 2, 3, 4, 5, 6వ సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు 143 మంది విద్యార్థులకు గానూ 132 మంది హాజరు కాగా 11 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. అలాగే మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 105 మంది విద్యార్థులకు గానూ 96 మంది విద్యార్థులు హాజరు కాగా 9మంది గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. -
ఇందూరు నుంచే రణభేరి మొదలు
● విద్యార్థుల జీవితాలతో సీఎం రేవంత్రెడ్డి ఫుట్బాల్ ఆడుతున్నారు ● వైఎస్ఆర్ మహానుభావుడు ● నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురిసుభాష్నగర్ : ఫీజు రీయింబర్స్మెంట్ ఆలోచన ఇందూరు నుంచే మొదలైందని, పథకం బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోతే అదే గడ్డ నుంచి రణభేరి మొదలవుతుందని ఎంపీ అర్వింద్ ధర్మపురి హె చ్చరించారు. శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్లో ఫీజు రీయింబర్స్మెంట్ బ కాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ‘ఇందూరు రణభేరి’ కార్యక్రమాన్ని నిర్వహించింది. అంతకుముందు ఎంపీ అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సారథ్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీ అర్వింద్ ధర్మపురి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అప్పటి పీసీసీ అధ్యక్షుడు డీఎస్ మెదడులో నుంచి పుట్టిన ఆలోచన అని, వైఎస్ను ఒప్పించి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టించారని గుర్తుచేశారు. ఆరోగ్య శ్రీ, రైతాంగానికి ఉచిత విద్యుత్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందించిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర్రెడ్డి అని కొనియాడారు. బకాయిలు చెల్లించేందుకు 40 శాతం కమీషన్ అడగటం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో కమీషన్ల సర్కారు కొనసాగుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. అధికారంలోకి వస్తే బాలికలకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు ఇవ్వలేదని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల షోరూమ్లు ఎక్కడ ఉన్నా స్కూటీలు ఎత్తుకెళ్లాలని బాలికలు, యువతులకు పిలుపునిచ్చారు. అనంతరం ఫీజు రీయింబర్స్మెంట్ కోసం సీఎం రేవంత్రెడ్డి 40 శాతం కమీషన్ అడగటంపై అక్కడ ఏర్పా టు చేసిన డబ్బాల్లో విద్యార్థులు డమ్మీ నోట్లను వేసి నిరసన తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి, రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, రా ష్ట్ర, నాయకులు మేడపాటి ప్రకాశ్రెడ్డి, వడ్డి మోహన్రెడ్డి, కంచెట్టి గంగాధర్ పాల్గొన్నారు. -
ఏటీసీ నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలి
పెర్కిట్(ఆర్మూర్): పట్టణంలో అడ్వాన్స్డ్ టెక్నాల జీ సెంటర్ నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాల ని విద్యార్థి సంఘాల నాయకులు అంగరి ప్రదీప్, షాహిద్ అలీ ఆధ్వర్యంలో నాయకులు మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామికి వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్ సచివాలయంలో శుక్రవారం మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఏటీసీ సెంటర్ నిర్మాణం కోసం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంతంలో భూమి కేటాయింపు జరిగిన నిర్మాణంలో జాప్యం నెలకొందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆర్మూర్ ప్రాంతానికి చెందిన 40 గ్రామాల విద్యార్థులు సాంకేతిక విద్యనభ్యసించడానికి ఇతర ప్రాంతాల్లోని ఏటీసీ సెంటర్లకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మంత్రిని కలిసిన వారిలో జమాత్ ఎ ఉల్మా ప్రతినిధి ఇబ్రహీం, మర్కజ్ కమిటీ కార్యదర్శి రిజ్వాన్, జాఫర్ అలీ, షైబాజ్ తదితరులు ఉన్నారు. -
కరువు కోరలు
ఎడపల్లి మండలం జంలం శివారులో బీటలు వారిన మడిసాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాపై ‘ఎల్నినో’ పడగ విప్పుతోంది. జూలై మాసం పూర్తి కావొస్తు న్నా వర్షాల జాడ లేకపోవడంతో మెల్లిగా కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి. భూగర్భ జలాలు వేగంగా పడిపోవడంతో వ్యవసాయ బోర్లు నీరందక ఎత్తిపోతున్నాయి. జిల్లాలోని డొంకేశ్వర్ వంటి పలు మండలాలు, గ్రామాల్లో సాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాలుస్తోంది. వరినాట్లు నెమ్మదించా యి. ఇప్పటికే గుండె నిబ్బరం చేసుకొని నాట్లు వేసి న పంట పొలాలకు నీరందక ఎండుముఖం పడుతున్నాయి. నీటి తడి లేక సాగు భూములు నెర్రెలు బారుతుండడంతో రైతుల్లో దిగులు మొదలైంది. దీంతో ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే సాగు సంకటంలో పడింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 2.27లక్షల ఎకరాల్లో వరినాట్లు పడగా, ఇది గతేడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గింది. వర్షాల కోసం వేచి చూసే పరిస్థితి లేకపోవడంతో పంటలను కాపాడుకునేందుకు రైతన్నలు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. చేతిలో పైసలు లేకపోయినా అప్పులు తెచ్చి పొలాల్లో కొత్త బోర్లు వేయిస్తున్నారు. అయినా చుక్క నీరు రాకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఒకచోట ఫెయిల్ అయితే మరోచోట బోరు వేస్తూ వేల రూపాయలు మట్టిలో పోస్తున్నారు. ఇంత చేస్తున్నా ఫలితం లేకపోవడంతో ఎండిపోతున్న పొలాలను రైతులు అలాగే వదిలేయడానికి సిద్ధమవుతున్నారు. పలుచోట్ల నాట్లు వేయకుండా భూములను పడావుగా ఉంచుతున్నారు. నీరందక వాడుతున్న మక్క జిల్లాలో సాగవుతున్న ప్రధాన పంటలు(ఎకరాల్లో..) జిల్లాపై ఎల్నినో ప్రభావం అడుగంటిన భూగర్భ జలాలు వట్టిపోతున్న బోరుబావులు నెర్రెలు బారుతున్న భూములు సాగునీరు లేక ఎండిపోతున్న పంటలు రైతులు కొత్త బోర్లు వేస్తున్నా ఫలితం శూన్యం -
వేటు కంటిన్యూ!?
నిజామాబాద్అర్బన్: జిల్లాలో భూ అక్రమాలకు వత్తాసు పలికిన రెవెన్యూ అధికారులపై వేట మొదలైంది. జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల్లో అసైన్డ్, నిషేధిత భూములకు పట్టాలు జారీ చేసిన అక్రమార్కులు మరికొందరు ఉన్నట్లు తెలిసింది. ధరణిలోని లొసుగులను అనుకూలంగా మార్చుకొని కొందరు కాసులు దండుకున్నారు. రాష్ట్రస్థాయిలో విచారణ జరగడంతో జిల్లాలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నందిపేట తహసీల్దార్ సంతోష్రెడ్డిపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేసింది. అక్రమాలు అనేకం.. నందిపేట మండలంలో అనేక అక్రమాలు జరిగినట్లు విచారణలో తేలింది. గతంలో ఓ రెవెన్యూ అధికారి మండల కేంద్రంలోని చెరువు ప్రాంతంలో వెలసిన వెంచర్కు అనుమతులు జారీ చేశారు. ఇందులో ఇరిగేషన్కు సంబంధించిన ఏడు ఎకరాల స్థలం ఉన్నా నాటి రెవెన్యూ అధికారి ఆగమేఘాల మీద అనుమతులు జారీ చేయడం గమనార్హం. ● నందిపేటలో ఓ అధికారి తాను పనిచేస్తున్న కా లంలో 25 ఫైల్స్ను నిబంధనలకు విరుద్ధంగా పూర్తిచేసి ఒక్కో ఫైల్కు రూ. 3 లక్షల చొప్పున వసూలు చేసినట్లు కలెక్టర్ పరిశీలనలో తేలింది. దీంతో ఆ అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఇదే ప్రాంతంలో ఓ రేషన్ డీలర్ మధ్యవర్తిగా ఉంటూ ప్రభుత్వ భూములను పట్టాలుగా మార్చి అధికారులకు లంచాలు ఇస్తూ కోట్లు సంపాదించాడని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఓ మీసేవ కేంద్రం నిర్వాహకుడి హస్తం ఉన్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ఈ వ్యవహారంలో విచారణ కొనసాగుతుంది. ● జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో మూడెకరాల 20 గుంటల ప్రభుత్వ భూమిని ఓ వెంచర్లో కలిపేసుకున్నారు. ఈ వ్యవహారం బయటకు రాకుండా ఇద్దరు తహసీల్దార్లను ఉన్నఫలంగా బదిలీ చేయించారు. ఓ బడా వ్యాపారి వెంచర్లో ఇనాం భూములకు రెవెన్యూ అధికారి ఒకరు భారీ మొత్తంలో లంచాలు తీసుకొని క్లియరెన్స్ జారీ చేసినట్లు ఆరోపణలున్నాయి. ● ధర్మపురి హిల్స్ ప్రాంతంలోని 41 ఎకరాల బొందమ్ చెరువు 19 ఎకరాలకు కుచించుకుపోయింది. ఇక్కడ గుట్టలు, రాళ్లలో సైతం పట్టాలు ఉన్నాయని ఇళ్లు నిర్మించుకున్నారు. ఈ వ్యవహారంలో మాజీ కా ర్పొరేటర్లు ఇద్దరు భారీ మొత్తంలో డబ్బులు వసూ లు చేసి అసైన్డ్ భూములను ప్లాట్లుగా మార్చి విక్ర యించారు. అప్పటి కలెక్టర్ నారాయణరెడ్డి ప్రభు త్వ భూములకు ఫెన్సింగ్ వేయించారు. ఆయన బదిలీ అనంతరం మళ్లీ భూములను కబ్జా చేశారు. ఈ వ్యవహారంలో ఓ ఉన్నతాధికారి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. ● న్యాల్కల్ నుంచి నిజామాబాద్కు వచ్చే ప్రాంతంలో నక్కల వాగు రెండుగా చీలి ప్రవహిస్తుంది. ఇందులో పోచమ్మగల్లి వైపు వచ్చే వాగు ప్రస్తుతం కనుమరుగైంది. ఈ వాగుపై రెండు వెంచర్లు వెలిశాయి. దీనికి సైతం రెవెన్యూ అధికారులు అనుమతులు ఇ చ్చేశారు. ఓ ఉన్నతాధికారి రెండు ప్లాట్లను గిఫ్ట్గా తీ సుకొని అనుమతులు జారీ చేసినట్లు సమాచారం. ● కంఠేశ్వర్ ప్రాంతంలో వాగుకు ఆనుకొని రెవెన్యూ ఉద్యోగి ఒకరు 600 గజాల స్థలాన్ని కబ్జా చేశాడు. పహణీలో వాటి సర్వే నంబర్లను మార్చారని సమాచారం. ఆర్మూర్ రోడ్డులోని ఓ ప్రయివేటు వ్యక్తి స్థలాన్ని నార్త్ తహసీల్ కార్యాలయ ఉద్యోగి ఒకరు పహణీలో మార్పులు చేసి మరొకరికి అనుకూలంగా మార్చినట్లు తెలుస్తోంది. సస్పెన్షన్ల పర్వం.. ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే నందిపేట తహసీల్దార్ సస్పెన్షన్కు గురయ్యారు. ఇదే ప్రాంతంలో మరో ఇద్దరిపై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఇందిరమ్మ ఇళ్లకు సరఫరా చేసే ఇసుకను బయటకు విక్రయించిన మెండోరా ఆర్ఐపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేసింది. పహానీలో మార్పులు చేసిన నార్త్ రూరల్ తహసీల్ కార్యాలయంలోని రికార్డు అసిస్టెంట్ సస్పెండ్ అయ్యారు. ఇలా రెవెన్యూ శాఖలో జరుగుతున్న అక్రమాలు బయటపడుతుండడంతో ఉద్యోగులు సస్పెన్షన్కు గురవుతున్నారు. ప్రస్తుతం ధరణి అంశంలో జరుగుతున్న విచారణతో మరికొందరు రెవెన్యూ అధికారుల అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతోంది. నవీపేట, బోధన్, ఎడపల్లి, ఆర్మూర్, డిచ్పల్లి ప్రాంతాలలో భారీ మొత్తంలో అక్రమాలు జరిగినట్లు సమాచారం. వీటిపై సీసీఎల్ నుంచి త్వరలోనే ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని తెలిసింది. సిరికొండ ప్రాంతంలోని అసైన్డ్ భూము లను ఓ మాజీ ప్రజాప్రతినిధి భర్త ఆక్రమించగా.. సహకరించిన రెవెన్యూ అధికారికి డిచ్పల్లి ప్రాంతంలో ఓ ప్లాట్ను గిఫ్ట్గా ఇచ్చిన ట్లు తెలిసింది. డిచ్పల్లి, నిజామాబాద్ రూరల్, ధ ర్పల్లి, ఇందల్వాయిలో ఎక్కువ మొత్తంలో అ సైన్డ్ భూములను పట్టా భూము లుగా మార్చినట్లు ఆరోపణలున్నాయి. నవీపేట ప్రాంతంలో ఓ ఎకై ్సజ్ కానిస్టేబుల్ 300 గజాల స్థలం కబ్జా చేసి పట్టా పొందినట్లు సమాచారం. సంతోష్రెడ్డిని సర్వీస్ నుంచి తొలగించండి ఇటీవల సస్పెన్షన్ వేటు పడిన నందిపేట తహసీల్దార్ సంతోష్ రెడ్డిని సర్వీస్ నుంచి తొలగించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సీసీఎల్కు ప్రతిపాదించారు. రెవెన్యూ అధికారిగా ఉంటూ ప్రభుత్వ భూములను అక్రమంగా ఇతరులకు కేటాయించడంతోపాటు అనేక అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. బట్టబయలైన భూ అక్రమాలు విచారణలో విస్తుపోయే నిజాలు ప్రభుత్వ భూములకు ఎసరు ఇష్టారాజ్యంగా పట్టాల జారీ రెవెన్యూ అధికారుల మాయాజాలం ఇప్పటికే పలువురిపై చర్యలు ఉపేక్షించే ప్రసక్తే లేదు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఎలాంటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం. ఇది వరకే ఓ తహసీల్దార్పై వేటు పడింది. ప్ర భుత్వ భూముల వివరాలన్నీ రికార్డుల్లో ఉంటాయి. అధికారుల పరిశీలనలోనూ ఉంటాయి. దీంతో ఎవరు అక్రమాలకు పాల్పడినా తెలిసిపోతుంది. – గీత, డీఆర్వో -
ఆస్పత్రిలో అపరిశుభ్రతపై కలెక్టర్ సీరియస్
● కాంట్రాక్ట్ ఏజెన్సీకి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు ● బోధన్ జిల్లా ఆస్పత్రి తనిఖీబోధన్: బోధన్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నెలకొన్న అపరిశుభ్రతపై కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆగ్రహం వ్యక్తంచేశారు. పారిశుద్ధ్య కాంట్రాక్టు ఏజెన్సీకి షోకా జ్ నోటీస్లు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితిలో మార్పు రాకపోతే కాంట్రాక్టును రద్దు చేస్తామని హెచ్చరించారు. పట్టణ కేంద్రంలోని బోధన్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ శుక్రవారం తనిఖీ చేశారు. తాను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తానని, వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. అంకితభావంతో విధులు నిర్వర్తించాలి ఐఐహెచ్ఎఫ్ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్పర్సన్ డాక్టర్ కవితారెడ్డితో కలిసి జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, డీఎంహెచ్వో రాజశ్రీ, ఆర్డీవో విజయకుమారి, వైద్యులతో వైద్య సేవల తీరు, మౌలిక సదుపాయాలపై కలెక్టర్ సమీక్షించారు. మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ బోధన్ ఆస్పత్రిలో ప్రతి నెలా 200 కాన్పులు జరుగుతున్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకొని బర్త్ వెయిటింగ్ రూం ఏర్పాటు చేయాలని సూచించారు. ఆస్పత్రిలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు కోసం జిల్లా పోలీస్ శాఖకు ప్రతిపాదనలు పంపిస్తామని కలెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వాస్పత్రుల పనితీరుపై సమ్మకాన్ని పెంపొందించాలని, వైద్యులు, సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలన్నారు. మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, తహసీల్దార్ విఠల్, వైద్యాధికారులు పాల్గొన్నారు. -
మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
ఆర్మూర్: స్థానిక మున్సిపాలిటీలో ఔట్సోర్సింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ (బీఎల్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ మున్సిపల్ ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ చెల్లింపుల విషయంలో సరైన అవగాహన లేకపోవడంతో నష్టపోతున్నారని వాపోయారు. అనంతరం తమ డి మాండ్లను వివరిస్తూ మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి రఘుతో పాటు మున్సిపల్ కమిషనర్ శ్రీహ రి రాజుకు వేర్వేరుగా వినతిపత్రాలు సమర్పించా రు. ఈ నిరసనలో బీఎల్టీయూ జిల్లా అధ్యక్షుడు కాంబ్లె మధు, బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, యూనియన్ నాయకులు రాజేశ్వర్, శ్రీనివాస్, పాండు, నర్సయ్య, మల్లేష్, రూపే ష్, నాగరాజు, రేఖ, రమేష్ తదితరులున్నారు. -
గ్రామదేవతలకు జలాభిషేకం
● వర్షాలు సమృద్ధిగా కురవాలని పలు గ్రామాల్లో ప్రత్యేక పూజలు ● పలు చోట్ల గోదావరి నుంచి తెచ్చిన గంగ జలాల ఊరేగింపు వర్ని/రుద్రూర్/బోధన్ రూరల్ : వర్ని మండలం జాకోరా, చందూరు మండలం ఘన్పూర్ గ్రామా ల్లో వర్షాలు సమృద్ధిగా కురియాలని గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని కాంక్షిస్తూ గో దావరి నది నుంచి తీసుకువచ్చిన జలాలతో గ్రామదేవతలకు అభిషేకం చేసినట్లు సర్పంచ్లు ముత్తకుంట కృష్ణ, ఫారం సాయిలు వెల్లడించారు. వీడీసీ చైర్మన్ లాలాబోయి, సభ్యులు సాయి గోండా, సంజీవ్, మాజీ సర్పంచ్ గంగారాం, సాయిలు, శేఖర్ పాల్గొన్నారు. రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామదేవతలకు జలాభిషేకం నిర్వహించారు. కందకుర్తి త్రివేణి సంగమం నుంచి పవిత్ర జలాలను తీసుకొచ్చి గ్రామదేవతలకు అభిషేకం, ప్రత్యేక పూ జలు చేశారు. గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పట్ల సురేశ్, మాజీ జెడ్పీటీసీ నరోజి గంగారాం, ద త్తాత్రి, కృష్ణ, కుర్మాజీ గంగారాం, సంతోష్, కృష్ణకాంత్, తదితరులు పాల్గొన్నారు. బోధన్ మండలంలోని కల్దుర్కి, అమ్దాపూర్, ఊట్పల్లి గ్రామాల్లో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ గ్రామస్తు లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెంజల్ మండలంలోని కందకుర్తి పవిత్ర త్రివేణి సంగమం నుంచి గంగజలాలను తీసుకువచ్చి ఆయా గ్రామాల్లోని ఊరేగింపు నిర్వహించారు.కార్యక్రమంలో గ్రామాల ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. నవీపేట: మండలంలోని రాంపూర్ గ్రామంలో వీడీసీ ఆధ్వర్యంలో గ్రామస్తులు శుక్రవారం గోదావరి జలాలతో గ్రామ దేవతలకు అభిషేకం నిర్వహించారు. -
బోధన్లో వైభవంగా జగన్నాథ రథయాత్ర
బోధన్రూరల్ : బోధన్లో శుక్రవారం సేవకుంజ్ భక్త బృందం ఆధ్వర్యంలో జగన్నాథ స్వామి రథయాత్రను వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని రాకాసీపేట్ బస్టాండ్ సమీపంలో సేవకుంజ్ వద్ద రథయాత్రకు మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. జగ న్నాథ స్వామి, బలభద్రుడు, సుబద్రమ్మల ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి ఊరేగించారు. రథయాత్ర పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా, పెద్ద హనుమాన్ మందిరం, కొత్త బస్టాండ్ మీదుగా సాగి టీటీడీ కల్యాణ మండపం వద్ద ముగిసింది. సేవకుంజ్ భక్త బృందం ప్రతినిధులు విఠల్ ప్రభు, వైశాలి మాతాజీ, శ్రీరామ్ ప్రభు, రవి ప్రభు, శ్యామ్ ప్రభు, మాధవి, వాణి, శాంతి, జనివాస్ దాస్ ప్రభుజీ, గౌర్ గోపాల్ దాస్, మహిళా భక్తులు, యువకులు, చిన్నారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పట్టణ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఘనంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవం
బోధన్: బోధన్కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. న్యాయవాదుల చాంబర్లో సమావేశం నిర్వహించారు. సీనియర్ న్యాయవాదులు మారుతిరావు ఖన్నా, మధుసింగ్లను ఘనంగా సన్మానించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వీఆర్ దేశాయ్,ప్రతినిధులు విద్యాసాగర్, మాధవీలత,న్యాయవాదులు పాల్గొన్నారు. వర్ని లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ ఎన్నిక వర్ని: వర్ని లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా సత్యనారాయణపురం గ్రామానికి చెందిన నూనె శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వర్ని మండల కేంద్రంలో శుక్రవారం నూతన కమిటీ ఎన్నిక జరిగింది. కార్యదర్శిగా వెంకటేశం, కోశాధికారిగా రెడ్డి చౌదరి, కార్యవర్గ సభ్యులుగా నగేష్, ఠాగూర్, శివ నాగేశ్వరరావు, పీవీ సుబ్బారావు, శ్రీమన్నారాయణలను ఎన్నుకున్నారు. ఫ్రె ౖడే డ్రై డే పాటించాలి కమ్మర్పల్లి(భీమ్గల్): వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని భీమ్గల్ ఎంపీడీవో సంతోష్ కుమార్ అన్నారు. మండలంలోని పల్లికొండలో ఫ్రై డే డ్రై డే కార్యక్రమంలో పాల్గొని గ్రామంలో రోడ్లను, మురికి కాలువలను పరిశీలించారు. పిచ్చి మొక్కలు తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. సిబ్బంది ఉన్నారు. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకునేలా అవగాహన కల్పించాలన్నారు. -
భూమిని తిరిగి ఇప్పించండి
ఆర్మూర్: ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామానికి చెందిన తన భూమిని పలువురు ఆక్రమించుకున్నందున ఆ భూమిని తిరిగి తనకు ఇప్పించాలని బాధితురాలు ఎర్రవ్వ గ్రామస్తులతో కలిసి ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, ఆర్మూర్ తహసీల్దార్ సత్యనారాయణకు శుక్రవారం వేర్వేరుగా వినతి పత్రాలు సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం జోగినీ వ్యవస్థను రూపు మాపడంలో భాగంగా ఎర్రవ్వకు పునరావాసం కల్పిస్తూ గ్రామ శివారులో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 1.18 గుంటల భూమిని కేటాయించారని వివరించారు. ఈ భూమిలో గుట్ట ఉండటంతో కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా కబ్జా చేసి బోరు వేసి ధోబీ ఘాట్ను సైతం నిర్మించారని బాధితురాలు వాపోయింది. పూర్తి స్థాయి విచారణ జరిపి తన భూమిని తనకు ఇప్పించాలని అధికారులకు విన్నవించింది. -
ముత్తూట్ ఫిన్కార్ప్ ‘గ్రామోత్సవ్’ ప్రారంభం
నిజామాబాద్ అర్బన్: గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల ప్రజలకు ఆర్థిక సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ముత్తూట్ ఫిన్కార్ప్ లిమిటెడ్ ‘గ్రామోత్సవ్’ పేరుతో వినూత్న కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ వేదికను ప్రారంభించింది. తొలి గ్రామోత్సవ్ను శుక్రవారం కంఠేశ్వర్లోని లక్ష్మి కల్యాణ మండపంలో నిర్వహించారు. కార్యక్రమంలో ము త్తూట్ ఫిన్కార్ప్ అందిస్తున్న 24 రకాల ఆర్థిక ఉత్పత్తులు, సేవలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకొచ్చారు. ముత్తూట్ ఫిన్కార్ప్ సీఈవో షాజీ వర్గీస్ మాట్లాడుతూ.. వినియోగదారులతో సంస్థకు ఉన్న విశ్వాస బంధాన్ని మరింత బలోపేతం చేయడమే గ్రామోత్సవ్ ప్రధాన ఉద్దేశమన్నారు. ఆర్థిక సేవలు కేవలం లావాదేవీలకే పరిమితం కాకుండా, ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా, అందుబాటులో ఉండేలా చేయాలన్నదే తమ లక్ష్యమని అన్నా రు. జిల్లాలో సంస్థకు ఇప్పటికే ఐదు శాఖలు, తెలంగాణ వ్యాప్తంగా 200కు పైగా శాఖలు ఉండటంతో తొలి గ్రామోత్సవ్ నిర్వహణకు ఈ నగరాన్ని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. అర్హులైన విని యోగదారులకు కార్యక్రమం వేదికపైనే రుణాల మంజూరుపై నిర్ణయం వెల్లడించారు. అనంతరం నగర మేయర్ ఉమారాణి మాట్లాడుతూ.. ముత్తూ ట్ అందిస్తున్న సేవలు ఎంతో బాగున్నాయన్నాని అన్నారు. కార్యక్రమంలో ముత్తూట్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలి
కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ పట్టణంలో ప్రజలు తమ ఇంటి వద్ద ఇంకుడు గుంతలను నిర్మించుకో వాలని మున్సిపల్ కమిషనర్ గజానంద్ పేర్కొన్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభు త్వం సీడీఎంఏ ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్లో ‘జలశక్తి అభియాన్, జనభాగీ దారి ‘జేఎస్జేబీ–3.0 లో భాగంగా క్యాచ్ ది రెయిన్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇంకుడు గుంతలను నిర్మించి భూగర్భ జలాలను పెంపొందించడంలో తమ వంతు సహకారం అందించాలని కోరారు. అనంతరం విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. పాఠశాలలో ఫ్రై డే డ్రైడే సందర్భంగా బ్లీచింగ్ చల్లడంతో పాటు, దోమల మందు స్ప్రే చేశారు. ఎంఈవో స్వామి, మున్సిపల్ మేనేజర్ నరేందర్, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. -
నిజాంసాగర్ నీటిని వెంటనే విడుదల చేయాలి
రుద్రూర్: జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులను ఆదుకునేందుకు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి వెంటనే సాగునీటిని విడుదల చే యాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు కోటగిరి తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, తహసీల్దార్ గంగాధర్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా బీజేపీ కోటగిరి మండల అధ్యక్షుడు ఏముల నవీన్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో సాగునీటి పరిస్థితిపై ఇరిగేషన్ శాఖ అధికారులతో తక్షణమే సమీక్షా సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశా రు. కోటగిరి మండలంతో పాటు బాన్సువాడ ని యోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆశించిన మేర వర్షాలు కురవక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని, ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు కార్యాచరణ రూపొందించి రైతులకు భరోసా కల్పించాలని కోరారు. ధర్నాలో నియోజకవర్గ సీనియర్ నాయకులు మార్కెల్లి ప్రకాష్ పటేల్, పైడిమల్ లక్ష్మీనారాయణ, జిల్లా కౌన్సిల్ సభ్యుడు సున్నం సాయిలు, గూడూరి ప్రశాంత్ గౌడ్, పుల్లెల మోహన్రావు, హౌగిరిరావు దేశాయ్, పార్వతి మురళి, మహిళా మోర్చా జిల్లా నాయకురాలు కులకర్ణి శ్యామల, శ్యామ్, వెంకటేష్, ఏముల గజేందర్, కుర్లెపు గంగాధర్, వడ్ల శ్యామ్, తిరుమలాపూర్ విజయ్, మక్కయ్యతో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మత్స్యకారులకు అవగాహన సదస్సు
వేల్పూర్(మెండోరా): మెండోరా మండలం శ్రీరాంసాగర్ జాతీయ చేపల ఉత్సత్తి కేంద్రం వద్ద మత్స్యకారులకు శుక్రవారం జిల్లా ఏడీఏ నాగులు, ఎఫ్డీవో దామోదర్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. మత్స్యకారులు చేపల వేటలో ఉపయోగించే పనిముట్లను వివరించారు. శ్రీరాంసాగర్ పరిధిలో సుమారు 2 వేల మంది చేపలు పట్టే వృత్తిపై ఆధారపడి ఉన్నందున వృత్తి పనిముట్లు సకాలంలో అందించాలని జిల్లా గంగపుత్ర నాయకుడు సోన్ నారాయణ అధికారులను కోరారు. సమావేశంలో ఎస్సారెస్పీ పరిధి మత్స్యకారులు పాల్గొన్నారు. వృద్ధులు, దివ్యాంగుల సర్ కు కౌన్సిలర్ల సహాయం ఆర్మూర్: ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా చేపట్టిన సర్లో ఎన్యుమరేషన్ ఫారాలను నింపడానికి ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, దివ్యాంగులకు కౌన్సిలర్లు సహాయం చేస్తున్నారు. పట్టణంలోని 34, 33, 13వ వా ర్డుల్లో కౌన్సిలర్లు నర్మె నవీన్, రాణి సుమన్, కొ డిగెల మల్లయ్యలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల ఎ న్యుమరేషన్ ఫారాలను నింపి తిరిగి ఇచ్చారు. వందశాతం సర్ పూర్తి చేయించాలి కమ్మర్పల్లి(భీమ్గల్): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) వందశాతం పూర్తి చేయించాలని డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. భీమ్గల్ పట్టణంలో శుక్రవారం ఎస్ఐఆర్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. బీఎల్ఏలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలతో మాట్లాడి సర్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భీమ్గల్ వెనుకబడి ఉందని పార్టీ శ్రేణులు వేగవంతం చేయాలని సూచించారు. మండలాధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, టౌన్ ప్రెసిడెంట్ అనంత్రావు, జిల్లా ఉపాధ్యక్షుడు రత్నాకర్గౌడ్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు జనార్దన్, నాయకులు కన్నె సురేందర్, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ గ్రామశాఖ కార్యవర్గం ఎన్నిక కమ్మర్పల్లి: కమ్మర్పల్లి మండలం హాసాకొ త్తూర్లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ నూతన కార్యవర్గాన్ని గ్రామశాఖ అధ్యక్షుడు ఎడ్ల శ్రీకాంత్ అధ్యక్షతన ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా చిన్నవేళ శ్రీనివాస్, కార్యదర్శిగా ఎదుల రాజు, కోశాధికారిగా రాదారపు సాయ న్న, కార్యదర్శిగా శేఖర్, ప్రధాన సలహాదారులుగా సీహెచ్. గంగాధర్, మేడం రమేశ్, కనక గంగన్నలను ఎన్నుకున్నారు. ఉప సర్పంచ్ల ఫోరం చేయూత కమ్మర్పల్లి(మోర్తాడ్): గుండెపోటుతో ఇటీవల మరణించిన ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ సర్పంచ్ బెజ్జారం పావని కుటుంబానికి జిల్లా ఉప సర్పంచ్ల ఫోరం చేయూత అందించింది. శుక్రవారం ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బోట్ల కార్తీక్ జిల్లాలోని పలు గ్రామాల ఉప సర్పంచ్లతో క లిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఫోరం తరపున రూ. 31 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షు డు ఇస్సాపల్లి మహేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మూడ్ దయానంద్, ఏర్గట్ల అధ్యక్షుడు ఆశిరెడ్డి హన్మంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జానకంపేటలో బాధిత కుటుంబానికి.. బోధన్: ఎడపల్లి మండలం జానకంపేటలో నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడు పోచమ్మల సాయిలు(34) పాముకాటుకు గురై గురువారం మృతి చెందిన విష యం తెలిసిందే. సాయిలు కుటుంబానికి 50 కిలో బియ్యం,ఇతర నిత్యావసర సరుకులు,కొంత నగదును గ్రామ యువకులు చేయుత అందించారు. -
