breaking news
Nizamabad District Latest News
-
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన బీఆర్ఎస్
● కేసీఆర్కు ఆడబిడ్డ ఉసురు తగులుతుంది ● జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేశ్రెడ్డినిజామాబాద్ రూరల్: ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊ బిలోకి నెట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్రెడ్డి అన్నారు. మంగళవారం నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మట్లా డారు. కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ నాయకులు, ప్రజలకు శుభకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కమీషన్లకు కక్కుర్తి పడి నాయకులు తెలంగాణను దోచుకున్నారని మండిపడ్డారు. కమీషన్లు పంచుకునేటప్పుడు తేడాలు రావడంతోనే కవిత బీఆర్ఎస్ ను వీడారని అన్నారు. కేసీఆర్కు ఆడబిడ్డ కవిత ఉ సురు తగులుతుందన్నారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని ఆయన అన్నారు. అసెంబ్లీకి రా కుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీ జేపీ మతత్వ పార్టీ అని ఎన్నికలు రాగానే రాముని పేరు చేప్పి ఓట్లు దండుకోవాలని చూస్తారన్నారు. కార్పొరేషన్ డీసీసీ చైర్మన్ బొబ్బిలి రామకృష్ణ, క ల్లుగీత కార్మిక ఆర్థిక సంఘం ప్రణాళిక చైర్మన్ బాడ్సి శేఖర్ గౌడ్, శరత్, అంతిరెడ్డి రాజిరెడ్డి, రమేశ్రెడ్డి, గోపి, రవి, ప్రవీణ్ గౌడ్, రాజప్రసాద్, ఐసీడీఎంఎస్ మాజీ చైర్మన్ తారాచంద్ నాయక్, యాదగిరి, భక్తవత్సలం, వైశాక్షి సంతోష్, జావిద్ అక్రమ్, రేవతి, విపుల్ గౌడ్, రాజేంద్రప్రసాద్, సర్ధార్ నరేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం
● బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ బోధన్: కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాల న వైఫల్యాలను ప్రజలు ప్రశ్నించాలని, ఎన్నిక ల్లో అనేక వాగ్ధానాలు చేసి వాటిని అమలు చేయ కుండా ప్రజలను మోసం చేసిందని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమేర్ అన్నారు. పట్టణ కేంద్రంలోని ఆయన స్వగృహంలో పార్టీ పట్టణ, మండల ప్రతినిధులతో కలిసి నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నా రు. మూడేళ్ల పాలనలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి అధోగతి పాలైందని అన్నారు. తెలంగాణ రక్షణ సమితి వ్యవస్థా పక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బోధన్ నియోజకవర్గంలో పోటీ చేస్తానంటే స్వాగతిస్తామని ఆయన అన్నారు. కవిత బీఆర్ఎస్ మా జీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేల పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మా నాయకుడు కేసీఆర్, బీఆర్ఎస్కు కట్టుబడి ఉంటామని వెల్లడించారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీంద్ర యాదవ్, మండలాల అధ్యక్షులు సంజీవ్, గోగి నేని నర్సయ్య, భూంరెడ్డి, దేరడి శ్రీరాం, నర్సింగ్రావు, కౌన్సిలర్ గుమ్ముల అశోక్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
కాలువలో పడి యువకుడి మృత్యువాత
వర్ని: మండలంలోని నారాయణపురం గ్రామ శివారులో భోగవల్లి రఘు(36) అనే యువకుడు పంట కాలువలో పడి మృతి చెందినట్లు వర్ని ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. బీర్కూరు మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రఘు మతిస్థిమితం లేక గ్రామాల్లో తిరుతుంటాడు. మంగళవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు పంట కాలువలో పడి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నీటి తొట్టెలో పడి ఒకరు.. రెంజల్: ప్రమాదవశాత్తు నీటి తొట్టెలో పడి ఒకరు మృతి చెందినట్లు రెంజల్ ఎస్సై గంగాధర్ మంగళవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. రెంజల్ మండలంలోని కిసాన్తండా గ్రామానికి చెందిన జరుపుల హేమ్లా(58) తన ఇంటి ఆవరణలో ఉన్న నీటి తొట్టెలో పడిపోయిన అన్నం ప్లేట్ను బయటకు తీసే క్రమంలో జారి అందులో పడిపోయాడు. మద్యం మత్తులో ఉన్న ఆయన నీట మునగడంతో ఊపిరాడక మృతి చెందాడు. మృతుడి కుమారుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని బోధన్లోని జిల్లా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు ఎస్సై గంగాధర్ తెలిపారు. వేములవాడ: వేములవాడ పట్టణంలోని గుడిచెరువు కట్టకింది బస్టాండు ప్రాంతంలో ఓ కారు అదుపుతప్పి ట్రాన్స్ఫార్మర్ను మంగళవారం ఢీకొంది. ప్రమాదంలో కామారెడ్డికి చెందిన ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన ముగ్గురిని ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఎలాంటి ప్రాణహాని కలుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. -
సీపీఎస్ను రద్దు చేయాల్సిందే..
● పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా జిల్లాలో ఉద్యోగుల నిరసననిజామాబాద్ అర్బన్: సీపీఎస్ను రద్దు చేయాల్సిందేనని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు సుమన్కుమార్ అన్నారు. సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల జేఏసీ, గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్ అండ్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో మంగళవారం పెన్షన్ విద్రోహ దినాన్ని నిర్వహించారు. ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సము దాయంలో మంగళవారం భోజన విరామ సమయంలో ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. 2004 తరువాత ఉద్యోగాల్లో చేరిన వారందరికీ సీపీఎస్ గుదిబండగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్కు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని, ఈనెల 10వ తేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న మహాధర్నా కార్యక్రమానికి ఉద్యోగు లు తరలిరావాలని పిలుపునిచ్చారు. టీఎన్జీవోస్ నాయకులు పెద్దోళ్ల నాగరాజు, శ్రీనివాస్, జమీలుల్లా, ధర్మేందర్, మారుతి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అందని యూరియా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ‘ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్’(ఎఫ్ఎఫ్ఎస్) యాప్ ద్వారా సకాలంలో యూరియా బుకింగ్ కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగుకు అవసరమైన సమయంలో యూరియా అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాప్ ద్వారా బుకింగ్కు నోచుకోక, అఽధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆన్లైన్లో యాప్ ద్వారా తప్ప వేరే విధంగా యూరియా ఇచ్చే పరిస్థితి లేదని అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఇప్పటికే వరినాట్లు వేసి నెలరోజులు గడిచినా యూరియా దొరక్క ఎరువులు వేయలేదని, అదను దాటితే దిగుబడి వచ్చేది కష్టమేనని రైతులు చెబుతున్నారు. అవసరానికి సరిపడా కనిపించని సరఫరా జిల్లాలో యూరియాకు కొరత లేదని అధికారులు చెబుతున్నా.. పలుచోట్ల క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. చాలావరకు మండలాల్లో సహకార కేంద్రాలు, డీలర్ల ఎదుట యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని రైతులు చెబుతున్నారు. అలాగే జిల్లాలో కొందరు డీలర్ల వద్ద అధికంగా నిల్వలు ఉండటం, అవసరమైన నిల్వకు మించి బుకింగ్ నమోదవుతోంది. మరికొందరు డీలర్లకు కేటాయించిన నిల్వకన్నా తక్కువ స్థాయిలో బుకింగ్ అవుతోంది. కొన్ని గ్రామాలు, భూముల వివరాలు యాప్లో కనిపించకపోవడంతో ఆయా గ్రామాల రైతులకు బుకింగ్కు అవకాశం ఉండటం లేదు. సెకన్లలోనే నో స్టాక్.. ప్రభుత్వం తరచూ యూరియా యాప్లు మారుస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. గంటల తరబడి వేచి చూశాక యాప్ లో యూరియా బుకింగ్కు ప్రయత్నిస్తే క్షణాల్లోనే నో స్టాక్ చూపిస్తోంది. ఎన్నిసార్లు బుకింగ్ కోసం ప్రయత్నించినా యూరియా దొరకడం లేదు. అవసరమైన యూరియా అందుబాటులో ఉంచాలి. – మిట్టాపల్లి మల్లారెడ్డి, రైతు, డొంకేశ్వర్ జిల్లాలో ఈసారి ఖరీఫ్ సీజన్లో మొత్తం 80,857 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కానుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఇప్పటివరకు జిల్లాకు 64,542 మెట్రిక్ టన్నుల యూరియాను ప్రభుత్వం కేటాయించగా, రైతులకు 58,299 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ అయ్యింది. మరో 22,558 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాల్సి ఉంది. కానీ జిల్లాలో ఒకచోట ఎక్కువ మరో చోట తక్కువ సరఫరాతో రైతులకు యూరియా అందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో యూరియా నిల్వలకు ఎలాంటి కొరత లేదని, రైతులు ఆందోళన చెందొద్దని జిల్లా వ్యవసాయాధికారి వీరస్వామి అన్నారు. రైతుల ఇబ్బందులు తొలగించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రైతుల చేతికి 58,299 మెట్రిక్ టన్నులు ఎఫ్ఎఫ్ఎస్ యాప్ బుకింగ్తో కొనసాగుతున్న తిప్పలు కొరత లేదంటున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నం సాగుచేసి నెలరోజులైనా యూరియా అందక రైతుల ఆందోళన -
ఎవరితోనూ మంతనాలు జరపలేదు
కమ్మర్పల్లి(భీమ్గల్): కాంగ్రెస్ నాయకులతో తా ను మంతనాలు జరపలేదని లక్ష్మీనృసింహుని సన్నిధిలో ఉండి చెబుతున్నానని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఓడిపోయిన రెండో రోజే తాను కాంగ్రెస్తో మంతనాలు జరిపానని కవిత చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ప్రస్తుత కష్ట కాలంలో కేసీఆర్ వెంట ఉన్నది ఎవరో కవిత చెప్పాలని డిమాండ్ చేశారు. భీమ్గల్ లింబాద్రి గుట్టపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో, ప్రజాక్షేత్రంలో సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది ప్రశాంత్రెడ్డి నా.. కవితనా అని ప్రశ్నించారు. తను రహస్యంగా కాంగ్రెస్ నాయకులతో మంతనాలు చేయలేదని కవిత చెప్పగలరా అని నిలదీశారు. ఎవరి ప్రయోజనాల కోసం కవిత తనపై నిరాధార ఆరోపణలు చేశారో ప్రజలకు తెలుసన్నారు. మాజీ సీఎం కేసీఆర్, కవితను కలపడానికి ప్రయత్నం చేశానో, లేక విడదీయడానికి ప్రయత్నం చేశానో కేసీఆర్కు బాగా తెలుసన్నారు. పార్టీ లైన్ దాటిన తర్వాతనే కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని స్పష్టం చేశారు. కవిత సభలో కన్నీళ్లు పెట్టుకోవడం రాజకీయంగా సానుభూతిని సంపాదించడానికేనని అర్థమవుతోందని, అది ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. లక్ష్మీనృసింహుని సన్నిధిలో ఉండి చెబుతున్నా.. తను కాంగ్రెస్తో మంతనాలు జరపలేదని కవిత చెప్పగలరా? మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి -
నమ్మించి..నట్టేట ముంచి
పాపన్నపేట(మెదక్): నమ్మించి, అధిక వడ్డీల ఆశ చూపి సుమారు రూ.2.20 కోట్లతో ఓ వ్యాపారి ఉడాయించాడు. ఈ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని చిత్రియాల్ చౌరస్తాలో ఆలస్యంగా వెలుగు చూసింది. అత్తకు తెలియకుండా.. కోడళ్ల వద్ద, తండ్రికి తెలియకుండా.. కొడుకుల వద్ద ఇలా అందిన కాడికి దండుకొని సుమారు 80 మందికి టోకరా పెట్టాడు. దీంతో బాధితులు రెండు నెలలుగా అతని కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన గౌతం దంపతులు 2022లో పాపన్నపేట మండలం చిత్రియాల్ చౌరస్తాలో కిరాణ దుకాణం ఏర్పాటు చేసుకున్నారు. అందరితో ఆత్మీయంగా మాట్లాడే దంపతులు అనతి కాలంలోనే, స్థానికుల నమ్మకాన్ని చూరగొన్నారు. చే బదుళ్లతో మొదలైన వ్యవహారం, అప్పుల వరకు వెళ్లింది. నూటికి రూ.3 వరకు ఠంచన్గా నెల నెలా వడ్డీ చెల్లిస్తుండటంతో, ఆశలో పడిన స్థానికులు, అప్పులిచ్చారు. ఇలా అనతి కాలంలోనే 80 మంది వద్ద సుమారు రూ.2.20 కోట్ల వరకు అప్పులు తీసుకొని, ఇల్లు, వరికోత మిషన్, ఇతర ఆస్తులు కొనుగోలు చేసినట్లు బాధితులు తెలిపారు. కానీ ఆస్తులేవీ అతని పేర రిజిస్ట్రేషన్ చేసుకోలేనట్లు తెలుస్తోంది. ఒక్క ఇల్లు మాత్రం భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. చిత్రియాల్కు చెందిన ఒకే కులస్తుల నుంచి సుమారు రూ.40 లక్షల వరకు అప్పు తీసుకున్నట్లు బాధితులు తెలిపారు. గ్రూపుగా ఏర్పడి పెట్టుకున్న చిట్టీ డబ్బులు కూడా ఎత్తుకున్నట్లు తెలిసింది. గాజులగూడెంకు చెందిన ఓ మహిళ భర్త చనిపోతే వచ్చిన రూ.5 లక్షలు కూడా అతని చేతిలో పెట్టినట్లు సమాచారం. కొంత మంది మహిళలు వడ్డీపై ఆశతో కాళ్ల కడియాలు, పట్ట గొలుసులు అమ్మి సదరు వ్యాపారికి అప్పుగా ఇచ్చినట్లు తెలిసింది. రెండు నెలలుగా అతని జాడ తెలియకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసినట్లు పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వ్యాపారి గతంలోనూ సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో సైతం ఇలా అప్పులు చేసి, బిచానా ఎత్తేశాడని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ● సుమారు 2.20 కోట్లతో వ్యాపారి పరారీ ● లబోదిబోమంటున్న 80 మంది బాధితులు -
అమరవీరుల కుటుంబాలకు ఫ్యామిలీ కార్డుల పంపిణీ
నిజామాబాద్ అర్బన్: పోలీస్ అమరవీరుల కుటుంబాలకు టీజీ వీర్ ఫ్యామిలీ కార్డులను సీపీ సాయి చైతన్య మంగళవారం పంపిణీ చేశారు. గతంలో జిల్లా నుంచి నక్సలైట్ల కాల్పుల్లో 14 మంది పోలీసులు మరణించారని వీరి కుటుంబాలకు సీపీ ఫ్యామిలీ కార్డులను అందించారు. కార్యక్రమంలో అమరవీరుల కుటుంబ సభ్యులు ఉన్నారు.వేల్పూర్(బాల్కొండ): బాల్కొండ మండల కేంద్రంలోని ఆర్మూర్గల్లి ఏరియాకు చెందిన పిట్ల ఉమారాణి(21) కుటుంబ కలహాలతో మంగళవారం తల్లిగారి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శైలేందర్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ అర్బన్: వర్ని చౌరస్తాలో సోమవారం రాత్రి ఓ వ్యక్తి పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని ఇద్దరిపై కత్తితో దాడి చేశాడు. రెండో టౌన్ ఎస్సై యాదగిరి గౌడ్ మంగళవారం తెలిపిన వివరాలప్రకారం.. మాధవనగర్కు చెందిన జాదవ్ గణేశ్ అతని స్నేహితుడు ఆదిత్య ఇద్దరు ఆటోలో వర్ని చౌరస్తాకు వచ్చా రు. అక్కడ లక్కె నవీన్ అనే వ్యక్తి పాత కక్షలతో గ ణేశ్ పై కత్తితో దాడి చేశారు. వీపులో కత్తితో పొడవు గా అతని స్నేహితుడు ఆదిత్య అడ్డుకునే ప్రయత్నం చేయగా అతని చాతిపై సైతం నిందితుడు పొడిచా డు. ఈ ఘటనపై గణేశ్ పోలీసులకు ఫిర్యాదు చే యగా విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు న వీన్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
పలువురిపై కేసులు నమోదు
మోపాల్: మండలంలోని ముదక్పల్లి ఫారెస్ట్ సౌత్ బీట్ పరిధిలో ఉన్న కంపార్ట్మెంట్ నంబర్ 159 శివారు ప్రాంతాల్లో చెట్లను అనధికారికంగా నరికేసిన పలువురిపై అటవీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు నిజామాబాద్ సౌత్ ఎఫ్ఆర్వో రవిమోహన్ భట్ మంగళవారం తెలిపారు. రామేశ్పూర్ తండా (శివలాల్ తండా)కు చెందిన కేతావత్ సరియ, కేతావత్ పీక, కేతావత్ లక్ష్మణ్, కేతావత్ రాము, గుగులోత్ రమేశ్, నేనవత్ నరేందర్తోపాటు ఇతరులు చెట్లు నరికినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ముదక్పల్లి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎంఏ బాసిత్, బీట్ ఆఫీసర్ సయ్యద్ సాబేర్ చెట్లు నరికేసిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించి నివేదికను అందజేశారని, ఆ నివేదిక ఆధారంగా వారిపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీరిపై అటవీ చట్టాలు, సంబంధిత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని పాతకలెక్టరేట్ మైదానంలో సోమవారం తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కవిత సభ నిర్వహించారు. ఇందులో వేలాది మంది పాల్గొన్నారు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇద్దరు వ్యక్తుల నుంచి బంగారు చైన్లను దొంగిలించారు. ఒక వ్యక్తికి చెందిన రెండు తు లాల బంగారు, మరో వ్యక్తికి చెందిన మూడు తులా ల బంగారు చైన్లు చోరీకి గురైనట్లు ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కలప స్వాధీనం సిరికొండ: భీమ్గల్ మండలంలోని ముచ్కూర్ గ్రా మంలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలపను స్వాధీనం చేసుకున్నట్లు సిరికొండ ఎఫ్ఆర్వో న ర్సింగ్రావు మంగళవారం తెలిపారు. కలప వ్యాపా రం నిర్వహించే కొయ్యాడ చిన్న కిష్టాగౌడ్ వద్ద అ క్రమ టేకు కలప ఉందనే సమాచారం మేరకు దాడి చేశామన్నారు. ఇందులో రూ.1,11,805 విలువ చేసే కలపను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎఫ్ఆర్వో తెలిపారు. -
చిరుతల హల్చల్
● కల్లెడి, చిన్నాపూర్ అటవీ ప్రాంతాల్లో కదలికలుమాక్లూర్: మండలంలోని గాలిబ్నగర్ నుంచి కల్లెడి వెళ్లే రహదారి పక్కన అటవీ ప్రాంతంలో గుత్ప నీటి ఎత్తిపోతల పథకం వద్ద గత నెల 31వ తేదీన స్థానికులకు రెండు చిరుతలు కనిపించాయి. ఓ వాహనదారుడు చిరుత కదలికలను తన సెల్ఫోన్లో బంధించాడు. వీడియో వైరల్ కావడంతో రైతులు, పశువుల, గొర్రెల కాపరులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ఫారెస్ట్ అధికారులు స్పందించి మంగళవారం కల్లెడిలో సర్పంచ్ గంగ్గోల్ల సుస్మిత ప్రళయ్తేజ్ అధ్యక్షతన వన్యప్రాణులపై ఆవగాహన సదస్సు నిర్వహించారు. చిన్నాపూర్, కల్లెడి, అడవి మామిడిపల్లి, గుత్ప శివారుల వ్యాప్తంగా విస్తరించి ఉన్న అడవిలో చిరుత పులులు తరుచుగా కన్పిస్తున్నాయని ఫారెస్ట్ రేంజ్ అధికారి అరుణ్కుమార్, డిప్యూటీ రేంజ్ అధికారి ఎస్ అశోక్కుమార్ తెలిపారు. సుమారు ఏడు నుంచి ఎనిమిది చిరుతలు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నాయన్నారు. అనుకోకుండా కనిపించిన చిరుతలను రాళ్లతో కొట్టి తరమవద్దని, వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు. అటవీ ప్రాంతంలోని పంట పొలాల్లోకి రైతులు ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు. చిరుతల నుంచి రక్షణ కోసం త్వరలో తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
వెయ్యి రోజుల పాలనలో ఏం చేశారో చెప్పాలి
● ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిఆర్మూర్టౌన్: రేవంత్ రెడ్డి సర్కార్ ఖజానాకు కన్నం వేయడం, పాతగోడలకు సున్నం వేయ డం తప్ప ఈ వెయ్యి రోజుల పాలనలో ఏం చే శారో చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆ ర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి డిమాండ్ చే శారు. ఆర్మూర్ సిద్ధుల గుట్ట శివయ్య సాక్షిగా ఎ న్నికల హామీలు అమలు చేస్తానని నాడు ఒట్టు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలను, 420 హామీలను గాలికి వదిలేశారని అన్నారు. నవనాథ సిద్ధుల గుట్టపై నిర్వహించిన విలేకరు ల సమావేశంలో మాట్లాడారు. ఇచ్చిన హామీల అమలు జరిగేంతవరకు బీఆర్ఎస్ పార్టీ చేపట్టి న పోరు ఆగదన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు పృథ్వీరాజ్, నయీమ్, మాజీ ద్, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. -
సర్కారు బడి హరిత లోగిలి
రుద్రూర్ : బడి అంటే పుస్తకాలు, పరీక్షలు మాత్రమే కాదు.. పిల్లల మనసులను వికసింపజేసే ఒక అందమైన ప్రపంచం. అక్షరాల తోటగా మాత్రమే కా దు.. పచ్చని చెట్లతో కూడిన హరిత లోగిలిగా రూపుదిద్దుకున్నదీ ఆ సర్కారు బడి. పాఠశాల ఆవరణలో నాటిన ప్రతి మొక్క ఒక విద్యార్థి భవిష్యత్తులా పెరుగుతోంది. తరగతి గది లోపల అక్షరాల వెలుగు, బయట ప్రకృతి పచ్చదనం తోడై నందనవనంగా మారింది నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) ప్రాథమికోన్నత పాఠశాల. పొదుపు అలవాటుకు ‘సంచాయిక’ విద్యార్థుల్లో పొదుపు అలవాటును పెంపొందించేందుకు పాఠశాలలో బాలల సంఘం, ‘సంచాయిక’ కార్యక్రమాలు అమలు చే స్తున్నారు. ప్రతి ఏడాది విద్యార్థులను విజ్ఞాన విహా ర యాత్రలకు తీసుకెళ్లి పాఠ్యాంశాలతోపాటు వివిధ ప్రాంతాల విశేషాలను ప్రత్యక్షంగా తెలుసుకునేలా చేస్తున్నారు. ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా విద్యార్థులకు టై, బెల్ట్, షూస్, స్పోర్ట్స్డ్రెస్ అందజేస్తున్నారు. ప్రత్యేకం.. ‘తిథి భోజనం’ పాఠశాలలో ‘తిథి భోజనం’ ప్రత్యేక ఆకర్షణగా ని లుస్తోంది. గ్రామపెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల పుట్టిన రోజులు లేదా ఇతర ప్రత్యేక సందర్భాల్లో ‘తిథి భోజనం’ పేరిట విద్యార్థులకు ప్రత్యేక వంటకాలను రుచి చూపిస్తున్నారు. బడిలోనే.. సాగు‘పాఠాలు’ పిల్లలకు చదువుతోపాటు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని పా ఠశాల ఆవరణలోనే కూరగాయల సాగు చేపడుతున్నారు. పాఠశాల ప్రాంగణంలో పాలకూర, మెంతికూర, టమాట వంటివి సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నారు. అదే విధంగా పాఠశాల ప్రాంగణంలో పచ్చని మొక్కల మధ్య చదువుల తల్లి సరస్వతి దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆవరణ మొత్తం తీగజాతి, అలంకార మొక్కలైన మయూర పంఖి, స్పైడర్ ప్లాంట్, ఫైకస్, పామ్ జాతి మొక్కలు ఆహ్లాదం పంచడంతోపాటు ఆకట్టుకుంటున్నాయి. అంబం(ఆర్) ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో ఆహ్లాదకరమైన గ్రీనరిపాఠశాల ఆవరణలో చదువుల తల్లి సరస్వతి విగ్రహం పాఠశాలపై ప్రత్యేక శ్రద్ధ ప్రయివేటు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు కల్పించేందుకు ఉపాధ్యాయులతో కలిసి పనిచేస్తున్నాం. విద్యార్థుల సంఖ్య పెరగడం సంతోషంగా ఉంది. స్లాబ్ మరమ్మతులు, అదనపు టాయిలెట్ల నిర్మాణం, ఖాళీ ఉపాధ్యాయ పోస్టు భర్తీ వంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తాం. – కుర్లెపు గంగాధర్, సర్పంచ్80 నుంచి 110కి పెరిగిన విద్యార్థుల సంఖ్య అంబం(ఆర్) ప్రాథమికోన్నత పాఠశాలలో గతేడాది 80 మంది విద్యార్థులుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 110కి చేరింది. 2016లో గ్రామానికి చెందిన పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదివేందుకు ఆసక్తి చూపుతున్నారని వీడీసీ సభ్యులు గ్రహించారు. వీడీసీ సహకారంతో అప్పటి హెచ్ఎం రాంకుమార్ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం బోధన ప్రారంభించారు. దీంతో పాఠశాల సందర్శనకు వచ్చిన ఉన్నతాధికారుల బృందం ఈ పాఠశాలకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చింది. కాగా ఈ విద్యా సంవత్సరం పాఠశాలకు ప్రీప్రైమరీ తరగతులు కూడా మంజూరు కావడంతో ఒక టీచర్, ఆయా అందుబాటులోకి వచ్చారు. గ్రామస్తులు, దాతల సహకారంతోనే.. గ్రామస్తులు, దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో పాఠశాలను అభివృద్ధి చేస్తున్నాం. విద్యార్థు లకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు పొదుపు అలవాటు, క్రమశిక్షణ, పరిశుభ్రత, విజ్ఞానా న్ని పెంపొందించే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక వసతులు క ల్పించాలి. – మనోజ్ వైద్య, ప్రధానోపాధ్యాయుడు ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులకు పాఠాలు పొదుపు అలవాట్లు, సాగు పాఠాలు ప్రత్యేకం ఆదర్శం అంబం(ఆర్) ప్రాథమికోన్నత పాఠశాల -
పెద్దల చేతికి మసి అంటకుండా..
