breaking news
Nizamabad District Latest News
-
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
నిజామాబాద్ అర్బన్: మున్సిపల్ ఎన్నికల్లో పోలీసు సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేస్తూ అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూడాలని సీపీ సాయిచైతన్య అన్నారు. కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం నిజామాబాద్ డివిజన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నేరాలను నియంత్రించాలన్నారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. పోక్సో గ్రేవ్ కేసులలో త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వర్ రావు, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ అంజయ్య, నిజామాబాద్ డివిజన్ సీఐలు, ఎస్సైలు, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు. -
మూడు సెంటర్లు
జేఈఈ మెయిన్స్కు ● నేటి నుంచి 29 వరకు పరీక్షల నిర్వహణ ● జిల్లా కేంద్రంలో పరీక్ష రాయనున్న 4,171 మంది విద్యార్థులు ఖలీల్వాడి: ఎన్ఐటీల్లో బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి, జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత పొందేందు కు బుధవారం నుంచి జేఈఈ మెయిన్స్ ప్రా రంభం కానున్నది. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష(సీబీటీ)కు జిల్లాలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) సిటీ కోర్డినేటర్ భాస్కర్ మెరిగా మంగళవారం తెలిపారు. నగరంలోని అర్సపల్లిలోని ఏవీ ఎంటర్ప్రైజెస్, ఆర్మూర్ మండలం చేపూర్లోని క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాల, మల్లారంలోని స్విఫ్ట్ టెక్నాలజీస్, ఆయేషా కాలేజ్ ఆఫ్ ఎ డ్యుకేషన్లో పరీక్షలు జరుగుతాయన్నారు. బు ధవారం నుంచి ఈ నెల 29 వరకు ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో పరీక్షలు ఉంటా యని పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు పేపర్–1, 29న పేపర్–2 నిర్వహించనున్నారు. జిల్లాలోని పరీక్ష కేంద్రాల్లో మొత్తం 4,171 మంది అభ్యర్థులు జేఈఈ మెయిన్స్ రాయనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు తీసుకురావాలి, గడియారాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, నిషేధిత వస్తువులు పరీక్ష హాల్లోకి అనుమతించబడవని పేర్కొన్నారు. వివరాలకు 89781 98421నంబర్లో సంప్రదించాలని తెలిపారు.ఖలీల్వాడి: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అకౌంటెంట్, ఏఎన్ఏం పోస్టులను 2025–26 సంవత్సరానికి కాంట్రాక్ట్ పద్ధతిలో మెరిట్ కం రోస్టర్ ప్రతిపాదికగా భర్తీ చేసేందుకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు డీఈవో పా ర్శి అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అకౌంటెంట్ పోస్టుకు బీసీ(ఈ)కి చెంది నవారై డిగ్రీలో బీకాం కంప్యూటర్ పూర్తి చేయడంతోపాటు ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ పూ ర్తి చేసినవారు అర్హులని పేర్కొన్నారు. ఏఎన్ ఎం పోస్టుకు మహిళా దివ్యాంగ అభ్యర్థులు ద రఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అకౌంటెంట్, ఏఎన్ఎం ఒక్కో పోస్టు ఖాళీగా ఉందని తెలిపారు. దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి కలెక్టరేట్లోని విద్యాశాఖ కార్యాలయంలో ఈ నెల 23వ తేదీ వరకు అందించాలని సూచించారు. సమర్థవంతమైన నేతలను ఎన్నుకోవాలి ● ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి బాన్సువాడ రూరల్: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సమర్థవంతమైన నాయకులనే ఎన్నుకోవాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన బాన్సువాడ పట్టణంలోని 15, 16 వార్డుల్లో స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. గ్రామ పంచాయతీగా ఉన్న బాన్సువాడను మున్సిపాలిటీగా మార్చుకుని సుమారు రూ.200 కోట్లతో అభివృద్ధి చేశానన్నారు. రానున్న రోజుల్లో బాధ్యతతో పనిచేసే వారిని ఎన్నుకుంటే రాష్ట్రంలోనే బాన్సువాడ మున్సిపాలిటీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కాలనీవాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెల్సుకున్నారు. ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, నాయకులు జంగం గంగాధర్, కృష్ణారెడ్డి, గురువినయ్, శ్రీధర్, ఎజాజ్, అసద్బిన్ మోసీన్, నర్సన్నచారీ, నార్లసురేష్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు. -
పలువురికి జైలు
డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో కామారెడ్డి క్రైం: మద్యం తాగి వాహనాలు నడిపినందుకు గాను జిల్లా వ్యాప్తంగా ఆయా కోర్టులు ఒకే రోజు 27 మందికి శిక్షలు విధించాయి. ఇటీవల పోలీసులు జిల్లావ్యాప్తంగా డ్రంకన్డ్రైవ్ తనిఖీలు చేపట్టగా, పలువురు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని మంగళవారం స్థానిక కోర్టులలో హాజరుపర్చగా 14 మందికి ఒకరోజు జైలు శిక్ష, మరో 13 మందితోపాటు మొత్తం 27 మందికి రూ.వెయ్యి చొప్పున జరిమానాలు విధించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లాలోని అన్ని పీఎస్ల పరిధిలో క్రమం తప్పకుండా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. నిజామాబాద్ అర్బన్: నగరంలో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా 11 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని మంగళవారం పోలీసులు జిల్లాకేంద్రంలోని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. జడ్జి 11 మందికి ఒక్కొక్కరి రూ.10వేల చొప్పున జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్అలీ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఐదుగురికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు. అలాగే ఐదో టౌన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు ఇటీవల డ్రంకన్డ్రైవ్లో పోలీసులకు పట్టుబడ్డారు. వారిని మంగళవారం కోర్టులో హాజరుపర్చగా జడ్జి ఒకరికి ఏడురోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై గంగాధర్ తెలిపారు. మరో వ్యక్తికి రూ.పదివేల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. ఇందల్వాయి: ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల పోలీసులు చేపట్టిన డ్రంకన్డ్రైవ్ తనిఖీల్లో ఇద్దరు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని మంగళవారం స్పెషల్ ఎకై ్సజ్ కోర్టులో మెజిస్ట్రేట్ అహమ్మద్ మెయినొద్దిన్ ఎదుట హాజరు పర్చినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. జడ్జి వారిలో ఒకరికి ఏడు రోజుల జైలు శిక్ష, మరొకరికి రూ. పదివేల జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు.నిజామాబాద్ అర్బన్: నగరంలోని మాల పల్లిలో న్యూ సవేరా హోటల్ను నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచడంతో హోటల్ యజమానిని ఇటీవల ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి అరెస్టు చేశారు. మంగళవారం హోటల్ నిర్వాహకుడిని కోర్టులో హాజరుపర్చగా జడ్జి అతడికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు. -
చికిత్స పొందుతూ ఒకరు మృతి
బాన్సువాడ రూరల్: చలిమంటలకు గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికి త్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు.. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఖాజాపూర్ గ్రామానికి చెందిన ఎండీ సా హెబ్ అలీ(41) కొన్నేళ్ల క్రితం బాన్సువాడకు వ లస వచ్చాడు. పట్టణంలోని ఇస్లాంపుర కాలనీలో నివాసముంటూ సంతల్లో చేపలు శుభ్రంచేసి కట్చేసే పనులు చేసేవాడని తెలిసింది. ఈనెల 16న రాత్రి అతడు ఇంటిబయట ఉన్న చలిమంటల వద్దకు వచ్చాడు. ఈక్రమంలో అతడి దుస్తువులకు మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 19న మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బాన్సువాడ ఎస్హెచ్వో శ్రీధర్ తెలిపారు. భిక్కనూరు మండలంలో.. భిక్కనూరు: పతంగి ఎగురవేస్తూ భవనం పైనుంచి కిందపడి గాయపడిన ఓ బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా.. మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన ఆవుసుల ప్రకాశ్ సిద్దిపేట జిల్లా కేంద్రంలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఆయన చిన్న కుమారుడు కార్తీక్ (11) ఈనెల 15న (సంక్రాంతి రోజున) సిద్ధిపేటలోని రెండంతస్తుల భవనం పైనుంచి గాలిపటం ఎగురవేస్తుండగా, ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. స్వగ్రామంలో మధ్యాహ్నం కార్తీక్ మృతదేహానికి అంత్యక్రియలను నిర్వహించారు. ఎల్లారెడ్డి రూరల్ : ఎల్లారెడ్డి మండలం అడవి లింగాల గ్రామంలో అన్నదమ్ములు మృతి చెందారు. గ్రామానికి చెందిన అవిసుల అంజయ్య (48) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందగా, కొద్ది గంటలకే అతడి తమ్ముడు నాగభూషణం (46) మూర్చ వ్యాధి వచ్చి మృతి చెందాడు. ఒకేరోజు అన్నదమ్ములు గ్రామంలో మృతి చెందడం పట్ల కుటుంబీకులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి
బోధన్: విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుకుని తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఆర్జీయూకేటీ (రాజీవ్గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ) అసోసియేట్ డీన్ విఠల్ సూచించారు. సాలూర పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్లో మంగళవారం కెరీర్ గైడెన్స్ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై, మాట్లాడారు. క్రమశిక్షణతో కూడిన అధ్యయనం భవిష్యత్తుకు దా రి చూపుతుందన్నారు. సైకాలజిస్ట్ శ్రీనివాస్, ఎంఈవో రాజిమంజూష, ఉపాధ్యాయులు ఉన్నారు. -
నిర్మాణంలో ఉన్న భవనం సీజ్
సుభాష్నగర్: నగరంలోని పూ సలగల్లిలో ఓ ఫారెస్ట్ అధికారి ని ర్మిస్తున్న రెండంతస్తుల భవనా న్ని టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్రెడ్డి నోటీసులు అతికించి మంగ ళవారం సీజ్ చేశారు. భవనం మొదటి, రెండో అంతస్తు నిర్మాణం పరిధి దాటి చేస్తుండటంతో ఓ వ్యక్తి టౌన్ప్లానింగ్ అధికారులకు గతంలో ఫిర్యా దు చేశారు. అధికారులు పరిశీలించి భవన నిర్మాణానికి అనుమతులు లే వని, ఫిర్యాదులు అందాయని, వెంటనే పనులు నిలిపేయాలని సూచించారు. పనులు కొనసాగుతుండటంతో కోర్టును సైతం ఆశ్రయించారు. ప నులు తక్షణమే ఆపేయాలని చెప్పినా.. సదరు ఫారెస్ట్ అధికారి పట్టించుకోలేదు. అధికారులు వెళ్లినప్పుడు పనులు నిలిపేసి.. ఆ తర్వాత నిర్మాణా న్ని కొనసాగించారు. దీంతో ఏసీపీ శ్రీధర్రెడ్డి మంగళవారం పోలీస్ బలగాలతో వెళ్లి భవనానికి నోటీసులు అతికించి సీజ్ చేశారు. -
ఆశావహుల పక్కచూపులు!
● మున్సిపల్ ఎన్నికల బరిలో నిలవడమే లక్ష్యంగా ఎత్తుగడలు ● ఒక పార్టీ టికెట్ ఇవ్వకపోతే మరో పార్టీ నుంచి దక్కించుకునే యత్నం ఆర్మూర్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో రాజకీయం రోజురోజుకు రంజుగా మారుతోంది. పార్టీ టికెట్ల కోసం ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో వార్డు స్థానం నుంచి సుమారు ఐదారుగురు ఆయా పార్టీలకు దరఖాస్తులు అందిస్తుండటంతో పోటీ అధికంగా మారింది. ఈక్రమంలో టికెట్ల కోసం కొందరు ఆశావహులు తటస్థంగా ఉంటూ ఏ పార్టీ టికెట్ ఇస్తే, ఆ పార్టీలోకి మారే ప్రయత్నాలు చేస్తున్నారు. ● నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తోపాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీల పరిధిలో అధికార కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించే వారి సంఖ్య అధికంగా ఉంది. ఒక్కో వార్డులో ముగ్గురు, నలుగురు కాంగ్రెస్ పార్టీ నాయకులు టికెట్ ఆశిస్తున్నారు. ఎంతమంది దరఖాస్తు చేసినా పార్టీ మాత్రం ఒక్కరికే టికెట్ ఇస్తుంది. దీంతో పలువురు ఆశావహులు అధికార పార్టీ టికెట్ లభించని పక్షంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ టికెట్ అయినా సాధించి గెలవాలనే పట్టుదలతో ఆయా పార్టీల నాయకులతో మంతనాలు సాగిస్తున్నారు. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండాలనే పట్టుదలతో ఉన్నారని సమాచారం. ● ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ గంగామోహన్ చక్రు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాడు. కానీ చైర్పర్సన్ రిజర్వేషన్ కలిసి రావడంతో తన సతీమణి సవిత చక్రును బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయించడానికి మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. 24వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్ ఆకుల రాము తరువాతి కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కానీ ఈ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నుంచి పోటీ ఉండటంతో 9వ వార్డు నుంచి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నాడు. తనకు టికెట్ రాని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవాలనే సంకల్పంతో ఉన్నాడు. 27వ వార్డుకు చెందిన బదాం రాజ్ కుమార్ సైతం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నప్పటికీ పార్టీ ముఖ్య నాయకులు ఈ వార్డు నుంచి ఇతర ఆశావహులను ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంతో బీజేపీ లేదా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవడానికి సిద్దమవుతున్నాడు. 2వ వార్డు ఎస్టీ రిజర్వు కావడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన మాజీ కౌన్సిలర్లు పూల నర్సయ్య, వనం శేఖర్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలా ఆర్మూర్ పట్టణంలోనే కాకుండా నిజామాబాద్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని రోజుల్లో పార్టీ టికెట్ పొందే ఆశావహులు ఎవరో తెలియనుంది.నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలటీల్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న ఆశావహులు తమ ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆదర్శప్రాయంగా ఉండేందుకు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి సొంత ఇళ్లు ఉంటే ఇంటి పన్ను, నల్లా పన్ను లాంటివి బకాయి ఉంటే నామినేషన్ల స్క్రూటినీలో సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. బకాయిదారుల నామినేషన్ను సైతం తిరస్కరించడానికి ఆవకాశం ఉంది. దీంతో తమపై బకాయి ఉన్న పన్నులను కట్టేయడమే కాకుండా అద్దె ఇంట్లో ఉండే ఆశావహులు ఆ ఇంటి యజమానులతో సైతం పన్నులను కట్టిస్తూ పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇదివరకు నిర్వహించిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు ఈ వివరాలన్నీ తెలిసి సిద్ధంగా ఉన్నప్పటికీ కొత్తగా పోటీలోకి వస్తున్న అభ్యర్థులు మాత్రం ఒకటికి రెండు సార్లు ఎన్నికల నిబంధనలను తెలుసుకుంటూ రంగంలోకి దిగుతున్నారు. ఇక రాజకీయ పార్టీలకు చెందిన కొందరు నాయకులు కాంట్రాక్టర్లుగా కొనసాగుతున్నారు. ఇలాంటి వారు పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న తరుణంలో కాంట్రాక్టర్ లైసెన్సును రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. ఈక్రమంలో వారి కుటుంబ సభ్యులతో ఎవరితోనైనా పోటీ చేయించడమా లేదా లైసెన్సును రద్దు చేసుకొని పోటీలో నిలవడంపై సన్నిహితుల వద్ద అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కలిసి వచ్చిన రిజర్వేషన్తో కౌన్సిలర్గా పోటీ చేయడానికి ఆసక్తి ఉన్న ఆశావహులు కుల ధ్రువీకరణ పత్రాలను పొందడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కలిసి రావడంతో ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఆశావహులు తమ భార్యను లేదా తల్లిని బరిలో దింపడానికి గాను వారి కుల ధ్రువీకరణ పత్రాలను పొందడానికి మీసేవా, తహసీల్దార్ కార్యాలయాలను ఆశ్రయిస్తున్నారు. -
నల్లవెల్లిలో యువకుడి ఆత్మహత్య
ఇందల్వాయి: మండలంలోని నల్లవెల్లి గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఇన్చార్జి రైల్వే ఎస్సై లింబాద్రి తెలిపారు. వివరాలు ఇలా.. నల్లవెల్లి గ్రామానికి చెందిన పనాస అనిల్(28) అనే యువకుడు వ్యవసాయం చేస్తూ జీవించేవాడు. కొన్ని నెలల క్రితం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయన్న ఆన్లైన్ ప్రకటనలను నమ్మి మోసపోయి అప్పులపాలయ్యాడు. ఈక్రమంలో సోమవారం సాయంత్రం అతడు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేడు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. మరుసటి రోజు ఉదయం గ్రామశివారులోని రైల్వే పట్టాలపై ఓ వ్యక్తి మృతదేహాన్ని రైల్వేట్రాక్మన్ గుర్తించి రైల్వే పోలీసులకు, గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహం అనిల్దిగా గుర్తించారు. రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇస్సానగర్లో ఒకరు.. బీబీపేట: మండలంలోని ఇస్సానగర్లో ఓ వ్యక్తి ఆ త్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై విజయ్కుమార్ తెలిపారు. వివరాలిలా.. ఇస్సానగర్ గ్రామానికి చెందిన ధర్మగారి రాజాగౌడ్ (34) ఇస్సానగర్ గ్రామ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడుగా పని చేస్తున్నారు. అతడికి అప్పులు ఎక్కువ కావడంతో ఆ ర్థిక ఇబ్బందులు భరించలేక సోమవారం ఇంట్లో నే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని చికి త్స నిమిత్తం ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అ క్కడ పరిస్థితి విషమించి రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పర్సంటేజీల చిట్టా ఉంది
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ అర్వింద్ ధర్మపురి, పక్కన కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యనారాయణ, రాకేశ్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎంపీ ల్యాడ్స్ పనులకు సంబంధించి అధికారులు తీసుకుంటున్న ప ర్సంటేజీల చిట్టా తనవద్ద ఉందని, తీరు మా ర్చుకోకుంటే వచ్చే సమావేశంలో పేర్లు బయటపెట్టి చర్యలకు సిఫారసు చేస్తానని ఎంపీ ధర్మపురి అర్వింద్ హెచ్చరించారు. ఎంపీ అధ్యక్షతన మంగళవారం ‘దిశ’ (జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమి టీ) సమావేశం కలెక్టరేట్లో జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అమృత్ పథకం కింద భూగర్భ డ్రెయినేజీ, తాగునీటి పనులు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ఆర్వోబీ, ఆర్ యూబీ పనులను త్వరితగతిన చేపట్టాలన్నారు. ఆర్అండ్బీ, జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రోడ్ల నిర్మాణాలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలని సూచించారు. అలాగే పీఎం విశ్వకర్మ పథకం కింద అర్హులైన వారందరూ లబ్ది పొందేలా చర్యలు తీసుకోవాలని, పథకం అ మలులో ద్వితీయ స్థానంలో ఉన్న జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు సిరికొండ మండలంలో అట వీ భూములు ఆక్రమణకు గురవుతుంటే అధికారులు ని ర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నార ని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి అన్నారు. దీనిపై అటవీ అధికారులు పొంతనలే ని సమాధానాలు చెప్పడంతో ఎంపీ అర్వింద్ ఆగ్రహించారు. అటవీ అధికారులు మాట్లాడకుండా కూర్చోవాలంటూ మండిపడ్డారు. తిలక్ గార్డెన్ కాంప్లెక్స్లో బినామీలు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ నిజామాబాద్ నగర పాలక సంస్థకు చెందిన తిలక్ గార్డెన్ వాణిజ్య సముదాయాల్లో బినామీలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, కార్పొరేషన్కు నామమాత్రపు అద్దెలు సైతం సంవత్సరాల తరబడి చెల్లించడం లేదన్నారు. పైగా మడిగెలను సబ్ లీజ్కు ఇచ్చి వేలాది రూపాయలు తీసుకుంటున్నారన్నారు. దీనిపై నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్ స్పందిస్తూ దీనిపై సమగ్ర పరిశీలన జరిపామన్నారు. నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. అద్దె పెంపు, లీజు రద్దు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ భవనాలు నిర్మించాలి● కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. స్థలం కొరత ఉందంటూ వివిధ ప్రభుత్వ శాఖల నూతన భవనాల నిర్మాణాన్ని ఆలస్యం చేయొద్దని, సమస్యను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానన్నారు. భారీ వర్షాల కారణంగా పంట పొలాల్లో ఇసుక మేటలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని దిశ కమిటీ సభ్యులు కోరారు. సీజీజీ ఆధ్వర్యంలో ఇసుక తొలగింపు ప్రక్రియను త్వరలోనే చేయిస్తామన్నారు. నిధులు అందుబాటులో ఉన్నందున ఆరోగ్య ఉప కేంద్రం భవన నిర్మాణాలు ప్రారంభమయ్యేలా చూడాలని డీఎంహెచ్వోను ఆదేశించారు. అభివృద్ధి పనుల కోసం కేటాయించిన స్థలాలు కబ్జాకు గురైతే సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద అర్హులైన వారు లబ్దిపొందేలా జిల్లా యంత్రాంగం తరపున ప్రత్యేక చొరవ చూపుతున్నామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, దిశ కమిటీ సభ్యులు ఆశన్న, లింగం, విజయ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. అధికారులు తీరు మార్చుకోండి.. లేనిపక్షంలో పేర్లు బయటపెట్టి చర్యలకు సిఫారసు చేస్తా దిశ మీటింగ్లో ఎంపీ ల్యాడ్స్పై హెచ్చరించిన ఎంపీ ధర్మపురి అర్వింద్ పూలాంగ్ వాగు ఆక్రమణలపై ఎన్ని ఎఫ్ఐఆర్లు చేశారని ఇరిగేషన్ అధికారులకు ప్రశ్న అటవీ భూముల ఆక్రమణల వ్యవహారంలో అధికారులపై ఆగ్రహం -
ఆహారశుద్ధి ఉత్పత్తి యూనిట్లకు ప్రోత్సాహకాలు
సుభాష్నగర్: సూక్ష్మ ఆహార శుద్ధి ఉత్పత్తి యూని ట్లు నెలకొల్పేందుకు అసంఘటిత రంగంలో ఉన్న యువతకు, ప్రత్యేకించి స్వయం సహాయక సంఘాల సభ్యులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందజేస్తున్నాయని రాష్ట్ర నోడల్ ఆఫీసర్ నవీన్కుమార్ తెలిపారు. ఆహారశుద్ధి రంగాన్ని బ లోపేతం చేయడంపై మెప్మా ఆధ్వర్యంలో ఎస్హె చ్జీ సభ్యులకు నగరంలోని టీఎల్ఎఫ్ భవనంలో మంగళవారం ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్కుమార్ మాట్లాడుతూ.. మెప్మా సంఘాల పట్టణ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.40 వేల చొప్పున మొత్తం 140 మందికి రూ.56 లక్షల మూలధన రుణం మంజూరైందని పేర్కొన్నారు. మెప్మా సభ్యులు వ్యక్తిగతంగా, సంఘటితంగా అయినా ఆహారశుద్ధి ఉత్పత్తి తయారీ సంస్థల యూనిట్లను నెలకొల్పవచ్చన్నారు. ప్రాజెక్ట్ వ్యయంలో 35 శాతం రాయితీ ఉంటుందని, గరిష్టంగా రూ.10 లక్షల వరకు సబ్సిడీ అందజేస్తారన్నారు. ఈ స్కీమ్లో భాగంగా ఉత్పత్తి యూనిట్లు నెలకొల్పేందుకు అవసరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్, సాంకేతిక తోడ్పాటు, రుణ సదుపాయాల కల్పన, ఉత్పత్తుల మార్కెటింగ్, బ్రాండింగ్, మౌలిక సదుపాయాల కల్పనతోపాటు పూర్తి చేయూతనందిస్తామని పేర్కొన్నారు. వర్క్షాప్లో మున్సిపల్ టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సీ రమేశ్, పరిశ్రమల శాఖ రిసోర్స్ పర్సన్లు రచన, పల్లవి, మెప్మా డీఎంసీ మాధురి, టీఎంసీ శోభారాణి, సీవోలు సంతోష్, అశోక్, ఆర్పీలు పాల్గొన్నారు. గరిష్టంగా రూ.10 లక్షల వరకు సబ్సిడీ యువత, ఎస్హెచ్జీ సభ్యులకు అవకాశం మెప్మా రాష్ట్ర నోడల్ ఆఫీసర్ నవీన్కుమార్ వెల్లడి -
ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉద్యాన శాఖ రాయితీ
ఇందల్వాయి: కూరగాయలు సాగు చేసే ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉద్యానశాఖ పలు రా యితీలను అందిస్తున్నట్లు ఆ శాఖ అధికారులు సంధ్యరాణి, రోహిత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎకరానికి రూ.9,600తోపాటు పవర్ స్ప్రేయర్లు, బ్రష్ కట్టర్లు 50 శాతం రాయితీపై అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 89777 13980, 85558 34268 నంబర్ల ద్వారా ఉద్యానశాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. దరఖాస్తు గడువు పొడిగింపు డిచ్పల్లి: తెలంగాణ గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు తేదీని ఈ నెల 25 వరకు పొడిగించినట్లు సుద్దపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాల ప్రిన్సిపాల్ నళిని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురుకుల పాఠశాల ల్లో ఐదో తరగతితోపాటు 6 నుంచి 9వ తర గతి వరకు ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశాలు పొందవచ్చని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనార్టీ రెసిడెన్షియల్ సంస్థల ఆధ్వర్యంలోని పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కమ్మర్పల్లిలో రాష్ట్రస్థాయి పోటీలు కమ్మర్పల్లి: ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం నుంచి 23వ తేదీ వరకు మండల కేంద్రంలో 69వ రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీ లు నిర్వహిస్తున్నట్లు ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి నాగమణి తెలిపారు. అండర్– 17 బా లుర, బాలికల విభాగంలో పోటీలు నిర్వ హిస్తున్నామని, రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి 320 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. ఈ మేరకు మంగళవారం మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఆమె వెంట ఎంఈవో ఆంధ్రయ్య, హెచ్ఎం సాయన్న, పీడీ నాగభూషణం, సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగామోహన్ తదితరులు పాల్గొన్నారు. సహాయ ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకోవాలి సుభాష్నగర్: జిల్లాలోని దివ్యాంగులు సహా య ఉపకరణముల కోసం సంబంధిత అన్ని ధువ్రపత్రాలతో వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి, మహిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధులశాఖ అధి కారి షేక్ రసూల్ బీ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. బ్యాటరీ ఆపరేటేడ్ వీల్చైర్లు, హైబ్రిడ్ వీల్చైర్ అటాచ్మెంట్, వీల్ చైర్, మొబైల్ బిజినెస్ బ్యాటరీ, ట్రై సైకిల్, హై ఎండ్ ల్యాప్టాప్, ట్యాబ్స్ పొందేందుకు గతంలో దరఖాస్తులు చేసుకోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు జిల్లా సంక్షేమ అధికారి, మహిళ, శిశు దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ కార్యాలయంలో నేరుగా లేదా 08462 251690 నంబర్ను సంప్రదించాలని ఆమె సూచించారు. -
భీమ్గల్ను వీడని సమస్యలు
మోర్తాడ్: మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయినా భీమ్గల్ పట్టణం పరిస్థితి మాత్రంగా మేడిపండు చందంలా ఉంది. వంద పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనులు మూడున్నరేళ్లవుతున్నా ఇప్పటికీ పూర్తి కాలే దు. భీమ్గల్ బస్సుడిపోను 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పునఃప్రారంభించినా బస్సులను, అధికారులను, ఉద్యోగులను కేటాయించకపోవడంతో కాగితాలకే పరిమితమైంది. తహసీల్ భవనాన్ని కూల్చి ఆ స్థలాన్ని మార్కెట్ కోసం కేటాయించారు. అయితే ఆ స్థలంలో మౌలిక వసతులను కల్పించకపోవడంతో వ్యాపారులు, కొనుగోలుదారులు ఇ బ్బందులు పడుతున్నారు. తహసీల్ కార్యాలయాని కి సొంత భవనం లేక పోవడంతో విద్యార్థి వసతి గృహంలో కార్యాలయం కొనసాగుతోంది. ఇలా ఎ న్నో సమస్యలు భీమ్గల్ పట్టణంలో తిష్ట వేశాయి. నేడు మంత్రి సీతక్క పర్యటన జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క బుధవారం భీమ్గల్ పట్టణంలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి.. సమస్యల పరిష్కారంపై ఎలా స్పందిస్తారోనని పట్టణ ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. భీమ్గల్లో రూ.56.50 కోట్ల అభివృద్ధి పనులకు బీజం పడనుంది.అసంపూర్తిగా ఉన్న వంద పడకల ఆస్పత్రి భవనంబస్సులు లేని భీమ్గల్ బస్సుడిపో బస్సులు లేని డిపో.. సొంత భవనం లేని తహసీల్ అసంపూర్తిగా ఆస్పత్రి భవనం మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయినా మారని పరిస్థితి -
పసిడి పరుగు
● తులం రూ.1,50,800 ● వెండి ధర సైతం పెరుగుదల నిజామాబాద్ రూరల్: బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వారం క్రితం 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,200 ఉండగా, మంగళవారం రూ.1,50,800లకు చేరుకుంది. కిలో వెండి ధర రూ.3.17 లక్షలకు చేరింది. బంగారం, వెండి ధరల పెరుగుదల కొనుగోలుదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. వచ్చే నెలలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉండటంతో బంగారం కొనుగోలుపై సామాన్య, మధ్యతరగతి ప్రజలు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే, బంగారం, వెండిపై పెట్టుబడులు పెరుగుతుండటంతో ధరలు పెరుగుతున్నాయని, రానున్న రోజుల్లో తులం బంగారం ధర రూ.2 లక్షల వరకు దాటే అవకాశం ఉందని నగరానికి చెందిన ఆభరణాల తయారీదారు సీహెచ్.భూషణ్చారి ‘సాక్షి’తో తెలిపారు. -
విద్యార్థులకు స్కూల్ కిట్
ఖలీల్వాడి: ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల విద్యా ర్థుల మాదిరిగా ప్రభుత్వ విద్యార్థులకూ స్కూల్ బ్యాగ్, టై, బూట్లు, ఐడీ కార్డులు తదితర వస్తువుల ను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ప్రత్యేకంగా ‘స్కూల్ కిట్’ పేరిట వి ద్యార్థులకు అవసరమయ్యే 22 రకాల వస్తువులను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందించబోతోంది. మరోవైపు జిల్లాలోని 261 ప్రాథమిక పాఠశాలల్లో ఏఐతోపాటు కంప్యూటర్ విద్య అందించేందుకు ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించింది. ప్రభు త్వం అందించే కిట్తోపాటు కంప్యూటరీకరణ, డిజిటల్ తరగతులు ప్రారంభించనుండటంతో ప్రభు త్వ పాఠశాలలు కార్పొరేట్ హంగులు సంతరించుకోనున్నాయి. ఒకటి నుంచి పదో తరగతి వరకు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం 22 రకాల వస్తువులతో స్కూల్ కిట్ అందించనుంది. ఈ కిట్లో పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, మూడు జతల ఏకరూప దుస్తులు, స్కూల్ బ్యాగ్, షూస్, సాక్స్, బెల్ట్, టై, ఐడీకార్డు, పెన్సిళ్ల సెట్ తదితర వస్తువులు ఉంటాయి. కిట్లు అందించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడంతోపాటు తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గుతుంది. ఇంటర్నెట్ సౌకర్యం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలల్లో కృత్రిమ మేధ(ఏఐ) ద్వారా పాఠ్యాంశాలను బోధిస్తున్నది. కానీ, చాలా పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంలో ఏఐ బోధన ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 50 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్నచోట ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి ఐదు కంప్యూటర్లను సమకూర్చేందుకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో గతేడాది డిసెంబర్, ఈ సంవత్సరం జనవరి నెలల్లో జిల్లాలోని 261 ప్రాథమిక పాఠశాలలకు బీఎస్ఎన్ఎల్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించింది. ఈ పాఠశాలలకు రాష్ట్ర విద్యాశాఖ ద్వారా త్వరలో ఐదు కంప్యూటర్లను అందజేయనున్నది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 22 రకాల వస్తువులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు జిల్లాలో 261 ప్రాథమిక పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం తల్లిదండ్రులకు తగ్గనున్న ఆర్థికభారం -
కార్యకర్త అధ్యక్షుడు కావడం బీజేపీలోనే సాధ్యం
● ప్యాకేజీల కోసమే ఫోన్ ట్యాపింగ్పై సిట్ విచారణ ● ఎన్ఎంసీలో ఎంఐఎం, బీజేపీ మధ్యే పోటీ ● కాంగ్రెస్కు రెండు సీట్లు కూడా రావు ● ఎంపీ అర్వింద్ ధర్మపురి సుభాష్నగర్: దేశంలో వారసత్వ రాజకీయాలు, కుటుంబ పార్టీ లు రాజ్యమేలుతున్న తరుణంలో కేవలం పనితనం, చిత్తశుద్ధి ప్రామాణికంగా సామాన్య కార్యకర్త జాతీయ అధ్యక్షుడు కావడం బీజేపీలోనే సాధ్యమని ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. జాతీ య అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా నగరంలోని పార్టీ కార్యాలయ ఆవరణలో ఎంపీ అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడి పదవి చేపట్టడం బీజేపీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని, కోట్లాది యువ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపిందన్నారు. డబ్బుల వసూళ్ల కోసమే.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీశ్రావుకు సిట్ నోటీసులు ఇవ్వడంపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం ప్యాకేజీల కోసమే సీఎం రేవంత్రెడ్డి సిట్ విచారణ చేయిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్, ప్రశాంత్రెడ్డి కేంద్రం నుంచి వచ్చిన నిధులు మళ్లించారని మండిపడ్డారు. ముస్లిం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.. మున్సిపల్ ఎన్నికల్లో మైనార్టీ ఏరియాలో ముస్లిం అభ్యర్థులు దర ఖాస్తు చేసుకుంటే బీజేపీ టికెట్ ఇస్తామని ఎంపీ అర్వింద్ పేర్కొ న్నారు. 75 ఏళ్లుగా కాంగ్రెస్కు, కొన్నేళ్లుగా బీఆర్ఎస్కు ఎందుకు ఓటేస్తున్నారని, జీవితాలు బాగుపడ్డాయా అని ముస్లిములను సూటిగా ప్రశ్నించారు. మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగురవేసిన వెంటనే నిజామాబాద్ను ఇందూరుగా మార్చి తీరుతామన్నారు. ఇందూరుగా ఎందుకు మార్చకూడదో మహేశ్కుమార్గౌడ్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఎంఐఎం, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని, కాంగ్రెస్కు రెండు సీట్లు కూడా రావన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, నాయకులు న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
పదేళ్లలో 50 ఏళ్ల అభివృద్ధి
నిజామాబాద్ అర్బన్: అధికారంలో ఉన్న సుమారు పదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం 50 ఏళ్ల అభివృద్ధి చేసిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీల్లో అత్యధిక డివిజన్లు, వార్డుల్లో బీఆర్ఎస్ నాయకులు గెలుపొందుతారని అన్నారు. నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కై వసం చేసుకుంటామన్నారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు సురేశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా మాట్లాడారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. కళాభారతి, రైల్వేకమాన్ బ్రిడ్జి, ఖలీల్వాడిలోని మార్కెట్ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. అభివృద్ధికి మారుపేరుగా నిలిచామన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, నగర మాజీ మేయర్ దండు నీతూకిరణ్, పార్టీ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, సత్యప్రకాశ్, సుజిత్సింగ్ ఠాకూర్, నవీద్ ఇక్బాల్, ఇమ్రాన్, షెహజాద్, మతీన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆభరణాల కోసం తల్లిపై కొడుకు దాడి
● హత్యాయత్నం కేసు నమోదు, నిందితుడి అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన ఏఎస్పీ చైతన్య రెడ్డి కామారెడ్డి క్రైం : మద్యానికి బానిసైన ఓ కొడుకు మెడలో ఉన్న ఆభరణాలు అమ్మి డబ్బులు ఇవ్వాలని తల్లిని డిమాండ్ చేశాడు. ఇవ్వకపోవడంతో కన్న తల్లి అని కూడా చూడకుండా హత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఆమైపె కర్కశంగా దాడి చేసి ఆభరణాలు లాక్కొని ఉడాయించాడు. దాడిలో తీవ్రగాయాలైన సదరు మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని వివేకానంద కాలనీలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకోగా 24 గంటల్లోపే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కామారెడ్డి డివిజన్ పోలీసు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు వెల్లడించారు. కంచర్ల శంకర్, అతని భార్య గౌరవ్వ, కుమారుడు రాజేశ్తో కలిసి కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో వాచ్మన్గా పనిచేస్తూ జీవిస్తున్నారు. రాజేశ్ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మద్యం సేవించి ఇంటికి వచ్చిన రాజేశ్ డబ్బులు కావాలని తల్లితో గొడవపడ్డాడు. లేవని చెప్పడంతో మెడలోని బంగారం గొలుసు ఇవ్వాలని గొడవకు దిగాడు. తల్లి నిరాకరించడంతో చేతికి ఉన్న ఇనుప కడియం, మరో ఇనుప రాడ్డుతో తల్లి తలపై బలంగా కొట్టి గొలుసు లాక్కొని పరారయ్యాడు. గౌరవ్వ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన భర్త శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గౌరవ్వను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని సోమవారం ఉదయం పట్టణంలోని జేపీఎన్ రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. బంగారం గొలుసు, దాడికి ఉపయోగించిన ఇనుప కడియంను స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. దోపిడీ కేసులో ఇద్దరు రిమాండ్ కామారెడ్డి క్రైం: మద్యం మత్తులో ఉన్న వ్యక్తికి మాయమాటలు చెప్పి దోపిడీ చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. పట్టణానికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ అనే వ్యక్తి వారం రోజుల క్రితం రామారెడ్డి చౌరస్తాలో ఉన్న ఓ కల్లు దుకాణంలో కల్లు సేవించాడు. మత్తులో ఉన్న అతనితో ఇద్దరు వ్యక్తులు మాటలు కలిపారు. ఇంటి వద్ద దింపుతామని నమ్మించి ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని సిరిసిల్లా రోడ్డు ప్రాంతంలోకి తీసుకువెళ్లారు. రాడ్డుతో దాడి చేస్తామని బెదిరించి ఇర్ఫాన్ వద్దనున్న రూ.700 నగదు, సెల్ఫోన్ను లాక్కొని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు విచారణ జరిపి నిందితులను ఇస్లాంపుర కాలనీకి చెందిన మహ్మద్ ఖుద్బుద్దీన్, మహ్మద్ సమీర్గా గుర్తించారు. సోమవారం వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన పట్టణ ఎస్హెచ్వో నరహరి, సిబ్బందిని అభినందించారు. -