షేర్వాల్ టెక్నాలజీతో పీఎస్ నిర్మాణం
● రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మోపాల్: ఆధునిక నిర్మాణ రంగంలో వేగం, నాణ్యత, భద్రతకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో షేర్వాల్ టెక్నాలజీని విస్తృతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి పేర్కొన్నారు. గురువారం మోపాల్ మండల కేంద్రంలో షేర్ వాల్ టెక్నాలజీతో నిర్మిస్తున్న నూతన పోలీస్స్టేషన్ భవన నిర్మాణ పనులను సీఐ సురేశ్, ఎస్సై సుస్మిత, కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. నిర్మాణ పురోగతిని సంబంధిత అధికారులు, ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కూడా షేర్వాల్ టెక్నాలజీని అమలు చేసే అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆయన వెంట రాష్ట్ర కల్లు గీత కార్మిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్గౌడ్, నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, నాయకులు మునిపల్లి సాయిరెడ్డి, ఎల్లోల్ల సాయిరెడ్డి, బోర్గాం శ్రీనివాస్, జలంధర్రెడ్డి, గంగాప్రసా ద్, మండల అధ్యక్షుడు రవి, సొసైటీ చైర్మన్లు మోహన్రెడ్డి, గంగారెడ్డి, ప్రతాప్ తదితరులు ఉన్నారు. -
క్రైం కార్నర్
మద్యానికి బానిసై ఒకరి మృతి నిజామాబాద్ అర్బన్: నగరంలో రెండో టౌన్ పీఎస్ పరిధిలో కూలి పనులు చేసే ఇట్టికుమార్ (36) అనే వ్యక్తి మద్యానికి బానిసై మృతిచెందినట్లు ఎస్సై యాదగిరి గురువారం తెలిపారు. అధికంగా మద్యం సేవించడం వల్లే మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పాముకాటుతో యువకుడు..బోధన్: ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామంలో పాముకాటుకు గురైన ఓ యువకుడు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జానకంపేట గ్రామానికి చెందిన పోచమ్మల సాయిలు(34)తన పూరి గుడిసెలో నిద్రిస్తుండగా మంగళవారం రాత్రి పాము కాటు వేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను జిల్లా ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.పిచ్చికుక్క దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలు నిజామాబాద్ అర్బన్: నగరంలోని సాయినగర్లో గురువారం సాయంత్రం పిచ్చికుక్క చిన్నారులపై తీవ్రంగా గాయపరిచింది. ఇంటి ఎదుట ఆడుకుంటున్న చిన్నారులపై అకస్మాతుగా వచ్చి దాడిచేసింది. చిన్నారులు అశ్విత, మనస్విలకు తీవ్రగాయాలు కాగా మరో బాలికకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు, కుటుంబీకులు చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. కాలనీలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని స్థానిక కార్పొరేటర్కు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని చిన్నారుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. అధికారులు స్పందించి కాలనీలో నెలకొన్న కుక్కల సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. -
ప్రారంభమైన బీఈడీ, బీపీఈడీ పరీక్షలు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో బీఈడీ 2వ సెమిస్టర్ రెగ్యులర్, బీపీఈడీ 1, 2, 3, 4వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం నిర్వహించిన పరీక్షలకు 95 మందికి 75 మంది హాజరు కాగా 19 మంది గైర్హాజరైనట్లు అకాడమిక్ ఆడిట్సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఆర్మూర్ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో మాల్ప్రాక్టీస్కు పాల్పడిన ఒక విద్యార్థి డిబార్ అయినట్లు పేర్కొన్నారు. మధ్యా హ్నం నిర్వహించిన పరీక్షలకు 36 మందికి 31 మంది హాజరు కాగా ఐదుగురు గైర్హాజరయ్యారు. కొనసాగుతున్న ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం..తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగినట్లు అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం నిర్వహించిన పరీక్షలకు 28 మందికి 26మంది హాజరు కాగా ఇద్దరు గైర్హాజరు కాగా మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలకు ముగ్గురు విద్యార్థులకు ముగ్గురు హాజరైనట్లు తెలిపారు. దేశాభివృద్ధిలో యువత నైపుణ్యత కీలకంతెయూ(డిచ్పల్లి): దేశాభివృద్ధిలో యువత నైపుణ్యాలే కీలక పాత్ర పోషిస్తాయని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరి పేర్కొన్నారు. ప్రపంచ యువాన్ నైపుణ్య దినోత్సవం సందర్భంగా తెయూ ఎన్ఎస్ఎస్ యూనిట్1 ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు రిజిస్ట్రార్ బహుమతులు అందజేశారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధి కీలకమని తెలిపారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ అపర్ణ, విద్యార్థులు మనోహర్, శేఖర్, సౌమ్య తదితరులు పాల్గొన్నారు. సమష్టి కృషితోనే సంస్థ విజయండిచ్పల్లి(తెయూ): ఉద్యోగుల సమష్టి కృషి, నాయకత్వం, సవాళ్లను ఎదుర్కొనే విధానం, సత్వర నిర్ణయాల ప్రక్రియతోనే వ్యాపార సంస్థలు విజయం సాధిస్తాయని తెయూ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ ఆంజనేయులు పేర్కొన్నారు. మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో గురువారం ‘ఏ జర్నీ ఆఫ్ బిజినెస్’ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేట్ ప్రపంచంలోని వాస్తవ పరిస్థితులను మేనేజ్మెంట్ విద్యార్థులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులుగా బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు సాహిల్ అవేజ్, సమత, మహేశ్ వ్యవహరించారు. -
రైల్వే భద్రతపై అవగాహన
ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు గురువారం నిజామాబాద్ రైల్వే పోలీస్ ప్రొటెక్షన్ ఏఎస్సై డెబ్బర్మ ఆధ్వర్యంలో రైల్వే భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రామ్మోహన్రెడ్డి, ఆర్పీఎఫ్ ఏఎస్సై డెబ్బర్మ మాట్లాడుతూ.. సరైన అవగాహన కలిగి ఉంటే ప్రమాదాలు, సమస్యలను అధిగమించవచ్చని అన్నారు. రైల్వే ప్రాంగణంలో, ట్రాక్ ప్రాంతంలో, ప్లాట్ఫారంలపై నిర్లక్ష్యంగా ఉండకూడదన్నారు. రైలు కదులుతున్నప్పుడు ఎక్కడం, దిగడం, డోర్ దగ్గర నిలబడి ప్రయాణం చేయరాదని, ఏదైనా అక్రమ రవాణాలు, దొంగతనాలు గమనిస్తే వెంటనే రైల్వే పోలీస్ ప్రొటెక్షన్ కి సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం, రమేశ్ గౌడ్, వినయకుమార్, దండు స్వామి, రామస్వామి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రశాంత్ రెడ్డిది దొంగ నిరాహార దీక్ష
● బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదు ● జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్రెడ్డి నిజామాబాద్ రూరల్: ప్రజల్లో తన ఉనికిని కాపాడుకోడానికి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దొంగ నిరాహార దీక్ష చేస్తున్నాడని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని కాంగ్రెస్ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2022లో భీంగల్ పట్టణంలో రూ. 35 కోట్లతో వంద పడకల ఆస్పత్రికి ఫౌండేషన్ వేసినప్పుడు మూడు నెలల్లో నిర్మిస్తామని చెప్పి 18 మాసాలు నత్త నడకన సాగించి చివరకు రూ. 17 కోట్ల పనులు మాత్రమే చేశారన్నారు. అలాగే భీంగల్లో రోడ్ల నిర్మాణానికి రూ. 25 కోట్లు మంజూరు కాగా రూ. 17 కోట్ల మేరకే పనులు జరిగాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పని చేసిన ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్లో నూతన సచివాలయ నిర్మాణానికి రూ. 500 కోట్లు అంచనా పెట్టుకొని మరో రూ. 500 కోట్లు అదనంగా మంజూరు చేయించుకొని ప్రజాధనాన్ని కొల్లగొట్టారని అన్నారు. తొమ్మిది మాసాల్లో నిర్మించిన సచివాలయాన్ని, నియోజకవర్గంలోని అభివృద్ధి పనులను ఎందుకు పూర్తి చేయాలని ఆయన ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండి పడ్డారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిప్ప 20, 21 ప్యాకేజ్ పనులకు గతంలో మంత్రిగా ఉన్న సుదర్శన్రెడ్డి రూ.9వేల500 కోట్లు ఖర్చు చేశారని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టును రైతులకు ఉపయోగం లేకుండా చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రత్నాకర్ గౌడ్, గాదరి గోపి, కోశాధికారి భక్త వత్సలం, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు యాదగిరి, జావీద్ అక్రం, లింగన్న, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, బీసీ సెల్ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, బాల నర్సయ్య, ర వి, గణేశ్, పూర్ణ చందర్, కిష్టా గౌడ్ పాల్గొన్నారు. -
తప్పిపోయిన బాలుడి అప్పగింత
భిక్కనూరు: తప్పిపోయిన బాలుడి ఆచూకిని పోలీసులు రెండు గంటల్లో కనుగొని తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన భిక్కనూరు మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రం సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన కమ్మరిపల్లి రుత్విక్ అనే పదేళ్ల విద్యార్థి ఇటీవల ఐదో తరగతిలో ప్రవేశం పొందాడు. రుత్విక్ మధ్యాహ్నం 12 గంటలకు పాఠశాలలో కనిపించకపోవడంతో ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ నరేశ్ ఎస్పీ రాజేశ్ చంద్రకు సమాచారం అందించాడు. ఎస్పీ ఆదేశాలతో కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో భిక్కనూరు సీఐ నరేశ్ రెండు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి బాలుడి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రెండు గంట ప్రాంతంలో పెద్ద మల్లారెడ్డి వెళ్లే రోడ్డులో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల క్రీడామైదానంలో రుత్విక్ ఒంటరిగా ఉండటాన్ని పోలీసులు గుర్తించి పీఎస్కు తీసుకొచ్చారు. ప్రిన్సిపాల్ రఘుతో పాటు రుత్విక్ తండ్రి రాజును పోలీస్ స్టేషన్కు పిలిపించి బాలుడిని అప్పగించారు. -
చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమం
బాన్సువాడ: తండ్రితో కలిసి నిద్రించిన ఓ ఏడు నెలల చిన్నారిని రాత్రి కొందరు అపహరించి బ్లేడ్తో దాడి చేసి పొదల్లో పడేశారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఘటనకు సంబంధించిన వివరాలిలా.. బీర్కూర్ మండల కేంద్రంలోని ఇందిరా కాలనీకి చెందిన టేకు సతీశ్, సంధ్య దంపతులు. వీరికి 7 నెలల చిన్నారి వైష్ణవి ఉంది. ఈ నెల 14న రాత్రి సతీశ్ కుమార్తెతో కలిసి రాత్రి 7.30 గంటలకు ఆరుబయట నిద్రించారు. రాత్రి 8 గంటల సమయంలో సతీశ్ నిద్ర లేచి చూసే సరికి చిన్నారి కనిపించకపోవడంతో ఇంట్లో తల్లి వద్ద నిద్రిస్తుందేమోనని అలాగే పడుకున్నాడు. తెల్లవారుజాము 5 గంటల సమయంలో నిద్రలేచిన సతీశ్ చిన్నారి కోసం ఇంట్లోకి వెళ్లి చూడగా కనిపించలేదు. దీంతో భార్య శైలజ, తల్లిని అడిగాడు. తమ వద్ద లేదని చెప్పడంతో ముగ్గురి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం కాలనీలో వెతుకుతుండగా గోసంగి సంఘం భవనం వద్ద ఉన్న పొదల్లో వైష్ణవి స్పృహ కోల్పోయి కనిపించింది. వైష్ణవి ఒంటిపై బ్లేడ్తో కోసిన గాయాలు ఉండడంతో వెంటనే బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిజామాబాద్కు తరలించారు. 48 గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. సతీశ్కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య శైలజ, రెండో భార్య సంధ్య ఇద్దరూ సొంత అక్కాచెల్లెళ్లు. మొదటి భార్య శైలజకు ముగ్గురు కుమార్తెలు, సంధ్యకు వైష్ణవి ఒక్క కుమార్తెనే ఉన్నారు. అక్కాచెల్లెళ్లు ఐదు నెలక్రితం భర్త సతీశ్తో గొడవ పడ్డారు. తర్వాత సంధ్య పుట్టింటికి వెళ్లిపోయింది. చిన్నారి వైష్ణవి మాత్రం తండ్రి సతీశ్ వద్దే ఉంటోంది. కాగా తన కుమార్తైపె బ్లేడ్తో దాడి చేసింది శైలజ అంటు తల్లి సంధ్య పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బీర్కూర్ పోలీసులు తెలిపారు. -
డ్రగ్ ఫ్రీ తెలంగాణకు విద్యార్థులు తోడ్పడాలి
రుద్రూర్: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటేనే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఈగల్ ఫోర్స్ డీఎస్పీ ఎం సోమనాథం అన్నారు. రుద్రూర్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల (సీఎఫ్ఎస్టీ)లో గురువారం ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఎం సోమనాథం, బోధన్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తి ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజం తీవ్రంగా నష్టపోతాయని తెలిపారు. నార్కోటిక్, సైకోట్రోపిక్ పదార్థాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డ్రగ్స్కు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే 1908 టోల్ఫ్రీ హెల్ప్లైన్ లేదా 8712671111 వాట్సాప్ నంబర్కు తెలియజేయాలని సూచించారు. ‘డ్రగ్ ఫ్రీ తెలంగాణ’ లక్ష్య సాధనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం డ్రగ్స్ వ్యతిరేక అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రిన్సిపాల్ వెంకట్రెడ్డి, రుద్రూర్ సీఐ కృష్ణ, ఎస్సై మనోజ్కుమార్, ఈగల్ ఫోర్స్ ఆర్ఎసీసీఇన్్స్పెక్టర్ ఏ పూర్ణేశ్వర్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
నిజామాబాద్ అర్బన్: ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. రక్షిత మంచినీటి సరఫరా, వాతావరణ పరిస్థితులు, సీజనల్ వ్యాధులు, ప్రజాపాలన తదితర అంశాలపై గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పై అంశాలకు సంబంధించి నెలకొన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ సంబంధిత జిల్లా అధికారులతో సమావేశమై కీలక సూచనలు చేశారు. ఎల్నినో కారణంగా వర్షాభావ పరిస్థితుల్లో వరి సాగు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని రైతులు ప్రత్యామ్నాయంగా కంది, సజ్జ, కొర్రలు, కూరగాయలు వంటి పంటలు పండించేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వీసీలో అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రెయినీ కలెక్టర్ సురేశ్, అధికారులు పాల్గొన్నారు. విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపర్చాలి నందిపేట్: కేజీబీవీలో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు నాణ్యతతో అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులు, ఉపాధ్యాయులను ఆదేశించారు. నందిపేట మండల కేంద్రంలోని కేజీబీవీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల నిర్వహణ, విద్యాబోధన, వసతి, భోజన ఏర్పాట్లు విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలను సమగ్రంగా పరిశీలించారు. కేజీబీవీలోని 7వ తరగతి గదికి వెళ్లి విద్యార్థి నులతో మాట్లాడారు. పలు ప్రశ్నలు వేసి విద్యార్థినుల అభ్యాసన సామర్థ్యాన్ని అంచనా వేశారు. అనంతరం విద్యార్థినులకు చాక్లెట్లు, బహుమతులను అందజేశారు. ఎంపీడీవో శ్రీనివాసరావు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ శాంతికుమారి ఉన్నారు. తహసీల్దార్, సిబ్బందిపై ఆగ్రహం ప్రభుత్వ స్థలాలు, అసైన్డ్ భూములు కబ్జాకు, అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదేనని కలెక్టర్ అన్నారు. నందిపేట తహసీల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. లోపాలను గుర్తించి తహసీల్దార్, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, అక్రమాలకు తావు కల్పించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియ ఉన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి -
కేజీబీవీ, భవిత కేంద్రాలను పూర్తి చేయాలి
నిజామాబాద్ అర్బన్: ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఉద్ధేశించిన భవిత సెంటర్ల నిర్మాణా లు, మరమ్మతుల పనులను, కస్తూర్బా విద్యాల యాల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయించాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. త్వరితగతిన అన్ని కేంద్రాలు అందుబాటులోకి వచ్చేలా కృషి చేయాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం భవిత సెంటర్లు, కేజీబీవీ నిర్మాణాలు, పీఎంశ్రీ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాగునీటి సమస్య తలెత్తొద్దు.. జిల్లాలో ఎక్కడా కూడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని, పైప్ లైన్ లీకేజీలు లేకుండా, తాగునీరు కలుషితం కాకుండా చూడాల న్నారు. ప్రతి నివాస ప్రాంతంలో చివరి వరకు తాగునీరు సరఫరా జరిగేలా పకడ్బందీ పర్య వేక్షణ చేయాలని సూచించారు అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, డీఈవో అశోక్, ఇంజినీరింగ్ విభాగం ఈఈ రవీందర్, ఏఈ ఉదయ్కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
తెయూలో హైడ్రామా
నిజామాబాద్ప్రశాంత్రెడ్డిది.. ఉనికిని కాపాడుకోవడానికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దొంగ నిరాహార దీక్ష చేశాడని డీసీసీ అధ్యక్షుడు నగేశ్రెడ్డి విమర్శించారు. శుక్రవారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2026– 8లో uతెయూ(డిచ్పల్లి) : తెలంగాణ యూనివర్సిటీ రి జిస్ట్రార్ ఎం యాదగిరి తన పదవికి రాజీనామా వ్య వహారంతో క్యాంపస్లో హైడ్రామా నెలకొంది. బు ధవారం సాయంత్రం నుంచి రాజీనామా అంశం ఉ మ్మడి నిజామాబాద్ జిల్లాలో వైరల్గా మారింది. గు రువారం మధ్యాహ్నం రిజిస్ట్రార్ రాజీనామాను వీసీ యాదగిరిరావు తిరస్కరించడం, తిరిగి కొనసాగాల ని బుజ్జగించడంతో డ్రామాకు తెరపడింది. 2024 జూన్ 16 నుంచి రిజిస్ట్రార్గా యాదగిరి బా ధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పదవీ కాలం ముగిసినప్పటికీ రిజిస్ట్రార్గా యాదగిరినే వీసీ కొనసాగింపజేస్తున్నారు. ఈ విషయంలో పలువురు అధ్యాపకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఆయన పదవి నుంచి తప్పుకుంటే తమలో ఒకరికి రిజిస్ట్రార్గా అ వకాశం వస్తుందని చాలా కాలంగా ఆశావహులు ఎ దురు చూస్తున్నారు. పరిపాలనా సామర్థ్యం యాదగిరికే ఉందని నమ్ముతున్న వీసీ.. ఆయననే కొనసాగింపజేయడం ఆశావహులను మరింత అసహనాని కి గురిచేస్తోందని చెప్పొచ్చు. ప్రధానంగా 2014లో నియమితులైన అధ్యాపకుల పదోన్నతుల అంశం నేపథ్యంలో రిజిస్ట్రార్ను తక్షణమే తొలగించాలనే డిమాండ్ కొంతకాలంగా వినిపిస్తోంది. ప్రస్తుత రి జిస్ట్రార్ను తొలగించి వర్సిటీలోని సీనియర్ అధ్యాపకులలో ఒకరికి పదవి కట్టబెట్టాలనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. రాజీనామాను తిరస్కరించిన వీసీ గురువారం ఉదయం వర్సిటీకి వచ్చిన వీసీ యాదగిరిరావు చేతికి రిజిస్ట్రార్ రాజీనామా లేఖ అందింది. వెంటనే ఆయన యాదగిరికి ఫోన్ చేసి తన చాంబర్కు పిలిపించుకున్నారు. రాజీనామాను తాను ఆ మోదించడం లేదని రిజిస్ట్రార్గా కొనసాగాలని బు జ్జగించారు. వర్సిటీ అభివృద్ధి కోసం, పరిపాలన పారదర్శకంగా, సాఫీగా సాగడానికి మీ సేవలు అ వసరమని కోరారు. దీంతో యాదగిరి తన రాజీనామాను ఉపసంహరించుకుని మధ్యాహ్నం నుంచి విధుల్లో కొనసాగారు.ఇంకెన్నాళ్లు రిజిస్ట్రార్గా కొనసాగుతారు..రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య బుధవారం యూనివర్సిటీని సందర్శించిన స మయంలో ఆయన ఎదుటే కొందరు ఇంకెన్నా ళ్లు రిజిస్ట్రార్గా కొనసాగుతారని యాదగిరిని ప్రశ్నించారు. ప్రొఫెసర్ కనకయ్యను తొలగించి తనను ప్రభుత్వం రిజిస్ట్రార్గా నియమించిందని, ప్రస్తుత వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు బా ధ్యతలు చేపట్టిన తర్వాత తనను రిజిస్ట్రార్ పద వి నుంచి తొలగించాలని పలుసార్లు కోరినా ఆ యన స్పందించలేదని యాదగిరి పేర్కొన్నారు. తనకు కనకయ్యతో వ్యక్తిగత వైరం లేదని, ఇ దంతా పొజిషన్ కోసమేనని, ఇప్పటికైనా తన ను తొలగిస్తే పాఠాలు చెప్పుకుంటానని అన్నా రు. అడగకుండానే వచ్చి కుర్చీలో కూర్చున్నా వా అంటూ.. యాదగిరిని కనకయ్య నిలదీశా రు. ఇందుకు సంబంధించిన వీడియో బుధవా రం మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో వై రల్ అవుతోంది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, వీ సీతోపాటు 2014 నియామక అధ్యాపకులు, జి ల్లాకు చెందిన ఎస్సీ, ఎస్టీ నాయకుల ఎదుటే త నను పలువురు నిలదీయడంతో రిజిస్ట్రార్ మా నసిక వేదనకు, తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలిసింది. దీంతో అదేరోజు సాయంత్రం 5.30గంటల కు తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణ యించుకున్నారు. అప్పటికే వీసీ తన వెళ్లిపోవడంతో రాజీనామా లేఖను వీసీ పీఏకు అందజేసి వెళ్లిపోయారు. రిజిస్ట్రార్ యాదగిరి తన పదవికి రాజీనామా చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ పదవి కోసం వర్సిటీలోని కొందరు సీనియర్ ప్రొఫెసర్లు పైరవీలు మొదలెట్టారు. ఇద్దరు ముగ్గురు ప్రొఫెసర్లు గురువారం ఉదయం వర్సిటీకి వచ్చి తనకే రిజిస్ట్రార్ పదవి ఖాయమని పలువురితో చెప్పుకున్నట్లు సమాచారం. అయితే మధ్యాహ్నానికి సీన్ రివర్స్ కావడంతో అందరూ తెల్లముఖం వేశారు. తిరిగి రిజిస్ట్రార్గా యాదగిరి బాధ్యతల్లో కొనసాగడంతో కక్కలేక మింగలేక మిన్నకుండిపోయారు. రిజిస్ట్రార్ యాదగిరి రాజీనామా బుజ్జగించిన వీసీ యాదగిరిరావు తిరిగి విధుల్లో యథావిధిగా కొనసాగింపు ఆశావహుల్లో తీవ్ర అసహనం -
పాత డిజైన్ ప్రకారమే మంచిప్ప
మోపాల్(నిజామాబాద్రూరల్) : రైతులకు త క్కువ వ్యయంతో శాశ్వత సాగునీరు అందించడ మే ప్రభుత్వ లక్ష్యమని, మంచిప్ప–కొండెం చె రువు ప్రాజెక్టును పాత డిజైన్ ప్రకారమే పూర్తి చే యాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్రెడ్డి తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డితో కలిసి మండలంలోని మంచిప్పలో ఉన్న కొండెం చెరువు ప్రాంతాన్ని సందర్శించిన సుదర్శన్రెడ్డి.. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్ మ్యాప్తోపాటు పనులను పరిశీలించారు. అనంతరం అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులతో పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ త కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు రైతులతో సమావేశం ఏర్పా టు చేసి, వారి సలహా మేరకే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రూపకల్పన చేశామన్నారు. రూ. 900 కోట్లతో నవీపేట్ మండలం బినోల నుంచి సారంగాపూర్ వరకు 20 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి చేసి మోటార్లు బిగించి ట్రయల్ రన్ చేపట్టామని గుర్తుచేశారు. సారంగాపూర్ నుంచి మంచిప్ప వరకు అవసరం మేరకు మరో 9 కిలోమీటర్ల టన్నెల్, పంప్హౌజ్, ఇతర పనులకు రూ.1200 కోట్ల అంచనా వ్యయంతో 85 శాతం పనులు పూర్తి చేశామన్నారు. కేవలం రూ.300 కోట్లు ఖర్చు చేస్తే రైతులకు సాగునీరు, కామారెడ్డికి తాగునీరు అందేదని తెలిపారు. ఆ తర్వాత స్వార్థపరుల ప్రభుత్వం ఏర్పడి కమీషన్ల కోసం ప్రాజెక్టును రీ డిజైన్ చేసి అంచనా వ్యయాన్ని రూ.3వేల కోట్ల భారీ మొత్తానికి పెంచేశారని ఆ రోపించారు. రూ.1800 కోట్లు ఖర్చు చేసి ఒక్క గుంటకు కూడా నీరందించలేకపోయారని, అ యినా సిగ్గు లేకుండా కొందరు నాయకులు మా ట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నివేదిక వచ్చాక సీఎంను కలుస్తాం తక్కువ ఖర్చుతో పాత డిజైన్ ప్రకారమే పనులు చేపట్టాలని నిర్ణయానికి వచ్చామని, ఇందుకో సం అవసరమైన నిధులు, సాంకేతిక ప్రణాళిక ను రూపొందించి నివేదించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించామని రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపతిరెడ్డి తెలిపారు. నివేదిక వచ్చాక జిల్లా ప్రజాప్రతినిధులు, టీపీసీసీ అధ్యక్షుడితో సహా సీఎం రేవంత్రెడ్డి, ఇరిగేషన్ మంత్రిని కలుస్తామన్నారు. ప్రాజెక్ట్ పూర్తయితే మంచిప్ప–కొండెం చెరువు ప్రాజెక్టు ద్వారా సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, డిచ్పల్లి మండలాల్లోని సుమారు 85 వేల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని పేర్కొన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర కల్లు గీత కార్మిక సహకార కార్పొ రే షన్ చైర్మన్ శేఖర్గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డిరాజారెడ్డి, నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కా ట్పల్లి నగేష్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, నాయకులు మునిపల్లి సాయిరెడ్డి, మంగూరపు రవి, ఇరిగేషన్ ఎస్ఈలు ప్రమీల, నజీర్ హుస్సేన్, ఈఈ నరేంద్రకుమార్, డీఈలు గంగాధర్, భూమన్న, స్థానిక అధికారులు, సర్పంచులు, సొసైటీ చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. రెండో కాళేశ్వరంగా రిజర్వాయర్ రైతుల శ్రేయస్సు కోసం ప్రాణహిత – చేవెళ్ల డిజైన్ ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డితో కలిసి ప్రాజెక్ట్ పనులు పరిశీలన -
వేగంగా వీవో భవనాలు..