డొంకేశ్వర్(ఆర్మూర్): అటవీ శాఖలో ఏ సంఘటన జరిగినా అధికారులు తప్పించుకోవడానికి కింది స్థాయి ఉద్యోగులను బలి పశువులను చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెంజల్ మండలం నీలా శివారులోని బొగ్గుబట్టి ఘటనలో కూడా ఇదే జరిగిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో లైసెన్స్ రద్దయిన వ్యక్తికే మళ్లీ అనుమతు లు కట్టబెట్టిన అధికారుల్లో ఏ ఒక్కరిపై కనీస చర్యలు లేకపోవడం చూస్తే ‘సేఫ్గేమ్’ ఆడుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలోనే పెద్దల చేతికి ‘మసి’ అంటకుండా సెక్షన్ ఆఫీసర్పై చర్యలు తీసుకుని బలిపశువును చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 5న సదరు బొగ్గుబట్టీపై అటవీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. బొగ్గు తయారీ కోసం అనుమతి లేని విలువైన అటవీ కలపను యథేచ్ఛగా వినియోగిస్తున్నట్లు గుర్తించి, సదరు వ్యాపారులపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. హైదరాబాద్ నుంచి విజిలె న్స్ అధికారులు జిల్లాకు వచ్చి బొగ్గుబట్టీ ఘటనపై ఆరా తీసి ఉన్నతాధికారులకు నివేదించారు. సెక్షన్ ఆఫీసర్తోపాటు మరో ఇద్దరు పైస్థాయి అధికారుల పేర్లు కూడా నివేదికలో ఉన్నట్లుగా సమాచారం. అనుమతి లేకుండా రెండు, మూడు చెట్లు నరికితేనే వేలల్లో జరిమానా విధిస్తుంటే.. కలపతో అక్రమంగా బొగ్గుబట్టీ నడుస్తున్నా రెండేళ్లుగా పట్టనట్లుగా ఉన్న అధికారులపై ఎలాంటి చర్యలు కానరాకపోవడం అటవీ శాఖలో చర్చ జరుగుతోంది. ఉన్నతాధికారులదే నిర్ణయం నిబంధనలకు విరుద్ధంగా నడిచిన బొగ్గుబట్టీ విషయంపై జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయి విజిలెన్స్ విచారణ జరిగింది. రాష్ట్ర అధికారులకు నివేదిక చేరింది. ఇప్పటికే ఒక ఆఫీసర్ సస్పెండ్ అయ్యారు. ఇంకా ఎవరెవరిపై చర్యలు తీసుకోవాలనే నిర్ణయం పైస్థాయి అధికారులే తీసుకుంటారు. – ప్రశాంత్ బాజీరావు పాటిల్, డీఎఫ్వో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్పై చర్యలు.. బొగ్గుబట్టి ఘటనలో పైస్థాయి అధికారులపై కానరాని చర్యలు తమను బలి చేస్తున్నారని కిందిస్థాయి ఉద్యోగుల ఆవేదన -
రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రవాసి మృతి
బోధన్: ఎడపల్లి మండల కేంద్రంలోని రైల్వేగేట్ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్ర ప్రాంత వాసీ మృతి చెందాడని ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ మంగళవారం తెలిపారు. నాందేడ్ జిల్లా దెగ్లూర్ తాలూకా పరిధిలోని చైన్పూర్ గ్రామానికి చెందిన గణపతి పీరాజీ కామ్లే పాడేవార్(50), సూర్యకాంత్ లక్ష్మణ్ పాడేవార్ నాలుగేళ్ల నుంచి బాల్కొండ మండలంలోని బోదేపల్లిలో వ్యవసాయ పనులకు జీతం ఉన్నారు. సూర్యకాంత్ లక్ష్మణ్ పాడేవార్ తన యాజమాని బైక్పై రాఖీ పండుగకు స్వగ్రామానికి వెళ్లాడు. తిరిగి అదే బైక్పై బోధన్లో ఉన్న గణపతి పీరాజీ కామ్లే పాడేవార్ను వెనుక కూర్చుబెట్టుకుని బోదేపల్లి వెళ్లే క్రమంలో ఎడపల్లి రైల్వే గేట్ దాటిన తర్వాత బైక్ అదుపు తప్పి ఇద్దరు కిందపడ్డారు. గణపతి పీరాజీ కామ్లే పాడేవార్కు తీవ్రగాయాలు కాగా స్థానికులు అంబులెన్స్లో బోధన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పీరాజీ అప్పటికే మృతి చెందాడన్నారు. సూర్యకాంత్కు స్వల్ప గాయాలయ్యాయి. బంధువు గౌతం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. బొలెరో, ఎక్సెల్ ఢీకొని ఒకరు.. తాడ్వాయి: బొలెరో వాహనం, ఎక్సెల్ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన తా డ్వాయి మండలం ఎ ర్రపహాడ్ శివారులో మంగళవా రం చోటు చేసుకుంది. ఎ స్సై నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎండ్రియల్ గ్రామానికి చెందిన చాకలి భీమయ్య (80) మందు ల కోసం తన టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై ఎర్రపహాడ్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. తిరిగి గ్రామానికి వస్తుండగా తాడ్వాయి నుంచి ఎర్రపహాడ్ వైపు అతివేగంగా వస్తున్న బొలెరో వాహనం భీమయ్యను ఢీ కొన్నది. ఈ ఘటనలో అతని తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు రమాకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వంద క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని మిర్చికంపౌండ్ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న వంద క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఒకటో టౌన్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. మిర్చికంపౌండ్లో న్యూపాపులర్ ట్రాన్స్ఫోర్టు నుంచి 400 బ్యాగులు 100 క్వింటాళ్ల రేషన్ బియ్యానిన మహారాష్ట్రకు తరలిస్తున్నారనే సమాచారం రావడంతో దాడిచేసి పట్టుకున్నట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. ట్రాన్స్ఫోర్టు యజమాని జానీపాషా, అబ్దుల్ లతీఫ్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని అన్నారు. నందిపేట్లో 22.60 క్వింటాళ్లు.. నందిపేట్: మంల కేంద్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న 22.60 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని నందిపేట్ పోలీసులు పట్టుకున్నారు. నందిపేట పీఎస్ పరిధి లోని రైతు ఫారం గ్రామ శివారులో ఎస్సై వినయ్ వాహనాల తనిఖీ చేపట్టారు. ఇందులో బొలెరో వాహనంలో 22.60 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నారు. డ్రైవర్ సయ్యద్ అన్సార్, ఎండీ మోసిన్, చోటు, వా హన యజమా ని భైంసా పట్టణానికి చెందిన మహమ్మద్ ఖురేషిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఉపకార వేతనాల దరఖాస్తు గడువు పొడిగింపు
కమ్మర్పల్లి: కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ద్వారా బీడీ కార్మికుల పిల్లలకు అందిస్తున్న ఉపకార వేతనాల దరఖాస్తు గడువును పొడిగించినట్లు బీడీ కార్మికుల సంక్షేమ శాఖ భీమ్గల్ డివిజన్ అధికారి గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలకు సెప్టెంబర్ 30లోగా, ఇంటర్, డిగ్రీ విద్యార్థులు పోస్ట్మెట్రిక్ ఉపకార వేతనాలకు అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బీడీ కార్మిక కుటుంబాల వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.52లక్షలుగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. బోధన్టౌన్(బోధన్): పట్టణంలోని స్కానింగ్ సెంటర్లను డీఎంహెచ్వో రాజశ్రీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భ్రూణ లింగ నిర్ధారణ, లింగ ఎంపికకు సంబంధించిన కార్యకలాపాలు చట్టవిరుద్ధమని, ప్రతీ స్కానింగ్ కేంద్రంలో పీసీపీ ఎన్డీటీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఉప వైద్యాధికారి విద్య, సిబ్బంది తదిత రులు పాల్గొన్నారు. పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం అంకా పూర్ గ్రామాన్ని నైజీరియా దేశం ఓగున్ రాష్ట్రం అభికుచ్ అనే గ్రామానికి చెందిన మైకేల్, బిసో ల అనే రైతులు గురువారం సందర్శించారు. నైజీరియాలో వ్యవసాయం చేస్తున్న మైకేల్, బిసోల అధిక దిగుబడులను సాధించడానికి అంకాపూర్ను సందర్శించారు. ఈసందర్భంగా వారు అంకాపూర్లో సాగవుతున్న పసుపు పంట, విత్తన శుద్ధి ప్లాంట్లను పరిశీలించారు. అనంతరం అంకాపూర్ సర్పంచ్ అంక్సాపురం దేవేందర్ రెడ్డితో సమావేశమై పసుపు పంటలో అధిక దిగుబడులు సాధించడానికి తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తిరుపతిరెడ్డి, కేకే భాజన్న, శేష సాయి తదితరులు పాల్గొన్నారు. తెయూ(డిచ్పల్లి): రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ సీహెచ్ పార్థసారథి గురువారం డిచ్పల్లి మండలంలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడవ బెటాలియన్ను సందర్శించారు. గతంలో తెయూ వైస్చాన్స్లర్గా పార్థసారధి సేవలందించారు. ఈసందర్భంగా ఆయనను తెయూ రిజిస్ట్రార్ యాదగిరి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. వర్సిటీ అభివృద్ధిపై రిజిస్ట్రార్తో ఆయన చర్చించారు. వర్సిటీ అభివృద్ధికి భవిష్యత్తులో తనవంతు పాత్ర ఉంటుందని హామీ ఇచ్చారు. -
జయ కృష్ణా.. ముకుందా.. మురారి
● నేడు శ్రీకృష్ణాష్టమి ● వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న భక్తులునిజామాబాద్ రూరల్: ప్రజల ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడి పుట్టిన రోజు పండుగను నేడు (శ్రువారం) శ్రావణ మాసం బహుళ అష్టమి, రోహిణి నక్షత్రం సందర్భంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. ద్వాపరయుగంలో ఈ పర్వదినాన కృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈనేపథ్యంలో జిల్లావ్యాప్తంగా అన్ని వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించనున్నారు. భక్తులు ఉదయాన్నే తలస్నానం చేసి, గృహాన్ని, పూజా మందిరాన్ని శుభ్రపరుచుకుని మామిడి తోరణాలతో అలంకరిస్తారు. ఇంటి గుమ్మం నుంచి పూజా మందిరం వరకు వరిపిండితో కృష్ణుడి చిన్ని పాదాలను ముద్రించడం ఇక్కడి ప్రత్యేకత. ఇతర పూజలకు భిన్నంగా శ్రీకృష్ణాష్టమి పూజా కార్యక్రమాలను చాలావరకు మధ్యాహ్నం ప్రారంభించడం సాంప్రదాయంగా వస్తోంది. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్న, అటుకులు, చలిమిడి, సున్ని ఉండలు, ఆవు పాలు అలాగే ఐదు మధుర పదార్థాలతో కూడిన పంచ ఖజ్జాయాన్ని నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. పవిత్ర దినాన కన్నయ్యను భక్తితో పూజిస్తే సమస్త పాపాలు తొలగి మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పలుచోట్ల స్వామివారికి 56 రకాల భోగ్లను నైవేద్యాలుగా సమర్పిస్తారు. అయితే ఏ నైవేద్యం సమర్పించినా దానిపై తులసి దళాలను ఉంచడం మాత్రం తప్పనిసరి. ఇక సాయంత్రం వేళ వాడవాడలా ’ఉట్టి కొట్టే’ వేడుకలు కోలాహలంగా సాగుతాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను శ్రీకృష్ణుడు, గోపికల వస్త్రధారణలతో ముస్తాబు చేసి ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ పవిత్ర రోజున భాగవతంలోని దశమ స్కంధాన్ని పారాయణం చేయడం, అష్టోత్తర శతనామ సహస్రనామ పూజలు చేయడం ద్వారా వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు పేర్కొంటున్నారు. నగరంలో ఉత్సవాలకు శ్రీకృష్ణాలయం, పెద్దబజార్లోని కృష్ణమందిరం ఆలయాలను ఆయా ఆలయాల కమిటీల ఆధ్వర్యంలో విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. -
కేరళం రాష్ట్ర సంస్కృతికి ప్రతీక ఓనం
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): ఓనం పండుగ కేరళం రాష్ట్ర సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్ అన్నారు. మండలంలోని తిరుమల నర్సింగ్ కళాశాలలో గురువారం నిర్వహించిన ఓనం వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా కళాశాల చైర్మన్ పరమేశ్వర్రెడ్డి, కరస్పాండెంట్ పద్మావతిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. తమ కళాశాలలో చదువుతున్న కేరళం విద్యార్థుల కోసం గత పదేళ్లుగా ప్రతిఏటా ఓనం పండుగను నిర్వహిస్తున్నట్లు చైర్మన్ పరమేశ్వర్రెడ్డి తెలిపారు. వేడుకల్లో విద్యార్థినులు రంగురంగుల పువ్వులతో వేసిన అందమైన రంగవల్లులు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది. తాహెర్తోపాటు పరమేశ్వర్రెడ్డి ఉత్సాహంగా ఉట్టి కొట్టారు. అనంతరం ‘ఓనం సాద్య’ విందును విద్యార్థులు, అతిథులు, అధ్యాకులు, సిబ్బంది ఆరగించారు. డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్రెడ్డి విద్యార్థులకు, అధ్యాపకులకు ఓనం పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రిన్సిపాల్ ప్రతిభ, వినీల్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
సీసీ కెమెరాల ఏర్పాటుతో పటిష్ట నిఘా
● సీపీ సాయి చైతన్య ● పెగడపల్లి గ్రామంలో 15 సీసీ కెమెరాలు ప్రారంభంబోధన్రూరల్: సీసీ కెమెరాల ఏర్పాటుతో గ్రామంలో పటిష్టమైన నిఘా ఉంటుందని, ఒక్కో కెమెరా 100 మంది పోలీసులతో సమానమని సీపీ సాయిచైతన్య అన్నారు. మండలంలోని పెగడపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన 15 సీసీ కెమెరాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రజల భద్రతలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవచ్చని, నేరాల నియంత్రణతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు కూడా ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతి దుకాణం, వ్యాపార సంస్థల యజమానులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పెగడపల్లిలో కెమెరాల ఏర్పాటుకు సహకరించిన శాలిమార్ హ్యాచరీస్ యాజమాన్యాన్ని సీపీ అభినందించారు.విద్యార్థులు ఆకర్షణలకు లోనుకాకుండా విద్యపై దృష్టిసారించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్ బాబు, ఎస్ఐ రాజశేఖర్, సర్పంచ్ రచన, శాలిమార్ హ్యాచరీస్ మేనేజర్ ఇమ్రా ముల్లా, వైస్ ప్రెసిడెంట్ పోతు రెడ్డి, ఉపసర్పంచ్ ఎండీ షబ్బీర్, విలేజ్ కమిటీ అధ్యక్షుడు సాయిబాబు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాద ఘటనాస్థలి పరిశీలన బోధన్టౌన్(బోధన్): పట్టణంలోని బైపాస్ రోడ్డు అంబేడ్కర్ కాలనీ వద్ద గురువారం ఓ కారు బైక్ను తప్పించబోయి అదుపుతప్పి అక్కడే ఉన్న హోటల్ లోకి దూసుకుపోయింది. అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పట్టణ సీఐ వెంకట నారాయణను వివరాలు కోరగా ప్ర మాదం జరిగినట్లు సమాచారం ఉందని ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఈ ప్రమాదంలో ఎవరికీ గా యాలు కాలేదని సీఐ తెలిపారు. కొద్దిసేపటికి ఘటన స్థలాన్ని సీపీ సాయి చైతన్య పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు, వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ విధ్వంసం
● కేసీఆర్ హయాంలో రాజుగా రైతు ● ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్: కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర విధ్వంసానికి గురవుతోందని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వేల్పూర్ క్రాస్రోడ్డు వద్దగల 44 నెంబరు జాతీయ రహదారిపై గురువారం నిర్వహించిన బాల్కొండ నియోజకవర్గ రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన ఏడాదిన్నరలోనే కేసీఆర్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసి దేశంలో ఎక్కడా లేనివిధంగా 24 గంటల ఉచిత విద్యుత్ అందించిందన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో 18 సబ్స్టేషన్లు, 45 భారీ 5 మెగావాట్ల పవర్ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయించినట్లు చెప్పారు. శ్రీరాంసాగర్లో నీటి కొరత శాశ్వతంగా తీర్చడానికి కేసీఆర్ రూ. 1900 కోట్లతో ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం (రివర్స్ పంపింగ్) పూర్తిచేశారని వెల్లడించారు. రైతును రాజును చేసి కేసీఆర్ తెలంగాణ బలరాముడిగా నిలిచారని మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చరిత్ర సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఆయా మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకెళ్తాం: అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల నిజామాబాద్ అర్బన్: కాంగ్రెస్ వెయ్యిరోజుల పాల న వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకెళ్తామని అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్గుప్తా అన్నారు. నగరంలోని ధర్నాచౌక్లో గురువారం పార్టీ శ్రేణులతో కలిసి కాంగ్రెస్ వైఫల్యాలపై నిరసిస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు, భూములకు రక్షణ లేకుండా పో యిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇవ్వా లసిన రైతు భరోసా, రైతు బీమా, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం చేస్తున్నరన్నారు. కంఠేశ్వర్ ఆలయ భూములు, గూపన్పల్లిలోని వక్ఫ్బోర్డు భూములు, 22ఏలో ఎందుకు చేర్చలేదన్నారు. మాజీ మేయర్ నీతూకిరణ్, శేఖర్, నాయకులు సిర్ప రాజు, ప్రభాకర్రెడ్డి, సత్య ప్రకా ష్, సుజిత్ సింగ్, నవీద్ ఇక్బాల్, అబ్దుల్ మతీన్, జగత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మాయమాటలతో మోసగించిన ముగ్గురి అరెస్ట్
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలకేంద్రం గోపాల్పేటలో గత నెల 31న వృద్ధులతో మాయమాటలు చెప్పి, దోపిడీకి పాల్పడిన నిందితులను పట్టుకున్నట్లు నాగిరెడ్డిపేట పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా.. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం పోచమ్మరాల్ తండాకు చెందిన మూడ్ కేస్లీ, సక్రియ దంపతులు ఆగస్టు 31న గోపాల్పేటలోని ఓ హాస్పిటల్ వద్దకు వచ్చారు. అదే సమయంలో ముగ్గురు వ్యక్తులు వారి వద్దకు వచ్చి మాయమాటలు చెప్పి, వారిని బెదిరించి వారి నుంచి వెండిగొలుసు, నగదును అపహరించుకొని అక్కడి నుంచి స్కూటీపై మెదక్ వైపు పారిపోయారు. బాధితులు వెంటనే నాగిరెడ్డిపేట పోలీసులను ఆశ్రయించగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నహవేలీ ఘనపూర్ మండలం బూర్గుపల్లికి చెందిన శివాజీ చవాన్, అతని బంధువులైన మహారాష్ట్రలోని పర్భాణి జిల్లా శివాజీనగర్ తండాకు చెందిన ధర్మశంకర్ చవాన్, కౌటంవాడికి చెందిన రమేష్ చంద్రసింగ్ను నిందితులుగా గుర్తించారు. గురువారం వారిని పట్టుకొని, వారి నుంచి 12తులాల వెండిగొలుసుతోపాటు రూ.15వేల నగదును, స్కూటీని, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. కాగా ఘటన జరిగిన 36 గంటల్లోనే కేసును చేధించినట్లు వివరించారు. -
ప్రజా ప్రభుత్వంలో స్వేచ్ఛగా ప్రజలు
వేల్పూర్(బాల్కొండ): నియంతృత్వ బీఆర్ఎస్ పాలనలో ప్రజలు పదేళ్లు నిర్బంధంలో ఉన్నారని, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా పనులు చేసుకుంటున్నారరని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామ రామ్మోహన్రెడ్డి అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో గురువారం ఆయన కాంగ్రెస్ వేయి రోజుల ప్రజాపాలనపై నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ, బహిరంగ సభలో ఆయన పాల్గొ ని మాట్లాడారు. కబ్జాలు, కమీషన్లకు అలవాటుపడిన వారు నిజాయితీ గురించి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేశ్రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ము త్యాల సునీల్కుమార్ అన్నారు. అనంతరం బా ల్కొండ నియోజవకర్గంలో బీఆర్ఎస్ హ యాంలో చేసిన దౌర్జన్యాలను పేర్కొంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. వేల్పూర్ ఏఎంసీ చైర్మన్ కొత్తింటి ముత్యంరెడ్డి, ఆయా మండలాల నాయకులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాల సమీపంలోని తాడ్వాయి–చందాపూర్ రహదారిపై రెండు బైక్లు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్రగాయాలు అయినట్లు గ్రామస్తులు తెలిపారు. వివరాలు ఇలా.. తాడ్వాయికి చెందిన లింగవోల జీవన్ అనే వ్యక్తి తన బైక్పై తాడ్వాయి నుంచి చందాపూర్ వైపు బయలుదేరాడు. అదే సమయంలో బ్రహ్మాజివాడి గ్రామానికి చెందిన దేవునిపల్లి శ్రావన్ తన బైక్పై చందాపూర్ నుంచి తాడ్వాయికి వస్తున్నాడు. బాలికల గురుకుల పాఠశాల సమీపంలో ఇరువురి బైక్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో జీవన్, శ్రావణ్లకు తీవ్రగాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. జీవన్ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్కు తరలించారు. ఇసుక ట్రాక్టర్ స్వాధీనం గాంధారి(ఎల్లారెడ్డి): మండలంలోని గుర్జాల్ బీట్లో నుంచి గురువారం అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఆర్వో రమేష్ తెలిపారు. గుర్జాల్ చెందిన జయరాం ట్రాక్టర్లో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా పట్టుకుని ట్రాక్టర్ను ఫారెస్టు రేంజ్కు తరలించినట్లు తెలిపారు. కోటగిరి మండలంలో.. రుద్రూర్: మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు కోటగిరి ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. కోటగిరి మండలం లింగాపూర్ గ్రామ శివారులో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో ఇసుక ట్రాక్టర్ను నిలిపి తనిఖీ చేశారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో కోటగిరి పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం ట్రాక్టర్ యజమానితోపాటు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. మద్నూర్(జుక్కల్): మండలంలోని డీజే నిర్వాహకులను గురువారం తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై మోహన్రెడ్డి తెలిపారు. రానున్న గణపతి నవరాత్రుల్లో ఊరేగింపు శోభాయాత్రలో డీజేలకు అనుమతి లేదని ఎస్సై పేర్కొన్నారు. దీంతో మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు మండలంలోని డీజే నిర్వహకులను పిలిపించి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు తెలిపారు. -
టీటీసీ ఫలితాలు విడుదల
ఖలీల్వాడి: హైదరాబాద్లోని ప్రభుత్వ పరీక్షల విభాగము సంచాలకుల ఆదేశాల మేరకు ఆగస్టులో టెక్నికల్ టీచర్స్ సర్టిఫికేట్ (లోయర్ గ్రేడ్) థియరీ పరీక్షలు నిర్వహించగా, పరీక్ష ఫలితాలను గురువారం విడుదల చేసినట్లు డీఈవో పార్శి అశోక్ ఒక ప్రకటనలో తెలిపా రు. పరీక్ష రాసిన అభ్యర్థుల ఫలితాలను www. bse. telangana. gov. in వెబ్సైట్లో ఉంచినట్లు ఆయన తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్, పుట్టిన తేదీతో వెబ్ మెమోలను తీసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు డీఈవో కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఖలీల్వాడి: నగరంలోని నిశిత డిగ్రీ కాలేజీ, టాస్క్ ఆధ్వర్యంలో ఈనెల 9న టీసీఎస్ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు డైరెక్టర్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం పదిగంటల నుంచి కార్యక్రమం కొనసాగుతుందన్నారు. పదవ తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి, 50 శాతం మార్కులు వచ్చిన విద్యార్థులు ఆర్హులని ఆయన తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు జాబ్మేళాకు తరలిరావాలని కోరారు. భిక్కనూరులో వృద్ధుడి ఆత్మహత్య భిక్కనూరు: మండలకేంద్రంలో ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై అనిల్ గురువారం తెలిపారు. వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన నీల రాజయ్య(66) అనే వృద్ధుడు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గత ఏడాది ఆయన భార్య మృతి చెందింది. బుధవారం రాత్రి అతడు మద్యం తాగి ఇంటికి వెళ్లగా కుమారుడు మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన అతడు గురువారం వేకువజామున ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. బొబ్బిలి చెరువులో సాయంత్రం ఓ వ్యక్తి మృతదేహం తేలడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహన్ని ఒడ్డుకు తీసుకవచ్చి, విచారించగా, మృతుడిని నీల రాజయ్యగా గుర్తించి, కుటుంబీకుల సమాచారం అందించారు. వారి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. -
ఆగస్టు ఆదుకుంది!