పేలుడు పదార్థాలు స్వాఽధీనం
కామారెడ్డి క్రైం : ఎలాంటి అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలను సరఫరా చేస్తున్న ముగ్గురిని రామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. వారి వద్దనుంచి 70 జిలెటిన్ స్టిక్స్, 10 డిటోనేటర్లు, ఇతర సామగ్రిని స్వాఽధీనం చేసుకున్నామన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామారెడ్డిలో ఆదివారం ఉదయం వాహనాలను తనిఖీ చేస్తుండగా బైక్పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. వారిని గర్గుల్కు చెందిన రాజు, చత్తీస్ఘడ్ రాష్ట్రం మౌలమవ్పూర్ ప్రాంతానికి చెందిన శేషులాల్గా గుర్తించారు. ఇద్దరూ కలిసి గర్గుల్ ప్రాంతంలో బండరాళ్లు పగులగొట్టే కూలీలుగా పని చేస్తున్నారు. వారి వద్ద 50 జిలెటిన్ స్టిక్స్, 6 డిటోనేటర్లు, 52 మీటర్ల వైరు లభించాయి. పేలుడు పదార్థాలను నిజామాబాద్ జిల్లా నందిపేట్కు చెందిన వరికుప్పల నర్సింలు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసి గాంధారి మండలంలో బండరాళ్లను పేల్చడానికి అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం నందిపేట వెళ్లి నర్సింలు ఇంట్లో సోదాలు చేయగా మరో 20 జిలెటిన్ స్టిక్స్, 4 డిటోనేటర్లు, ఇతర సామగ్రి లభించాయి. లైసెన్స్దారునుంచి కొనుగోలు చేసి.. ఆలూరు మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన ఒరుసు సాయిమల్లు అనే వ్యక్తి పేలుడు పదార్థాలను సరఫరా చేసేందుకు లైసెన్స్ కలిగి ఉన్నాడని ఎస్పీ తెలిపారు. అయితే అతడి వద్దనుంచి నర్సింలు నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసి అధిక ధరలకు ఇతరులకు విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. సాయిమల్లు ఇంటిని, రికార్డులను తనిఖీ చేయగా రామారెడ్డి, నందిపేట్లలో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు అక్రమంగా విక్రయించినవే అని తేలిందన్నారు. దీంతో రాజు, శేషులాల్లతోపాటు వరికుప్పల నర్సింలులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని, మరో నిందితుడు సాయిమల్లు పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. కేసును ఛేదించిన కామారెడ్డి రూరల్ సీఐ రామన్, రామారెడ్డి ఎస్సై రాజశేఖర్, మాచారెడ్డి ఎస్సై అనిల్, సిబ్బంది మహేందర్, సిద్దిరాములులను అభినందించారు. వాహనాల తనిఖీలు జరుగుతున్నప్పుడు నిందితులను గుర్తించడం, పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన హోంగార్డు కై లాస్కు రివార్డును అందించారు. సమావేశంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. సరఫరా చేస్తున్న ముగ్గురి అరెస్ట్.. పరారీలో మరో నిందితుడు 70 జిలెటిన్ స్టిక్స్, 10 డిటోనేటర్లు, సామగ్రి సీజ్ వివరాలు తెలిపిన ఎస్పీ రాజేశ్ చంద్ర -
రైల్వే పనుల పరిశీలన
ఇటుక ధరలు నియంత్రించాలి మోపాల్: ఇటుక ధరలు నియంత్రించాలని ముదక్పల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు బోడ మహేందర్ సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదక్పల్లి, నర్సింగ్పల్లి గ్రామ పరిసరాల్లో ప్రభుత్వ అనుమతి లేకుండానే విచ్చలవిడిగా ఇటుకబట్టీలు వెలుస్తున్నాయని తెలిపారు. ఒక్కో ఇటుక ధర రూ.10 లకుపైనే అమ్ముతున్నారని, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే వారు అప్పుల పాలవుతున్నారని తెలిపారు. నవీపేట: డబుల్ రైల్వేలైన్ విస్తరణలో భాగంగా బాసర నుంచి నవీపేట వరకు పూర్తయిన పనులను రైల్వేసేఫ్టీ కమిషనర్ మాధవి, డీఆర్ఎం సంతోష్ కుమార్ వర్మ అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. నవీపేట, ఫకీరాబాద్, బాసర రైల్వే స్టేషన్లలో పూర్తయిన నూతన భవనాలను సందర్శఇంచారు. దారి పొడవునా ఏర్పాటు చేసిన సౌకర్యాలను నేరుగా పరిశీలించారు. పనుల పరిశీలనకు వచ్చిన రైల్వేశాఖ ఉన్నతాధికారులకు నవీపేట, ధర్యాపూర్, తడగాం గ్రామాల డెవలప్మెంట్ కమిటీ ప్రతినిధులు, నాయకులు పలు సమస్యలను విన్నవించారు. నవీపేట రైల్వేస్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపాలని కోరారు. -
మాక్లూర్ పాఠశాల పరిశీలన
మాక్లూర్: మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కో ఆర్డినేటర్ వెంకటేశ్వర్రావు, డీఈవో అశోక్ కుమార్తో కలిసి సోమవారం పరిశీలించారు. మే నెలలో జరిగే నీట్ పరీక్ష నిర్వహణకు భవనం అనుకూలంగా ఉంటుందా అని ఆరా తీశారు. ప్రతి గదిని పరిశీలించి, కార్పొరేట్ పాఠశాల స్థాయిలో అన్ని సౌకర్యాలు ఉన్నా యని పేర్కొన్నారు. నీట్కు అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని తెలిపారు. వారి వెంట సమగ్ర శిక్షణ అధికారి శ్రీనివాస్రావు, మా క్లూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దేవన్న, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రచ్చ మురళి ఉన్నారు. సుభాష్నగర్: జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవే ట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 21న ఉ ద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి క ల్పనాధికారి మధుసూదన్ రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగ మేళాకు మ హీంద్రా ఆటోమోటివ్, ఎంఎఫ్ఆర్ ప్రైవేట్ లి మిటెడ్ కంపెనీలు నియమకాలు చేపడుతున్నా రని పేర్కొన్నారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్, టెక్నీషియన్, క్వాలిటీ కంట్రోల్, సూపర్వైజర్ పోస్టులకు పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, ఏదైనా డిగ్రీ చదివిన వారు అర్హులని తెలిపారు. డిచ్పల్లి, నిజామాబాద్లో ఉద్యోగాలు ఉన్నాయని, ఆసక్తి గల అభ్యర్థులు శివాజీనగర్లోని ఉపాధి కార్యాలయానికి 21న ఉదయం 10.30 గంటలకు సంబంధిత ధ్రువపత్రాలతో రావా లని పేర్కొన్నారు. వివరాలకు 99594 56793, 70135 80089లలో సంప్రదించాలన్నారు. ఖలీల్వాడి: ఈ నెల 21న ఇంటర్ మొదటి సంవత్సరం, 22న రెండవ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్న ట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఉదయం 9 గంటలకు పరీ క్ష కేంద్రానికి కచ్చితంగా చేరుకోవాలని సూచించారు. ఈ పరీక్షలకు గైర్హాజరైన వారు ఫెయిల్ అయినట్లుగా పరిగణిస్తామని పేర్కొన్నారు. జి ల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, అన్ని రెసిడెన్షియల్ కళాశాలల ప్రిన్సిపాళ్లు విద్యార్థులకు హాల్టికె ట్ల పంపిణీ చేయడంతోపాటు విద్యార్థులంద రూ పరీక్షలకు హాజరయ్యేలా సమాచారం అందించాలని ఆదేశించారు. 23న గతంలో పరీక్ష రాయని, ఫెయిల్ అయిన బ్యాక్లాగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు నైతికత, మానవ వి లువలు పరీక్ష ఉదయం 10 గంటలకు నిర్వహిస్తామన్నారు. 24న ఉదయం 10 గంటలకు మొదటి సంవత్సరం విద్యార్థులకు పర్యావర ణ విద్య పరీక్ష ఉంటుందని తెలిపారు. నిజామాబాద్ అర్బన్: పోలీస్ ప్రజావాణికి సోమవారం 33 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా బాధితులు సీపీ సాయిచైతన్యను కలిసి సమస్యలను విన్నవించారు. ఫిర్యాదులను పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను సీపీ ఆదేశించారు. -
మహిళల ఆర్థిక పురోగతే ప్రభుత్వ లక్ష్యం
● ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిబోధన్టౌన్(బోధన్): మహిళలు ఆర్థిక పురోగతి సాధించేలా, కోటి మందిని కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని లయన్స్ కంటి ఆస్పత్రి మీటింగ్ హాల్లో సోమవారం వడ్డీలేని రుణాల రాయితీ చెక్కుల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా 690 మహిళా సంఘాల సభ్యులకు వడ్డీలేని రుణాల రాయితీ చెక్కు రూ. 1 కోటి 99 లక్షలను సభ్యులకు అందజేశారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం మొట్టమొదటిసారిగా వడ్డీలేని రుణాల కింద నిధులను కేటాయించిందన్నారు. ప్రభుత్వ అందించే బ్యాంకు లింకేజీ వడ్డీ లేని రుణాలతో వ్యాపారం నిర్వహించి ఆర్థిక పరిపుష్టి సాధించాలని సూచించారు. సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, స్కూల్ యూనిఫాం స్టిచింగ్, ఇందిరా మహిళా శక్తి వంటి క్యాంటిన్లు మంజూరు చేస్తోందని గుర్తు చేశారు. మహిళల గౌరవం మరింత పెంచేలా ప్రభుత్వం విస్తృత స్థాయిలో కార్యక్రమాలను అమలు చేస్తుందని, రుణాలతోపాటు మహిళలకు ఇందిరమ్మ చీరలను అందజేస్తుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రభుత్వం అందించే తోడ్పాటును మహిళలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, డీఆర్డీవో సాయాగౌడ్, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, నాయకులు, పట్టణ మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
జేఎంకేపీఎం స్టాల్ ఏర్పాటు
పసుపు ప్యాకెట్లను పరిశీలిస్తున్న ఎంపీ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, కార్యదర్శి భవానీ శ్రీసుభాష్నగర్: నగరంలోని ఓ హోటల్లో సోమ వారం పసుపు బోర్డు తొలి వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో జేఎంకేపీఎం పసు పు రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఉత్ప త్తి చేసిన విలువ ఆధారిత వస్తువులను ఉంచారు. ఈ ప్రదర్శనను ఎంపీ అర్వింద్ ధర్మపురి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, పసుపు బోర్డు కార్యద ర్శి భవానీ శ్రీ తదితరులు సందర్శించారు. పసుపు ఉత్పత్తులను పరిచయం చేసుకున్నారు. జేఎంకేపీఎం చైర్మన్ పాట్కూరి తిరుపతిరెడ్డితోపాటు డైరెక్టర్లు పుప్పాల నాగేష్, మైలారం శ్రీనివాస్రెడ్డి, ఉట్ల చిన్నయ్య, సూపర్వైజర్ రుత్విక్ పాల్గొన్నారు. -
ప్రజావాణికి 73 ఫిర్యాదులు
నిజామాబాద్అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 73 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్తోపాటు సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, అదనపు డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, నిజామాబాద్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్లకు వివరించారు. కాగా, అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరిపి పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. -
చోరీ కేసులో అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్
బాన్సువాడ: మహిళను కత్తితో బెదిరించి ఆమె మె డలో ఉన్న పుస్తెలతాడును ఎత్తుకెళ్లిన అంతర్రాష్ట్ర నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు బాన్సువాడ డీఎస్పీ విఠల్రెడ్డి పేర్కొన్నారు. సో మవారం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీర్కూర్ మండలం బరంగెడ్గి గ్రా మానికి చెందిన బోయి అనుషవ్వ డిసెంబర్ 2న బీర్కూర్లో అంగడి చేసుకొని నడుచుకుంటూ వె ళ్తుండగా హెగ్డోలే హన్మంత్ విఠల్ అనే వ్యక్తి బైక్పై వచ్చి లిఫ్ట్ ఇస్తానని నమ్మించి ఆమెను ఎక్కించుకున్నాడు. బైరాపూర్ ఎక్స్ రోడ్డు సమీపంలో బైక్ ఆపి తన వద్ద ఉన్న కత్తిని చూపి చంపుతానని బెదిరించాడు. ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడు, బంగారు గుండ్లు, కెంపులను బలవంతంగా లాక్కొని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బీర్కూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఈ నెల 18న బీర్కూర్ కమాన్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా నిందితుడు పారిపోయే ప్రయత్నం చేయగా చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం విచారణ చేపట్టగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడని డీఎస్పీ తెలిపా రు. నిందితుడిది నాందేడ్ జిల్లా దెగ్లూర్ తాలూకా పెల్గావ్ గ్రామమని పేర్కొన్నారు. నిందితుడి నుంచి కత్తి, బైక్, మొబైల్ను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. కేసును ఛేదించిన సీసీఎస్ బృందం, రూరల్ సీఐ తిరుపయ్య, ఎస్సై మహేందర్ను ఎస్పీ రాజేశ్చంద్ర అభినందించినట్లు ఆయన తెలిపారు. -
డాక్టర్లు, మందులు ఉండేలా చూడాలి
సుభాష్నగర్: వెల్నెస్ సెంటర్లో డాక్టర్లు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నామని, డాక్టర్ల తక్షణమే నియమించాలని తెలంగాణ ఆ ల్ పెన్షనర్స్–రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆ ధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో అడిషన ల్ కలెక్టర్ కిరణ్కుమార్కు వినతిపత్రం అందజేశారు. అనేక రోజులుగా డాక్టర్లు అందుబాటులో లేరని, ఈ విషయమై సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం కనిపించడం లేదని పే ర్కొన్నారు. దీంతో స్పందించిన అదనపు కలెక్టర్ వెంటనే చర్యలు చేపట్టాలని జిల్లా సూపరింటెండెంట్కు ఆదేశాలు జారీచేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సిర్ప హన్మాండ్లు, ప్రధాన కార్యదర్శి నారాయణ, కోశాధికారి వీరయ్య, డివిజన్ కార్యదర్శి సాంబశివరావు, జిల్లా నాయకులు ప్రసాదరావు, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
బాలికల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
ఖలీల్వాడి: బాలికల చదువుపై టీచర్లు ప్రత్యేక దృష్టి సారించాలని, హాస్టల్లో వారికి అన్ని రకాల వసతులను కల్పించాలని డీఈవో పార్శి అశోక్ కుమార్ పేర్కొన్నారు. నగరంలోని ఓ హోటళ్లలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సౌజన్యంతో సోమవారం స్పెషల్ ఆఫీసర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని డీఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 23 వరకు ఐదు రోజులపాటు శిక్షణ ఉంటుందన్నారు. బాలికల హాస్టళ్లలోని కేర్టేకర్లకు జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమంలో నిజామాబాద్, కామారెడ్డి, మంచిర్యాల జిల్లాల జెండర్ అండ్ ఈక్విటీ కోఆర్డినేటర్స్ భాగ్యలక్ష్మి, సుకన్య, విజయలక్ష్మి, రాజన్న సిరిసిల్ల జిల్లా రిసోర్స్ పర్సన్ పద్మలత, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్స్, టీజీఎంఎస్ హాస్టల్ కేర్ టేకర్స్ 40 మంది పాల్గొన్నారు. -
రెండేళ్లలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు
బోధన్: రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఎక్కడా చూసినా అవినీతి, దోచు కోవడమేనని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో ప్ర జలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించిందని ఆరోపించారు. బోధన్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో మాజీ ఎ మ్మెల్యే మహ్మద్ షకీల్ ఆమేర్ అధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని సోమ వా రం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వేము ల ప్రశాంత్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆశన్నగారి జీవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పథకాలు, అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. త్వరలో జరగనున్న ము న్సిపల్ ఎన్నికల్లో జిల్లాలోని నిజామాబాద్ కార్పొరేషన్తోపాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల హామీల మోసా న్ని ఇంటింటా ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీశ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. బోధన్ పట్టణ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే షకీల్ రూ. వంద కోట్లు నిధులు తీసుకొచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ కొన్ని పనులు మొదలు పెట్టలేదని విమర్శించారు. హామీలపై కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని జీవన్రెడ్డి పిలుపునిచ్చారు. షకీల్ మాట్లాడుతూ.. తన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయించి తన ఆర్థికమూలాలను దెబ్బతీసేందుకు ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి కక్షసాధింపులకు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎంఐఎం పట్ట ణ మాజీ అధ్యక్షుడు ముషీర్బాబా, శ్రీనివాస్ తమ అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరగా వారికి కండువాకప్పి ఆహ్వానించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు రవీంద్రయాదవ్, గిర్దావర్ గంగారెడ్డి, రవికిరణ్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు సంజీవ్, నర్సింగ్రావు, శ్రీరాం, భూంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీల మోసాన్ని ఇంటింటా ప్రచారం చేయాలి జిల్లాలోని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేస్తాం మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి -
ఆర్గానిక్ పసుపునకు డిమాండ్
● సేంద్రియ సాగుపై దృష్టి సారించాలి ● ప్రభుత్వం తరఫున రైతులకు తోడ్పాటు ● పసుపు బోర్డు తొలి వార్షికోత్సవ సభలో ఎంపీ అర్వింద్ ధర్మపురిసుభాష్నగర్: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆర్గానిక్ పసుపునకు డిమాండ్ ఉందని, రైతులు సేంద్రియ విధానంలో పసుపు సాగుపై దృష్టిని కేంద్రీకరించాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నా రు. జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని సోమ వారం జిల్లాకేంద్రంలోని ఓ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో తొలి వార్షికోత్సవ సభ, రైతులకు అవ గాహనా సదస్సు నిర్వహించారు. ఎంపీ అర్వింద్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బోర్డు కార్యదర్శి ఎన్ భవాని శ్రీ (ఐఏఎస్), రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పసుపు బోర్డు ద్వారా ఏడాది కాలంగా రైతులకు అందించిన తోడ్పాటు, చేపట్టిన కా ర్యక్రమాలను బోర్డు చైర్మన్, కార్యదర్శులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అర్వింద్ మాట్లాడుతూ.. పసుపు సాగులో నిజామాబాద్ జిల్లా ప్రత్యేకతను కలిగి ఉందన్నా రు. మూడు దశాబ్దాలకుపైగా ఈ ప్రాంత రైతు లు అలుపెరగకుండా కొనసాగించి న పోరాటా లు, నిరవధిక కృషి ఫలితంగా జాతీ య పసుపు బోర్డును ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏడాది క్రితం ఏర్పాటు చేసిందన్నా రు. బోర్డు ఏర్పాటైన ఫలితంగా ఇక్కడి పసుపు పంటకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఏర్పడుతోందని, విదేశాలకు ఇక్కడి పసుపు పంటను పరిచయం చేయడంలో బోర్డు సఫలీకృతమైంద ని పేర్కొన్నారు. మున్ముందు బోర్డు ద్వారా పసు పు రైతులకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నా యని ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే రైతులు ఆర్గానిక్ పసుపు పంటను సాగు చేస్తే మరింత డిమాండ్ ఉంటుందని ఎంపీ సూచించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. పసు పు రైతుల సాధకబాధకాలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని, వారికి ప్రభుత్వపరంగా జి ల్లా యంత్రాంగం తరఫున పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని భరోసా కల్పించారు. పసు పు ఎగుమతులు అంతర్జాతీయ స్థాయిలో జరిగే లా పసుపు బోర్డు విశేషంగా కృషి చేస్తోందన్నా రు. నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఉద్యానవన శాఖ సంయుక్త సంచాలకుడు శ్రీనివాస్రావు, పసుపు బోర్డు అధికారులు, రైతులు, ట్రేడర్లు పాల్గొన్నారు. -
పామాయిల్ సాగు లాభదాయకం
బోధన్: పామాయిల్ పంట సాగు అధిక లా భదాయకంగా ఉంటుందని, మార్కెటింగ్ ఇ బ్బందులు లేవని రాష్ట్ర ప్రభుత్వ సలహాదా రు, ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్రెడ్డి రైతులకు సూచించారు. కోతుల బెడద ఉండద ని, పామాయిల్ పంటను అధిక విస్తీరణంలో సాగు చేయాలని అన్నారు. సిద్దిపేట జిల్లా నర్మెట గ్రామ శివారులోని పామాయిల్ ఫ్యాక్టరీని ఆయిల్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, జిల్లా, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో కలిసి సుదర్శన్రెడ్డి సోమవా రం సందర్శించారు. జంగా రాఘవరెడ్డి ఫ్యా క్టరీకి సంబంధించిన వివరాలను సుదర్శన్రెడ్డికి వివరించారు. ఎమ్మెల్యే వెంట రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, టీపీసీసీ డెలిగేట్ గంగాశంకర్, బోధన్, రెంజల్ మండలాల కాంగ్రెస్ నాయకులు నాగేశ్వర్రావు, మోబిన్, రైతులు ఉన్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి బోధన్టౌన్(బోధన్): బోధన్ మున్సిపాలిటీని కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం సందర్శించారు. బల్దియా ఆవరణలో నూతన మున్సిపల్ కార్యాలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. నూతన భవన నిర్మాణానికి పంపిన ప్రతిపాదనల వివరాలు కమిషనర్ జాదవ్ కృష్ణను అడిగి తెలుసుకున్నారు. వ చ్చే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని, నోటిఫికేషన్ ఎప్పుడైనా రావొ చ్చని తెలిపారు. ఎన్నికలు సజావుగా సాగే లా అన్ని పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్రీడల్లో పోటీతత్వం ముఖ్యం నిజామాబాద్ అర్బన్: క్రీడల్లో పోటీతత్వం ముఖ్యమని సీపీ సాయిచైతన్య అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన ప్రమోద్ స్మారక ఫుట్బాల్ పో టీలు సోమవారం ముగిశాయి. సీపీ ముగింపు కార్యక్రమానికి హాజరై విజేతలకు ట్రోఫీ ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కానిస్టేబుల్ ప్రమోద్ త్యా గం పోలీస్శాఖకు ఎల్లప్పుడూ గుర్తుండిపో తుందన్నారు. యువతలో క్రమశిక్షణ, ఐక్య త, దేశభక్తిభావాలను పెంపొందించడం కో సం ప్రమోద్ స్మారకార్థం టోర్నీని నిర్వహించామన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీ రాజావెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్సే గెలుస్తోంది
నిజామాబాద్ రూరల్: వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ గె లిచి తీరుతుందని డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని కాంగ్రెస్ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్, కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు ఆశావహులు దరఖాస్తులను పట్ట ణ కాంగ్రెస్ అధ్యక్షులకు సమర్పించాలని సూచించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటై దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతారని, రాష్ట్రాన్ని మళ్లీ అప్పులపాలు చేసేందుకు వస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 80 శాతం నెరవేర్చామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కాంగ్రెస్ నాయకులు ప్రజలకు వివరించాలని సూచించారు. సమావేశంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ , నుడా చైర్మన్ కేశ వేణు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజిరెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావీద్ అక్రం, ఏఐసీసీ కో ఆర్డినేటర్ గన్రాజ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
రంగంలోకి ప్రత్యేక బృందాలు
ఖలీల్వాడి: ప్రభుత్వ బడుల బలోపేతానికి విద్యా శాఖ చర్యలు చేపట్టింది. పాఠశాలలను తనిఖీ చేసే బాధ్యతను ఉపాధ్యాయులతో ప్రత్యేక బృందాలను తయారు చేసి వారికి అప్పగించింది. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, పీఎస్ హెచ్ఎం, ప్రధానోపాధ్యాయులు సోమవారం నుంచి రంగంలోకి దిగారు. జిల్లాలో మొత్తం పదకొండు బృందాలు పాఠశాలల తనిఖీని ప్రారంభించాయి. పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్న ప్రత్యేక బృందాలు అక్కడి పరిస్థితులను విద్యా శాఖాధికారులకు నివేదిక రూపంలో అందించనున్నారు. బడిలో పరిస్థితులు మారా యా? లేదా? అనే విషయాలపై ఆరా తీస్తారు. విద్యార్థుల ప్రగతితోపాటు రికార్డులు, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తారు. విద్యార్థుల హాజ రు, ఉపాధ్యాయుల పనితీరు, తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. మొదటి రోజు 11 ప్రత్యేక బృందాలు జిల్లాలోని 11 పాఠశాలలను తనిఖీ చేశాయి. తూతూ మంత్రపు తనిఖీలకు చెక్ జిల్లాలో డీఈవో పరిధిలో 1,156 పాఠశాలలు ఉ న్నాయి. అలాగే 10 మోడల్ స్కూళ్లు, 27 కేజీబీవీలు ఉండగా వీటిని మండల విద్యాధికారులు, సెక్టోరల్ అధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షిస్తున్నారు. అయితే చాలా మంది తూతూ మంత్రంగా తనిఖీలు చేపట్టడంతో విద్యా శాఖ ఉన్నతాధికారులు సీనియర్ ఉపాధ్యాయుల తో తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ విద్యా సంవత్సరం ముగిసే వరకు ప్రత్యేక బృందాల స భ్యులు డిప్యూటేషన్పై పనిచేయనున్నారు. ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేసే బృందంలో ఇద్దరు ఎస్జీటీలు, ఒక పీఎస్ హెచ్ఎం, ప్రాథమి కోన్నత పాఠశాలలను తనిఖీ చేసే బృందంలో స్కూల్ అసిస్టెంట్, పీఎస్ హెచ్ఎం, ఎస్జీటీ ఒకరు చొప్పున ఉంటారు. అలాగే ఉన్నత పాఠశాలలను తనిఖీ చేసే బృందంలో ఏడుగురు ఎస్ఏలు, ఒక పీ డీ, ఒక పీజీ హెచ్ఎం ఉన్నారు. మొత్తం 51 మంది ఉపాధ్యాయులకు డిప్యూటేషన్పై విధులను కేటాయించారు. వారంతా పాఠశాలలను తనిఖీ చేస్తున్నారు. వారానికోసారి లేదా పదిహేను రోజులకో సారి నివేదికను డీఈవో కార్యాలయంలో అందజేయనున్నారు. వాటి ఆధారంగా జిల్లా విద్యాశాఖాధికారి రివ్వ్యూ నిర్వహించనున్నారు. సర్దుబాటు తనిఖీ బృందాల్లోకి వెళ్లిన ఉపాధ్యాయుల స్థా నాల్లో ఇతర ఉపాధ్యాయులను సర్దుబాటు చే యనున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతు న్నారు. జిల్లాలో సర్దుబాటు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోంది. తనిఖీ బృందాల్లో స్కూల్ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగించడంతో విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడే పరిస్థితి ఉంది. పదో తరగతి పరీక్ష నేపథ్యంలో ఖాళీ అయిన స్థానాల్లో ఇతర ఉ పాధ్యాయులను సర్దు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఎప్పటికి పూర్తి చేస్తారో వేచి చూడాల్సిందే. పాఠ్యాంశాల బోధన, రికార్డుల నిర్వహణ, ఉపాధ్యాయుల పనితీరును తనిఖీ చేసేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సో మవారం నుంచి తనిఖీలను ప్రారంభించాయి. తనిఖీ అనంతరం వారం రోజుల్లో బృందాలు నివేదిక ఇవ్వనున్నాయి. ఆ నివేదికల ఆధారంగా డీఈవో సమీక్షించనున్నారు.తనిఖీలు కొనసాగుతున్నాయి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రాథమిక పాఠశాలలు, యూపీఎస్ ఉన్నత పాఠశాలలకు 11 బృందాలు తనిఖీలు చేపడుతున్నాయి. పాఠశాలల్లో అకడమిక్ తదితర రికార్డులను పరిశీలించి డీఈవో కార్యాలయానికి వేదికలు సమర్పించాల్సి ఉంటుంది. – బాలకృష్ణ, విద్యాశాఖ సెక్టోరల్ అధికారి ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలల తనిఖీ వారానికోసారి జిల్లా విద్యాశాఖకు నివేదిక! రిపోర్టుల ఆధారంగా క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్షించనున్న డీఈవో జిల్లాలో 11 ప్రత్యేక బృందాలు -
టికెట్ ప్లీజ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న పరిస్థితుల్లో నిజామాబాద్ నగర కార్పొరేషన్, ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీల్లో ఆశావహుల టిక్కెట్ల ఆరాటం సందడిని సృష్టిస్తోంది. నిజామాబాద్ నగరపాలకంలో మేయర్ సీటును దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీజేపీల మధ్య నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ నెలకొంది. మరోవైపు నగరంలో ఎంఐఎం కింగ్మేకర్ పాత్ర తనదేనని ఆశాభావంతో ఉంది. అవసరమైతే మేయర్ పదవిని సైతం పంచుకునేందుకు అవకాశం దక్కుతుందని ఎంఐఎం లెక్కలు వేసుకుంటోంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ నగరంలో ఎన్నికల ఫలితాల తరువాత సమీకరణాలు ఎలా మారతాయోననే చర్చ నగరంలో నడుస్తోంది. మొత్తంమీద పోరు రసవత్తరం కానుంది. నిజామాబాద్ నగరంలో బీజేపీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 500కు పైగా ఉండడం గమనార్హం. ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందని అంచనా. ఇక కాంగ్రెస్ టికెట్లు ఆశిస్తూ సోమవారం ఒక్కరోజే 220 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే రిజర్వేషన్ల కేటాయింపునకు ముందే కాంగ్రెస్ టికెట్ల కోసం 400 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అయితే రిజర్వేషన్ల మేరకు వీ టిలో 180 మాత్రమే అర్హత ఉన్నవని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తెలిపారు. మరిన్ని దరఖాస్తులు రానున్నట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఎంఐఎం నుంచి టికెట్ల కోసం 20 డివిజన్ల పరిధిలో 157 మంది దరఖాస్తు చేసుకున్నారు. టికెట్ రాకపోతే జంప్నిజామాబాద్ నగరంతోపాటు ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల్లో టిక్కెట్లు ఆశిస్తున్నవారిలో పలువురు తమకు టికెట్లు దక్కకపోతే మరో పార్టీలోకి వెళ్లేందుకు సైతం సిద్ధంగా ఉన్నారు. తాము ఆశించిన పార్టీలో అవకాశం కల్పించకపోతే జంపింగ్ జపాంగ్లుగా మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అవసరమైతే స్వతంత్రులుగా సై తం బరిలోకి దిగేందుకు పలువురు ఆశావహులు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అన్ని పార్టీల కు రెబల్స్ బెడద తప్పేలా లేదు. అయితే పార్టీ లు మాత్రం గెలుపు గుర్రాలకే టిక్కెట్లు అని స్ప ష్టం చేస్తున్నాయి. వివిధ సర్వేల మేరకు అన్ని అంశాలను బేరీజు వేసుకుని టిక్కెట్ల కేటాయింపులు చేస్తామని పార్టీల నాయకులు చెబుతున్నారు దరఖాస్తుల జాతర కాంగ్రెస్, బీజేపీలో భారీగా డిమాండ్ నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో టికెట్ల కోసం పోటాపోటీ అవకాశం ఇవ్వకపోతే పార్టీలు మారేందుకు పలువురు సిద్ధం -
ఎండిన, శుభ్రం చేసిన పసుపును తీసుకురావాలి
● పచ్చి పసుపు అమ్మకాలు పూర్తిగా నిషేధం ● రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి ● పసుపు ప్రచార రథాలు ప్రారంభంసుభాష్నగర్: ఎండిన, శుభ్రం చేసిన పసుపును నిజామాబాద్ మార్కెట్యార్డుకు తీసుకువచ్చి గిట్టుబాటు ధర పొందాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి రైతులకు సూచించారు. పసుపు సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మార్కెట్కు పసుపు తీసుకొచ్చే రైతులను చైతన్యపర్చేందుకు ప్రచార రథాలను సోమవారం ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ మార్కెట్యార్డులో పచ్చి పసుపు అమ్మకాలను పూర్తిగా నిషేధించిన విషయాన్ని గుర్తెరగాలని రైతులకు సూచించారు. ఏఎంసీ సిబ్బందితో ఏర్పాటైన కమిటీలు రైతులను చైతన్యపర్చి, అవగాహన కల్పించేందుకు వాల్పోస్టర్లు, కరపత్రాలతో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో గ్రామగ్రామానా ప్రచారం చేస్తాయన్నారు. రైతులంతా ఒకేసారి పసుపు తీసుకురాకుండా విడతల వారీగా తీసుకొస్తే మంచి ధర వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులు మార్కెట్ కమిటీకి సహకరించాలని చైర్మన్ ముప్ప గంగారెడ్డి కోరారు. పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్గౌడ్, నాయకులు బాగారెడ్డి, వైస్ చైర్మన్ రాంచందర్, డైరెక్టర్లు మారుతి, మల్లేశ్, గంగారెడ్డి, ఇసా, సెలక్షన్ గ్రేడ్ సెక్రెటరీ అపర్ణ, నాయకులు ఉమ్మాజి నరేశ్, చిన్న సాయిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కరంటోళ్ల ‘ప్రజాబాట’
రెంజల్: క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు టీజీఎన్పీడీసీఎల్ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రైతులకు సంబంధించి వ్యవసాయ విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు పొలంబాట నిర్వహిస్తున్న ట్రాన్స్కో అధికారులు, ప్రస్తుతం గృహ సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ప్రజాబాట చేపట్టారు. ఈ నెల 6వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రజాబాట నిర్వహిస్తున్నారు. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో గ్రామస్థాయిలో ప్రజాబాట నిర్వహించి స్థానిక సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. వ్యవసాయ, గృహ అవసరాల విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించేందుకు వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆధునిక సాంకేతికను వినియోగించి వినియోగదారులకు నిరంతరం మెరుగైన కరెంట్ను అందించేందుకు ముందుకు సాగుతున్నారు. పొలంబాట ద్వారా నేరుగా రైతుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అదే తరహాలో క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యటించి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రజాబాట పడుతున్నారు. ప్రాధాన్య క్రమంలో గుర్తించిన సమస్యలను విడతల వారీగా పరిష్కరించేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. సెక్షన్ స్థాయిలో ఎస్ఈ, డీఈ, ఏడీఈ, ఏఈల సమక్షంలో నిర్వహించే ప్రజాబాటలో ఆయా స్థాయి అధికారులు మూడు రోజులు మూడు గ్రామాల్లో పాల్గొనేలా టీజీఎన్పీడీసీఎల్ ఆదేశాలను జారీ చేసింది. ప్రజాబాట ద్వారా గ్రామాల్లోని చిన్న, చిన్న సమస్యలను సిబ్బంది సత్వరం పరిష్కరిస్తారు. పెద్ద సమస్య ఉంటే నిబంధనల ప్రకారం అంచనాలు రూపొందించి పరిష్కరిస్తాం. విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చేందుకు పొలంబాట, ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. జిల్లాలోని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, డిచ్పల్లి డివిజన్లలో సుమారు 50 వరకు సెక్షన్లు ఉన్నాయి. ప్రతి వారం ఆయా డివిజన్లలో మూడు రోజులపాటు ప్రజాబాట ఉంటుంది. వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి. – ఎండీ ముక్తార్, డీఈ, బోధన్ క్షేత్రస్థాయిలో ట్రాన్స్కో అధికారుల పర్యటన ప్రతి సెక్షన్లో వారానికి మూడు రోజులు కొత్త కార్యక్రమానికి టీజీఎన్పీడీసీఎల్ కార్యాచరణ మంగళ, గురు, శనివారాల్లో నిర్వహణ -
‘రాజీకి రమ్మని ఒత్తిడి చేస్తున్నారు’
సిరికొండ: పాకాల గ్రామంలో నెలకొన్న సమస్యలపై జాతీయ గిరిజన కమిషన్కు ఇచ్చిన ఫిర్యాదుపై రాజీకి రమ్మని తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని గ్రామానికి చెందిన బాణావత్ గంగాధర్ తెలిపారు. పాకాల గ్రామంలో 50 ఏళ్లుగా సరైన మౌలిక వసతులు కల్పించక పోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. సరైన రోడ్డు సౌకర్యం లేక గ్రామస్తులు ఆస్పత్రికి వెళ్లేందుకు పడుతున్న ఇబ్బందులపై తాను గిరిజన కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు గంగాధర్ తెలిపారు. ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని, సమస్య పరిష్కారమైనట్లు సంతకం చేయాలని ఎంపీడీవో మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి తనను ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. శనివారం కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బాకారం రవి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చందర్ నాయక్ తహసీల్దార్ రవీందర్రావు తదితరులను గ్రామానికి తీసుకొచ్చి ఫిర్యాదుపై విత్డ్రా కావాలని ఒత్తిడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకుండా తనను మానసికంగా క్షోభ పెట్టడం సరికాదని, జిల్లా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గంగాధర్ విజ్ఞప్తి చేశారు. -
వైభవోపేతంగా ఏకచక్రేశ్వర శివాలయ ఆవిర్భావ దినోత్సవం
బోధన్రూరల్: బోధన్ పట్టణంలోని ప్రసిద్ధ ఏక చక్రేశ్వర శివాలయంలో 67వ ఆవిర్భావ దినోత్స వాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఆదివా రం ఆలయ ప్రాంగణాన్ని పచ్చని తోరణాలు, పు ష్పాలతో అలంకరించారు. ఉదయం నుంచి స్వామి వారికి లఘున్యాస రుద్రాభిషేకం, బిల్వార్చన, నవగ్రహారాధనతోపాటు వివిధ రకాల పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. వేద పండితులు, ఆలయ ప్రధాన అర్చకులు గణేశ్ మహరాజ్, వేద ప్రముఖ్ సంతోష్ మహరాజ్, అర్చకులు మహేశ్ పాఠక్, శివ కుమార్ మంత్రోచ్ఛారణలతో స్వామి ఉత్సవ విగ్రహ మండపారాధన, రుద్ర హోమం, పూర్ణాహుతి, దూప దీప మంగళ నీరాజనాలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి నాయకం రాములు, పట్టణ ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ఐయామ్ యమా.. వేర్ ఈజ్ హెల్మెట్