డొంకేశ్వర్(ఆర్మూర్): కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకం (వీబీ జీ రామ్ జీ) కింద జిల్లాకు మంజూరు చేసిన (వీవో) గ్రామ సమాఖ్య మహిళా భవన నిర్మాణాలు వేగం పుంజుకున్నాయి. ఈ ఏడాది నవంబర్ నెలాఖరు నాటికి అన్నింటిని పూర్తి చేయాలనే లక్ష్యంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కలిసి పని చేస్తున్నాయి. డిసెంబర్ నెలలో ఎట్టి పరిస్థితిలోనూ నూతన భవనాల్లోకి వెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. గ్రామాల్లోని మహిళా సంఘాలు కలిసి సమావేశాలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం జిల్లాకు మొత్తం 351 వీవో భవనాలను ఐదు నెలల కిందట మంజూరు చేసి ఒక్కోదానికి రూ.10 లక్షలు కేటాయించింది. ఆయా గ్రామాల్లో స్థలాలు కూడా దొరకడంతో స్థానిక సర్పంచులు, సంబంధిత అధికారులు కలిసి పనులు ప్రారంభించారు. అయితే, వీటి నిర్మాణ బాధ్యతలు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖకు అప్పగించారు. పాత కాంట్రాక్టర్లను, స్థానిక సర్పంచులను ఎలాగోల ఒప్పించి నిర్మాణ పనులను మొదలు పెట్టించారు. ఇప్పటికే జిల్లాలో పొతంగల్ మండలం కల్లూర్లో వీవో భవనం అన్ని హంగులతో పూర్తయి అందుబాటులోకి వచ్చింది. ఇంకా 350 భవనాల్లో 292 పనులు పురోగతిలో ఉండగా, 200 వరకు సైట్లు స్లాబ్ లెవల్ వరకు వచ్చాయి. మిగతా చోట్ల వివిధ కారణాలతో పనులు ప్రారంభం కాలేదు. అయితే, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సైతం వీవో భవనాల పనులపై ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సమీక్షిస్తున్నారు. ఈ భవనాలు పూర్తయితే గ్రామాల్లో మహిళా సంఘాలు సమావేశాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి చక్కని వేదికగా మారనున్నాయి. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పిస్తున్నాం మంజూరైన గ్రామ సమాఖ్య భవనాలను త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో పీఆర్ ఇంజినీరింగ్ శాఖతో కలిసి పని చేస్తున్నాం. పనుల పురోగతిని తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నాం. పనులు నెమ్మదించిన చోట వేగవంతం చేయిస్తున్నాం. – సాయన్న, డీఆర్డీవో, నిజామాబాద్ నవంబర్ నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యం పొతంగల్ మండలం కల్లూర్లో అందుబాటులోకి వచ్చిన భవనం పురోగతిలో 292 భవనాలు -
నందిపేట తహసీల్దార్ సస్పెన్షన్
నిజామాబాద్ అర్బన్ : నందిపేట తహసీల్దార్ సంతోష్రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలో నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేసినట్లు విచారణలో తేలింది. ధరణిలో అవకాశాలను అడ్డుపెట్టుకొని ప్రభుత్వ భూ ములను అక్రమంగా ఇతరులకు కేటాయించినట్లు తెలిసింది. సీసీఎల్ఏ నుంచి ఉత్తర్వులు రావడంతో విచారణ చేపట్టిన కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం ఉండొద్దు వర్ని : కోట్లాది రూపాయలు వెచ్చించి రైతులకు సాగునీరందించేందుకు చేపడుతున్న సి ద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనుల్లో నా ణ్యత లోపం లేకుండా చూడాలని రాష్ట్ర ప్ర భుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువా డ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అధికారు లను ఆదేశించారు. గురువారం హైదరాబా ద్లోని తన కార్యాలయంలో ఇరిగేషన్, అట వీశాఖ అధికారులతో రిజర్వాయర్ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ముంపునకు గురవుతున్న భూముల రైతులకు నష్టప రిహారం చెల్లించి అవసరమైన అనుమతులు పొందేందుకు రూ.55.30 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించా రు. అటవీశాఖ పీసీసీఎఫ్ శ్రావణ్, ఇరిగేషన్ ఈఎన్సీ శ్రీనివాస్, కామారెడ్డి ఇన్చార్జి సీఈ దక్షిణామూర్తి, ఈఈ రాజశేఖర్ పాల్గొన్నారు. ఎన్డీసీసీబీకి ఉత్తమ పనితీరు అవార్డు సుభాష్నగర్: రాష్ట్రంలోని సహకార బ్యాంకుల్లో అత్యుత్తమ పనితీరు కనబర్చినందుకు నాబార్డ్ 45వ జాతీయ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్లోని నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయంలో నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (ఎన్డీసీసీబీ)కి ఉత్తమ పనితీరు అవార్డు వరించింది. అవార్డును తెలంగాణ రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయభాస్కర్, ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ నీలేష్ ద్వివేది చేతుల మీదుగా ఎన్డీసీసీబీ సీఈఓ నాగభూషణం వందే, డిప్యూటీ జనరల్ మేనేజర్ లింబాద్రి అందుకున్నారు. ఈ అవార్డు బ్యాంకు పాలకవర్గం, యాజమాన్యం, సిబ్బంది సమిష్టి కృషికి నిదర్శనమని సీఈఓ నాగభూషణం వందే పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్రంలోని డీసీసీబీల సీఈవోలు, ఉన్నతాధికారులు, రాష్ట్రస్థాయి అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. గర్భిణికి ఎక్స్పైరీ టాబ్లెట్స్ రుద్రూర్: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ గర్భిణికి గడువు ముగిసిన మాత్రలు ఇచ్చారు. సదరు గర్భిణీ మామ మాట్లాడుతూ.. తన కోడలు ప్రతి నెలా రుద్రూర్ పీహెచ్సీలో వైద్య పరీక్షలు చేయించుకుంటోందని, గత నెల 2వ తేదీన వైద్యులు 60 కాల్షియం మాత్రలు రాసి ఇవ్వగా, వాటిని వినియోగిస్తున్న సమయంలో మందుల ప్యాకెట్ను పరిశీలించగా, గడువు తేదీ మే 31 నాటికి ముగిసినట్లు గుర్తించామన్నారు. ఈ ఘటనపై పీహెచ్సీ వైద్యురాలు ఆయేషాను వివరణ కోరగా.. పొరపాటు జరిగిందని అంగీకరించారు. ఇప్పటి వరకు ఎవ్వరికి కూడా గడువు ముగిసిన టాబ్లెట్స్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఒక్క డబ్బా ఎలా ఎలా వచ్చిందో విచారణ చేస్తున్నామన్నారు. టాబ్లెట్ వేసుకున్న గర్బిణీకి స్కానింగ్ చేసి మెరుగైన చికిత్స అందిస్తామని తెలిపారు. -
తొమ్మిది నాటుతుపాకులు సీజ్
● దేవక్కపేట అటవీ ప్రాంతంలో పట్టుబడిన నిందితులు ● మొత్తం 10 మంది అరెస్ట్, రిమాండ్ నిజామాబాద్ అర్బన్ : భీమ్గల్ మండలం దేవక్కపేట అటవీ ప్రాంతంలో తొమ్మిది నాటుతుపాకులను స్వాధీనం చేసుకొని, పది మంది నిందితులను అరెస్టు చేసినట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. దేవక్కపేట శివారులో ఈ నెల 16వ తేదీన అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా తొమ్మిది నాటుతుపాకులు లభించాయన్నారు. నిందితులు అడవి జంతువులు, ఇతర వన్యప్రాణులను వేటాడేందుకు వాటిని ఉపయోగించడం జరిగిందన్నారు. తొమ్మిది మంది నిందితుల్లో భూక్యా రఘుపతి, కార్ల అంజయ్య, ముదావత్ తిరుపతి, భూక్యా చందర్, ముర్రి గంగనర్సయ్య, అనిమేని లింబాద్రి, మలావత్ కుంభ, బానావత్ గంగారెడ్డి, మలావత్ దారిసింగ్, ఆకునూర్ రాజు(ఆయుధాలు రిపేర్ చేసిన వ్యక్తి)ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. చిరుతలను వేటాడిన కేసుల్లో.. జిల్లాలోని భీమ్గల్ మండలం కారేపల్లి సౌత్ బీట్ పరిధిలోని 79 కంపార్టమెంట్లో, ఇందల్వాయి రేంజ్ పరిధిలోని అన్సాన్పల్లి బీట్ పరిధిలో చిరుతలను వేటాడిన ఘటనల్లో నిందితులను అరెస్టు చేసినట్లు సీపీ సాయిచైతన్య వెల్లడించారు. వివరాలు.. కారేపల్లి సౌత్ బీట్లో భీమ్గల్ మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన మలావత్ సంజీవ్, దేవక్కపేట గ్రామానికి చెందిన సిరిసిల్ల రాములు చిరుత పులిని చంపారన్నారు. మేకల కాపరి అయిన సంజీవ్ నెల రోజుల కిందట మేత కోసం జీవాల మందను కారేపల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లగా, ఓ మేకను చిరుత వేటాడి హతమార్చింది. అదే మేక కళేబరంలోకి గడ్డి మందు ఇంజెక్ట్ చేసి ఇద్దరూ కలిసి చిరుతను హతమార్చారు. అనంతరం మరో నలుగురితో కలిసి చిరుత కళేబరాన్ని దాచిపెట్టి కొనుగోలు దారుడు దొరికిన తరువాత తీసి అమ్ముకుందామని నిర్ణయించుకున్నారు. చిరుత కళేబరాన్ని గుర్తించిన అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టగా, విచారణలో సిరిసిల్ల రాములు ఇంట్లో నాటుతుపాకీ లభించింది. రాములుతోపాటు సంజీవ్ను అరెస్టు చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్నారు. అలాగే అన్సాన్పల్లి బీట్ పరిధిలో మూడు నెలల కిందట చిరుతను వేటాడి చంపిన ఘటనను పోలీసులు ఛేదించారు. అటవీ అధికారుల సమాచారం మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. అడవి పందుల వేట కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో చిరుతపులి చిక్కుకోగా, కొందరు వ్యక్తులు దానిని కర్రలతో కొట్టి చంపారు. చిరుత కళేబరాన్ని ధర్పల్లి శివారులోని ఓ మామిడితోటకు తరలించి దాని చర్మాన్ని ఒలిచి నాలుగు పంజాలను వేరుచేసి మిగిలిన శరీర భాగాలను సమీపంలోని బావిలో పారేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నారు. చిరుతలను వేటాడిన వ్యక్తులను గుర్తించేందుకు పక్కాగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు మరికొంత మంది నాటు తుపాకులతో పట్టుబడ్డారు. అలాగే భీమ్గల్ మండలం కారేపల్లి సౌత్బీట్, ఇందల్వాయి రేంజ్లోని అన్సాన్పల్లి బీట్ పరిధిలో చిరుతను హతమార్చిన దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై వన్యప్రాణి (సంరక్షణ) చట్టం, తెలంగాణ అటవీ చట్టం తదితర నిబంధనల మేరకు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సాయిచైతన్య గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. -
పుష్కరాలకు ముందస్తు కార్యాచరణ రూపొందించాలి
వేల్పూర్(మెండోరా): గోదావరి పుష్కరాల (2027)కు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భద్రతాచర్యలు, ట్రాఫిక్ నిర్వహణ, సీసీ కెమెరాల ఏర్పాటు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ, తాత్కాలిక పోలీస్ సహాయ కేంద్రాలు, అత్యవసర స్పందన బృందాల ఏర్పాటుపై ముందస్తు కార్యాచరణ చేపట్టాలని సీపీ సాయి చైతన్య ఆదేశించారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డితో కలిసి సీపీ మెండోరా మండలం పోచంపాడ్ వద్ద పుష్కర ఘాట్లను గురువారం పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి పోలీసుశాఖ సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. అనంతరం శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఆర్మూర్ రూరల్ సీఐ జాన్రెడ్డి, మెండోరా ఎస్సె సుహాసిని, ఇరిగేషన్ డీఈ సురేశ్, మెండోరా డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ వేణుగోపాల్, ఏఈలు సుశాంత్కుమార్, వంశీ తదితరులు సీపీ వెంట ఉన్నారు. -
జీజీహెచ్లో మరింత మెరుగైన వైద్యం అందించాలి
సుభాష్నగర్: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ద్వా రా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందేలా అధికారులు, వైద్యులు కృషి చేయాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి సూచించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి అధ్యక్షతన మాతా శిశు సంరక్షణ ఆస్ప త్రి కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాకేంద్ర ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అభివృద్ధి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయా విభాగాల ద్వారా అందిస్తున్న వై ద్యసేవలు, సదుపాయాలు, వసతు లు, వైద్య పరికరాల గురించి సుదర్శన్రెడ్డి సంబంధిత విభాగాల అధిపతుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వై ద్యులు, సిబ్బంది ప్రజలకు అంకితభావంతో సేవలందిస్తూ ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకాన్ని పెంచాలని సూచించారు. జీజీహెచ్కు సగటున ప్రతిరో జూ సుమారు 1,700 నుంచి 2వేల మంది వరకు ఇన్ పేషెంట్లు వస్తున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రోగులకు సంతృప్తికరంగా వైద్యసేవలందించాలని, రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ఆస్పత్రిలో తగిన మరమ్మతులు, అభివృద్ధి పనులు సకాలంలో చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని టీ జీఎస్ఐడీసీ ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయిలో గుర్తింపు తీసుకురావాలి.. జీజీహెచ్లో అపారమైన అనుభవం ఉన్న వైద్యులు ఉన్నందున వారి సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా అందించాలని ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, డాక్టర్ భూపతిరెడ్డి కోరారు. ఆయా విభాగాల్లో అందుబాటులో ఉన్న పరికరాలు, అవసరమైన వెంటిలేటర్లు, మౌలిక సదుపాయాలపై పూర్తి వివరాలతో కూడిన నివేదికలను సమర్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించా రు. నగర మేయర్ ఉమారాణి, ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ చైర్పర్సన్ డాక్టర్ కవితారెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవ సాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, రాష్ట్ర గీత పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, నుడా చైర్మన్ కేశ వేణు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణమోహన్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్ రాములు, డీఎంహెచ్వో రాజశ్రీ, సంబంధిత విభాగాల వైద్యాధికారులు పాల్గొన్నారు. రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్రెడ్డి జీజీహెచ్ అభివృద్ధి సలహా సంఘ సమావేశం -
‘సామాజిక బహిష్కరణ’పై విచారణ
ఇందల్వాయి: మండలంలోని గన్నారం గ్రామంలో ఓ కులానికి చెందిన వ్యక్తులపై సామాజిక బహిష్కరణ ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యుడు రాంబాబు బుధవారం గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. బాధితులకు న్యాయం జరిగేలా చట్టప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ఆదేశించారు. వారివెంట అడిషనల్ కలెక్టర్ భుజంరావు, పోలీసు అధికారులు, ఆయా శాఖల జిల్లా అధికారులు ఉన్నారు. -
అధ్యాపకుల పదోన్నతులు పూర్తి చేయండి
● ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్యతెయూ(డిచ్పల్లి): జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలంగాణ యూనివర్సిటీని సందర్శించారు. పరిపాలనా భవనంలో వీసీ, రిజిస్ట్రార్లను కలిశారు. తెయూ ఎస్సీ, ఎస్టీ అధ్యాపకులు, టూటా (తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్) ప్రతినిధులు ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. వివిధ కారణాల చేత 12 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న 2014 అధ్యాపకుల పదోన్నతుల ప్రక్రియను పూర్తిచేయాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని తెయూ వీసీ ప్రొఫెసర్ టి.యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి లకు చైర్మన్ వెంకటయ్య సూచించారు. అనంతరం కమిషన్ చైర్మన్ వెంకటయ్యతో పాటు సభ్యుడు రాంబాబు నాయక్ను వీసీ, రిజిస్ట్రార్, టూటా ప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు, విద్యార్థులు, నాన్ టీచింగ్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది వేర్వేరుగా ఘనంగా సన్మానించారు. అనంతరం వివిధ సమస్యల మీద విద్యార్థులు, నాన్ టీచింగ్, అవుట్సోర్సింగ్ సిబ్బంది కమిషన్ చైర్మన్ వెంకటయ్యకు వినతిపత్రాలు అందజేవారు. కమిషన్ చైర్మన్ వెంట డీఆర్వో గీత, ఆర్ఐ సంతోష్, ఎస్సై ఎండీ ఆరీఫ్ తదితరులు ఉన్నారు. -
జాతిని జాగృతం చేసిన ‘వందేమాతరం’
రెంజల్: జాతీయోద్యమంలో భారత జాతిని వందేమాతర గేయం జాగృతం చేసిందని అదనపు కలెక్టర్ భుజంగరావ్ పేర్కొన్నారు. సీసీఆర్టీ భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, సంగీత నాటక అకాడమి న్యూఢిల్లీ ఆధ్వర్యంలో మండలంలోని దూపల్లి హైస్కూల్లో బుధవారం రాత్రి వందేమాతరం 150 సంవత్సరాల జాతీయ వేడుకలను నిర్వహించారు. అదనపు కలెక్టర్ భుజంగరావ్తో పాటు డీఈవో అశోక్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. భారత స్వాతంత్రానికి 75 ఏళ్ల ముందు స్వాతంత్రం తర్వాత 150 సంవత్సరాలుగా జాతీయ గేయాన్ని ఆలపిస్తున్నామని, అది పాడుతున్నప్పుడు దాని రచనలో ఉన్న గొప్పతనమని వివరించారు. సమావేశంలో సర్పంచ్ దువ్వూరి నర్సవ్వ, తహసీల్దార్ శ్రావణ్కుమార్, హెచ్ఎం మాధవరెడ్డి, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు సోమలింగంగౌడ్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బాబన్న, మాజీ అధ్యక్షుడు లింగంయాదవ్ తదతరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి
● ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి నిజామాబాద్ అర్బన్: ఉపాధ్యాయులు అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ నాణ్యమైన విద్యను అందించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పీ సుదర్శన్ రెడ్డి అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో బుధవారం జిల్లా విద్యాశాఖ పనితీరుపై కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ప్రభుత్వ సలహాదారు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకులాల నిర్వహణ తీరుతెన్నులు, సాధించిన ఫలితాలు, మౌలిక సదుపాయాల స్థితిగతులు తదితర అంశాలపై సమీక్ష జరిపి, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. విద్యా రంగానికి సీఎం రేవంత్ రెడ్డి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. పీఎంశ్రీ పాఠశాలల్లో పెండింగ్ లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. విద్యా రంగంలో నిజామాబాద్ జిల్లా పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు. ప్రభుత్వ బడులలో విద్యార్థులు ప్రవేశాల విషయంలో రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా ఐదవ స్థానంలో ఉందని, ఈ నెలాఖరు వరకు లక్ష్యానికి అనుగుణంగా ప్రవేశాలు పూర్తి చేసి జిల్లాను ముందంజలో నిలుపుతామని తెలిపారు. ఎస్సెస్సీలో టాపర్లుగా నిలిచిన లహరిక, సౌజన్య, సంజన, లాస్య, అభిజ్ఞ పలువురు విద్యార్థులను జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో నగదు ప్రోత్సా హం అందించి సన్మానించారు. సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, అ దనపు కలెక్టర్ భుజంగరావు, ట్రెయినీ కలెక్టర్ సురేశ్, నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, రాష్ట్ర గౌడ సంక్షేమ సంఘం చైర్మన్ శేఖర్ గౌడ్, డీఈవో అశోక్, డీఆర్డీవో సాయాగౌడ్, విద్యా శాఖ అధికారులు, ఆర్సీవోలు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు పాల్గొన్నారు. సర్ సర్వే ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి బోధన్: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ సర్వే ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం పట్టణ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నియోజకవర్గ స్థాయి డివిజన్, మండల అధికారులతో సర్ సర్వే ప్రక్రియ పురోగతి పై సమీక్షించారు. మండలాల వారీగా సర్వే ప్రక్రియలో భాగంగా ఓటర్ల డిజిటలైజేషన్ పురోగతిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, సిబ్బంది బీఎల్వోలతో సమన్వయంతో పని చేయాలని తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మశరత్రెడ్డి, ఆర్డీవో విజయకుమారి, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, వివిధ శాఖల డివిజన్, మండలాల అధికారులు పాల్గొన్నారు. -
చివరి నిమిషం వరకు వేచి చూడొద్దు
● ఎన్యుమరేషన్ ఫామ్లు అందించాలి ● కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్ అర్బన్: చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ఎన్యుమరేషన్ ఫామ్లను బీఎల్వోలకు అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా ఎన్యుమరేషన్ ఫామ్లు సమర్పించేందుకు గడువు ముగియనున్నదని, వివరాలను డిజిటలైజ్ చేయా ల్సి ఉందన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రత్యేకించి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పరిధిలోని ఓటర్లు ఎన్యుమరేషన్ ఫామ్లు అందజేసే విషయంలో తాత్సారం చేయొవద్దని, నిర్లక్ష్యం వహిస్తే ఓటరు జాబితా నుంచి పే రు గల్లంతవుతుందని స్పష్టం చేశారు. ఎవరికై నా గత 2002 ఎస్ఐఆర్ వివరాలు తెలియకపోతే సర్కిల్ వారీగా నెలకొల్పిన హెల్ప్ డెస్క్ను లేదా బీఎల్వోలను సంప్రదించాలని సూచించారు. అయినప్పటికీ వివరాలు తెలియని పక్షంలో ప్రస్తుత ఓటరు జాబితా వివరాలు పొందుపరచి ఫామ్ అందజేయొచ్చన్నారు. బూత్ లెవెల్ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో ఉంటూ క్రియాశీలక పాత్ర పోషించాలని, ప్రతి రోజూ ఓటర్ల నుంచి 50 చొప్పున ఫామ్లు సేకరించి బీఎల్వోలకు అందించేలా చొరవ చూపాలన్నారు. అందుబాటు లో లేని, చనిపోయిన, శాశ్వతంగా వలస వెళ్ళిన, రెండు చోట్ల ఓటు కలిగిన ఓటర్ల పేర్లను గుర్తిస్తూ పక్కాగా జాబితాను రూపొందించి, వాటిపై బీ.ఎల్వోల సంతకాలు తీసుకోవాలన్నారు. -
దూసుకొచ్చిన మృత్యువు
నిజాంసాగర్(జుక్కల్): బంధువు దశ దినకర్మకు అవసరమైన సామగ్రి తెచ్చేందుకు వెళ్లిన ఇద్దరు యువకులను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం ఒడ్డేపల్లి గ్రామ శివారులో బుధవారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులు వరుసకు బావబావమరుదులు. వివరాలిలా ఉన్నాయి. నిజాంసాగర్ మండలం గోర్గల్ గ్రామానికి చెందిన జుంజురి దినేశ్ (25) హైదరాబాద్లో కారు మెకానిక్గా, జుంజురి రమేశ్ (27) నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్నారు. రమేశ్ మేనమామ శివయ్య ఇటీవల మరణించారు. ఆయన దశదిన కర్మకు సంబంధించి కూరగాయలతోపాటు శివయ్య ఫొటో ప్రేం కోసం రమేశ్, దినేశ్ కలిసి బుధవారం బైక్పై పిట్లం వెళ్లారు. తిరిగి వస్తుండగా ఒడ్డేపల్లి గ్రామ శివారులో ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం వీరి బైక్ను బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న దినేశ్ అక్కడికక్కడే ప్రాణాలొదలగా, వెనకాల కూర్చున్న రమేశ్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. ఆ మార్గంలో ఎల్లారెడ్డి వైపు వెళ్తున్న ఎమ్మెల్యే మదన్మోహన్రావు తన వాహనాన్ని ఆపి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. కల నెరవేరకుండానే.. గోర్గల్ గ్రామానికి చెందిన జుంజురి లచ్చవ్వ, దుర్గయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. పెద్ద కొడుకు దినేశ్కు 14 నెలల క్రితం వెల్గనూర్కు చెందిన రమ్యతో వివాహమైంది. రమ్య ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. గోర్గల్ గ్రామానికి చెందిన జుంజురి అంబవ్వ, సంజీవు దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు రమేశ్. పిట్లం మండలం సిద్దాపూర్ గ్రామానికి చెందిన సుగుణతో రమేశ్కు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం సుగుణ ఎనిమిది నెలల గర్భిణి. ఇద్దరు యువకుల భార్యలు గర్భిణులు కావడంతో.. త్వరలోనే తమ సంతానాన్ని చూసుకుంటామనే కల తీరకుండానే రోడ్డు ప్రమాదంలో మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం బంధువు దశ దినకర్మ సామగ్రి తెస్తుండగా ఘటన గోర్గల్ గ్రామంలో తీవ్ర విషాదం -