డొంకేశ్వర్(ఆర్మూర్): ఎల్నినో ప్రభావంతో వర్షాల్లేక జూలై నెలాఖరు వరకు కరువు పరిస్థితే కనిపించింది. భూగర్భజలాలు తగ్గి, బోర్లు ఎత్తిపోయి, పంటలు ఎండుతున్న తరుణంలో ఆగస్టు మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలు ఊరిపిపోశాయి. ఆ తర్వాత కురిసిన వానలతో కూడా భూగర్భ జలాలు ఒక్కసారిగా పైకి వచ్చాయి. జూలై ముగిసే నాటికి జిల్లాలో 12.93 మీటర్ల లోతులో ఉన్న నీటి మట్టాలు ఏకంగా 4.15 మీటర్లు మేర పైకి పెరిగి ప్రస్తుతం 8.78 మీటర్ల వద్ద స్థిరంగా ఉన్నాయి. దీంతో వట్టిపోయిన వ్యవసాయ బోర్లు రీచార్జ్ అయ్యి నిండుగా పోస్తున్నాయి. పొలాలకు నీరందే మార్గం సుగమం కావడంతో సాగుకు ఎలాంటి ఢోకా లేదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారులు ఆగస్టు మాసానికి సంబంధించిన భూగర్భ జలాలను ఫీజో మీటర్ల ద్వారా ఇటీవల లెక్కించారు. జిల్లా వ్యాప్తంగా 82 ఫీజో మీటర్లు ఉండగా, 65 వాటిల్లో పుష్కలంగా నీటి మట్టాలు ఉన్నట్లుగా గుర్తించారు. నిండిన చెరువులు జిల్లా వ్యాప్తంగా 1,097 చెరువులు ఉండగా ఆగస్టు లో కురిసిన వర్షాలతో 70 శాతానికి పైగా చెరువులు పూర్తిగా నిండాయి. ఆయా చోట్ల 19 చెరువులు ఇప్పటికీ అలుగు పారుతున్నాయి. దీంతో చెరువుల ఆయకట్టు కింద ఉన్న పంటలకు సాగునీటి ఇబ్బందులు తప్పాయని అన్నదాతలు ధీమాలో ఉన్నారు. మొత్తానికి తీవ్ర వర్షపాత లోటుతో ఉన్న జిల్లాకు ఆగస్టు నెల సంజీవనిలా పని చేసిందని చెప్పొచ్చు. వర్షాకాలంలో ఇప్పటి వరకు 65 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని చెరువుల్లో నీరు.. కురిసిన వర్షాలతో ౖపైపెకి భూగర్భ జలాలు జూలైతో పోలిస్తే 4.15 మీటర్ల మేర పెరిగిన జలమట్టం జిల్లాలో నిండిన 70శాతం చెరువులు నిండుగాపోస్తున్న వ్యవసాయ బోర్లు -
జోరుగా లిక్కర్ పార్టీలు
● ఇతర రాష్ట్రాల మద్యం వినియోగం ● గంజాయి, పేకాట జోరు ● చోద్యం చూస్తున్న ఎకై ్సజ్ శాఖ నిజామాబాద్ అర్బన్: కాలానికి అనుగుణంగా విందు, వినోదాల సంస్కృతి పెరుగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజులతోపాటు ప్రత్యేక రోజుల పేరిట జిల్లాకు చెందిన కొందరు లిక్కర్ పార్టీలు నిర్వహిస్తున్నారు. జిల్లా, మండల కేంద్రాల శివారు ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటైన ఫామ్హౌస్లు లిక్కర్ పా ర్టీలకు అడ్డాగా మారాయి. అయితే, ఈ విందుల్లో నిషేధిత మద్యం, గంజాయి తదితర మత్తు పదార్థా ల వినియోగంతోపాటు అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నట్లు సమాచారం. జిల్లాలోని గుత్ప, సారంగాపూర్, ధర్మపురి హిల్స్, మోపాల్ మండలం నర్సింగ్పల్లి, డిచ్పల్లి మండలం లింగసముద్రం రోడ్, బోధన్, నందిపేటలోని గోదావరి బ్యాక్వాటర్, మాక్లూర్ మండలం అడవి మామిడి పల్లి శివారులలో ఏర్పాటు చేసిన ఫామ్హౌస్లలో ప్రతి వారం లిక్కర్ పార్టీలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక రోజులతోపాటు శని, ఆదివారాల్లో పార్టీలు నిర్వహిస్తున్నారు. సెలెబ్రెషన్స్ మోజులో కర్న్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన మద్యం వినియోగిస్తుండటంతోపాటు పేకాట ఆడుతున్నారు. కొంద రు నిర్వాహకులు ఫామ్హౌస్లను అద్దెకు తీసుకొని మరీ పేకాట ఆడిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. -
గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలి
● మండపాల ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలి ● పోలీస్ కమిషనర్ సాయిచైతన్య బోధన్టౌన్(బోధన్): గణేశ్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో సోదర భావంతో నిర్వహించుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నా రు. పట్టణంలోని లయన్స్ కంటి ఆస్పత్రి ఆవరణ లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం శాంతి కమిటీ, గణేశ్ మండప నిర్వాహకులతో సన్నా హక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. గణేశ్ మండపాలు ఏర్పాటు చే సే వారు పోలీసుల అనుమతి తీసుకోవాలని, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. మండపాల వద్ద డీజేలు, సౌండ్ సిస్టమ్ల వినియోగంలో ప్రభుత్వం నిర్దేశించిన శబ్ద పరిమితులను, సమయపాలనను తప్పని సరిగా పాటించా లని సూచించా రు. నిమజ్జన సమయంలో పోలీస్శాఖతో సమన్వ యం చేసుకొని ముందుకు సాగాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను న మ్మొద్దని, ఏదైనా అనుమానాస్పద సమాచారం వస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూ చించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే స హించేది లేదని స్పష్టం చేశారు. వినాయక మండపా ల వద్ద రాత్రి వేళల్లో నిర్వాహకులు ఉండాలన్నారు. ఏసీపీ శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ప్రజాప్రతినిధులు, మండపాల నిర్వహకులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న సీపీ సాయిచైతన్య పాల్గొన్న గణేశ్ మండపాల నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు -
రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకులు..
● ఉత్తమ ఉపాధ్యాయుడిగా నారాయణరెడ్డిఖలీల్వాడి/ తెయూ(డిచ్పల్లి)/ మాక్లూర్ : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉత్తమ అధ్యాపకులుగా ఎంపికై న వారి వివరాలను కళాశాల విద్యా కమిషనర్ గురువారం వెల్లడించారు. రాష్ట్ర ఉత్తమ అధ్యాపకులుగా జిల్లా కేంద్రంలోని జీజీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ కె.రంజిత (కామర్స్), డాక్టర్ పి.రామకృష్ణ (భౌతిక శాస్త్రం) ఎంపికై నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి.రామ్ మోహన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ ప్రొఫెసర్ లావణ్య ఉత్తమ అధ్యాపకురాలిగా ఎంపికయ్యారు. ఉత్తమ ప్రిన్సిపల్గా నాగారం డైట్ కళాశాల ప్రిన్సిపల్ టి. శ్రీనివాస్, ఉత్తమ ఉపాధ్యాయుడిగా మాక్లూర్ మండలం మదన్పల్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన నారాయణరెడ్డిని ఎంపిక చేశారు. వీరంతా ఈ నెల 5న హైదరాబాద్లో నిర్వహించనున్న గురుపూజోత్సవంలో అవార్డులు స్వీకరించనున్నారు. -
జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా అర్వింద్
సుభాష్నగర్: ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) అమెండ్మెంట్ట్ బిల్ – 2026పై ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఎంపీ అర్వింద్ ధర్మపురి సభ్యుడిగా నియమితులయ్యారు. లోక్సభ గురువారం విడుదల చేసిన అధికారిక బులెటిన్లో జాయింట్ కమిటీ సభ్యుల జాబితాలో అర్వింద్ ధర్మపురి పేరు నమోదైంది. కమిటీలో లోక్సభ, రాజ్యసభకు చెందిన మొత్తం 31 మంది సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కీలకమైన బాధ్యతను నిర్వర్తించే అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతను అప్పగించిన ప్రధాని నరేంద్రమోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రయోజనాలు, జాతీ య భద్రత, పారదర్శకత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని బిల్లుపై జాయింట్ కమిటీలో సమగ్రంగా చర్చించి బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. 5 నుంచి ప్రత్యేక ఓటరు నమోదు నిజామాబాద్ అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 5, 6, 12, 13 తేదీల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ప రిధిలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్ర మం (స్పెషల్ క్యాంపెయిన్) నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేశ్ మిశ్రా గురువారం ఒక ప్రకటనలో తెలిపా రు. ప్రత్యేక ఓటరు నమోదు కోసం ప్రతి బూత్ లెవల్ అధికారి తమకు కేటాయించిన ప్రదేశంలో అందుబాటులో ఉంటారన్నారు. ఓటర్లకు అవసరమైన ఫారం–6, 7, 8లతో పాటు ముసాయిదా ఓటరు జాబితాను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాల్సిన వారు ఫారం–6 ద్వారా, ఓటరు జాబితా లోని పేర్ల తొలగింపు లేదా అభ్యంతరాలకు ఫారం–7 ద్వారా, ఓటరు వివరాల్లో మార్పు లు, సవరణలు, చిరునామా మార్పు వంటి వాటికి ఫారం–8 ద్వారా దరఖాస్తు చేసుకో వచ్చని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రాథమిక నైపుణ్యాలపై దృష్టి సారించాలి ● ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్ ఖలీల్వాడి: విద్యార్థులకు చదవడం, రాయడం, గణిత ప్రాథమిక నైపుణ్యాలపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టిసారించాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ఖిల్లా జీపీఎస్ గద్వాల్ పాఠశాలతోపాటు నాగారంలోని విద్యా శిక్షణా సంస్థ(డైట్)ను గురువారం డీఈవో అశోక్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల అభ్యసన స్థాయి, ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాల అమలు, బోధన–అభ్యసన ప్రక్రియ, విద్యార్థుల హాజరు, పాఠశాల విద్యా ప్రమాణాలను పరిశీలించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డైట్ కళాశాలలోని పరిసరాలను, తరగతి గదుల్ని, వసతులను పరిశీలించారు. ఛాత్రోపాధ్యాయులతో మాట్లాడారు. ఆయన వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, డైట్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. అసంక్రమిత వ్యాధిగ్రస్తులను గుర్తించాలి రెంజల్: అసంక్రమిత వ్యాధిగ్రస్తులను గుర్తించి వా రికి అవసరమైన మందులను ఉచితంగా అందజేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ వసే సూచించారు. గురువారం రెంజల్ ప్రాథమిక ఆరో గ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ౖఅసంక్రమిత వ్యాధి గ్రస్తులు, అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్న రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో కలియతిరుగుతూ వసతులను తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లా ఎన్సీడీ ప్రోగ్రామ్ అధికారి వెంకన్న, రెంజల్ ఆస్పత్రి వైద్యుడు సుధాకర్, ఎన్సీడీ రిపోర్టింగ్ అధికారి వెంకటేశ్, ఆరోగ్య విస్తరణ అధికారులు రవీందర్, సురేశ్ తదితరులున్నారు. -
భవితవ్యం తేలేదెన్నడో..?