● హెల్మెట్ ధారణపై వినూత్న పద్ధతిలో పోలీసుల అవగాహన మోర్తాడ్: ‘ఓ ద్విచక్ర వాహనదారుడా..! తలకు హె ల్మెట్ ధరిస్తే ప్రశాంతంగా ఇంటికి వెళ్తావు. లేదంటే మా దగ్గరికి రావాల్సి ఉంటుంది.’ అంటూ యమధర్మరాజు, యమభటుల వేషధారణతో పోలీసు శాఖ కళాకారులు అవగాహన కల్పిస్తున్నారు. వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలను పాటించకపోతే జరిమానాలను వసూలు చేయడం ఎంత ముఖ్యమో, ఆ నిబంధనలను పాటించేలా చైతన్యం తీసుకరావడం అంతే ముఖ్యమని ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వివిధ స్టేషన్ల ఆధ్వర్యంలో వాహనదారులకు వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. హెల్మెట్ ధరించకపోవడం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో జరిగే అనర్థాలను కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నారు. ప్రత్యేకంగా షార్ట్ ఫిల్మ్... హెల్మెట్ వినియోగంతో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ఏర్గట్ల ఎస్సై పడాల రాజేశ్వర్ 5 నిమిషాల నిడివిగల షార్ట్ఫిల్మ్ను రూపొందించగా సీపీ సాయి చైతన్య ఆవిష్కరించారు. ఈ షార్ట్ ఫిల్మ్ సామాజిక మాధ్యమాలలో ట్రోలింగ్ అవుతూనే ఉంది. హెల్మెట్ ఆవశ్యకతను వివరిస్తూ పోలీసులు చేపడుతున్న చైతన్య కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని ప్రజలు అభినందిస్తున్నారు. -
ప్రసూన్ కుమార్ రెడ్డి
రుద్రూర్: మండల కేంద్రానికి చెందిన ప్రసూన్కుమార్ రెడ్డి న్యూఢిల్లీలోని ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు. విద్యా ప్రమాణాల పెంపుదలే లక్ష్యంగా ఎన్సీఈఆర్టీ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ శిక్షణకు తెలంగాణ నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు ఎంపికకాగా, అందులో ప్రసూన్కుమార్ రెడ్డి ఒకరు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం నాగారం ప్రభుత్వ పాఠశాలలో సోషల్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం 21 రోజులపాటు సాగిన ఈ శిక్షణలో పాఠ్య పుస్తకాల రూపకల్పన, జాతీయ విద్యా విధానం–2020 (ఎన్ఈపీ–2020)కు అనుగుణంగా పాఠ్యసామగ్రి తయారీ, బోధనా పద్ధతుల నవీకరణ వంటి అంశాలపై విస్తృత అవగాహన పొందారు. ప్రసూన్కుమార్ రెడ్డి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సాంఘిక శాస్త్ర రిసోర్స్ పర్సనన్గా, పాఠ్యపుస్తక రచయితగా పలు సేవలు అందిస్తూ విద్యారంగంలో తనదైన ముద్ర వేస్తున్నారు. జాతీయ స్థాయి శిక్షణ పూర్తి చేయడంపై విద్యాశాఖ అధికారులు, సహచర ఉపాధ్యాయులు అభినందించారు. -
క్రైం కార్నర్
స్వదేశానికి చేరిన మృతదేహం రామారెడ్డి (ఎల్లారెడ్డి): రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట గ్రామానికి చెందిన గోపురాములు(34) రెండు నెలల క్రితం ఉపాధి నిమిత్తం దుబాయి దేశానికి వెళ్లాడు. వారం రోజుల క్రితం బాత్ రూంలో కిందపడి చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆదివారం స్వగ్రామానికి మృతదేహం చేరుకోగా అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. సర్పంచ్ నాగులపల్లి రాజేందర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని లక్ష్మీనారయణ గోశాల సమీపంలో మిషన్ భగీరథ పైప్లైన్ కోసం తవ్విన గుంతలో గేదే దూడ పడి మృతి చెందినట్లు బాధితుడు అవార్వార్ హన్మాండ్లు తెలిపారు. నాలుగు రోజులుగా గేదేదూడ కనిపించకపోవడంతో ఆచూకీ కోసం వెతుకుతుండగా ఆదివారం గోశాల సమీపంలో తవ్వి వదిలేసిన గుంతలో దూడ కళేబరం కనిపించినట్లు తెలిపారు. గుంత మూసివేయకపోవడంతోనే దూడ మృతి చెందిందని, అధికారులు తనకు నష్టపరిహారం ఇప్పించాలని ఆయన కోరారు. బైక్ చోరీ రుద్రూర్: కోటగిరి మండలం దేవునిగుట్ట తండాకు చెందిన చలపతిరావు ద్విచక్రవాహనం చోరీకి గురైనట్లు ఎస్సై సునీల్ తెలిపారు. డిసెంబర్ 31న మధ్యాహ్నం కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామ శివారులోని పొలం వద్ద రోడ్డు పక్కన బైక్ను నిలిపి పొలానికి వెళ్లారు. తిరిగి వచ్చే సరికి బైక్ కనిపించలేదు. సమీప ప్రాంతాల్లో వెతికినా దొరకకపోవడంతో ఆదివారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూహౌసింగ్ బోర్డు కాలనీలో చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్వో శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 15న న్యూ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన రమేశ్ ఇంట్లో చొరబడిన దుండగులు బంగారు ఆభరణాలు, నగదు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసుకొని, రెండు పోలీసు బృందాలు దర్యాప్తు చేపట్టా యి. శనివారం మధ్యాహ్నం వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ప్రియదర్శిని నగర్కు చెందిన బానోతు సందీప్ను పోలీసులు విచారించారు. దీంతో రమేశ్ ఇంట్లో చోరీకి పాల్పడినట్లు సందీప్ ఒప్పుకున్నాడని ఎస్హెచ్వో తెలిపారు. దొంగిలించిన బంగారాన్ని స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్కు తరలించామన్నారు. -
టీసీఎస్ ఐయాన్పై అవగాహన
ఖలీల్వాడి: నగరంలోని గిరిరాజ్ కళాశాలలో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో టీసీఎస్ ఐయాన్ జాబ్ అచీవర్ బిజినెస్ ఆపరేషన్ ప్రోగ్రాంపై ఆదివారం అవగాహన కల్పించారు. టీసీఎస్ ఐయాన్ ప్రతినిధి ప్రమోద్కుమార్ మాట్లాడుతూ ఓపెన్ యూనివర్సిటీలోని బీఏ, బీకాం, బీఎస్సీ మొదటి, రెండవ సెమిస్టర్ విద్యార్థులకు టీసీఎస్–ఐయాన్ ద్వారా ఆన్లైన్ కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు. నైపుణ్యాల అభివృద్ధి, ఇంగ్లిష్లో ప్రావీణ్యం, ఉపాఽధి అవకాశాలు పెంపొందించుకోవడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఓపెన్ యూనివర్శిటీ కోఆర్డినేటర్ రంజిత, ఆర్సీసీ సిబ్బంది రాధ, చిందు, ప్రేమ్సింగ్, అధ్యాపకులు కౌన్సిలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. రుద్రూర్: మండల కేంద్రంలోని గ్రంథాలయ శాఖను ఆదివారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ భవనంలోని సౌకర్యాలను పరిశీలించి, పాఠకులతో మాట్లాడారు. నిరుద్యోగులు, విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి గ్రంథాలయ భవనం పైఅంతస్తులో ఉన్న గదిని రీడింగ్ రూంగా కేటాయించాలని సర్పంచ్ ఇందూర్ సునీత చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన చైర్మన్ అవసరమైన సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఉప సర్పంచ్ షేక్ నిసార్, మాజీ ఉప సర్పంచ్ డౌర్ సాయిలు, రైడ్ సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు కర్రోళ్ల కృష్ణ ప్రసాద్, పార్వతి శేఖర్ తదితరులు ఉన్నారు. వర్ని: మండలంలోని మల్లారం శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మూ డు వాహనాలు ధ్వంసమయ్యాయి. వర్ని నుంచి మైలారం వెళ్తున్న సరిచందు తన కారుతో మరో రెండు కార్లను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ప్రభుత్వ బడి పిలుస్తోంది
ప్రథమ పౌరులారా..డిచ్పల్లి(నిజామాబాద్ రూరల్): మనం చదివిన క న్నతల్లి లాంటి ఊరి బడిని చూడగానే మనసు బా ల్యం వైపు పరిగెడుతుంది. మనకు విజ్ఞానంతోపా టు వివేకం నేర్పిన ప్రభుత్వ బడిలో చదివి, బాల్యం మధురస్మృతులను మరపురాని జ్ఞాపకాలను పదిలంగా దాచుకున్న ప్రథమ పౌరులు ఒక్కసారి ప్రభుత్వ బడిని సందర్శించండి. విద్యార్థులు, ఉపాధ్యాయులను పలకరించండి. పాఠశాల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థుల నమోదు పెంచేందుకు ప్రణాళికలు రచించండి. గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో పాఠశాల సమస్యలకు చోటు కల్పించి పరిష్కరించే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ బడిని ప్రథమ పౌరుడే బతికించాలి.. జిల్లాలోని అన్ని గ్రామాలలో నూతన పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరాయి. రెండేళ్లుగా పాలకవర్గాలు లేక సమస్యలతో సహవాసం చేస్తున్న పల్లెలలో అభివృద్ధి కార్యక్రమాలకు సర్పంచులు శ్రీకారం చుడుతున్నారు. ఊరుబడి బాగుంటే ఆ గ్రామం బాగుంటుంది. ఎన్నుకోబడిన చాలా మంది సర్పంచులు తన ఊరి బడిలో చదువుకున్నవారే. సర్పంచులు ఒక్కసారి తమ ప్రభుత్వ బడిని సందర్శించండి. అక్కడ నిరుపేద విద్యార్థులను పలుకరించండి. వారి కష్టసుఖాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీరు సర్పంచు అనే దర్పాన్ని ఆ ఊరిలో జాతీయ పండుగల పర్వదినాలలో వేదికలపై ఆ ఊరిబడే చూపెడుతుంది. అక్కడి ఉపాధ్యాయులను గౌరవంతో పలుకరించి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. పాతబడిన భవనపు గోడలకు సున్నం వేయించండి. రాయలేకపోతున్న నల్లబల్లలకు రంగులు వేయండి. విద్యార్థులకు తగిన మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణానికి కృషి చేయండి. అవసరమయ్యే అదనపు గదులకు నిధులు మంజూరు చేయించి వీలైనంత త్వరగా శంకుస్థాపనలు చేసే ప్రయత్నం చేయాలి. సన్మానించండి.. సమస్యలు చెప్పండి.. జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లను ప్రభుత్వ బడికి సాధారంగా ఆహ్వానించాలి. అందరికీ తోచిన విధంగా సన్మానించండి. ప్రస్తుత విద్యార్థుల అవసరాలకు తగినట్లుగా అత్యవసరంగా జరగాల్సిన పనుల జాబితా తయారుచేసి సర్పంచులకు విన్నవించండి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వివరించండి. నాణ్యమైన విద్య నిరుపేద విద్యార్థులకు ఎలా అందుతుందో ప్రధానోపాధ్యాయులు వివరించే ప్రయత్నం చేయాలి. బడి బాగుకోసం ప్రథమ పౌరుడు ప్రణాళికలు రచించి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)లో చేర్చేలా ప్రయత్నం చేయండి. ఈ చిత్రంలో కనిపిస్తున్న రేకులపల్లి ప్రాథమిక పాఠశాలకు నూతనంగా ఎంపికై న 8వ వార్డు మెంబర్ గంగాధర్ తన తండ్రి ధర్పల్లి చిన్న గంగారం జ్ఞాపకార్థం రూ. 10 వేల విలువగల క్రీడాపరికరాలను వితరణ చేశారు. నూతనంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులు ఇలాంటి చేయూతనందిస్తే ప్రభుత్వ పాఠశాలలకు కొంత మేలు జరుగుతుంది. పసిప్రాయాలను ఎందరినో అక్కున చేర్చుకొని విజ్ఞానవంతులుగా చేసిన ప్రభుత్వ బడికి ఎంత చేసినా తక్కువే. జిల్లా లోని అన్ని గ్రామాల సర్పంచు లు తమ గ్రామంలోని సర్కారు బడిని సందర్శించి విద్యార్థుల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు పెరిగేలా వాటి ప్రాముఖ్యతను అందరికీ తెలిపే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ బడులను అంతా కలిసి బతికించుకోవాలి. – అంకం నరేశ్, పీఆర్టీయూ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు మన ఊరు బడిని బతికించుకుందాం సమస్యల పరిష్కారానికి సర్పంచులు నడుం బిగించాలి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ప్రణాళికలు వేయాలి -
శభాష్ పోలీస్
● నీటమునిగిన వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్ నిజాంసాగర్(జుక్కల్): మాఘమ అమావాస్య స్నానానికి వచ్చి నాగమడుగులో నీటమునిగిన ఒకరిని పోలీస్ కానిస్టేబుల్ సాహసం చేసి కాపాడాడు. వివరాలు ఇలా ఉన్నాయి. బిచ్కుందకు చెందిన మల్లేశ్ కుటుంబీకులతో కలిసి ఆదివారం నిజాంసాగర్ మండలం నాగమడుగు నీటిలో స్నానానికి వచ్చాడు. మంజీర నది తీరాన ఉన్న బండరాళ్లపై నుంచి ప్రమాదవశాత్తు కాలుజారీ నీటమునిగాడు. ఒడ్డున ఉన్న కుటుంబీకులు కాపాడాలని ఆర్తనాదాలు చేయడంతో అక్కడే విధుల్లో ఉన్న శ్యాం కానిస్టేబుల్ నాగమడుగులోకి దూకాడు. నీటమునుగుతున్న మల్లేశ్ను ఒడ్డుకు తీసుకువచ్చాడు. అప్పటికే మల్లేశ్ నీరు మింగడంతో స్థానికులు, పోలీసులు సపర్యలు చేసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఒకరి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ శ్యాంను భక్తులు, స్థానికులు అభినందించారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత ఇందల్వాయి: మండలంలోని లింగాపూర్ వాగు నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న పాటి తండాకి చెందిన రెండు ట్రాక్టర్లను శనివారం అర్ధరాత్రి పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. ఇసుక తరలింపునకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. -
యువత క్రీడలపై ఆసక్తి చూపాలి
డిచ్పల్లి: యువత క్రీడలపై ఆసక్తి చూపాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్రెడ్డి అన్నారు. యువత గ్రామాభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవచ్చని ఆయన సూచించారు. డిచ్పల్లి మండలంలోని తన సొంత గ్రామం ముల్లంగి (ఐ)లో ఆదివారం నిర్వహించిన ఎంపీఎల్–2026 (ముల్లంగి ప్రీమియర్ లీగ్) క్రికెట్ టోర్నమెంట్లో విజేత జట్టుకు నగేశ్రెడ్డి ట్రోఫీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సహకారంతో ముల్లంగి(ఐ) గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ నర్సయ్య, ఉప సర్పంచ్ అశోక్, వీడీసీ అధ్యక్షుడు నితిన్, క్రికెట్ విన్నర్ టీమ్ కెప్టెన్ హరీశ్, రన్నర్ టీమ్ కెప్టెన్ లక్ష్మణ్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. -
ఇందూరును స్మార్ట్ సిటీగా మారుస్తాం
నిజామాబాద్ రూరల్: ఇందూరును స్మార్ట్ సిటీగా మారుస్తామని, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. రూరల్ నియోజకవర్గంలోని గూపన్పల్లి, ముబారక్ డివిజన్లో రూ. రెండు కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గంగస్థాన్ ఫేస్–2లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గూపన్పల్లి డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని, మంచినీటి వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం గ్రామస్తులు భూమిని సేకరించి ఇస్తే నిర్మాణం కోసం పనులు చేపడతామని అన్నారు. గత ప్రభుత్వం గూపన్పల్లి అభివృద్ధిని మర్చిపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో గూపన్పల్లికి రూ. ఆరు కోట్ల నిధులు వెచ్చించి అభివృద్ధి చేశామని అన్నారు. అనంతరం ముబారక్నగర్ డివిజన్లో డ్రెయినేజీ, సీసీ రోడ్లు, కల్వర్టులకు శంకుస్థాపన చేశారు. లక్ష్మీప్రియనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని స్థానికులను కోరారు. సీడీపీ నిధులతో రూ. 10 లక్షలతో మహిళా భవనం కట్టిస్తానని హామీ ఇచ్చారు. నిజామాబాద్ చుట్టూ రింగ్ రోడ్కు ప్రతిపాదనలు పంపించామని అన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, యూత్ నాయకులు నరేశ్, నాయకులు సంజీవరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సందీప్, చిరంజీవి, హనుమాండ్లు, ఐసీడీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, లక్ష్మీ ప్రియ నగర్ కాలనీ అధ్యక్షుడు రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి గూపన్పల్లి, ముబారక్నగర్ డివిజన్లలో రూ. రెండు కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన -
నియామకం
జక్రాన్పల్లి: మండలంలోని మునిపల్లి తండాకు చెందిన బానోత్ గణేశ్ జిల్లా ఆలిండియా బంజారా యూత్ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు మూడిందల్నాయక్ చేతుల మీదుగా గణేశ్ నియామకపత్రం అందుకున్నారు. గణేశ్ మాట్లాడుతూ.. బంజారాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఆయనను సంఘ సభ్యులు, నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ సంతోష్ నాయక్, జిల్లా అధ్యక్షుడు రమావత్ మోహన్నాయక్, ఉపాధ్యక్షుడు సేవాలాల్నాయక్, కోశాధికారి రవి, బోధన్ యూత్ నాయకుడు నరేశ్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సవాల్లో పాల్గొనాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం
జక్రాన్పల్లి: మండలంలోని పడకల్లో ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయారెడ్డి, ఉపసర్పంచ్ పురుషోత్తంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు వొల్కాజీ విఠల్, కార్యదర్శి అరుణ్, ఆలయ కమిటీ సభ్యులు రాజేశ్వర్, శ్రీనివాస్, సంతోష్ తదితరులు ఉన్నారు. -
నూతన కార్యవర్గం ఎన్నిక
సుభాష్నగర్: నగరంలోని గాయత్రినగర్లో గాయత్రి చైతన్య కమిటీ సర్వసభ్య సమావే శం ఆదివారం నిర్వహించారు. సభ్యులు గాయత్రి చైతన్య కమి టీ నూతన కార్యవర్గా న్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా బేతి సంజీవరెడ్డి, అధ్యక్షుడిగా ఆడెపు నరేంద్ర స్వామి, ఉపాధ్యక్షుడిగా కట్ట శంకరయ్య, ప్రధాన కార్యదర్శిగా దోమల పండరి, సహాయ కార్య దర్శులుగా బాస ప్రవీణ్, బొద్దుల లక్ష్మణ్, కోశాధికారిగా భూమేశ్వర్, కార్యవర్గ సభ్యులుగా అందె లక్ష్మణ్, ప్రవీణ్, పళ్లికొండ ప్రవీణ్, సలహాదారులుగా గర్ధాస్ శంకర్, గజ్జెల లింబాద్రి చారి, బల్ల నారాయణ ఎన్నుకున్నారు. జక్రాన్పల్లి: మండలంలోని పడకల్ గ్రామంలో స్వేరోస్ నెట్వర్క్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ లోక స్వప్న, ఉపసర్పంచ్ పురుషోత్తంరెడ్డి లను స్వేరోస్ ప్రతినిధులు ఆదివారం ఘనంగా సన్మానించారు. అంబేడ్కర్ చిత్ర పటాన్ని సర్పంచ్కు బహూకరించారు. సర్పంచ్, ఉపసర్పంచ్తో పాటు వార్డు సభ్యులు భవదీప్, సత్తెమ్మలను సత్కరించారు. ఈ సందర్భంగా స్వేరోస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ సాయి మాట్లాడుతూ.. నూతన పాలకవర్గం విద్యా, వైద్యాఽనికి అధిక ప్రాధాన్యత కల్పించి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. స్వేరోస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ సాయి, స్వేరోస్ ప్రతినిధులు, ఎంపీడీవో గంగాధర్, సంజీవ్రావు, లిఖిత్, పిల్లి సంజీవ్, వంశీ, నాయకులు అంకం రాజేందర్, వొల్కాజీ విఠల్, మూడ శ్రీనివాస్ పాల్గొన్నారు. క్రీడాకారిణికి అభినందన ధర్పల్లి: మండలంలోని మద్దుల్ తండాకు చెందిన క్రీడాకారిణి గౌతమి ఇటీవల హర్యానాలో నిర్వహించిన జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి విజయం సాధించారు. ఈ మేరకు ధర్పల్లి మాజీ ఎంపీపీ నల్ల సారిక, బీఆర్ఎస్ నాయకులు ఆమెను ఘనంగా సన్మానించారు. నాయకులు హనుమంత్ రెడ్డి, కొట్టాల గంగారెడ్డి, మాజీద్, నాజీర్, రవి, రాజేశ్వర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. 108 అంబులెన్స్లో ప్రసవం ఆర్మూరుటౌన్: ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీకి చెందిన సోనీ అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబీకులు 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. సిబ్బంది ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సోని ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సిబ్బంది ఆస్పత్రిలో చేర్పించగా తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని ఈఎంటీ జగదీశ్, పైలట్ గణేశ్ తెలిపారు. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
సుభాష్నగర్: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని యోగా గురువు ప్రభాకర్ అన్నా రు. మౌని అమావాస్య సందర్భంగా నగరంలోని సుభాష్నగర్లో ఉన్న దయానంద్ యో గా సెంటర్లో ప్రభాకర్ ఆధ్వర్యంలో యోగా సాధకులు 108 సూర్య నమస్కారాలు చేశారు. ప్రభాకర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న ప్రతి యోగా కేంద్రంలో సూర్య నమస్కారాలు చే యాలని, దీని వల్ల డీ విటమిన్, రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఈనెల 25న రథసప్తమి రోజున అందరూ 108 సూర్య నమస్కారాలు చేసి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.దయానంద్ యోగా కేంద్రం డైరెక్టర్ రాంచందర్, యోగా సాధకులు భూమాగౌడ్, నారా యణ, తోట రాజశేఖర్, శ్రీనివాస్ చారి, సురేశ్రెడ్డి, జగదీశ్, మురళీ, లక్ష్మీనారాయణ, గురుపాదం,ప్రభు లింగం తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లి: పంచాయతీ ఎన్నికల్లో తనను సర్పంచ్గా గెలిపిస్తే కొత్తగా ఇల్లు నిర్మాణం చేసేవారికి సొంత డబ్బులతో 10 బస్తాల సిమెంట్ అందజేస్తానని దేవనగర్ క్యాంప్ గ్రామ సర్పంచ్ యూసుఫ్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఆదివారం గ్రామంలో కొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి పది బస్తాల సిమెంటును సర్పంచ్ అందజేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీనివాస్, వార్డుసభ్యులు సునీత, జైనబి, స్వప్న, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జక్రాన్పల్లి: మండలంలోని పడకల్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో విజేతగా నిలిచిన పడకల్ జట్టు క్రీడాకారులు ఆదివారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. హై స్కూల్ నుంచి ప్రారంభమై గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ చేపట్టారు. పటాకులు కాల్చారు. అనంతరం జీపీ కార్యాలయం వద్ద ప్రజాప్రతినిధులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ లోక స్వప్న, ఉపసర్పంచ్ పురుషోత్తంరెడ్డి, ఏసీబీ ఇన్స్పెక్టర్ గడ్డం నాగేశ్, పీఈటీ శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ రిత్విక్, గడ్డం సురేశ్, ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు గంట సుధాకర్, అంకం రాజేందర్, వీడీసీ సభ్యులు రాజేశ్వర్గౌడ్, భాస్కర్, సీనియర్ క్రీడాకారులు మల్లికార్జున్, చిన్నయ్య, గుండేటి రాజేశ్, క్రీడాకారులు పాల్గొన్నారు. అలరించిన భజన నవీపేట: మండల కేంద్రంలోని భక్త మార్కండేయ మందిరంలో జిల్లా కేంద్రానికి చెందిన భక్త మార్కండేయ దీక్షాపరులు చేసిన భజన భక్తులను ఆకట్టుకుంది. పుష్య అమావాస్య పర్వదినమున బాసర నది స్నానానికి వెళ్తున్న మార్కండేయ స్వాములు మార్గ మధ్యంలోని మార్కండేయ మందిరంలో ఆలపించిన భక్తి పాటలు అలరింపజేశాయి. స్థానిక పద్మశాలి కమిటీ ప్రతినిధులు మార్కండేయ స్వాములకు పండ్లు, పాల సేవను అందించారు. -
మున్సిపోల్స్పై పంచాయతీ ప్రభావం
మోర్తాడ్: పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు అ భ్యర్థుల ఖర్చు అంచనాలకు మించిపోవడంతో ఆ ప్రభావం మున్సిపల్ ఎన్నికల్లో ఉంటుందనే అభి ప్రాయం వ్యక్తమవుతోంది. పల్లెల్లోనే రూ. లక్షల్లో ఖర్చు చేస్తే పట్టణాల్లో అంతకు మించి ఖర్చు పెరుగుతుందనే చర్చ జరుగుతోంది. భీమ్గల్ మున్సిపాలిటీలో 12 వార్డులు, ఆర్మూర్ మున్సిపాలిటీలో 36 వార్డులకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించనున్నారు. సామాజిక వర్గాలు, మహిళల వారీగా రిజర్వేషన్లు తేల్చడంతో ఏ వార్డులో ఎవరు పోటీ చే యడానికి అర్హులో అనే స్పష్టత వచ్చింది. మున్సిప ల్ ఎన్నికల్లో పోటీచేసి తమ రాజకీయ భవితవ్యాన్ని తేల్చుకోవాలనే ఆశతో ఉన్న నాయకులు ఖర్చులపై లెక్కలు వేసుకుంటున్నారు. అధికార కాంగ్రెస్తోపాటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీల తరఫున పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్న నాయకులు ప్రచారం ఖర్చు, బహుమతులు, విందుల కోసం ఎంత ఖ ర్చు చేయాలనే ఆలోచనలో పడ్డారు. ఎన్నికల నోటి ఫికేషన్ త్వరలోనే వెలువడనుండగా పోటీలో నిలవాలనుకునే నాయకులు తమ ఎన్నికల ఖర్చుల కోసం నిధుల సమీకరణపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఆర్మూర్ డివిజన్లో పంచాయతీ ఎన్నికలు తుది విడతలో జరిగాయి. అప్పట్లో ఈ డివిజన్లో వివిధ పంచాయతీల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఖర్చు రూ.30 కోట్లకు మించింది. మేజర్ పంచాయతీల్లో జరిగిన ఖర్చును పరిగణలోకి తీసుకుంటున్న అభ్యర్థులు తమ తమ వార్డులలో ఎంత వరకు ఖర్చవుతుందో అంచనాలను సిద్ధం చేసుకుంటున్నారు. గ త ఎన్నికల్లో భీమ్గల్లో ఒక్కో వార్డులో ఒక ప్ర ధాన పార్టీ అభ్యర్థులు రూ.10 లక్షల వరకూ సొంతంగా ఖర్చు చేయగా పార్టీ ఫండ్గా ఒక్కో అభ్య ర్థికి రూ.5 లక్షల వరకు నిధులు అందించినట్లు సమాచారం. ప్రస్తుతం పార్టీ నుంచి నిధులు వచ్చినా, రాకపోయినా సొంతంగా కనీసం రూ.15 లక్షల వరకు ఖర్చు చేయాలనే ఆలోచనలో నాయకులు ఉన్నట్లు తెలిసింది. ఇక చైర్మన్ పీఠాన్ని ఆశించేవారు మాత్రం రెండింతల ఖర్చు ఎక్కువ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కౌన్సిలర్ అభ్యర్థులకు కూడా తాము సొంతంగా ఎంతో కొంత నిధులు సమకూర్చాలనే భావనలో చైర్మన్ పీఠంపై గురిపెట్టిన అభ్యర్థులు ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఎన్నికల సంఘం సూచించే ఖర్చుల పరిమితికి క్షేత్రస్థాయిలో జరిగే ఖర్చుకు ఎంతో తేడా ఉండనుందని చెప్పవచ్చు. పంచాయతీ ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసిన అభ్యర్థులు ఆ ప్రభావం మున్సిపల్ ఎన్నికల్లో చూపుతుందనే భావన వార్డుకు పోటీ చేస్తే రూ. 15 లక్షలకు పైనే ఖర్చు అవుతుందని అంచనా పార్టీ ఫండ్ వచ్చినా, రాకపోయినా నిధులు సమీకరించుకోవాలనే నిర్ణయం -
● లొంకలో భక్తుల సందడి
సిరికొండ: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ శైవ పుణ్యక్షేత్రమైన లొంకలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. మాఘ శుద్ధ బహుళ అమావాస్యను పురస్కరించుకొని లొంకలోని రామలింగేశ్వర స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు అవధూత గంగాధర్, ఎన్నం రాజారెడ్డి, తాళ్ల శ్రీనివాస్, బడాల సంతోష్, మారుతి, నవీన్, భూపతి, రాజు, బోయిడి ప్రకాశ్, నాగేశ్, ప్రశాంత్, వినీల్రెడ్డి, భాస్కర్, రాజు, రామకృష్ణ, నరేశ్, మోహన్, ప్రసాద్, సతీశ్, భూషణ్, నాగేశ్, గంగాధర్, లక్ష్మణ్, శ్రీరాం చారి, నారాయణ తదితరులు పాల్గొన్నారు. జక్రాన్పల్లి: మండలంలోని పడకల్లో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించారు. అమావాస్యను పురస్కరించుకుని గంగనీటిని తీసుకొచ్చి గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. గ్రామస్తులు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తిరుపతిరెడ్డి, రాజేశ్వర్గౌడ్, భాస్కర్, శివ, రవి, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ: మండలంలోని పెద్ద వాల్గోట్ గ్రామ సమీపంలోని త్రీ హిల్స్ అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయంలో జాతరను ఆదివారం వైభవంగా నిర్వహించారు. గుట్ట పైన ఉన్న ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గుట్ట కింద అమ్మవారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. సిరికొండ, ధర్పల్లి, భీంగల్ మండలాల నుంచి జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి రథం లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో అమావాస్యను పురస్కరించుకొని భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నీలకంఠేశ్వర ఆలయం, మనోకామేశ్వరఆలయం, శంభు లింగేశ్వర ఆలయం, లలిత ఆశ్రమాలయం లలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. జానకంపేటలోని అష్టముఖి కోనేరులో భక్తులు స్నానాలు ఆచరించారు. ఆధ్యాత్మికం -
సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై నిరసన
నిజామాబాద్ అర్బన్: బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలను కూల్చాలని సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ దాదన్నగారి మధుసూదన్ నిరసన తెలిపారు. సీఎం చట్టాలకు ఏమైనా అతీతు డా అని ఆయన ప్రశ్నించారు. అధికారిక హోదాలో ఉన్న సీఎం చట్ట వ్యతిరేకంగా మాట్లాడడం సరైంది కాదని అన్నారు. ఆస్తుల విధ్వంసానికి సీఎం పిలుపునివ్వడం ఆయన మనస్తత్వానికి నిదర్శనమన్నారు. రాజకీయ పార్టీని రాజకీయంగా ఎదుర్కోవాలే కాని భౌతిక దాడులకు పురికొల్పడం దారుణమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆరాచక సంస్కృతిని సృష్టించే దిశగా రేవంత్రెడ్డి అడుగులు ఉన్నాయని అన్నారు. -
జొన్న సాగుపై ఆసక్తి
● కామారెడ్డి జిల్లాలో యాసంగిలో 72 వేల ఎకరాలలో సాగవుతుందని అంచనా ● మద్దతు ధర లభిస్తుండడంతో పెరుగుతున్న సాగు విస్తీర్ణంకామారెడ్డి క్రైం : జిల్లా రైతులు మూడేళ్ల క్రితం వరకు జొన్న సాగు చేయడానికి అంతగా ఆసక్తి చూపేవారు కాదు. తోటి రైతులు సాగు చేయకపోవడం, పక్షుల నుంచి పంటను కాపాడుకోవడానికి నానా అవస్థలు పడాల్సి రావడం, ధర తక్కువగా ఉండడం వంటి కారణాలతో తక్కువ మంది రైతులు మాత్రమే ఈ పంట వేసేవారు. అయితే మూడేళ్లుగా పరిస్థితిలో మార్పు వస్తోంది. మార్కెట్లో గిట్టుబాటు ధర లభిస్తుండడం, దిగుబడులు బాగుంటుండడంతో క్రమంగా రైతులు ఈ పంట సాగుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో జిల్లాలో జొన్న సాగు విస్తీర్ణం పెరుగుతోంది. నీటి వినియోగం అధికంగా ఉండే పంటల స్థానంలో జొన్న సాగు వైపు చాలా మంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. అంచనాలకు మించే అవకాశం.. గతంలో నీటి వనరులు తక్కువగా ఉన్న రైతులు మొక్కజొన్న, శనగ వంటి ఆరుతడి పంటలను ఎంచుకునేవారు. అయితే శనగ దిగుబడులు తక్కువగా వస్తుండడంతో రైతులు ఆ పంట సాగు తగ్గించారు. శనగ స్థానంలో జొన్నను ఎంచుకుంటున్నారు. అధి క దిగుబడులు వచ్చే వంగడాలు మార్కెట్లో అందుబాటులో ఉండడం, నీరు తక్కువగా అవసరం ఉండడంతో ఈ పంట సాగుకే ఆసక్తి చూపుతున్నా రు. గతేడాది యాసంగి సీజన్లో 71,104 ఎకరాల్లో జొన్నసాగయ్యింది. జుక్కల్ నియోజకవర్గంతో పాటు గాంధారి, సదాశివనగర్, తాడ్వాయి, లింగంపేట తదితర మండలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో ఈ పంట పండించారు. ఈసారి 72,200 ఎకరా ల్లో జొన్న సాగవవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే ఈ సీజన్లో జొన్న పంట అంచనాలకు మించి సాగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారులు అంచనా వేసిన దానికంటే 20 శాతం ఎక్కువ విస్తీర్ణంలో జొన్న సాగయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. రెండు రకాలు.. జొన్న సాగు రెండు రకాలుగా ఉంటుంది. నీటి తడి అందించకుండా పండించే సాధారణ రకం జొన్నతోపాటు మూడు నుంచి నాలుగు తడులతో పండే నీళ్ల జొన్న రకాలున్నాయి. సాధారణ రకం 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు, నీటి తడులతో పండే జొన్న 20 నుంచి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. కొనుగోలు కేంద్రాలతో ఊరట గతంలో జొన్న కొనుగోలు కేంద్రాలు లేక రై తులు తమ దిగుబడిని దళారులకు విక్రయించాల్సి వచ్చేది. దీంతో సరైన ధర లభించక రై తులు ఈ పంట సాగుకు ఆసక్తి చూపేవారు కా దు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం మార్క్ఫెడ్ ఆ ధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. గతేడాది ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ. 3,371 గా ఉంది. కొనుగోలు కేంద్రాల్లో గత యాసంగి వరకు ఎకరానికి 8.65 క్వింటాళ్ల వరకు మాత్రమే కొనుగోలు చేయాలనే పరిమితి ఉండేది. కానీ ఈ పరిమితి ని ప్రభుత్వం 14 క్వింటాళ్లకు పెంచింది. ఇది కూడా రైతులకు ఊరటనిస్తోంది. నీళ్ల జొన్న ది గుబడి 20 క్వింటాళ్లకు పైగా వస్తుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని కొనుగోలు పరిమితిని ఎత్తివేయాలని రైతులు కోరుతున్నారు. -
అల్లమ ప్రభు జాతరకు మొదటిసారి వచ్చా
● ప్రభుత్వ సలహాదారు పోచారంనస్రుల్లాబాద్: బొమ్మన్దేవ్పల్లిలో ఏటా నిర్వహించే అల్లమ ప్రభు జాతరకు తొలిసారి వచ్చానని ప్రభు త్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. గ్రామ నాయకులు తనను జాతరకు పిలవడంలో అలసత్వం చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన జాతరలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ అల్లమ ప్రభు జాతర కుల మతాలకు అతీతంగా జరుగుతుందన్నారు. ఆలయ భూములు, అటవీ భూము లు అన్యాక్రాంతం అవుతున్నాయని తెలిసిందన్నా రు. అధికారులతో చర్చించి భూముల పరిరక్షణకు చర్యలు చేపడతామన్నారు. ఆయన వెంట ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్, సర్పంచ్ సాయిలు, నాయకులు పాల్త్య విఠల్, కంది మల్లేష్, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి వన్యప్రాణుల గణన
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో వన్యప్రాణుల గణనకు అటవీ శాఖ సిద్ధమైంది. ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు మొత్తం ఆరు రోజులపాటు అడవుల్లో సర్వే చేపట్టనున్నారు. జిల్లాలో పులులతోపాటు ఇతర వన్యప్రాణులు ఎన్ని ఉన్నాయో అంచనా వేయనున్నారు. ఇందుకోసం గతేడాది నవంబర్లోనే ఫారెస్ట్ అధికారులు శిక్షణ పొందగా, ఇటీవల డివిజన్ వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. వన్యప్రాణుల గణనకు అవసరమైన పరికరాలను అందజేశారు. మొదటి మూడు రోజులు మాంసహార జంతువులను, తర్వాతి మూడు రోజులు శాఖహార జంతువులను లెక్కిస్తారు. వన్యప్రాణుల గణనలో బీట్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లు, డిప్యూటీ ఎఫ్ఆర్వోలు, రేంజ్ ఆఫీసర్లు, ఎఫ్డీవోలు పాల్గొననున్నారు. అటవీ విస్తీర్ణం 86,871.45 హెక్టార్లు! జిల్లాలో 86,871.45 హెక్టార్ల మేర అటవీ విస్తీర్ణం ఉంది. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం సిరికొండ, కమ్మర్పల్లి, ఇందల్వాయి, నిజామాబాద్సౌత్, నిజామాబాద్నార్త్, వర్ని, ఆర్మూర్ రేంజ్లు ఉన్నాయి. జిల్లాలో అటవీ శాఖ లెక్కల ప్రకారం పెద్దపులులు లేకపోగా, చిరుతలు, ఎలుగుబంట్లు, అడవి కుక్కలు, అడవి పిల్లులు, జింకలు, మానుబోతులు, తోడేళ్లు, నక్కలు, నెమళ్లు ఉన్నాయి. చివరిసారిగా 2021లో వన్యప్రాణుల గణన చేపట్టగా, మళ్లీ ఇప్పుడే దేశమంతటా ఒకేసారి జరుగుతోంది. ఫారెస్ట్ అధికారులు అడవుల్లో తిరిగి పాదముద్రలు, ట్రాప్ కెమెరాలు, తదితర మార్గాల ద్వారా వన్యప్రాణుల సంఖ్యను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఈనెల 25 వరకు అడవుల్లో సర్వే ఆరు రోజులపాటు కొనసాగనున్న ప్రక్రియ మొదటి మూడు రోజులు మాంసాహార.. తరువాతి మూడు రోజులు శాఖాహార జంతువుల లెక్కింపు చివరిసారిగా 2021లో అడవి జంతువుల గణన -
అన్వేషణ
నిజామాబాద్ గెలుపు గుర్రాల కోసం వేట ● టికెట్ల కోసం అన్ని పార్టీల్లోనూ తీవ్ర పోటీ ● మొదలైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ● మేయర్ పీఠంపై కన్నేసిన ప్రధాన పార్టీలు ప్రథమ పౌరులారా.. బడి బాగుంటే ఊరు బాగుంటుంది. మన ఊరి బడిని బతికించుకుందాం. సమస్యల పరిష్కారానికి సర్పంచులు కృషి చేయాలిసోమవారం శ్రీ 19 శ్రీ జనవరి శ్రీ 2026– 8లో uసుభాష్నగర్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై కన్నేసిన ప్రధాన పార్టీలు.. గెలుపు గుర్రాల అన్వేషణలో పడ్డాయి. పేరు ప్రఖ్యాతలతోపాటు ధన, కుల బలాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మేయర్ పీఠం దక్కించుకోవాలని అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు ఉండగా.. 3.48 లక్షల మంది ఓటర్లు, 488 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మేయర్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కాగా, 15 స్థానాలు జనరల్, 15 జనరల్ మహిళ, 12 బీసీ జనరల్, 12 బీసీ మహిళ, 3 ఎస్సీ జనరల్, 2 ఎస్సీ మహిళ, ఒకటి ఎస్టీ జనరల్కు రిజర్వ్ అయ్యాయి. గత రెండు పర్యాయాలు మేయర్ పీఠం మహిళలకే దక్కగా, ఈసారి కూడా మహిళకే కేటాయించారు. రిజర్వేషన్లు అనుకూలించిన నేతలు ఇప్పటికే రంగంలోకి దిగారు. టికెట్ల కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బడా నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో ఆశావహులు నిమగ్నమయ్యారు. విజయం సాధించే సత్తా ఉన్న వారి కోసం.. నిజామాబాద్ నగరంలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నాయి. ఆయా పార్టీల్లో ఆశావహులు భారీగానే ఉన్నప్పటికీ.. మేయర్ పీఠం కై వసం చేసుకోవాలంటే గెలుపొందే అవకాశమున్న అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఆయా పార్టీల నాయకత్వాలు నిమగ్నమయ్యాయి. మరోవైపు ఆశావహులు సైతం సొంత పార్టీ టికెట్ ఇవ్వకుంటే మరో పార్టీ బీ ఫామ్తో, లేకుంటే స్వతంత్రంగా పోటీ చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా అభ్యర్థుల పేర్లతో ఓ ప్రధాన పార్టీ సర్వేలుసైతం చేపడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాగా ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద తప్పేలా లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భారీ సంఖ్యలో ఆశావహులు కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి బరిలో దిగేందుకు ఎక్కువమంది ఆసక్తితో ఉన్నారు. బీఆర్ఎస్, ఎంఐఎంసైతం గట్టి పోటీ ఇచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీల్లో ఒక్కో డివిజన్కు సగటున 4 నుంచి 5 దరఖాస్తులు వస్తున్నట్లు తెలిసింది. పోటీ తీవ్రంగా ఉన్నచోట గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఆశావహుల నుంచి కాంగ్రెస్ సోమవారం నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నది.మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన రిజర్వేషన్ల ఘట్టం ముగియడంతో అటు పార్టీలు గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తుండగా.. ఇటు ఆశావహులు టికెట్ల కోసం తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆయా పార్టీలు జిల్లాలో కీలకమైన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. నేటి నుంచి దరఖాస్తులు.. నిజామాబాద్ రూరల్: పార్టీ అధిష్టానం ఆదేశానుసారం సోమవారం నుంచి ఆశావహుల దరఖాస్తులను స్వీకరించనున్నట్లు నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తెలిపారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలకరులతో మాట్లాడారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్న వారు ఉదయం 10 గంటల నుంచి కాంగ్రెస్ భవన్లో దరఖాస్తులు అందజేయాలని ఆయన సూచించారు. -
క్రీడల నిర్వహణ ఎలా..?