అమ్మ పేరున మొక్క
● సెప్టెంబర్ 15 వరకు కొనసాగనున్న కార్యక్రమం ● జిల్లాలో లక్ష మొక్కలు నాటడం టార్గెట్ ● మండలానికి 5 వేల మొక్కలు ఖలీల్వాడి: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్ర భుత్వం ‘అమ్మ పేరుతో మొక్క’ కార్యక్రమానికి శ్రీ కారం చుట్టింది. జాతీయ విద్యార్థి పర్యావరణ పో టీ పేరుతో బుధవారం నుంచి జిల్లాలో ’ఏక్ పేడ్ మాకే నామ్ (అమ్మ పేరుతో ఓ మొక్క)–సోయింగ్ టు గ్రోయింగ్–2026’ కార్యక్రమాన్ని చేపడుతున్నా రు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్య క్ర మం సెప్టెంబర్ 15వ తేదీ వరకు కొనసాగనుంది. విద్యార్థులు తమ తల్లిపేరుతో ఒక మొక్కను నాటనున్నారు. జిల్లాలోని 33 మండలాల్లోని 1156 ప్ర భుత్వ, 290కి పైగా ప్రైవేటు పాఠశాలలు ఉండగా సుమారు 2 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి విద్యార్థి అమ్మ పేరుతో ఒక మొక్క నాటాల్సి ఉంటుంది. స్కూల్ ఆవరణతోపాటు విద్యాసంస్థలకు సంబంధించిన ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి లక్ష్యాన్ని పూర్తి చేసేలా జిల్లా విద్యాశాఖ ఎంఈవోలు, హెడ్ మాస్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లకు ప్రోత్సాహం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటే ఐదుగురు విద్యార్థులకు విద్యాశాఖ ప్రోత్సాహకాలను అందించనుంది. తన తల్లి పేరుతో మొక్కను నాటిన విద్యార్థులంతా నాటిన మొక్కతో సెల్ఫీ తీసుకొని ఏకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ వెబ్ సైట్లో ఫొటోను అప్లోడ్ చేయాలి. ఆ తరువాత విద్యార్థికి సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది. దీంతో పాటు పర్యావరణంపై విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి సెప్టెంబర్ 20న ఫలితా లు వెల్లడిస్తారు. జిల్లాల వారీగా అత్యధిక స్కోర్ సాధించిన ఐదుగురు విద్యార్థులకు, ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనేలా కృషి చేసిన హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలను అందిస్తుంది.పర్యావరణంపై అవగాహన కోసమే.. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహ న కల్పించడంతోపాటు మొక్కల పెంపకం మానవ జీవన విధానంలో భాగంగా ఉండేలా విద్యార్థి తన తల్లి పేరుతో ఒక మొక్కను నాటి దానిని సంరక్షించేందుకు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లల్లో అధికారులు మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతిబడిలో 10 పండ్ల మొక్క లు నాటాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి మండలంలో 5 వేల మొక్కలు నాటేందు కు చర్యలు చేపడుతున్నారు. విద్యార్థులకే మొ క్కల సంరక్షణ బాధ్యత అప్పగించనున్నారు. ప్రతి విద్యార్థి మొక్కలు నాటాలి పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం అమ్మ పేరిట మొక్క కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు చెందిన ప్రతి విద్యార్థి మొక్కనా టి దానిని సంరక్షించాలి. విద్యార్థులందరూ పాల్గొని విజయవంతం చేయాలి. దీంతో పచ్చదనం ఏర్పడి పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది. – గంగాకిషన్, జిల్లా సైన్స్ అధికారి, నిజామాబాద్ -
బాధ్యతగా ఉండాలి
మంచి వాతావరణం కలిగిన ఇలాంటి ప్రాంతాన్ని పర్యాటకులు వచ్చి చూసి ఎంజాయ్ చేయాలి. అంతేకాని ప్లాస్టిక్ వ్యర్థాలు, మద్యం సీసాలు వదిలి వెళ్లడం సరికాదు. వీటి వల్ల ప్రకృతి పాడవుతోంది. నీళ్లు కలుషితం అవుతున్నాయి. పర్యాటకులు ప్రకృతి పట్ల బాధ్యతగా ఉంటే బాగుంటుంది. – వేముల దశరథ్, చిన్నయానం వాసి ప్రకృతిని ఆస్వాధించడానికి ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతం అందరికీ వరంలాంటిది. అ లాంటి ప్రదేశా న్ని ప్లాస్టిక్ వ్యర్థాలు, మ ద్యం సీ సాలతో కలుషితం చెయొద్దు. మద్యం సేవించి లోతుగా ఉన్న నీటిలోకి దిగకూడదు. వచ్చిన తో టి పర్యాటకులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తి స్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. –వినయ్, ఎస్సై, నందిపేట్ -
మరింత సమయం
నిజామాబాద్సర్కు ● గడువు పొడిగింపుతో ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం, ఓటర్లు ● వచ్చే నెల 3వ తేదీ వరకు కొనసాగనున్న ప్రక్రియగురువారం శ్రీ 16 శ్రీ జూలై శ్రీ 2026ముదురుతున్న నారు నీరు లేక నెర్రెలు..వేగవంతంగా డిజిటలైజేషన్..నిజామాబాద్ అర్బన్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)కు కేంద్ర ఎన్నికల సంఘం గడువును పొడిగించడంతో అటు అధికార యంత్రాంగం, ఇటు ఓటర్లు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల పరిధిలో ఎన్యుమరేషన్ ఫామ్ల పంపిణీ పూర్తయినప్పటికీ అవి తిరిగి బీఎల్వోల చేతికి అందడం కొంత ఆలస్యమవుతోంది. ఓటర్లు అందించిన ఫారాలను డిజిటలైజ్ చేస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ మినహా జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో సర్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మరోవైపు ఫారాలను పూరించడంలో కొన్ని చోట్ల ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ముందుగా నిర్ణయించిన గడువు తేదీ సమీపిస్తుండడంతో అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. తాజాగా గడువును వచ్చే నెల 3వ తేదీ వరకు పొడిగించారు. ఆగస్టు 10న డ్రాఫ్ట్ జాబితా.. గడువు పొడిగింపు నేపథ్యంలో ఆగస్టు 10వ తేదీన డ్రాఫ్ట్ ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 9వ తేదీ వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరణ కొనసాగుతుంది. అలాగే అక్టోబర్ 8 వరకు అభ్యంతరాలు పరిష్కారం కొనసాగుతుంది. అక్టోబర్ 12వ తేదీన తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు. ప్రాథమిక సమాచారం ఇచ్చినా పర్వాలేదు 2002 ఓటరు జాబితాలో వివరాలు లేనివారు ప్రస్తుత ఓటరు జాబితా వివరాలు పొందుపరచి, ఆధార్కార్డు, ఫోన్నంబర్, ఫొటో జతచేసి బీఎల్వోలకు ఫామ్ అందజేయొచ్చు. అలాంటి వారి పేరు కూడా ముసాయిదా ఓటరు జాబితాలో చేరుస్తారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఈఆర్వో) నోటీసు జారీ చేసే హియరింగ్కు పిలుస్తారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన 13 రకాల గుర్తింపు ధ్రువీకరణ పత్రాలలో ఏదైనా ఒక దానిని చూపిస్తే ఓటరు తుది జాబితాలో పేరు చేరుస్తారు. జిల్లాలో ఎన్యుమరేషన్ ఫామ్ల పంపిణీ వందశాతం పూర్తయ్యింది. మొత్తం 14,39,734 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 10,62,624 (73.81 శాతం) మందికి సంబంధించిన ఫామ్లు డిజిటలైజ్ అయ్యాయి. చందూర్ మండలంలో 92.21 శాతం, డొంకేశ్వర్ మండలంలో 92.72, నందిపేట మండలంలో 89.45 , రెంజల్ మండలంలో 89.37, ముప్కాల్లో 89.50, ఏర్గట్లలో 86.52, సిరికొండలో 82.80 శాతం డిజిటలైజేషన్ పూర్తికాగా, అతి తక్కువగా నిజామాబాద్ నార్త్ మండలంలో 44.62 శాతం , సౌత్ మండలంలో 44.73 శాతం నమోదైంది. -
ఆగస్టు 16 నుంచి ఉద్యమం ఉధృతం
భీమ్గల్కు చెందిన ప్రముఖ వైద్యుడు మధుశేఖర్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. ఆగస్టు 15లోగా భీమ్గల్లో నెలకొన్న నాలుగు ప్రధాన ప్రజాసమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో 16 నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్న కాలంలో భీమ్గల్లో రూ.100 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని, రాజకీయాల కన్నా ప్రజా సంక్షేమమే తమకు ముఖ్యమని పేర్కొన్నారు. నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘మిషన్ ప్రకృతి’లో రాష్ట్రస్థాయి అవార్డులు
మోపాల్: మండలంలోని కంజర్ శివారులో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ – ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన మిషన్ ప్రకృతి పర్యావరణ అవగాహన కార్యక్రమంలో రాష్ట్రస్థాయి అవార్డులు దక్కినట్లు ప్రిన్సిపాల్ జి విజయలలిత బుధవారం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 238 పాఠశాలలు ఈ కార్యక్రమంలో పాల్గొనగా, టాప్ పదింటిని ఎంపిక చేశారని, తిరిగి అందులో నుంచి 3 బెస్ట్ పాఠశాలలను ఎంపిక చేశారని తెలిపారు. అందులోనూ కంజర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల స్థానం సాధించిందని పేర్కొన్నారు. పాఠశాలకు బెస్ట్ స్కూల్ అవార్డుతోపాటు బెస్ట్ అడ్వయిజరీ టీచర్స్ అవార్డు డి ఉదయశీల, ఎన్ రాజేశ్వరికి, బెస్ట్ స్టూడెంట్స్ అవార్డు సోనాక్షి, కృష్ణప్రియ, మినాక్షి, ఆకృతి, అమూల్య, నిహారికకు లభించాయన్నారు. అవార్డులను డబ్ల్యూడబ్ల్యూఎఫ్ – ఇండియా ట్రస్టీ, చైర్మన్ వీ అనిల్కుమార్, స్టేట్ డైరెక్టర్ ఫరీదా తంపాల్ అందజేశారని తెలిపారు. -
రేపు ఇందూరు రణభేరి
సుభాష్నగర్: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 17న ఉదయం 10 గంటలకు ధర్నా చౌక్ (పాత కలెక్టరేట్) వద్ద ఇందూరు రణభేరి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి తెలిపారు. బుధవారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లపైనే ఆధారపడి చదువుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో రూ.11వేల కోట్లు బకాయిలు పేరుకుపోయాయని పేర్కొన్నారు. రణభేరి కార్యక్రమా న్నివిద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శులు పోతన్కర్ లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీనారాయణ, బీజేవైఎం రాష్ట్ర కో కోశాధికారి ఆమంద్ విజయ్కృష్ణ, కార్పొరేటర్ శ్రవణ్, బీజేపీ ఐటీ కార్యదర్శి పిల్లి శ్రీకాంత్, నాయకులు అంబదాస్ రావు, వంశీ గౌడ్, విపుల్ రావు, రాజ్ గణేశ్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటకం సరే.. పారిశుద్ధ్యం సంగతేంటి?
డొంకేశ్వర్(ఆర్మూర్): ఆహ్లాదాన్ని పంచే ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని కొందరు పర్యాటకులు తమ బాధ్యతారాహిత్యంతో పాడుచేస్తున్నారు. కనీస ‘చిత్తశుద్ధి’ లేకుండా ప్రకృతిని కలుషితం చేస్తూ పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నారు. అటవీ అధికారులు, పోలీసులు అవగాహన కల్పిస్తున్నా మార్పు రావడం లేదు. వారాంతంలోనే.. డొంకేశ్వర్ మండలం జీజీ నడ్కుడ, చిన్నయానం బ్యాక్వాటర్ ప్రాంతం పచ్చికబయళ్లు తేలి ఆహ్లాదకరంగా మారడంతో వీకెండ్ వస్తే చాలు వందల సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఆనందంగా గడుపుతూనే వారు తెచ్చుకున్న ప్లాస్టిక్ కవర్లు, తినుబండారాల ప్యాకెట్లు, వినియోగించిన విస్తార్లు, వాటర్ బాటిళ్లను ఇష్టానుసారంగా పడేసి వెళ్తుతున్నారు. పచ్చని ప్రకృతిని కాస్త ప్లాస్టిక్తో నింపేస్తున్నారు. ఇది చాలదన్నట్లుగా బహిరంగంగా మద్యం సేవించి, ఆ సీసాలను నీటి అంచున, పచ్చని బయళ్లలో విసిరికొడుతున్నారు. ఎక్కడ చూసినా పగిలిన గాజు పెంకులే దర్శనమిస్తుండడంతో తోటి పర్యాటకులకు, స్థానికులకు, మేతకు వచ్చే పశువులకు ఇబ్బందిగా మారింది. కొంతమంది యువకులు తాగిన సీసాలను పగులగొట్టడం, మత్తులో ప్రాజెక్టు నీటిలోకి వెళ్లి ప్రమాదకర ఆటలాడుతున్నారు. మద్యం మత్తులో నీట ముగిని ప్రాణాలు పోయే ప్రమాదముంది. అలాగే ఇటీవల తోటి పర్యాటకులతో పలు గొడవలు కూడా జరిగాయి. యువకులు, పర్యాటకులకు కనీస బాధ్యత లేకపోగా, ఇక్కడ పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. అయితే, ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతం ఎకో టూరిజంకు ఎంపిక కాగా ఇక్కడ ఇప్పటి వరకు పనులు మొదలు కాలేదు. కాటేజీలు, రిసార్ట్లు ఏర్పాటైతే సిబ్బంది పర్యవేక్షణ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు, మద్యం ఖాళీ బాటిళ్లను కూడా నియంత్రించవచ్చు.చిన్నయానం వద్ద ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో పర్యాటకులు వదిలి వెళ్లిన ప్లాస్టిక్ వ్యర్థాలు , నీటి మధ్యలోకి వెళ్లిన పర్యాటకులు ఎస్సారెస్పీ బ్యాక్వాటర్ ప్రాంతాన్ని కలుషితం చేస్తున్న పర్యాటకులు పచ్చని ప్రకృతిలో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను పారవేస్తున్న వైనం పట్టించుకోని అధికారులు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
● 8 వాహనాలు స్వాధీనం ఆర్మూర్టౌన్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు చేసి అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టుకున్నారు. 350 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు నిజామాబాద్ సివిల్ సప్లయీస్ ఓఎస్డీ శ్రీధర్రెడ్డి తెలిపారు. బియ్యంతోపాటు ఒక వ్యాన్, ఏడు మినీ లేలాండ్ వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించామన్నారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థుల యుడైస్ చేయాలి ఖలీల్వాడి: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థి వివరాలను యుడైస్ (యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్)లో నమోదు చేయాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. జిల్లా ఇంటర్ విద్యాధికా రి కార్యాలయంలో బుధవారం ప్రభు త్వ కళాశాలల ప్రిన్సిపాళ్లతో డీఐఈవో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. అడ్మిషన్లను మరిన్ని పెంచేందుకు ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు కృషి చేయా లని, ప్రతి గ్రామానికి వెళ్లాలని ఆదేశించారు. పాఠ్యపుస్త కాల పంపిణీని పూర్తి చేయాలని, కళాశాల ల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చా లని, విద్యార్థుల సమస్యలను ఎప్పటిక ప్పుడు పరిష్కరించేందుకు ప్రిన్సిపాళ్లు కృషి చేయాలని ఆదేశించారు. ప్రిన్సిపాల్తో సహా అధ్యాపకులందరూ సమయపాలన పాటించాలని అన్నారు. అధ్యాపకుల కొరతకు సంబంధించి వివరాలు అందిస్తే గెస్ట్ లెక్చరర్లను నియమించేందుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో ప్రిన్సిపాల్లు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినికి హెల్పింగ్ హార్ట్స్ చేయూత నిజామాబాద్ అర్బన్: ఉన్నత విద్యాభ్యాసానికి ఆర్థిక స్థోమత లేని ఓ విద్యార్థినికి రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆర్థిక చేయూతనందించింది. నిజామాబాద్ నగరంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన ఎం కీర్తి బాసర ట్రిపుల్ ఐటీలో సివిల్ ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కీర్తిది పేద కుటుంబం కావడంతో రూ.2.10 లక్షల ఫీజు బకాయిలు చెల్లించే స్థోమత లేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. విషయం తెలుసుకున్న హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు ఆ విద్యార్థినికి అండగా నిలిచారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా బుధవారం రూ.లక్ష చెక్కును అందజేశారు. ఫౌండేషన్ సేవలను ప్రభుత్వ సలహదారుతోపాటు కలెక్టర్ ప్రశంసించారు. ఫౌండేషన్ ప్రతినిధులు రమణ్రెడ్డి, మహేశ్, శ్రీనివాస్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ఎదుట వీడీసీ సభ్యుల ధర్నా
నిజామాబాద్ అర్బన్: కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నందిపేట గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీనివాస్, సుధాకర్, గ్రామస్తులు ధర్నా చేశారు. నందిపేటలో వీడీసీ భవనం నిర్మాణానికి, నర్సరీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని బోరుకూడా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కానీ సర్పంచ్ ఎర్రం లింగం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా జేసీబీలతో అట్టి స్థలాన్ని ధ్వంసం చేశారని అన్నారు. అధికారులు తక్షణమే సర్పంచ్పై చర్యలు తీసుకోవాలని కోరారు. కొనసాగుతున్న ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పరీక్షలు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం రెగ్యులర్, బ్యాక్లాగ్ సెమిస్టర్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం నిర్వహించిన పరీక్షలకు 28 మందికి 26 మంది హాజరు కాగా ఇద్దరు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలకు 12 మందికి 11 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులకు సంబంధించి నాల్గో, ఐదో సెమిస్టర్లు, 7, 9వ సెమిస్టర్ల బ్యాక్లాగ్ థియరీ పరీక్షలు ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కే సంపత్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 28 నుంచి.. పీజీ, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల పరీక్షలు ఈ నెల 28 నుంచి ప్రారంభమవుతాయని సంపత్కుమార్ మరో ప్రకటనలో తెలిపారు. పీజీ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంఎస్డబ్ల్యు, ఎంబీఏ, ఎంసీఏ, ఇంటిగ్రేటెడ్ పీజీ 4 వ సెమిస్టర్, ఐఎంబీఏ 10వ సెమిస్టర్ రెగ్యులర్, ఐఎంబీఏ, ఐపీసీహెచ్ 6వ సెమిస్టర్ బ్యాక్లాగ్, ఐపీసీహెచ్ 6వ సెమిస్టర్ రెగ్యులర్ సిద్ధాంత పరీక్షలకు ఈ షెడ్యూల్డ్ వర్తిస్తుందని పేర్కొన్నారు. ఆయా పరీక్షలకు సంబంధించి పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ www. telanganauniversity.ac.in ను సంప్రదించాలని ఆయన సూచించారు. నిజామాబాద్ అర్బన్: వర్నిచౌరస్తాలో బుధవారం నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న వారిని అరెస్టు చేసినట్లు ఐదో టౌన్ ఎస్సై సునీల్ తెలిపారు. వాహనాల తనిఖీలో కై జర్, రమేశ్గౌడ్ అనే ఇద్దరు బైక్పై వస్తుండగా వారి ప్రవర్తనలో మార్పు గమనించిన పోలీసులు వారిని ఆపారు. వారి నుంచి రూ.500 నోట్లతో ఉన్న రూ.1లక్షా65వేలు ఉన్న నగదును స్వాధీనం చేసుకోగా అందులో ఉన్న రూ. లక్ష నగదు నకిలీ కరెన్సీగా పోలీసులు గుర్తించారు. వీరితో పాటు వీరికి సహకరించిన 8 మంది నిందితులపై కేసు నమోదు చేయగా రమేశ్గౌడ్, కై జర్లను రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
29 నుంచి పీజీ బ్యాక్లాగ్ పరీక్షలు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ, 1, 3వ సెమిస్టర్లు, ఇంటిగ్రేటెడ్ పీజీ (ఐదేళ్ల కోర్సులు) 7, 9వ సెమిస్టర్ల బ్యాక్లాగ్ థియరీ పరీక్షలు ఈ నెల 29వ తేదీన ప్రారంభమై ఆగస్టు 14వ తేదీవరకు నిర్వహించబడతాయని పరీక్షల నియంత్రణాధికారి సంపత్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు తెయూ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. తెయూ(డిచ్పల్లి): తెయూ పరిధిలో జరుగుతున్న డిగ్రీ వన్టైం చాన్స్ బ్యాక్లాగ్ 1, 2, 3, 4, 5, 6వ సెమిస్టర్ పరీక్షలకు బుధవారం 26 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం నిర్వహించిన పరీక్షలకు 262 మందికి 250 మంది హాజరు కాగా 12 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన ప రీక్షలకు 172 మందికి 158 మంది హాజరు కా గా 14మంది గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. క్యాంపస్ డ్రైవ్లో 29 మంది ఎంపిక తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రముఖ ఔషధ సంస్థ హెటిరో డ్రగ్స్ (హైదరాబాద్) కంపెనీ బుధవారం క్యాంపస్ (వాక్–ఇన్) ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో తెయూ రసాయన శాస్త్ర విభాగంతో పాటు అనుబంధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలలో ప్రతిభ కనబరిచిన మొత్తం 29 మంది విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసినట్లు హెటిరో డ్రగ్స్ కంపెనీ హెచ్ఆర్ శ్రీకాంత్, వేణుమాధవ్ తెలిపారు. ఎంపికై న వారిలో 10 మంది డిగ్రీ, 19 మంది పీజీ విద్యార్థులున్నారు. ఉద్యోగాలకు ఎంపికై న విద్యార్థులను తెయూ వీసీ యాదగిరి రావు, రిజిస్ట్రార్ యాదగిరి, రసాయనశాస్త్ర విభాగాధిపతి సాయిలు, అధ్యాపకులు బాల్కిషన్, గంగాకిషన్, డానియల్, రాజేశ్వరి, నాగేంద్రబాబు, సురేశ్, నాగేశ్వర్రావు అభినందించారు. వీసీ మాట్లాడుతూ.. పరిశ్రమలతో వర్సిటీల అనుసంధానం విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని పేర్కొన్నారు. తెయూ(డిచ్పల్లి): విద్యార్థులు గంజాయి, డ్రగ్స్, మాదకద్రవ్యాల వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అపర్ణ సూచించారు. తెయూ ఎన్ఎస్ఎస్ యూనిట్4 ఆధ్వర్యంలో వికసిత్ భారత్ లక్ష్యసాధనలో భాగంగా యువతను మాదకద్రవ్యాల బారి నుంచి కాపాడేందుకు ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్’ అనే అంశంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎన్ఎంబీఏ నోడల్ అధికారి లావణ్య, ప్రోగ్రాం ఆఫీసర్లు నర్సయ్య, స్వామి, అలీమ్ఖాన్, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
భీమ్గల్ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం
వేల్పూర్: సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వా మ్యబద్ధంగా, శాంతియుతంగా దీక్ష చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయమెందుకని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన పోలీసుల ఆంక్షల మ ధ్య తన స్వగృహంలోనే నిరాహార దీక్ష కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభు త్వం భీమ్గల్ ప్రజల వైద్య అవసరాల కోసం వంద పడకల ఆస్పత్రిని మంజూరు చేసిందని, ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని చె ప్పారు. మిగిలిన పనులు పూర్తి చేయాలని గత రెండున్నరేళ్లుగా అసెంబ్లీలో, భీమ్గల్ వేదికగా అనేక పోరాటా లు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. బస్ డిపోను పునరుద్ధరించాలని, సీసీ రోడ్డు, మార్కెట్ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. నాలుగు డిమాండ్ల సాధన కోసం తాను భీ మ్గల్లో ఒకరోజు నిరాహార దీక్షకు అనుమతి కో రుతూ సీపీ, ఏసీపీ, ఎస్హెచ్వోలకు ముందస్తు సమాచారం ఇచ్చామని, అయినప్పటికీ పైఅధికారుల ఆదేశాలు ఉన్నాయని చెబుతూ వేకువజాము నే పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టి బయటకు రాకుండా గృహ నిర్భంధం చేశారన్నారు. భీమ్గల్లో దీక్ష కోసం వేసిన టెంట్లను, స్టేజీని తొలగించడమే కాకుండా ప్లెక్సీలను సైతం పోలీసులు చించి వేశారని ఆరోపించారు. భీమ్గల్లో వంద పడకల ఆస్పత్రి ప్రారంభమయ్యేవరకు, మూతపడిన బస్ డిపోను తెరిపించేవరకు, మార్కెట్, అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్ల పనులు పూర్తయ్యే వరకు తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై శాంతియుత దీక్షకు భయమెందుకు? పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ మాట తప్పారు అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకు విశ్రమించేది లేదు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పోలీసు పహారాలో స్వగృహంలోనే కొనసాగిన దీక్ష -