ఎన్సీఎస్ఎఫ్ పునరుద్ధరణ అయ్యేనా..ఫ్యాక్టరీలో యంత్రాలుకేంద్ర ప్రభుత్వం ఇథనాల్ను ప్రోత్సహిస్తున్నందున ఎన్సీఎస్ఎఫ్ను ఇథనాల్ ఫ్యాక్టరీగానైనా మార్చాలని కోరాం. కానీ భారీ బడ్జెట్, పర్యావరణ అనుమతులు, ప్రభుత్వ నిబంధనలు అడ్డంకిగా మారాయి. తక్కువ పెట్టుబడితోనైనా ఫ్యాక్టరీని చిన్న తరహా బెల్లం పరిశ్రమగానైనా మారిస్తే ప్రాంతీయ చెరకు రైతులకు తక్షణ ఉపశమనం లభిస్తుంది. ప్రభుత్వం స్పందించి బెల్లం ఫ్యాక్టరీగానైనా మార్చాలి. – చెరుకు ఉత్పత్తిదారుల సంఘం సభ్యులు, రైతు నాయకులు నిజామాబాద్ రూరల్: రైతులు, కూలీలు, కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపిన నిజామాబాద్ కో ఆపరేటీవ్ షుగర్ ఫ్యాక్టరీ(ఎన్సీఎస్ఎఫ్) భవిత వ్యం ఎటూ తేలడం లేదు. ఫ్యాక్టరీ పునరుద్ధరణపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులు ఉద్యమిస్తూనే ఉ న్నారు. రైతులు, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటైన ఫ్యాక్టరీ అనేక కారణాలతో 2008 నుంచి 2015 వరకు క్రమంగా మూతపడింది. ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తామని పార్టీలు, ప్రజాప్రతినిధులు హామీలు ఇస్తూనే ఉన్నారు. 23వేల మందికిపైగా రైతులు స భ్యులు(షేర్ హోల్డర్లు)గా ఉన్న ఫ్యాక్టరీని పునరుద్ధరించి ప్రభుత్వ, రైతుల భాగస్వామ్యంలోనే నడిపించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తూనే ఉంది. రాష్ట్రంలోని చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణ కోసం మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన సబ్కమిటీ సైతం ఎన్సీఎస్ఎఫ్ను సందర్శించింది. ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. సబ్ కమిటీ ఏం చెప్పిందంటే.. ఫ్యాక్టరీ పునరుద్ధరణపై ప్రభుత్వానికి సానుకూల నివేదికను సమర్పించిన సబ్ కమిటీ పలు సూచనలు చేసింది. చెరుకు సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు అవసరమైన ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ఇవ్వాలని, ధాన్యానికి ఇస్తున్న మాదిరిగానే చెరుకుకు సైతం బోనస్ ఇవ్వాలని, డ్రిప్ పరికరాలను అందించాలని సూచించింది. బెల్లం ఫ్యాక్టరీగా మార్చాలనే రైతు నాయకులు, రైతులు, ప్రజాప్రతినిధులు సిఫార్సులను సబ్ కమిటీ పరిగణనలోకి తీసుకుంది. సాగుకు రైతులు సిద్ధమే..! ఆరు తడి పంటలు సాగు చేయాలని ప్రజాప్రతినిధు లు, అధికారులు సూచిస్తుండగా.. ఎన్సీఎస్ఎఫ్ను పునరుద్ధరిస్తే తాము చెరుకు సాగుకు సిద్ధమేనని రైతులు స్పష్టం చేస్తున్నారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో జూలై నెలలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా సమావేశంలోనూ రైతులు ఇదే అంశాన్ని లేవనెత్తారు. ఫ్యాక్టరీ ముఖద్వారంరైతులకు అవగాహన కల్పించాలి చెరకు సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి. చెరుకు సాగు చేస్తే ఎవరు కొంటారు? ఎక్కడికి తరలించాలి అనే అనేక సందేహాలు రైతుల్లో ఉన్నాయి. ఎన్సీఎస్ఎఫ్ పునరుద్ధరణపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి. ఆరుతడి పంటల సాగును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం చెరుకు సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు కృషి చేయాలి. – పోల వంశీరెడ్డి, బర్ధిపూర్ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి రైతులు చెరుకు సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎన్సీఎస్ఎఫ్ పునరుద్ధరణపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. రైతులు షేర్ హోల్డర్లుగా ఉన్న ఫ్యాక్టరీని మూసివేయడం బాధాకరం. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించాలి. లేని పక్షంలో ఉద్యమిస్తాం. – ఆకుల పాపయ్య, రైతు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ నిధులు కేటాయించాలి ఫ్యాక్టరీ పునరుద్ధరణపై రైతులకు భరో సా కల్పించాల్సిన బా ధ్యత రేవంత్రెడ్డి ప్ర భుత్వానిదే. రైతులు చెరుకు సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు. చక్కెర ఫ్యాక్టరీ ని బెల్లం ఉత్పత్తి కేంద్రంగా మార్చి ప్రభుత్వ మే నడిపించాలి. ఇందుకోసం రూ.వంద కో ట్లు కేటాయించాలి. – వేల్పూర్ భూమయ్య, ఏఐకేఎంఎస్ అధ్యక్షుడు మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం మంత్రి శ్రీధర్బాబు అధ్యక్షతన సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఎన్సీఎస్ఎఫ్ను సైతం పునరుద్ధరించాలని సబ్ కమిటీతోపాటు సీఎంను కూడా కోరా. ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయబోం. ఫ్యాక్టరీ నిర్వహణపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుంది. – ఎన్సీఎస్ఎఫ్ను సందర్శించిన సమయంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి గత వైభవం.. 1964లో రైతులు, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటైన ఎన్సీఎస్ఎఫ్ సుమారు 10వేల మందికి ఉపాధి కల్పించింది. 23,143 మంది రైతులు షేర్ హోల్డర్లుగా ఉన్నారు. రైతుల వాటా రూ.2.95 కోట్లు, ప్రభుత్వ వాటా రూ.50 లక్షలు రోజుకు సుమారు 1,250 నుంచి 2,000 టన్నుల చెరకును నలిపి సీజన్లో వేల టన్నుల చక్కెర ఉత్పత్తి అయ్యేది. ఇక్కడ ఉత్పత్తి అయిన చక్కెర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా సరఫరా అయ్యేది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేసేవారు. దాదాపు 1,000 నుంచి 1,500 మంది వరకు పూర్తిస్థాయి, సీజనల్ కాంట్రాక్ట్ కార్మికులు పనిచేసేవారు. పరోక్షంగా వేలాది మంది రైతు కుటుంబాలు ఫ్యాక్టరీపై ఆధారపడేవి. ఇథనాల్ ఉత్పత్తి చేస్తారా? బెల్లం ఫ్యాక్టరీగా మారుస్తారా?ఫ్యాక్టరీ మూతపడి సుమారు 18 ఏళ్లు అవుతుండగా, యంత్రాలు అసలు పనికి వస్తాయా? లేవా? రైతుల భాగస్వామ్యంతో ఫ్యాక్టరీని నడిపించడం సాధ్యమేనా? ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న చెరుకు ఉత్పత్తిదారుల సంఘం నాయకులు, రైతులు ఇథనాల్ ఫ్యాక్టరీ గా మార్చాలని మొదట కోరారు. అయితే బడ్జెట్, అనుమతులు కష్టమేననే అభిప్రాయం మేరకు బెల్లం ఫ్యాక్టరీగా మార్చాలని డిమాండ్ చేస్తున్నా రు. చెరుకు సాగు బాధ్యత రైతులు తీసుకుంటా రని అంటున్నారు. తక్కువ పెట్టుబడితో, తక్కు వ సమయంలో బెల్లం ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యమని, ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు సమావేశాలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఫ్యాక్టరీ ఆవరణలో రైతు సమ్మేళనం ఏర్పాటు చేసి ప్రభుత్వమే ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని డిమాండ్ చేయడంతోపాటు పలు కీలక తీర్మానాలు చేశారు. రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సైతం ఫ్యాక్ట రీ పునరుద్ధరఫై ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించారు. ఉద్యమిస్తున్న రైతు నాయకులు ఏళ్లుగా నిరీక్షిస్తున్న కార్మికులు తుప్పుపడుతున్న యంత్రాలు బెల్లం ఉత్పత్తి కేంద్రంగా మార్చాలంటున్న రైతులు -
మాస్టర్ ప్లాన్ ఫైల్ను వెనక్కి తెప్పిస్తున్నాం
● ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్ నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ నగర మాస్టర్ ప్లాన్, నుడా మాస్టర్ ప్లాన్లో అనేక లోపాలు ఉన్న దృష్ట్యా ఆ ఫైల్ను వెనక్కి తెప్పిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్పై ప్రజాభిప్రాయ సేకరణ, గతంలో అభ్యంతరాలు, మార్పులు కోరిన వారితో చర్చలు జరిపి అందరి ఆమోదంతో సీఎం ఆ మోదానికి పంపిస్తామని వివరించారు. నగరంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో సోమవా రం తనను కలిసిన నగర అభివృద్ధి కమిటీ ప్రతినిధులతో మాట్లాడారు. నగర అభివృద్ధి విషయమై సంబంధిత అధికారులతో చర్చించి ప్రజలందరికీ ఉపయోగపడేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రోడ్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తామని తెలిపారు. నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఆకుల ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కే రామ్మోహన్రావు, ఉపాధ్యక్షులు షేక్ హుస్సేన్, నారాయణరెడ్డి, కరిపే రవీందర్, జహీరుద్దీన్, ముస్తఫా, నాగేశ్వరరావు, రాజు, సత్యం తదితరులు ఉన్నారు. తెయూ బీఈడీ ఫలితాలు విడుదల తెయూ(డిచ్పల్లి): తెలంగాణ విశ్వవిద్యాల యం 2024 బ్యాచ్ బీఈడీ పరీక్ష ఫలితాలను వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. యాదగిరి సోమవారం సాయంత్రం విడుదల చేశారు. మొత్తం 1,354 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 1,288 మంది (95.12 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ కే సంపత్కుమార్ తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కంట్రోలర్ శాంత పాల్గొన్నారు. మారథాన్లో కానిస్టేబుల్ సత్తా జక్రాన్ పల్లి: జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) హైదరాబాద్లో ఆదివారం నిర్వహించిన మారథాన్లో మండలంలోని పడకల్ గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ పిల్లి మహిపాల్ సత్తాచాటాడు. 42.195 కిలోమీటర్ల మారథాన్ను 05:05:41 గంటల్లో పూర్తి చేసి మెడల్ అందుకున్నారు. మహిపాల్ ప్రస్తుతం బాల్కొండ సర్కిల్ ఆఫీసులో కానిస్టేబుల్గా విధులు ని ర్వర్తిస్తున్నాడు. గతేడాది నిర్వహించిన హాఫ్ మారథాన్ను సైతం పూర్తి చేశాడు. ఇప్పటి వరకు నాలుగు హాఫ్ మారథాన్లతోపాటు రెండు 10 కేఎంలో పా ల్గొన్న మహిపాల్.. అక్టోబర్లో ఢిల్లీలో నిర్వహించనున్న వేదాంత హాఫ్ మారథాన్లో పాల్గొననున్నట్లు తెలిపాడు. ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ భుజంగరావు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 159 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్తోపాటు ట్రెయినీ కలెక్టర్ సురేశ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్, డీఆర్వో గీత, డీఆర్డీవో సాయన్న, జెడ్పీ సీఈవో సాయాగౌ డ్, డీపీవో శ్రీనివాస్, ఏసీపీ శ్రీశైలంకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా.. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పోలీస్ ప్రజావాణికి 34.. నిజామాబాద్ అర్బన్: పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం పోలీస్ ప్రజావాణి నిర్వహించారు. మొత్తం 34 ఫిర్యా దులు అందగా, వాటిని తక్షణమే పరిశీలించి చట్టప్రకారం బాధితుల సమస్యలను పరిష్కరించాలని సీపీ సాయిచైతన్య సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. -
నిజామాబాద్
మంగళవారం శ్రీ 1 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026‘ఇందూరు ప్రజలే నా ధైర్యం. ఇక్కడి ప్రజల అండతోనే ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా. నన్ను ఎంపీగా, ఎమ్మెల్సీగా గెలిపించి అక్కున చేర్చుకున్నారు. ఇంతకుముందులాగే ఇకముందు కూడా నాకు అండగా ఉండాలి. భవిష్యత్లోనూ ఆశీర్వదించాలి’ అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్లో నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభ’లో ప్రసంగించారు. తాను ఎక్కడికి వెళ్లినా నిజామాబాద్ కోడలిగా చెప్పుకునేందుకు గర్వపడతానని అన్నారు. -
చేయూత పింఛన్ దరఖాస్తు గడువు పెంపు
డొంకేశ్వర్(ఆర్మూర్): చేయూత కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుకు రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం సోమవారం (ఆగస్టు 31) నాటితో గడువు ముగియాల్సి ఉన్నప్పటికీ ఈనెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పలు పత్రాలు అందక దరఖాస్తు చేసుకోలేని వారికి ఊరట లభించింది. జిల్లా వ్యాప్తంగా సోమవారం వరకు ఆయా కేటగిరిల్లో 17,466 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం మరో 15 రోజులు దరఖాస్తులకు సమయం ఇవ్వడంతో మరింతమంది దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. బాధ్యతలు స్వీకరించిన జడ్జీలు నిజామాబాద్ లీగల్ : సీనియర్ సివిల్ జడ్జీలుగా పదోన్నతి పొందిన ముగ్గురు న్యాయమూర్తులు సోమవారం ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి నుంచి బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ సీనియర్ సివిల్ కోర్టు జడ్జీగా అజయ్ ఉల్లమ్, అదనపు సీనియర్ సివిల్ కోర్టు జడ్జీగా చైతన్య, జిల్లా న్యాయసేవ సంస్థ కార్యదర్శిగా ముద్దసాని నీలిమా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నిజామాబా ద్ జిల్లా కోర్టులో గత కొన్ని నెలలుగా ఖాళీగాఉన్న న్యాయమూర్తుల పోస్టులు భర్తీ కావడంతో బార్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఖాళీగా ఉన్న మిగితా మేజిస్ట్రేట్ పోస్టులను సైతం వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ● ఈనెల 15వ తేదీ వరకు అవకాశం ● ఇప్పటికే జిల్లాలో 17,466 అప్లికేషన్లుకేటగిరి వారీగా అందిన దరఖాస్తులు -
సాగు లెక్క.. ఇక పక్కా..
రెంజల్: జిల్లాలో వరి, ఆరుతడి, కూరగాయలతోపా టు ఇతర పంటల సాగు లెక్క ఇక పక్కాగా నమో దు కానుంది. ఇందులో భాగంగా వ్యవసాయ శాఖ డిజిటల్ క్రాప్ సర్వేను ప్రారంభించింది. సోమ వారం నుంచి క్షేత్రస్థాయిలో పూర్తి వివరాలను సేకరించేందుకు ఏఈవోలు, వలంటీర్లు రైతుల పొలాల వద్దకు చేరుకుని పంటల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రత్యేక యాప్లో పంటల వివరాలను నమోదు చేస్తున్నారు. జిల్లాలో ఎంత మంది రైతులు, ఏఏ పంటలను ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారనే వివరాలను సర్వే నంబర్లతో సహా డిజిటల్ క్రాప్ సర్వే ద్వార యాప్లో నమోదు చేస్తున్నారు. వలంటీర్లతో సర్వే గతంలో గ్రామాల్లో పూర్తిగా ఏఈవోలు క్రాప్ సర్వే నిర్వహించే వారు. ప్రస్తుతం ఏఈవోలు తగిన సంఖ్యలో లేకపోవడంతోపాటు ఉన్నవారిపై పని భారం పెరగడంతో వ్యవసాయశాఖ తాత్కాలికంగా వలంటీర్లను నియమించింది. ఏఈవోల సహకారంతో వలంటీర్లు సర్వే నిర్వహిస్తున్నారు. జిల్లాలో 106 మంది ఏఈవోలు ఉండగా వారికి తోడుగా 427 మంది వలంటీర్లతో డిజిటల్ క్రాప్ సర్వే కొనసాగుతోంది. ప్రభుత్వం వద్ద ఉన్న సాగు భూముల వివరాలు, క్షేత్రస్థాయిలో ఉన్న వివరాల్లో తేడా ఉండటంతో రైతులు ధాన్యం విక్రయించే సమయంలో గతంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతుల భూమి సర్వే నంబర్లు ఆన్లైన్లో లేక పోవడంతో అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఏఈవోలు సకాలంలో సర్వే పూర్తి చేయకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురైంది. గతంలోని పరిస్థితులు పునరావృతం కాకుండా ఈ సారి సర్వే పక్కాగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు. పారదర్శకంగా పంటల సర్వే జిల్లాలో 427 మంది వలంటీర్లతో డిజిటల్ క్రాప్ సర్వే జరుగుతోంది. వారం రోజు లుగా సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. సర్వేను పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. సర్వే ఆధారంగా రైతులకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచడం జరుగుతుంది. జియో ట్యాగింగ్తో కచ్చితత్వం ఉంటుంది. వాస్తవ సాగు వివరాలను పక్కాగా నమోదు చేస్తాం. – వీరాస్వామి, జిల్లా వ్యవసాయాధికారి ప్రారంభమైన డిజిటల్ క్రాప్ సర్వే కొనసాగుతున్న పంటల వివరాల నమోదు జిల్లాలో 427 మంది వలంటీర్లు, 106 మంది ఏఈవోలు -
ఆర్టీసీకి రాఖీ పండుగే..
నిజామాబాద్ రూరల్: ఆర్టీసీకి రాఖీ పండుగ ఆదాయం తెచ్చిపెట్టింది. పండుగను పురస్కరించుకొని ఆగస్టు 27, 28, 29 తేదీల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపింది. దీంతో మూడు రోజుల్లో సుమారు రూ.5 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ప్రతిరోజూ నడిచే బస్సులతోపాటు ప్రత్యేక బస్సులను నడిపి ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా చూసింది. నిజామాబాద్ రీజియన్ పరిధిలో నిజామాబాద్–1, 2 డిపోలతోపాటు ఆర్మూర్, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ డిపోలు ఉన్నాయి. ఈ డిపోల పరిధిలో ఆర్టీసీకి మొత్తం 655 బస్సులున్నాయి. వీటితోపా టు 27వ తేదీన 83 ప్రత్యేక బస్సులు, 28న 90, 29న 43 బస్సులు నడిపారు. రోజుకు 2.59 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు నడపగా, రాఖీ పండుగ సందర్భంగా అదనంగా 27న 10 వేలు, 28న 28 వేలు, 29న 10 వేల కిలోమీటర్లు నడిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించారు. నిజామాబాద్ రీజియన్ పరిధిలోని ఆదాయం వివరాలు సిబ్బంది సహకారంతో.. రీజియన్ పరిధిలోని డ్రైవర్లు, కండక్టర్లు, డిపో మేనేజర్లు ఇతర సిబ్బంది కృషితో ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా బస్సులు నడిపాం. రాఖీ పండుగ రద్దీ రోజుల్లో ప్రత్యేక బస్సుల నిర్వహణ ద్వారా రీజియన్లో బ్రేక్ ఇవెన్ సాధించింది. – కృష్ణమూర్తి, రీజినల్ మేనేజర్ మూడు రోజుల్లో రూ.5 కోట్లకు పైగా ఆదాయం రీజియన్ పరిధిలో 655 బస్సులు పండుగ వేళ అదనంగా ప్రత్యేక బస్సులు నడిపిన సంస్థ -
నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
● సీపీ సాయిచైతన్య ● కేంద్ర కారాగారం భద్రత పరిశీలన నిజామాబాద్ అర్బన్: కేంద్ర కారాగారం అత్యంత కీలకమైన భద్రతా ప్రదేశమని, ఇక్కడ విధులు నిర్వర్తించే సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య సూచించారు. నిజామాబాద్ కేంద్ర కారాగారంలో భద్రతా ఏర్పాట్లపై సోమవారం నిర్వహించిన సెక్యూరిటీ రివ్యూ మీటింగ్లో సీపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కారాగారంలోని భద్రతాను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా విధానాలు, బందోబస్తు నిర్వహణ, సిబ్బంది విధుల కేటాయింపు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు తదితర వివరాలను అధికారులతో మా ట్లాడి తెలుసుకున్నారు. జైలులోని ఆస్పత్రి, డీ–అడిక్షన్ సెంటర్లను పరిశీలించి, ఖైదీలకు అందుతున్న వైద్య సేవల వివరాలు తెలుసుకున్నారు. జైలు అధి కారులు, పోలీస్శాఖ, భద్రతా సిబ్బంది సమన్వ యంతో పనిచేస్తే భద్రతను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చన్నారు. జైలు సూపరింటెండెంట్ అశోక్కుమార్, డిప్యూటీ జైలర్ మన్మథ రావు, జైలర్లు తిరుమలరెడ్డి , శ్రీనివాస్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ (అడ్మిన్) ధరణికుమార్, మెడికల్ ఆఫీసర్ సామ్రాట్ ఆరో టౌన్ ఎస్సై సందీప్ పాల్గొన్నారు. అనాథ మృతుల ఆత్మశాంతి కోసం..జీవిత చివరి మజిలీలో నా అనేవారు లేక కన్నుమూసిన అనాథలకు ‘ఇందూరు యువత’ అంతిమ సంస్కారాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అనాథలకు అంతిమ సంస్కారాలు పూర్తిచేసి అక్కడితో వదిలేయకుండా.. జీవికి మోక్ష నగరి అయిన కాశీకి చితాభస్మాన్ని తీసుకెళ్లి పవిత్ర గంగా నదిలో కలిపారు. మణికర్ణికా ఘాట్లో సోమవారం పిండ ప్రదానం చేశారు. సామాజిక సేవలో ముందుటున్న ‘ఇందూరు యువత’ ప్రతి అడుగులో తన బాధ్యతను పక్కాగా నిర్వర్తిస్తూ మానవత్వాన్ని చాటుతోంది. – నిజామాబాద్ రూరల్పంటల వివరాలతో స్పష్టత డిజిటల్ సాంకేతికను వినియోగించి రైతులు ప్రతి సీజన్లో సాగు చేస్తున్న పంటల వివరాల్లో స్పష్టత తీసుకు వచ్చేందుకు పారదర్శకంగా సర్వే నిర్వహిస్తున్నారు. దీంతో పంటల వాస్తవ పరిస్థితిపై స్పష్టమైన సమాచారం లభిస్తుంది. జియో ట్యాగింగ్ ద్వారా పంటల లెక్కలను పక్కాగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి సర్వే పనులను చేపట్టగా రెండు రోజులుగా ఊపందుకుంది. -