● అధ్వానంగా క్రీడా ప్రాంగణాలు ● ప్రశ్నార్థకంగా సీఎం కప్ పోటీల నిర్వహణ మోర్తాడ్(బాల్కొండ): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీల ని ర్వహణ అనేక గ్రామాల్లో ప్రశ్నార్థకంగా మారింది. క్రీడా ప్రాంగణాలు అస్తవ్యస్తంగా ఉండటం, వాటిని బాగు చేసే పరిస్థితి లేకపోవడంతో క్రీడా పోటీల నిర్వహణకు అనువైన స్థలాల కొరత తీవ్రమైంది. ఫలితంగా గ్రామాల్లో ఆరు రోజులపాటు సాగాల్సిన క్రీడా పోటీలను కేవలం క్రీడాకారుల ఎంపికతోనే సరిపెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం శనివారంతోనే గ్రామాల్లో క్రీడా పోటీలు ప్రారంభం కావాల్సి ఉంది. మండల కేంద్రాల్లో టార్చ్ ర్యాలీలను నిర్వహించి క్రీడా పోటీలను మొక్కుబడిగా ప్రారంభించారు. 545 గ్రామ పంచాయతీలు ఉండగా 530 గ్రామాల్లోనే 2022లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. అప్పట్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో అనువైన స్థలాల ను గుర్తించి క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు జరగలేదు. ఇది ఇలా ఉండగా గ్రామీణ స్థాయిలో అథ్లెటిక్స్, ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, యోగా పోటీలను నిర్వహించాల్సి ఉంది. యోగా పోటీలను వరండాల్లో నిర్వహించే అవకాశం ఉంది. ఇతర పోటీలకు మాత్రం కచ్చితంగా క్రీడా ప్రాంగణాలు అవసరం కానున్నాయి. 2022లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాల నిర్వహణ తూతూ మంత్రంగానే సాగుతోంది. కనీసం రెండున్నర ఎకరాల్లో క్రీడా ప్రాంగణాలు ఉండాలని అప్పట్లో ప్రభుత్వం నిర్దేశించింది. అనువైన స్థలాలు లేకపోవడంతో కొద్ది స్థలంలోనే ప్రాంగణాలను ఏర్పాటు చేసినా నిర్వహణ లోపం వల్ల అనేక చోట్ల వినియోగంలోకి రాలేవు. కనీసం సీఎం కప్ పోటీలను దృష్టిలో ఉంచుకుని క్రీడా ప్రాంగణాలను వినియోగంలోకి తీసుకురావాలని క్రీడాభిమానులు కోరుతున్నారు. -
సేంద్రియ ఎరువుకు డిమాండ్
మోర్తాడ్(బాల్కొండ): పశు పేడ ధర భారీగా పెరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పసుపు సాగు చేసే వ్యవసాయ క్షేత్రాల్లో వేసవిలోనే ఆవు, గేదె, గొర్రె, మేక పేడను రైతులు విరివిగా వినియోగిస్తున్నారు. పసుపు తవ్వకాలతో సంబంధం లేకుండానే రైతులు ముందస్తుగా పశువుల పేడను తమ పంట పొలాల వద్ద నిలువ చేసుకుంటున్నారు. పశువుల పేడ లారీ లోడ్ ధర గతంలో రూ.16 వేలు పల కగా.. ప్రస్తుతం రూ.23 వేల నుంచి రూ.25 వేలకు వరకు పెరిగింది. గొర్రెలు, మేకల పేడ ధర గతంలో రూ.26 వేలు ఉండగా.. ఇప్పుడు రూ.35 వేల నుంచి రూ.38 వేల వరకు ధర పలుకుతోంది. గత సీజన్లో పసుపు క్వింటాల్కు రూ.10 వేలకుపైగా ధర లభించడంతోనే సేంద్రియ ఎరువుల ధరలను విపరీతంగా పెంచారని రైతులు అంటున్నారు. పశు పేడను విక్రయించే యజమానులు నేరుగా విక్రయి స్తే ధర ఇలా ఉండదని, దళారుల జోక్యం కారణంగానే ధర భారీగా పెరిగిందని వాపోతున్నారు. పశు పేడకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, స్థానికంగా పేడ లభించక దిగుబడి చేసుకుంటుండడంతో ధర పెరుగుతోందని అంటున్నారు. వర్మికంపోస్టు వినియోగిస్తే.. వర్మి కంపోస్టు వినియోగిస్తే పశు పేడ ధర తగ్గుతుందని పలువురు అంటున్నారు. వర్మి కంపోస్టును గ్రామ పంచాయతీల ద్వారా ఉత్పత్తి చేయాలని నిర్ణయించినా ఆశించిన స్థాయిలో ఉత్పత్తి సాగడం లేదు. ప్రైవేట్ కంపెనీలు విక్రయించే ఎరువు ధర కొంత ఎక్కువగానే ఉంది. పశువుల సంఖ్య మన ప్రాంతంలో పెరిగితే పేడ ధర అదుపులోకి వచ్చే అవకాశం ఉందని కూడా పలువురు అంటున్నారు. ఏది ఏమైనా పశు పేడ ధర పెరగడం వల్ల రైతులకు పెట్టుబడులు భారం అవుతున్నాయని చెప్పొచ్చు. మోర్తాడ్లో సేంద్రియ ఎరువును నిలువ చేసుకుంటున్న రైతు భారీగా పెరిగిన ధరలు లారీ పేడ ధర రూ.16 వేల నుంచి రూ.23 వేలకు.. దళారులే పెంచుతున్నారని రైతుల ఆరోపణ వర్మి కంపోస్టు వినియోగం మేలంటున్న శాస్త్రవేత్తలు -
పోతే రూ.6వేలు.. వస్తే రూ.18 లక్షల ఇల్లు
నిజామాబాద్ జిల్లా: రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇటీవల తగ్గిపోవడంతో కొందరు తమ స్థిరాస్తిని విక్రయించేందుకు నయా ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. మోర్తాడ్కు చెందిన ఓ వ్యక్తి రూ. 18 లక్షలు విలువ చేసే 110 గజాల తన ఇంటిని కేవలం రూ. ఆరు వేలకే లక్కీ డ్రాలో పొందవచ్చంటు కరపత్రాల ద్వారా ప్రచా రం చేస్తున్నాడు. 300 మందికి సభ్యత్వం కల్పిస్తూ రూ.18లక్షలు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. మహాశివరాత్రి రోజున నిర్వహించే లక్కీ డ్రాలో బంపర్ ప్రైజ్గా రూ.18లక్షల విలువ చేసే ఇంటిని, 30 మందికి గృహోపకరణాలను బహుమతిగా ప్రకటించారు. ఇలా ఎంతో మంది తమ పాత కార్లు, ఇంటి స్థలాలను, ఇతర సామగ్రిని మార్కెట్లో విక్రయించుకోలే లక్కీ డ్రా ద్వారా మార్కెటింగ్ చేసుకునే పద్ధతిని ఎంచుకుంటున్నారు. లక్కీ డ్రా నిర్వహణపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నా కొందరు ఇలాంటి ప్రయత్నాలను మానడం లేదు.కఠిన చర్యలు తీసుకుంటాంఎవరైనా ప్రభుత్వ అనుమతి లేకుండా లక్కీడ్రాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. మోర్తాడ్లో లక్కీడ్రా విషయం మా దృష్టికి వచ్చింది. సదరు వ్యక్తిని హెచ్చరించాం. ప్రజలు లక్కీడ్రాలను నమ్మి మోసపోవద్దు. – రాము, ఎస్సై, మోర్తాడ్ -
రిజర్వేషన్లు ఖరారు
నిజామాబాద్● రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కొనసాగిన ప్రక్రియ ● డివిజన్లు, వార్డుల వారీగా వెల్లడించిన కలెక్టర్ ఇలా త్రిపాఠిఇసుక అక్రమ దందాకు అడ్డేది? మాక్లూర్ మండలంలోని చిక్లీ, వల్లభాపూర్ ఇసుక క్వారీల్లో అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది.ఆదివారం శ్రీ 18 శ్రీ జనవరి శ్రీ 2026– 8లో uనిజామాబాద్అర్బన్: జిల్లాలోని నిజామాబాద్ నగర పాలక సంస్థతోపాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల వార్డు స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ రిజర్వేషన్లు ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్సు హాల్లో అదనపు కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియాలతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ 2011 జనాభా ప్రాతిపదికన, బీసీ డెడికేషన్ కమిషన్ నివేదికను అనుసరిస్తూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలకు అనుగుణంగా రిజర్వేషన్ కేటాయింపులు చేశామని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషన్కు నివేదిస్తామని తెలిపారు. రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియలో నిజామాబా ద్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపల్ కమిషనర్లు జాదవ్ కృష్ణ, శ్రావణి, గంగాధర్, కలెక్టరేట్ ఎన్నికల విభా గం పర్యవేక్షకుడు బాలరాజు, గుర్తింపు పొందిన రా జకీయ పార్టీల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
నవీపేట–బాసర డబుల్ లైన్ పూర్తి
● రేపు నూతన రైల్వేట్రాక్ పరిశీలన నవీపేట: మేడ్చల్ నుంచి ముద్ఖేడ్ వరకు రైల్వేలైన్ విస్తరణలో భాగంగా మొదటి విడ త పనులు పూర్తయ్యాయి. బాసర నుంచి న వీపేట వరకు ముందుగా పనులను ప్రారంభించిన రైల్వే అధికారులు రైల్వే డబ్లింగ్, వి ద్యుత్ సౌకర్యం, రైల్వేస్టేషన్ల ఆధునీకరణ పనులను పూర్తి చేశారు. దీంతో ఈ నెల 19న రైల్వే ఉన్నతాధికారులు, సంబంధిత శాఖ సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో పరి శీలించనున్నారు. పరిశీలన అనంతరం ట్ర యల్ రన్ను పూర్తి చేసి, కొత్త పట్టాలపై మరిన్ని రైళ్ల రాకపోకలను కొనసాగించేందు కు ఏర్పాట్లు చేశారు. వారంలోగా కొత్తట్రాక్ పూర్తిగా వినియోగంలోకి వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ఆర్మూర్టౌన్: మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్కు ఇన్చార్జి కమిషనర్గా బాధ్యతలను ఉ న్నతాధికారులు అప్పగించారు. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ పూజారి శ్రావణి ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. కాగ ఆమె ఫౌండేషన్ కోర్సు ట్రెయినింగ్ కో సం హైదరాబాద్కు వెళ్లారు. అక్కడ 45 రో జుల పాటు ఆమె శిక్షణలో పాల్గొననున్నారు. దీంతో మున్సిపల్ మేనేజర్ ఇన్చార్జి కమి షనర్గా బాధ్యతలు స్వీకరించారు. సుభాష్నగర్: మేడారం వెళ్లలేని భక్తులకు ఆర్టీసీ కార్గో ద్వారా కేవలం రూ.299లకే మేడారం సమ్మక్క–సారక్క ప్రసాదం ఇంటి వద్దకే తెచ్చి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు రీజినల్ మేనేజర్ జ్యోత్స్న తెలిపారు. నగరంలోని ఆర్ఎం కార్యాలయంలో శనివారం సమ్మక్క–సారక్క ప్రసాదం పంపిణీ కరపత్రాలను డిపో మేనేజర్లతో కలిసి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమ్మక్క–సారక్క ప్రసాదం ఇంటికి తెచ్చి ఇచ్చే కార్యక్రమానికి సంబంధించి www. tgsrtclogistics. co. in అనే వెబ్సైట్ ద్వారా, లేదా ఆర్టీసీ కార్గో నిజామాబాద్ కౌంటర్ వద్ద కూడా బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని ఉ మ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల భ క్తులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపా రు. పూర్తి వివరాలకు ఆయా డిపోల ఫోన్నంబర్లను సంప్రదించాలని సూచించారు. కలెక్టర్ను కలిసిన ఆర్టీసీ ఆర్ఎం సుభాష్నగర్: కలెక్టర్ ఇలా త్రిపాఠిని టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజినల్ మేనేజర్ టీ జ్యోత్స్న శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ఆర్టీసీ బస్సు రవాణా వ్యవస్థ, ప్రజలకు మెరుగైన సేవలు, ప్రయాణికుల భద్ర త, రవాణా సౌకర్యాల అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. ప్రధానంగా పండుగ సమయాల్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు. వారి వెంట నిజామాబాద్–1 డిపో మేనేజర్ ఆనంద్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని బీపీఎడ్ 1, 3వ సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలు ఈనెల 25న నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ప్రొఫెసర్ సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా జరుగుతాయన్నారు.ఆర్మూర్ 7396889496 బోధన్ 9154298729. నిజామాబాద్ –1 9154298727 నిజామాబాద్ –2 7396889496 బాన్సువాడ 9154298729 కామారెడ్డి 9154298729 నిజామాబాద్ ఆర్ఎం 8639963647 -
సీఎం కప్ క్రీడా పోటీలకు నిధుల కొరత!
మోర్తాడ్(బాల్కొండ): సీఎం కప్ క్రీడా పోటీలకు నిధుల కొరత వేధిస్తోంది. గతేడాది క్రీడా పోటీలకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో అధికార యంత్రాంగం దాతల సహకారంతో నిర్వహించింది. ఈసారి క్రీడా పోటీలు ఆరంభమైనా నిధుల జా డ లేకపోవడం సందేహాలకు తావిస్తోంది. కేవలం టార్చ్ ర్యాలీ కార్యక్రమానికి ప్రతి మండలానికి రూ.5 వేల చొప్పున నిధులను విడుదల చేశారు. దీంతో శనివారం అన్ని గ్రామాలలో క్రీడా పోటీలను ఆరంభించారు. ఎక్కువ చోట్ల క్రీడాకారులను నామమాత్రంగానే ఎంపిక చేసి మండల స్థాయికి పంపించాలని ప్రజాప్రతినిధులు, అధికారులు ఆలోచిస్తున్నారు. గ్రామీణ స్థాయి కీడ్రా పోటీలను ఈ నెల 22 వరకు, మండల స్థాయిలో 28 నుంచి 31 వరకు, నియోజకవర్గ స్థాయిలో ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉంది. రూ.50 వేల నుంచి రూ.2.50 లక్షల వరకు.. సీఎం కప్ క్రీడా పోటీల్లో భాగంగా గ్రామీణ స్థాయిలో అథ్లెటిక్స్, ఫుట్బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, యోగా పోటీలను నిర్వహించాలని నిర్ణయించారు. కలెక్టర్ విచక్షణాధికారంతో మరో గ్రామీణ క్రీడను నిర్వహించేందుకు అవకాశం ఉంది. మండల స్థాయిలో చెస్, కరాటే, క్యారమ్స్ అదనంగా చేర్చారు. నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మాత్రం 22 నుంచి 25 రకాల క్రీడా పోటీలను నిర్వహించనున్నారు.అయితే, మండల స్థాయిలో నిర్వహించే పోటీలకు కనీసం రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు ఖర్చు అవుతుంది. నియోజకవర్గ స్థాయిలో రూ.1.50 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు నిధులు అవసరం. గతంలో కేవలం మండల స్థాయిలో క్రీడాపోటీల నిర్వహణకు రూ.20 వేల చొప్పున నిధులు ఇచ్చినా సకాలంలో మంజూరు చేయకపోవడంతో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టార్చ్ ర్యాలీల కోసం నిధులిచ్చాం.. టార్చ్ ర్యాలీ కార్యక్రమాల నిర్వహణకు ప్రతి మండలానికి రూ.5 వేల చొప్పున ని ధులను విడుదల చేశాం. త్వ రలో మండల స్థాయి పోటీలకు నిధులు మంజూరు కానున్నాయి. ఈసారి ఎంతో ఉత్సాహంగా క్రీడాపోటీలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. నిధుల కొరత తీరుతుంది. – పవన్, జిల్లా క్రీడల అధికారి గతంలో దాతల సహకారంతోనే నిర్వహించిన అధికారులు ఈసారి నిధులు కేటాయిస్తామని ప్రకటించినా.. ఇంకా విడుదల కాని వైనం -
రిజర్వేషన్లపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం
● దళితులు, మహిళలు, బీసీలకు తీరని అన్యాయం ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్సుభాష్నగర్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో డివిజన్ వారీగా రిజర్వేషన్ల కేటాయింపుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి పేర్కొ న్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, ఎంపీ అర్వింద్ ధర్మపురి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. శనివారం కలెక్టరేట్లో మున్సిపాలిటీల రిజర్వేషన్ల లక్కీ డ్రా నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లా డారు. కార్పొరేషన్లో ఓడిపోతామనే భయంతో అధికార పార్టీ నాయకులు దళితులు లేని 39, 40, 44 డివిజన్లను ఎస్సీలకు కేటాయించారని, ఈ విషయమై కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు వ్యతిరేకించా యని తెలిపారు. మహిళా రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో చేశామని చెప్పి.. లక్కీ డ్రా తీయడంతో మళ్లీ ఆ డివిజన్కే మహిళా రిజర్వేషన్లు వచ్చాయన్నారు. గత ఎన్నికల్లో మహిళలకు 29 డివిజన్లను కేటాయించారని, ప్రస్తుతం కూడా లక్కీ డ్రాలో మళ్లీ ఆ డివిజన్లు మహిళలకే కేటాయించబడ్డాయన్నారు. కాంగ్రెస్ పార్టీ హిందువులపై కపట ప్రేమ చూపించిందని, బీసీలకు 24 సీట్లు కేటాయిస్తే అందులో 8 డివిజన్లు మైనార్టీలు గెలిచే స్థానాలకు ఇచ్చారని విమర్శించారు. ఆర్మూర్, బోధన్లో కూడా ఇలాగే అ న్యాయం జరిగిందన్నారు. అధికారుల తప్పిదాలను నిరసిస్తూ రిజర్వేషన్ల పత్రాలపై సంతకాలు పెట్టకుండా బహిష్కరించామని, సరిచేయాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు నాగోళ్ల లక్ష్మీనారాయ ణ, బంటు రాము, శ్రీనివాస్రెడ్డి, పంచరెడ్డి శ్రీధర్, రాజు, ముస్కె సంతోష్, బైకన్ చిన్న ఒడ్డెన్న, విజయ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వే‘గంగ’ కిందకు..
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో భూగర్భ జలాలు తగ్గడం మొదలైంది. నీటి వినియోగం పెరగడంతో ‘గంగమ్మ’ వేగంగా కిందకు వెళ్తోంది. వరినాట్లు చివరిదశకు చేరుకోవడంతో వ్యవసాయ బోర్ల వాడకం పెరిగింది. దీంతో నవంబర్ నెలలో 5.40 మీటర్ల లోతులో ఉన్న జలాలు డిసెంబర్ ముగిసే నాటికి 1.80 మీటర్ల మేర తగ్గి 7.20 మీటర్ల లోతులోకి వెళ్లాయి. ఇది 2024 డిసెంబర్ (8.92 మీటర్లు)తో పోలిస్తే మెరుగైన పరిస్థితే అయినప్పటికీ నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే వేసవి సమయంలో నీటి ఎద్దడి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారి శ్రీనివాస్బాబు ‘సాక్షి’తో పేర్కొన్నారు. అవసరం మేరకే వ్యవసాయ, గ్రామ పంచాయతీ, గృహావసరాల బోర్లను వినియోగించాలని రైతులను, ప్రజలను, గ్రామ పంచాయతీల అధికారులను కోరారు. నీటిని వృథా చేయొద్దన్నారు. డిసెంబర్ మాసానికి సంబంధించిన భూగర్భ జలాల లెక్కలను ఇటీవల గ్రౌండ్వాటర్ డిపార్ట్మెంట్ సేకరించింది. జిల్లా వ్యాప్తంగా 82 ఫీజో మీటర్ల ద్వారా నీటి లెక్కలను తీసింది. ఇందులో 64 ఫీజో మీటర్లలో 10 మీటర్ల లోపు నీటి మట్టాలున్నాయి. అలాగే 16 ఫీజో మీటర్లలో 10 నుంచి 20 మీటర్ల లోపు భూగర్భ జలాలున్నాయి. అదే విధంగా రెండు ఫీజో మీటర్లలో 20 మీటర్ల లోతులో ఉన్నాయి. అంటే.. జిల్లా వ్యాప్తంగా నవంబర్ నెలలో 92శాతం విస్తరించి ఉన్న జలాలు డిసెంబర్ ముగిసే సమయానికి 85 శాతానికి తగ్గాయి. భీమ్గల్, సిరికొండ, నవీపేట్, డిచ్పల్లి, మోపాల్ మండలాల్లో కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు కిందికి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. మే 12.48 జూన్ 11.49 జూలై 11.76 ఆగస్టు 8.48 సెప్టెంబర్ 6.03 అక్టోబర్ 5.58 నవంబర్ 5.40 డిసెంబర్ 7.202025లో నెలల వారీగా భూగర్భ జలాలు (మీటర్లలో) తగ్గుతున్న భూగర్భ జలాలు డిసెంబర్ ముగిసే నాటికి 7.20మీటర్ల లోతులో నీటి మట్టం నవంబర్ నెలతో పోలిస్తే 1.80 మీటర్ల మేర తగ్గుదల -
మూడోసారీ మహిళకే మేయర్ పీఠం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ మేయర్ పీఠం మీద మూడోసారీ మహిళే కూర్చోనున్నారు. గత రెండు పర్యాయాలు బీసీ మహిళలు ఈ పదవిని నిర్వర్తించారు. ఈసారి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఇక ఆర్మూరు, భీంగల్ మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాలు సైతం జనరల్ మహిళలకే రిజర్వ్ అయ్యాయి. బోధన్ మున్సిపల్ పీఠం జనరల్కు రిజర్వ్ అయింది. ● నిజామాబాద్ మేయర్ సీటు కోసం పోటీ పడేవారి సంఖ్య పెరుగుతోంది. బీజేపీ నుంచి మాజీ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి మేయర్ రేసులో ఉన్నారు. ఇప్పటికే ఈమె మేయర్ రేసులో ఉన్నట్లు గతం నుంచే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎమ్యెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కోడలు డాక్టర్ ధన్పాల్ శ్రీవాణి సైతం మేయర్ పీఠం రేసులోకి రానున్నట్లు తెలుస్తోంది. శ్రీవాణి రేడియాలజిస్టుగా పనిచేస్తున్నారు. ● కాంగ్రెస్ నుంచి డాక్టర్ కవితా రెడ్డి పేరు చాలా రోజులుగా ప్రచారంలో ఉన్నప్పటికీ ఆమెకు రాష్ట్ర స్థాయి ’ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్’ చైర్ పర్సన్గా పదవి దక్కనున్నట్లు సమాచారం. దీంతో నల్ల స్రవంతి రెడ్డి కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా రేసులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఎంఏ ఆర్థిక శాస్త్రం చదివిన నల్ల స్రవంతి రెడ్డి భర్త దినేష్ రెడ్డితో కలిసి ఈమె అనేక వ్యాపారాలు నిర్వహిస్తోంది. నల్ల స్రవంతి అనేక సేవా కార్యక్రమాలు చేస్తుండడంతో బాటు ఆర్బీవీఆర్ఆర్ లో చురుకై న సభ్యురాలిగా ఉన్నారు. ఈమెది రాజకీయ కుటుంబ నేపథ్యం. భర్త దినేష్ తాత నిజామాబాద్ మున్సిపల్ మొదటి చైర్మన్ కాగా, ఆమె అత్త డాక్టర్ భారతీరెడ్డి సైతం మున్సిపల్ చైర్ పర్సన్గా చేశారు. మరోవైపు ఈమె అన్న పురన్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ కు అత్యంత సన్నిహితుడు. ● మాజీ పబ్లిక్ ప్రాసిక్యుటర్ కాటిపల్లి సరళా మహేందర్ రెడ్డి మేయర్ రేసులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆమె, ఆమె భర్త మహేందర్ రెడ్డి హైకోర్టు న్యాయవాదులుగా సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే సరళ మహేందర్ రెడ్డిని ఒక జాతీయ పార్టీ సంప్రదించినట్లు చర్చ జరుగుతోంది. ప్రధాన పార్టీలు సైతం మేయర్ అభ్యర్థి విషయంలో లెక్కలు వేసుకుంటున్నాయి.ఆర్మూరు, భీవ్ుగల్ చైర్పర్సన్ (జనరల్ మహిళ) -
తుది జాబితా విడుదల
● నేడు మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు ● నోటిఫికేషన్ వెలువడటమే తరువాయి ● డివిజన్లలో ఎన్నికల కోలాహలం సుభాష్నగర్ : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫొటో తుది ఓటరు జాబి తా, పోలింగ్ కేంద్రాల తుది జాబితాను శుక్రవారం ప్రదర్శించారు. రిజర్వేషన్ల ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుంది. శనివారం డివిజన్లకు రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. ఇప్పటికే మున్సిపాలిటీల్లో ఎ న్నికల కోలాహలం నెలకొనగా, ఇక ఎన్నికల షె డ్యూల్, నోటిఫికేషన్ వెలువడటమే మిగింది. నిజామాబాద్లో 3.48 లక్షల ఓటర్లు.. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉన్నాయి. మొత్తం 3,48,051 మంది ఓటర్లు ఉన్నారు. 488 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో పోలింగ్ కేంద్రానికి సుమారు 750 మంది ఓటర్లు ఉండేలా చర్యలు చేపట్టారు. బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరగనున్న దృష్ట్యా దాదాపు వెయ్యికిపైనే బ్యాలెట్ బాక్సులు అవసరమని అధికారులు అంచనా వేశారు. అదేవిధంగా 2200 మంది (20 శాతం అదనం) పోలింగ్ సిబ్బంది అవసరముంటుంది. పీవో, వోపీవో, ఏపీవో, ఆర్వోలకు ఎన్నికల శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పోలీస్శాఖ గుర్తించింది. 60 డివిజన్లకు.. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 60 డివిజన్లకు శనివారం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు 50 శాతం పరిమితి మించకుండా బీసీ, ఎస్టీ, ఎస్సీలకు (ఆయా సామాజిక వర్గాల నిష్పత్తుల ప్రకారం) రిజర్వేషన్లు కేటాయించనున్నారు. ఆ మేరకు ఇప్పటికే రిజర్వేషన్లను ప్రకటించారు. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు కేటాయిస్తారు. 60 డివిజన్లకుగాను 30 అన్రిజర్వ్డ్కు కేటాయించగా, 24 బీసీలు, 5 ఎస్సీలు, 1 ఎస్టీకి కేటాయించారు. శనివారం ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి నేతృత్వంలో అన్ని రాజకీయ పార్టీల సమావేశంలో నిజామాబాద్ సహా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల మహిళల రిజర్వేషన్లకు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటమే మిగిలింది. ఇప్పటికే డివిజన్లలో ఎన్నికల కోలాహలం మొదలైంది. రిజర్వేషన్లు నేడు ఖరారు కానున్న నేపథ్యంలో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా ఈనెల 19 లేదా 20 తేదీల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశముందని అధికారిక వర్గాల ద్వారా తెలిసింది.పెరిగిన పోలింగ్ కేంద్రాలు.. ఎన్ఎంసీలో పెరిగిన జనాభాకనుగుణంగా పోలింగ్ కేంద్రాలను పెంచారు. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో 2.91లక్షల మంది ఓటర్లు ఉండగా, 413 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆరేళ్లలో సుమారు 57 వేల ఓట్లు పెరిగి 3.48 లక్షలకు చేరాయి. దీంతో పోలింగ్ కేంద్రాల సంఖ్య కూడా 488కి పెరిగాయి. 2025 అక్టోబర్ 1కి ముందు ఓటరుగా నమోదు చేసుకున్న వారికే ఓటు వేసేందుకు కటాఫ్ తేదీని ఎన్నికల సంఘం ప్రకటించింది. కలెక్టర్, మున్సిపల్ కార్యాలయం, ఆర్డీవో, నార్త్, సౌత్ తహసీల్ కార్యాలయాల్లో తుది పోలింగ్ కేంద్రాల జాబితా, పోలింగ్ కేంద్రాల వారీగా ఫొటో ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. -
‘ఆఫీసర్స్ క్లబ్’కు సహకారం అందిస్తాం
● ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి సుభాష్నగర్: నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ కార్యకలాపాలకు తమ పూర్తి సహకారం అందిస్తామని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం నగరంలోని తన నివాసంలో సుదర్శన్రెడ్డిని ఆఫీసర్స్ క్లబ్ కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ సామాజిక, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాల గురించి ఆయనకు వివరించారు. క్లబ్ భవిష్యత్తు కార్యక్రమాలకు సహకారం, మార్గనిర్దేశనం అందించాలని ఆయనను కోరారు. ఆఫీసర్స్ క్లబ్ ఉపాధ్యక్షుడు తాహెర్బిన్ హందాన్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జలగం తిరుపతి రావు, జాయింట్ సెక్రెటరీ శ్యాంసుందర్ రెడ్డి, కోశాధికారి సురేశ్ గాడ్, దేవిదాస్, భూపాల్ రెడ్డి, రాంరెడ్డి, పురన్రెడ్డి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ● అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సుభాష్నగర్: మహారాష్ట్రలో జరిగిన మున్సిప ల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు.. ఇందూరు కార్పొరేషన్ ఎన్నికల్లో పునరావృతం కావడం ఖాయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ధీమా వ్యక్తంచేశారు. గురువారం మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై నగరంలోని గాంధీచౌక్లో బీజేపీ కార్యకర్తలతో కలిసి సంబరాలు నిర్వహించారు. టపాకాయ లు కాల్చి, మిఠాయిలు పంచిపెట్టారు. అనంత రం ధన్పాల్ మాట్లాడుతూ రాబోయే మున్సిపల్కార్పొరేషన్ ఎన్నికల్లో ఇందూరు కార్పొరేషన్పై బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. మాజీ కార్పొరేటర్లు, నాయకులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, జ్యోతి, కోడూరి నాగరాజు, బంటు రాము, మాస్టర్ శంకర్, ప్రభాకర్, శీల శ్రీనివాస్, మఠం పవన్, విజయ్ కృష్ణ, పంచరెడ్డి శ్రీధర్, చింతకాయల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ‘సాగర్’కు 1.129 టీఎంసీల నీరు చేరిక నిజాంసాగర్(జుక్కల్): సంగారెడ్డి జిల్లాలోని సింగూరు జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో శుక్రవారం సాయంత్రం వరకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 1.129 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఈనెల 10 నుంచి సింగూరు ప్రాజెక్టు నుంచి మంజీరా నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఈ నెల 13న సింగూరు జలాలు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి చేరుకున్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు 17.8 టీఎంసీలకు గాను ప్రస్తుతం 1403 అడుగులు 14.978 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,185 క్యూసెక్కుల జలాలు ఇన్ఫ్లోగా వచ్చి చేరుతున్నట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. నియామకం ఖలీల్వాడి: జిల్లా ఉపాధ్యాయ పండిత పరిషత్ అధ్యక్షుడిగా కేతటి చిదానందరెడ్డి, జిల్లా ప్రధా న కార్యదర్శిగా ప్రమోద్కుమార్ నియామకం అయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహులు, రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి శశికుమార్ యాదవ్ వీరి ని శుక్రవారం నియమించారు. జిల్లాలోని అన్ని రకాల భాషల ఉపాధ్యాయులకు అండగా నిలుస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా మని వారు అన్నారు. -
పుట్టిన రోజే ఆకస్మిక మరణం
నిజామాబాద్ అర్బన్: వైద్యశాఖకు చెందిన ఉద్యోగి సంజీవరావు(53) గురువారం గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. జిల్లా కేంద్రానికి చెందిన సంజీవరావు గురువారం తన పుట్టిన రోజు కావడంతో నూతన బట్టల కొనుగోలుకు మార్కెట్కు వెళ్లాడు. అక్కడ ఛాతిలో నొప్పిరావడంతో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వెళ్లారు. ఈసీజీ తీసిన తర్వాత మరణించారు. వైద్యులు సీపీఆర్ చేసినా ప్రయత్నం లేకుండా పోయింది. అతని పుట్టిన రోజే మరణించడం విషాదంగా మారింది. ప్రస్తుతం జగిత్యాల మెడికల్ కళాశాలలో పరిపాలన అధికారిగా కొనసాగుతున్నారు. అతని అంత్యక్రియలు బిచ్కుందలో శుక్రవారం నిర్వహించారు. సంజీవరావు అకాల మృతికి జిల్లా టీఎన్జీవోస్ సభ్యులు నివాళులు అర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. అతని కుటుంబానికి టీఎన్జీవోస్ అండగా ఉంటుందని సంఘం అధ్యక్షుడు సుమన్ పేర్కొన్నారు. గతంలో టీఎన్జీవోస్ జిల్లా మాజీ కార్యవర్గ సభ్యుడుగా సంజీవరావు పనిచేశాడని అన్నారు. ● గుండెపోటుతో వైద్యశాఖ ఉద్యోగి మృతి -
మందుగుండు పేలి ఆవు మృతి
బోధన్: ఎడపల్లి మండలంలోని జానకంపేట శివారులో గురువారం గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన మందు గుండు పేలి మేతకు వెళ్లిన ఆవు మృతి చెందింది. రెంజల్ మండలం దూపల్లి గ్రామానికి చెందిన కారె సాయికుమార్కు చెందిన ఆవును మేతకు కోసం జానకంపేట శివారులో తీసుకొచ్చినట్లు స్థానికులు తెలిపారు. అడవి పందుల వేటలో భాగంగా గుర్తు తెలియని వ్యక్తులు పేలుడు మందును పశువుల ఆహార పదార్థం తౌడులో ముద్దగా పెట్టి వదలిపెట్టినట్టు తెలుస్తోంది. ఆ ఆహార పదార్థాన్ని ఆవు తింటుండగా నోట్లో పేలుడు సంభవించి తీవ్రగాయాలపాలైంది. తీవ్రగాయలకు గురైన ఆవు మృతి చెందింది. ఈ ఘటనపై పోలీస్ శాఖ విచారణ చేపట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో గుర్తు తెలియని ఓ వృద్ధుడు (65)గురువారం కిందపడి మృతి చెందినట్లు పట్టణ సీఐ నరహరి తెలిపారు. వృద్ధుడు కిందపడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీసులను సంప్రదించాలని సీఐ కోరారు. -
మీకు తెలుసా..