క్రైం కార్నర్
ప్రమాదవశాత్తు ఒకరి మృతి మాక్లూర్: మండలంలోని ముల్లంగి(బి) శివారులో బుధవారం సాయంత్రం దమ్ము చేసిన పంట పొలంలో ఒకరు మృతిచెందారు. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం.. ముల్లంగి(బి) గ్రామానికి చెందిన బట్టు గంగాధర్(40) తన పొలంతో పాటు ఇతరుల వ్యవసాయ భూమి కౌలుకు చేస్తాడు. ఉదయం పొలం పనులకు వెళ్లిన అతను రాత్రి అయినా తిరిగిరాలేదు. కుటుంబీకులు పలుచోట్ల గాలించారు. దమ్ము చేసిన పొలంలో ప్రమాదవశాత్తు పడి మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. డిచ్పల్లి: డిచ్పల్లిలోని తెయూ సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో దోర్నాల భరత్కు తీవ్ర గాయాలయ్యాయి. డిచ్పల్లి ఎస్సై మహమ్మద్ ఆరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. కాలూరు గ్రామానికి చెందిన భరత్ ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాడు. తెయూ డిగ్రీ వన్టైం ఛాన్స్ బ్యాక్లాగ్ పరీక్షల్లో భాగంగా వారం రోజుల క్రితం డిచ్పల్లికి వచ్చి వారి బంధువుల వద్ద ఉంటూ పరీక్షలు రాస్తున్నాడు. బుధవారం పరీక్ష రాసిన తర్వాత యూనివర్సిటీకి నుంచి డిచ్పల్లికి బైక్ పై వస్తుండగా లారీ ఢీకొన్నది. అదే సమయంలో తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్న ఎస్సై ఆరీఫ్ వెంటనే 108 అంబులెన్స్లో క్షతగాత్రుడిని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోస్లీ శివారులో కూలీలకు ..నవీపేట: మండలంలోని కోస్లీ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలైనట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కోస్లి శివారులో వరి నాట్లు వేసేందుకు ఉత్తరప్రదేశ్ నుంచి కూలీలు వలస వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామానికి చెందిన డాంగె రాజబాబు వ్యవసాయ పొలంలో వరి నాట్లు వేసేందుకు వచ్చిన కూలీలు తిరుగు ప్రయాణంలో వాహనం అదుపుతప్పి మార్గమధ్యలో బోల్తా కొట్టిందన్నారు. రాజబాబు నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నలుగురిని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. రాజబాబుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉండాలి
నిజామాబాద్ రూరల్: రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉండాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బుర్రి ప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో వర్షాభావ పరిస్థితుల మూలంగా రైతులు వేసిన పంటలు దెబ్బతిని నష్టపోయే పరిస్థితి వచ్చిందని, ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం తక్కువగా ఉండటంతో పంటలు పండించటం కష్టమవుతుందని ఫలితంగా కరువు పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. రైతులను ఆదుకోవటానికి కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలని, ప్రధానంగా రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘం కార్మిక సంఘాలతో సమావేశాలు నిర్వహించి వీటిని ఎదుర్కోవటానికి తీసుకోవాల్సిన కార్యాచరణపై చర్చించాలన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి రమేశ్బాబు, కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, వెంకటేశ్, శంకర్గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు కొండ గంగాధర్, నన్నేసావ్ జంగం, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి
కమ్మర్పల్లి : వర్షాకాలంలో మలేరియా, డెంగీ మొదలగు సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చే పట్టాలని వైద్య సిబ్బందికి డీఎంహెచ్వో రా జశ్రీ సూచించారు. మండలంలోని చౌట్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆ మె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆరోగ్య మహిళా కార్యక్రమం, అమ్మ ఒడి కార్యక్రమాల అమలును పరిశీలించారు. గర్భిణుల కు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నా రు. ప్రతి మహిళను మంగళవారం తప్పకుండా స్క్రీనింగ్ చేయాలని, దానికి సంబంధించిన అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహించాలని వై ద్యాధికారి అసీనను ఆదేశించారు. అనంతరం ల్యాబ్తో పాటు ప్రసూతి గది, వార్డులను, ఆస్పత్రి రికార్డులు రిపోర్టులను తనిఖీ చేశారు. ఆర్మూర్టౌన్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్మూర్ డిపోలోని కార్గో పార్సిల్ సర్వీస్ కార్యాలయంలో మిగిలిపోయిన పాత పార్సిళ్లకు వేలంపాట నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ ప్రతిమరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్మూర్ బస్టాండ్ ప్రాంతంలోని బస్పాస్ కౌంటర్ వద్ద నేడు సాయంత్రం 4.00 గంటలకు వేలం ప్రారంభిస్తామన్నారు. ఆసక్తిగలవారు వేలంపాటలో పాల్గొని తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చని డిపో మేనేజర్ పేర్కొన్నారు. వర్ని: తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారు డికి రేషన్ బియ్యాన్ని సక్రమంగా పంపిణీ చే యాలని జిల్లా ఎన్ఫోర్స్ మెంట్ డీటీ శ్రీనివా స్ సూచించారు. మోస్రా మండల కేంద్రంలోని రేషన్ దుకాణాన్ని మంగళవారం ఆయన తని ఖీ చేశారు. ప్రతిరోజు ఉదయం నుంచి సా యంత్రం వరకు లబ్ధిదారులకు బియ్యాన్ని అందజేయాలని డీలర్లకు సూచించారు. రేషన్ పంపిణీలో అవకతవకలకు పాల్పడరాదని సమయపాలన పాటించాలని ఆయన సిబ్బందికి పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్: గురుపౌర్ణమిని పురస్కరించుకొని గురుబ్రహ్మ, గురుశిరోమణి పుర స్కారాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్కు చెందిన సర్వేజనా సుఖినోభ వంతు సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఈ ఎస్ఎస్ నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా, వైద్యం, సాహిత్యం,సంగీతం, నృత్యం, కళలు, క్రీడలు, కరాటే, అధ్యాత్మికం, నాటకరంగం, టీవీ, సినీరంగాలలో సేవలందిస్తున్న, ప్ర తిభావంతులైన గురువులు అర్హులన్నారు. పుర స్కారాల కోసం కోసం వారి సేవలను, ప్రతిభను, గురించి తెలియజేసే సర్టిఫికెట్స్, ఫొటో లు, పత్రికల క్లిప్పింగ్స్, గతంలో పొందిన పురస్కారల సర్టిఫికెట్స్, జిరాక్స్ కాపీలతో పాటు 4పాస్పోర్టు సైజు ఫొటోలను దరఖాస్తుకు జతచేసి ఈనెల 20లోగా ఆఫీస్ చిరునామా: స ర్వేజనా సుఖిణోభవంతు డోర్ నం. 1–20–164, తిరుమలగిరి, గోకుల్నగర్, వెంకటాపురం, సికింద్రాబాద్–15నకు పంపాలన్నారు. ఇతర వివరాలకు 9652347207 సంప్రదించాలన్నారు. -
‘పసుపు ఉత్పత్తిదారుల సంఘాలకు నిధులివ్వండి’
జక్రాన్పల్లి : పసుపు రైతుల ఉత్పత్తిదారుల సంఘా లకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజేను రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు తిరుపతిరెడ్డి కోరారు. మంగళవారం హై దరాబాద్లో జేఎంకేపీఎం రైతు ఉత్పత్తి దారుల సంఘం ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రిని కలి సి వినతిపత్రం అందజేశారు. శాఖ తరఫున గ్రామీ ణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పరిశ్రమలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు తిరుపతిరెడ్డి తెలిపారు. ప్రకృతి ఎన్జీవో సీఈవో జయశ్రీ, డైరెక్టర్లు సామ గంగారెడ్డి, అల్లూరి సంతోష్, గడ్డం శ్రీనివాస్, పుప్పాల నాగేశ్, రాజు తదితరులు సహాయ మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. -
బైక్ దొంగల అరెస్ట్
బోధన్: పట్టణ, పరిసర ప్రాంతాల్లో మోటర్ బైక్లను దొంగతనానికి పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు బోధన్ ఏసీపీ శ్రీనివాస్, టౌన్ సీఐ వెంకటనారాయణ తెలిపారు. పట్టణంలోని పోలీస్స్టేషన్లో మంగళవారం వారు వివరాలను వెల్లడించారు. పట్టణ శివారులోని బాబాగార్డెన్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బోధన్లోని బీటీనగర్కు చెందిన వసీం, ఆటోనగర్ కాలనీకి చెందిన జావిద్లు అనుమానాస్పదంగా బైక్పై రావడంతో పట్టుకుని విచారించారు. విచారణలో వారు బైక్ల చోరీలకు పాల్పడుతున్నట్టు వెల్లడైంది. దీంతో వారిని పట్టుకొని, వారి వద్ద నుంచి ఐదు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్సై బాబురావు, కానిస్టేబుల్స్ గంగారాం, శివకృష్ణను ఏసీపీ అభినందించారు. -
అనుమతిలేని బడులపై చర్యలు తీసుకోండి
ఖలీల్వాడి: జిల్లాలోని అనుమ తి లేని ప్లేస్కూళ్లపై చర్యలు తీ సుకోవాలని డీఈవో అశోక్ ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. జూన్ 20న సాక్షి దినపత్రికలో ‘ప్లే స్కూళ్లలో భరోసా ఎక్కడ?‘ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ వార్తకు విద్యాశాఖ అధి కారులు స్పందించారు. ప్లే స్కూల్స్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని విద్యాశాఖ దృష్టికి రాలేదని తెలిపారు. జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులకు తమ పరిధిలో అలాంటి పాఠశాలలు ఏమైనా ఉంటే వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. గంజాయి పట్టివేత నిజామాబాద్అర్బన్ : నగరంలోని బాబన్సపహాడ్లో మంగళవారం ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ దాడిచేసి ఎండుగంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్హెచ్వో వెంకటేశ్ తెలిపారు. బజాజ్పల్సర్ వాహనంపై సౌద్చౌస్ గంజాయి విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. అతని వద్ద 152 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కామారెడ్డి అర్బన్: వీకేఆర్ ఎంటర్టైన్మెంట్స్ ఆ ధ్వర్యంలో సందేశాత్మక ప్రేమకథా చిత్రం షూటింగ్ సోమవారం రాత్రి కామారెడ్డి సమీపంలోని ఒక దాబా హోటల్లో ప్రారంభించారు. వీకే రమేష్ నిర్మాతగా, సత్యమార్క దర్శకత్వంలో హీరో, హీరోయిన్గా మధు, పూజ నటిస్తున్నారు. ఈ చిత్రానికి గేయ రచయితగా రుద్రంగి రమేష్, సంగీతం జరపాల రమేష్, కోరియోగ్రాఫర్ గా అమ్మ రమేష్ పని చేస్తున్నారు. జిల్లాకు చెందిన యువకులు కొందరు ఈ చిత్రంలో నటిస్తున్నారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు అంబీర్ మనోహర్రావు క్లాప్ కొట్టగా కథానాయిక పూజపై క్లాప్ కొట్టారు. -
టీకాలతో నియంత్రించే వ్యాధులు నమోదు చేయాలి
సుభాష్నగర్ : టీకాల ద్వారా నియంత్రించే వ్యాధులను ఇకనుంచి జిల్లాస్థాయిలో కాకుండా పీహెచ్సీ స్థాయిలోనే ‘వ్యాక్సిన్ ప్రివెన్టబుల్ డిసిజెస్ సిస్టమేటిక్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్’లో నమోదు చేయాలని ట్రైనర్, పిల్లల వైద్య నిపుణులు శ్రీకాంత్ సూచించారు. నగరంలోని కలె క్టరేట్లోగల డీఎంహెచ్వో కార్యాలయంలో టీకాల ద్వారా నియంత్రించే వ్యాధులపై మంగళవారం జి ల్లాస్థాయి శిక్షణా కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 8 జిల్లాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారని, అందులో నిజామాబాద్ ఒకటని తెలిపారు. వ్యాక్సి న్ ప్రివెన్టబుల్ డిసిజెస్ సిస్టమేటిక్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్లో భాగంగా టీకాల ద్వారా నియంత్రించే వ్యాధుల తీవ్రతను తగ్గించడం, అకస్మాత్తు గా ఒకేసారి ఎక్కువ మొత్తంలో వ్యాధులతో బాధపడే వ్యక్తుల అవుట్ బ్రేక్స్ను గుర్తిస్తారన్నారు. అలా గే పలు అంశాలపై అవగాహన కల్పించారు. నులిపురుగుల నివారణ ఆరోగ్య కార్యక్రమాలపై వైద్యాధికారులకు డీఎంహెచ్వో రాజశ్రీ సూచనలు చేశారు. డీఐవో అశోక్, అజ్మల్, శ్రావ్య, డీడీఎం పృథ్వీ, డి ప్యూటీ డీఎంహెచ్వో రవీందర్, విద్య, సికందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కదిలొచ్చిన ఉద్యోగం
కరిగించిన కథనం..● వెన్ను విరిగిన భర్తకు దన్నుగా నిలుస్తున్న మల్లీశ్వరి ● ఆమె కష్టాన్ని కళ్లకు కట్టిన ‘సాక్షి’ ● ఉద్యోగం ఇచ్చి అండగా నిలిచిన విద్యుత్ శాఖ ● సాయానికి ముందుకొస్తున్న దాతలు సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/నాగిరెడ్డిపేట : విద్యుత్ స్తంభంపై నుంచి పడిపోయి వెన్నువిరిగిన యాదగి రి దీనస్థితిపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం అధికారులను కదిలించింది. ఆయన భార్యకు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో క్యాజువల్ లేబర్ ఉద్యోగాన్ని ఇచ్చారు. నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట గ్రామానికి చెందిన బోయిని యాదగిరి విద్యుత్ శాఖలో క్యాజువల్ లేబర్గా పనిచేసేవాడు. గతేడాది జూన్ 3న స్తంభంపై ఏబీ స్విచ్ మరమ్మతు చేసే క్రమంలో కిందపడిపోగా వెన్నుపూస దెబ్బతింది. నడుము, రెండు కాళ్లు సచ్చుబడిపోయాయి. సికింద్రాబాద్ కి మ్స్లో వైద్యం చేయించినా మెరుగుపడలేదు. ఇక ముందు కూడా ఆయన పరిస్థితి అంతే అని వైద్యు లు చెప్పారు. యాదగిరికి తండ్రి మల్లయ్య, భార్య మల్లీశ్వరి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. యాదగిరిని ఇంటికి తీసుకువచ్చి ఏడాది కా లంగా ఆయన భార్య సపర్య లు చేస్తూ కంటికి రెప్పలా చూ సుకుంటోంది. ఆమె కష్టాలను ‘సాక్షి’ కళ్లకు కట్టేలా ‘ఆమే వె న్నెముక’ శీర్షికన ఈనెల 12న కథనాన్ని ప్రచురించింది. ఇది ఎందరినో కదిలించింది. మూడు రోజుల్లో పలువురు దాతల ద్వారా దాదాపు రూ.90 వేల సాయం అందింది. మల్లీశ్వరి కి ఉద్యోగం ఇస్తే ఆ కుటుంబానికి ఎంతో ఆసరా అ వుతుందని ‘సాక్షి’ ఆ కథనంలో నొక్కిచెప్పడంతో విద్యుత్ అధికారులు స్పందించారు. అవుట్ సోర్సింగ్ ద్వారా క్యాజువల్ లేబర్ ఉద్యోగాన్ని ఇస్తూ మంగళవారం నియామకపు కాపీని ఆమెకు అందించా రు. నాగిరెడ్డిపేట సమీపంలోని బంజర సెక్షన్ ఆఫీ సులో క్యాజువల్ లేబర్ ఉద్యోగం కల్పించారు. దీంతో ఏడాది కాలంగా ఎన్నో అవస్థ లు పడుతున్న యాదగిరి కుటుంబానికి ఊరట కలిగింది. ఈ సందర్భంగా మళ్లీశ్వరి మాట్లాడుతూ తాము పడుతున్న కష్టాలను వెలుగులోకి తీసుకువచ్చి న ‘సాక్షి’కి ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. సాయం అందించిన దాతలు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. -
చోరీ చేసి.. మళ్లీ తీసుకువచ్చి..
● పెద్దమల్లారెడ్డిలో బైక్ను యథాస్థానంలో ఉంచిన దుండగులు భిక్కనూరు: ఎత్తుకెళ్లిన బైక్ను తిరిగి యజమాని ఇంటి ముందు గుర్తుతెలియని వ్యక్తులు పెట్టిన ఘటన భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో మంగళవారం వేకువజామున జరిగింది. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన సురేష్ కుమార్ తన బైక్ను ఇంటి ముందు నిలిపి ఉంచగా గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసిన విషయం విధితమే. ఈ విషయమై బాధితుడు సురేష్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై అంజనేయులు ఘటన స్థలాన్ని సందర్శించి, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో గుర్తుతెలియని వ్యక్తులు తాము ఎత్తుకెళ్లిన వాహనాన్ని తిరిగి యజమాని అయిన సురేష్ కుమార్ ఇంటి ముందర నిలిపి వెళ్లిపోయారు. బైక్ హెడ్లైట్తోపాటు పలుచోట్ల వాహనంను ధ్వంసం చేశారు. -
తెయూ సమాచారం..
అసలైన ఉద్యమకారులను గుర్తించాలి తెయూ(డిచ్పల్లి): తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ప్రభుత్వం నియమించిన కేకే కమిటీ కొంతమందికే సమాచారం ఇచ్చి సలహాలు స్వీకరిస్తుందని, అసలైన ఉద్యమకారులను పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ యూనివర్సిటీలోమంగళవారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పలు అంశాలపై చర్చించారు. పలువురు విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. ఇకనైనా కమిటీ అసలైన ఉద్యమకారులను గుర్తించి తగు న్యాయం చే యాలని కోరారు. నాయకులు శ్రీనివాస్గౌడ్, పిట్ల సరిత, రవి, ప్రదీప్, రవీందర్ నాయక్, పస్క నర్స య్య, పిల్లి శ్రీకాంత్, పులి జైపాల్, ఎల్బీ రవి కుమా ర్, సౌందర్య, ప్రసన్న, సిద్ధలక్మి, బట్టు సురేష్, సంతోష్, బాల్రాజు నాయక్, సుధాకర్, రమేష్ నాయ క్, భరత్, సత్యం, వాసరి సాయినాథ్, విజయలక్ష్మి, స్వరూప తదితరులు పాల్గొన్నారు. నేడు క్యాంపస్లో వాక్–ఇన్ ఇంటర్వ్యూ తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బుధవారం ప్రముఖ ఔషధ సంస్థ హెటెరో డ్రగ్స్ సహకారంతో వాక్–ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు వీసీ యాదగిరిరావు తెలిపారు. తెయూలోని తన ఛాంబర్లో కార్యక్రమ బ్రోచర్ను వీసీ మంగళవారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్వ్యూలు నేడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతాయన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభను చాటుకోవాలని కోరారు. ఈ వాక్–ఇన్ ఇంటర్వ్యూలకు హెటెరో డ్రగ్స్, హైదరాబాద్ సంస్థ ప్రతినిధులు హాజరై అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. బీఎస్సీ, బీకాం, బీఏ, ఎంఎస్సీ (కెమిస్ట్రీ), ఐటీఐ, డిప్లొమా తదితర అర్హతలు కలిగి, 2024–2026 మధ్య ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులన్నారు. రసాయన శాస్త్ర విభాగాధిపతి సాయిలు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న డిగ్రీ పరీక్షలు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధి లో కొనసాగుతున్న డిగ్రీ 1, 2, 3, 4, 5, 6వ సెమిస్టర్ బ్యాక్లాగ్ వన్టైమ్ చాన్స్ పరీక్షలు మంగళవా రం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు 253 మంది విద్యార్థులకు గాను 233 మంది హాజరు కాగా 20 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 238 మంది విద్యార్థులకు గాను 223 మంది హాజరు కాగా 15 మంది గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పరీక్షలు ప్రారంభం తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో ఎ ల్ఎల్బీ, ఎల్ఎల్ఎం రెగ్యులర్, బ్యాక్లాగ్ సెమిస్ట ర్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమై నట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు 28 మంది విద్యార్థులకు గాను 26 మంది హాజరు కాగా ఇద్దరు గైర్హాజరైనట్లు తెలిపారు. మధ్యాహ్నం జరిగి న పరీక్షకు 09 మంది విద్యార్థులకుగాను ఆరుగురు హాజరు కాగా ముగ్గురు గైర్హాజరైనట్లు తెలిపారు. -
స్కూటీని ఢీకొన్న లారీ: ఒకరి మృతి
నిజామాబాద్ అర్బన్: నగరంలోని బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. వివరాలు ఇలా.. నగరంలోని గాజులపేటకు చెందిన నవీన్(25)అనే యువకుడు పాలు విక్రయిస్తూ, జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో సోమవారం బైపాస్ రోడ్డులోని పవర్గార్డెన్ వద్ద నవీన్ స్కూటీపై బయలుదేరగా, అర్సపల్లి వైపు వెళుతున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నవీన్ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తల్లి విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. -
గుప్పుమంటున్న గంజాయి
బాన్సువాడ : గంజాయి విక్రయాలకు బాన్సువాడ కేరాఫ్ అడ్రస్గా మారింది. రెండు రాష్ట్రాల సరిహద్దులకు దగ్గరగా ఉన్న బాన్సువాడలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. బాన్సువాడ, బీర్కూర్ ప్రాంతాల్లో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరుగుతున్నా ఎకై ్సజ్ శాఖ అధికారులు అటువైపు దృష్టి సారించకపోకవడం గమనార్హం. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో గంజాయిని కొనుగోలు చేసి బాన్సువాడలో విక్రయిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా కూలీలు, యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి దందా సాగిస్తున్నారు. వారం రోజుల క్రితం బీర్కూర్లో నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీర్కూర్ మంజీర నదిపై వారధి నిర్మించడంతో మహారాష్ట్రకు రవాణా సౌకర్యం చాలా దగ్గరైంది. దీంతో అక్రమార్కులు ఈ వారధి నుంచే దెగ్లూర్ ప్రాంతం నుంచి బీర్కూర్కు గంజాయి తీసుకొస్తున్నట్లు తెలిసింది. బాన్సువాడలోని సంగమేశ్వర కాలనీ, తాడ్కోల్ డబుల్ బెడ్ రూం కాలనీ, గౌలీగూడ తదితర ప్రాంతాల్లో రోజువారీ కూలీలు, యువకులు గంజాయి మత్తులో జోగుతున్నారు. టీ పాయింట్ల వద్ద సిగరెట్లలో గంజాయిని సేవిస్తున్నట్లుగా తెలుస్తోంది. సమాచారం ఇస్తే తప్ప అటు వైపు అధికారులు దృష్టి సారించలేకపోవడం గమనార్హం. కూపీ లాగుతున్న పోలీసులు.. ఇటీవల బీర్కూర్లో గంజాయి సేవిస్తుండగా పట్టుబడిన నలుగురు కూడా మైనర్లే కావడం గమనార్హం. ఇటు మహారాష్ట్ర, అటు కర్ణాటకకు దగ్గరగా ఉన్న బాన్సువాడ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసు, ఎకై ్సజ్ శాఖ అధికారులు నిత్యం తనిఖీ లు చేపట్టడంతో పాటు గంజాయి అక్రమ రవాణా పై ప్రత్యేక దృష్టి సారించారు. పాత కేసుల్లో పట్టుబడిన వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు. ఏం చేస్తున్నారనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. వారం రోజుల క్రితం నలుగురు మైనర్లు గంజాయి సేవిస్తుండగా అదుపులోకి తీసుకున్నాం. వీరికి గంజాయి ఎక్కడ లభించింది. ఎవరు సరఫరా చేస్తున్నారు.. అనే కోణంలో విచారణ చేస్తున్నాం. ప్రత్యే క నిఘా పెట్టాం. గంజాయికి యువకులు బానిస కావొద్దు. గంజాయి సేవించినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవు. –రాములు, ఎస్సై, బీర్కూర్ బానిసలుగా మారుతున్న రోజువారీ కూలీలు, యువకులు టీ పాయింట్లు, పట్టణ శివారు ప్రాంతాలే అడ్డాలు తాజాగా బీర్కూర్లో నలుగురు యువకుల అరెస్ట్ అవగాహన కల్పిస్తున్నా ఫలితం శూన్యం -
5.1 కిలోల గంజాయి పట్టివేత
నిజామాబాద్ అర్బన్: నగరంలోని రైల్వేస్టేషన్లో భారీగా గంజాయిని ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. ఎకై ్సజ్ పోలీసులు తెలిపిన వివరాలు ఇ లా.. నిజామాబాద్ రైల్వేస్టేషన్కు వస్తున్న నాగావ ళి ఎక్స్ప్రెస్ రైలులో గంజాయి తరలిస్తున్నారనే స మాచారం రావడంతో సోమవారం స్టేషన్లో రైలు ఆగిన అనంతరం పోలీసులు తనిఖీలు చేపట్టారు. బీహార్కు చెందిన అఖిల్ అలం, మహమ్మద్చాంద్ అనే ఇద్దరు వ్యక్తులు 5.1 కిలోల గంజాయిని సంబల్పూర్ నుంచి నాందేడ్ వెళుతున్న నాగవల్లి ఎ క్స్ప్రెస్లో తరలిస్తుండగా పట్టుకున్నారు. అలాగే గంజాయిని, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ సబ్ఇన్స్పెక్టర్ గంగాధర్ తెలిపారు. ట్రెయినీ ఏఈఎస్ గాయత్రి, కా నిస్టేబుళ్లు దేవేందర్, శైలేష్, గౌతమ్ పాల్గొన్నారు. బోధన్లో.. బోధన్: పట్టణంలోని బాబాగార్డెన్ వద్ద సోమవా రం మధ్యాహ్నం పోలీసులు తనిఖీలు చేపట్టగా, బోధన్కు చెందిన షేక్ కమ్రాన్ వద్ద 194 గ్రాముల గంజాయి లభ్యమైనట్లు సీఐ వెంకటనారాయణ తెలిపారు. కమ్రాన్ మహారాష్ట్ర ప్రాంతంలోని నాందేడ్ నుంచి గంజాయి తీసుకొచ్చినట్టు తమ విచారణలో తెలిసిందని పేర్కొన్నారు. గంజాయిని సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
చోరీ కేసుల్లో జైలుకు.. బెయిల్పై వచ్చి అదే పని..