భూ సేకరణను వేగవంతం చేయాలి
● రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం ఉండొద్దు ● వీసీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజునిజామాబాద్ అర్బన్: రైల్వే ప్రాజెక్టుల కోసం అవసరమైన స్థల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజు సూచించారు. రైల్వే లైన్ల విస్తరణ, డబ్లింగ్, ఇతర అభివృద్ధి పనుల కోసం చేపట్టాల్సిన భూ సేకరణ ప్రక్రియపై సోమవారం హైదరాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా లో నిర్దేశిత రైల్వే ప్రాజెక్టుల కోసం అవసరమైన స్థల సేకరణ కోసం ఇప్పటివరకు తీసుకున్న చర్యల వివరాలు తెలుసుకున్నారు. రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాల్లో అనవసర జాప్యానికి తావు లేకుండా భూ సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులతో, భూ యజమానులతో సంప్రదింపులు జరుపుతూ, నష్టపరిహారం నిర్ణయంలో సానుకూల ధోరణిని అవలంబించాల ని సూచించారు. జిల్లాలో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి నిజామాబాద్ నగర శివారులో బైపాస్ లైన్ కోసం భూసేకరణ ప్రక్రియ పురోగతిలో ఉందని కలెక్టర్ భవేశ్ మిశ్రా సీఎస్కు తెలిపారు. నిజామాబాద్ మీదుగా కొనసాగుతున్న ముథ్కేడ్ – మేడ్చల్ డబ్లింగ్ పనుల కోసం భూసేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో ఆర్డీవో రాజేంద్రకుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఇందూరే నా ధైర్యం..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/నిజామాబాద్ అర్బన్: ప్రజా సమస్యలపై పోరాడుతూనే పార్టీ నిర్మాణం చేపడతానని, పార్టీ పెట్టిన నాలుగు నెలల తరువాత సొంత గడ్డకు రావడం ఎంతో సంతోషంగా ఉందని కల్వకుంట్ల కవిత అన్నారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అవినీతిపై పోరాటం చేస్తామన్నారు. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మనకు కావాల్సింది బంగారు తెలంగాణ కాదని.. బహుజన తెలంగాణ అని అన్నారు. పదవుల కోసం కాకుండా ప్రజల కోసమే పార్టీని స్థాపించానని స్పష్టం చేశారు. తాను ఏం తప్పు చేశానని తీహార్ జైలులో పెట్టారని, తనను అన్యాయంగా జైలులో పెట్టారని కవిత కన్నీరు పెట్టుకున్నారు. కన్నీరు పెట్టినంత మాత్రాన తాను పిరికిదాన్ని కాదని, సమస్యలపై పోరాటం చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యిరోజులు అవుతున్నా ఒక్క హామీ అమలు చేయలేదని, రైతు భరోసా, రైతులు ఆగమయ్యారన్నారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని కేటీఆర్ స్నేహితుడు కోరుట్ల ఎమ్మెల్యే కోసమే తెరిపించలేదన్నారు. ఆయనకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరిగాయని కవిత ఆరోపించారు. నిజాం షుగర్స్ను తిరిగి తెరిపించే వరకు రైతుల మద్దతుగా ఉంటానన్నారు. సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీ కోసం ధర్నా చేస్తున్న కార్మికులకు మద్దతిస్తున్నామని, అవసరమైతే పోరాటం చేస్తామన్నారు. ప్రశాంత్రెడ్డిని క్షమించేది లేదు.. కేసీఆర్ మాదిరిగా ఉండేందుకు ప్రశాంత్రెడ్డి ప్రయత్నిస్తాడని, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే కుదురుతుందా అని విమర్శించారు. తండ్రీ కూతురిని విడదీయంలో ప్రశాంత్రెడ్డిది మొదటి పాత్ర అని.. ఆయనను క్షమించే ప్రసక్తేలేదని కవిత అన్నారు. తన ఉసురు ప్రశాంత్రెడ్డికి తగులుతుందన్నారు. బీఆర్ఎస్ ఓడిపోయిన రెండో రోజే కాంగ్రెస్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్రెడ్డి, ప్రశాంత్రెడ్డిని తాను గెలిపిస్తే వారు నన్ను ఓడించారన్నారు. ప్రశాంత్ రెడ్డి, జీవన్రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించటం లేదన్నారు. ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, ధన్పాల్, ప్రశాంత్రెడ్డి, సుదర్శన్రెడ్డిల అక్రమాలపై పోరాడతామన్నారు. అర్వింద్వి అడ్డగోలు మాటలు..ఎంపీ ధర్మపురి అర్వింద్ పేరులోనే ధర్మం ఉందని, కానీ ఆయనలో మొత్తం అధర్మమేనని కవిత విమర్శించారు. మాధవ్ నగర్ బ్రిడ్జిని ఏడేళ్లుగా ఎందుకు కట్టించలేకపోతున్నారని ప్రశ్నించారు. ఆయన తెచ్చానని చెప్పుకుంటున్న పసుపు బోర్డు ద్వారా రైతులకు పైసా ప్రయోజనం లేదని, ప్రశ్నిస్తే అడ్డగోలుగా మాట్లాడటం తప్పా ఆయన ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. అర్వింద్, ప్రశాంత్రెడ్డి కాంగ్రెస్లోకి పోదామని అనుకుంటున్నారంట? అర్వింద్ కేసీ వేణుగోపాల్ను కూడా కలిశాడంట.. అని కవిత అన్నారు. ప్రజల కోసం పార్టీలు మారితే ఓకే కానీ పదవుల కోసం మారేవాళ్లను సహిద్దామా? అంటు సభకు హాజరైన వారిని ప్రశ్నించారు. ప్రజల కోసమే.. పాంచజన్యం మీపై ఆశతోనే ముందుకు వెళ్తున్నా ఇక్కడి నుంచి పుట్టిన రాజకీయ పార్టీ చరిత్రలో నిలవాలి ఎప్పటిలాగే ఇకముందు కూడా అండగా ఉండాలి బంగారు తెలంగాణ కాదు.. బహుజన తెలంగాణ కావాలి నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ కోసం పోరాటం ఆపను ‘పాంచజన్య సంకల్ప సభ’లో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శ్రీకృష్ణుడిని, ఆయన చేతిలోని పాంచజన్యాన్ని నమ్ముకున్న వాళ్లు ఓడిపోయినట్లు చరిత్రలో లేదని కవిత అన్నారు. పాంచజన్యం పేరునే టీఆర్ఎస్ ఐదు అంశాలకు పెట్టామన్నారు. ఉచిత విద్య, వైద్యం, యువతకు ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం ఐదు అంశాలను సంకల్పంగా తీసుకుని ముందుకు వెళ్తామన్నారు. యువతకు రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉపాధి రుణాలు, భూమిలేని పేదలకు భూలక్ష్మి పేరుతో ఎకరం భూమి అందిస్తామన్నారు. ప్రజల జీవితాల్లో గుణ్మాతక మార్పు తీసుకరావాలన్న సంకల్పంతో ముందుకు వచ్చానన్నారు. సభలో టీఆర్ఎస్ నాయకులు నవీన్ ఆచారి, అవంతిరావు, లక్ష్మీనారాయణ భరద్వాజ్, విజయలక్ష్మి, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
యథేచ్ఛగా చెట్ల నరికివేత
ఇందల్వాయి: ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని దేవితండా శివారులో 1223 సర్వే నంబరులో కొందరు యథేచ్ఛగా చెట్లను నరికివేస్తూ అటవీ భూములను ఆక్రమించాలని చూస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఈ సర్వే నంబరులో రెవెన్యూ, ఫారెస్ట్ సరిహద్దు వివాదం ఉందని తెలిసినా, పట్టాలు, ఎలాంటి హక్కులు లేకున్నా కొందరు చట్టాన్ని అతిక్రమిస్తూ చెట్లను నరకడం స్థానికంగా చర్చనీయ అంశంగా మారింది. అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారని, ఇకనైనా స్పందించి అడవులను కాపాడాలని కోరుతున్నారు. ఈ విషయమై రేంజ్ అధికారి రవి మోహన్ భట్ని సంప్రదించగా నరికివేతకు గురైన చెట్లను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సిరికొండ: సిరికొండ అటవీశాఖ రేంజ్ పరిధిలోని తాటిపల్లి బీట్ అటవీ ప్రాంతంలో అక్రమంగా భూ ఆక్రమణకు ప్రయత్నించిన గ్రా మానికి చెందిన భూక్యా మోహన్పై కేసు న మోదు చేసినట్లు సిరికొండ ఎఫ్ఆర్వో నర్సింగరావు సోమవారం తెలిపారు. మోహన్ను సిరికొండ తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రస్తుతం అటవీ భూములకు ఎలాంటి హక్కులు కల్పించడం లేదని, కావున ఎవరు కూడా అటవీ భూముల ఆక్రమ ణకు పాల్పడవద్దని ఎఫ్ఆర్వో సూచించారు. వర్ని: చందూర్ మండలం ఘన్పూర్ అటవీ ప్రాంతం నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా టిప్పర్లలో మొరం తరలిస్తుండగా పట్టుకున్నట్లు చందూర్ తహసీల్దార్ వీర్సింగ్ సోమ వారం తెలిపారు. అనుమతులు లేకుండా ఆరు టిప్పర్లలో మొరం తరలిస్తుండగా పట్టుకొని కార్యాలయానికి తరలించినట్టు వివరించారు. వాహనాలతోపాటు యజమాని, డ్రైవర్పై కేసులో నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. బోధన్ మండలంలో.. బోధన్ రూరల్: మండలంలో మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్నట్లు రూరల్ ఎస్సై రాజశేఖర్ సోమవారం తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వివరించారు. -
రాజీపడే కేసులను ముందుగా గుర్తించాలి
ఆర్మూర్టౌన్: రాజీపడే అవకాశం ఉన్న కేసులను ముందుగానే గుర్తించి, ఇరుపక్షాలు అదాలత్కు హా జరయ్యేలా ప్రోత్సహించాలని జూనియర్ సివిల్ జ డ్జి సరళ రాణి పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కోర్టులో ఈ నెల 12న లోక్అదాలత్ నిర్వహించను న్న నేపథ్యంలో సోమవారం పోలీస్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ లోక్ అదాలత్ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు పోలీస్ అధికారులు ప్రతి గ్రామంలో విస్తృత ప్రచా రం చేయాలన్నారు. లోక్ అదాలత్ ద్వారా చిన్నచిన్న వివాదాలు త్వరగా, ఉచితంగా పరిష్కారం అవుతాయని అవగాహన కల్పించాలన్నా రు. కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జ డ్జి భవ్యశ్రీ, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గట్టు గంగాధర్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కుదురుపాక ప్రవీణ్ చందర్, జనరల్ సెక్రెటరీ పోడేటి శంకర్, భీమ్గల్ సీఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
చికిత్స పొందుతూ ఒకరి మృతి బోధన్రూరల్: మండలంలో ఇటీవల ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతిచెందాడు. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని ఏరాజ్పల్లి గ్రామానికి చెందిన బానెల్లి నర్సయ్య (48) మద్యానికి బానిసై, ఈనెల 24న రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని, ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య విమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. హత్యకేసులో ముగ్గురికి పదేళ్ల జైలు నిజామాబాద్ లీగల్: ఓ వ్యక్తిపై దాడిచేసి హత్యచేసిన కేసులో ఓ మహి ళతోపాటు ఆమె కుమారుడు, తమ్ముడికి నిజామాబాద్ కోర్టు జడ్జి హరీష పదేళ్ల జైలుశిక్ష, రూ.పదివేల జరిమానా విధించింది. వివరాలు ఇలా.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బిలోలి తాలుకా సావ్లి గ్రామానికి చెందిన బింగేవార్ రాజమణి, తన కుమారుడు రాజు, తమ్ముడు అగపట్రే మాధవ్లతో కలిసి కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం నిజామాబాద్ నగరానికి వచ్చింది. నగర శివారులోని అర్సపల్లిలో నివాసముంటూ కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అలాగే వారి సమీప గ్రామం మచ్కూరేకు చెందిన చాంద్కె తారాబాయి తన కుమారుడు చాంద్కె మాధవ్తో కలిసి అర్సపల్లిలోనే జీవనం సాగిస్తున్నారు. 2022లో రాజమణి గురించి తారాబాయికి కుమారుడు మాధవ్ చెడుగా చెప్పాడు. ఈ విషయం రాజమణికి తెలియడంతో 26 ఏప్రిల్ 2022న ఓ హోటల్ వద్ద టిఫిన్ చేస్తున్న మాధవ్పై రాజమణి, రాజు, ఆగపట్రే మాధవ్ విచక్షణా రహితంగా దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన 6వ టౌన్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని, కోర్టుకు తరలించారు. జడ్జి విచారణ చేపట్టి, ముగ్గురు నిందితులకు పదే ళ్ల జైలు శిక్ష, రూ.పదివేల జరిమానా విధించారు. ఈ కేసులో పోలీసుల తర ఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నర్సింహారెడ్డిప్రాసిక్యూషన్ నిర్వహించారు. రెంజల్: మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో ఇటీవల పోలీసులు డ్రంకన్డ్రైవ్ తనిఖీలు చేపట్టగా, మద్యం తాగి వాహనాలు నడుపుతూ నలుగురు పట్టుబడ్డారు. సోమవారం వారిని బోధన్ కోర్టుకు తరలించగా, జడ్జి రూ.10వేల చొప్పున జరిమానా విధించినట్లు ఎస్సై గంగాధర్ తెలిపారు. వారిలో ఒకరు జరిమానా చెల్లించకపోవడంతో 7రోజుల జైలు శిక్ష విధించినట్లు వివరించారు. వేల్పూర్: విదేశాలకు పంపిస్తానని పలువురి నుంచి డబ్బులు తీసుకొని, పరారీలో ఉన్న వే ల్పూర్ మండలం జాన్కంపేట్ గ్రామానికి చెందిన ఏజెంట్ కొలిప్యాక ప్రవీణ్ను సోమ వారం అరెస్టు చేసినట్లు ఎస్సై సంజీవ్ తెలిపారు. వేల్పూర్, ఆర్మూర్ పరిసర ప్రాంతాల విద్యార్థులకు విదేశాలలో విద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని మాయమాటలు చెప్పి గతంలో నిందితుడు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశాడన్నారు. కానీ వీసాలు పంపకుండా పరారీ కావడంతో బాధితుల ఫిర్యాదు మేరకు 2023లో పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు అతడిని అరెస్టు చేశామన్నారు. వాహనాల చోరీ కేసులో నిందితుడు.. నిజామాబాద్ అర్బన్: నగరంలో గతంలో పలు వాహనాల చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు రెండో టౌన్ ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపారు. నగరానికి చెందిన అబ్దుల్ సల్మాన్ఖాన్ అనే వ్యక్తి గతంలో బర్కత్పురలో స్కూటీని, 4వ టౌన్ పరిధిలో కారును దొంగిలించాడు. పరారీలో ఉండగా సోమవారం బర్కత్పురలో అతడిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. కారు, స్కూటీని రికవరీ చేసినట్లు తెలిపారు. పేకాడుతున్న నలుగురు.. ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగారెడ్డిపేటలో పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై రాజు సోమవారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేసి, పేకాడుతున్న వారిని పట్టుకున్నామన్నారు. అలాగే వారి వద్ద నుంచి రూ.7,900 నగదు, 4 ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
నిజామాబాద్ అర్బన్: పెండింగ్లో ఉన్న రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, జే ఏసీ, డీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు సోమవారం ప్రజావాణిలో అదనపు కలెక్టర్ భుజరంగరావుకు వినతిప్రతం అందజేశారు. అలాగే డైట్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ జపాన్ పర్యటనను రద్దుచేయాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు గణేష్ ప్రజావాణిలో వినతిప్రతం సమర్పించారు. శ్రీనివాస్పై ఆర్థిక, పరిపాలన అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు, ఆరోపణలు ఉన్నాయని, వెంటనే ఆయనను జపాన్ పర్యటన నుంచి తప్పించాలన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్ మంజూరు చేయాలని కొందరు కార్మికులు ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. గత కొన్నెళ్లుగా వినతిపత్రాలు ఇస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. -
ప్రయివేట్ బడుల ఆగడాలకు చెక్!
● విద్యాశాఖ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదు చేసే అవకాశం ● ప్రభుత్వ నిర్ణయంతో తల్లిదండ్రుల్లో హర్షంఖలీల్వాడి: ప్రయివేట్ పాఠశాలల ఆగడాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యలను విద్యార్థుల తల్లిదండ్రులు నేరుగా ఆన్లైన్లోనే ఫిర్యాదు చేసేందుకు నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. సమస్యను ఇదివరకు సంబంధిత విద్యాశాఖ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసేవారు. ప్రస్తుతం ఆన్లైన్ విధానం రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోప్యంగా ఫిర్యాదుదారుల వివరాలు.. జిల్లాలో సుమారు 293 ప్రయివేటు బడులు ఉండ గా, 1.05 లక్షల మంది విద్యార్థులు వాటిలో విద్యన భ్యసిస్తున్నారు. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో ఫీజుల పేరుతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం ప డుతోందనే ఫిర్యాదులు వస్తున్నాయి. ట్యూషన్ ఫీ జుతోపాటు వివిధ రకాల పేర్లతో అదనపు రుసుములు వసూళ్లు చేస్తున్నారు. అలాగే పుస్తకాలు, యూనిఫాంల విక్రయం, ఒకే షాపులో కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయడం, అర్హతలేని ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయడం పరిపాటిగా మా రింది. విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ప్ర యోజనం లేకపోవడంతో తల్లిదండ్రులు చేసేదేమి లేక మిన్నకుండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్లో ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది. తల్లిదండ్రులు schooledu. telangana. gov. in/ PSCMS/ వెబ్సైట్లో తమ స మస్యను నమోదు చేయడంతోపాటు అవసరమైన ఆధారాలను కూడా సమర్పించే అవకాశం ఉంటుంది. వాట్సాప్, టోల్ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చే సేందుకు చర్యలు చేపడుతోంది. ఫిర్యాదు చేసిన వా రి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెబుతోంది. అధికారుల పరిశీలన.. ఆన్లైన్లో వచ్చిన ఫిర్యాదులను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు పరిశీలించి వాస్తవాలను నిర్ధారిస్తారు. ఆ తర్వాత జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారం అందిస్తారు. ఆరోపణలు నిజమని తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. పాఠశాల యాజమాన్యాలకు అవసరమైన సూచనలు, హెచ్చరికలు జారీ చేయడంతో పాటు నోటీసులు అందజేస్తారు. నిబంధనల ఉల్లంఘన తీవ్రత ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటారు. -
టీఆర్ఎస్ అధ్యక్షురాలికి ఘన స్వాగతం
ఇందల్వాయి/నిజామాబాద్ అర్బన్: పాంచజన్య మహాసభ కోసం జిల్లాకు వచ్చిన తెలంగాణ రక్షణ సేన పార్టీ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవితకు సోమవారం ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద ఆభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించి సాంప్రదాయ నృత్యాలు చేశారు. కవిత పార్టీ జెండాను ఆవిష్కరించి, ప్రజలకు అభివాధం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం ర్యాలీగా జిల్లాకేంద్రానికి బయలుదేరారు. మాధవనగర్లో పూజలు నిర్వహించి పాత కలెక్టరేట్కు చేరుకున్నారు. మహిళలు బోనాలు, బ తుకమ్మలతో స్వాగతం పలికారు. సభలో కవిత ప్రసంగింస్తుండగా కుమారుడు ఆధిత్య, భర్త అనిల్ కింద జనాల మధ్యలో కూర్చొని ఆసక్తిగా విన్నారు. చప్పుట్లు కొడుతూ సంతోష పడ్డారు. కవిత ప్రసంగిస్తుండగా జనంతోపాటు వింటున్న భర్త, కుమారుడు.. ప్రజలతో మాట్లాడుతున్న కవిత -
ప్రజల ఆరోగ్యంపై బాధ్యతగా వ్యవహరించాలి
నిజామాబాద్ రూరల్: ప్రజల ఆరోగ్యంపై వైద్యసిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని ట్రెయినీ కలెక్టర్ సురేష్ పామూరి అన్నారు. జిల్లాకేంద్రంలోని డీఎంహెచ్వో కార్యాలయంలో సోమవారం వైద్య ఆరోగ్యశాఖలోని అన్ని విభాగాల అధికారులతో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి ట్రెయినీ కలెక్టర్ సురేష్ పామూరి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. పాఠశాల, కళాశాలలో ఆరోగ్యంపై అవగాహన కల్పించాలలన్నారు. గెలుపొందిన వారికి బహుమతుల ను ప్రోత్సాహంగా అందించాలన్నారు. కాలేజీలలో కాంపిటీషన్లను నిర్వహించి, విజేతలకు బహుమతులను అందజేయాలన్నారు. వివిధ శాఖల సమన్వయంతో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. ప్రాథమిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయాలన్నారు. మానవతా ధృక్పథంతో పనిచేస్తూ కొత్తదనాన్ని, సృజనాత్మకత దృష్టితో సాధారణ సేవలకు భిన్నంగా ప్రజలకు సేవలు అందించాలన్నారు. అనంతరం జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై డీఎంహెచ్వో వివరించారు. వైద్యశాఖ అధికారులు బేబీ నాగేశ్వరి, అశోక్, సుమంత్ కుమార్, విద్య, సికందర్నాయక్, రవీందర్, వెంకన్న, అంజన, సుప్రియ, శిఖర, నవ్య, వెంకటేష్, భార్గవి, శ్రావ్య, కీర్తన, రాజేశ్వర్, నారాయణ, విశాల, ఘన్పూర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
మాటలు కలిపి.. మత్తుమందు చల్లి..