వస్తువుల కొనుగోలులో లోపం ఉంటే.. రామారెడ్డి : వినియోగదారుడు ఒక వస్తువును కొన్నప్పుడు అ ది పాడైపోయినా, నాణ్యత లేకపోయినా, మోసపోయినా భయపడాల్సిన అవసరం లేదు. భార త వినియోగదారుల రక్షణ చట్టం(కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019) ప్రకారం వారికి పూర్తి హక్కులు ఉంటాయి. కేసు ఎలా వేయాలి.. ఎక్కడ వేయాలన్న విషయాలను తెలుసుకుందాం. ● రసీదు(బిల్) కొన్న వస్తువుకు సంబంధించిన ఒరిజినల్ బిల్లును భద్రపరచుకోవాలి. ● సంస్థకు ఫిర్యాదు మొదట సదరు కంపెనీ కస్టమర్ కేర్కు లేదా షాపు యజమానికి రాతపూర్వకమైన ఫిర్యాదు చేయాలి. ● నోటీసుకు వారు స్పందించకపోతే, ఒక లీగల్ నోటీసు పంపాలి. ● వస్తువు విలువ లేదా కోరుతున్న పరిహారం ఆధారంగా మూడు స్థాయిల్లో కోర్టులు ఉంటాయి. ● స్థాయి వస్తువు విలువ పరిహారం జిల్లా కమిషన్ రూ. 50లక్షల లోపు, రాష్ట్ర కమిషన్ రూ. 50 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు ఫిర్యాదు చేయాలి. ● జాతీయ కమిషన్ రూ. 2కోట్లకు పైగా నష్టం జరిగితే ఫిర్యాదు చేయాలి. రెండు రకాలుగా ఫిర్యాదు చేయొచ్చు ● ఆన్లైన్ ద్వారా వినియోగదారులు ఇంటి నుంచే ed-a-a-khi.ni-c.in వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ● మరొకటి నేరుగా కోర్టులో మీ ప్రాంతంలోని జిల్లా వినియోగదారుల ఫోరమ్కు వెళ్లి స్వ యంగా ఫిర్యాదు పత్రాన్ని సమర్పించవచ్చు. దీనికి లాయర్ ఉండాల్సిన అవసరం లేదు. ● అవసరమైన పత్రాలు ఫిర్యాదు చేసేటప్పుడు మీ పేరు, చిరునామా అవతలి వ్యక్తి/కంపెనీ వివరాలు, వస్తువు కొన్న బిల్లు వారంటీ/గ్యారెంటీ కార్డు ఉంటే వాటిని సమర్పించాలి ● వస్తువులో ఉన్న లోపానికి సంబంధించిన ఫొటోలు లేదా ఆధారాలు, మీరు కంపెనీకి పంపిన ఈమెయిల్స్ లేదా నోటీసుల కాపీలు జతచేయాలి. ● మీకు ఏదైనా సందేహం ఉంటే ప్రభుత్వం ఏ ర్పాటు చేసిన హెల్ప్లైన్ నంబర్ 18001 14000 లేదా 1915, ఎస్ఎంఎస్: 88000 01915 నంబర్కు మెసేజ్ పంపి సాయం పొందవచ్చు. -
రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు
నవీపేట: మండలంలోని అబ్బాపూర్(ఎం) గ్రామ సమీపంలో బాసర రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలైనట్లు ఎస్సై శ్రీకాంత్ శుక్రవారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని మాలపల్లి సమీపంలో ఒక కారును మరో కారు ఢీకొనడంతో ఇరువురు పోటాపోటీగా రన్నింగ్లోనే వాదోపవాదాలకు దిగారని పేర్కొన్నారు. అబ్బాపూర్(ఎం) సమీపంలో వేగంగా ముందుకు వచ్చిన ఒకకారు మరోకారును అడ్డుకునేందుకు యత్నించగా రెట్టింపు వేగంతో ఢీకొందన్నారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు బోల్తాపడి ..సమీపంలోని పొలాల్లోకి దూసుకెళ్లాయన్నారు. బోల్తాపడిన కారు ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొనడంతో బైక్పై వస్తున్న ముగ్గురిని ఢీకొన్నదని అన్నారు. ప్రమాదంలో రెండు కార్లలో ప్రయాణిస్తున విజయ్, ధన్వీర్, బిట్టులతో పాటు బైక్పై వస్తున్న షేక్ సలీమ్, సల్మాబేగమ్, సోఫియా గాయపడ్డారని పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆఫర్ల పేరుతో నకిలీ లింక్లు..
● పండుగ పూట వాట్సాప్ గ్రూపుల్లో ఫేక్ లింక్లు ● ఓపెన్ చేసిన వెంటనే మరిన్ని గ్రూపుల్లోకి ఫార్వర్డ్డొంకేశ్వర్: ‘మొదట ఇది నకిలీ అనుకున్నాను కానీ నిజంగా నాకు రూ. ఐదు వేలు వచ్చాయి. మీరు కూ డా ట్రై చేయండి’ అంటూ ‘సంక్రాంతి ఆఫర్లు, గిఫ్ట్ లు’ పేరుతో ఫేక్ లింక్లు గత మూడు రోజులుగా వాట్సాప్, ఫేస్బుక్లలో వైరల్ అవుతున్నాయి. ఫో న్ పే, తదితర లోగోలతో ఉన్న లింకులు వాట్సాప్ గ్రూపుల్లోకి ఎక్కువగా వెళ్లడంతో చాలామంది మొబైల్ ఫోన్ యూజర్లు ఇది నిజమే కావొచ్చని నమ్మి లింక్ను ఓపెన్ చేస్తున్నారు. తద్వారా వారి నంబర్ల నుంచి ఇతర వాట్సాప్ గ్రూపుల్లోకి ఫార్వర్డ్ అవుతున్నాయి. ఫేక్ లింక్ను ఓపెన్ చేయడంతో వా రి వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తున్నా యి. బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు మాయమ య్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ కూడా అప్రమత్తమైంది. ఈ లింక్ ఎందుకు ప్రమాదకరం? ● లింక్ చివరలో xyz డొమెన్ ఉంటుంది. ● నమ్మదగిన బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు ఇలాంటి లింక్లు ఉపయోగించవు. ● లింక్ ఓపెన్ చేయగానే వివరాలు అడిగే అవకాశం ఉంది. ● మొబైల్ నంబర్, ఓటీపీ, యూపీఐ, బ్యాంకు వివరాలు తీసుకుని ఖాతా ఖాళీ చేసే ప్రమాదముంది. ● మొబైల్ హ్యాక్ కావడం, వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అవుతుంది. ● ఇప్పటికే లింక్ క్లిక్ చేసి ఉంటే బ్యాంక్ పాస్వర్ట్, యూపీఐ మార్చండి. ● బ్యాంకు కస్టమర్ కేర్కు సమాచారం ఇవ్వండి, 1930కు కాల్ చేయండి. డబ్బు సులభంగా వచ్చేస్తుందని చెప్పే ఆఫర్లను నమ్మొద్దు. మొబైల్ ఫోన్లలో వాట్సాప్, ఫేస్బుక్లలో వచ్చే లింక్లు, ఏపీకే ఫైల్స్ను తెరవకూడదు. వాటిని ఓపెన్ చేస్తే సైబర్ మోసాలకు గురవుతారు. డబ్బులు పోయే ప్రమాదముంది. ఇప్పటికే లింక్లు నొక్కిన వారు ఉంటే వెంటనే సైబర్ పోలీసులకు సమాచారం ఇవ్వాలి. – శ్యామ్రాజ్, ఎస్సై, నందిపేట్ -
చోరీ కేసుల్లో నిందితుడి రిమాండ్
డిచ్పల్లి: చోరీలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని పట్టుకొని రిమాండ్కు తరలించినట్లు డిచ్పల్లి సీఐ కే వినోద్, ఎస్సై మహమ్మద్ ఆరిఫ్ తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. డిచ్పల్లి మండలం మెంట్రాజ్పల్లి గ్రామంలో ఈ నెల 12న జరిగిన రెండు దొంగతనాలలో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురువారం ఉదయం డిచ్పల్లి మండలం ధర్మారం (బి) గ్రామంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపడుతుండగా జిల్లా కేంద్రానికి చెందిన బంగారు రాజు అనే వ్యక్తి అనుమానితుడిగా అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. దీంతో అతను గతంలో చేసిన దొంగతనాలను ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి మెంట్రాజ్పల్లిలో చోరీ చేసి 3.5 గ్రాముల బంగారం, 12 తులాల సిల్వర్ పట్టగొలుసులు, రూ.20 వేల నగదును పోలీసులు రికవరీ చేశారు. అలాగే బాన్సువాడలో చోరీ చేసి నడుపుతున్న బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ, ఎస్సై పేర్కొన్నారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. -
బాధ్యతలు స్వీకరించిన ఏపీపీలు
బోధన్: పట్టణ కేంద్రంలోని కోర్టులో ఇద్దరు ఏపీపీలు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బోధన్ మండలంలోని ఎరాజ్పల్లికి చెందిన న్యాయవాది బోధన్ కోర్టు ఐదవ అదనపు జిల్లా కోర్టు, సెషన్ కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా, పట్టణ కేంద్రానికి చెందిన సీనియర్ న్యాయవాది సీహెచ్వీ హనుమంతరావు అసిస్టెంట్ సెషన్ కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు చేపట్టిన ఏపీపీలను బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బీ రాములు, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
నిజామాబాద్ అర్బన్: నగరంలోని శివాజీనగర్లో ఉన్న ఐటీఐ కళాశాల ప్రాంగణంలో గంజాయి అ మ్ముతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు రెండో టౌన్ ఎస్సై సయ్యద్ముజాయిద్ తెలిపారు. షేక్అఫ్రోజ్ అనే వ్యక్తి గంజాయిని అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అతని వ ద్ద ఉన్న 210 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీ నం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయిని నాందేడ్ నుంచి జిల్లాకు తీసుకవచ్చి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఇతనిపై వివిధ పోలీస్స్టేషన్లలో 13 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. -
ఈ పంటకు..రైతు నిర్ణయించిందే ధర
మోర్తాడ్(బాల్కొండ): ప్రకృతి సాగును నమ్ముకున్న రైతులు.. వారు పండించిన పంటకు వారే ధరను నిర్ణయిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సాగులో ప్రకృతి సిద్ధంగా లభించిన ఎరువులను వాడి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పంటను విక్రయిస్తూ లాభా లు పొందుతున్నారు. మోర్తాడ్ మండలం శెట్పల్లికి చెందిన గంజాల అశోక్, మోర్తాడ్లోని కస్ప ల క్ష్మీనర్సయ్య ఏళ్లుగా ప్రకృతి పరంగానే పసుపును సాగు చేస్తున్నారు. అశోక్ రెండున్నర ఎకరాల్లో, లక్ష్మీనర్సయ్య ఒక ఎకరం విస్తీర్ణంలో పసుపును పండిస్తున్నారు. గోమూత్రం, గోపే డ, పల్లిపిండిలను వినియోగించి సాగు చేయడంతో శ్రమకు తగిన ఫలితం లభిస్తోంది. పంటలో గడ్డి పెరిగితే సాధారణంగా మందును స్ప్రే చేస్తారు. ఈ ఇద్దరు రైతులు మాత్రం కూలీలతోనే గడ్డిని కోయిస్తున్నారు. పసుపు దిగుబడి ఒక్కో ఎకరానికి 18 నుంచి 20 క్వింటాళ్ల వరకు లభిస్తోంది. గత సీజన్లో లక్ష్మీనర్సయ్య తన పసుపును క్వింటాలుకు రూ.18 వేల చొప్పున కర్ణాటక, హైదరాబాద్లలోని వ్యాపారులకు విక్ర యించాడు. అశోక్ మాత్రం పసుపు కొమ్ములను కాకుండా పొడిని పట్టించి సొంతంగానే మార్కెటింగ్ చేసుకున్నాడు. క్వింటాలు పసుపు పొడిని రూ. 25 వేలకు విక్రయించాడు. సాధారణ పసుపు పొడికి మార్కెట్లో క్వింటాలుకు రూ.13 వేల నుంచి రూ.15 వేల వరకు ధర పలుకుతుంది. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు ప్రభుత్వం సర్టిఫికెట్ జారీ చేయడంతో వీరి పసుపు పంట, పొడిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు, వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. పసుపు కొమ్ములు ఎంతో సంతోషంగా ఉంది.. భూసారాన్ని పరిరక్షించడంతోపాటు ప్రజలకు ఆరోగ్యం అందించే ప్రకృతి వ్యవసాయం చేస్తుండటం ఎంతో సంతోషంగా ఉంది. మేము పండించిన పసుపును మేము నిర్ణయించిన ధరకే విక్రయించడంతో ఆదాయం పెరిగింది. ఎంతో మంది పోటీపడి మా పసుపును కొనుగోలు చేస్తుండటం సంతృప్తినిచ్చింది. – గంజాల అశోక్, రైతు, శెట్పల్లి సాగు విస్తీర్ణం పెంచుతాం.. గతేడాది పసుపును ఇతర రైతుల కంటే ఎక్కువ ధరకు విక్రయించాం. పసుపు బోర్డు జాతీయ కార్యదర్శి భవానీ శ్రీ సహకారంతో క్వింటాలుకు రూ.18 వేల ధర లభించింది. ఇదే స్ఫూర్తి సాగు విస్తీర్ణం పెంచుతాం. – కస్ప లక్ష్మి నర్సయ్య, రైతు, మోర్తాడ్ ఆదాయం పెరుగుతుంది... సేంద్రియ పద్ధతిలో సాగు ప్రారంభించిన వీరికి మొదట్లో ఆశించిన దిగుబడి రాకపోయినా రానురాను పెరుగుతూ వచ్చింది. రసాయనాల వినియోగంతో సాగు చేసిన పసుపును విక్రయించే ఒక్కో రైతుకు రూ.2.34 లక్షల వరకు ఆదాయం లభిస్తే ప్రకృతి పరంగా సాగు చేసినందుకు రూ.3.24 లక్షల నుంచి రూ.4.40 లక్షల వరకు ఆదాయం లభించింది. ఈసారి తాను పండించిన పసుపును పొడిగా మార్చి విక్రయించడానికి ఒక్కో క్వింటాలుకు రూ.30 వేల ధరను రైతు అశోక్ నిర్ణయించడం విశేషం. పసుపు సాగులో పూర్వపు పద్ధతిని అనుసరిస్తున్న ఈ రైతుల బాటలో ఇతర రైతులు నడిస్తే ప్రకృతికి మేలు చేసినవారవుతారని పలువురు పేర్కొంటున్నారు. సేంద్రియ విధానంలో పసుపు సాగు పసుపు కొమ్ములు, పొడికి డిమాండ్ క్వింటాలుకు రూ.18 వేల నుంచి రూ.25 వేల వరకు ధర కొనుగోలుకు ముందుకొస్తున్న వ్యాపారులు లాభాలు సాధిస్తున్న కర్షకులు -
ఘనంగా సంక్రాంతి సంబురాలు
ఆర్మూర్లో పతంగులతో యువకులుకోటగల్లిలో పతంగులతో చిన్నారులునిజామాబాద్ రూరల్: జిల్లా వ్యాప్తంగా ప్రజలు సంక్రాంతి సంబురాలను గురువారం ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు ఇంటి ముంగిళ్లను రంగవల్లులతో అందంగా తీర్చిదిద్దారు. గొబ్బెమ్మలను పెట్టి పూజలు చేశారు. కొత్త బియ్యంతో పొంగలి చేసి దేవతలకు సమర్పించారు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే ఉత్తరాయణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం వేళలో యువతీయువకులు, చిన్నారులు ఒకరిని మించి ఒకరు ఇంటి డాబాలు, మైదానాలు, వీధుల్లో డీజే సౌండ్ల మధ్య ఉత్సాహంగా పతంగులు ఎగురవేశారు. రంగవల్లులతో ఆకట్టుకున్న మహిళలు పతంగులతో చిన్నారులు, యువత బిజీబిజీ ఆలయాల్లో ప్రత్యేక పూజలు -
తాగునీటి సమస్య తలెత్తొద్దు
● ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి ● అదనపు కలెక్టర్ అంకిత్ నిజామాబాద్ అర్బన్: వచ్చే వేసవి కాలంలో జిల్లా వ్యాప్తంగా ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శు క్రవారం మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవ రి 1వ తేదీలోపు అన్ని గ్రామాలలో మంచినీటి, పా రిశుద్ధ్య కమిటీలను ఏర్పాటు చేసుకొని నీటి సరఫరా తీరును నిశితంగా పరిశీలించాలన్నారు. ఫిబ్ర వరి 1 నుంచి 20వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. ఎంపీవో, మిషన్ భగీరథ ఏఈలు మండల స్థాయి బృందాలుగా ఏర్పడి అన్ని గ్రామాలలో సర్పంచ్, సెక్రెటరీలతో కలిసి వీధులలో పర్యటించి నీటి సమస్యలను గుర్తించి కార్యాచరణ ప్రణాలిక సిద్ధం చేయాలన్నారు. గ్రామాలలో నీటి సమస్య ఎదురైతే రాష్ట్రస్థాయి టోల్ ఫ్రీ నంబర్ 1916కు కాల్ చేసి అధికారుల దృష్టికి తీసుకురా వాలని ప్రజలకు సూచించారు. సమావేశంలో డీఎంహెచ్వో రాజశ్రీ, మిషన్ భగీరథ ఎస్ఈ రాజేందర్, ఈఈలు రాకేశ్, నరేశ్, స్వప్న, డీఎల్పీవోఎస్, డీఈఈఎస్, ఎంపీడీవో, ఎంపీవోలు పాల్గొన్నారు. -
ప్రభుత్వాస్పత్రులపై నమ్మకం పెంపొందించాలి
● కలెక్టర్ ఇలా త్రిపాఠి ● రెంజల్ పీహెచ్సీ ఆకస్మిక తనిఖీరెంజల్ (బోధన్): ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెంపొందించేలా మెరుగైన వైద్య సేవలందించి, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శుక్రవారం సాయంత్రం రెంజల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్, ఇన్పేషంట్, ల్యాబ్, ఫార్మసీ, ఇమ్యునైజేషన్ గ దులను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది హా జరు రిజిస్టర్ను తనిఖీ చేశారు. అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది వివరాలను ఆరా తీశారు. తనిఖీ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేషంట్ల వివరాలతో కూడిన రిజిస్టర్ను పరిశీలించి, వారికి అందించిన ఔషధాలను గమనించారు. ప్రతిరోజు ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగుల సంఖ్య, స్థానికంగానే కాన్పులు చేస్తున్నా రా? అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. డిస్పెన్సరీలో నిలువ ఉన్న ఔషధాల గడువు తేదీ, వాటి నాణ్యతను పరిశీలించారు. వైద్యు లు, సిబ్బంది అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలని ఆదేశించారు. -
రిజిస్ట్రేషన్ లేని డయాగ్నొస్టిక్ సెంటర్లు సీజ్
● అనుమతి లేకుండా చికిత్స అందిస్తే కఠిన చర్యలు ● డీఎంహెచ్వో రాజశ్రీసుభాష్నగర్: నగరంలో రిజిస్ట్రేషన్ లేకుండా డ యాగ్నొస్టిక్ సెంటర్లు నిర్వహిస్తున్న వారిపై శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి రాజ శ్రీ కొరఢా ఝుళిపించారు. వినాయక్నగర్లోని అపరాజిత డయాగ్నొస్టిక్ కేంద్రాన్ని ఆమెతోపాటు సీఈ ఏ బృందం ఆకస్మికంగా తనిఖీ చేసింది. అనుమతి లేకుండా నడుస్తున్న కేంద్రాన్ని ఆమె సీజ్ చేశారు. అందులోనే ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ను నడిపిస్తూ, అదే గదిలో అనుమతి లేని డయాగ్నొస్టిక్ కేంద్రం నడుపుతున్నట్లు ఫిర్యాదులు అందాయని ఆమె తెలిపారు. అర్హత లేని వ్యక్తి యాంటీబయాటిక్స్, ఐవీ ఫ్లుయిడ్స్ వ్యాధిగ్రస్తులకు అందిస్తున్నట్లు పూర్తి ఆధారాలతో పట్టుకున్నామన్నారు. అనుమతి లేకుండా, అర్హత లేని వ్యక్తులు అల్లోపతిక్ మందుల ద్వారా చికిత్స చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. దుబ్బ చౌరస్తాలోని నిత్య ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అర్హత లేని వ్యక్తి ఐవీ ద్వారా చికిత్స చేస్తున్న సమయంలో రెడ్హ్యాండెడ్గా పట్టుకుని సీజ్ చేశారు. ఆయన వద్ద ఉన్న మందులను గుర్తించారు. చికిత్స చేసే అర్హత లేని వారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్ర హం వ్యక్తంచేశారు. అనుమతి తీసుకున్న తర్వాతే ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ కేంద్రాలు నడిపించాలని, అనుమతి లేకుండా నడుస్తున్న మరికొన్ని కేంద్రాలను గుర్తించామని ఆమె తెలిపారు. తనిఖీల్లో వైద్యులు సుప్రియ, శిఖర, ప్రవీణ్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
డ్రోన్తో ఆట కట్టించారు
● కోడి పందేలపై పోలీసుల నిఘా వర్ని/రుద్రూర్: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిషేధిత కోడి పందేలను అరికట్టేందుకు పోలీసులు డ్రోన్ సహాయంతో నిఘా చేపట్టారు. వర్ని, చందూర్, మోస్రా, కోటగిరి, బోధన్ రూరల్, జైనాపూర్, హంగర్గ ఫారం, చేతనగర్, పోతంగల్, హంగర్గ, ఎత్తోండ, ఎక్లాస్పూర్ క్యాంపు తదితర ప్రాంతాల్లో కోడి పందేలు జోరుగా సాగుతాయన్న అనుమానంతో పోలీసులు గురు, శుక్రవారాల్లో డ్రోన్ కెమెరా ద్వారా పరిశీలించారు. దీంతో అప్రమత్తమైన పందెం రాయుళ్లు కోడి పందేలను విరమించుకున్నారు. అయితే, కోడి పందేలు జరిగే ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడి వర్ని మండలం నుంచి సుమారు 250 మంది సంక్రాంతికి రెండ్రోజుల ముందే తరలి వెళ్లినట్లు సమాచారం. పేకాట, కోడి పందేలు వంటి కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేసినట్లు ఎస్సై సునీల్ తెలిపారు. నేడు మహిళా రిజర్వేషన్ల ఖరారు ● జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి నిజామాబాద్ అర్బన్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని నిజామాబాద్ నగర పాలక సంస్థతోపాటు భీంగల్, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీల వార్డులకు శనివారం మహిళా రిజర్వేషన్లను ప్రకటించనున్నారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రిజర్వేషన్ల డ్రా నిర్వహిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. భీంగల్ మున్సిపాలిటీకి ఉదయం 10 గంటలకు, ఆర్మూర్కు 10.15 గంటలకు, బోధ న్కు 10.30 గంటలకు, నిజామాబాద్కు సంబంధించిన రిజర్వేషన్లపై 11 గంటలకు డ్రా ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. సమావేశానికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ కోరారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం సుభాష్నగర్: నగరంలోని న్యూ హౌసింగ్ బోర్డు సబ్స్టేషన్లో మరమ్మతుల నేపథ్యంలో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని టౌన్–2 ఏడీఈ ఆర్ ప్రసాద్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సబ్స్టేషన్ పరిధిలోని మారుతీనగర్, హౌసింగ్ బోర్డు, గంగస్థాన్, చంద్రశేఖర్ కాలనీ, బైపాస్ రోడ్డులో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు. వెబ్సైట్లో ఎంఎల్హెచ్పీ అభ్యర్థుల జాబితా సుభాష్నగర్: ఎంఎల్హెచ్పీ(మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్) ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు, జాబితా, ప్రొవిజనల్ జాబితా, రిజెక్ట్ అభ్యర్థుల జాబితాను నిజామాబాద్.తెలంగాణ.గౌట్.ఇన్లో పెట్టినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి రాజ శ్రీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబితాలో ఎవరికై నా అభ్యంతరాలుంటే ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. హెల్మెట్ ఉంటేనే కలెక్టరేట్లోకి ఎంట్రీ నిజామాబాద్ అర్బన్: కలెక్టరేట్ కార్యాలయంలోకి హెల్మెట్ ధరించిన వాహనదారులకే ప్రవేశం లభిస్తుందని నిజామాబాద్ ఏసీ పీ రాజావెంకట్రెడ్డి పేర్కొన్నారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ ప్రవేశమార్గం వద్ద అవగాహన క ల్పించారు. ఉద్యోగులతోపాటు బయట వ్య క్తులు సైతం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో కొంతమంది ఉద్యోగులు హెల్మెట్ ధరించకుండా రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డు భద్రత నియమాలను కచ్చితంగా పాటించాలన్నారు. కార్యక్రమంలో రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్, ఎస్సై షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. -
బీరులో మత్తు కలిపి..మాయం చేశారు
● బంగారం, నగదు చోరీ ● నిందితులను అరెస్టు చేసిన పోలీసులు నిజామాబాద్ అర్బన్: మత్తు పదార్థాలు ఇచ్చి చోరీకి పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు నాలుగో టౌన్ ఎస్హెచ్వో సతీశ్ తెలిపారు. గత డిసెంబర్ 17న వంశీ ఇంటర్నేషనల్ హోటల్లో శ్రీనివాస్ అనే వ్యక్తి తాగుతున్న బీరులో మత్తు గో లీలు కలిపి అతని వద్ద నుంచి రెండు బంగారు ఉంగరాలు, గోల్డ్ చైన్, కొంత నగదు దొంగిలించుకుపోయారు. ఈ మేరకు నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా నిందితులైన భారత ప్రసాదం, నర్సింగ్రావు, రుద్ర యాదవ్లను పోలీసులు పట్టుకొని విచారించారు. వీరు దొంగిలించిన సొమ్మును హైదరాబాద్లో శ్రీనివాస్గుప్త అనే వ్యాపారి వద్ద తాకట్టు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురూ కలిసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. బియ్యం వ్యాపారం గురించి మాయమాటలు చెప్పి మాట్లాడదామని బీర్లలో మత్తు పదార్థాలు కలిపి చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. సమావేశంలో ఎస్సై సందీప్, ఉదయ్ కుమార్, ఏఎస్ఐ రవీందర్, కానిస్టేబుల్ శేఖర్, రమేశ్, నాగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మద్యం మత్తులో యువకుని వీరంగం
మాచారెడ్డి: మద్యం మత్తులో ఓ యువకుడు దుస్తుల దుకాణంలో వీరంగం సృష్టించిన ఘటన మండలంలోని గజ్యానాయక్ తండాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రునాయక్ తండాకు చెందిన మధు బుధవారం గజ్యనాయక్ తండా చౌరస్తాలో ఉన్న బట్టల దుకాణంలో దుస్తులు కొనుగోలు చేశాడు. తాను కొనుగోలు చేసిన దుస్తులకు భారీ డిస్కౌంట్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీనికి షాపులో పనిచేస్తున్న గుమాస్తా కుదరదని చెప్పడంతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇరువురి మధ్య మాటామాట పెరుగడంతో మీ అంతు చూస్తానని బెదిరించి, తన సొంత లారీతో బట్టల దుకాణాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు మధును అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్ తెలిపారు. ఐదు ఇళ్లలో చోరీ పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలోని ముకుంద రెడ్డి కాలనీలో మంగళవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించి ఐదు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఎస్సై వెంకట్రావ్ తెలిపిన వివరాల ప్రకారం.. ముకుందరెడ్డి కాలనీలోని అల్లాపూర్ గ్రామానికి చెందిన కాసాల జనార్దన్ రెడ్డి ఇంట్లో కొంత నగదు, ఒక బంగారు చైన్, వెండి పూజ సామగ్రి అపహరణకు గురైందని, మిగతా ఇళ్లలో వస్తువులు చోరీకి గురికాలేదని తెలిపారు. బుధవారం చోరీ జరిగిన ప్రదేశాలను బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య సిబ్బందితో కలిసి పరిశీలించారు. క్లూస్ టీం వేలిముద్రల నమూనాలను సేకరించారు. సీసీ కెమెరా ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ తిరుపయ్య మాట్లాడుతూ పండుగకు వేరే ప్రాంతాలకు వెళ్లే వ్యక్తులు పోలీస్స్టేషన్లో సమాచారం ఇవ్వాలని పేర్కొన్నప్పటికీ, ఎవరూ సమాచారం ఇవ్వలేదని, సమాచారం ఇస్తే ఆ ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ ఉంచేవారమని పేర్కొన్నారు. పేకాడుతున్న ఏడుగురి అరెస్టు రుద్రూర్: కోటగిరి పోలీస్స్టేషన్ పరిధిలోని పోతంగల్ మండలం కల్లూర్ గ్రామ శివారులో మంగళవారం అర్ధరాత్రి పేకాడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై సునీల్ తెలిపారు. వారి నుంచి రూ.7,920 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మొరం టిప్పర్ల పట్టివేత బాన్సువాడ : అక్రమంగా మొరం తరలిస్తున్న నాలుగు టిప్పర్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. సింగీతం శివారు నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తరలిస్తున్న నాలుగు టిప్పర్లను ప ట్టుకుని సీజ్ చేశామని, డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నార. అను మతి లేకుండా మొరం తలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చోరీ కేసులో నిందితురాలి అరెస్ట్ నిజాంసాగర్ (జుక్కల్): మండలంలోని మల్లూరు గ్రామంలో ఈ నెల 9న జరిగిన చోరీ కేసులో నిందితురాలు సాయవ్వను బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. మల్లూరు గ్రామానికి చెందిన పెద్ద రెడ్డి విజయరావు ఇంట్లో బీరువా నుంచి వెండి ఆభరణాలతోపాటు బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. కేసు నమోదు చేసుకొని సాయవ్వపై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. -
చైనా మాంజా విక్రయించిన ముగ్గురిపై కేసు
ఆర్మూర్టౌన్: నిషేధిత చైనా మంజా విక్రయిస్తున్న ముగ్గురిని పట్టుకొని క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. పట్టణంలో బుధవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న నారాయణ, రవిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ. 18,500 విలువ గల చైనా మాంజాను స్వా ధీనం చేసుకున్నారు. నిజామాబాద్లో హోల్సేల్గా అమ్ముతున్న జహీర్ఖాన్ను సైతం అదుపులో తీసుకొని ముగ్గురిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్వో పేర్కొన్నారు. నిజామాబాద్లో ఒకరు... నిజామాబాద్ అర్బన్: చైనా మాంజా విక్రయిస్తున్న వారిని అరెస్టు చేసినట్లు రెండో టౌన్ ఎస్సై సయ్యద్ ముజాహిద్ తెలిపారు. నగరంలోని పోస్టు ఆఫీస్ వెనుక సుల్తాన్ కై ట్ షాపులో సయ్యద్ అస్లాం అనే వ్యక్తి 18 మాంజా చుట్లు విక్రయిస్తున్నారని తెలుసుకొని, అతనిని అరెస్టు చేశామన్నారు. సయ్యద్ అస్లాంతోపాటు దుకాణం యజమాని ఫహీం అన్సారీపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
వరద కాలువకు జలకళ
మోర్తాడ్(బాల్కొండ): వరద కాలువను ఆనుకుని ఉన్న భూములకు సాగునీరందించేందుకు ప్రభు త్వం చొరవ చూపింది. రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం నీటిని వరద కాలువలో నింపడంతో యాసంగి పంటలకు నీటి కొరత తీరనుంది. వరద కాలువ ద్వారా నీటి విడుదల లేకపోయినప్పటికీ నీటిని నిలువ ఉంచడం ద్వారా భూగర్భ జలాలు వృద్ధి చెందడం, కాలువను ఆనుకుని ఉన్న భూములకు సాగునీటి సౌకర్యం లభించేది. వర్షాకాలంలో గాండ్లపేట్ వద్ద వరద కాలువకు గండిపడటంతో నీరు లీకై కాలువ ఖాళీ అయ్యింది. వర్షాకాలం పంటలకు ఎలాంటి సమస్య లేకపోయినా యాసంగి పంటలకు మాత్రం వరద కాలువలో నీరు నిలువ లే కపోతే ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంటుందని రైతులు ఆందోళన చెందారు. మోర్తాడ్, తిమ్మాపూర్, పాలెం, గాండ్లపేట్, కమ్మర్పల్లి, ఉప్లూర్, నాగాపూర్ గ్రామాలకు చెందిన రైతులు సుమారు 2,600 ఎకరాలు వరద కాలువపైనే ఆధారపడి ఉన్నాయి. గండికి మరమ్మతులు పూర్తి చేసేందుకు మరింత సమయం ఉండటంతో గండి ఏర్పడిన ప్రాంతానికి దూరంలో నీటిని నిలువ ఉంచితే తమకు ఇబ్బందులు తప్పుతాయని రైతులు భావించారు. ఈ మేర కు ఏడు గ్రామాల రైతులు ఇటీవల బాల్కొండ ని యోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ముత్యాల సునీల్రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆయన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులతో మాట్లాడా రు. నీటి విడుదలకు ఆమోదం తెలుపడంతో రైతులకు నీటి చింత తీరింది. ఈనెల 8వ తేదీన నీటిని రివర్స్ పంప్ చేయగా మరుసటి రోజు వరకు వరద కాలువలో నీరు నిండింది. రెండు మీటర్ల లోతులో నీరు నిలువ ఉండటంతో యాసంగి పంటలకు ఎ లాంటి ఇబ్బంది ఉండదని రైతులు పేర్కొంటున్నా రు. కమ్మర్పల్లి మండలం నాగాపూర్ నుంచి మోర్తా డ్ మండలం గాండ్లపేట్ వరకు నీరు నిల్వ ఉంది. రాంపూర్ పంప్హౌజ్ వద్ద సాంకేతిక సమస్య కాళేశ్వరం నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా మోర్తాడ్ వరకు పంపించేందుకు నీటిపారుదల శాఖ మంత్రి, అధికార యంత్రాంగం అంగీకరించినా వరద కాలువ 70వ కిలోమీటర్ వద్ద ఉన్న రాంపూర్ పంప్హౌజ్లో సాంకేతిక సమస్య నెలకొంది. అక్కడి విద్యుత్ సబ్స్టేషన్ నుంచి దొంగలు విద్యుత్ తీగలను ఎత్తుకెళ్లారు. దీంతో నీటి విడుదలకు ప్రభుత్వం అంగీకరించినా సాంకేతికంగా సాధ్యపడలేదు. ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులతో మరోసారి సంప్రదింపులు జరపడంతో సబ్స్టేషన్ నుంచి పంప్హౌజ్కు విద్యుత్ సరఫరా ప్రారంభమైంది. దీంతో నీరు గాండ్లపేట్ వరకు చేరింది. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం వరద కాలువలోకి నీటిని విడుదల చేయాలని రైతులు కోరడం, ప్రభుత్వం స్పందించడంతో పెద్ద సమస్య తీరిపోయింది. గండిపడిన చోట మరమ్మతులకు కొంత సమయం ఉండటంతో కట్టలు కట్టిన వరకై నా నీటిని నిలువ ఉంచాలని కోరాం. ప్రభుత్వం స్పందించినందుకు రైతులు రుణపడి ఉంటారు. – రొక్కం మురళి, సీడ్ కార్పొరేషన్ డైరెక్టర్, తిమ్మాపూర్ రివర్స్ పంపింగ్తో కాలువలోకి చేరిన కాళేశ్వరం నీరు గాండ్లపేట్ శివారులోని కాలువలో గండి వద్ద మట్టికట్ట ఏర్పాటు నీటిని నిలువ ఉంచి యాసంగి పంటలను గట్టెక్కించేందుకు చొరవ -
బల్దియా పోరుకు మరో అడుగు
● సామాజికవర్గాల వారీగా రిజర్వ్ అయ్యే స్థానాల సంఖ్యపై స్పష్టతమోర్తాడ్(బాల్కొండ): మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో మరో అడుగు ముందు పడింది. జిల్లాలో ని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తోపా టు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల పరిధిలో ఏ సామాజికవర్గానికి ఎన్ని సీట్లు రిజర్వ్ అవుతాయనేదానిపై స్పష్టత వచ్చింది. ఈ మేర కు బుధవారం రాత్రి ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉండగా ఎస్టీ వర్గానికి ఒకే ఒక్క స్థానం.. 16 డివిజన్లు జనరల్ మహిళలకు రిజర్వ్ అయ్యాయి. బోధన్ మున్సిపాలిటీలో 38 వార్డులు, ఆర్మూర్లో 36, భీమ్గల్లో 12 వార్డు స్థానాలున్నాయి. -
దేశ సమైక్యత కోసం ఆర్ఎస్ఎస్ నిర్విరామ కృషి
● సమాజ పరివర్తన కోసం పాటుపడాలి ● విభాగ్ కార్యవాహ రాజుల్వర్ దిగంబర్ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వందేళ్లలో అనేక సామాజిక కార్యక్రమా లు నిర్వహించడంతోపాటు దేశ సమైక్యత కోసం నిర్విరామంగా కృషి చేసిందని విభాగ్ కార్యవహ రాజుల్వర్ దింగబర్ పేర్కొన్నారు. బుధవారం ఇందూరు నగరంలోని శ్రీరామ్ ఉపనగరంలో సంఘ శతాబ్ది సంక్రాంతి ఉత్సవం జనార్దన్ గార్డెన్లో నిర్వహించారు. ఈ ఉత్సవంలో ప్రధాన వక్తగా హాజరైన రాజుల్వర్ దిగంబర్ మాట్లాడారు. శతాబ్ది వేడుకల ద్వారా సంక్రాంతి పండుగ సమరసత సందేశాన్ని ప్రతి హిందువు కుటుంబానికి అందజేయాలని కోరారు. హిందూ సమాజంలో అంటరానితనం లేదన్నారు. శ్రీరాముడు గుహుడితో స్నేహం చేయడం, శబరి ఇచ్చిన ఎంగిలి పళ్లను తినడం, అరుంధతి నక్షత్రాన్ని చూపించడం లాంటి అంశాలు సనాతన జీవన విధానంలోని సమరసతకు నిదర్శనాలన్నారు. ప్రతి పౌరుడు పంచ పరివర్తన ద్వారా సమాజ పరివర్తన కోసం పాటు పడాలన్నా రు. కార్యక్రమంలో నగర కార్యవహ అరుగుల సత్యం, సహ కార్యవహ సుమిత్, అనిల్, అభిరామ్, శ్రవణ్, మృత్యుంజయ, నరేశ్ తదితరులు పాల్గొ న్నారు. -
‘సాగర్’కు చేరిన సింగూరు జలాలు
● ప్రధాన కాలువకు కొనసాగుతున్న నీటి విడుదలనిజాంసాగర్: సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా ఈనెల 10 నుంచి విడుదలవుతున్న నీరు బుధవారం నిజాంసాగర్ ప్రాజెక్టును చేరింది. ప్రాజెక్టులోకి 4,380 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. ఆయకట్టు అవసరాల కోసం ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు 700 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా బుధవారం సాయంత్రానికి 1,402 అడుగుల (14.830 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని తెలిపారు. కార్పొరేషన్లో అఖిలపక్ష సమావేశం ● ఓటరు జాబితాలో తప్పులున్నాయని అభ్యంతరాలునిజామాబాద్ రూరల్: మున్సిపల్ ఎన్నికల కసరత్తులో భాగంగా నగరంలోని మున్సిప ల్ కార్యాలయంలో కమిషనర్ఽ దిలీప్కుమార్ ఆధ్వర్యంలో బుధవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఆయా రాజకీయ పార్టీ ల నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఓటరు జాబితాలో తప్పులున్నా యని తాము కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా పరిశీలించి సాధ్యమైనంత వరకు సరి చే స్తామని కమిషనర్ అన్నారని నాయకులు తె లిపారు. తాము పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఓటరు జాబితాను సరిచేయాలని కోరామన్నారు. అలాగే పోలింగ్ కేంద్రాల సంఖ్య దాదాపు 50 వరకు పెరిగిందని తెలిపారు. ఆరోగ్య ఉపకేంద్రం తనిఖీవేల్పూర్: వేల్పూర్ మండలం జాన్కంపేట్ ఆరోగ్య ఉపకేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి రాజశ్రీ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరును పరిశీలించారు. ప్రతి బుధవారం జరిగే వ్యాధి నిరోధ టీకాల కార్యక్రమం వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాలిచ్చే తల్లులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్ఠికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గర్భిణుల మొదటి కాన్పు సాధారణ డెలివరీ అయ్యేలా చూడాలని చెప్పారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వెంట ఆరోగ్య కార్యకర్త కమల, ఆశావర్కర్ కళావతి ఉన్నారు. -
భూపతి రెడ్డికి కార్పొరేషన్ పదవి ?