● జైల్లో పరిచయమైన వ్యక్తి ఇంటికి వెళ్లి దొంగతనానికి పాల్పడ్డ నిందితుడు ● 48 గంటల్లోనే అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు ఎల్లారెడ్డి: పలు చోరీ కేసుల్లో జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ.. ఇటీవల బెయిల్పై వచ్చి మళ్లీ చోరీకి పాల్పడి, పోలీసులకు చిక్కాడు. ఎల్లారెడ్డిలో సోమవారం డీఎస్పీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. లింగంపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన నీరుడి సాయిలు అనే పాత నేరస్థుడు పలు చోరీ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. జైలులో అతడికి ఎల్లారెడ్డి మండలం లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన పుర్రె సాయిలు అనే నేరస్తుడితో పరిచయం ఏర్పడగా, వివరాలన్నీ తెలుసుకున్నాడు. ఇటీవల అతడు బెయిల్పై విడుదల కాగా, ఈనెల 11న పుర్రె సాయిలు ఇంటికి వెళ్లి, మీ కొడుకు బెయిల్ కోసం డబ్బులు తీసుకురమ్మనాడని తల్లి కాశవ్వకు తెలిపాడు. బీరువాలో డబ్బులు దాచాడని, వాటిని ఇవ్వమని కోరాడు. ఆమె డ బ్బులు లేవని తెలపడంతో నిందితుడు వారితో ముచ్చటిస్తూ కల్లు తెప్పించాడు. వారంతా కల్లు తాగి, మత్తులో ఉండగా త లారి దుర్గవ్వపై దాడి చేసి ఆమె మెడలో ఉన్న బంగారు గుండ్ల గొలుసును లాక్కున్నాడు. కుక్కల పోశవ్వ అనే మహిళ చేతికి ఉన్న వెండి కడియం తీసుకుని పారిపోయాడు. బాధితులు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు ప్రారంభించారు. నీరుడి సాయిలును నిందితుడిగా గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. నేరాన్ని ఒప్పుకోవడంతో కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి దాదాపు 12 గ్రాముల బంగారు గుండ్ల తాడు, 4 తులాల వెండి కడియాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీఐ రాజిరెడ్డి, ఎస్సై రాజు, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
ఆయిల్పామ్తో స్థిరమైన ఆదాయం
సిరికొండ: ఆయిల్ పామ్ సాగుతో రైతులకు స్థిర మైన ఆదాయం లభిస్తుందని జిల్లా ఉద్యాన పట్టు ప రిశ్రమ శాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని గడ్కోల్, చీమన్పల్లి రైతు వేదికల్లో సోమవా రం ఆయన ఆయిల్పామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. గడ్కోల్ సదస్సులో శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆయిల్పామ్ సాగుతో రై తులకు అనేక విధాల లాభాలున్నాయని తెలిపారు. ఆసక్తి గల రైతులు ఉద్యాన శాఖను సంప్రదించి ప్ర భుత్వ పథకాల ప్రయోజనాలను పొందాలని సూ చించారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరాస్వా మి మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రోత్సాహకాలను రై తులు సద్వినియోగం చేసుకొని అధిక ఆదాయం పొందాలని తెలిపారు. సర్పంచ్ సండ్ర లతశంకర్, ఏడీఏ కృష్ణ, ఏవో నర్సయ్య, హెచ్వో రోహిత్, తహసీల్దార్ రవీందర్రావు, ఎంపీడీవో రఫీ ఉన్నారు. -
రేపు కార్గ్గో పార్సిళ్ల వేలం
ఆర్మూర్టౌన్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్మూర్ డిపోలోని కార్గో పార్సిల్ సర్వీస్ కార్యాలయంలో మిగిలిపోయిన పాత వస్తువులకు వేలంపాట నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ ప్రతిమరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్మూర్ బస్టాండ్ ప్రాంతంలోని బస్పాస్ కౌంటర్ వద్ద ఈనెల 15న సాయంత్రం 4.00 గంటలకు వేలంపాట నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గలవారు వేలంపాటలో పాల్గొని తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చని వారు పేర్కొన్నారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ 1, 2, 3, 4, 5, 6వ సెమిస్టర్ బ్యాక్లాగ్ వన్టైం ఛాన్స్ పరీక్షలకు సోమవారం 23 మంది గైర్హాజరైనట్లు అకడమిక్ ఆడిట్సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు 171 మంది విద్యార్థులకు గానూ 158 మంది హాజరు కాగా 13 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. అలాగే మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 146 మంది విద్యార్థులకు గానూ 136 మంది హాజరు కాగా 10 మంది గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. నిజామాబాద్ రూరల్: నగరంలోని ఏఐటీ యూసీ కార్యాలయంలో సోమవారం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అ ధ్యక్ష, కార్యదర్శులుగా ఓమయ్య, వెన్నెల హ నుమాండ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా చక్రపాణి, రాజన్న, కవిత, అంజ య్య, చందర్. సహాయ కార్యదర్శిగా సంజీవ్, అనిల్, దేవేందర్, భాగ్యలక్ష్మి, గోవర్ధన్, సంప త్ కోశాధికారిగా ఎస్డి ఫెరోస్తోపాటు కార్యవ ర్గ కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నారు. అంతకుముందు వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, థర్డ్ పార్టీ విధానాన్ని రద్దుచేసి ఉద్యోగులందరిని పర్మినెంట్ చేయాల ని లేదా కాంట్రాక్ట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయా లని అన్నారు. కార్యక్రమంలో నాయకులు సంజీవ్, అనిల్, చందర్, గోవర్ధన్, ఫెరోస్, రాధా కుమార్, తదితరులు పాల్గొన్నారు. భిక్కనూరు: మండలంలోని గుర్జకుంట గ్రా మంలో గుర్తుతెలియని వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేశారు. గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఐదు ట్రాన్స్ఫార్మార్లను సోమవా రం వేకువజామున దుండగులు ధ్వంసం చేసి, అందులోని కాపర్ కాయల్స్ ఎత్తుకెళ్లారు. ఈ విషయమై ట్రాన్స్కో ఏఈ జాదవ్ బాలాజీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై అంజనేయులు తెలిపారు. -
సీఎం ఇంటి ముట్టడికి ఆప్ నేతల యత్నం
● అడ్డుకొని పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసు సిబ్బంది నిజామాబాద్ రూరల్: హైదరాబాద్లోని సీఎం రే వంత్రెడ్డి ఇంటి ఎదుట సోమవారం నిజామాబాద్ జిల్లా ఆప్(ఆమ్ ఆద్మీ పార్టీ) అధ్యక్షుడు సమీర్ అ హ్మద్ నేతృత్వంలో రాష్ట్ర, నియోజకవర్గాల నాయకు లు భారీ ధర్నా నిర్వహించారు. సీఎం ఇంటి ముట్ట డికి యత్నించగా పోలీసు సిబ్బంది వారిని అడ్డుకొ ని హైదరాబాద్లోని మధురానగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అంతకుముందు సమీర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉర్దూ ప్రథమ భాషగా గుర్తించాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. బోధన్లోని శక్కర్నగర్ మధుమాలంచ హైస్కూల్ (ఇంగ్లీష్ మీడియం)లో ఉర్దూను ప్రథమ భాషగా ఎంచుకోవాలనుకునే మైనారిటీ విద్యార్థులకు అడ్మిషన్లు నిరాకరించడంపై మండిపడ్డారు. తక్షణమే వారికి అడ్మిషన్లు ఇవ్వాలని, ఉర్దూ ఉపాధ్యాయులను ని యమించాలని డిమాండ్ చేశారు. నాయకులు జు నైద్ అహ్మద్, జుబేర్ అహ్మద్ తదితరులు ఉన్నారు. -
భీమ్గల్ కోర్టు భవనం పరిశీలన
కమ్మర్పల్ల(భీమ్గల్): భీమ్గల్ పట్టణంలో నిర్మాణం పూర్తయిన నూతన కోర్టు భవనాన్ని ఎండీసీ, ఎస్సీయూ మాజీ చైర్మన్లు ఈరవత్రి అనిల్కుమార్, మానాల మోహన్రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. భీమ్గల్ ప్రాంత ప్రజలకు కోర్టు ఏర్పాటు ఎంతోకాలంగా ఉన్న అవసరమని, న్యాయ సేవలు స్థానికంగానే అందుబాటులోకి రావడం వల్ల ప్రజల సమయం, ధనం ఆదా అవుతుందని తెలిపారు. కోర్టు భవనంలోని మౌలిక వసతులు, నిర్మాణ పనులను పరిశీలించి, ప్రజలకు త్వరలోనే పూర్తి స్థాయిలో న్యాయ సేవలు అందుబాటులోకి రావాలని వారు ఆకాంక్షించారు. నాయకులు బొదిరె స్వామి, నాగేంద్ర బాబు, గోపాల్ నాయక్, కన్నె సురేందర్, సుంకరి సురేష్, మేకల శ్రీనివాస్, దొనకంటి రాజేష్, ముల్క అరుణ్, గట్టు సతీశ్, మల్లేష్ మెండోర ఉపసర్పంచ్ కుంట రమేశ్, బాబాపూర్ సర్పంచ్ సమీర్, బాబాపూర్ ఉపసర్పంచ్ గోవర్ధన్, పిప్రి ఉపసర్పంచ్ జేమ్స్ తదితరులు ఉన్నారు. -
రైతుల సమస్యలపై సమీక్షించాలి
నిజామాబాద్ అర్బన్: రైతుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే చర్చించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు. అనంతరం దినేష్ మాట్లాడుతూ.. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు సాగు చేయలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, నీటి లభ్యతపై ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించాలన్నారు. రైతులకు సరిపడ నీటి సరఫరా, విద్యుత్ సరఫరా తక్షణమే కల్పించాలన్నారు. అంతకుముందు అదనపు కలెక్టర్ భుజంగరావుకు వారు వినతిపత్రం అందజేశారు. -
ప్రమాదమని తెలిసినా బేఖాతరు!
నిజామాబాద్ రైల్వేస్టేషన్లోని ఒకటవ నంబర్ ప్లాట్ఫామ్పైకి సోమవారం ఓ రైలు వేగంగా దూసుకొస్తోంది. దూరం నుంచే ఆ రైలు వస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, కొందరు ప్రయాణికులు ఏమాత్రం భయం లేకుండా పట్టాలపైనే నడుస్తూ ఒక ప్లాట్ఫామ్ నుంచి మరో ప్లాట్ఫామ్కు వెళ్లే ప్రయత్నం చేశారు. ప్రమాదమని తెలిసినా.. లగేజీ బ్యాగులతో ఉన్న ప్రయాణికులు కనీసం వెనుక నుంచి వస్తున్న రైలును కూడా గమనించకుండా, నిర్లక్ష్యంగా పట్టాలు దాటారు. కాస్త అటుఇటైనా ఘోర ప్రమాదం జరిగి ప్రాణాలు గాల్లో కలిసిపోయే అవకాశం ఉందని అక్కడి వారు చర్చింకున్నారు. ఈ దృశ్యాలను ‘సాక్షి’ క్లిక్మనిపించింది. –సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
‘సర్’ఫారాల స్వీకరణ వేగవంతం చేయాలి
డిచ్పల్లి: ‘సర్’ ఎన్యుమరేషన్ ఫారాల స్వీకరణను వేగవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) శ్రీనివాసరావు సూచించారు. డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామాన్ని సోమవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్యుమరేషన్ ఫారాల స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. సర్పంచ్ వాసుబాబు ముందుకు వచ్చి ఎన్యుమరేషన్ ఫారాలు నింపేందుకు హెల్ప్డెస్క ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పోలింగ్ స్టేషన్ల వారీగా జరుగుతున్న సర్ ఓటరు ఆన్లైన్ నమోదు ప్రక్రియ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రెండు మూడు రోజుల్లో 80– 90 శాతం ఎన్యుమరేషన్ ఆన్లైన్ నమోదయ్యేలా చూడాలని సూచించారు. -
రక్తం తీసుకుని నీళ్లివ్వండి
● సీఎం రేవంత్రెడ్డికి ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి విజ్ఞప్తి ● ముప్కాల్ పంప్ హౌజ్ వద్ద రక్తదానంతో నిరసనకమ్మర్పల్లి: ‘‘నా రక్తం తీసుకోండి.. రైతులకు మా త్రం నీళ్లు ఇవ్వండి’’ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రభుత్వాన్ని కోరా రు. నిజామాబాద్ జిల్లాలో ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకంలో భాగంగా నిర్మించిన ముప్కాల్ పంప్ హౌజ్ వద్ద సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి రక్తదానం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కాళేశ్వరం ద్వారా నీటిని అందించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. వేముల ప్రశాంత్రెడ్డి కూడా రక్తదానం చేశారు. బాల్కొండ రైతులనుంచి సేకరించిన రక్తం, వినతిపత్రాలను ఎస్సారెస్పీ అధికారులకు అందజేసి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పంపించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రశాంత్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులపై ప్రశ్నించిన మీడియాతో సీఎం రేవంత్రెడ్డి ‘వాళ్ల రక్తం చల్లితే పంటలు పండుతాయి’ అని రాక్షసంగా సమాధానమిచ్చారన్నారు. అందుకే తనతోపాటు బాల్కొండ రైతులు రక్తాన్ని ఇస్తున్నారని, ఇప్పుడు అయినా పంటలను కాపాడేందుకు నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గోదావరిలో కాళేశ్వరం వద్ద రోజుకు 10 టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా వెళ్తోందని, వెంటనే కన్నెపల్లి పంప్ హౌజ్ మోటార్లను ప్రారంభించి ఆ నీటిని ఎల్లంపల్లికి తీసుకువచ్చి అక్కడ నుండి వరద కాలువలోకి ఎత్తిపోయాలన్నారు. వరద కాలువపై నిర్మించిన రాంపూర్, రాజేశ్వరరావుపేట, ముప్కాల్ పంప్ హౌజ్లు సురక్షితంగా, రివర్స్ పంపింగ్కు సిద్ధంగా ఉన్నాయని, వాటి ద్వారా నీటిని ఎత్తిపోసి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో కాళేశ్వరం జలాలను పోయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో సుమారు 15 టీఎంసీల నీరుందని, నిజామాబాద్ జిల్లా రైతుల అవసరాల కోసం వెంటనే 4 టీఎంసీలను విడుదల చేయాలని కోరారు. ఈ నీటితో 15 రోజులపాటు పంటలను కాపాడుకోవచ్చని, ఈలోపు కన్నెపల్లి పంప్ హౌజ్ ద్వారా రివర్స్ పంపింగ్ చేపట్టి ఎస్సారెస్పీని తిరిగి నింపాలని సూచించారు. ఈనెల 15న జరిగే స్కివమ్ సమావేశంలో రైతుల ప్రయోజనాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. -
అల్బెండజోల్ మాత్ర వేసుకోవాలి
● అడిషనల్ కలెక్టర్ భుజంగరావు మాక్లూర్ : ఒకటి నుంచి 19 ఏళ్లలోపు వారందరూ తప్పనిసరిగా అల్బెండజోల్ మాత్ర వేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ భుజంగరావు అన్నారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినం సందర్భంగా అల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని మండలంలోని దాస్నగర్ వద్ద ఉన్న మహాత్మా జ్యోతి బాపూలే పాఠశాలలో అడిషనల్ కలెక్టర్ సోమవారం ప్రారంభించారు. విద్యార్థులకు ఆయన అల్బెండజోల్ మా త్రలు వేశారు. సోమవారం మాత్రలు వేసుకోని వారు ఈనెల 20వ తేదీన తీసుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో రాజ శ్రీ, డీఈవో అశోక్, డాక్టర్ అశోక్, రీజినల్ కో ఆర్డినేటర్ సత్యనాథ్రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్వో సికిందర్నాయక్, వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పంటలు ఎండకుండా చర్యలు తీసుకోవాలి
వర్ని: ఖరీఫ్లో రైతులు సాగు చేస్తున్న పంటలు వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోకుండా చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులకు ప్రభుత్వ వ్యవసాయ సలహాదా రు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి సూచించారు. ఎలినినో ప్రభావ పరి స్థులు, సిద్ధాపూర్ రిజర్వాయర్, జాకోరా లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిపై సోమవా రం హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. ఇదివరకే వేసిన పంటలను కాపాడుకోవడానికి రైతుల అవసరాన్ని బట్టి ప్రాజెక్టుల కింద సాగునీరందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. సిద్దాపూర్ రిజర్వాయర్, జాకోరా, చందూరు లిఫ్ట్ ఇరిగేషన్ల పైప్లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేసి సాగునీరందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇన్చార్జి సీఈ దక్షిణామూర్తి, ఈఈ రాజశేఖర్ పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్కు రితీశ్ డిచ్పల్లి: మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర మైనార్టీ గురుకుల పాఠశాల/కళాశాల విద్యార్థి రితీశ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పీఈటీ రవీందర్ సోమవారం తెలిపా రు. జిల్లా కేంద్రంలోని నాగారం స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ అండర్–18 విభాగంలో 1500 మీటర్ల రన్నింగ్ చాంపియన్షిప్ పోటీలో రితీశ్ ప్రథమ స్థానం సాధించినట్లు తెలిపారు. ఈ నెల 18 నుంచి మెదక్ జిల్లాలో నిర్వహించనున్న రా ష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పీఈటీ తె లిపారు. రితీశ్ను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి రాజాగౌడ్, పీఈటీలు రవీందర్, శ్రీనివాస్, సందీప్తోపాటు పాఠశాల ప్రిన్సిపాల్ ప్రసాద్ అభినందించారు. యాప్ ద్వారానే యూరియా తీసుకోవాలి సిరికొండ: ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా బుక్ చేసుకొని యూరియా తీసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరాస్వామి రైతులకు సూచించారు. మండల కేంద్రంతోపాటు కొండూర్ గ్రామంలో ప్రైవేట్ ఫెర్టిలైజర్ దుకాణాలను డీఏవో సోమవారం తని ఖీ చేశారు. రికార్డులను, ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఎలాంటి లింకులు అంటగట్టకుండా రైతులకు ఎరువులను విక్రయించా లని ఆయన డీలర్లను ఆదేశించారు. మండలంలో ఇప్పటి వరకు యాప్ ద్వారా రైతు లు 41,500 యూరియా బస్తాలను కొనుగో లు చేశారని తెలిపారు. భారీ వర్షాలు కురవ డం లేదని, వరికి బదులు ఆరు తడి పంటల ను సాగు చేయాలని రైతులకు సూచించారు. ఆయన వెంట ఏడీఏ కృష్ణ, మండల వ్యవసాయశాఖ అధికారి నర్సయ్య ఉన్నారు. ‘స్వయం ఉపాధి’ కోసం శిక్షణ ఖలీల్వాడి: స్వయం ఉపాధి లేదా చిన్న వ్యాపారం ప్రారంభించాలనే ఆసక్తి ఉన్న షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారికి నైపుణ్యాభివృద్ధిలో భాగంగా ఎనిమిది రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ లిమిటెడ్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ శ్రీదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 45 ఏళ్ల వయస్సు వారై అర్హులైన వారు 8 రోజుల శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోఆలని సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రగతినగర్ యెండల టవర్ వద్ద ఉన్న నిపుణ్ ఎడ్యుకేషన్ సొసైటీలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు http://tsscb havitha.cgg.gov.in/ homePage Candidate Cornerలో పేర్లను నమోదు చేసుకోవాలని, దరఖాస్తుతో రేషన్కార్డు, ఆధార్కార్డు, కులం, ఆదాయం, విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలను జత చేసి జిల్లా సమీకృత కలెక్టరేట్లోని రూమ్ నంబర్ 102లో సంప్రదించాలని సూచించారు. -
ప్రజావాణికి 156 ఫిర్యాదులు
నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ భుజంగరావు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 156 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ భుజంగరావుతోపాటు డీఆర్వో గీత, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయ న్న, డీపీవో శ్రీనివాస్రావు, బోధన్ ఏసీపీ శ్రీనివాస్కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సత్వరమే పరిష్కరించాలని అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రోజుకు 52 రైళ్లు.. గేటు పడితే 15 నిమిషాలు
● నవీపేటలో తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్య● ఆర్వోబీ లేక తీవ్ర ఇబ్బందులునవీపేట: రోజులో 52 వివిధ రైళ్లు నవీపేట మీదు గా రాకపోకలు సాగిస్తుండగా.. నిజామాబాద్ – బాసర రహదారిపై స్థానికంగా ఉన్న రైల్వే గేటు వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గేటు పడిన ప్రతిసారి సుమారు 15 నుంచి 20 నిమిషాలు వాహనాలు గేటుకు ఇరువైపులా నిలచిపోతున్నాయి. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఈ రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మేడ్చల్ నుంచి ముద్ఖేడ్ వరకు వేల కోట్లతో డబుల్ ట్రాక్ పనులకు నిధులు మంజూరవగా.. మొదటి విడతలో భాగంగా నవీపేట నుంచి బాసర వరకు ఇటీవల పనులను పూర్తి చేశారు. దీంతో రైళ్ల రాకపోకలు మరింత పెరిగాయి. నవీపేటలో ఆర్వోబీ నిర్మాణం చేపట్టాలని గత కొన్నేళ్లుగా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు రైల్వే ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఎంపీలను కలిసి సమస్యను వివరించారు. కిలో మీటర్ మేర ట్రాఫిక్ గేటు పడిన ప్రతిసారి ఇరువైపులా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. గేటు తీయగానే ఒక్కసారిగా హార్న్ కొడుతూ పోటాపోటీగా గేటు దాటేందుకు పోటీపడుతున్నారు. ఈ గేటు మీదుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు ముందుగా గే టుపడిందా.. లేదా.. అని దూరం నుంచి చూడడం అలవాటు చేసుకున్నారు. మండల కేంద్రంలో ప్రతి శనివారం మేకలసంత సాగుతుండగా, ఆ రోజున ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటోంది. పూర్తికాని ఆర్యూబీ పనులునవీపేట ప్రధాన రైల్వేగేట్కు ఇరువైపులా కొంత దూరంలో వేర్వేరుగా ఆర్యూబీ(రైల్వే అండర్ బ్రిడ్జి) పనులు కొనసాగుతున్నాయి. సుమారు రూ.5 కోట్లతో మహంతం, ధర్మారం, దర్యాపూర్ ప్రాంతాల్లో పనులను ఏడాది కిందట ప్రారంభించారు. ఫలితంగా ఈ మూడు ప్రాంతాల రైల్వేగేట్లను మూసివేయడంతో ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు నవీపేట ప్రధాన రైల్వే గేటు మీదుగా వెళ్తున్నారు. ఆర్యూబీల పనులు ఆలస్యమవుతుండడంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. పనులు పూర్తయ్యేందుకు మరికొన్ని నెలల సమయం పడుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఎంపీ దృష్టికి ఆర్వోబీ సమస్య.. మండల కేంద్రంలో ఆర్వోబీ నిర్మాణాం చేపట్టాలని ఎంపీ ధర్మపురి అరవింద్కు విన్నవించాం. ట్రాఫిక్ సమస్యతో పాటు ఆర్వోబీ ఆవశ్యతను వివరించాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి సమస్యకు పరిష్కారం చూపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆర్వోబీ నిర్మిస్తే ఎంతో సౌకర్యంగా ఉంటుంది. – పిల్లి శ్రీకాంత్, బీజేవైఎం జిల్లా నాయకులు, నవీపేటఇబ్బందులు పడుతున్నాం.. నవీపేటను ఆనుకుని ప్రధాన గేటు ఉండడంతో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరుగుతోంది. సుమారు ప్రతి 30 నిమిషాలకు ఒకసారి గేటు పడుతుండడంతో విద్యార్థులు, ప్రయాణికులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. నవీపేటలో ఆర్వోబీ నిర్మాణం ఆవశ్యకతను గుర్తించి, పనులను వెంటనే చేపడితే బాగుంటుంది. – గోదాంవార్ నవీన్రాజ్, ఉప సర్పంచ్, నవీపేట -
ప్రభుత్వ వైద్యకళాశాలలో సీట్ల పెంపు
● 150కి పెంచుతూ ఎన్ఎంసీ అనుమతిసుభాష్నగర్: నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లను 150కి పెంచుతూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతి మంజూరు చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ కృష్ణమోహన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 120 సీట్లతో కళాశాల కొనసాగుతుండగా, అదనంగా 30 మంజూరు చేయడంతో సీట్ల సంఖ్య 150కి పెరిగింది. ఎన్ఎంసీకి చెందిన నలుగురు అసెస్సర్ల బృందం అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు కోసం గతనెల 17వ తేదీన ప్రభుత్వ వైద్యకళాశాలతోపాటు ప్రభు త్వ జనరల్ ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించిందని ఆయన పేర్కొన్నారు. ఈ తనిఖీల ఆధారంగా సో మవారం సీట్ల సంఖ్యను పెంచుతూ అధికారికంగా అనుమతి పత్రాన్ని జారీ చేసిందని తెలిపారు. -
హంటింగ్ ముఠా!
జిల్లాలో సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలోని అటవీప్రాంతంల్లో పులులు, చిరుతలు, వన్యప్రాణులే లక్ష్యంగా వేటగాళ్లు చెలరేగిపోతున్నారు. భీమ్గల్, ఇందల్వా యి, సిరికొండ, మంచిప్ప రేంజ్లో వన్యప్రాణుల ను వేటాడేందుకు ముఠాగా ఏర్పడినట్టు తెలుస్తోంది. జిల్లాలోని భీమ్గల్ మండలం దేవక్కపేట శివా రులో ఇటీవల చిరుతను వేటాడినట్టుగా అటవీ, పోలీస్శాఖల అధికారులు గుర్తించారు. అదే గ్రామానికి చెందిన పలువురు వేటకోసం నాటు తుపాకులను వినియోగిస్తున్నట్టు అధికారుల విచా రణలో బయటపడింది. దేవక్కపేట గ్రామంలోనే వేటగాళ్ల నుంచి 15 వరకు నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. జిల్లాలోని అటవీప్రాంతంలోని చిరుతలే లక్ష్యంగా వేటగాళ్లు బలితీసుకుంటుండటం, తీగ లాగినకొద్దీ ఒక్కోటి బయటపడుతుండటం జిల్లాలో కలకలం రేపుతోంది. నాటు తుపాకులతో.. పులులు, చిరుతల గోర్లు, చర్మాన్ని విక్రయించేందు కు వేటగాళ్లు ఏకంగా ముఠాగా ఏర్పడినట్టు తెలు స్తోంది. భీమ్గల్ రేంజ్ పరిధిలోని దేవక్కపేట సమీపంలో చిరుతను బలితీసుకున్నట్టుగా అధికారులు గుర్తించారు. చిరుతపులిని వేటాడి ఖననం చేసిన ప్రాంతంలో కళేబరానికి అధికారులు పోస్ట్మార్టం నిర్వహించి నిర్ధారణ కోసం ల్యాబ్కు పంపించారు. విషప్రయోగంతో చిరుతను వేటాడినట్లు అధికారు లు భావిస్తున్నారు. ఈ ఘటనపై లోతుగా విచారణ చేపడుతున్న సమయంలోనే దేవక్కపేట గ్రామంలో పలువురు నిందితుల నుంచి 15 వరకు నాటు తు పాకులు లభ్యమైనట్టుగా తెలిసింది. తాజా ఘటన నేపథ్యంలో మరింత లోతుగా దర్యాప్తు చేపడుతుండగా, 6 నెలల కిందట మరో చిరుతను సైతం వేటాడిన విషయం బయటపడినట్టు సమాచారం. ఇందల్వాయి రేంజ్ పరిధిలోని అన్సాన్పల్లి సెక్షన్ రామడుగు బీట్ సమీపంలో చిరుతను చంపి కళేబరాన్ని బావిలో పడేసినట్టు తెలిసింది. దీనికి సంబంధించి ధర్పల్లికి చెందిన ఇద్దరిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని అటవీప్రాంతాల్లో వేటాడేందుకు ఏర్పడిన ముఠా బాగోతంపై పోలీసులు నేడో, రేపో మీడియా ఎదుట వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. జే1 టైగర్ ఉన్నట్టా? లేనట్టా?ఈ ఏడాది మార్చిలో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల మీదుగా జిల్లాలోకి వచ్చిన జే–1 పెద్దపులి ఆచూకీ ఇప్పటివరకు తెలియలేదు. కమ్మర్పల్లి, సిరికొండ, సిరిసిల్ల రేంజ్లలో కొంత కాలంపాటు తిరిగిన పెద్దపులి ఏప్రిల్ 17 నుంచి జాడ లేకుండాపోయింది. అధికారులు ట్రాప్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టినా పెద్దపులి కదలికలు నమోదుకాలేదు. ఇక్కడి నుంచి ఎక్కడికై నా వెళ్లిందా, లేక ఇక్కడే ఉందా అని అధికారులు ట్రాక్ చేయలేకపోయారు. కమ్మర్పల్లి రేంజ్పరిధిలో పెద్ద పులి జాడ కనిపెట్టేందుకు అటవీశాఖ అధికారులు చేపట్టిన ట్రాకింగ్లో భాగంగానే చిరుతల వేట బయటకు వచ్చినట్టు సమాచారం. పెద్దపులి జాడను వెతుక్కుంటూ అడవిలో జల్లెడ పడుతున్న నేపథ్యంలోనే చిరుతపులుల వేటగాళ్ల ఆనవాళ్లు దొరికినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా అడవిలో వేటగాళ్లు వినియోగించిన గ్లౌవ్స్, సామగ్రి అటవీ అధికారుల కంటపడటంతో ఈ కోణంలో విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే దేవక్కపల్లిలో, ధర్పల్లిలో వేటగాళ్ల ముఠాకు చెందిన వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని కమ్మర్పల్లి, ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ల పరిధిలో చిరుతలను వేటాడి హతమార్చినట్లు నిర్ధారణకు వచ్చిన అధికారులు.. హంటింగ్ ముఠాపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తీగ లాగినాకొద్దీ డొంక కదలుతున్న చందంగా.. వన్యప్రాణుల వేటకు సంబంధించి రోజుకో విషయం బయటపడుతోంది. అయితే జిల్లాలో సంచరించి కనిపించకుండా పోయిన పెద్ద పులి ఎక్కడ ఉందనేది మిస్టరీగా మారింది. సీరియస్గా తీసుకున్నాం జిల్లాలోని అటవీప్రాంతంలో రెండు చిరుతలను వేటాడినట్టు ఆనవాళ్లు లభించాయి. దీనిపై సీరియస్గా విచారణ చేపడతున్నాం. ఇంకా ఎవరెవరు ఉన్నారన్న కోణంలో లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలోనే పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తాం. – సుశాంత్ సుఖ్దేవ్, ఇన్చార్జి డీఎఫ్వో, నిజామాబాద్ వన్యప్రాణులే టార్గెట్.. వ్యవస్థీకృతంగా సాగుతున్న వేటగాళ్ల రాకెట్ దందా భీమ్గల్ మండలం దేవక్కపేటలో అదుపులోకి నిందితులు ఇందల్వాయి రేంజ్ పరిధిలోనూ చిరుతను వేటాడినట్టు గుర్తింపు తీగ లాగితే బయటపడుతున్న ముఠా లింకులు -
‘చిగురింతలు’ గేయ సంపుటికి నాగభైరవ పురస్కారం
నిజామాబాద్ రూరల్: ప్రముఖ బాల సాహిత్య వేత్త, కవి, రచయిత చింతల శ్రీనివాస్ గుప్తా రచించిన ‘చిగురింతలు’ గేయ సంపుటికి జాతీయస్థాయి నాగభైరవ పురస్కారం లభించిందని ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదిక అధ్యక్షుడు డాక్టర్ కాసర్ల నరేశ్రావు సోమవారం తెలిపారు. గత నెలలో నిర్వహించిన పోటీల్లో బాల సాహి త్యానికి సంబంధించి జాతీయస్థాయిలో సుమారు 200 రచనలురాగా అందులో చింతల రచించిన చిగురింతలు పుస్తకానికి పురస్కారం వరించిందన్నారు. నిర్వాహకులు ఒంగోలులో ఆగస్టు 16న నిర్వహించనున్న కార్యక్రమంలో శ్రీనివాస్గుప్తాకు పురస్కారం అందజేయడంతోపాటు సన్మానిస్తారన్నారు. శ్రీనివాస్ గుప్తాకు ప్రముఖ బాల సాహితీవేత్తలు వీఆర్ శర్మ, గరిపల్లి అశోక్, కవులు వీపీ చందన్రావు, గణపతి అశోక్శర్మ, మహేశ్బాబు, గంట్యాల ప్రసాద్, ప్రవీణ్కుమార్ శర్మ, డాక్టర్ శారద తదితరులు అభినందనలు తెలిపారు. -
అనుమానితుల సమాచారం అందించాలి
ఆర్మూర్టౌన్: పట్టణంలో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ఆర్మూర్ ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ అన్నారు. ఆర్మూర్లోని నల్లపోచమ్మ గల్లీలో ఆదివారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈసందర్భంగా పోలీసులు ఉదయం నుంచి కాలనీలోని ప్రతి ఇంటిని తనిఖీ చేసి, వివరాలు సేకరించారు. వాహనాలకు సంబంధించి ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్లను పరిశీలించారు. ఈసందర్భంగా ఎస్హెచ్వో మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని, లేదంటే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. కాలనీల్లో దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు ప్రతి ఇంటి ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనంతరం నిబంధనలు ఉల్లంఘించిన 50 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను సీజ్ చేశారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పేకాడుతున్న నలుగురి అరెస్టు ఇందల్వాయి: మండలంలోని గన్నారం గ్రామాశివారులోగల పేకాట స్థావరంపై శనివారం రాత్రి దాడులు నిర్వహించినట్లు ఎస్సై సుమలత తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేయగా, పేకాడుతున్న నలుగురిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే వారి వద్ద నుంచి రూ.12,760 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
నాణ్యమైన వైద్య సేవలందించాలి
నందిపేట్/పెర్కిట్(ఆర్మూర్): ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలని, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందికి డీఎంహెచ్వో రాజశ్రీ సూచించారు. నందిపేట మండల కేంద్రంలోని పీహెచ్సీతోపాటు ఆలూర్ మండలం దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్వో ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, రిజిస్టర్లు, మందుల స్టాక్ను పరిశీలించి వ్యాక్సినేషన్ వివరాలు తెలుసుకున్నారు. నందిపేటలోని పద్మశాలి సంఘం హనుమాన్ దేవాలయం వద్ద కొనసాగుతున్న ఎస్ఐఆర్ సర్వేను పర్యవేక్షించారు. ఆమెవెంట మండల మండల వైద్యాధికారి ప్రవీణ్, పీహెచ్సీల వైద్య సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది తదితరులు ఉన్నారు. -
చద్దన్నమే పరమాన్నం..