● వృద్ధ దంపతుల నుంచి నగదు, వెండి ఆభరణాలు అపహరించిన దుండగులు నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలకేంద్రం గోపాల్పేటలో మాయమాటలు చెప్పి వృద్ధ దంపతుల నుంచి వెండి ఆభరణాలు, నగదును గుర్తుతెలియని వ్యక్తి అపహరించాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మెదక్ జిల్లా హావేలీ ఘణపూర్ మండలం పోచమ్మరాల్తండాకు చెందిన మూడ్ కేస్లీ, ఆమె భర్త సక్రీయ సోమవారం షుగర్ మాత్రల కోసం గోపాల్పేటకు వచ్చారు. బస్టాండ్ సమీపంలోని ఓ మెడికల్ దుకాణం వద్దకు వెళ్తుండగా వారిని గుర్తుతెలియని వ్యక్తి వచ్చి పలకరించాడు. మాయమాటలు చెప్పడంతోపాటు వారిపై గుర్తుతెలియని మత్తు మందును చల్లాడు. దీంతో వెంటనే మత్తులోకి వెళ్లిన కేస్లీ దుండగుడు అడిగిన వెంటనే మెడలో ఉన్న 12 తులాల వెండిగోలుసుతోపాటు తన వద్దనున్న పర్సును అప్పగించింది. అనంతరం దుండగుడు మరో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులను పిలిపించుకొని స్కూటీపై పారిపోయారు. వారు వెళ్లిపోయిన తర్వాత తేరుకున్న వృద్ధదంపతులు వెంటనే తాము మోసపోయామని తెలుసుకొని నాగిరెడ్డిపేట పోలీసులను ఆశ్రయించారు. దీంతో అప్రమత్తమైన నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్గౌడ్ మండలకేంద్రలలోని పలు దుకాణాలలో ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించి దుండగుల వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. -
ఆటో–బైక్ ఢీ: పలువురికి గాయాలు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఎదురుగా వస్తున్న ఆటోను బైక్ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురితోపాటు బైక్ నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. నాగిరెడ్డిపేట మండలం బంజార వద్ద జరిగిన ఘటన వివరాలు ఇలా.. ఎక్కపల్లితండాకు చెందిన రవీందర్, అఖిల్, శాంతి, లక్ష్మీ, సక్రంతోపాటు నాన్విత అనే బాలుడు సోమవారం రాత్రి బంజార తండాకు చెందిన కమ్లీ అనే వ్యక్తి ఆటోలో గోపాల్పేట నుంచి బంజారకు బయల్దేరారు. అదే సమయంలో గుడితండాకు చెందిన కేవ్లోత్ చోక్లా అనే వ్యక్తి తన బైక్పై బంజారతండా వైపు నుంచి గోపాల్పేట వైపు వెళ్తున్నాడు. ఈక్రమంలో బంజార విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో ఆటో–బైక్ ఎదురెదురుగా వచ్చి బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇరు వాహనాలు ధ్వంసం కాగా, ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురితోపాటు బైక్ నడిపిన చోక్లాకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో రవీందర్తోపాటు అఖిల్, నాన్విత్ అనే బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. అంబులెన్స్ రావడంలో జాప్యం కావడంతో సమాచారం అందుకున్న ఎస్సై భార్గవ్గౌడ్ ఘటనస్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన రవీందర్, అఖిల్ను తానే స్వయంగా తీసుకొచ్చి పెట్రోలింగ్ వాహనంలోకి చేర్చారు. అనంతరం వారిని మెదక్ ఆస్పత్రికి తరలించారు. -
8 కి.మీ ప్రయాణం.. రూ.90 టికెట్
● ఆర్టీసీ నిలువు దోపిడీ ● రూ.30 టికెట్కు మూడింతలు వసూలు భిక్కనూరు : రాఖీ పండుగ స్పెషల్ బస్సుల పేరిట ఆర్టీసీ అదనపు చార్జీలతో ప్రయాణికులకు మోత మోగుతోంది. ఎనిమిది కిలోమీటర్ల దూరానికి రూ.30 టికెట్ ఉండగా, రూ.90 చార్జీ వసూలు చేసిన సంఘటన కామారెడ్డి జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. మెదక్ జిల్లా రామాయంపేట నుంచి భిక్కనూరుకు సరిగ్గా ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది. భిక్కనూరుకు చెందిన ఎనిమిది మంది ప్రయాణికులు రామాయంపేట బస్టాండ్లో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డిపోకు చెందిన బస్సు ఎక్కారు. చాలా మంది ప్రయాణికులు ఉండటంతో కండక్టర్ టిక్కెట్లు ఇస్తూ వచ్చేసరికి బస్సు బస్వాపూర్ గ్రామం వద్దకు చేరుకుంది. భిక్కనూరుకు టికెట్ ఇవ్వాలని అడగ్గా ఒక్కొక్కరికి రూ.90 అని కండక్టర్ చెప్పడంతో ప్రయాణికులు అవాక్కయ్యారు. అధిక చార్జీలు ఎందుకు వసూలు చేస్తున్నారని కండక్టర్ను ప్రశ్నించగా ప్రత్యేక రోజుల్లో ఆర్టీసీకి చార్జీలను పెంచుకునే అవకాశం ఉందని సమాధానం ఇచ్చాడు. దీంతో చేసేదేమీ లేక ప్రయాణికులు ఒక్కొక్కరూ రూ.90 చెల్లించి టికెట్ తీసుకున్నారు. తాము రోజూ వ్యక్తిగత పనుల నిమిత్తం రామయాంపేట నుంచి భిక్కనూరుకు వచ్చి వెళ్తుంటామని, ఆర్టీసీ ఇలా దోపిడీ చేయడం తగదని ఆవేదన వ్యక్తంచేశారు. -
నికాల్పూర్లో ఘనంగా తీజ్
డొంకేశ్వర్: మండల పరిధిలో నికాల్పూర్ గ్రామంలో బంజారాల అతిపెద్ద సాంప్రదాయ పండుగ తీజ్ ఉత్సవాలు వైభంగా జరిగాయి. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ప్రకృతి మాతను పూజిస్తూ తొమ్మిది రోజుల పాటు సాగిన ఈ వేడుకలు నికాల్పూర్లో పండుగ శోభను తీసుకొచ్చాయి. వేడుకల ముగింపు సందర్భంగా యువతీ యువకులు తమ సంప్రదాయ దుస్తులైన పేటియా, కంచాలి, చంతియా ధరించి కాళ్లకు గజ్లె లు కట్టి ఆడిన లంబాడీ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. వేడుకల్లో సర్పంచ్ బానోత్ అనితాసుమన్, మాజీ ఎంపీటీసీ భీమ్నాయన్, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు గొడిసెరం భూమేశ్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
గుంతను తప్పించే క్రమంలో ఢీకొన్న బైక్లు
● యానంపల్లి వద్ద ఒకరి మృతిడిచ్పల్లి(నిజామాబాద్రూరల్): మండలంలోని యానంపల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు, డిచ్పల్లి ఎస్సై ఎండీ ఆరీఫ్ తెలిపిన వివరాలు ఇలా.. యానంపల్లి గ్రామానికి చెందిన జయ్య నవీన్ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఆదివారం బైక్పై డిచ్పల్లి వైపు బయలుదేరాడు. అదే సమయంలో మెంట్రాజ్పల్లి గ్రామానికి చెందిన గుర్రపు కిషన్ (46) తన బైక్పై సుద్దులం నుంచి తన గ్రామానికి వెళుతున్నాడు. బాలికల గురుకుల పాఠశాల సమీపంలో రోడ్డుపై గుంతను తప్పించడానికి ముందు వెళుతున్న నవీన్ సడన్బ్రేక్ వేశాడు. ఈక్రమంలో వెనకే వస్తున్న కిషన్ బైక్ అతడిని ఢీకొనగా, రెండు బైక్లు కొంతదూరం రాసుకుపోయాయి. అదే సమయంలో రామడుగు గ్రామానికి చెందిన నీరడి ప్రదీప్ తన భార్య, కొడుకుతో కలిసి బైక్పై సుద్దపల్లి వైపు నుంచి తన గ్రామానికి వెళుతున్నాడు. దీంతో నవీన్ వాహనం తగిలి ప్రదీప్ వాహనం కూడా అదుపుతప్పి రోడ్డుపై పడిపోయా రు. ఈ ఘటనలో కిషన్కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే నవీన్, ప్రదీప్తోపాటు వారి కుటుంబీకులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక కంకర క్రషర్ల నుంచి నిత్యం భారీ లోడుతో రాకపోకలు సాగిస్తున్న టిప్పర్ల వల్ల రోడ్డుపై పలు చోట్ల భారీ గుంతలు ఏర్పడుతున్నాయని, దీంతో వాహనదారులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. -
ముగిసిన ఉమ్మడి జిల్లాస్థాయి ఆర్చరీ పోటీలు
● రాష్ట్రస్థాయి పోటీలకు పలువురి ఎంపిక దోమకొండ: మండల కేంద్రంలోని గడికోటలో ఆదివారం ఉమ్మడి జిల్లాస్థాయి జూనియర్ ఆర్చరీ పోటీలు ముగిశాయి. పలువురు క్రీడాకారులు ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇండియన్ రౌండ్ బాలికల విభాగంలో లైలా, ప్రీతి, అంజలి, శ్రావ్య, శ్రీజ, భావన ఉత్తమ ప్రతిభతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బాలుర విభాగంలో పణీత్, రెహాన్, రామ్చరణ్, అరవింద్, సోఫియన్, స్నేహిత్ ఎంపికయ్యారు. రికర్వ్ రౌండ్ బాలికల విభాగంలో ఇందు, వైష్ణవి, వర్షిత విజయం సాధించారు. బాలుర విభాగంలో అనుదీప్, నవీన్, అకుల్, రుత్విక్, హేమంత్, నిశిత్ కుమార్ విజయం సాధించారు. కాంపౌండ్ రౌండ్ బాలుర విభాగంలో సురేష్ చౌదరి ఎంపికయ్యారు. హైదరాబాద్లోని కొల్లూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వచ్చే నెల 6న నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో వారు పాల్గొననున్నట్లు కోచ్ ప్రతాప్దాస్ తెలిపారు. ప్రతిభ చూపిన క్రీడాకారులను జిల్లా ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు తిర్మల్గౌడ్, ఉపాధ్యక్షుడు నరసింహరెడ్డి, కార్యదర్శి మోహన్రెడ్డి, కోచ్ ప్రతాప్దాస్, దోమకొండ గడికోట ట్రస్టు మేనేజర్ బాబ్జీ, నిజామాబాద్ అర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, కార్యదర్శి గంగరాజు అభినందించారు. ఆర్చరీ డిస్ట్రిక్ట్ మీట్లో గోల్డ్ మెడల్ వర్ని: మండలంలోని చింతల్పేట్ గ్రామా నికి చెందిన బర్ధవల్ సురేశ్చౌదరి ఆర్చరీ డి స్ట్రిక్ట్ మీట్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి గోల్డ్మెడల్ సాధించాడు. బోర్గాం జిల్లా పరిషత్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్న సురేశ్చౌదరి కామారెడ్డి జిల్లా దోమకొండలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ మీట్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించడంతోపాటు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 6న హైదరాబాద్లో నిర్వహించే రాష్ట్రస్థాయి మీట్లో పాల్గొననున్నాడు. ఆర్చరీ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ రవీందర్ సురేశ్కు కోచ్గా వ్యవహరించారు. -
పేదల సొంతింటి కల సాకారం
వేల్పూర్: ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల సాకారం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమ వుతుందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రంగు అనిల్గౌడ్ అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో జే తులసి, శ్రీనివాస్ దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లుకు ఆయన ఆదివారం గృహప్రవేశం నిర్వహించారు. కార్యక్రమంలో వేల్పూర్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలేటి రాజేందర్, నాయకులు నరేందర్, హరికిషన్, మల్లేశ్, మోహన్, ఆర్మూర్ మోహన్, మాదారి రాజేందర్, రేవంత్రెడ్డి, ధనుష్, నవీన్, ఇంద్రాగౌడ్, మధు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాక్లూర్: మండలంలోని మాణిక్భండార్ గ్రామంలో ఆదివారం లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్రెడ్డి ఆదేశం మేరకు డీసీసీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీ పురుషోత్తం ఆధ్వర్యంలో నిర్వహించిన గృహ ప్రవేశ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. పార్టీ మండల సీనియర్ నాయకులు గంగాధర్గౌడ్, పార్టీ అధ్యక్షుడు బీ దయాకర్రావు, సర్పంచుల ఫోరం మంల అధ్యక్షుడు సాయినేని వెంకటేశ్వర్రావు, మాక్లూర్ విండో చైర్మన్ బూరోల్ల అశోక్, మాజీ సర్పంచ్ అన్నబోయిన రాజేందర్, నాయకులు కంటాజి రాజేశ్వర్, లచ్చారెడ్డి, టీఎన్ రెడ్డి, జీ స్వామి, టీ లక్ష్మణ్, నుడా అధికారి జైవీర్, ఇందిరమ్మ కమిటీ, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు. -
రూ. పది లక్షల ఎల్వోసీ అందజేత
డొంకేశ్వర్: అనారోగ్యంతో చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన చిన్నాయానం గ్రామానికి చెందిన బొమ్మ నరేశ్కు చికిత్స కోసం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి రూ.10 లక్షల ఎల్వోసీ అందజేశారు. ఈ మేరకు బీజేపీ నాయకులు తొండాకూర్ ముత్యం ఆధ్వర్యంలో చెక్కును బాధిత కుటుంబానికి ఆదివారం అందజేశారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి అండగా నిలుస్తున్నార ని ఆయన కొనిడాయారు. బీజేపీ మండల అధ్యక్షు డు చిన్నారెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు. వేల్పూర్: చేయూత పింఛన్కు సోమవారం ఆఖరు తేదీ ఉన్నందున వేల్పూర్లో అర్హులైన వారంతా దరఖాస్తు చేసుకోవాలని స్థానిక సర్పంచ్ మొండి అశోక్ తెలిపారు. వేల్పూర్లో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోనివారు ఎవరైనా ఉంటే జీపీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. బోధన్ టౌన్(బోధన్): బోధన్ ప్రభుత్వ ఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు సీఐ వెంకటనారాయణ ఆదివారం తెలిపారు. పట్టణంలోని శక్కర్నగర్ చౌరస్తాలో ఈనెల 21న భిక్షాటన చేసే గుర్తుతెలియని వ్యక్తి అపస్మారకస్థితిలో ఉండగా, పోలీసులు గమనించి, స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడని, మృతదేహాన్ని మార్చురీలో ఉంచినట్లు తెలిపారు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవని, వయస్సు సుమారు యాభై ఏళ్ల వరకు ఉంటాయన్నారు. ఆచూకీ తెలిసిన వారు 87126 59778, 87126 50870 నంబర్లకు సమాచారం అందించాలన్నారు. ● దంపతులకు గాయాలు ఆర్మూర్ టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ 44వ నెంబర్ జాతీయ రహదారిపై బైక్ను లారీ ఢీకొనడంతో దంపతులకు గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామానికి చెందిన కుకునూర్ సాయిరెడ్డి, సంధ్య దంపతులు ఆదివారం బైక్పై పెర్కిట్లోని ఓ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న పెళ్లికి బయలుదేరారు. హైవే సర్కిల్ చౌరస్తా వద్ద వారి బైక్ను హైదరాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆర్మూర్ లోని ఆస్పత్రికి తరలించారు. కాగా సాయిరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. లారీని సీజ్ చేసినట్లు కేసు నమోదు చేసి పోలీసులు తెలిపారు. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. -
రేపటి నుంచి జిల్లా స్థాయి యోగా పోటీలు
నిజామాబాద్ రూరల్ : యోగా అసోసియేషన్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నందిపేట్లోని ఉజ్వల హైస్కూల్లో 17వ జిల్లా స్థాయి యోగాసన పోటీలను నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఐశ్వర్య కాళె తెలిపారు. జిల్లా కేంద్రంలోని అసోసిమేషన్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 8 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి వివిధ కేటగిరీలుగా పోటీలు ఉంటాయని, పాల్గొనదలచిన వారు ముందుగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. మరింత సమాచారం కోసం 8106420241, 80749 82200 నంబర్లను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో టీవీ ప్రవీణ్నాయుడు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా నీట్ పీజీ ఎంట్రెన్స్
నిజామాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలో నీట్ పీజీ ఎంట్రెన్స్ పరీక్ష ఆదివారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. మొత్తం 265 మంది అభ్యర్థులకుగాను 263 మంది హాజరు కాగా, ఇద్దరు గైర్హాజరయ్యారు. ఏవీ ఎంటర్ ప్రైజెస్ పరీక్ష కేంద్రంలో 175 మంది అభ్యర్ధులకుగాను 174 మంది, అయేషా కా లేజీ సెంటర్లో 90 మందికి గాను 89 మంది పరీక్ష రాశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్సీ స్టడీ సర్కిల్ సెంటర్ టిఫిన్లో పురుగులు ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్లో ఆదివారం ఉదయం అందించిన అల్పాహారంలో తెల్ల పు రుగులు కనిపించాయి. స్టడీ సర్కిల్లో కో చింగ్ పొందుతున్న అభ్యర్థులకు ఆదివారం ఉదయం బోండాలు అందించారు. అభ్యర్థు లు తింటున్న క్రమంలో బజ్జీల్లో తెల్లపురుగు లు కనిపించాయి. నాలుగు నెలల క్రితం స్టడీ సర్కిల్ను ప్రారంభించగా, అప్పటి నుంచి భోజనం సక్రమంగా ఉండటం లేదని, స్టడీ సర్కిల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్యను పరిష్కరించడం లేదనే ఆరోపణ లు వ్యక్తమవుతున్నాయి. స్టడీ సెంటర్పై కలెక్టర్ దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని అభ్యర్థులు కోరుతున్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం బాన్సువాడ : వర్ని మండలం తగిలేపల్లి మాజీ సర్పంచ్ వెంకన్న కుటుంబానికి ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి ఆదివారం రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. వెంకన్న ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. మాజీ సర్పంచ్ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న పోచారం ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడూ తన వెంట ఉండే నాయకుడు వెంకన్న హత్యకు గురికావడం బాధాకరమని అన్నారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి ఉన్నారు. -
నూతన కమిటీ ఎన్నిక
బోధన్: ఎడపల్లి గ్రామ మున్నూరు కాపు సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఆరు తర్పాలకు సంబంధించిన 194 మంది ప్రతినిధులు సమావేశమయ్యారు.సంఘ గ్రామ అధ్యక్షుడిగా బర్ధిపూ ర్ నర్సయ్య,ఉపాధ్యక్షులుగా కట్కం సుధా కర్, సంతోష్, బర్ధిపూర్ అశోక్, ప్రధాన కార్యదర్శు లుగా శిరిశెట్టి సంతోష్,కంజర అభినవ్, స హా య కార్యదర్శులుగా కంజరి ఓంప్రకాశ్, న్యావ నంది శ్రీకాంత్,ప్రచార కార్యదర్శిగా శివచైత న్య, కోశాధికారిగా ఆకుల సంతోష్,సలహాదా రులుగా నాయిడి పోతన్న,ఆకుల శ్రీనివాస్, బొబ్బిలి శ్రీనివాస్, భుజంగం లింగం,బర్ధిపూ ర్ విఠల్,కట్కం అరుణ్ ఎన్నికయ్యారు. కుల సంఘ పెద్దలు, ప్రతినిధులు పాల్గొన్నారు. నందిపేట్: మండల కేంద్రంలో జీపీ కార్మికులకు కాంగ్రెస్ నాయకుడు మంద మహిపాల్ సతీమణి మంద శ్రావణి జన్మదినం సందర్భంగా ఆదివారం దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, లయన్స్ క్లబ్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్నగర్లో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఆర్మూర్ మహాత్మ స్వచ్ఛంద సే వా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాప క అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్, సభ్యులు గణేశ్, వేణు,నూకల ఆదిత్య,రమేశ్,మహేశ్ అగర్వా ల్,సాయి కిరణ్,ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వేల్పూర్(ముప్కాల్): ముప్కాల్ మండల కేంద్రంలో దివంగత నునుగొండ అంజయ్య స్మారకార్థంగా ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించిన అండర్ 17 బాలికల కబడ్డీ పోటీల్లో పోచంపాడ్ రెసిడెన్షియల్ స్కూలు బాలికల జట్టు విజేతగా నిలిచింది. అంజయ్య కుమారుడు రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై విజేత జట్టుకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కే గంగాధర్, ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ సభ్యులు, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు. బోధన్: శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని పట్టణ కేంద్రంలోని ఆర్యసమాజ్ దయానంద్ గోశాలలో ఈ నెల 26న ప్రారంభమైన శ్రావణి ఉపాకర్మ, వేది ధర్మ ప్రచార యజ్ఞ మహోత్సవ వేడుకలు ఆదివారం ముగిశాయి. ఐదు రోజుల పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో యజ్ఞం, వేదపారాయణం, ప్రవచనాలు కొనసాగాయి. యజ్ఞ బ్రహ్మ శ్రీమాన్ మాఘం కృష్ణమూర్తి వేద ప్రవచనాలు చేశారు. ఆఖరి రోజు సామూహిక యజ్ఞం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్యసమాజ్ ప్రతినిధులు, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్టపై ఉన్న శివాలయంలో సోమ వారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆలయ పరిసర ప్రాంతాల్లో పల్లకీసేవ నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. -
ఇందూరు అబ్బాయి– కెనడా అమ్మాయి
● పెద్దల అంగీకారంతో నగరంలో వైభవంగా వివాహ వేడుక డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): నిజామాబాద్ నగ రానికి చెందిన అబ్బాయి, కెనడా దేశానికి చెందిన అమ్మాయి పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. వివరా లు ఇలా.. నిజామాబాద్లోని అంబేడ్కర్ కాలనీకి చెందిన తాటిపాముల సంజయ్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, ఉద్యోగం కోసం కెనడా దేశానికి వెళ్లాడు. అక్కడే అమెరికన్ ఫుడ్ కంపెనీలో పని చేస్తున్న సబ్రినాతో సంజయ్కు ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ విషయాన్ని ఇరువైపులా పెద్దలకు చెప్పడం, వారు అంగీకరించడంతో పెళ్లికి ముహూర్తం ఖరారు చేశారు. ఇండియాలో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో తల్లిదండ్రులు ఏమీచర్చస్వైన్, శామ్యూల్ మార్క్స్వైన్లతోపాటు వారి కుమార్తె సబ్రినా ఇటీవల ఇండియాకు చేరుకున్నారు. పెళ్లికి ముందు తతంగాలు పూర్తి చేసుకున్నారు. ఆదివారం డిచ్పల్లి మండలం బర్ధిపూర్ శివారులో ని హోటల్ కృష్ణలో సంజయ్, సబ్రినా పెళ్లి వైభవంగా జరిగింది. నూతన వధూవరులను ఇరువైపులా కుటుంబసభ్యులు, బంధువులు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. -
హెల్మెట్ లేని వారికి మొక్కల పంపిణీ
ఆర్మూర్ టౌన్: హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు మొక్కలు అందజేస్తూ హెల్మెట్ ప్రాధాన్యతను సామాజిక సేవకుడు వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్మూర్, పిప్రి, మంథని, సుర్బిర్యాల్, ఫతేపూర్తో వివిధ గ్రామాలకు ప్రయాణించే ద్విచక్ర వాహనదారులను ఆపి, హెల్మెట్ లేని వారికి అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఉచితంగా మొక్కలను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. -
సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి
వర్ని: ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని, గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని వర్ని ఎస్సై వంశీకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని సిద్ధాపూర్ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన సదస్సును నిర్వహించారు. కెమెరాల ఏర్పాటు వల్ల నేరాలను నియంత్రించవచ్చని, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడవచ్చని వెల్లడించారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సర్పంచ్ బాల్ సింగ్, జాకోరా సొసైటీ చైర్మన్ దశరథ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