● పదవులు దక్కని సీనియర్ల ఎదురుచూపులు ● మున్సిపల్ ఎన్నికల తర్వాత నియామకాలు చేయనున్నట్లు చర్చ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో నామినేటెడ్ పదవులను పూర్తిస్థాయిలో భర్తీ చేయ లేదు. దీంతో సీనియర్ నాయకులు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొందరు ఎమ్మెల్యేలకు సైతం కీలకమైన రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవు లు కేటాయించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డికి కీలకమైన రాష్ట్ర కార్పొరేషన్ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలో భూపతిరెడ్డి ఎమ్మెల్సీగా పనిచేశారు. కాగా ఇప్ప టి వరకు ప్రభుత్వ విప్ పదవిని ఆశిస్తూ వచ్చిన భూపతిరెడ్డికి తాజాగా కార్పొరేషన్ పదవి కేటాయించనున్నట్లు తెలియడంతో పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే జిల్లా నుంచి సుదర్శన్రెడ్డికి కీలక పదవి కేటాయించారు. భూపతిరెడ్డికి సైతం ప దవి దక్కితే పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ● జుక్కల్ ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించి భంగపడిన గడుగు గంగాధర్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. తనకు వ్యవసాయ కమిషన్ సభ్యుడిగా పదవి ఇవ్వడంపై గడుగు అసంతృప్తిగా ఉన్నారు. 1983 నుంచి ఆయన పార్టీకి సేవలందిస్తున్నారు. ● ఎనిమిది నెలల కిందట రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పదవులు దక్కని సీనియర్ల వివరాలు సేకరించారు. నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నవారు, డీసీసీ అధ్యక్ష పీఠం కోసం, బ్లాక్, మండల అధ్యక్ష పదవుల కోసం పోటీ పడుతున్న నాయకుల పేర్లను మీనాక్షి తీసుకున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ఎక్కువ అవకాశాలు కల్పించేందుకు గాను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కసరత్తు చేశారు. మీనాక్షి నటరాజన్ క్షేత్రస్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని పకడ్బందీగా చేసే లక్ష్యంతో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అయినప్పటికీ తమకు నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు కేటాయించడంలో ఆలస్యం చేస్తుండడంపై పార్టీలో నిరాశ వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోగా నామినేటెడ్, పార్టీ పదవుల కోసం సీనియర్ నాయకులు ఎదురు చూస్తున్నారు. తమకంటే జూనియర్లకు కీలకమైన పదవులు దక్కాయంటూ గుర్రుగా ఉన్నారు. మనస్తాపం చెందుతున్నారు. 1988 నుంచి పార్టీకి సేవలందిస్తున్న మార చంద్రమోహన్రెడ్డి తాజాగా డీసీసీ పీఠం ఆశించి విఫలమయ్యారు. చంద్రమోహన్రెడ్డి నామినేటెడ్ రేసులో ఉన్నారు. మరో సీనియర్ నాయకుడు బాడ్సి శేఖర్గౌడ్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి రేసులో ఉన్నారు. 1983 నుంచి శేఖర్గౌడ్ కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్నారు. శేఖర్గౌడ్కు రాష్ట్ర కార్పొరేషన్ పదవి వచ్చినట్లేనని అంటున్నప్పటికీ ఎప్పటికప్పుడు పెండింగ్ పడుతోంది. డీసీసీ పీఠం కోసం గట్టి ప్రయత్నాలు చేసిన బాస వేణుగోపాల్ యాదవ్ సైతం కీలకమైన పదవిని ఆశిస్తున్నారు. -
అవసరానికి సరిపడా యూరియా నిల్వలు
ఆర్మూర్ : జిల్లాలో అవసరానికి సరిపడా యూరి యా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందొద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఆర్మూర్ మండలం అంకాపూర్లోని సహకార సంఘం ఎరువుల గోదామును కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా త నిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్, ఈ పాస్ యంత్రం ద్వారా ఎరువుల అమ్మకాల వివరాలను పరిశీలించారు. ఎరువుల కోసం వచ్చిన రైతు లతో మాట్లాడారు. సరిపడా ఎరువులు అందుతున్నాయా అని ఆరా తీశారు. వచ్చే ఖరీఫ్ సీజన్ కు సైతం ఎరువుల కొరత ఉండబోదని అన్నారు. అన్ని ప్రాంతాల రైతులకు ఎరువులు అందేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామన్నారు. సహకార సంఘాలు లేని చోట రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీ చేసేలా చూడటంతోపాటు పంట సాగు చేస్తున్న ప్రతి రైతుకూ ఎరువులు అందేలా చూస్తా మని స్పష్టం చేశారు. అవసరానికి అనుగుణంగా దశల వారీగా ఎరువులు తీసుకోవాలని, మోతాదుకు మించి వాడొద్దని రైతులకు సూచించారు. నానో యూరియాపై అవగాహన పెంచుకోవాలి అంకాపూర్ గ్రామ శివారులో ఓ ఆదర్శ రైతు డ్రో న్ను వినియోగిస్తూ నానో యూరియాను పంటకు పిచికారీ చేస్తున్న విధానాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి రైతులతో కలిసి పరిశీలించారు. నానో యూరియా వినియోగంపై ఆసక్తి కలిగిన రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రైతులు సైతం అవగాహన పెంచుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్, జిల్లా వ్యవసాయ అధికారి వీరాస్వామి, జిల్లా సహకార అధికారి శ్రీనివాస్రావు, మండల వ్యవసాయ అధికారి హరికృష్ణ, అంకాపూర్ సర్పంచ్ దేవేందర్రెడ్డి, స్థానిక అధికారులు ఉన్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్కు స్థల పరిశీలన.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం కోసం ఆర్మూర్ మండ లం అంకాపూర్, పిప్రి శివార్లలో స్థలాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. ప్రతిపాదనలు పంపించాలని రె వెన్యూ అధికారులకు సూచించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి అనువైన పరి స్థితులు, అనుకూల వాతావరణం, రవాణా సదుపాయం, విద్యార్థులకు ఏ మేరకు భద్రత ఉంటుంది, నేల స్వభావం తదితర అంశాలను నిశితంగా పరిశీలించారు. వచ్చే ఖరీఫ్ సీజన్లోనూ కొరత ఉండదు రైతులకు ఎరువులు అందేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నాం సొసైటీలు లేనిచోట్ల రైతు వేదికల ద్వారా పంపిణీ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
నిజామాబాద్
ప్రభుత్వ ఆస్పత్రిలోనే.. గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రిలోనే కాన్పు చేయించుకునేలాచర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వో రాజశ్రీ అన్నారు. బుధవారం శ్రీ 14 శ్రీ జనవరి శ్రీ 2026.– 8లో u కష్టాలు, బాధలను వదిలి ఉత్తరాయణంలోకి.. ఇంటింటా సంక్రాంతి సందడి ఘుమఘుమలాడుతున్న పిండివంటలు హరివిల్లును తలపిస్తున్న వాకిళ్లు ఆకాశంలో పతంగుల సందడి -
పంచాయతీల్లో కార్మికుల కొరత
● తీవ్రమవుతున్న పారిశుద్ధ్య నిర్వహణ సమస్య ● రోజువారీ కూలీలతో పనులు చేయిస్తున్న సర్పంచ్లుమోర్తాడ్(బాల్కొండ): గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ సమస్య తీవ్రమైంది. జనాభా పెరుగుతున్నా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెరగకపోవడంతో గ్రామాల్లో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. పంచాయతీల్లో నిధుల కొరత ఉ న్నా రోజువారీ కూలీలను రప్పించి పారిశుద్ధ్య పను లు చేపట్టేందుకు సర్పంచ్లు నడుం బిగించారు. జిల్లాలో 545 గ్రామ పంచాయతీల్లో 3054 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో కారోబార్లు, బిల్కలెక్టర్లను మినహాయించగా 2,300ల మంది వరకు కా ర్మికులు ఉన్నారు. జనాభా ఎక్కువగా ఉండటంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారితే ఆ సమస్యను పరిష్కరించడానికి ఉన్న సిబ్బంది సరిపోవడం లేదు. మేజర్ పంచాయతీలలో కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్, ఇదే మండలంలోని చేపూర్ల నుంచి అద్దె కూలీలను రప్పిస్తున్నారు. ఒక్కోక్కరికి రోజుకు రూ.500 కూలి చెల్లించి రవాణా చార్జీలను పంచాయతీలే భరిస్తున్నాయి. సమస్య తీవ్రతను బట్టి ఒక్కో రోజు 10 మంది నుంచి 20 మంది కూలీలను రప్పిస్తున్నారు. రోజుకు రూ.6వేల నుంచి రూ.12 వేల వరకూ ఖర్చు చేస్తూ అద్దె కూలీలతో పరిసరాలను పరిశుభ్రంగా మారుస్తున్నారు. కొత్తగా ఎంపికైన సర్పంచ్లకు పారిశుద్ధ్య సమస్యనే ప్రధానం కావడంతో ఖర్చుకు వెనుకాడకుండా రోజువారీ కూలీలతో పనులు కానిస్తున్నారు. నిధులు లేకపోవడంతో సొంతంగా డబ్బులు చెల్లించి ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఎంబీలను రికార్డు చేయించి ఉంచుతున్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వగానే పారిశుద్ధ్య సమస్య పరిష్కారం కోసం తాము చేసిన ఖర్చులకు బిల్లులు పొందాలని సర్పంచ్లు భావిస్తున్నారు. ప్రజారోగ్యం కోసం ఖర్చు చేస్తున్నాం ప్రజారోగ్యం ముఖ్యం కావడంతో పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించడం కోసం ఖర్చు చేయక తప్పడం లేదు. పరిసరాలు బాగుంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. రోజువారీ కూలీలతో మురికి కాలువలను శుభ్రం చేయించడానికి బాగానే ఖర్చు అవుతుంది. – కొలిప్యాక ఉపేంద్ర, సర్పంచ్, ఏర్గట్ల -
శుభకాల భోగి
వర్ని: దక్షిణాయణంలోని ప్రతికూలతలను వదిలి ఉత్తరాయణంలోకి పయనించే శుభకాలానికి సంకేతం భోగి. సంక్రాంతి సంబురాల్లో భాగంగా నేడు భోగి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లావాసులు సిద్ధమయ్యారు. రంగురంగుల ముగ్గులతో వాకిళ్లు హరివిల్లును తలపిస్తున్నాయి. ఆకాశంలో ఎగురుతున్న పతంగులు నూతనోత్సాహాన్ని నింపుతున్నాయి. ప్రతి ఇల్లూ పిండి వంటలతో ఘుమఘుమలాడుతోంది. మహిళలు వారం రో జుల ముందు నుంచే పిండి వంటలు తయారు చే స్తున్నారు. విదేశాలతోపాటు ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు సొంతూళ్లకు చేరి సందడి చేస్తున్నా రు. బంధువులు, చిన్ననాటి స్నేహితులను కలిసి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. సంక్రాంతి సంబురాల్లో భాగంగా జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఆటల పోటీలు నిర్వహిస్తున్నా రు. యువత క్రికెట్ టోర్నీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. పిల్లలు, పెద్దలు పతంగులను ఎగురవేస్తూ ఉత్సాహంగా గడుపుతున్నారు. ఏ ఇంటికి వెళ్లినా రకరకా ల ముగ్గులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది మహిళలు, యువతులు రంగులు కొను గోలు చేసి పండగపూట వాకిళ్లను అందమైన ముగ్గులతో నింపడానికి సిద్ధంగా ఉన్నారు. చిన్నారులకు ఆయు రారోగ్యాలు, ధనధాన్యాలు, కీర్తిప్రతిష్టలతో వెలు గొందాలని ఆకాంక్షిస్తూ భోగి పండ్లు పోయనున్నా రు. సుహాసినులు నోములు నోచుకోనున్నారు.శ్రీనగర్లో పిండి వంటలు చేస్తున్న మహిళలు -
అధికార పార్టీ అత్యుత్సాహం
● రిజర్వేషన్లకు ముందే ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ● సర్వే నిర్వహించి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామంటున్న అధినాయకత్వం ఆర్మూర్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ కాంగ్రెస్ టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య రో జు రోజుకీ పెరుగుతోంది. అయితే రిజర్వేషన్లు ఖ రా రు కాకముందే ఆశావహుల నుంచి ఆ పార్టీ దర ఖాస్తులు తీసుకుంటోంది. రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేయనున్నారు. రిజర్వేషన్లు 50 శాతానికే పరిమితం కాగా కార్పొరేటర్, కౌన్సిలర్ సీట్లను బీ సీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీలకు దామాషా పద్ధతిలో కేటాయించనున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్తోపా టు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీల్లో సామాజిక వర్గాల వారీగా ఓటర్ల తుది జాబితాను సిద్ధం చేసిన తరువాత రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో వారు ఏ వార్డు నుంచి పోటీ చేయాలనుకుంటున్నారో పేర్కొంటూ పార్టీ జిల్లా నాయకత్వానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సర్వే నిర్వహించి గెలుపు గుర్రాలకు టికెట్లు కేటాయిస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ రిజర్వేషన్లు ఖరారు కాకముందే పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం, వాటిని స్వీకరించండం చర్చనీయాంశమైంది. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు సుమారు 300 మంది ఆశావహులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. ఆర్మూర్లో36 వార్డులకు 140 మంది, భీమ్గల్లో 12 వార్డులకు సుమారు 40 మంది దర ఖాస్తు చేసుకున్నట్లు ఆయా పట్టణాల పార్టీ అధ్యక్షులు తెలిపారు. ఈ సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. బోధన్ మున్సిపాలిటీ పరిధిలో మాత్రం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాలేదు. -
జిల్లా ప్రజలకు కలెక్టర్ సంక్రాంతి శుభాకాంక్షలు
నిజామాబాద్ అర్బన్: జిల్లా ప్రజలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగభాగ్యాలనిచ్చే భోగి, సరదాలు పంచే సంక్రాంతి వేడుక ప్రజలందరికీ ఆనందం పంచాలని ఆకాంక్షించారు. అనుకున్న కార్యాలన్నీ నెరవేరాలని, ఏడాది పొడుగునా ఇంటింటా సిరుల కాంతులు విలసిల్లాలని ఆకాంక్షించారు. ఎలక్షన్ కోడ్ కచ్చితంగా అమలు చేయాలి నిజామాబాద్ అర్బన్: ఎన్నికల విధుల్లో పా ల్గొనే ప్రతి అధికారి, సిబ్బంది కోడ్ను కచ్చితంగా అమలు చేయాలని సీపీ సాయిచైతన్య అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఎన్ని కల నేపథ్యంలో వివాదాస్పద ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి అధికారి తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించాలన్నా రు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా.. శాఖ ప్రతిష్ఠను మరింత పెంచేలా అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు. అదనపు డీసీ పీ బస్వారెడ్డి, ఆర్మూర్, నిజామాబాద్, బో ధన్ ట్రాఫిక్ ఏసీపీలు రాజావెంకటరెడ్డి, శ్రీనివాస్, వెంకటేశ్వరరెడ్డి, మస్తాన్ అలీ తదితరులు పాల్గొన్నారు. సమన్వయంతో పని చేయాలి నిజామాబాద్ రూరల్: జిల్లా అభివృద్ధి కోసం అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ఇలా త్రిపాఠిని ఆయన మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. జిల్లాకు 22 మంది ల్యాబ్ టెక్నీషియన్లు బోధన్: ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్లో మంగళవారం నియమాకపత్రాలు అందించారు. ఇందులో జిల్లాకు చెందిన 22 మంది నియామక పత్రాలు అందుకున్నారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగాల్లో వీరు విధులు నిర్వహించనున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ల నియామకాలతో ప్రభుత్వాస్పత్రుల్లో రోగ నిర్ధారణ పరీక్షల సేవలు మరింత వేగవంతం అవుతాయని సంబంధిత శాఖ అధికా రుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతి రైతూ ఎఫ్పీవోలో సభ్యుడిగా చేరాలి ఇందల్వాయి: ఫార్మర్ ప్రొడ్యుసర్ ఆర్గనైజేష న్(ఎఫ్పీవో)లో ప్రతి రైతూ సభ్యుడిగా చే రాలని జిల్లా సహకార అధికారి శ్రీనివాస్రా వు అన్నారు. మండలంలోని నల్లవెల్లిలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో డీసీవో అవగాహన కల్పించారు. జిల్లాలో 89 సహకార సంఘాలు ఉండగా.. ఉత్తమ పనితీరు కలిగిన 12 సంఘా ల ను ఎఫ్పీవోలకు ఎంపిక చేసినట్లు తెలిపా రు. కనీసం 15 లక్షల మూలధనం కలిగి ఉంటే దానికి మరో 15 లక్షల మ్యాచింగ్ గ్రాంట్ ని కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందని, దాని ద్వారా ఎఫ్పీవోలు సొంతంగా వ్యాపారాలు చేసుకోవచ్చన్నారు. సీఈవో తేజాగౌడ్, ప్రత్యేక అధికారి సత్యనారాయణ, ఏఎంసీ డైరెక్టర్ ధన్ల రాజు, మాజీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి క్యాషియర్ రాజన్న, రైతులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్పై అభిమానం
● ఉప్లూర్లో ఫ్లెక్సీల ఏర్పాటు కమ్మర్పల్లి: వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అ భిమానంతో సంక్రాంతి పండగ నేపథ్యంలో శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మండలంలోని ఉప్లూర్లో వైఎస్ జగన్ అభిమాని ఈర్నాల మారుతి, మరో 40 మంది యువకులు కలిసి మంగళవారం గ్రామంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నారు. గ్రామ స్తులకు భోగి, సంక్రాంతి, మహా శివరాత్రి పండగ శుభాకాంక్షలు తెలుపుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, వైఎస్ జగన్, ఆయన సతీ మణి భారతి చిత్రాలతో గ్రామ స్వాగతతోరణం నుంచి శివారు వరకు కూడళ్లు, వీధుల్లో 150 పైగా చిన్న ఫ్లెక్సీలు, 6 పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జగన్ బర్త్డేను యువకులు డిసెంబర్లో ఘనంగా నిర్వహించారు. 10 కిలోల కేక్ కట్ చేశారు. గ్రామ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వైస్ రాజశేఖర్రెడ్డి, జగన్ చిరత్రాలతో ఫ్లెక్సీ.. -
కుటుంబ భద్రతకు భరోసా ఇవ్వాలి
నిజామాబాద్ అర్బన్: వాహనాలు నడుపుతున్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తమ కుటుంబాల భద్రతకు భరోసాగా ఉండాలని సీపీ సాయిచైతన్య సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసు శాఖ చేపట్టిన ‘అరైవ్ –అలైవ్’ కార్యక్రమాన్ని ప్రారంభించిందని సీపీ మంగళవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ కారణంగా మర ణించిన వారి కన్నా రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. రెండేళ్లలో కరోనాతో 200 మంది చనిపోగా, 2025లో రోడ్డు ప్రమాదాల్లో 250 మంది చనిపోయారన్నారు. వాహనాలు నడుపుతున్న సమయంలో సీట్ బెల్ట్లు, హెల్మెట్లు పెట్టుకోకుండా నిర్లక్ష్యం కారణంగా చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ట్రా ఫిక్ నిబంధనలను పాటించాలని అన్నారు. అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు అర్జున అవార్డు గ్రహీత హుస్సాముద్దీన్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో తమ కుటుంబంలోని ఒకరిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించి టీషర్ట్స్, ట్రాఫిక్ నిబంధనల స్లోగన్స్తో రూపొందించిన ప్లకార్డులను ఆవిష్కరించారు. విష్ణు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సౌజన్యంతో వాహనదారులకు 100 హె ల్మెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర్, ఆర్టీసీ డిపో మేనేజర్లు, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ విశాల్, నిజామాబాద్ ఏసీపీ రాజావెంకటరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, అంబులెన్స్, ఆటో, క్యాబ్ డ్రైవర్ల అసోసియేషన్ల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కన్నా రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ సంఖ్యలో మరణించారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి : సీపీ సాయిచైతన్య -
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
డిచ్పల్లి: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని పోలీసులు అన్నారు. అరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత నిబంధనలపై పోలీసులు రూరల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్పల్లి గ్రామంలో అరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులకు రోడ్డు భద్రత నియమాలపై డిచ్పల్లి సీఐ కే వినోద్, ఎస్సై మహమ్మద్ ఆరిఫ్ అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపేవారు సీట్ బెల్ట్ ఉపయోగించాలని సూచించారు. మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరమని తెలిపారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, విద్యార్థులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సిరికొండలో.. సిరికొండ: యువత క్రీడలకు దగ్గరగా, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ధర్పల్లి సీఐ భిక్షపతి సూచించారు. మండలంలోని దుప్య తండాలో ‘గంజాయి వద్దు–గ్రౌండ్ ముద్దు’ అనే అవగాహన కార్యక్రమంలో భాగంగా కబడ్డీ టోర్నమెంట్ను ఏర్పాటు చేశారు. అలాగే గ్రామస్తులకు రోడ్డు భద్రత అంశంపై ‘అరైవ్–అలైవ్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు భద్రత నియమాల గురించి అవగాహన కల్పించారు. ఎస్సై జే రామకృష్ణ, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు చందర్నాయక్, పందిమడుగు సర్పంచ్ గోవింద్ నాయక్, గంగనర్సయ్య తదితరులు పాల్గొన్నారు. నర్సింగ్పల్లిలో.. నిజామాబాద్ రూరల్: మోపాల్ మండలం నర్సింగ్పల్లి గ్రామంలో పోలీస్శాఖ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. కార్యక్రమానికి ఏసీపీ రాజావెంకట్రెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు. యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని అన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. అనంతరం నిర్వహించిన పోటల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. సీఐ సురేశ్కుమార్, ఎస్త్సై, గ్రామస్తులు, పాల్గొన్నారు. రూరల్ మండలంలోని గుపన్పల్లిలో రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్ ప్రజలకు రోడ్డు భద్రతనియమాల గురించి వివరించారు. గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు. ధర్పల్లిలో.. ధర్పల్లి: మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ధర్పల్లి ఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ.. వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. అనంతరం రోడ్డు భద్రతపై ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆర్మూర్ బాలరాజ్, ఉప సర్పంచ్ శ్రీకాంత్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
గృహజ్యోతితో విద్యుత్ బిల్లుల నుంచి ఊరట
సిరికొండ: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన గృహజ్యోతి పథకం ద్వారా సామాన్యులకు విద్యుత్ బిల్లుల భారం నుంచి ఎంతో ఊరట లభిస్తోందని సర్పంచ్ పిట్ల వనితనర్సింగ్ అన్నారు. సిరికొండ మండలం పెద్దవాల్గోట్ గ్రామంలో ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క జారీ చేసిన గృహజ్యోతి ఉచిత విద్యుత్ కరపత్రాలను సర్పంచ్ మంగళవారం ఆవిష్కరించారు. ప్రభుత్వం రాయితీ ఇస్తున్న విద్యుత్ బిల్లు డబ్బులను వినియోగదారులు తమ పిల్లల చదువులు, ఆరోగ్యం, కుటుంబ అవసరాలకు వినియోగించుకోవాలన్నారు. ఉపసర్పంచ్ తలకట్ల రాంరెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు నర్సింగ్, కిసాన్ ఖేత్ మండల అధ్యక్షుడు గాదారి నర్సారెడ్డి, సురేందర్రెడ్డి, ఏఈ చంద్రశేఖర్, లైన్ ఇన్స్పెక్టర్ బాలచంద్రం, గ్రామస్తులు పాల్గొన్నారు. -
పరిసరాలను శుభ్రంగా ఉంచాలి
సిరికొండ: ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ మాలావత్ చందర్నాయక్ తెలిపారు. సర్పల్లి తండా గ్రామ పంచాయతీ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, గ్రామస్తులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. చెత్తా చెదా రాన్ని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెత్త ట్రాక్టర్లో వేయాలన్నారు. మురుగు నీరు నిలు వ ఉండకుండా, దోమలు వ్యాపించకుండా తగి న చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామా భివృద్ధికి ప్రజలు తగిన సహకారం అందించాలని కోరారు. ఉపసర్పంచ్ పిట్ల కళ్యాణ్, పంచాయతీ కార్యదర్శి రాజు, కారొబార్ శ్రీనివాస్, వైద్య శాఖ సిబ్బంది సుసన్న, విజయ, స్వప్న, ఆశ కార్యకర్త సుజాత తదితరులు పాల్గొన్నారు. ధర్పల్లి: మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన కురుమ బీరయ్యకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును బీజేపీ నాయకులు మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, నాయకులు కర్క గంగారెడ్డి, నరేశ్ గౌడ్, సదానంద్, మంద నర్సయ్య, రాజశేఖర్, మంద శ్రీకాంత్, నితిన్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్: సీపీఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంథా పార్టీ నాయకురాలు అనసూయ రెండో వర్ధంతిని మంగళవారం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆమె చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ.. జీవితాంతం పార్టీనీ కుటుంబంగా భావించి, పార్టీ పద్ధ తిలోనే జీవించారని కొనియాడారు. పార్టీ నగర కార్యదర్శి ఎం సుధాకర్, నాయకులు ఎం నరేందర్, ఎం వెంకన్న, డీ రాజేశ్వర్, ఏ రవీందర్, వీ గోదావరి, కే సంధ్యారాణి, కే భాస్కరస్వామి, రాధ, మేఘన, వర్ష, కే గణేశ్, డీ నవీన్, ఎం సాయిబాబా, సాయారెడ్డి, సునంద, నర్సక్క, నితిన్, లలిత పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్: హిందువులపై వివక్ష చూపకుడదని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు దినేశ్ ఠాకుర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెలలో ఢిల్లీలో నిర్వహించిన సమావేశాల్లో పరిషత్ పెద్దలు చేసిన తీర్మానాలను ఇందూర్ శాఖ పూర్తిగా మద్దతు తెలుపుతుందని అన్నారు. ఇందూర్ విభాగ్ కార్యదర్శి తమ్మల కృష్ణ, గాజులదయానంద్, దాత్రిక రమేశ్, రెబ్బ ఆనంద్, నాంపల్లి శేఖర్, రాంప్రసాద్ చటర్జీ, బాసొల్లా నీకేశ్, ఘన్ శ్యాం, గణేశ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాయన్న పోరాట స్ఫూర్తితో రైతు ఉద్యమాలు డిచ్పల్లి(మోపాల్)/ నిజామాబాద్ రూరల్: రైతాంగ పోరాట యోధుడు శావులం సాయన్న పోరాట స్ఫూర్తితో రైతు ఉద్యమాలను నిర్వహిస్తామని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య అన్నారు. మంగళవారం మోపాల్ మండల కేంద్రంలో సాయన్న వర్ధంతి నిర్వహించారు. వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ.. 1996న ఆనాటి పీపుల్స్ వార్ అరాచక శక్తులు చేసిన దాడిలో సాయన్న అమరుడయ్యాడని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు అగ్గు ఎర్రన్న, సహాయ కార్యదర్శి చిన్నయ్య, న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి బండమీద నర్సయ్య, రమేశ్, సాయిలు, భుజేందర్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం రైతాంగ పోరాట నాయకుడు శావులం సాయన్న వర్ధంతి సభను నగర కార్యదర్శి నీలం సాయిబాబా అధ్యక్షతన నిర్వహించారు. సభలో నాయకులు ఎం శివకుమార్, జీ రమేశ్, తంపె రాజు, మోహన్, గోపాల్ మల్లికార్జున్, రైస్, వకీల్, శంకర్, అన్వర్, రాజు, సంజు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
వాహనం ఢీకొని నీల్ గాయ్ మృతి
నిజామాబాద్ అర్బన్: గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ఘటనలో నీల్ గాయ్(బ్లూ కౌ) మృతి చెందిన ఘటన ఎడపల్లి మండలం జాన్కంపేట్ శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. జానకంపేట్ శివారులోని గుట్ట ప్రాంతంలో రోడ్డు దాటుతున్న ఓ బ్లూ కౌను గుర్తు తెలియని వాహనం ఢీ కొన్నది. దీంతో తీవ్ర గాయాలపాలైన నీల్ గాయ్ పంట పొలాల్లో పడి మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎడపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అటవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు పంట పొలాల్లో నుంచి మృతిచెందింది నీల్గాయ్(బ్లూ కౌ) అని గుర్తించారు. ఓ వింత జంతువు మృతి చెందిందని సమాచారం అందడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి తరలివచ్చారు. -
ఓటరు జాబితాలో అన్నీ తప్పులే..