బాన్సువాడ రూరల్: బోరు బావుల వద్ద వర్షాకాలం వరినాట్లు ప్రారంభం కావడంతో వ్యవసాయ కూలీలు పనుల్లో బిజీ అయ్యారు. ఉదయం 7 గంటలకే కూలీలు పొలం వద్దకు చేరుకుంటున్నారు. రాత్రి మిగిలిన చద్దన్నమే పరమాన్నంగా భావించి పొలం గెట్లపై తింటూ ఆకలి తీర్చుకుంటున్నారు. ఒకే వరుసలో కూర్చుని తింటూ కెమెరాకు చిక్కారు. తమకు నాట్లు ప్రారంభమైన నెలరోజులే చేతినిండా పని లభిస్తోందని, మిగిలిన నెలల్లో వ్యవసాయ యాంత్రీకరణ, కలుపు నివారణ మందుల ప్రభావంతో చేద్దామన్నా పనులు దొరకని పరిస్థితులు నెలకొన్నాయని కూలీలు వాపోయారు. -
వర్షాకాలం.. కరెంట్తో పైలం
బాన్సువాడ: వర్షాకాలం నేపథ్యంలో ఈదురు గాలులతో కూడిన వర్షాల కారణంగా పెద్ద చెట్లు, కొమ్మలు విద్యుత్ తీగలపై పడే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని బాన్సువాడ డీఈ వినోద్కుమార్ సూచించారు. ఆయన సాక్షితో మాట్లాడుతూ.. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడి కనపించినా, స్తంభాలు ఒరిగినా, ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకర స్థితిలో ఉన్నా వెంటనే సమీప విద్యుత్ అధికారులకు లేక విద్యుత్ అత్యవసర సేవల ట్రోల్ ఫ్రీ నంబర్ 1912తో పాటు వాట్సప్ నంబర్ 8712481982ను సంప్రదించాలని ఆయన అన్నారు. ప్రతి వినియోగదారుడు తప్పక పాటించాల్సిన భద్రత సూచనలు తెలియజేశారు. రైతులకు సూచనలు. ● వ్యవసాయ మోటార్లు, ఫుట్ వాల్వులు, పైపులు తడిగా ఉన్నప్పుడు తాకరాదు. ● పంపుసెట్లు, స్టార్టర్లు తప్పనిసరిగా సరైన ఎర్తింగ్తో ఉండాలి. ఎర్తింగ్ మోటార్లు, జీఐ పైపులు, ఫుట్ వాల్వులు అత్యంత ప్రమాదకరం. ● విద్యుత్ పనులను స్వయంగా చేయకుండా అర్హ త కలిగిన ఎలక్ట్రీషియన్ ద్వారా చేయించాలి. వ్యవసాయ మోటార్లకు జాయింట్లు లేని నాణ్యమైన సర్వీసు వైర్లు మాత్రమే వినియోగించాలి. ● ఇంటి వైరింగ్కు సరైన ఎర్తింగ్ తప్పనిసరి. ● ఐఎస్ఐ మార్క్ గల నాణ్యమైన ప్లగ్గులు, స్విచ్లు ఉపయోగించాలి. ● సెల్ఫోన్ చార్జింగ్ పెట్టి తడి చేతులతో మాట్లాడొద్దు. ముందుగా చార్జింగ్ ఆఫ్ చేయాలి. ● పశువులను మేతకు తీసుకెళ్తున్నప్పుడు ట్రాన్స్ ఫార్మర్లు, స్తంభాల దగ్గరకు వెళ్లనీయెద్దు. ● ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఫ్యూజులు మార్చడం, రిపేర్లు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఏబీ స్విచ్లు ఆపరేట్ చేయడం నిషేధం. ● కాలిన తీగలను స్వయంగా సరి చేయకూడదు. ఎవరైనా కరెంట్ షాక్ తగిలితే వెంటనే చేతులతో తాకవద్దు. కర్ర, లేదా విద్యుత్ ప్రసారం కాని వస్తువులతో వేరు చేయాలి. ● ఇనుప కూలర్లు ఆన్లో ఉండగా నీళ్లు పోయొద్దు. ప్లాస్టిక్ కూలర్లు వాడడం శ్రేయస్సుకరం. తీగల కింద టెంట్లు, జెండా గద్దెలను కట్టరాదు. లైన్ల మధ్య నుంచి ఇనుప నిచ్చెనలు తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. దేవుళ్ల విగ్రహాలు తీసుకెళ్లేటప్పుడు లైన్లకు తాకనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సొంతగా విద్యుత్ పనులు చేయడం ప్రమాదకరం అత్యవసరమైతే 1912 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలి బాన్సువాడ ట్రాన్స్కో డీఈ వినోద్కుమార్ -
ఇందూరులో పూరి జగన్నాథుడు
● గంజ్ కమాన్ వద్ద భారీ సెట్టింగ్తో ఆలయాన్ని ఏర్పాటు చేసిన ఇస్కాన్ బృందం ● నిత్యం దర్శించుకుంటున్న నగరవాసులునిజామాబాద్ రూరల్: నగరంలో పూరి జగన్నాథుడు కొలువుదీరాడు. గాంధీగంజ్ క్లాక్ టవర్ వద్ద ఇటీవల ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథుడి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేశారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి, పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిత్యం నగరవాసులతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆలయాన్ని సందర్శిస్తూ, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాత్రివేళల్లో భజన లు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు సైతం చేపడుతున్నారు. నిత్యం భక్తులకు ప్రసాద వితరణ చేస్తున్నారు. ఈనెల 10న ఆలయాన్ని ప్రారంభించ గా, 17 వరకు భక్తుల సందర్శనార్థం ఉత్సవాలు కొనసాగున్నాయి. చివరి రోజు మధ్యాహ్నం నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహాలను రథంపై ఉంచి నగరంలో శోభాయాత్ర నిర్వహించనున్నారు. -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 2002–03 బ్యాచ్ పదో తతరగతి విద్యార్థులు ఆదివారం ‘ఆత్మీయ సమ్మేళనం’ నిర్వహించారు. గ్రామంలోని ఓ ఫంక్షన్హాల్ కార్యక్రమం నిర్వహించగా, ఏళ్ల తర్వాత మళ్లీ ఒక్క చోట కలుసుకోవడంపై వారంతా హర్షం వ్యక్తం చే శారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకుంటూ ఆనాటి తీపి గుర్తులను నెమరు వేసుకున్నారు. అనంతరం విందువినోదాలతో ఆనందంగా గడిపా రు. ప్రతి ఏడాది ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవాలని, పాఠశాల అభివృద్ధికి సహాయం చేయాలని తీర్మానించుకున్నారు. -
నిరుపయోగంగా హాస్టల్ భవనం
● కమ్మర్పల్లిలో 2015లో ఎస్సీ బాలుర వసతి గృహం ఏర్పాటు ● 3 ఏళ్లు వాడకం.. 8ఏళ్లుగా ఖాళీ ● పట్టించుకోని అధికారులు కమ్మర్పల్లి: లేనిచోట లేక ఏడిస్తే, ఉన్నచోట ఉండి ఏడుస్తున్నా చందంగా మారింది మండల కేంద్రంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్ భవనం పరిస్థితి. ఎనిమిదేళ్లుగా నిరుపయోగంగా ఉండడంతో భవనంలోని తలుపులు, కిటికీలు వాటికి సంబంధించిన ఫేమ్లు చోరీకి గురయ్యాయి. భద్రత, రక్షణ లేక పశువులు, పాములు, తేళ్లు, ఇతర జీవాలకు ఆవాసంగా మారింది. గురుకులం మంజూరుతో హాస్టల్ తరలింపు.. 2015 సెప్టంబర్లో మండలంలోని మానాల గ్రామానికి తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్(గర్ల్స్)(టీటీడబ్ల్యూఆర్ఎస్(జీ)) మంజూరైంది. రూ. 5.20 కోట్లు కేటాయిస్తూ 2016–17 విద్యా సంవత్సరం నుంచి బోధన తరగతులు ప్రారంభించాలని జీవో జారీ చేశారు. దీంతో కమ్మర్పల్లి ఎస్సీ బాయ్స్ హాస్టల్ను చౌట్పల్లిలోని ఎస్సీ హాస్టల్లో విలీనం చేసి, హాస్టల్ భవనంలో తాత్కలికంగా పాఠశాల తరగతులు నిర్వహించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఎస్టీ గురుకుల బాలికల పాఠశాలను ఇదే భవనంలో ఏర్పాటు చేశారు. 2016లో చేపట్టిన జిల్లాల పునర్విభజనతో ‘మానాల’ గ్రామాన్ని నూతనంగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్తగా ఏర్పడిన రుద్రంగి మండలంలో కలిపారు. మానాల గ్రామం పేరిట ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లాకే కేటాయించింది. అయినప్పటికీ పాఠశాలను మానాల చిరునామాగా 2018 జూలై నెలాఖరు వరకు రెండున్నరేళ్ల పాటు కమ్మర్పల్లిలోని ఇదే భవనంలో కొనసాగించారు. అనంతరం ఉన్నతాధికారులు పాఠశాలను హుటాహుటిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడకు తరలించారు. దీంతో అప్పటి నుంచి హాస్టల్ భవనం ఖాళీగా ఉంటోంది. దర్వాజలు, కిటికీలు చోరీ... హాస్టల్ భవనంలో 10 గదులు ఉండగా, వెనక వైపు ప్రహరీ లేదు. దీంతో కలపతో చేసిన తలుపులు, దర్వాజలు, ఇనుముతో చేసిన కిటికీలు, ఫేమ్లను దుండగులు ఎత్తుకెళ్లారు. భవనంలో ఫ్లోరింగ్ ధ్వంసం అయింది. బాత్రూం, మరుగుదొడ్ల గదులకు సంబంధించిన గోడలను ధ్వంసం చేసి తలుపులు ఎత్తుకెళ్లారు. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన భవనం నిరుపయోగంగా ఉండడంతో ప్రజాధనం వృథా అయిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చిన్నచిన్న మరమ్మతులు చేపట్టి భవనాన్ని ఏదైనా ప్రభుత్వ కార్యాలయం కోసం వినియోగించాలని పలువురు కోరుతున్నారు. రూ.80లక్షల నిధులతో.. కమ్మర్పల్లిలో ఎస్సీ బాయ్స్ హాస్టల్కు సొంత భవనం లేకపోవడంతో 2013లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సొంత భవనం నిర్మాణం కోసం రూ. 80లక్షలు నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో పోలీస్ స్టేషన్ పక్కన ప్రభుత్వ కార్యాలయాల స్థలంలో 10 గదులతో కూడిన భవనాన్ని నిర్మించారు. భవన నిర్మాణం పూర్తి కాగా, అద్దె భవనంలో కొనసాగుతున్న బాయ్స్ హాస్టల్ను 2015 విద్యా సంవత్సరంలో నూతన భవనంలోకి మార్చారు. కమ్మర్పల్లిలోని ఎస్సీ హాస్టల్ భవనం నిరుపయోగంగా ఉందని మా దృష్టిలో ఉంది. ఏదైనా ప్రభుత్వ శాఖ అడిగితే భవనం కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, ఖాళీ భవనాన్ని వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడతాం. –రజిత, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి, నిజామాబాద్ కమ్మర్పల్లి జెడ్పీహెచ్ఎస్లో హైస్కూల్తోపాటు, ప్రైమరీ, జూనియర్ కాలేజ్ నడుస్తున్నాయి. ఈమూడు కొనసాగుతుండటంతో స్థలం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కాలేజ్ను నిరుపయోగంగా ఉన్న ఎస్సీ హాస్టల్ భవనంలోకి మారిస్తే భవనం వినియోగంలోకి వస్తుంది. –మైలారం సుధాకర్, మాజీ ఎంపీటీసీ, కమ్మర్పల్లి -
క్రైం కార్నర్
నాడు తండ్రి.. నేడు కొడుకు మృతి ● ఆ కుటుంబానికి శాపంగా మారిన రోడ్డు ప్రమాదాలు బాన్సువాడ: బీర్కూర్ మండల కేంద్రంలోని ఓ కుటుంబానికి రోడ్డు ప్రమాదాలు శాపంగా మారాయి. బీర్కూర్కు చెందిన తాటిచెట్ల రాములుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడికి వివాహం కాగా, చిన్నకుమారుడు రవి(18) హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. గతేడాది కుటుంబానికి పెద్ద దికై ్కన రాములు లారీ ఢీకొనడంతో మృతి చెందాడు. శనివారం చిన్న కుమారుడు రవి హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తుండగా హైదరాబాద్ సమీపంలోని గుమ్మడిదల వద్ద ఢీవైడర్ను ఢీకొని మృతి చెందాడు. తండ్రి, కొడుకు మృతి చెందడంతో కుటుంబానికి రోడ్డు ప్రమాదాలు శాపంగా మారాయని గ్రామస్తులు వాపోయారు. బీర్కూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. బాన్సువాడ: పొలానికి వెళ్తుండగా ఓ రైతు బురదలో పడి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. బాన్సువాడ పట్టణానికి చెందిన గొల్ల సంగయ్య(70) అనే రైతు ఆదివారం ఉదయం తన పొలం వద్దకు బయలుదేరాడు. ఈక్రమంలో పొలాల్లోని బురదలో వెళుతుండగా కాళ్లు ఇరుక్కపోయి పడిపోయాడు. ముఖం బురదలో కూరుకుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలున్నారు. -
ఓట్లు తొలగిపోకుండా చూస్తాం
కమ్మర్పల్లి: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)లో పౌరుల ఓట్లు తొలగిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామ ని అదనపు కలెక్టర్ భుజంగరావు అన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంతోపాటు హాసాకొత్తూర్లో కొనసాగుతున్న సర్ ప్రక్రియను ఆదివారం ఆయన పరిశీలించారు. ఎన్యుమ రేషన్ ఫామ్ల స్వీకరణ, డిజిటలైజేషన్ వివరాలను తెలుసుకున్నారు. ఆన్లైన్లో వెనుకబడి ఉన్న కమ్మర్పల్లి, మానాల గ్రామాల్లో సిబ్బంది తమ పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించారు. తహసీల్దార్ నరేశ్, ఆర్ఐ శరత్కుమార్, సర్పంచ్ నలిమెల గంగారెడ్డి ఉన్నారు. సిద్ధులగుట్టపై రేంజ్ డీఐజీ ప్రత్యేక పూజలు ఆర్మూర్టౌన్: పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నవనాథ సిద్ధుల గుట్టపై ఉన్న శివాలయంలో బాసర జోన్ రేంజ్ డీఐజీ భాస్కరన్ కుటుంబ సమేతంగా ఆదివారం ప్రత్యేక పూ జలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐ జీ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. అర్చకులు సిద్ధుల గుట్ట విశిష్టతను డీ ఐజీకి వివరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జిమ్మీ, రవి, చరణ్రెడ్డి, బట్టు శంకర్ తదితరులు పాల్గొన్నారు. ‘మహా’ పోలీసుల అదుపులో దొంగల ముఠా? ● ఫూణెలో పట్టుబడిన దుండగులు నిజామాబాద్అర్బన్: జిల్లాలోని మూడు ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజామున చోరీలకు పాల్పడిన దుండగుల ముఠాను మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆర్మూర్లోని మెడికల్ షాప్తోపాటు నిజామాబాద్ నగరంలో రెండు చోట్ల చైన్ స్నాచింగ్కు పాల్పడిన నలుగు రు సభ్యులున్న ముఠా మహారాష్ట్ర వైపు పరారైంది. దుండగులను పట్టుకునేందుకు సీపీ సాయిచైతన్య 8 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. శనివారం సాయత్రానికి మహారాష్ట్రలోని ఆయా ప్రాంతాలకు చేరుకున్న ప్రత్యేక బృందాలు దుండగుల కోసం గాలింపు చేపట్టాయి. బొలెరో దొంగిలించి.. చోరీ చేసిన టాటా సుమోలో జిల్లాకు వచ్చిన దొంగల ముఠా అదే వాహనంలో పరారైన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని పూణే కు చేరుకున్న ముఠా సభ్యులు అక్కడ బొలెరోను చోరీ చేసినట్లు తెలిసింది. పుణే శివారులోని ఓ హోటల్లో ఉండగా బొలెరోను గుర్తించిన స్థానికులు దుండగులను పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించగా.. నిజామాబాద్ జిల్లాలో చోరీకి పాల్పడింది ఈ ముఠానే అని నిర్దారణ అయినట్లు సమాచారం. సదరు ముఠాపై అనేక దొంగతనం కేసులు ఉండడంతో మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండడంతో జిల్లా పోలీసులు వెనుదిరిగినట్లు తెలిసింది. -
త్వరలో కంప్యూటర్ విద్య
ఖలీల్వాడి: ప్రభుత్వ బడుల్లో బ్లాక్ బోర్డు, చాక్పీస్కే పరిమితమైన బోధన త్వరలోనే డిజిటల్ రూపం దాల్చునున్నది. పుస్తకాలతోపాటు కంప్యూటర్ స్క్రీన్పై పాఠాలు చూసే అవకాశం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. విద్యను ఆసక్తికరంగా, సులభం చేయడంతోపాటు సాంకేతికతతో అనుసంధానం చేసే లక్ష్యంతో ప్రభుత్వం జిల్లాలోని 191 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను తీసుకువస్తోంది. 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు డిజిటల్ బోధన ద్వారా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను సొంతం చేసుకునే అవకాశం లభించనుంది. 2008లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి హయాంలో ప్రభుత్వ స్కూళ్లలో కంప్యూటర్ విద్యను ప్రారంభించగా.. 2014 వరకు కొనసాగింది. ఆ తర్వాత కంప్యూటర్ విద్య అటకెక్కింది. ప్రభుత్వం మళ్లీ కంప్యూటర్ విద్యను తీసుకురానుండడంతో విద్యార్థులకు పోటీ ప్రపంచంలో మేలు చేకూరనుంది. 191 ప్రభుత్వ పాఠశాలల్లో.. జిల్లాలో 769 ప్రాథమిక, 132 ప్రాథమికోన్నత, 299 ఉన్నత పాఠశాలలు ఉండగా, 96 వేల మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రస్తు తం కొన్ని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మాత్రమే కంప్యూటర్ విద్య అమలవుతోంది. ప్రస్తుతం పీఎంశ్రీ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య అమలవుతుండగా, మిగతా ప్రభుత్వ, జెడ్పీ, మోడల్ స్కూల్, కేజీబీవీల్లో కంప్యూటర్ విద్య అమలు కానుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కూడా ప్రపంచ స్థా యి డిజిటల్ విద్యను అందిపుచ్చుకునే రోజులు వచ్చాయి. విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా కంప్యూటర్, డిజిటల్ కంటెంట్, ఆడియో విజువల్ పాఠాల ద్వారా నేర్చుకునే అవకాశం కల్పించనున్నారు. గ్రామీణ విద్యార్థులకు వరం.. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఇప్పటికే డిజిటల్ బోధన అందుబాటులో ఉండగా, గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సదుపాయాలు పరిమితంగానే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ఆధారిత విద్య అమలుతో గ్రామీణ విద్యార్థులు కూడా ఆధునిక సాంకేతిక విద్యను అందిపుచ్చుకునే అవకాశం కలగనుంది. వారంలో మూడు రోజులు.. ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఓ ప్రయివేట్ కన్సల్టెన్సీ వారు పాఠశాలల్లో కంప్యూటర్ విద్య అమలు చేయనున్నారు. పాఠశాలలో వారానికి మూడు రోజులపాటు విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అందిస్తారు. పాడైన కంప్యూటర్లను ఇప్పటికే బాగు చేయించాం. – డి సాయాగౌడ్, ఇన్చార్జి డీఈవోడిజిటల్ నైపుణ్యాలే భవిష్యత్.. ప్రపంచం డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు అడుగు లు వేస్తోంది. ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్, ఆరోగ్యం, విద్య, పరిశ్రమలు, వ్యాపారం, వ్యవసాయం, పరిశోధన, ఉద్యోగ రంగాలు అన్నీ కంప్యూటర్ సాంకేతికతపై ఆధారపడుతున్నాయి. ఏఐ, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నా యి. దీంతో విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే డిజిటల్ ప్రపంచాన్ని అర్థం చేసుకునే లా ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొస్తోంది. జిల్లాలో 191 ప్రభుత్వ పాఠశాలల ఎంపిక ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు బోధన విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాల పెంపే లక్ష్యం -
నులి పురుగును నిర్మూలిద్దాం..
సుభాష్నగర్: పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. శుభ్రత పాటించకపోవడం వల్ల పిల్లలు రోగాల బారిన పడతారు. ముఖ్యంగా నులిపురుగులు అపరిశుభ్రత కారణంగా శరీరంలోకి చేరుతాయి. నులిపురుగుల బారిన పడిన పిల్లల్లో అ నారోగ్య సమస్యలు తలెత్తి శారీరక, మానసిక ఎదు గుదలపై ప్రభావం చూపుతుంది. పిల్లలు నులిపురుగుల బారిన పడకుండా వైద్యారోగ్యశాఖ నివారణ చర్యలు చేపట్టింది. అందులోభాగంగానే జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవా న్ని (ఎన్డీడీ) పురస్కరించుకుని జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 1 నుంచి 19 ఏళ్ల పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనుంది. ముందుగా గుర్తించిన సెంటర్ల వద్ద ఈనెల 13వ తేదీన, మాప్ అప్ డే సందర్భంగా 20వ తేదీన మిగిలిపోయిన పిల్లలకు రెండు విడతల్లో మాత్రలు పంపిణీ చేయ నున్నారు. ఇందుకోసం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. ముఖ్యంగా అల్బెండజోల్ మాత్రలు అన్ని యాజమాన్య పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్స్కు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అందజేశారు. అపోహలు వద్దు.. పిల్లలకు అల్బెండజోల్ మాత్రల ఇవ్వడంపై తల్లిదండ్రులు అపోహలు పెట్టుకోవద్దు. మాత్రలు పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడతాయి. అయితే జ్వరం, ఫిట్స్ వచ్చిన పిల్లలు అల్బెండజోల్ మాత్రలు వేసుకోవద్దు. జ్వరం పూర్తిగా నయమైన తర్వాత మలివిడత 20వ తేదీన మాత్రలు వేసుకోవాలి. మాత్రల పంపిణీని ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, వివిధ శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని డీఎంహెచ్వో రాజశ్రీ పేర్కొన్నారు. 3 లక్షల 90 వేల మంది పిల్లలకు.. జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాల లు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు, వసతి గృహాలు, రెసిడె న్షియ ల్స్, నర్సింగ్ కళాశాల, ఐటీఐ, పాలిటెక్నిక్, జూనియర్ కళాశాలల్లో మొత్తం 3 వేలకుపైనే కేంద్రాలు ఏర్పాటు చేసి మాత్ర లు పంపిణీ చేయనున్నారు. 1నుంచి 19 ఏళ్ల లోపు పిల్లలు 3,90,297మంది ఉన్న ట్లు అధికారులు గుర్తించారు. ఏడాది నుంచి రెండేళ్లలోపు వయసు ఉన్న పిల్లలకు సగం మాత్రను, రెండు నుంచి మూడేళ్లలోపు వారికి ఒక మాత్రను క్రష్ చేసి ఇవ్వాలి. అలాగే మూడేళ్ల నుంచి 19ఏళ్ల పిల్లలు ఒక మాత్రను చంపరించి, నమిలి మింగాలి.నేటి నుంచి జిల్లాలో అల్బెండజోల్ మాత్రల పంపిణీ 1 నుంచి 19 ఏళ్ల లోపు వారందరికీ తప్పనిసరి ఏర్పాట్లు పూర్తి చేసిన వైద్యారోగ్యశాఖ -
పెద్దపులి జాడ కోసం వెళ్తే..