సంక్షిప్తం
నేడు మండల మహిళా సమాఖ్య సభ రుద్రూర్: కోటగిరి మండల మహిళా సమాఖ్య వార్షిక మహజన సభ సోమవారం నిర్వహించనున్నట్లు ఐకేపీ ఏపీఎం భాస్కర్ ఆదివారం తెలిపారు. కోటగిరి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉదయం 11:30 గంటలకు సభ ప్రారంభమవుతుందన్నారు. మహిళా సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు సకాలంలో హాజరు కావాలని కోరారు. సభను విజయవంతం చేయాలి రెంజల్: జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ గ్రౌండ్లో సోమవారం మధ్యాహ్నం నిర్వహించే పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన నాయకులు కోరారు. ఆదివారం స్థానిక విలేకరులతో తాడ్బిలోలి సర్పంచ్ డాక్టర్ తెలంగాణ శంకర్, జాదవ్ రాజు, రాఘవేందర్ మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత జిల్లా పర్యటనకు వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మొదటి పర్యాయం హాజరవుతున్నట్లు వివరించారు. మండలం నుంచి భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో లచ్చవార్ కృష్ణ, అశోక్ పాల్గొన్నారు. నేడు గ్రామ సభ రుద్రూర్: మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో సోమవారం గ్రామ సభను ఏర్పాటు చేస్తున్నట్లు జీపీ కార్యదర్శి ప్రేమ్దాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్పంచ్ ఇందూర్ చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించే సభలో డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. సన్మానం బోధన్టౌన్: బోధన్ బల్దియా బీజేపీ ఫ్లోర్ లీడర్గా ఎన్నికై న 11 వార్డు కౌన్సిలర్ కొలిపాక రేణుకా బాలరాజు, డిప్యుటీ ఫ్లోర్ లీడర్గా ఎన్నికై న రాజుల దేవి లక్ష్మి పూజిత, ఫ్లోర్ సెక్రటరీగా ఎన్నికై న గుంత అబ్బవ్వను పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పసులోటి గోపికిషన్, మాజీ కౌన్సిలర్ మాసిని వినోద్, ప్రధాన కార్యదర్శి మిర్జాపూర్ బాలరాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పోలీస్ ఎన్నికల్లో గందరగోళం
● పరస్పర ఫిర్యాదులు.. ఆరోపణలు ● ఇప్పటికే ఓ సారి రద్దయిన ప్రక్రియ ● నేడు ‘సర్కిల్’ పరిధిలో నిర్వహణ నిజామాబాద్అర్బన్: పోలీస్సంఘం ఎన్నికలు జిల్లాలో రసవత్తరంగా మారాయి. పరస్పర ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో ఈనెల 27న జరగాల్సిన ఎన్నికలు అనూహ్యంగా వాయిదాపడ్డాయి. పోలీస్ సంఘం అధ్యక్ష పదవికి మొత్తం నలుగురు పోటీ పడగా.. సతీశ్ (పీసీ) ప్రస్తుతం పోలీసుశాఖలో కాకుండా డిప్యుటేషన్పై విద్యుత్ సంస్థ (ట్రాన్స్కో)లో పని చేస్తున్నారని, ఆయన ఎన్నికల్లో పోటీకి అనర్హుడని పేర్కొంటూ మరో అధ్యక్ష అభ్యర్థి సురేశ్ అభ్యంతరం తెలిపారు. దీంతో సతీశ్ నామినేషన్ను ఎన్నికల అధికారులు స్కృటినిలో తొలగించారు. అయితే అనూహ్యంగా సురేశ్ను జగిత్యాల జిల్లాకు బదిలీ చేశారు. గతంలోనే సురేశ్ను బదిలీ చేయాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆ ప్రక్రియ పూర్తయ్యిందని పోలీసు అధికారులు పేర్కొనడం గమనార్హం. అయితే అధ్యక్ష బరిలో ఉన్న అభ్యర్థిని ఎలా బదిలీ చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీంతో సంఘం అధ్యక్ష ఎన్నికల్లో గంగదరగోళం మొదలైంది. చివరకు సీపీ ఎన్నికలను రద్దు చేశారు. అయితే ఎప్పుడో వచ్చిన ఆర్డర్ కాపీని అడ్డుగా పెట్టుకొని తనను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకే బదిలీ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ సురేశ్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. జిల్లాలో 25 సర్కిల్ స్టేషన్లు ఉండగా.. సోమవారం సర్కిల్ స్థాయిలో ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. సుమారు 2వేల మంది వరకు సిబ్బంది, అధికారులు ఆయా సర్కిల్లలో ప్రతినిధులను ఎన్నుకోనున్నారు. సర్కిల్ స్థాయి ఎన్నిక ప్రక్రియ ముగిసిన తరువాత అధ్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు. -
హోరాహోరీగా పీఆర్టీయూ ఎన్నికలు
● మొత్తం ఓట్లు 366.. పోలైనవి 358 ● అర్ధరాత్రి వరకు కొనసాగిన కౌంటింగ్ ఖలీల్వాడి : పీఆర్టీయూ జిల్లా కార్యవర్గ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఆదివారం ఉదయం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని అధ్యక్షుడు మోహన్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగింది. మొత్తం 366 ఓట్లు ఉండగా.. ఆయా మండలాల నుంచి తరలివచ్చిన 358 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్ష పదవికి ఎంబెల్లి శంకర్, పొద్దుటూరి మోహన్రెడ్డి , ప్రధాన కార్యదర్శి పదవికి గంట అశోక్, గంగోని కిషన్, ఎం వెంకటేశ్వర్గౌడ్ పోటీపడ్డారు. అలాగే అసోసియేట్ అధ్యక్షులుగా అంకం నరేశ్, చిలుక శ్రీనివాస్, ఎంవీ సురేశ్ చంద్ర, హన్మారెడ్డి, ఉపాధ్యక్ష పదవికి గాండ్ల రాజశేఖర్, డి హన్మాండ్లు, కే కృష్ణమనోహర్రావు, అంజయ్య, శ్రీనివాస్గౌడ్, సాయన్న, కార్యదర్శి స్థానా నికి అప్పెన్న కపిల్ కుమార్, ఏ రామకృష్ణ, ఎడ్ల శేఖర్, జిందం రవి, కే గోపాల్, శ్రీనివాసస్వామి, శ్రీనివాస్ పోటీలో పడ్డారు. మహిళ కమిటీ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. మొత్తం 358 ఓట్లు పోల్కాగా కౌంటింగ్ ప్రక్రియ రౌండ్ల వారీగా అర్ధరాత్రి వరకు కొనసాగింది. మోహన్రెడ్డి, శంకర్ మధ్య రౌండ్ రౌండ్కు ఆధిప త్యం కొనసాగింది. చివరకు శంకర్ 11 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. -
ఇచ్చిన హామీలను అమలు చేయాలి
వర్ని: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం రేవంత్రెడ్డి అమలు చేయాలని టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశ్ అన్నారు. ఆదివారం మోస్రా మండల కేంద్రంలో బీడీ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా కటాఫ్ డేట్ ను తొలగించి పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే జీవనభృతిని రూ. 4016 చెల్లిస్తామని హామీ ఇచ్చి అమలు చేయడంలో వెనకడుగు వేస్తున్నారని ఆరోపించారు. బీడీ కార్మికులను మోసం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి గత సీఎం కేసీఆర్కు పట్టిన గతే పడుతుందని అన్నారు. బీడీ కార్మికులు కళ్యాణి, లక్ష్మి, జ్యోతి, గంగామణి, సునంద, వరలక్ష్మి పాల్గొన్నారు. -
రోడ్డు వెంట ముళ్ల ముప్పు
● ఇబ్బందిపడుతున్న వాహనదారులు ● పట్టించుకోని అధికారులు బోధన్ : సాలూర మండలానికి సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర వైపు వెళ్లే అంతర్రాష్ట్ర రోడ్డు అంచున ఇరువైపుల పలు చోట్ల ముళ్ల పొదలు పెరిగి రోడ్డుపైకి రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు మీదుగా నిత్యం వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు కొనసాగుతుంటాయి. ముళ్ల పొదల వల్ల రాత్రి వేళల్లో వాహనాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలున్నాయి. అంతర్రాష్ట్ర బైపాస్ రోడ్డు మార్గంలో ఇరువైపులా పంట పొలాలున్నాయి. ఆదమరిచి వాహనాలు డ్రైవింగ్ చేస్తే వాహనాలు పంట పొలాల్లోకి దూసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. సంబంధిత శాఖ అధికారులు ఈ రోడ్డు నిర్వహణ, పర్యవేక్షణ విషయంలో పట్టించుకోవడం లేదు. పట్టణ శివారు నుంచి ప్రారంభమై సాలూర మండల కేంద్రం శివారులోని మంజీర నది వరకు విస్తరించి ఉన్న అంతర్రాష్ట్ర బీటీ రోడ్డు సుమారు 8.3 కిలో మీటర్ల పొడువున ఉంది. అంతర్రాష్ట్ర రవాణాకు కీలకమైన ఈ రోడ్డును మూడేళ్ల క్రితం విస్తరణ చేపట్టి పూర్తి చేశారు. ఇదే రోడ్డు మార్గంలో ఉన్న బోధన్ మండలం నాగన్పల్లి గ్రామ అంచున ఉన్న పసుపు వాగుపై హైలెవల్ వంతెన చేపట్టారు. 2025 జూన్ నెలకు ముందు నుంచే ఈ వంతెన మీదుగా అంతర్రాష్ట్ర రవాణా ప్రారంభమైంది. అంతర్రాష్ట్ర రోడ్డు విస్తరణలో భాగంగా బోధన్, సాలూర మండలంలోని నాగన్పల్లి, సాలూర క్యాంప్, సాలూర గ్రామాల శివారులో బైపాస్ రోడ్డును నిర్మించారు. ఎన్హెచ్ఏ, పోలీస్ శాఖ సహకారంతో అంతర్రాష్ట్ర రోడ్డు మార్గంలో భద్రత చర్యలు చేపట్టారు. పలు చోట్ల ఫైబర్ స్పీడ్ బ్రేకర్స్తోపాటు ప్రమాద సూచీక బోర్డులు, పోలీస్ కటౌట్లు ఏర్పాటు చేసి వదిలేశారు. అలాగే పలు గ్రామాల క్రాసింగ్ వద్ద లైటింగ్ స్తంభాలను ఏర్పాటు చేసినా కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదు. దీంతో ప్రధాన కూడళ్లల్లో అంధకారం నెలకొంది. కొంత కాలంలో ఈ రోడ్డుపై నిర్వహణకు అధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఇకనైనా అధికారులు స్పందించి ముళ్ల పొదలు, పిచ్చిమొక్కలు తొలగించేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. అంతర్రాష్ట్ర రోడ్డు నిర్వహణ, పర్యవేక్షణను అధికారులు పట్టించుకోవాలి. రోడ్డు అంచున పెరిగిన ముళ్ల పొదల వల్ల వాహనదారుల ప్రాణాలకు ముప్పు ఉంది. మాగ్రామంతో పాటు పలు చోట్ల లైటింగ్ కోసం స్తంభాలు వేశారు. కానీ కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించాలి. – శ్రీనివాస్ రెడ్డి, సాలూర క్యాంప్ మాజీ ఎంపీటీసీ -
రుణాల లక్ష్యం రూ.91కోట్లు
● జిల్లాలో నందిపేట మండలమే టాప్ ● ఐకేపీ ఏపీఎం గంగాదర్నందిపేట్(ఆర్మూర్): 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను నందిపేట మండలం మహిళా సంఘం సభ్యులకు రూ.91 కోట్ల రుణాలను ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలోనే నందిపేట మండలం అత్యధికంగా రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు ఐకేపీ ఏపీఎం గంగాధర్ తెలిపా రు. మండల కేంద్రంలోని సీ్త్రశక్తి భవనంలో శని వా రం మండల మహిళా సమాఖ్య 19వ వార్షిక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఈ ఆర్థి క సంవత్సరంలో సాధించిన విజయాలు, రాబోయే సంవత్సరంలో చేపట్టబోయే కార్యక్రమాల గురించి చ ర్చించారు. ఏపీఎం మాట్లాడుతూ.. 2026–27 సంవత్సరంలో మహిళా సంఘ సభ్యులకు బ్యాంకు లింకేజీ కింద రూ. 76కోట్లు, సీ్త్రనిధి రూ.15కోట్లు ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం మండల సమాఖ్య నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా సిహెచ్ కొండూర్ గ్రామానికి చెందిన తుల సమ్మ, కార్యదర్శిగా ప్రవీణ, కోశాధికారిగా రుకియా ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నందిపేట సర్పంచ్ ఎర్రం లింగం, తహసీల్దార్ లక్ష్మణ్, వివిద గ్రామాల మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఘనంగా క్రీడా దినోత్సవం
మాక్లూర్/ వేల్పూర్(బాల్కొండ): మాక్లూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ, దాస్నగర్ వద్ద ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం ఘనంగా జాతీయ క్రీడల దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమాల్లో ప్రత్యేక అధికారి స్రవంతి, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నిరూప, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని కృష్ణవేణి హైస్కూల్లో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు క్రీడా విన్యాసాలు నిర్వహించారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నూతన కమిటీ ఎన్నిక
రుద్రూర్: పొతంగల్ మండల గ్రామ పంచా యతీ కార్యదర్శుల సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పీ ప్రతాప్, ఉపాధ్యక్షుడిగా కే వెంకటేశ్వర్గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బీ ప్రియాంక, కోశాధికారిగా ఏ రాజు, గౌరవ అధ్యక్షుడిగా ఎం క్యాకప్ప ఎన్నికయ్యారు. అభినందన ఆర్మూర్టౌన్: ఆర్మూర్ ఆల్ టూ వీలర్స్ మె కా నిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన బీజేపీ ఆర్మూర్ పట్టణ కార్యదర్శి, స్వాభిమాన్ ఆత్మీయ మిత్ర మండలి సభ్యుడు దక్షిణామూర్తికి స్వాభిమాన్ ఆత్మీయ మిత్రమండలి సభ్యులు అభినందించారు. కార్యక్రమంలో జెస్సు అనిల్ కుమార్, ద్యాగ ఉదయ్, విజయానంద్, దొండి ప్రకాశ్, పులి యుగంధర్, కలిగోట ప్రశాంత్, ఉదయ్ గౌడ్, వంశీ తదితరులు పాల్గొన్నారు. భోజన బిల్లులను వెంటనే విడుదల చేయాలి పెర్కిట్: మధ్యాహ్నా భోజన బిల్లులను ప్రభు త్వం వెంటనే విడుదల చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేశ్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఆర్మూర్ డివిజన్ మధ్యాహ్న భోజన కార్మికుల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేసి బియ్య ముతో పాటు కూరగాయలు, నూనె, కోడిగుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు. అ నంతరం మధ్యాహ్న భోజన కార్మిక సంఘం(సీఐటీయూ)ఆర్మూర్ ఏరియా నూతన కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పల్లపు వెంకటేశ్, ఏరియా కార్యదర్శిగా సుజాత, ఉపాధ్యక్షులు గా స్వరూప, సహాయ కార్యదర్శిగా ప్రమీల, కోశాధికారిగా దయమణి ఎన్నికయ్యారు. కా ర్యక్రమంలో నాయకులు సుశీల, దేవాయి, స మీనా, అలేమా, భవిత పాల్గొన్నారు రేపు ప్రత్యేక బస్సులు నడుపుతాం బోధన్: రాఖీ పండుగను పురస్కరించుకుని ప్ర యాణికుల సౌకర్యార్థం ఈ నెల 31న బోధన్ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు డీఎం విశ్వనాథ్ శనివారం ఒక ప్ర కటనలో తెలిపారు. ఆ ఒక్క రోజు మాత్రమే ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించే వారు అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ముందస్తు సీట్ల కోసం రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం ఉందన్నారు. బోధన్ డిపో నుంచి నిజామాబాద్ నగర కేంద్రంతో పాటు జేబీఎస్, వరంగల్ రూట్లో, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడుపుతామన్నారు. సమస్యను పరిష్కరించాలి రెంజల్: నిబంధనలకు విరుద్ధంగా వైన్స్లు ని ర్వహిస్తున్నట్లు ఫిర్యాదు చేసి నెల రోజులు గడుస్తున్నా సంబంధిత ఎకై ్సజ్ పోలీసులు పట్టించుకోవడం లేదని తెలంగాణ రక్షణ సేన సాటా పూర్ గ్రామ ప్రతినిధులు ఆరోపించారు. శనివారం స్థానిక విలేకరులతో వారు మాట్లాడా రు. మండలంలోని సాటాపూర్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వైన్స్లపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్నా రు. వైన్స్ పక్కనే మైసమ్మ గుడి ఉందని అ క్కడికి వచ్చే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అధికారులు విచారణ చే పట్టి చర్యలు తీసుకువాలని కోరారు. మాజీ సర్పంచ్ మృతి బోధన్: సాలూర మాజీ సర్పంచ్ ఇల్తెపు సాయన్న (94) అనారోగ్యంతో శుక్రవారం అర్ధరాత్రి కన్ను మూశారు. ఆయన హ యాంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల మ న్ననలు పొందారు. శనివారం స్వగ్రామంలో ఆ యన అంత్యక్రియలు జరిగాయి. ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు సాయన్న పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. -
బోర్గాం(పీ) జెడ్పీహెచ్ఎస్ విస్తరణకు చర్యలు
మోపాల్(నిజామాబాద్ రూరల్): బోర్గాం(పి) జెడ్పీహెచ్ఎస్ ఆనుకుని ఉన్న ప్రయివేటు స్థలాన్ని కొంతమేర సేకరించి పాఠశాలను మరింత విస్తరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. అలాగే పాఠశాల పక్కనున్న ఆరోగ్య ఉపకేంద్రం, గ్రంథాలయ భవనాలను మరోచోటికి తరలించే అవకాశాలను పరిశీలించాలని, తద్వారా క్రీడా మైదానంతోపాటు అదనపు తరగతి గదుల నిర్మాణానికి వీలవుతుందని అభిప్రాయపడ్డారు. నగరశివారులోని బోర్గాం(పి) జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ శనివారం సందర్శించారు. విద్యార్థుల సంఖ్య, అందుబాటులో ఉన్న బోధనా సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలో 1120 మంది విద్యార్థినీవిద్యార్థులు ఉండటం, ముగ్గురు ఉపాధ్యాయులను జాతీయస్థాయిలో ఉత్తమ అవార్డులు వరించడంపై కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. పాఠాలు బోధించిన కలెక్టర్ పదోతరగతిని సందర్శించిన కలెక్టర్.. విద్యార్థినీవిద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. ఫిజిక్స్, మ్యాథ్స్, ఆంగ్లం సబ్జెక్టులను బోధించి, ప లు ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టారు. సరైన సమాధానాలు చెప్పిన విద్యార్థులకు పెన్నులు బహుమతిగా అందజేశారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యా బోధనను అందించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయా లని కలెక్టర్ సూచించారు. పిల్లలను కేవలం పా ఠ్యాంశాలకే పరిమితం చేయకుండా బయటి ప్రపంచానికి సంబంధించిన విషయ పరిజ్ఞానం కూడా కల్పించాలని ఉపాధ్యాయులకు హితవు పలికారు. ఏకాగ్రతతో చదువుకుని ఉజ్వల భవిష్యత్కు బాట లు వేసుకోవాలని, ప్రస్తుత పోటీ ప్రపంచంలో రా ణించాలంటే విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్క నాటారు. కలెక్టర్ వెంట డీఈవో పి అశోక్, మోపాల్ తహసీల్దార్ రేఖ, ఎంఈవో అమ్దాపూర్ సాయిలు, హెచ్ఎం శంకర్ తదితరులు ఉన్నారు. సబ్సెంటర్, లైబ్రరీని తరలించేందుకు ఏర్పాట్లు విద్యార్థులు విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి కలెక్టర్ భవేశ్ మిశ్రా -
బ్లాక్లో యూరియా!
నిజామాబాద్● కలెక్టర్ భవేశ్ మిశ్రా ఈఎంఐ చెల్లించలేక.. ఈఎంఐ చెల్లించలేక పోవడంతో లోన్ ఇచ్చిన కంపెనీ ఇంటిని సీజ్ చేయగా ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదివారం శ్రీ 30 శ్రీ ఆగస్టు శ్రీ 2026– 8లో uనీట్ పీజీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ సెంటర్ల పరిశీలన నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన నీట్ పీజీ ఎంట్రెన్స్ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ భవేశ్ మిశ్రా శనివారం పరిశీలించారు. అర్సపల్లిలోని ఏవీ ఎంటర్ ప్రైజెస్, మల్లారంలోని షిప్ట్ టెక్నాలజీస్ సెంటర్లలో మొత్తం 265 మంది పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల్లో సరిపడా కంప్యూటర్లు, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ ధ్రువీకరణ పరికరాలు, ఇంటర్నెట్ కనెక్షన్ త దితర సదుపాయాలు అందుబాటులో ఉ న్నాయా లేదా అని కలెక్టర్ గమనించారు. విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా చూడాలని, తాగునీరు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించా రు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే సెంటర్లకు చేరుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ భుజంగరావు, ఆర్డీవో రాజేంద్రకుమార్, డీఈవో అశోక్, డీ ఐఈవో రవికుమార్, డీఎంహెచ్వో రాజశ్రీ, ఏసీపీ ప్రకాశ్, తహసీల్దార్లు వినయ్కుమార్, హరికిశోర్, కలెక్టరేట్ ఏవో బాలరాజు ఉన్నారు. నేడు పీఆర్టీయూ ఎన్నికలు ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవనంలో పీఆర్టీయూ ఎన్నికలను ఆదివారం నిర్వహించనున్నట్లు యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు మోహన్రెడ్డి, కిషన్ శనివారం తెలిపారు. రాష్ట్ర కమిటీ ఎన్నికల బాధ్యల సమక్షంలో ఎన్నికల ప్రక్రియ కొన సాగుతుందని, ఉదయం 10 గంటలకు స మావేశం ఉంటుందని, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. నామినేషన్ల దాఖలు, విత్ డ్రా ప్రక్రియ ముగిసిన తరువాత ఓటింగ్ నిర్వహిస్తారన్నారు. జిల్లాలోని 33 మండలాల కార్యవర్గ సభ్యులు సుమారు 360 మంది ఓటింగ్లో పాల్గొంటారని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డిని కలిసిన గడుగు నిజామాబాద్ రూరల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని హైదరాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రైతు కమిషన్ సభ్యులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. జి ల్లాకు చెందిన రైతు కమిషన్ సభ్యుడు గడు గు గంగాధర్ సీఎంకు పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీఎంతో సమావేశమైన కమిషన్ సభ్యులు పలు అంశాలపై చ ర్చించారు. చిన్న నీటిపారుదల, చెరువుల పరిరక్షణపై వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సమర్పించిన నివేదికను సీఎం పరిశీలించారు. పంటల మార్పిడి, ఉద్యాన సాగు, ఎఫ్పీవోల ద్వారా రైతుల ఆదాయం పెంచడంపై మరింత దృష్టి సారించాలని, రైతు సంక్షేమం, నీటి భద్రత, గ్రామీణ తెలంగాణ సుస్థిర అభివృద్ధే ప్రజాప్రభుత్వ లక్ష్యం అని సీఎం పేర్కొన్నట్లు గడుగు తెలిపారు. జిల్లాలోని ఓ మారుమూల మండలంలోని ఒక గ్రామానికి ఇటీవల పెద్ద లారీలో యూరియా లోడ్ వచ్చింది. అది సొసైటీది కాదు.. డీలర్ది కూడా కాదు. అధికారుల కళ్లుగప్పి రహస్యంగా బ్లాక్ మార్కెట్ వ్యాపారులు తీసుకొచ్చిన యూరియా లారీ అది. మార్కెట్లో యూరియా దొరకని పరిస్థితి చూసి రైతులు వేరే మార్గం లేక ఒక్కో బస్తాను రూ.700 నుంచి రూ.900 వరకు వెచ్చించి కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లో కూడా ఇదే విధంగా బ్లాక్ మార్కెట్లో యూరియాను కొంటున్నారు. డొంకేశ్వర్(ఆర్మూర్): ప్రభుత్వాలు యూరియా పంపిణీలో పారదర్శకత కోసం ఎన్ని యాప్లు తెచ్చి నా, సంస్కరణలు చేసినా బ్లాక్ మార్కెట్లో బహి రంగంగా యూరియా బస్తాలు దొరుకుతున్నాయి. అధికారిక నిబంధనలు, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా యూరియాను కొందరు వ్యాపారులు శాసిస్తున్నారు. ప్రభుత్వం ఎకరానికి రెండు బస్తాలను పరిమితం చేయడంతో మిగతా యూరి యా కోసం రైతులు బ్లాక్ మార్కెట్ను ఆశ్రయిస్తున్నారు. రైతుల అవసరాన్ని, పరిస్థితులను ఆసరాగా చేసుకొని వ్యాపారులు అందినకాడికి దండుకుంటున్నారు. ఒక్కో బస్తాను ఏకంగా రూ.900 వరకు అమ్ముతున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై రూ.267కే ఒక బస్తాను అందిస్తుండగా, బ్లాక్ మార్కెట్లో మూడింతలు చేసి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత ఖరీఫ్లో 4.35 లక్ష ల ఎకరాల్లో వరి సాగవుతోంది. రెండు, మూడో డో సు కోసం పంటలకు సరిపడా యూరియా దొరక్క అన్నదాతలు అల్లాడిపోతున్నారు. ‘ఫ్రేమ్వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్’ మొబైల్ యాప్లో ఎకరానికి కేవలం రెండు బస్తాల నిబంధన ఉండడంతో క్షేత్రస్థాయిలో తీవ్ర కొరత ఏర్పడింది. పంట ఎదుగుదల దశలో యూరియా ఎంతో అవసరం కావడంతో దానికోసం రైతులు ఎంతైనా ఖర్చు చేస్తున్నారు. సాధారణంగా ఎకరానికి 4 బస్తాల వరకు యూరియాను వినియోగిస్తున్నారు. యాప్లో ఎకరానికి రెండు బస్తాలే రావడంతో మిగతా వాటి కో సం ఎక్కువ ధర వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. పట్టాపాస్ పుస్తకాలున్న రైతులకే ఈ పరిస్థితి ఉండగా, ఎలాంటి భూమి పత్రాలు లేకుండా సాగు చేస్తున్న రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వీరు ఎకరానికి సరిపోయే యూరియా కోసం రూ.3 వేల దాకా ఖర్చు చేస్తున్నారు. అయితే, అధికారుల కళ్లుగప్పి యూరియా బస్తాలను జిల్లాకు తెప్పిస్తున్నట్లు తెలుస్తోంది. బహిరంగంగా రైతులను దోపిడీ చేసి సొమ్ము చేసుకుంటున్న బ్లాక్ మార్కెట్ వ్యాపారులను వ్యవసాయాధికారులు పట్టించుకోవడం లేదనే విరమ్శలు వస్తున్నాయి. ఒక్క బస్తా రూ.900కు విక్రయం రైతుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్న కొంతమంది డీలర్లు లారీల్లో గ్రామాలకు రహస్యంగా చేరుకుంటున్న బస్తాలు పట్టించుకోని జిల్లా యంత్రాంగం బ్లాక్లో అమ్మే యూరియా ఎక్కడి నుంచి వస్తోంది..?