నిజామాబాద్ రూరల్: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మేయర్ పీఠాన్ని కై వసం చేసుకుంటుందనే భయంతోనే పాలకపక్షం ఓటర్ల జాబితాను తారుమారు చేసిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. మంగళవారం ఆయన మున్సిపల్ కార్యాలయంలో ఓటర్ల జాబితాపై కమిషనర్ దిలీప్ కుమార్తో భేటీ అయ్యారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న అక్రమాలు, పొరపాట్లపై చర్చించి, అభ్యంతరాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఒక వార్డులోని ఓటర్లను కావాలనే మరో వార్డులోకి మార్చారని, అర్హులైన వేలాది మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు. స్థానిక అధికార ప్రతినిధి కనుసైగల్లోనే అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ ముసాయిదాను తప్పుల తడకగా తయారు చేయించారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని సర్వేలు చెబుతుండటంతో, ఓటమి భయంతోనే అధికార పార్టీ అడ్డదారులు తొక్కుతోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగకుండా అధికారులు వారికి తొత్తులుగా మారడం సరికాదని అన్నారు. క్షేత్రస్థాయిలో మరోసారి విచారణ చేపట్టి తప్పులను సరిదిద్దాలని, వార్డుల వారీగా ఓటర్ల విభజన శాసీ్త్రయంగా ఉండాలన్నారు. ఓటర్ల జాబితాను సరిదిద్దకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. పాలకపక్షం ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గారు మేయర్ పీఠం కోసమే ఓట్ల గందరగోళం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ -
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి
నిజామాబాద్ అర్బన్: పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షుడు సుమన్ మంగళవారం కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారాని కి కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఎన్జీవోఎస్ జిల్లా కార్యదర్శి శేఖర్, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు ఉన్నారు. కాల్యెండర్ ఆవిష్కరణ నిజామాబాద్ రూరల్: విశ్రాంత ఉద్యోగుల సంఘం సభ్యులు రూపొందించిన నూతన క్యాలెండర్, డై రీని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. అలాగే డీఈవో అశోక్కుమార్ను సంఘ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి డైరీ, క్యాలెండర్ను అందజేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు పండరినాథ్, కార్యదర్శి గంగా కిషన్, రవీందర్రెడ్డి, రాజ్యలక్ష్మి, భోజాగౌడ్, రంగ ప్రకాశ్, మోహన్, దయాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. పేకాట స్థావరంపై దాడి నిజామాబాద్రూరల్: మోపాల్ మండలంలోని చిన్నాపూర్లో పేకాట స్థావరంపై దాడి చేసినట్లు ఎస్సై సుస్మిత మంగళవారం తెలిపారు.ఈ దాడిలో నలుగురిని అదుపులోకి తీసుకోగా వారి నుంచి రూ. 17,100 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.మృతదేహాన్ని ఇంటికి రప్పించడానికి ఆర్థికసాయం నవీపేట/ నిజామాబాద్రూరల్: నవీపేట మండలంలోని యంచ గ్రామానికి చెందిన గొల్ల అబ్బులు ఒమన్ దేశంలో నెల రోజుల క్రితం మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు కుటుంబ సభ్యుల దగ్గర డబ్బులు లేకపోవడంతో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డిని మంగళవారం సాయంత్రం హైదరాబాద్లో కలిశారు. స్పందించిన ఆయన రూ.1.5 లక్షలను మృతుడి భార్య సావిత్రి, కుమారుడు సంజయ్కు అందజేశారు. తక్షణమే మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో గల్ఫ్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ భీమారెడ్డి, యంచ సర్పంచ్ బేగరి సాయిలు, గ్రామస్తులు ఉన్నారు. -
మానవతా సదన్లో సంక్రాంతి వేడుకలు
డిచ్పల్లి: మండల కేంద్రంలోని మానవతా సదన్లో మంగళవారం రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ అధ్యక్షుడు శ్యాంసుందర్ అగర్వాల్ మాట్లాడుతూ.. ప్రతి ఏటా సదన్ పిల్లలతో సంక్రాంతి వేడుకలను జరుపుకోవడం ఆనందంగా ఉంటుందని అన్నారు. పిల్లలకు పతంగులు, మిఠాయిలను రోటరీ సీనియర్ సభ్యుడు గోపాల్ సోనీ ఆధ్వర్యంలో అందజేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి గోవింద్ జవహార్, సభ్యులు ఆకుల అశోక్, రాజ్ కుమార్ సుబేదార్, గోపాల్ సోనీ, శ్రీనివాసరావు, సతీశ్ షాహ, విజయరావు, మురళి, బాబురావు, సదన్ కేర్ టేకర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మానవతా సదన్లో శ్రీకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిల్లల కోసం ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. సదన్ పిల్లలకు పిండి, తీపి పదార్థాలు, అరటి పండ్లను పంపిణీ చేశారు. అలాగే ఆడ పిల్లల్లో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పిల్లలు డప్పు వాయిద్యాలు మోగిస్తూ, కోలాటాలు ఆడుతూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సదన్ పిల్లలకు పండుగ ఆనందాన్ని పంచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
ఇచ్చిన హామీలను అమలు చేయాలి
నిజామాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పదివేల రూపాయలు వేతనం ఇస్తామని, ప్రతి నెలా బిల్లులు, వేతనాలు చెల్లిస్తామని, కార్మికులుగా గుర్తిస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం ఆ పథకాన్ని హరే రామ హరే కష్ణా అనే అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థకు అప్పజెప్పడం సరైంది కాదన్నారు. దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కొడంగల్లో ప్రారంభించిన ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా రెండు నియోజకవర్గాలకు ఒక సెంటర్ పాయింట్ పెట్టి అక్కడ వంటలు చేయించి ప్రతి పాఠశాలకు భోజనాన్ని సరఫరా చేయడమంటే నాణ్యత లేనటువంటి భోజనం పెట్టడమే అని అన్నారు. ప్రభుత్వం పునరాలోచించి ఈ కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి టీ చక్రపాణి గౌరవ అధ్యక్షురాలు సాయమ్మ, లలిత, అనసూయ తదితరులు పాల్గొన్నారు. -
భవిత సెంటర్లను అందుబాటులోకి తేవాలి
● నిర్మాణాలు, మరమ్మతులను వేగంగా పూర్తి చేయాలి ● అధికారులతో కలెక్టర్ ఇలా త్రిపాఠిసమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి, పాల్గొన్న అధికారులు నిజామాబాద్ అర్బన్: ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఉద్ధేశించిన భవిత సెంటర్ల నిర్మాణ పనులు, మరమ్మతులను వేగంగా పూర్తి చేయించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి జిల్లాలోని మొత్తం 29 కేంద్రాలు అందుబాటులోకి వచ్చేలా కృషి చేయాల న్నారు. మండల ప్రత్యేకాధికారులు, ఎంఈవోలతో కలెక్టర్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవా రం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు, భవిత కేంద్రాలు, కస్తుర్బాగాంధీ విద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో 29 కేంద్రాలకు గాను నూతనంగా చేపట్టిన నిర్మాణాలతోపాటు పాత భవనాల మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేయించాలని కలెక్టర్ సూచించారు. అలాగే ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలకు అర్హులైన విద్యార్థుల వివరాల ను ఆన్లైన్లో నమోదు చేయించాలన్నారు. మండల ప్రత్యేకాధికారులు బాధ్యతాయుతంగా విధు లు నిర్వర్తించాలని, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కా ర్యక్రమాలు సమర్థవంతంగా అమలయ్యేలా పర్యవేక్షించాలన్నారు. భవిత కేంద్రాలతో పాటు కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, సంక్షేమ వసతి గ హాలు, పాఠశాలలు, వైద్యరోగ్య కేంద్రాలు తదితర వాటిని క్రమం తప్పకుండా సందర్శిస్తూ పనితీరును పరిశీలించాలన్నారు. అదనపు కలెక్టర్ అంకిత్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీవో సాయాగౌడ్, డీఈవో అశోక్, మండలాల ప్రత్యేక అధికారులు, ఎంఈవోలు పాల్గొన్నారు. -
వెల్మల్ వీడీసీపై కేసు నమోదు
ఆర్మూర్: నందిపేట్ మండలం వెల్మల్ గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్యామ్ రాజ్ మంగళవారం తెలిపారు. జిల్లాలో వీడీసీల ఆగడాలపై ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమవుతున్న నేపథ్యంలో వెల్మల్ వీడీసీపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం ప్రత్యేకతను సంతరించుకుంది. వెల్మల్ గ్రామంలో చికెన్, వైన్స్ ఏర్పాటుకు వీడీసీ వేలంపాట నిర్వహిస్తున్న వీడియో ఆధారాలను గ్రామానికి చెందిన బోగ రాములు పోలీసులకు సమర్పించి ఫిర్యాదు చేశాడు. దీంతో వీడీసీ అధ్యక్షుడు పొలాస ముత్యంతోపాటు వీడీసీ ప్రతినిధులు బురిపెల్లి గంగాధర్, సగ్గం నారాయణ, శివసారి మురళి, చేపూరి యాదాగౌడ్తోపాటు వీడీసీకి సహకరిస్తున్న శేఖర్గౌడ్పై కేసులు నమోదు చేశామన్నారు. కాగా పంచాయతీ ఎన్నికల్లో వేలంపాట నిర్వహించి సర్పంచ్గా ఒకే వర్గానికి చెందిన వ్యక్తి మాత్రమే బరిలో ఉంటాడంటూ నిబంధనను అమలు చేసిన ఇదే వీడీసీపై సైతం ఇదే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెలలో ఒక కేసు నమోదు చేశారు. దీంతో రెండు నెలల్లో వెల్మల్ వీడీసీపై రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో ఫిర్యాదుదారుడు వీడీసీ వారితో తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ప్రభుత్వ ఆస్పత్రిలోనే కాన్పులు జరిగేలా చూడాలి
కమ్మర్పల్లి: ప్రతి గర్భిణీ ప్రభుత్వ ఆస్పత్రిలోనే కాన్పు చేయించుకునేలా వైద్యులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రాజశ్రీ అన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చౌట్పల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం డీఎంహెచ్వో తనిఖీ చేశారు. టీ హబ్కు పంపుతున్న రక్త నమూనాల వివరాలను, మందుల వివరాలు, నిల్వలను ఎల్టీ, ఫార్మాసిస్ట్ను అడిగి తెలుసుకున్నారు. గర్భిణులకు అందుతున్న సేవల గురించి, ఆస్పత్రిలో కాన్పుల సంఖ్య తగ్గడానికి గల కారణాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కాన్పుల సంఖ్యను పెంచాలని వైద్యాధికారులు స్పందన, నరసింహాస్వామిని ఆదేశించారు. ఆరోగ్య విస్తరణ అధికారి సత్యనారాయణ, సిబ్బంది స్వరూప, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
కాటేపల్లిలో వివాహిత ఆత్మహత్య
పెద్దకొడప్గల్(జుక్కల్): మండలంలోని కాటేపల్లి గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. కాటేపల్లి గ్రామానికి చెందిన తులసి (25)ని భర్త రాందాస్ నిత్యం మద్యం తాగి వచ్చి వేధించేవాడు. సోమవారం రాత్రివేళలో రాందాస్ తాగి వచ్చి భార్యను వేధించాడు. దీంతో తులసి జీవితంపై విరక్తి చెంది అర్ధరాత్రి ఇంటి స్లాబ్ ఇనుప ఉక్కుకు చున్నితో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, తహసీల్దార్ భిక్షపతి ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. శాంతిపురంలో ఒకరు.. కామారెడ్డి క్రైం: కామారెడ్డి మండలం శాంతిపురం గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. శాంతిపురం గ్రామానికి చెందిన కంచర్ల నవీన్ కుమార్(32) కూలి పని చేసుకునేవాడు. కొద్దిరోజులుగా మద్యానికి బానిసకావడంతోపాటు ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. దీంతో అతడు జీవితంపై విరక్తి చెంది మంగళవారం మధ్యా హ్నం ఇంట్లో దూలానికి తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రంజిత్ తెలిపారు. -
సిబ్బంది సమయపాలన పాటించాలి
● కలెక్టర్ ఇలా త్రిపాఠి ● భీమ్గల్లోని కస్తూర్బాగాంధీ విద్యాలయం తనిఖీ కమ్మర్పల్లి(భీమ్గల్): బోధన, బోధనేతర సిబ్బంది అందరూ సమయ పాలన పాటిస్తూ, పక్కాగా విధులు నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఎవరైనా నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భీమ్గల్ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ మంగళవారం సందర్శించారు. విద్యాలయం ప్రత్యేకాధికారినితో మాట్లాడి, పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యాలయం ప్రహరీ తక్కువ ఎత్తులో ఉండడాన్ని గమనించిన కలెక్టర్, బాలికల భద్రత కోసం వెంటనే ప్రహరీ ఎత్తు పెంచాలని సూచించారు. అన్ని కేజీబీవీలకు మిషన్ భగీరథ నీరు సరఫరా జరిగేలా చూడాలన్నారు. కస్తూర్బా పాఠశాల ప్రాంగణంలో కుక్కలు సంచరించకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గంగాధర్ను ఆదేశించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, క్ర మం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని ఆ దేశించారు.ఆర్మూర్ సబ్కలెక్టర్అభిజ్ఞాన్మాల్వియ, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్, డీఈవో అశోక్ తదితరులు ఉన్నారు. -
క్రైం కార్నర్
బాన్సువాడ: సంగారెడ్డి జిల్లా జోగిపేటలో జరిగిన రోడ్డుప్రమాదంలో బాన్సువాడ మండలం దేశాయిపేట్కు చెందిన ఓ వ్యక్తి మృతిచెందాడు. వివరాలు ఇలా.. దేశాయిపేట్కు చెందిన దేవా సక్సెనా (55) విలేకరిగా పనిచేస్తున్నాడు. సోమవారం హైదరాబాద్లో ఉన్న తన కుమారుడిని తీసుకురావడానికి బైక్పై వెళ్లాడు. మంగళవారం తన కుమారుడితో కలిసి అతడు బైక్పై స్వగ్రామానికి బయలుదేరారు. జోగిపేట వద్ద వారి బైక్కు పంది అడ్డం రావడంతో వాహనం అదుపుతప్పింది. దీంతో వెనకాల కూర్చున్న దేవా సక్సెనా రోడ్డుపై పడటంతో తీవ్రగాయాలై, అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన కుమారుడు హెల్మెట్ పెట్టుకోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఇటీవల ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై నరేష్ తెలిపిన వివరాలు ఇలా.. తా డ్వాయి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన చెట్కూరి యశ్వంత్ (24) తండ్రి మల్లయ్య నెలన్నర రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి మరణంతో అతడు జీవితమై విరక్తి చెంది ఈనెల 8న గ్రామ శివారులో గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అతడిని చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిపేటలో గల ప్రయివేట్ హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ సో మవారం సాయంత్రం మృతి చెందాడు. మృతుడి తల్లి రాజవ్వ ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదుచేసుకొని కామారెడ్డి ఏరియా హాస్పిటల్లో పోస్టుమార్టం చేయించినట్లు ఎస్ఐ తెలిపారు. కన్నాపూర్లో వృద్ధుడు.. లింగంపేట(ఎల్లారెడ్డి): ఇటీవ ఆత్మహత్యకు యత్నించిన ఓ వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై దీపక్కుమార్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన దేవ సోత్ వసురాం(60) కొన్ని నెలలుగా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య కారణాలతో బాధపడుతుండేవాడు. దీంతో అతడు జీవితంపై విరక్తి చెంది వా రం రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఆత్మహత్యకు యత్నించిన వృద్ధురాలు
● కాపాడి కుటుంబీకులకు అప్పగించిన పోలీసులు రెంజల్ (బోధన్): మండలంలోని కందకుర్తి గోదావరి వంతెన వద్దకు వచ్చిన ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు కాపాడి, ఆమె కుటుంబీకులకు అప్పగించారు. వివరాలు ఇలా.. రెంజల్ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు ఇటీవల కుటుంబంలో జరిగిన చిన్న గొడవతో మనస్తాపానికి గురైంది. దీంతో మంగళవారం కందకుర్తి సమీపంలోని గోదావరి వంతెన వద్దకు చేరుకొని అనుమానాస్పదంగా తిరిగింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రెంజల్ ఎస్సై చంద్రమోహన్ సిబ్బందితో అక్కడికి చేరుకుని వృద్ధురాలిని సముదాయించారు. స్టేషన్కు తీసుకువచ్చి కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. -
భువిపై రంగుల హరివిల్లు
పాత కలెక్టరేట్ గ్రౌండ్లో ముగ్గులు వేస్తున్న మహిళలు, యువతులు, చిన్నారులునిజామాబాద్లోని పాత కలెక్టరేట్ మైదానమంతా రంగుల హరివిల్లు పరుచుకుంది. సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో సాక్షి దినపత్రిక, కిసాన్ ఫ్యాషన్మాల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు మహిళాలోకం పోటెత్తింది. మతాలకు అతీతంగా పోటీల్లో పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. న్యాయనిర్ణేతలు ముగ్గులను పరిశీలించి, ప్రతిభ చూపిన వారికి బహుమతులను అందజేశారు. నిజామాబాద్ రూరల్: నగ రంలోని పాత కలెక్టరేట్ మై దానం మంగళవారం ‘సాక్షి’, కిసాన్ ఫ్యాషన్ మాల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు మహిళలు, యువతులు త రలివచ్చారు. ఈసందర్భంగా పలువురు బోగి, సంక్రాంతి, కనుమ, ప్రస్తుతం స మాజంలో ఆడపడుచులపై జరిగే ఆకృత్యాలపై ముగ్గులు వేసి అవగాహన కల్పించారు. న్యాయనిర్ణేతలుగా డిప్యూటీ డీఎంహెచ్వో అశ్విని, ప్రము ఖ న్యాయవాది సరళమహేంధర్రెడ్డి, డాక్టర్ కవితారెడ్డి వ్య వహరించారు. వారు ముగ్గులను పరిశీలించి, ప్రథ మ, ద్వితీయ, తృతీయ, కన్సోలేషన్ ముగ్గులను ఎంపిక చేశారు. అంతకుముందు డిప్యూటీ డీఎంహెచ్వో అశ్విని మాట్లాడుతూ.. ఇంటిముందు వేసే రంగవల్లులు ఇంటిలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించిన ట్లు అవుతుందని పేర్కొన్నారు. మహిళలను ఉత్సాహపరిచేందుకు సాక్షి రంగవల్లుల కార్యక్రమం చేపట్టడం ఎంతో సంతోషకరమన్నారు. న్యాయవాది సరళమహేందర్రెడ్డి మాట్లాడుతూ..‘సాక్షి’ ముగ్గుల పోటీలను పారదర్శకంగా నిర్వహించారన్నారు. డాక్టర్ కవితారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత డిజిటల్ యుగంలో యువతులు ముగ్గులు వేయడం మరిచారని, ఈ పోటీలతో మేల్కొని వారు ముగ్గులను నేర్చుకొని పోటీల్లో పాల్గొనాలన్నారు. మైనారిటీ మహిళలు సైతం ‘సాక్షి’ ముగ్గుల పోటీల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈసందర్భంగా ‘సాక్షి’ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. సాక్షి నిజామాబాద్ ఏడీవీటీ మేనేజర్ సంపత్ మా ట్లాడుతూ.. హిందూ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి ముగ్గులని అన్నారు. ఇంటి ముందు ముగ్గులు వేస్తే ఇల్లు అందంగా కనిపిస్తుందని, పెద్దల నుంచి వస్తున్న సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలని కోరారు. సాక్షి ఆధ్వర్యంలో న్యాయనిర్ణేతలకు మెమోంటోలను ప్రదా నం చేశారు. సాక్షి మేనేజర్(ఏడీవీటీ) నాగుర్ల సంపత్, స్టాఫ్ అజయ్, దీక్షిత్, ఎస్ఆర్ రాంనాథ్, రిపోర్టర్ రజినీష్, ఆపరేటర్ దాసరి ఆనంద్కుమార్, సాక్షి టీవి కరస్పాండెంట్ కిరణ్రెడ్డి, ఆర్సీ ఇన్చార్జి సంజీవ్, ఫొటోగ్రాఫర్ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో అట్టహాసంగా ‘సాక్షి’ ముగ్గుల పోటీలు మతాలకు అతీతంగా పాల్గొన్న మహిళలు, యువతులు అందరికీ బహుమతుల ప్రదానం -
పిప్రి వాసికి పీహెచ్డీ పట్టా
కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ మండలం పిప్రి(జె) గ్రామపంచాయతీ పరిధిలోని మహాలక్ష్మి తండాకు చెందిన మాలవత్ పూర్ణ చందర్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జంతుశాస్త్రంలో పీహెచ్డీ పట్టా పొందారు. ఓయూ కాలేజ్ ఆఫ్ సైన్స్లో ఎమ్మెస్సీ జువాలజీ పూర్తి చేసిన పూర్ణచందర్, పీహెచ్డీ జంతుశాస్త్రం ప్రొఫెసర్ సునీతదేవి పర్యవేక్షణలో ప్రొఫెసర్లు మాధవి, జితేంధర్కుమార్ నాయక్, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ రెడ్యా నాయక్ ఆధ్వర్యంలో ‘హెమటాలాజికల్, బయోకెమికల్ ఆల్టరేషన్ ఇన్ చెన్న స్ట్రయోటస్ ఫెడ్ విత్ హై డైటరీ లిపిడ్’ అనే అంశంపై ఓయూలో పరిశోధన చేసి, పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్నారు. పరిశోధనలు పలు అంతర్జాతీయ జర్నల్స్లలో ప్రచురితం అయ్యాయి. కొర్రమీను చేప (చెన్న స్ట్రయోటస్) ఆహారంలో లిపిడ్ చేర్చడం, కొర్రమీను చేప పెరుగుదలపై పరిశోధనలు చేశారు. తన పరిశోధనలకు గాను ఓయూ వీసీ చేతుల మీదుగా ఈనెల 9న పీహెచ్డీ పట్టా అందుకున్నట్లు పూర్ణచందర్ మంగళవారం తెలిపారు. జక్రాన్పల్లి: జేఎంకేపీఎం పసుపు రైతు ఉత్పత్తిదార్ల సంఘం నుంచి ఉత్పత్తి అవుతున్న పసుపునకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలని సంఘం అధ్యక్షుడు తిరుపతిరెడ్డి కోరారు. ఈమేరకు ఆయన మంగళవారం సెర్ప్ తెలంగాణ చీఫ్ ఆపరేటింగ్ అగ్రికల్చర్ ఆఫీసర్ నరెడ్ల రజితను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. సెర్ప్ ద్వారా ప్రజలకు నాణ్యమైన పసుపుతో పాటు సరసమైన ధరలకు అందించాలన్నారు. రజిత మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో మా శాఖ తరపున కచ్చితంగా సహా య సహకారాలు అందిస్తామని, త్వరలోనే పరిశ్రమను సందర్శిస్తామని హామీ ఇచ్చారు. అధికారులు జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్: నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో మంగళవారం సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి ట్రాన్స్జెండర్లు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈసందర్భంగా ట్రాన్స్జెండర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓరుగంటి గంగ, ప్రధాన కార్యదర్శి జరీనా బేగం మాట్లాడుతూ..ట్రాన్స్ జెండర్లకు మున్సిపాలిటీల్లో కోఆప్షన్ సభ్యులుగా రాజకీయ అవకాశాన్ని సీఎం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలోనే జిల్లా ట్రాన్స్జెండర్స్ సొసైటీ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించామన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నాయకుడు రేవంత్ రెడ్డి అని ఆయనకు మా సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివక్షత లేని ప్రజాపాలన కొనసాగిస్తున్నారన్నారు. ట్రాన్స్ జెండర్స్ నాయకులు శ్యామల, లైలా, అమల, అనేకమంది ట్రాన్స్ జెండర్లు పాల్గొన్నారు. -
నాణేల కోసం మంజీరలోకి దిగి ఒకరి మృతి
పిట్లం(జుక్కల్): నాణేల కోసం మంజీర నదిలోకి దిగిన వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని బొల్లక్పల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. బొల్లక్పల్లి గ్రామానికి చెందిన సాయిలు(42) శుక్రవారం మంజీర నదిలో నాణేల కోసం దిగి గల్లంతయ్యాడు. సాయిలు కోసం గజ ఈతగాళ్లు, విపత్తు నిర్వహణ బృందాలు మూడు రోజులుగా శ్రమించాయి. సోమవారం ఉదయం సాయిలు మృతదేహం నదిలో లభ్యమైంది. నాణేల కోసం మంజీర నదిలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతూ ఒకరు..బాన్సువాడ : బాన్సువాడ మండలం బుడ్మి గ్రామానికి చెందిన ఆశయ్య (35) చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ నెల 8న కొల్లూర్ వద్ద జరిగిన ఆటో ప్రమాదంలో రుక్మిణి అనే మహిళ మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ఆశయ్యను హైదరాబాద్కు తరలించారు. నిమ్స్లో చికిత్స పొందుతూ ఆశయ్య సోమవారం మృతి చెందాడు. హత్య కేసులో నిందితుడి అరెస్టు మాక్లూర్: ఒకరి మృతికి కారణమైన తాపీ మేస్త్రీ మన్నేం లక్ష్మన్రావును సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు.మండలంలోని మెట్పల్లి గ్రా మంలో ఈ నెల 11న ఉదయం ఇద్దరు తాపీ మేస్త్రీల మధ్య మాటామాట పెరిగి ఘర్షణ పడగా లక్ష్మన్రావు తోటి కూలీగా పనిచేసే జలపతి రాజుని రాడ్తో కొట్టాడు. దీంతో రాజు తలకు బలమైన గాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. విషయం తెలిసిన లక్ష్మన్రావు పరారీలో ఉండగా, నార్త్జోన్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్సై రాజశేఖర్ గాలింపు చేపట్టారు. సోమవారం నిందితుడు లక్ష్మన్రావును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
అదుపుతప్పిన ద్విచక్రవాహనం
● ఒకరి దుర్మరణం నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని ఒడ్డేపల్లి శివారులో ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మాగి గ్రామానికి చెందిన ద్యానబోయిన కొనింటి నగేశ్(40) గాయత్రి కార్మాగారంలో గోడౌన్ ఇన్చార్జీగా పనిచేస్తున్నాడు. భార్య నీలిమా, కుమారుడు, కూతురుతో కలిసి పిట్లం మండల కేంద్రంలో అద్దెకు ఉంటున్నారు. ఫ్యాక్టరీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పిన నగేశ్ మాగి గ్రామానికి వచ్చి స్నేహితులతో కలిసి రాత్రి వరకు విందు పార్టీలో పాల్గొన్నాడు. అనంతరం ద్విచక్రవాహనంపై పిట్లంకు బయల్దేరాడు. మద్యం మత్తులో వాహనం నడుపుతున్న నగేశ్ మూలమలుపు వద్ద అదుపు తప్పి బైక్ పైనుంచి జారిపడ్డాడు. తల, ముఖానికి బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తెల్లవారుజామున ఘటనా స్థలం వద్ద ఉన్న బైక్ను గుర్తించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహానికి పంచానామా నిర్వహించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. -
మున్సిపోల్స్కు సిద్ధం
● వార్డులవారీగా ఓటర్ల జాబితా విడుదల ● కార్పొరేషన్తోపాటు మూడు మున్సిపాలిటీల్లో మహిళా ఓటర్లే అధికంమున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి తుది ఓటరు జాబితా విడుదలైంది. జిల్లాలోని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తోపాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీలకు సంబంధించి ఓటరు జాబితాను కమిషనర్లు సోమవారం వార్డులవారీగా విడుదల చేశారు. తుది జాబితా ప్రకారం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ పురుషుల కన్నా మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. -
సఫారీ రైడ్కు రెఢీ
● బ్యాక్ వాటర్లో ఎకో టూరిజం కోసం.. ● జిల్లాకు చేరిన మూడు వాహనాలుడొంకేశ్వర్(ఆర్మూర్): ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలో ఎకో టూరిజం ఏర్పాటులో భాగంగా జిల్లాకు సఫారీ వాహనాలు వచ్చేశాయ్. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది మూడు సఫారీ వాహనాలను మంజూరు చేసింది. ఒక్కో వాహనానికి రూ.15లక్షలు కేటాయించగా ఇప్పుడు అవి సిద్ధమై జిల్లాకు చేరుకున్నాయి. వాహనాలను జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో ఉంచారు. పర్యాటకులు, అధికారులు, ముఖ్య ప్రజాప్రతినిధులు ప్రయాణించేలా వీటిని డిజైన్ చేశారు. కాగా ఆకట్టుకునేలా వాహనాల వెనుక భాగంలో పక్షులు, జింకలు, టైగర్ ఫోటోలను ముద్రించారు. అధికారులు ప్రస్తుతం వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించే పనిలో ఉన్నారు. త్వరలోనే ప్రజాప్రతినిధులతో వాహనాలను ప్రారంభించి అందుబాటులోకి తేనున్నట్లు ఆర్మూర్ ఎఫ్డీవో భవానీ శంకర్ ‘సాక్షి’కి వెల్లడించారు. -
అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
నిజామాబాద్ అర్బన్: విధి నిర్వహణలో అలసత్వాన్ని ప్రదర్శిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి అధికారులు గైర్హాజరుకావడ ంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గైర్హాజరైన అధికారులకు మెమోలు జారీ చేసిన కలెక్టర్.. మరోసారి గైర్హాజరైతే వేతనంలో కోత విధిస్తామని హెచ్చరించారు. కొందరు అధికారులు ముందు ఉన్న సీట్లలో కూర్చోకపోవడాన్ని గమనించిన కలెక్టర్.. ముందు సీట్లలో ఎందుకు కూర్చుకోవడం లేదు? ఏమైనా ఇ బ్బందులు ఉన్నాయా? అని ఆగ్రహం వ్యక్తం చే శారు. మొత్తం 84 వినతులు అందగా వాటిని పరిశీలించిన కలెక్టర్ పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు. ప్రజావాణి వినతుల స్వీకరణ పూర్తయిన తరువాత శాఖల వా రీగా అధికారుల హాజరు జాబితాను పరిశీలించా రు. ఇది మొదటి తప్పుగా భావించి మెమోలతోనే సరిపెడుతున్నామని, ఇక నుంచి గైర్హాజరయ్యే అధి కారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజావాణి ప్రాధాన్యతను గుర్తెరిగి జిల్లా అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని అన్నారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాలకు చెందిన అధికారులు, సిబ్బంది సమయపాలనను పాటిస్తూ, సేవాభావంతో విధులు నిర్వర్తించాలని అన్నారు. ఇటీవల తాను ఆర్మూర్ ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేసిన సమయంలో పలువురు విధుల్లో లేరని, ఈ తరహా నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని అన్నా రు. మండలాల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని ఆదేశించారు. ప్రజావాణిలో జెడ్పీ సీఈవో సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, హౌసింగ్ పీడీ పవన్కుమార్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. అధికారులపై కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్ ప్రజావాణికి గైర్హాజరైన వారికి మెమోలు మరోసారి గైర్హాజరైతే అయితే వేతనంలో కోత అని హెచ్చరిక -
ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
● వీడియోకాన్ఫరెన్స్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిజామాబాద్ అర్బన్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. మున్సిపల్ శాఖ కార్యదర్శి టీ.కే.శ్రీదేవితో కలిసి సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ మాట్లాడారు. తుది ఓటరు జాబితా విడుదల, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై మాట్లాడారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రకటన అనంతరం పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరించి పరిశీలన, పరిష్కారం అనంతరం 16న పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రకటించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసే లోగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. జిల్లాలోని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తోపాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, బోధన్, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్లు జాదవ్ కృష్ణ, పి.శ్రావణి, కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అదను దాటుతోంది..
మోర్తాడ్(బాల్కొండ): యాసంగి సీజన్ ఆరంభమైనా పెట్టుబడి సాయం(రైతు భరోసా) పథకం అమలుపై ప్రభుత్వం నుంచి స్పష్టత కరువైంది. పంటల సాగు ప్రారంభానికి ముందుగానే అందించాల్సిన పెట్టుబడి సాయం ప్రతి సీజన్లో ఆలస్యమవుతుండటంతో రైతులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. పథకం ప్రారంభంలో ఒక్కో ఎకరానికి రూ.5 వేల చొప్పున సాయం అందించగా, కాంగ్రెస్ ప్రభుత్వం సాయం సొమ్మును ఒక్కో ఎకరానికి రూ.వెయ్యి పెంచింది. గత వర్షాకాలం సీజన్లో జిల్లాలో 2,98,472 మంది రైతులకు రూ.326.03 కోట్ల సాయం సొమ్మును జమ చేశారు. అయితే, జూన్ 20వ తేదీలోగా చిన్న, సన్నకారు రైతుల ఖాతాల్లో భరోసా సొమ్మును జమ చేశారు. చాలా రోజుల తర్వాత పెద్ద రైతులకు కూడా భరోసా సొమ్మును అందించారు. అయితే, జిల్లాలో ఇప్పటికే పెద్ద మొత్తంలో వరి నాట్లు పూర్తయ్యాయి. మిగిలిన ప్రాంతాల్లో మరో వారం, పది రోజుల్లో నాట్లు పూర్తికానున్నాయి. రైతు భరోసా డబ్బులు రాకపోవడంతో పంట పెట్టుబడుల కోసం రైతులు యథావిధిగా బ్యాంకులు, ప్రైవేటు ఫైనాన్స్లను ఆశ్రయిస్తున్నారు. పెట్టుబడి సాయం సకాలంలో అందిస్తే అప్పులు చేయాల్సిన అవసరం ఉండదని రైతులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి పెట్టుబడి సాయాన్ని విడుదల చేయాలని కోరుతున్నారు. పాత పద్ధతిలోనే సాయం అందించాలి.. సాగుకు యోగ్యంగా లేని భూములను గతంలోనే గుర్తించారు. పాత పద్ధతిలోనే సాయం అందిస్తే బాగుంటుంది. చిన్న, సన్నకారు రైతులకు ‘రైతు భరోసా’ ఎంతో అండగా ఉంటుంది. ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా సొమ్మును విడుదల చేయాలి. – తక్కూరి సాగర్, రైతు, మోర్తాడ్ఆలస్యం చేయవద్దు.. చిన్న, సన్నకారు రైతులు పెట్టుబడి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఆలస్యం చేయడంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుంది. షెడ్యూల్ ప్రకారం పెట్టుబడి సాయాన్ని అందిస్తే ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు. – దేగాం రాములు, రైతు, అంక్సాపూర్ పంట పెట్టుబడి సాయం కోసం రైతుల నిరీక్షణ యాసంగి సీజన్ పనులు ఊపందుకున్నా రైతు భరోసాపై స్పష్టత కరువు ప్రతిసారి ఆలస్యంగానే పెట్టుబడి సాయం -
కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత
● బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి నిజామాబాద్ అర్బన్: కాంగ్రెస్ పాలనను ప్రజలు తిరస్కరిస్తున్నారని, రోజురోజుకూ ఆ పార్టీపై వ్యతిరేకత పెరుగుతోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కా ర్యాలయంలో సోమవారం నిర్వహించిన స మావేశంలో ఆయన మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలే కాంగ్రెస్ వైఫల్యానికి నిద ర్శనమన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని, బీజేపీ మాటలకే పరిమితమైందన్నారు. ప్ర జలు ఇప్పటికీ కేసీఆర్వైపే ఉన్నారని పేర్కొన్నారు. పదేళ్లలో నిజామాబాద్ అర్బన్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తు చేశారు. గడపగడపకూ వెళ్లి పదేళ్లలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని నాయకులకు సూచించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, మాజీ మేయర్ నీతూకిరణ్, కేఆర్ సురేశ్రెడ్డి, వీజీగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇన్చార్జి డీఎఫ్వోగా సుశాంత్ సుఖ్దేవ్ డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లా అటవీ శాఖ ఇన్చార్జి డీఎఫ్వోగా నిర్మల్ డీఎఫ్వో సుశాంత్ సుఖ్దేవ్ బాధ్యతలు చేపట్టారు. సోమవారం జిల్లా కార్యాలయంలో బాధ్యతలు చేపట్టగా ఎఫ్డీవోలు, ఎఫ్ఆర్వోలు ఆయనకు పుష్ప గుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. రెగ్యులర్ డీఎఫ్వోగా ఉన్న వికాస్ మీనా ఎంసీటీ ట్రైనింగ్ కోసం డెహ్రడూన్కు వెళ్లారు. ఆయ న ఫిబ్రవరి 5వ తేదీన తిరిగి రానున్నారు. వికాస్ మీనా వచ్చే వరకు సుఖ్దేవ్ నిజామాబాద్ డీఎఫ్వోగా పని చేయనున్నారు. రౌడీషీటర్ జిల్లా బహిష్కరణ నిజామాబాద్ అర్బన్: నగరంలోని ఆటోనగర్కు చెందిన రౌడీషీటర్ బర్సాత్ అమేర్ను జిల్లా బహిష్కరణ చేసిన పోలీస్ కమిషనర్ సాయిచైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. సదరు రౌడీషీటర్పై 22 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఆరు సంవత్సరాలుగా నేరాలకు పాల్పడుతుండగా, ఇదివరకే పీడీ యాక్ట్ విధించినట్లు తెలిపారు. చా లాసార్లు జైలుకు వెళ్లివచ్చినా అమేర్ ప్రవర్తనలో మార్పు రావడం లేదని పేర్కొన్నా రు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం వచ్చే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏడాదిపాటు జిల్లా బహిష్కరణ చేసినట్లు తెలిపారు. పోలీస్ ప్రజావాణికి 35 ఫిర్యాదులు నిజామాబాద్ అర్బన్: పోలీస్ ప్రజావాణికి 35 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులను స్వీ కరించిన సీసీ సాయిచైతన్య తక్షణమే పరిష్కరించాలని సంబంధిత పోలీసులను ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా ఫిర్యాదు చేయా లని సీపీ సూచించారు. -
ఆర్మూర్లో దొంగల బీభత్సం
● ఐదు ఇళ్లతోపాటు ఆలయంలో చోరీ ● తాళం వేసిన ఇళ్లే టార్గెట్ ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలో ఆదివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీకి పాల్పడ్డారు. పట్టణంలోని గోల్బంగ్లా ప్రాంతంలో పాల గంగాధర్ ఇంటికి తాళం వేసి పక్కనే గల మరో పోర్షన్లో కుటుంబసభ్యులతో నిద్రిస్తున్నాడు. నిద్రిస్తున్న గదికి గడియపెట్టిన దుండగులు, పక్కన తాళం వేసిన ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాలో దాచిన 8 తులాల 8 గ్రాముల బంగారు ఆభరణాలు, అర కిలో వెండి అపహరించారు. ఓటిగల్లీలో కిరాణా షాప్, కార్ఖాన, అంగన్వాడీ కేంద్రంతోపాటు మరో ఇంటి తాళాలు ధ్వంసం చేసి లోనికి వెళ్లిన దుండగులకు ఏమీ లభించకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. నిజామాబాద్ రోడ్డులోని పెద్దమ్మ ఆలయం తాళాలను సైతం ధ్వంసం చేశారు. ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్, క్లూస్ టీం బృందం ఘటనా స్థలాలను పరిశీలించి ఆధారాలను సేకరించారు. కాగా, పెద్దమ్మ ఆలయంలో చోరీకి యత్నంచిన ఇద్దరి చిత్రాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో వెల్లడించారు. -
కార్పొరేషన్లో పెరిగిన ఓటర్ల సంఖ్య
● మహిళలు 1,80,546.. పురుషులు 1,67,461 ● మొత్తం ఓటర్లు 3,48,051నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తుది ఓటరు జాబితాను కమిషనర్ దిలీప్కుమార్ విడుదల చేశారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఓటర్ల సంఖ్య పెరిగింది. కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో మొత్తం 3,48,051 మంది ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 1,67,461 మంది, మహిళలు 1,80,546 మంది, ఇతరులు 44 మంది ఉన్నారు. గతంలో మొత్తం 3,07,459 మంది ఓటర్లు ఉండగా, తాజాగా విడుదల చేసిన తుది జాబితా ప్రకారం 40,592 మంది ఓటర్లు పెరిగారు. గతంలో పురుష ఓటర్లు 1,48,162 ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 1,67,461కు చేరింది. అలాగే మహిళా ఓటర్లు 1,59,255 మంది కాగా ప్రస్తుతం ఆ సంఖ్య 1,80,546కు చేరింది. గతంలో ఇతరులు 42 మంది ఉండగా ప్రస్తుతం 44 మంది ఉన్నారు. -
ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
నిజామాబాద్ అర్బన్: అధికారులు అంకితభావంతో కృషి చేస్తూ నిజామాబాద్ను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. ప్రమాదాల నియంత్రణ కోసం ప్రజల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. రో డ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా రవాణా శాఖ అధికారి ఉమా మహేశ్వర్ రావు రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన పలు వీడియోలను ప్రదర్శిస్తూ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. జిల్లాలో 2024 సంవత్సరంలో 856 ప్రమాదాలు చోటుచేసుకోగా 351 మంది మృతి చెందారని, 2025 నవంబర్ నెలాఖరు నాటికి 815 రోడ్డు ప్రమాదాల్లో 280 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. అజాగ్రత్తగా వాహనాలు నడపడంతోనే ప్రమాదాల బారిన పడుతున్నారని స్పష్టం చేశఆరు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో, సమష్టిగా కృషి చేయాలన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పూర్తిస్థాయిలో విజయవంతం చేసేలా కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. ప్రధానంగా పాఠశాలలు, కళాశాలలలో విద్యార్థులకు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎంవీఐ కిరణ్ కుమార్, హర్ష తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం ప్రజల్లో అవగాహన పెంపొందించాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి రోడ్డు భద్రతా మాసోత్సవాలపై అధికారులు, సిబ్బందికి అవగాహన -
భీమ్గల్లో 14,045..
కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డుల్లో మొత్తం 14,045 మంది ఓటర్లు ఉన్నారు. కమిషనర్ గోపు గంగాధర్ తుది ఓటరు జాబితాను విడుదల చేశారు. ఇదివరకు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ప్రకారం మొత్తం ఓటర్లు 14,189 ఉండగా.. రాజకీయ పార్టీల నాయకులు ఫిర్యాదుల మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఇతర గ్రామాలకు చెందిన 144 మంది ఓటర్లను గుర్తించి తొలగించినట్లు కమిషనర్ తెలిపారు. తుది జాబితా ప్రకారం 14,045 ఓటర్లు ఉండగా.. ఇందులో 6,616 మంది పురుషులు, 7,429 మంది మహిళలు ఉ న్నారు. పట్టణ ఓటర్లు తమ ఓట్ల సమాచారం ఆయా కార్యాలయాల్లోని నోటీస్ బోర్డులపై ప్రచురించిన జాబితాను పరిశీలించి తెలుసుకోవాలని ఈ సందర్భంగా కమిషనర్ సూచించారు. పురుషులు 6,616.. మహిళలు 7,429 -
క్రీడలతో మానసికోల్లాసం
● కమాండెంట్ సత్యనారాయణ ● బెటాలియన్లో అన్యువల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం డిచ్పల్లి: క్రీడలతో శారీరక దారుఢ్యంతోపాటు మానసికోల్లాసం పెంపొందుతుందని తెలంగాణ ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్ కమాండెంట్ పి.సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం బెటాలియన్లో ఇంటర్ కంపెనీ వార్షిక క్రీడా పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కమాండెంట్ సత్యనారాయణ క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం క్రీడాజ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బందిలో శారీరక ధృడత్వం, మానసిక స్థైర్యం, క్రమశిక్షణ పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. బెటాలియన్లోని వివిధ కంపెనీలకు చెందిన సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
● 14 తులాల బంగారం, ఆరు కిలోల వెండి స్వాధీనం ● వివరాలు వెల్లడించిన సీపీ సాయిచైతన్యనిజామాబాద్ అర్బన్: అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయిచైతన్య పేర్కొన్నారు. కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. డిసెంబర్ 21న బోధన్ పట్టణంలోని రెండు బంగారు షాపుల షెట్టర్లను ధ్వంసం చేసి 35 తులాల బంగారం, 14 కిలోల వెండి, రెండు మోటార్ సైకిళ్లను దొంగిలించారు. బోధన్ టౌన్లో కేసు నమోదు చేసుకొని, ఎస్హెచ్వో వెంకట్నారాయణ విచారణ చేపట్టారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఉమ్రికి చెందిన లక్ష్మన్సింగ్, ప్రేమ్సింగ్, సాగర్సింగ్, మహమ్మద్షేక్ అనే వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ఈ నెల 11న బోధన్లోని ఆచన్పల్లి బైపాస్ రోడ్డు వద్ద పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా రోడ్డు పక్కన నిందితులు మద్యం తాగుతూ కనిపించారు. పోలీసులను చూసి ఇద్దరు పారిపోగా, లక్ష్మన్సింగ్, ప్రేమ్సింగ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. ప్రస్తుతం సాగర్సింగ్, మహహ్మద్ షేక్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. దొంగిలించిన బంగారాన్ని కొనుగోలు చేసిన నయీం, నదీం, లక్ష్మీకాంత్, సంతోష్లపై కేసు నమోదు చేశామన్నారు. నిందితుల నుంచి మోటార్సైకిల్ , 14 తులాల బంగారం, ఆరు కిలోల వెండి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ దొంగల ముఠాపై రెంజల్ పోలీస్స్టేషన్ పరిధిలోని మహారాష్ట్ర ఉమర్కేడ్, కిన్వట్, నిర్మల్ జిల్లా కుభీర్, రుద్రూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఇది వరకు కేసులు ఉన్నాయన్నారు. ఈ కేసు విచారణలో ప్రతిభ కనబరిచిన బోధన్ ఎస్హెచ్వో వెంకట్నారాయణ, ఎస్సై మనోజ్కుమార్, ఏఎస్సై బాబూరావు, సిబ్బంది రవి, మహేశ్, సాయికుమార్, అశోక్లను సీపీ అభినందించారు. సమావేశంలో బోధన్ ఏసీపీ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాక్షేత్రంలో ఉన్న వారికే బీఫామ్
నిజామాబాద్ రూరల్: ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. ప్రజల మధ్య ఉన్న వారికే మున్సిపల్ ఎన్నికల్లో బీఫామ్ ఇస్తామని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ స్పష్టం చేశారు. ఫిబ్రవరిలో బల్దియా ఎన్నికలు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లాలో మెజార్టీ సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నామని, మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో రెబల్ కారణంగా కొంత నష్టం జరిగిందని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పక్కా ప్రణాళికతో మున్సిపాలిటీలను కై వసం చేసుకుంటామన్నారు. రెండేళ్లలో 80వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. జిల్లా వాసుల 30 ఏళ్ల కల అయిన ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కళాశాలలను తమ ప్రభుత్వ హయాంలో మంజూరు చేశామని, జిల్లాలో దాదాపు రూ.600 కోట్ల విలువైన రోడ్ల పనులు మంజూరు చేయడం జరిగిందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలు వివక్షకు గురయ్యాయని, కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఫామ్హౌస్కి పలాయనం చిత్తగించారని విమర్శించారు. నిజామాబాద్ కేంద్రంగా బియ్యం స్మగ్లింగ్ చేసిన ఘనత కేసీఆర్కు దక్కిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కథ ముగిసిపోయిందని, కవిత విమర్శలకు హరీశ్రావు, కేటీఆర్ వద్ద జవాబు లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్రెడ్డి మంత్రుల సహకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు పయనింపజేస్తున్నారన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ అంశం తేలాకే జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో సీఎం ఉన్నారన్నారు. దేవుడి పేరును వాడుకునే హక్కు బీజేపీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగే వారికి గుణపాఠం చెప్పాలని అన్నారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నుడా చైర్మన్ కేశ వేణు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్రావు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, గ్రంథాలయ సంస్త చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, సీనియర్ నాయకులు, మహిళ నాయకురాలు పాల్గొన్నారు. మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం ఫిబ్రవరిలో ఎన్నికలు ఉండే అవకాశం రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెట్టారు దేవుడి పేరుతో ఓట్లడిగే వారికి గుణపాఠం చెప్పాలి మీడియాతో టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ -
జిల్లాల పునర్వ్యవస్థీకరణ తొందరపాటు నిర్ణయం
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి నిజామాబాద్ రూరల్: రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం తీసుకుంటుందని జీజేపీ జిల్లా అద్యక్షుడు కులచారి దినేశ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామిక పద్ధతిలో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్నారు. గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పునే ప్రస్తుత కాంగ్రెస్ చేస్తుందని విమర్శించారు. మేడారం జాతరకు బస్సు చార్జీలు పెంచకుండా, సబ్సిడీ ఇవ్వాలని కోరారు. భక్తులకు ఉచిత, తక్కువ చార్జీలతో సౌకర్యవంతమైన రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. ఎల్లారెడ్డిరూరల్:విషపురుగు కా టు వేయడంతో వృద్ధురాలు మృతి చెందిన ఘటన మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రా మంలో సోమవారం చోటు చే సుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామాని కి చెందిన గాదె సాయవ్వ(60) సోమవారం పొలంలో నాటు వేసేందుకు వెళ్లగా విషపురుగు కాటు వేసింది. ఏదో పురుగు కరిచిందని భావించిన సా యవ్వ.. అలాగే పని చేసింది. కాసేపటికి ఆమె నోటి నుంచి నురగలు రావడంతో ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. వైద్యులను సంప్రదించగా పోస్టుమార్టంలో విషపురుగు వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. -
దంపతులకు గాయాలు
కారును ఢీకొన్న కంటైనర్ భిక్కనూరు: మండల కేంద్రం సమీపంలో కారును కంటైనర్ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న దంపతులకు గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పద్మ, మోహన్రెడ్డి దంపతులు ఆదివారం కారులో హైదరాబాద్కు బయలుదేరారు. మండల పరిధిలోని వజ్రా గ్రానైట్ ఫ్యాక్టరీ సమీపంలో జాతీయ రహదారిపై వారి కారును వెనుకనుంచి వచ్చిన కంటైనర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈఘటనలో కారులో ఉన్న పద్మ, మోహన్రెడ్డి దంపతులకు గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సంఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. -
క్రైం కార్నర్
మేసీ్త్రల మధ్య ఘర్షణ: ఒకరి మృతి మాక్లూర్: ఇద్దరు తాపీ మేసీ్త్రల మధ్య గొడవ జరుగగా, ఘర్షణలో ఒకరు మృతిచెందారు. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాలు ఇలా.. మన్నేం లక్ష్మన్రావు అనే తాపీమేసీ్త్ర సంవత్సరకాలంగా మెట్పల్లి గ్రామంలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటూ శివారు గ్రామాల్లో ఇంటి నిర్మాణ పనులను గుత్తకు పట్టుకుని కొత్త ఇళ్లు నిర్మిస్తుంటాడు. ఏరోజుకు ఆరోజు కూలీలను తెచ్చుకుని పనులు చేయిస్తాడు. ఆదివారం లక్ష్మన్రావుకు తనతో పాటు ఉన్న మేసీ్త్ర జలపతిరాజు (60)కు మధ్య కూలీపై పనికి వెళ్లే విషయంలో గొడవ జరిగింది. ఈక్రమంలో లక్ష్మన్రావు జలపతిరాజును బలంగా నెట్టివేయడంతో పక్కనే ఉన్న సిమెంట్ దిమ్మైపె పడ్డాడు. దీంతో అతడి తలకు బలమైన గాయాలు కావటంతో స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. మృతుడి కుమార్తె శివాని ఫిర్యాదు మేరకు లక్ష్మన్పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ఇసుక ట్రాక్టర్లు పట్టివేత నిజాంసాగర్(జుక్కల్): సంగారెడ్డి జిల్లా మాసాపల్లికి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్ట ర్లను శనివారం రాత్రి ప ట్టుకున్నామని ఎస్సై శివకుమార్ తెలిపారు. మండలంలోని మర్పల్లి గ్రామా నికి చెందిన మూడు ట్రాక్టర్లల్లో మంజీరా నదిలో నుంచి ఇసుక లోడ్ చేసి, పొరుగు జిల్లాకు తరలిస్తుండగా మార్గమధ్యలో పట్టుకున్నామన్నారు. పట్టుబడిన మూడు ఇసుక ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్కు తరలించి ముగ్గురు వ్యక్తులపైన కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. గంగారాం తండాలో ఒకరి ఆత్మహత్య ఇందల్వాయి: ఇందల్వాయి మండలం గంగారాం తండాలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై సందీప్ తెలిపిన వివరాలు ఇలా.. గంగారం తండాకు చెందిన షేక్ మహబూబ్ అలీ (48) అనే వ్యక్తి ఆటో డ్రైవర్గా కొనసాగుతూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా అతడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతడు జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య షేక్ రిజ్వానా బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. చోరీ కేసులో మహిళ అరెస్టు నిజామాబాద్ అర్బన్: నగరంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న మహిళను అరెస్టు చేసినట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి ఆదివారం తెలిపారు. ఇటీవల రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఓ మహిళ వద్ద నిందితురాలు బంగారాన్ని చోరీ చేసి, పారిపోయిందన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితురాలిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. నిందితురాలు కర్ణాటక రాష్ట్రం దీన్దయాల్ నగర్ ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయ రాణి బాయ్గా గుర్తించామన్నారు. అలాగే ఆమె వద్ద నుంచి నాలుగు తులాల రెండు గ్రాముల బంగారంను స్వాధీనం చేసుకున్నామన్నారు. -
ఆత్మీయ పలకరింపులు.. మధుర స్మృతులు
● జిల్లాలో పలుచోట్ల సమ్మేళనాలు నిర్వహించిన పూర్వవిద్యార్థులు ● ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో భావోద్వేగానికి గురైన మిత్రులు సాక్షి నెట్వర్క్: ఆత్మీయ పలకరింపులు.. ఆపాత మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని పూర్వ విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. అరే ఎన్నాళ్లయింది కలుసుకుని.. పూర్తిగా మారిపోయావంటూ ఆనాటి స్నేహితులు ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో హర్షం వ్యక్తంచేశారు. జిల్లాలోని వివిధ గ్రామాల ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల పదోతరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. చిన్నానాటి మిత్రులందరూ ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపై కలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఒకరినొకరు పలకరించుకుంటూ అనాటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్నారు. నాడు చదువు నేర్పిన ఉపాధ్యాయులను సమ్మేళనానికి ఆహ్వానించి, సన్మానించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. అనంతరం అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఆర్మూర్లోని చిన్న రామ్మందిర్ పాఠశాల 1993–94 బ్యాచ్ ఏడో తరగతి వి ద్యార్థులు ఓ ఫంక్షన్హాల్లో ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. ్డ -
ఘనంగా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం
● 250 మంది సంగీత కళాకారుల కీర్తనల ఆలాపన ● అలరించిన చిన్నారుల నాట్యప్రదర్శన బోధన్: పట్టణంలోని శక్కర్నగర్ రామాలయంలో ఆదివారం కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు, స్వరకర్త త్యాగరాజస్వామి మూడో ఆరాధనోత్సవాలు కనుల పండువగా నిర్వహించారు. శక్కర్నగర్ ప్రాంతానికి చెందిన ప్రతాప రామకృష్ణయ్య, అన్నపూర్ణ దంపతుల కుమారులు ప్రతాప శ్రీనివాస్, పీజీఎస్ శాసీ్త్ర అధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా వారు ముందుగా జ్యోతిప్రజ్వలన, త్యాగరాజస్వామి చిత్రపటానికి పూజలు చేశారు. అనంతరం త్యాగరాజ కీర్తనల సంగీత కచేరి ప్రారంభించారు. డాక్టర్ స్వప్న నేతృత్వంలో వివిధ ప్రాంతాలకు చెందిన 250 మంది సంగీత కళాకారులు త్యాగరాజస్వామి స్వరపర్చిన పంచకృతులు ఆలపించారు. నాట్యతరంగిణి సంస్థ నిర్వాహకులు కర్ణం శ్రీనివాస్ వారి విద్యార్థినులు, చిన్నారులు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి విశేషంగా ఆకట్టుకున్నారు. అతిథులు, సంగీత కళాకారులు, నృత్య ప్రదర్శనలిచ్చిన విద్యార్థినులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. -
సర్పంచులు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి
నిజామాబాద్ రూరల్: గ్రామాల్లో గెలిచిన సర్పంచు లు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని, స్థానిక స మస్యలపై ఎకరువు పెట్టాలని గనులు, కార్మిక ఉపా ధి కల్పన శాఖ మంత్రి వివేక్వెంకటస్వామి అన్నా రు. నగరంలోని న్యూ అంబేడ్కర్ భవన్లో ఆదివా రం జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో నూతనంగా గెలిచిన మాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వా ర్డు సభ్యుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కా ర్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథి హాజరై మాట్లాడారు. పదవులు ఉన్న లేకున్న ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్అలీ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తెలంగా ణ రాష్ట్ర సాధకుడు వెంకటస్వామి(కాక) విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని సర్పంచులను కోరారు. జిల్లావ్యాప్తంగా 64 మంది ఎస్సీ సర్పంచులు, 24 మంది ఉపసర్పంచులు గెలుపొందార న్నారు. రాష్ట్ర రైతుకమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నుడా చైర్మన్ కేశవేణు, మాల మహానాడు జాతీ య అధ్యక్షుడు చిన్నయ్య, జిల్లా అధ్యక్షుడు దేవిదాస్, లింబాద్రి, టీఎన్జీవో నాయకులు కిషన్ ఉన్నారు. పదవులు ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండాలి గనులు, కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్వెంకటస్వామి నగరంలో మాల మహానాడు, మున్నూరుకాపు సంఘాల ఆధ్వర్యంలో నూతన సర్పంచులకు సన్మానాలు -
మున్నూరుకాపులు రాజకీయంగా ఎదగాలి..
● ధర్మపురి సంజయ్నిజామాబాద్ రూరల్: మున్నూరుకాపులు రాజకీయంగా ఎదగాలని మాజీ మేయర్, మున్నూరుకా పు జిల్లా సంఘం అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ అ న్నారు. నగరంలోని మున్నూరుకాపు కల్యాణమండపంలో ఆదివారం మున్నూరుకాపు జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఇటీవల గెలుపొందిన సంఘ స ర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు సన్మాన కా ర్యక్రమం నిర్వహించారు. అంతకుముందు సంఘ ప్రతినిధులు నగరంలో బైక్ర్యాలీ నిర్వహించారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ.. జిల్లాలో 450 పైచిలుకు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లుగా మున్నూరుకాపులు గెలవడం గొప్ప విషయమన్నారు. మున్నూరుకాపులకు ఏ కష్టం వచ్చి నా నేనున్నానని మర్చిపోవద్దన్నారు. ఉర్దూ అకాడ మీ చైర్మన్ తాహెర్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ మేయర్ ఆకుల సుజాత, సురేందర్, గంగాధర్, చిన్నరాజేశ్వర్, బలరాం, శ్రీశైలం, రాజశేఖ ర్, రవీందర్, పోతన్న, సాయిలు పాల్గొన్నారు. -
మీకు తెలుసా..
వాట్సాప్లో మీ–సేవ రామారెడ్డి: ఉన్నత చదువుల కోసమో.. ఉద్యోగానికి దరఖాస్తు చేసేందుకో. విద్యార్థుల ప్రవేశాల కోసమో.. ఇలా అన్నింటికీ కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ తదితర పత్రాలు తప్పనిసరి. వీటన్నింటి కోసం ఇకపై రోజుల తరబడి వేచి చూడటం, మీ సేవా కేంద్రాలు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగడం లాంటి తిప్పలు తప్పనున్నాయి. వీటితో పాటూ దాదాపు 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580కి పైగా సేవలను తాజాగా ఫోన్ ద్వారా వాట్సప్ నంబర్ 8096958096 నుంచే అందుబాటులోకి రానున్నాయి. ● కామారెడ్డి జిల్లాలో 180 మీసేవలున్నాయి. ● ముందుగా ఫోన్లో అధికారిక మీ–సేవ వాట్సాప్ నంబరును సేవ్ చేసుకోవాలి. ● ఆ నంబరుకు మెనూ ఆప్షన్ టైప్ చేసి పంపిస్తే అందుబాటులో ఉన్న సేవలజాబితావస్తుంది. ● ఆధార్ ఆధారిత ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేసి అవసరమైన సేవను ఎంచుకోవాలి. ● దరఖాస్తు ఫారాన్ని వాట్సాప్లో ఇంటర్ఫేస్ ద్వారా పూర్తి చేయవచ్చు. ● అవసరమైన డాక్యుమెంట్లు, స్కాన్ చేసిన ప్ర తులను వాట్సాప్లోనే అప్లోడ్ చేయవచ్చు. ● ఫీజును ఆన్లైన్ పేమెంట్ గేట్వే ద్వారా సురక్షితంగా చెల్లించవచ్చు. ● సర్టిఫికెట్ లేదా డాక్యుమెంట్ సిద్ధం కాగానే దాని డౌన్లోడ్ లింక్ నేరుగా వాట్సాప్లోకి వస్తుంది. -
నిధుల కోసం నిరీక్షణ
మోర్తాడ్: గ్రామాల్లో అనేక సమస్యలు పేరుకుపోతున్నాయి. వాటి పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధుల కోసం సర్పంచులు ఎదురు చూపులు చూస్తున్నారు. 23 నెలలుగా నిలిచిపోయిన ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కేంద్రం మోక్షం కలిగిస్తేనే గ్రామాల్లో అభివృద్ధి పనులతో పాటు మౌలిక సదుపాయాల కల్పన సాధ్యమవుతుంది. 15వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం ప్రతి నెలా జిల్లాకు విడుదల చేయాల్సిన మొత్తం రూ.10.30 కోట్లు ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఉంటేనే నిధులను విడుదల చేయాల్సి ఉంది. ప్రభుత్వం సకాలంలో ఎన్నికలను నిర్వహించకపోవడంతో 23 నెలల పాటు ప్రత్యేకాధికారుల పాలనలోనే గ్రామాలు కొనసాగాయి. జిల్లాలోని 545 గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘం ద్వారా రూ.236.95 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను మంజూరు చేయనుందని సీఎం రేవంత్రెడ్డి పంచాయతీలపై వరాల జల్లును కురిపించారు. పెద్ద పంచాయతీలకు రూ.10లక్షలు, చిన్న పంచాయతీలకు రూ.5లక్షల చొప్పున నిధులను మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. కానీ సర్పంచులు బాధ్యతలు చేపట్టి పక్షం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కార్యాచరణ అమలు కావడం లేదు. దీంతో నిధుల కోసం సర్పంచులు నిరీక్షిస్తున్నారు. సీఎం చెప్పిన లెక్క ప్రకారం జిల్లాకు రూ.35 కోట్ల వరకూ నిధులు విడుదల అయ్యే అవకాశం ఉంది. అటు ఆర్థిక సంఘం నుంచి భారీ మొత్తంలోనే నిధులు విడుదల కావాల్సి ఉండగా పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదికను అందించాల్సి ఉంది. ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచ్, వార్డు సభ్యులు ఉన్నారని తెలియజేస్తేనే ఆర్థిక సంఘం ద్వారా నిధులు విడుదల కానున్నాయి. రెండేళ్లుగా ఎన్నో సమస్యలు ఆర్థిక సంఘం నిధుల విడుదల నిలిచిపోవడం, ఎస్ఎఫ్సీ నిధుల స్థానంలో పంచాయతీ సిబ్బందికి జీతాల కోసం కొంత నిధులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవడంతో రెండేళ్ల పాటు ఎన్నో సమస్యలు పేరుకుపోయాయి. పెద్ద పంచాయతీలకు పన్నుల ద్వారా ఆదాయం లభించగా చిన్న పంచాయతీల్లో పన్నుల ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. ఈ కారణంగా పరిసరాలను శుభ్రంగా ఉంచే పరిస్థితి కూడా అక్కడక్కడ లేదు. సర్పంచులు ఎన్నిక కావడంతో నిధుల విడుదలకు మోక్షం లభిస్తేనే గ్రామాల్లో అభివృద్ధి పనులు సాధ్యమవుతాయి. మోర్తాడ్ జీపీ భవనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలకు నిధులను వెంటనే విడుదల చే యాలి. గ్రామల్లో ఎన్నో సమస్యలు నెలకొని ఉ న్నాయి. ఆర్థిక వనరులు ఎంతో అవసరం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను విడుదల చేసి అభివృద్ధికి సహకరించాలి. – విజయ్, సర్పంచ్, శెట్పల్లి గ్రామాల్లో కుంటుపడుతున్న పాలన ఆర్థిక సంఘం నిధులు మంజూరైతేనే గ్రామాలు అభివృద్ధి కేంద్రం నుంచి జిల్లాకు రావాల్సింది రూ. 236.95 కోట్లు -
రాష్ట్రస్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం
పెర్కిట్: మామిడిపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో రాష్ట్ర స్థాయి జూనియర్ బాల్బ్యాడ్మింటన్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్రెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో డీఎస్వో పవన్, బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోనగిరి శ్యామ్, నాయకులు రాజయ్య, దుర్గయ్య, విద్యా సాగర్ రెడ్డి, రాజ్ కుమార్, నరేందర్, రాజేశ్, సునీత, సంతోష్ ఠాకూర్, నాగేశ్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
వీఏఓఏటీ కార్యవర్గం ఎన్నిక
సుభాష్నగర్: విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(వీఏఓఏటీ) నిజామాబాద్ సర్కిల్ కార్యవర్గాన్ని శనివారం నగరంలోని పవర్హౌస్ కంపౌండ్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జే శివాజీ గణేశ్, కార్యదర్శిగా పీ వెంకట్, ఉపాధ్యక్షుడిగా వై మోహన్, కోశాధికారిగా సతీశ్, మహిళా కార్యదర్శిగా సునీత ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా ఎన్పీడీసీఎల్ కంపెనీ సెక్రెటరీ సుదర్శన్, ఫైనాన్స్ సెక్రెటరీ దేవేందర్ వ్యవహరించారు. కార్యక్రమంలో జిల్లా విద్యుత్ అకౌంట్స్ అధికారులు ఈశ్వర్, గంగారాం, సురేశ్, రమణ, మంగ్త్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటి నిర్మాణ అనుమతి పొందండి ఇలా..
మీకు తెలుసా..రామారెడ్డి: గ్రామ పంచాయతీ పరిధిలో ఇల్లు నిర్మించుకోవడానికి గతంలో మాదిరిగా పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం tgbpass( తెలంగాణ భవన నిర్మాణ అనుమతి ఆమోదం స్వీయ ధృవీకరణ వ్యవస్థ ) అనే ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తోంది. ● ప్లాట్ విస్తీర్ణం ఆధారంగా అనుమతులు ● 75 చదరపు గజాల లోపు (జీ– ప్లస్ వన్ అంతస్తు వరకు) దీనికి ఎటువంటి ముందస్తు అనుమతి అవసరం లేదు. ● మీరు కేవలం రూ. 1 టోకెన్ అమౌంట్తో వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా అవసరం లేదు. ● 75 నుండి 600 చదరపు గజాల వరకు (ఎత్తు 10 మీటర్ల లోపు) తక్షణ అనుమతి. తక్షణ ఆమోదం. వివరాలను, స్థల పత్రాలను ఆన్లైన్లో ‘సెల్ఫ్ సర్టిఫికేషన్’ ద్వారా సమర్పిస్తే, వెంటనే అనుమతి పత్రం జారీ అవుతుంది. ● 600 చదరపు గజాల కంటే ఎక్కువ (లేదా 10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు) దీనికి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా దరఖాస్తు చేయాలి. 21 రోజుల్లోగా అధికారులు పరిశీలించి అనుమతి ఇస్తారు. ఒకవేళ 21 రోజుల్లోపు సమాధానం రాకపోతే, అది ఆమోదించబడినట్లుగా (డిమాండ్ అప్రూవల్ గా) పరిగణించవచ్చు. దరఖాస్తుకు కావలసిన పత్రాలు ● ఆధార్ కార్డు, స్థలానికి సంబంధించిన సేల్డీడ్ లేదా రిజిస్ట్రేషన్ పత్రాలు. ● లింక్ డాక్యుమెంట్స్, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ (ఈసీ) ● బిల్డింగ్ ప్లాన్, స్థలం ఫొటోలు. అనుమతి పొందే విధానం: అధికారిక వెబ్సైట్ tgbpass.telangana.gov.inను సందర్శించండి. ● దరఖాస్తు ఎంపిక మీ ప్లాట్ సైజును బట్టి online service ఆప్షన్ను ఎంచుకోవాలి. ● యజమాని వివరాలు, ప్లాట్ కొలతలు, సర్వే నంబర్ వివరాలను నమోదు చేయాలి. ●పత్రాలను అప్లోడ్ చేయాలి. నిర్దేశించిన ఫీజును ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. ●దరఖాస్తు పూర్తయిన వెంటనే మీరు అనుమతి పత్రాన్ని (పర్మిషన్ సర్టిఫికెట్) డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముఖ్య గమనిక: ● స్వీయ ధృవీకరణలో తప్పుడు వివరాలు ఇస్తే నోటీసు ఇవ్వకుండానే నిర్మాణాన్ని కూల్చివేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ● ప్రభుత్వం మరింత వేగంగా అనుమతులు ఇచ్చేందుకు బిల్డ్ నౌ అనే కొత్త విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. ● మీరు మీ ప్లాట్ యొక్క కచ్చితమైన కొలతలు (చదరపు గజాల్లో) చెబితే, మీకు ఎంత ఫీజు అవుతుందో లేదా ఏ కేటగిరీ కిందకు వస్తుందో కూడా తెలుసుకోవచ్చు. -
మహిళా విద్యకు మార్గదర్శకురాలు సావిత్రీబాయి ఫూలే
● నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఖలీల్వాడి: మహిళా విద్యకు మార్గదర్శకురాలిగా, సమాజ సంస్కర్తగా నిలిచిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీ బాయి ఫూలే అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. శనివారం జిల్లా బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ పురస్కారాలు–2026 కార్యక్రమం నగరంలోని న్యూ అంబేడ్కర్ భవన్లో నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, యువత నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని గుర్తు చేశారు. ప్రయివేటుకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యాబోధన సాగుతోందని పది ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపినా, కేంద్రం అడ్డుకుంటోందని విమర్శించారు. కార్యక్రమంలో బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు వినోద్, నాయకులు నరాల సుధాకర్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, డీఈవో అశోక్, జెడ్పీ మాజీ చైర్మన్ విఠల్ రావు, కాంగ్రెస్ నాయకులు అగ్గు భోజన్న, రామచంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
వీరన్నగుట్టలో షార్ట్సర్క్యూట్
రెంజల్: మండలంలోని వీరన్నగుట్ట గ్రామంలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. రామాలయం ఆవరణలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి షార్ట్సర్క్యూట్ కావడంతో పక్కనే ఉన్న గోశాలలో నిప్పురవ్వలు పడ్డాయి. దీంతో గోశాలలోని గడ్డికట్టలు దగ్ధమవుతున్న విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే 14 గోవులను సురక్షితంగా బయటకు తరలించారు. విషయం తెలుసుకున్న బోధన్ ఫైరింగ్ స్టేషన్ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో మంటలను ఆర్పివేశారు. ఆలయ ప్రాంతంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి తరచూ మంటలు వస్తున్న విషయాన్ని ట్రాన్స్కో అధికారులు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని గ్రామస్తులు, ఆలక కమిటీ ప్రతినిధులు పేర్కొ న్నారు. ఇకనైనా ట్రాన్స్కో అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరారు. ● గోశాలలో తప్పిన ప్రమాదం.. ● 14 గోవులు సురక్షితం -
గ్రామాల అభివృద్ధిలో సర్పంచులదే కీలకపాత్ర
● కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్ రెడ్డి ఆర్మూర్: గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కల్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచులకు సన్మాన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు నగేశ్రెడ్డి హాజరై మాట్లాడారు. గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్ అని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత సీఎం రేవంత్రెడ్డి తీసుకున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన్న వీబీ జీ రాం జీ ఉపాధి చట్టాన్ని సర్పంచులు కేంద్రానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికై న సర్పంచులను సన్మానించారు. అదేవిధంగా పలు పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి ఆయన కండువా వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఉరూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏబీ చిన్నా, పట్టణ అధ్యక్షుడు సాయిబాబా, సీనియర్ నాయకు డు మార చంద్రమోహన్, పార్టీ మండలాల అధ్యక్షులు మంద మహిపాల్, రవి ప్రకాశ్, భూమేశ్వర్ రెడ్డి, చిన్నారెడ్డి, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. -
దంపతుల ఆత్మహత్యాయత్నం
ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణ శివారులో శనివారం సాయంత్రం దంపతులు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు య త్నించారు. ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పూర్ మండలం పడిగెల వడ్డెర కాలనీకి చెందిన అలకుంట రవితేజ(21), భార్య శోభ అలియాస్ లత(20) ఆర్మూర్ పట్టణ శివారులోని ఓ వెంచర్లో గడ్డి మందు సేవించి అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దంపతులను అంబులెన్స్లో పెర్కిట్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తీసుకెళ్లారు. వారు చికి త్స పొందుతున్నారు. కాగా, ఇరువురికి మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. కుటుంబకలహాలతోనే దంపతులు ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసింది. నిందితుడి అరెస్ట్ డిచ్పల్లి: ట్రాక్టర్ను దొంగిలించిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డిచ్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ వినోద్ తెలిపారు. శనివారం సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బర్దిపూర్ శివారులో గత నెల 5న ట్రాక్టర్ చోరీకి గురైంది. ట్రాక్టర్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శనివారం మధ్యాహ్నం నాగ్పూర్ గేట్ సమీపంలోని కృష్ణప్రియ దాబా ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు కామారెడ్డి జిల్లా రాజానగర్కు చెందిన దిండ్ల కరుణాకర్గా గుర్తించారు. అతను చేసిన తప్పును అంగీకరించి ట్రాక్టర్ను పోలీసులకు చూయించాడు. ట్రాక్టర్ను పీఎస్కు తరలించి అతన్ని రిమాండ్కు తరలించారు. సమావేశంలో డిచ్పల్లి ఎస్సై మహమ్మద్ ఆరిఫ్, సిబ్బంది పాల్గొన్నారు. సెల్ఫోన్ చోరీ ఘటనలో ఇద్దరు..నిజామాబాద్అర్బన్: నగరంలో గాంధీచౌక్ ప్రాంతంలో శుక్రవారం సెల్ఫోన్ షాపులో దొంగతనం చేసిన ఇద్దరు నిందితులను పట్టుకొని అరెస్టు చేసినట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. నగరంలో బాబన్సాహెబ్పహడ్ ప్రాంతానికి చెందిన శ్రీకాంత్, తరుణ్ గాంధీచౌక్లో ఉన్న ఓ సెల్ఫోన్ షాపులో దొంగతనం చేశారు. పోలీసులు వీరి నుంచి 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
ఆర్టిజన్ కార్మికుల సర్వీసును రెగ్యులరైజ్ చేయాలి
● రాష్ట్ర జేఏసీ చైర్మన్ సతీశ్ రెడ్డి డిచ్పల్లి: విద్యుత్ సంస్థల్లో ఎక్కడా లేని విధంగా ఒకే సంస్థలో రెండు రూల్స్ అమలు చేసి ఆర్టిజన్ కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని రాష్ట్ర జేఏసీ చైర్మన్ సతీశ్రెడ్డి విమర్శించారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం డిచ్పల్లి మండల కేంద్రంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యల సాధన సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు విద్యార్హతను బట్టి కన్వర్షన్ ఇవ్వాలన్నారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులకు ఏపీఎస్ఈబీ రూల్స్ అమలు చేయాలన్నారు. పీస్రేట్ కార్మికులకు జీవో నంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించి, 30 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర జేఏసీ కన్వీనర్లు ఎస్ సాయిలు, ఎస్ చంద్రారెడ్డి, కో–చైర్మన్ ఎస్ శ్రీధర్ గౌడ్, వైస్ చైర్మన్ సంతోష్ నాయక్, సికిందర్, శ్రీకాంత్, మెట్టు జాషువా, తలారి తిరుపతి, మహేందర్ గౌడ్, బట్టు గంగాధర్, రవీందర్, రాజు, విజయ్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. క్రైం కార్నర్ -
ఎన్ఎంసీలో పోలింగ్ కేంద్రాల పెంపు
● మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ ● రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశంసుభాష్నగర్: నిజామాబాద్ మున్సిపల్ కా ర్పొరేషన్లో పెరిగిన ఓటర్ల సంఖ్యకు అను గుణంగా పోలింగ్ కేంద్రాలను పెంచుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ తెలిపారు. శనివారం కా ర్పొరేషన్ కార్యాలయంలోని తన చాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో గతంలో 2.92 లక్షల మంది ఓటర్లు ఉండేవారని, ప్రస్తుతం 3.47 లక్షలకు పెరిగారని పేర్కొన్నారు. 413 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటి సంఖ్య 434కు పెరిగిందన్నారు. పెరిగిన పోలింగ్ కేంద్రాలకు భవనం, వసతులపై అభిప్రాయాలను సేకరించామని తెలిపారు. కొన్ని పోలింగ్ కేంద్రాలను మారుస్తున్నాని, వాటి స్థానంలో కొత్త కేంద్రాలను ఎంపిక చేశామన్నారు. ఈ నెల 13న ముసాయిదా పోలింగ్ కేంద్రాలను ప్రదర్శిస్తామని, 16న తుది పోలింగ్ కేంద్రాల జాబితాతోపాటు పోలింగ్ కేంద్రాల వారీగా ఫొటో ఓటరు తుది జాబితాను ప్రదర్శిస్తామని స్పష్టం చేశారు. ఓటరు జాబితాలో తప్పిదాలపై కమిషనర్, ఆర్డీవో, తహసీల్దార్లు, బీఎల్వోలతో వివరాలు సేకరించి సరి చేస్తున్నామని, ఏ డివిజన్లోని ఓటరు అదే డివిజన్లో ఓటు వేసేలా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామని కమిషనర్ పేర్కొన్నారు. అదనపు కమిషనర్ రవీందర్ సాగర్, ఏసీపీ శ్రీనివాస్, ఆయా పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నిజామాబాద్
గ్రామాభివృద్ధిలో.. గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్రెడ్డి పేర్కొన్నారు.ఆదివారం శ్రీ 11 శ్రీ జనవరి శ్రీ 2026– IIలో uనందిపేటలో వీడీసీ అడ్డుకున్న భవన నిర్మాణం ఇదే..గ్రామాల్లో వీడీసీల ప్రభుత్వ, ప్రైవేటు భూముల ఆక్రమణలకు ఎదురు లేకుండా పోయింది. బాధితుల ఫిర్యాదు మేరకు విచారించిన కోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తోంది. అయితే, అధికారులు, వీడీసీలు మిలాఖత్ కావడంతో క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. నందిపేట మండల కేంద్రంలో బఫర్ జోన్లో భవనం నిర్మిస్తున్నారని అడ్డుకున్న వీడీసీ అక్కడే గోడ నిర్మించడం విస్మయానికి గురిచేస్తోంది. ఒకరు ఇంటి కోసం వేసుకున్న బోరును పూడ్చివేయడం, మరొకరి పొలం గట్లను ధ్వంసం చేయడం మచ్చుకు కొన్ని వీడీసీల ఆగడాలకు నిదర్శనం -
అంగన్వాడీలకు ‘ప్రయోజనం’ అందేనా?
మోర్తాడ్(బాల్కొండ): మోర్తాడ్కు చెందిన శారద అంగన్వాడీ టీచర్గా పనిచేస్తూ 65 ఏళ్ల వయస్సు నిండటంతో రెండేళ్ల కింద పదవీ విరమణ చేశారు. ఆమెతోపాటు సుంకెట్కు చెందిన ఆలూరు గంగు, మోర్తాడ్లోని నూతికట్టు లక్ష్మి ఆయాలుగా పనిచే స్తూ పదవీ విరమణ చేశారు. అయితే, ప్రభుత్వం ఇప్పటి వరకు వారికి రిటైర్మెంట్ బెన్ఫిట్ను అందించలేకపోయింది. ఇది ఒక్క శారద, గంగు, లక్ష్మిలకు ఎదురైన సమస్యనే కాదు. జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసిన ఆయాలు, టీచర్లు పదవీ విరమణ చేసినా ప్రభుత్వం ప్రకటించిన సాయాన్ని అందించకపోవడంతో సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లాలో 180 మంది ఎదురుచూపులు.. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసేవారిలో 65 ఏళ్ల వయస్సు నిండిన వారిని పదవీ విరమణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా జిల్లాలో 120 మంది ఆయాలు, 60 మంది టీచర్లను రిటైర్మెంట్ చేయించింది. పదవి విరమణ చేసిన ఆయాలకు రూ.50 వేల చొప్పున, టీచర్లకు రూ.1 లక్ష వరకు సాయం అందిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఆయాలకు రూ.1 లక్ష, టీచర్లకు రూ.2 లక్షలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినా ఉత్తర్వులలో మాత్రం 50 శాతం కోత విధించింది. ఉత్తర్వుల ప్రకారమైనా జిల్లాలోని ఆయాలు, టీచర్లకు రూ.1.20 కోట్ల నిధులను విడుదల చేస్తే సరిపోతుంది. రెండేళ్లుగా రిటైర్ అయిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు బెన్ఫిట్స్ కోసం నిరీక్షిస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ఇప్పటికైనా పదవీ విరమణ చేసిన అంగన్వాడీ ఆయాలు, టీచర్లకు బెనిఫిట్ సొమ్ము విడుదల చేయాలని కోరుతున్నారు. నిధులు విడదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్తున్నారు.పదవీ విరమణ చేసిన ఉద్యోగుల మాదిరిగానే ఆయాలు, టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ను అందిస్తే సంతోషంగా ఉంటుంది. హామీ ఇచ్చిన ప్రకారం కాకపోయినా ఉత్తర్వులలో ఉన్న విధంగానైనా అ మలు చేయాలి. నిధుల విడుదలలో నిర్లక్ష్యం తగదు. త్వరలో నిధులు విడుదల చేయకపోతే ఆందోళనలు చేస్తాం. – దేవగంగు,అంగన్వాడీ హెల్ప్ర్స్, టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు పదవీ విరమణ చేసిన ఆయాలు, అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద మంజూరు కావాల్సిన డబ్బుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం మంజూరు చేయగానే వారికి సొమ్మును అందజేస్తాం. – రసూల్ బీ, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి పదవీ విరమణ చేసిన ఆయాలు, టీచర్లకు అందని బెనిఫిట్స్ ఆయాలకు రూ.50 వేలు, టీచర్లకు రూ.లక్ష అందజేస్తామన్న ప్రభుత్వం రెండేళ్లు గడుస్తున్నా నయాపైసా ఇవ్వని వైనం -
నగరాభివృద్ధే లక్ష్యం
● అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ● పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షసుభాష్నగర్ : ఇందూరు నగర అభివృద్ధే లక్ష్యంగా, ప్రజా సంక్షేమమే ఆశయంగా ముందుకు సాగుతున్నామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే కార్యాలయంలో పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులతో ఆయన శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో చేపడుతున్న పలు కీలక అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించి, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అనంతరం ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ అమృత్–2 పథకం కింద అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ, మ్యాన్హోల్స్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. నీటి సరఫరా వ్యవస్థకు సంబంధించిన అన్ని నిర్మాణాలను నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ప్రతి డివిజన్కు టీయూఎఫ్ఐడీసీ ఫండ్ నుంచి విడుదలైన రూ.కోటితో చేపట్టే అభివృద్ధి, మరమ్మతు పనుల కోసం టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. రామర్తి చెరువు సుందరీకరణ పనులను వేగవంతం చేసి, ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చిత్తశుద్ధితో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఈఈ తిరుపతి, మున్సిపల్ ఇన్చార్జి ఈఈ నాగేశ్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఏఈ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
బ్యాలెట్తోనే మున్సిపోల్స్
● పరోక్ష పద్ధతిలో చైర్పర్సన్ ఎన్నిక ● పార్టీ గుర్తులతో నిర్వహణకు ఎన్నికల కమిషన్ నిర్ణయంఆర్మూర్: మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్, పార్టీ గుర్తులతోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను ఈవీఎంల ద్వారా నిర్వహించిన ఎన్నికల కమిషన్.. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు కార్పొరేషన్లతోపాటు 117 మున్సిపాలిటీల్లో బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. కౌన్సిలర్ను ఎన్నుకొనేందుకు వినియోగించే బ్యాలెట్ పత్రాలు తెలుపు రంగులో, అభ్యర్థుల పేర్లు, పార్టీ గుర్తులతో ఉంటాయి. ఓటరు తాను ఓటు వేయాలనుకున్న అభ్యర్థి పార్టీ గుర్తుపై స్టాంప్ వేయాల్సి ఉంటుంది. పోలింగ్ అనంతరం ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఒక్కో బ్యాలెట్ పేపర్ను లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. ఈ విధానంలో వార్డు కౌన్సిలర్ల ఎంపికకు మాత్రమే ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు రావడంతో చైర్పర్సన్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రచారానికి నేతలు రెడీ.. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో పోటీ ల్లో ఉన్న సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులకు ప్రత్యేకంగా గుర్తులను కేటాయించారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం లాంటి ప్రధాన పార్టీల నాయకులు పంచాయతీ ఎన్నికల్లో అంటీ ముట్టనట్లుగా వ్యవహరించారు. గెలిచిన అభ్యర్థిని తమ పార్టీలో చేర్చుకోవచ్చనే నమ్మకంతో నేరుగా ప్రచారం చేసేందుకు ఆసక్తి చూపించలేదు. అయితే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తోపాటు ఆ ర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీల్లో నిర్వహించే ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థులు సమర్పించే బీ ఫాం ఆధారంగా రాజకీయ పార్టీల గుర్తులను కే టాయించనున్నారు. దీంతో నియోజకవర్గాల పరిధిలో పార్టీలకు నాయకత్వం వహిస్తున్న నేతలు అ భ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. మున్సిపాలిటీల్లో తమ పార్టీ జెండాను ఎగురవేస్తే భవిష్యత్లో నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కలిసి వచ్చే అంశంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్లో బీజేపీ ఎమ్మెల్యేలు ధన్పాల్, పైడి రాకేశ్ రెడ్డి, బోధన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, బా ల్కొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తమ పరిధిలోని మున్సిపాలిటీలపై ఆధిపత్యం కో సం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.