● వెలుగులోకి వచ్చిన చిరుతను వేటాడిన ఘటన ● పోలీసుల అదుపులోకి నిందితులుకమ్మర్పల్లి(భీమ్గల్): కమ్మర్పల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో సంచరించి కనిపించకుండా పోయి న పెద్దపులి జాడ కోసం మార్చి నెల నుంచి ఫారెస్ట్ అధికారులు వెతుకుతూనే ఉన్నారు. భీ మ్గల్ మండలం తాళ్లపల్లి అటవీప్రాంతంలో గత కొద్ది రోజులుగా గాలింపు చర్యలు చేపడుతున్న అటవీ అధికారులకు ఇటీవల మనుషు లు వాడిన గ్లౌవ్స్(చేతి తొడుగు) కనిపించడంతో అవాక్కయారు. అనుమానంతో పోలీ స్ శా ఖను సంప్రదించగా ఇక్కడే కథ మలుపు తిరిగింది. రంగప్రవేశం చేసిన సీసీఎస్ పోలీసులు ధర్పల్లి మండలానికి చెందిన ఒకరితోపాటు మరొకరిని అదుపులోకి తీసుకొని విచారించగా.. కారేపల్లి బీట్ పరిధిలో చిరుతను చంపి పూడ్చిపెట్టిన ఘటన వెలుగు చూసింది. పోలీసులు, అటవీశాఖ అధికారులు కారేపల్లి బీట్ పరిధికి చేరుకుని చిరుత కళేబరాన్ని పాతిపెట్టిన చోట జేసీబీతో తవ్వించి చిరుత అవశేషాలను వెలికితీశారు. స్వాధీనం చేసుకున్న చిరుత అవశేషాలను కమ్మర్పల్లి రేంజ్ కార్యాలయానికి తరలించి అక్కడే పోస్ట్మార్టం పూర్తి చేసి ల్యాబ్కు తరలించారు. మరింత మంది గొర్రెల కాపరుల పాత్ర..? తన మందలోని గొర్రైపె దాడి చేసి చంపిన చిరుతను చంపేందుకు కాపరి గొర్రె కళేబరానికి విషంతో కూడిన ఇంజక్షన్ ఇవ్వగా.. మళ్లీ వచ్చిన చిరుత గొర్రె మాంసాన్ని తిని మృత్యువాతపడినట్లు తెలుస్తోంది. అయితే చిరుత చర్మం, గోళ్లు తీసుకున్న గొర్ల కాపరుల మధ్య విక్రయించే విషయంలో అభిప్రాయభేదాలు రావడంతో అసలు విషయం బయటికి పొక్కి నట్లు సమాచారం. చిరుతను చంపిన ఘటనలో మరికొంత మంది గొర్లకాపరుల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. పెద్దపులి సంగతేమిటో..? కమ్మర్పల్లి రేంజ్ పరిధిలో సంచరించి జాడలేకుండా పోయిన పెద్దపులి ఎక్కడ ఉందో తేలాల్సి ఉంది. చిరుతను హతమార్చిన అటవీప్రాంతంలోనే పెద్ద పులి సంచరించింది. చిరుతను హతమార్చిన నిందితులను అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. పెద్దపులికి సైతం హాని తలపెట్టి ఉంటారా అనే కోణంలో విచారణ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అటు పోలీసులు, ఇటు ఫారెస్ట్ అధికారులు ఈ ఘటనపై నోరు మెదపడం లేదు. -
అడుగంటుతున్న జలం!
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎల్నినో కారణంగా సకాలంలో వరుణు కరుణించకపోవడంతో భూగర్భ జలాలు రోజురోజుకూ పాతాళానికి పడిపోతున్నాయి. జూన్ నెలలోనే భూగర్భ జల మట్టాలు 0.75 శాతం మేర తగ్గినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా ఈ సమయానికి వర్షాలతో భూగ ర్భ జల మట్టం పెరగాల్సి ఉండగా.. ఈసారి పరిస్థి తి తలకిందులైంది. ప్రస్తుతం జిల్లాలో 36.4 శాతం లోటు వర్షపాతం నమోదు కావడమే ఇందుకు ప్రధాన కారణం. వర్షాలు లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా సాగు నీటి సంక్షోభం నెలకొంది. రైతులు ప్రస్తుతం నాట్లు వేసే పనుల్లో బిజీగా ఉన్నారు. వానలు కురవకపోవడంతో రైతాంగం పూర్తిగా వ్యవసాయ బోర్లపైనే ఆధార పడాల్సి వస్తోంది. దీంతో బోర్ల వాడకం విపరీతంగా పెరిగింది. ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటడం, మరోవైపు వాడకం పెరగడంతో బోర్లు సరిపడా నీటిని పోయడం లేదు. పంటలకు తగినంత నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ప్రధాన జలాశయాలు, చెరువులు ఇప్పటికే ఎండుముఖం పట్టాయి. జిల్లాలో సుమారు లక్షకు పైగా వరకు వ్యవసాయ బోర్లు ఉన్నాయి. సిరికొండ మండలంతోపాటు నిజామాబాద్, ధర్పల్లి, భీమ్గల్, ఽవేల్పూర్, మోర్తాడ్, డొంకేశ్వర్, నందిపేట్, మాక్లూర్ ప్రాంతాల్లో వేగంగా భూగర్భ జలాలు తగ్గి బోర్లు ఆగుతూ పోస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో పంటలు సాగు చేస్తున్న రైతాంగం దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పలు ప్రాంతాల్లో ఎత్తిపోతలు ఉండడంతో సాగుకు అవసరమైన నీరందుతోంది. నీరు లేక వెలవెలబోతున్న డొంకేశ్వర్ మండలంలోని నికాల్పూర్ జంగం చెరువునెల వారీగా భూగర్భ జలాలు (మీటర్లలో..)జనవరి 9.56ఫిబ్రవరి 10.57మార్చి 11.67ఏప్రిల్ 11.88మే 11.86జూన్ 12.61జిల్లాలో 82 ఫీజో మీటర్లలో ఇదీ పరిస్థితి..జిల్లా వ్యాప్తంగా అధికారులు 82 ఫీజో మీ టర్లు ఏర్పాటు చేసి ప్రతినెలా గ్రౌండ్ వాట ర్ లెక్కలు తీస్తున్నారు. మే నెలలో 11.68 మీటర్ల లోతులో ఉన్న నీరు జూన్కు వచ్చే సరికి 12.61 మీటర్ల లోతులోకి వెళ్లిపోయా యి. ఫీజో మీటర్ల వారీగా జూన్ లెక్కలు చూస్తే... 28 ఫీజో మీటర్లలో 10 మీటర్ల లోపు నీటి మట్టాలున్నాయి. అదే విధంగా 43 ఫీజో మీటర్లలో 10 నుంచి10 మీటర్ల లోపు భూగర్భ జలాలున్నాయి. అలాగే 11 ఫీజో మీటర్లలో 20 మీటర్ల లోతులో ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 50 శాతం మేర ఆరోగ్యకర నీటి మట్టాలు ఉన్నట్లు గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ లెక్కలు చెబుతున్నాయి. వర్షాలు పడితేగాని భూగర్భ జలాలు పెరిగి చెరువులు నిండే, పంటల పండే పరిస్థితి కనిపించడం లేదు. జూన్లో 0.75 శాతం తగ్గిన నీటి మట్టాలు జిల్లాలో 36.4 శాతం లోటు వర్షపాతం ఎండుతున్న చెరువులు.. వరినాట్లకు తప్పని తిప్పలు -
సంక్షేమం కరువు.. విద్యార్థులకు గుబులు
బాన్సువాడ: గురుకుల, ఆశ్రమ పాఠశాలలోతోపాటు వసతిగృహాల్లో విద్యార్థుల సంక్షేమం ఆందోళన కలిగిస్తోంది. అధికారుల పర్యవేక్షణ కొరవడి క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వసతి, భోజనం, మౌలిక సదుపాయాలు తదితర అంశాల్లో నెలకొన్న సమస్యలు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొక్కుబడి తనిఖీలు విద్యార్థుల సంక్షేమం, ఉద్యోగుల పనితీరును పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు మొక్కుబడి తనిఖీలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. లోపాలు సరిదిద్దడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సమాచారం. వంటశాలలు అపరిశుభ్రంగా ఉండటం, కూరగాయలు, సరుకులు నాణ్యత లోపించడం తదితర లోపాలు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదిలా ఉండగా ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, వసతి గృహాల వార్డెన్లు చాలా మంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హాస్టళ్లకు సమీపంలో ఉంటూ విధులు నిర్వర్తించాల్సిన వార్డెన్లు పట్టణాల్లోనే కాలం వెలదీస్తున్నట్లు సమాచారం. వసతి ఇబ్బందులు బాన్సువాడ ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహం ఏళ్లుగా అద్దె భవనంలో కొనసాగుతోంది. ఇరుకై న గదులు, సరిపడా స్నానాల గదులు, మూత్రశాలలు లేకపోవడంతో విద్యార్థునులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాణ్యత లేని, అపరిశుభ్రమైన ఆహారం వడ్డించడం, తాగునీటి సరఫరా సరిగా లేకపోవడంతో విద్యార్థులు తరుచూ అనారోగ్యానికి గురవుతున్నారు. ఇటీవల జరిగిన ఘటనలు ● ఈ నెల 7న బీర్కూర్ మహాత్మాగాంధీ జ్యోతీభా ఫూలే గురుకుల పాఠశాలకు చెందిన 12 మంది విద్యార్థుల అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనతో ముగ్గురు అవుట్ సోర్సింగ్ సిబ్బందిని విధుల్లోంచి తొలగించారు. ప్రిన్సిపల్, ఓ ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసులు జారీచేశారు. సెక్యూరిటీ, క్యాటరింగ్ నిర్వాహకులకు హెచ్చరిక నోటీసులు ఇచ్చారు. ● ఈ నెల 8న బాన్సువాడ ఎస్సీ వసతిగృహం విద్యార్థిని అమృత ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రిన్సిపల్ను సస్పెండ్ చేశారు. గురుకులం విద్యార్థులు బీసీ 3,783 ఎస్సీ 6,056 మైనార్టీ 2,276 గిరిజన 2,212 ఆశ్రమ పాఠశాలలు 671 ఏకలవ్య పాఠశాలలు 442 మొత్తం 15,440 ఆశ్రమ, గురుకుల పాఠశాలలు.. హాస్టళ్లలో కొరవడిన పర్యవేక్షణ ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్న అధికారులు వరుస ఘటనలతో ఆందోళన గురుకుల పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల వసతులపై పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రతీ నెల పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. సంఘటన జరిగినప్పుడే చర్యలు తీసుకొని వదిలేస్తున్నారు. – బాల్రాజ్, పీడీఎస్యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు -
చేనేత సహకార సంఘం అధ్యక్షుల ఎన్నిక
బోధన్: బోధన్ డివిజన్ చేనేత సహకార సంఘం అధ్యక్షుడిగా లోల శంకర్, ఉపాధ్యక్షుడిగా మోత్కూ రి నారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం పట్టణ కేంద్రంలోని సంఘ కార్యాలయంలో నూతన పాలక వర్గ సభ్యుల తో ఎన్నికల అధికారి ప్రత్యేక సమావేశం నిర్వహించి అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్త పాలక వర్గ సభ్యులకు చేనేత కార్మికులు, పలువురు ప్రజాప్రతినిధులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్ర మంలో పాలక వర్గ సభ్యులు పత్తి గంగారాం, మోత్కూరి లక్ష్మణ్, శ్యాంసుందర్ పహాడే, మోత్కూరి సాయిలు, తాటిపాముల విజయ్ కుమా ర్, మోత్కూరి కళావతి, జోరీగల లక్ష్మి పాల్గొన్నారు. ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలోని చేనేత పారిశ్రామిక సహకార సంఘంలో శుక్రవారం ఎన్నికలు జరుగగా చెన్న రవికుమార్ ప్యానల్తో కూడిన తొమ్మిది మంది డైరెక్టర్లు విజయవంతం సాధించారు. కాగా శనివారం తొమ్మిది మంది డైరెక్టర్లలో చెన్న రవికుమార్ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే వైస్ చైర్మన్గా బెక్కి గంగామోహన్, సెక్రెటరీగా కొండి రాము, కోశాధికారిగా చిట్ల శ్యాంసుందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. సంఘం అభివృద్ధికి, కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తానని చైర్మన్ అన్నారు. అనంతరం నూతన పాలకవర్గ సభ్యులను చేనేత కార్మికులు సన్మానించారు. నూతన అధ్యక్షుడు రవికుమార్తో డైరెక్టర్లుఅధ్యక్ష, ఉపాధ్యక్షులను సన్మానిస్తున్న సభ్యులు -
‘సర్’ ప్రక్రియను వేగవంతం చేయాలి
వర్ని: ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా పరిషత్ సీఈవో సాయాగౌడ్ సూచించారు. మోస్రా మండల కేంద్రంతోపాటు గోవురూలో ఓటరు నమోదు ప్రక్రియను ఆయన శనివారం పరిశీలించారు. ఓటరు జాబితా నమోదులో బూత్స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండి పారదర్శకంగా నమోదును పూర్తి చేయాలని సూచించారు. సర్లో సమస్యలు తలెత్తకుండా చూ సుకోవాలని, ఎన్యుమరేషన్ ఫారాలను తప్పులు లేకుండా నింపాలని, నిర్లక్ష్యం వహిస్తే ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉందన్నారు. ఆయన వెంట మో స్రా తహసీల్దార్ ధన్పాల్, ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్ భూపాల్ రెడ్డి,ఉప సర్పంచ్ సురేశ్గౌడ్, పంచాయతీ కార్యదర్శులునరేందర్,శేఖర్ ఉన్నారు. -
స్వగ్రామానికి శ్రీనాథ్రెడ్డి మృతదేహం
భిక్కనూరు: లండన్లో జూన్ 22న మృతి చెందిన రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన సావుసాని శ్రీనాథ్రెడ్డి మృతదేహం శనివారం స్వగ్రామానికి చేరుకుంది. ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన శ్రీనాథ్రెడ్డి తాను అద్దెకు ఉండే గదిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఉదయం హైదరాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న మృతదేహాన్ని అంబులెన్స్లో తలమడ్లకు తరలించారు. జాతీయ రహదారి జంగంపల్లి గ్రామశివారు నుంచి తలమడ్ల గ్రామంలోని శ్రీనాథ్రెడ్డి ఇంటివరకు ఆయన స్నేహితులు అంబులెన్స్ ముందట బైక్ ర్యాలీ నిర్వహించారు. దారిపొడవునా అంబులెన్స్పై పూలు చల్లారు. శ్రీనాథ్రెడ్డి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు మంజుల మధుసూదన్రెడ్డి బోరున రోదించడం కంటతడి పెట్టించింది. ఉన్నత చదువులు చదివి, ఉన్నత ఉద్యోగం సాధిస్తాడని తాము కన్న కలలు అడియాశలు అయ్యాయని విలపించారు. సాయంత్రం గ్రామ శివారులో అంత్యక్రియలు నిర్వహించారు. పిట్లం (జుక్కల్): గ్యాస్ సిలిండర్ల లోడ్తో వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తాపడిన ఘటన మండలంలోని రూంతండా మూలమలుపు వద్ద శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పిట్లం నుంచి బాన్సువాడ వైపు సిలిండర్ల లోడ్తో వెళ్తున్న టాటాఏస్ వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో రోడ్డుపై నిండు సిలిండర్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆ సమయంలో అటువైపు వాహన రాకపోకలు లేకపోవడంతో ప్రమాదం జరగలేదు. వాహనంలో ఉన్నవారికీ ఎలాంటి గాయాలు కాలేదు. -
అత్యాపత్యా పోటీలకు బయల్దేరిన జిల్లా జట్టు
నిజామాబాద్ అర్బన్ : సిద్దిపేట జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి అండర్–14 అత్యాపత్యా పోటీలకు జిల్లా జట్టు బయల్దేరినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు వినోద్రెడ్డి తెలిపారు. నగరంలోని కలెక్టర్ గ్రౌండ్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రీడాకారులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో జిల్లాకు పేరు తేవాలని, మంచి క్రీడా నైపుణ్యం ప్రదర్శించి విజేతగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సంజీవ్, మీసాల ప్రశాంత్, వ్యాయామ ఉపాధ్యాయులు స్వప్న, కల్పన, శ్రీకాంత్, ప్రదీప్ పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
● గుండెపోటుతో మహారాష్ట్ర వాసి మృతిదైవదర్శనానికి వచ్చి..మద్నూర్(జుక్కల్): దైవదర్శనానికి వచ్చిన ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన మండలంలోని సలాబత్పూర్లో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై మోహన్ రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని బిలోలి తాలూక తడిహిప్పర్గాకు చెందిన మహజన్ రామలక్ష్మణ్(80) ఉదయం ఇంటి నుంచి సలాబత్పూర్ హనుమాన్ ఆలయానికి బయల్దేరారు. హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్న రామలక్ష్మణ్ సమీపంలో ఉన్న శివాలయానికి వెళ్తుండగా గుండెపోటుతో రోడ్డు పక్కన కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతుడి జేబులో లభించిన ఆధార్ వివరాలతో కుటుంబీకులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు. మాక్లూర్ : మండలంలోని అడవి మామిడిపల్లి శివారులో ఆటో బోల్తా పడిన ఘటనలో గాయపడిన చిన్నుబాయి శనివారం మృతి చెందినట్లు ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ నగరంలోని ఆదర్శనగర్కు చెందిన చిన్నుబాయి తన కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం నందిపేట్ మండలంలోని ఓ దేవాలయానికి ఆటోలో వెళ్లింది. తిరుగు ప్రయాణంలో అడవి మామిడిపల్లి శివారులో కుక్క అడ్డం రావడంతో ఆటో బోల్తా కొట్టింది. దీంతో మిగతా కుటుంబసభ్యులకు స్వల్పగాయాలు కాగా చిన్నుబాయికి బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారని ఎస్సై తెలిపారు. చిన్నుబాయి సోదరుడు దేవిదాస్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
రేపు పీఎం అప్రెంటిస్షిప్ మేళా
కమ్మర్పల్లి : కమ్మర్పల్లి మండలం బషీరాబాద్లోని ఐటీఐ కళాశాలలో సోమవారం ప్రధానమంత్రి అప్రెంటిస్షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ కోటిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో మహీంద్రా అండ్ మ హీంద్రా(జహీరాబాద్), ప్రీమియర్ ఎనర్జీస్(హైదరాబాద్)తోపాటు ఇతర స్థానిక పరిశ్రమల ప్రతినిధులు హాజరై అప్రెంటిస్షిప్ అవకాశాలు కల్పిస్తారన్నారు. వివిధ ట్రేడ్లలో ఉత్తీర్ణులైన విద్యార్థులు, ప్రస్తుతం కోర్సు పూర్తి చేసుకున్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఆసక్తిగల అభ్యర్థులు వి ద్యార్హతకు సంబంధించి సర్టిఫికెట్లు, ఆధార్ ఒ రిజినల్,జిరాక్స్ ప్రతులతోపాటు పాస్పోర్ట్ సై జ్ ఫొటోలతో హాజరుకావాలని సూచించారు. డిచ్పల్లి : చారిత్రక ప్రసిద్ధి చెందిన డిచ్పల్లి ఖిల్లా రామాలయ కమిటీ నూతన చైర్మన్గా మాజీ సర్పంచ్ అప్పాల గంగాదాస్, హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్గా మారు రఘుపతి నియామకమయ్యారు. శనివారం సాయంత్రం క్యాంప్ కార్యాలయంలో ఆలయ నూతన కమిటీ చైర్మన్లు, పాలకవర్గం సభ్యులకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధ్యాత్మికత పెంపొందించేలా ఖిల్లా రామాలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో రామాలయం కమిటీ పాలకవర్గ సభ్యులు అశోక్, బూస రవి, చెలిమెల వినయ్, ఆర్మూర్ లలిత, ప్రధానార్చకులు కృష్ణమాచారితోపాటు హనుమాన్ ఆలయ కమిటీ పాలకవర్గ సభ్యులు సూర శ్యామ్, ఆడెపు రాజు, కొంగ ప్రవీణ్, చిన్నముత్తవ్వ, మాజీ సర్పంచ్ బూస సుదర్శన్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ రాంచందర్ గౌడ్, దాసరి అశోక్ తదితరులు పాల్గొన్నారు. సుభాష్నగర్ : ఈ నెల 24న నగరంలో నిర్వహించనున్న జగన్నాథ రథయాత్ర మహోత్సవానికి హాజరుకావాలని మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్కు ఇస్కాన్ కంఠేశ్వర్ ప్రతినిధులు శనివారం ఆహ్వానపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ దిలీప్కుమార్ మాట్లాడుతూ ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రం ఆధ్వర్యంలో సేవా,ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభ వంగా నిర్వహిస్తున్నారన్నారు. జగన్నాథ రథయాత్రలో నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొ ని భగవంతుడి కృపకు పాత్రులు కావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మాదాసు స్వామి యాదవ్, ఇస్కాన్ ప్రతినిధులు నితాయ్ చంద్, సుమంత్, సూర్య, రోహిత్ పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్ : నగరంలోని రెండో టౌ న్ పరిధిలో వ్యభిచార గృహంపై పోలీసులు దా డి చేసి నిర్వాహకుడితోపాటు నలుగురు విటులను అరెస్టు చేశారు. వర్ని రోడ్డులోని ఫారెస్టు ఆఫీస్ కార్యాలయం సమీపంలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రెండో టౌన్ పోలీసులు దాడి చేసి మాక్లూర్కు చెందిన ఇద్దరు, నందిపేటకు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
● బంగారు గొలుసు, నగదు అపహరణ రుద్రూర్ : తాళం వేసిన ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడిన ఘటన కోటగిరి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కోటగిరికి చెందిన దొప్పలపూడి చందన గత నెల 1న సాయంత్రం ఇంటికి తాళం వేసి హైదరాబాద్కు వెళ్లారు. శనివారం ఉదయం తిరిగి వచ్చి చూడగా ప్రధాన తలుపు తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తాళం కూడా ధ్వంసం చేసి అందులో ఉన్న రెండు తులాల బంగారు గొలుసుతోపాటు కొంత నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. -
దోషులకు శిక్ష పడేలా చూస్తా..
● బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటా.. ● ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): నాలుగు నెలల క్రితం కువైట్ దేశంలో అనుమానాస్పదంగా మృతి చెందిన గుగులోత్ కై లాశ్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండటంతోపాటు నిందితులకు శిక్ష పడేలా చూస్తామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి హామీ ఇచ్చారు. శనివారం డిచ్పల్లి మండలం కొరట్పల్లి తండాను సందర్శించిన ఎమ్మెల్యే కై లాశ్ తల్లిదండ్రులను ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించారు. కై లా శ్ను ఇదే మండలంలోని మేలయతండాకు చెందిన తండ్రీ కొడుకు కలిసి హత్య చేసి ఎడారిలో పాతిపెట్టారని, ఎలాగైనా తమకు న్యాయం చేయా లని తల్లిదండ్రులు ఎమ్మెల్యేను వేడుకున్నారు. ఎమ్మెల్యే అక్కడే ఉన్న డిచ్పల్లి సీఐ, ఎస్సైలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కై లాశ్ మృతి కేసులో పరారీలో ఉన్న నిందితుడు గణేశ్ ఆచూకీ కనిపెట్టి నిజానిజాలు రాబట్టాలని ఆదేశించారు. తక్షణ సాయంగా బాధిత కుటుంబానికి రూ.10 వేలు సాయం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఘటన విషయమై ఇప్పటికే సంబంధిత ఎన్నారై అధికారులతో మాట్లాడినట్లు చెప్పారు. బాధితులకు ప్రభుత్వపరంగా అందాల్సిన సాయం అందజేస్తామన్నారు. నిందితుల్లో ఒకరిని కువైట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఇక్కడే ఉన్న మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసుల ద్వారా తెలిసిందన్నారు. త్వరలోనే అతన్ని కూడా అదుపులోకి తీసుకొని చట్టప్రకారం శిక్ష పడేలా చూస్తామన్నారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంబర్సింగ్, ఐడీసీఎంఎస్ మాజీ అధ్యక్షుడు మునిపల్లి సాయిరెడ్డి, తారాచంద్నాయక్, డీసీసీ ఉపాధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ రాంచందర్గౌడ్, సర్పంచులు బానోత్ సంగీత మహేశ్, పోతె ప్రభాకర్, నాయకులు ఉన్నారు. -
వినూత్న ఆలోచన.. తీరిన సమస్య..
నందిపేట్(ఆర్మూర్): దాదాపు 20 వేల జనాభా గల నందిపేటలో డ్రెయినేజీలు, రోడ్లు, సోమవారం సంత రోజు ఏర్పడే చెత్తను శుభ్రం చేసేందుకు కార్మికులు సరిపోవడం లేదు. దీంతో మేజర్ గ్రామపంచాయతీ కావడం వల్ల రోడ్లను శుభ్రం చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈక్రమంలో రోడ్లను శుభ్రం చేసేందుకు పాలకవర్గం వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. సాధారణంగా పారిశుద్ధ్య కార్మికులు చీపుళ్లతో రోడ్లు ఊడ్చి శుభ్రం చేస్తారు. అయితే దీనికి భిన్నంగా నందిపేట పాలకవర్గం రోడ్ల క్లీనింగ్ కోసం వినూత్నంగా ఆలోచించి ప్రత్యేక యంత్రాన్ని తయారు చేసింది. ఒకేసారి నాలుగు చీపుర్లు.. గ్రామ పంచాయతీ ట్రాక్టర్కు వెనుక తేలికగా 360 డిగ్రీలలో తిరిగే యంత్రాన్ని తయారు చేయించారు, దానికి నాలుగు వైపుల పెద్ద చీపుర్లు అమర్చారు. ట్రాక్టర్ మోటారు సహాయంతో ఆ నాలుగు చీపుర్లు తిరుగుతూ రోడ్డును చక్కగా శుభ్రం చేస్తుంటాయి. అంతేగాక రోడ్డుపై ఉన్న చెత్తను ఒక పక్కకు తోస్తుంటాయి. ఈ యంత్ర ఉపయోగం వల్ల పారిశుధ్య కార్మికుల కొరత తీరుతుంది. దీంతోపాటు సుమారు పది మంది చేసే పనిని ఈ యంత్రం సులభంగా చేయడంతో గ్రామ పంచాయతీకి ఖర్చు కూడా తగ్గుతుంది. ప్రతిరోజు సుమారు 6 కిలోమీటర్ల వరకు ప్రధాన రోడ్డుతో పాటు పలు వీధులను శుభ్రం చేస్తుంది. గత కొన్ని రోజులుగా మట్టితో నిండి ఉన్న రోడ్లన్నీ ఈ యంత్రం సహాయంతో శుభ్రంగా కనిపిస్తున్నాయి. నందిపేట గ్రామాన్ని స్వచ్ఛ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇలాంటి వినూత్న కార్యక్రమాలతో మా పాలకవర్గం ముందుకు వస్తుంది. పది మంది కార్మికులు చేసే పనిని ఈ ఒక్క యంత్రం చేస్తుంది. పారిశుద్ధ్య కార్మికుల కొరత కూడ తీరుతుంది. జీపీలో ఉన్న 25 మంది కార్మికులతో ఇతర పనులు చేపడుతున్నాం. – ఎర్రం లింగం, సర్పంచ్, నందిపేట నందిపేటలో పారిశుద్ధ్య కార్మికుల కొరత రోడ్లను శుభ్రం చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఆధునిక యంత్రం ఏర్పాటుతో ఇక్కట్లు దూరం