యాప్లో పెట్టిన పది సెకన్లలోనే యూరియా బస్తాలు బుక్ అయిపోతున్నాయి. చదువుకున్న మా పరిస్థితే ఇలా ఉంటే, చదువురాని రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది. వారికి ఆన్లైన్లో ఒక్క బస్తా కూడా దొరకడం లేదు. దిక్కులేక బ్లాక్లో అధిక ధరకు యూరియా బస్తాలను కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం యాప్లో ఎకరానికి రెండు బస్తాలనే పరిమితం చేస్తే, వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న బస్తాలు ఎక్కడి నుంచి వస్తున్నట్లు? దీనికి అధికారులే సమాధానం చెప్పాలి. – సామాజిక మాధ్యమాల ద్వారా పలువురు రైతుల ఆవేదనధ్యాన్చంద్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న బీఆర్ నేత తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో ఫిజికల్ డైరక్టర్ (పీడీ) బీఆర్ నేత మేజర్ ధ్యాన్చంద్ ఎక్సలెన్స్ – 2026 అవార్డు అందుకున్నారు. జా తీయ క్రీడల దినోత్సవాన్ని పురస్కరించుకొని శని వారం హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ నే తకు నిర్వాహకులు అవార్డును అందజేశారు. ము ఖ్యఅతిథిగా తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ జి బాలకిష్టారెడ్డి, గౌరవఅతిథిగా ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం పాల్గొన్నట్లు నిర్వాహకులు, తెలంగాణ మే ధావుల ఫోరం రాష్ట్ర శాఖ (తెలంగాణ ఇంటలెక్చువల్స్ ఫోరం) అధ్యక్షుడు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ తెలిపారు. బీఆర్ నేతను వీసీ ప్రొఫెసర్ టీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఎం యాదగిరి, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది అభినందించారు. బ్లాక్లో అమ్మితే చర్యలు లైసెన్స్ కలిగిన డీలర్లు ఎవరైనా యూరియాను బ్లాక్ మార్కెట్ చేసి విక్రయిస్తే వారిపై చట్టపర చర్యలు తీసుకుంటాం. డీలర్లు అధిక ధర కు బస్తాలను అమ్మితే రైతు లు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. యూరియా కొరత లేదనే విషయాన్ని రైతులు గమనించాలి. – వీరాస్వామి, జిల్లా వ్యవసాయాధికారి -
ఓటరు జాబితాలో తప్పుల సవరణకు కృషి చేయాలి
● జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లెగంగారెడ్డి ఆర్మూర్: ఓటరు జాబితా తప్పుల సవరణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జాతీయ పసుపు బోర్డు చై ర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మేరు సంఘంలో ఆర్మూర్లో బీజేపీ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఫేస్ 2 వర్క్షాప్ బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అసెంబ్లీస్థాయి వర్క్షాస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ... ప్రతి బూత్లో బీజేపీ తరఫున నియమించిన బీఎల్ఏలు క్షేత్రస్థాయిలో చురుగ్గా పని చేయాలని సూచించారు. ఓటరు లిస్టులో తప్పులు ఉంటే సరిచేయడం, కొత్తగా ఓటు నమోదుకు అర్హులైన యువ తీ యువకులు, మహిళలను గుర్తించి వారిని ఓటర్లు గా నమోదు చేయించేలా ప్రతి గ్రామంలో, ప్రతి బూత్లో తిరిగి పని చేయాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు లోక భూపతిరెడ్డి, రాష్ట్ర నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్, పెద్దోళ్ల గంగారెడ్డి, గంగాధర్, శ్రీనివాస్ రెడ్డి, పొ ల్కం వేణు తదితరులు పాల్గొన్నారు. -
డివైడర్పైకి దూసుకెళ్లిన కారు
ఆర్మూర్ టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద శుక్రవారం ఓ కారు అదుపుతప్పి డివైడర్ పై కి ఎక్కింది. స్థానికులు తెలిపిన వివరా లు ఇలా.. పెర్కిట్ నుంచి ఆర్మూర్ వైపు వెళుతున్న కారు శనివారం మామిడిపల్లి చౌరస్తా వద్ద అదుపుతప్పి రోడ్డు మధ్య లో ఉన్న డివైడర్ పైకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని కారును డివైడర్ పైనుంచి పక్కకు తీశారు. కారులో ముగ్గురు ప్రయాణిస్తుండగా, ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. -
కబ్జా కోరల్లో డిస్ట్రిబ్యూటరీ కాలువ
● సాగునీరు అందక నష్టపోతున్న రైతులు ● ముసలి కుంట చెరువు అలుగు కబ్జా చేసి నిర్మాణాలు ● పట్టించుకోని అధికారులుమాక్లూర్: మండలంలోని దాస్నగర్ వద్ద ఉన్న నిజాంసాగర్ ప్రధాన కాలువ అయిన 68వ డిస్ట్రిబ్యూటరీ కాలువ కబ్జాకు గురైంది. కొందరు వెంచర్ యజమానులు కాలువను కబ్జా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాలువ కబ్జాతో ముసలికుంట – బొమ్మకుంట చెరువు ప్రాంతాల్లోని పంటలకు సాగు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నిజాంసాగర్ ప్రధాన కాలువ నుంచి ప్రారంభమయ్యే 68వ డిస్ట్రిబ్యూటరీ నుంచి రెండు పిల్ల కాలువలు ఉన్నాయి. దాస్నగర్ వద్ద ప్రస్తుత పోలీస్స్టేషన్ వెనుక నుంచి వెళ్లే పిల్ల కాలువ ద్వారా బోర్గాం(కె) శివారులోని ముసలికుంట చెరువు, బొమ్మ కుంట చెరువులు నిండి తద్వారా సుమారు 150 ఎకారలకు సాగు నీరంది రెండు పంటలు పండేవి. ప్రస్తుతం 68వ డిస్ట్రిబ్యూటరీ నుంచి వచ్చే పిల్ల కాలువను ఓ వెంచర్ యజమాని పూర్తిగా మట్టితో పూడ్చి ప్లాట్లు చేసి ప్రహారి నిర్మించటంతో ఈ రెండు చెరువులకు నీరందక పంటలు ఎండి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అదే విధంగా ముసలికుంట చెరువు అలుగు ప్రాంతంలో సుమారు 30 గుంటల భూమిని ఓ ప్రైవేట్ వ్యక్తి కబ్జాచేసి ఏకంగా షటర్లు నిర్మించి అద్దె కు ఇస్తున్నా సంబంధిత ఇరిగేషన్ అధికారులు ప ట్టించుకోవడం లేదని బోర్గాం(కె) ప్రజలు మండిపడుతున్నారు. అలాగే 68వ డిస్ట్రిబ్యూటరీ మరో పిల్ల కాలువ ద్వారా మాణిక్బండార్ ఖాన్ చెరువు నిండి తద్వారా మాణిక్బండార్ రైతులకు సంబంధించి వేసంగి 35 ఎకరాలు, వర్షాకాలం 50 ఎకరాల్లో పంటలు సాగయ్యేవి. ఈ పిల్ల కాలువ కూడా పూర్తిగా క బ్జాకు గురై 68వ డిస్ట్రిబ్యూటరీ నుంచి వచ్చే నిజాంసాగర్ నీరు ఖాన్ చెరువుకు అందక స్థానిక రైతులు ఏ ఒక్క పంటను కూడా సాగు చేసుకునే పరిస్థితి లేకుండా పోతోంది. కాలువలపైనే వ్యాపార సముదాయాలు నిర్మించి యథేచ్ఛగా వ్యాపారం చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కబ్జాల విషయమై ఈ నెల 28న స్థానిక రెండో డివిజన్ కార్పొరేటర్ మారంపల్లి మోహన్ ఇరిగేషన్ డీఈ రవికుమార్కు ఫిర్యాదు కూడా చేశారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి కబ్జా భూములపై స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కబ్జాలపై విచారణ చేస్తున్నాం ఇరిగేషన్ భూముల కబ్జాలపై వచ్చిన ఫిర్యాదులను విచారిస్తున్నాం. సర్వే కోసం మాక్లూర్ తహసీల్దార్కు విన్నవించారు. ఇరిగేషన్ ఏఈఈ సాగర్ జరిగిన కబ్జాలపై ఇప్పటికే విచారణ ప్రారంభించారు. – రవికుమార్, ఇరిగేషన్ డీఈ, నందిపేట్ -
యూరియా యాప్ను తొలగించాలి
నవీపేట/ మాక్లూర్: రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న యూరియా యాప్ను రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం ప్రతినిధులు శనివారం తహసీల్దార్ వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. యూరియా యాప్తో సకాలంలో యూరియా అందక రైతులు ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. వర్షాభావం నెలకొన్న నేపథ్యంలో ఎత్తిపోతల పథకాల నుంచి సాగునీటిని సరఫరా చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దేవేందర్ సింగ్, నాయకులు కిషన్, గంగాధర్ పాల్గొన్నారు. ఆలూర్ మండలం కల్లెడి గ్రామంలో యూరియా యాప్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం పెట్టిన యూరియా యాప్లో బుక్ చేసుకున్న పది నిమిషాల వ్యవధిలోనే యూరియా ఖాళీ అవుతుందని మండిపడ్డారు. కల్లెడికి 300 సంచుల యూరియా వస్తే అవసరం అయ్యే రైతులు వేల సంఖ్యలో ఉన్నారన్నారు. కేవలం నాలుగు నిమిషాల వ్యవధిలోనే యూరియా అయిపోవడంపై రైతులు మండిపడుతూ కొద్ది సేపు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. వెంటనే యాప్ను తొలగించి ప్రతి ఎరువుల దుకాణంలో యూరియాను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చే శారు. -
అంతర్రాష్ట్ర నేరస్తుడి అరెస్ట్
● 10.8 తులాల బంగారు నగలు స్వాధీనం నందిపేట్ (ఆర్మూర్): నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన దొంగత నం కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు అంతర్రాష్ట్ర నేరస్తుడిని అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఆర్మూర్ రూరల్ సీఐ జాన్రెడ్డి శనివారం నందిపేట పోలీస్ స్టేషన్లో మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన నందిపేటలోని గాంధీ మెడికల్ యజమాని ఇంటి తాళాలను పగులగొట్టి ఇంట్లోకి చొరబడిన దుండగులు బంగారు నగలను ఎత్తుకెళ్లారు. బాధితుడి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీలను పరిశీలించడంతోపాటు అనుమానిత నేరస్తుల పై నిఘా సారించారు. మహారాష్ట్రకు చెందిన పాత నేరస్తుడు షేక్ ఖయ్యూమ్ రఫీక్ బేగ్ దొంగిలించిన బంగారు ఆభరణాలను విక్రయించేందుకు శనివారం నిజామాబాద్ వైపు వెళ్తుండగా నవీపేట్ రైల్వే స్టేషన్ వద్ద పట్టుకున్నారు. అతడిని విచారించగా.. నందిపేటలో చోరీకి పాల్పడింది తానేనని అంగీకరించాడు. నిందితుడి వద్ద నుంచి పది తులాల 8 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మహారాష్ట్రలోని కొత్వాలీ, కర్నాటక రాష్ట్రంలోని బీదర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 2023లో కొత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుడి నుంచి అక్కడి పోలీసులు 4 పిస్టల్స్ రికవరీ చేశారు. నిందితుడిని పట్టుకున్న సీఐ జాన్రెడ్డి, ఎస్సై వినయ్, హెడ్ కానిస్టేబుల్ నరేందర్, కానిస్టేబుల్లు అనిల్, శ్రీనివాస్, షబ్బీర్, మహిపాల్ను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. -
ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
వేల్పూర్(బాల్కొండ): బాల్కొండ మండల కేంద్రంలోని కృష్ణవేణి హైస్కూల్లో శనివారం తెలుగు భా షా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు భాష గొప్పతనం గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో స్కూలు డైరెక్టర్లు, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గిడుగుదే ఘనత రుద్రూర్: వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు, గొప్ప భాషావేత్త గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏ డాది ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తామని కవి, రచయిత నాగం సాయిలు అన్నారు. పొతంగల్ మండలం హెగ్డొలి గ్రామానికి చెందిన నాగం సాయిలు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శనివారం సాక్షితో మాట్లాడారు. గిడుగు రామమూర్తి పంతులు చేసిన కృషి ఫలితంగానే నేడు తెలుగు భాషను సరళమైన వ్యవహారిక భాషలో మాట్లాడగలుగుతున్నామని పేర్కొన్నారు. -
నోటీసుల పంపిణీని వేగవంతం చేయాలి
నిజామాబాద్ అర్బన్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా హియరింగ్ నోటీసుల పంపిణీనీ వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై శనివారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి సుదర్శన్రెడ్డి హైదరాబాద్ నుంచి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా ఎస్ఐఆర్పై సమీక్షించారు. మ్యాపింగ్ కాని, అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్లకు నోటీసుల పంపిణీ, హియరింగ్ అంశాలపై పలు సూచనలు చేశారు. గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారం తీసుకుని ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. తప్పిదాలకు అవకాశం లేకుండా, పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించేందుకు ఈఆర్వోలు, సహాయ ఈఆర్వోలు బూత్ లెవెల్ అధికారులకు దిశా నిర్దేశం చేయాలన్నారు. కలెక్టర్ భవేశ్మిశ్రా మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్ఐఆర్ను పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో హియరింగ్ కోసం 4,32,401 నోటీసులు సిద్ధం చేయగా, ఇప్పటికే 56,678 మందికి నోటీసులు అందజేశామన్నారు. ఈఆర్వోలు, సహాయ ఈఆర్వోలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని, హియరింగ్ ప్రక్రియను నిర్ణీత గడువు లోగా పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. వీసీ అనంతరం జిల్లా అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ భుజంగరావు, నగర పాల క సంస్థ కమిషనర్ దిలీప్కుమార్, ఆర్డీవో రాజేంద్రకుమార్, ఏవో బాలరాజు తదితరులు పాల్గొన్నారు. వేగవంతంగా గోదావరి పుష్కర పనులు నిజామాబాద్ అర్బన్: గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించిన దృష్ట్యా, పుష్కర ఘాట్ల వద్ద విస్తృత ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు సూచించారు. కలెక్టర్తోపాటు దేవాదాయశాఖ అధికారులతో వారు శనివారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇప్పటికే ఆమోదం పొందిన పనులను మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించి తక్షణమే ప్రారంభించాలని అన్నారు. ఈ పనుల పర్యవేక్షణ కోసం తగిన అనుభవం కలిగిన సీనియర్ అధికారిని స్పెషల్ ఆఫీసర్ గా నియమించాలని అన్నారు. భూసేకరణ అవసరమైన పక్షంలో వెంటనే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వారం వారం పనుల ప్రగతిని సమీక్షిస్తూ, నివేదికలు సమర్పించాలని సూచించారు. కలెక్టర్ భవేశ్ మిశ్రా, అదనపు కలెక్టర్ భుజంగరావు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వాల్ పోస్టర్ ఆవిష్కరణ
మాక్లూర్: మండలంలోని కృష్ణనగర్ గ్రామంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర 9వ మహా సభలకు సంబంధించిన వాల్ పోస్టర్లను శనివారం సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దేశె ట్టి సాయిరెడ్డి ఆధ్వర్యంలో మండల నాయకు లు ఆవిష్కరించారు. రెండు రోజుల పాటు మంచిర్యాలలో నిర్వహించే మహా సభలకు ముఖ్యఅతిథులుగా వేములపల్లి వెంకట్రామ య్య, ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షుడు రవీందర్సింగ్, ఉపాధ్యక్షులు జేవీ చలపతిరావు, వీ కోటేశ్వర్రావు, శ్రీనివాస్ పాల్గొంటారని సాయి రెడ్డి తెలిపారు. రైతాంగ సమస్యలపై నిర్వహించే మహాసభలను రైతులు, కార్మికులు విజయవంతం చేయాలని కోరారు. నాయకులు దేదావత్ బన్సీ, డీ అనురాధ, డీ పద్మ, సక్రు, మంగమ్మ, లక్ష్మి, రజిత, సుజాత పాల్గొన్నారు. మధ్యాహ్న భోజనం పరిశీలన మాక్లూర్: మండల కేంద్రంలోని ఉర్ధూ పాఠశాలలో శనివారం మధ్యా హ్న భోజనాన్ని ఉర్దూ పాఠశాల కార్యదర్శి సై ఫొద్దీన్ జాఫర్ పరిశీలించారు. భోజనం నాణ్య త ప్రమాణాలను పరిశీ లించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మధ్యాహ్న భోజన ఏజెన్సీ సభ్యుడికి సూ చించారు. హెచ్ఎం శ్రీనివాస్, సర్పంచ్ ఎస్ వెంకటేశ్వర్రావు, ఉప సర్పంచ్ ఎస్కే హరీఫ్ ఉన్నారు. బాల్కొండలో క్రికెట్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ వేల్పూర్(బాల్కొండ): బాల్కొండ మండల కేంద్రంలో శనివారం స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలో శాంభవి క్రికెట్ లీగ్ టోర్నమెంట్ నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్లో శ్రీనివాస్ జట్టుపై రిత్విక్ జట్టు విజయం సాధించి కప్ సొంతం చేసుకున్నారు. విజేత జట్టుకు శాంభవి హైస్కూల్ చైర్మన్ మధుసూదన్రాజు, కరస్సాండెంట్ రవీన్ప్రసాద్, ప్రిన్సిపాల్ ఇంద్రాణి కప్ను బహూకరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పీఈటీ సందీప్ పాల్గొన్నారు. -
అధికారులు సమన్వయంతో పని చేయాలి
రుద్రూర్: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కారించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు స మన్వయంతో పని చేయాలని కోటగిరి మండల ప్రత్యేకాధికారి శ్రీకాంత్రెడ్డి సూచించారు. కోటగిరి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం మండల స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో మండల సర్పంచులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ మధ్యా హ్నం వరకు ఉంటున్నారని ఆ తర్వాత వచ్చిన రోగులు ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోందని కోటగిరి సర్పంచ్ మధుకర్ ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటలు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో నీటి సమస్య ఉత్పన్నం కాకుండా ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ్ అధికారులు సత్వరమే స్పందించాలని సర్పంచులు కోరా రు. యాద్గార్పూర్ నీటి ట్యాంక్ కూలిపోయే స్థితిలో ఉందని, గ్రామానికి వచ్చే మిషన్ భగీరథ పైపులైన్ దెబ్బతినడంతో మట్టి నీళ్లు సరాఫరా అవుతున్నాయని సర్పంచ్ గౌస్ వాపోయారు. సమస్యను పరిష్కారించి మంచి నీటిని సరాఫరా చేయా లని కోరారు. అవసరమగు ప్రతిపాదనలు చేస్తామ ని అధికారులు సమాధానం ఇచ్చారు. ప్రత్యేకాధి కారి శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలల్లో డ్రాప్ అవుట్ సంఖ్య తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం గ్యాస్ కనెక్షన్ ఉండేటట్టు చూడాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో విష్ణు, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు. -
కేదారేశ్వర ఆశ్రమం
మలిసంధ్యలో మనోధైర్యం● నిస్సహాయ వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్న కేదారానంద ● ఆధ్యాత్మిక చింతనతోపాటు ఆలన.. పాలన నందిపేట్(ఆర్మూర్): నా అనే వారు లేక నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తోంది నందిపేట మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమం. ప్రత్యేకంగా వృద్ధాశ్రమాన్ని నెలకొల్పిన ఆశ్ర మ పీఠాధిపతి కేదారానందస్వామిజీ దిక్కుమొక్కులేని వారి వృద్ధులను అక్కున చేర్చుకుంటున్నారు. బిక్కుబిక్కుమంటూ వస్తున్న వృద్ధుల్లో మనోధైర్యాన్ని నింపుతూ ఆధ్యాత్మిక చింతనలో లీనం చేస్తున్నారు. కన్న కొడుకులా ఆలనాపాలనా చూసుకుంటున్నారు. ఏ దిక్కు లేని వృద్ధులకు ఆశ్ర యం కల్పించాలని సంకల్పించి 20 ఏళ్ల క్రితం కేదారానంద స్వామి వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయా లని సంకల్పించారు. ఆలోచన వచ్చిందే తడువుగా ఆచరణలో పెట్టారు. ప్రస్తుతం 25 మందికి ఆశ్ర యం కల్పిస్తున్నారు. ఉదయం అల్పాహారం, మ ధ్యాహ్నం భోజనం, సాయంత్రం తేనీరు, రాత్రి భోజనం ఇలా రోజూ పౌష్టికాహారం అందిస్తున్నారు. నిద్రించేందుకు సౌకర్యవంతమైన బెడ్లు ఏర్పాటు చేయడంతోపాటు అవసరమైన దుస్తులు ఇస్తున్నారు. వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు ఒక వైద్యుడిని ప్రత్యేకంగా నియమించారు. ఆశ్రయం పొందుతూనే ఆధ్యాత్మిక సేవ కేదారేశ్వర వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారు ఆధ్యాత్మిక సేవలో ముందుంటున్నారు. ఆశ్రమానికి వచ్చే భక్తులకు తమ వంతు సేవలు అందిస్తున్నారు. నిత్యాన్నదానంలో పాలు పంచుకోవడంతోపాటు లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తూ, దేవతా మూర్తులకు ప్రతి నిత్యం అవసరమయ్యే పూలమాలలు అల్లుతూ తరిస్తున్నారు. ఒకరికొకరు తోడుగా ఉంటూ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నారు. ఏదైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే ఆశ్రమ కమిటీ సభ్యులకు తెలిపి సమస్యను పరిష్కరించుకుంటున్నారు. -
సబ్స్టేషన్కు దారేది..
● రోడ్లపై సర్కస్ ఫీట్లు చేస్తున్న సిబ్బంది రెంజల్: రెంజల్లోని సబ్స్టేషన్కు వెళ్లేందుకు సిబ్బందితో పాటు ఇతరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు దారులున్నా చిన్న పాటి వర్షం కురిస్తే రోడ్లు బురదమయంగా మారుతున్నాయి. బురద నుంచి సబ్స్టేషన్కు చేరుకోవా లంటే సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తోందని సిబ్బంది వాపోతున్నారు. అవసరమైన సామగ్రిని తీసుకొచ్చే వాహనాలు దిగబడటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సబ్స్టేషన్కు వచ్చేదారుల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ట్రాన్స్కో సిబ్బంది కోరుతున్నారు. -
యూనిఫాంలు అందజేత
బోధన్రూరల్: మండలంలోని అమ్దాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్, స్కూల్ బ్యాగులను బీఆర్ఎస్ పార్టీ బోధన్ నియోజకవర్గ ఇన్చార్జి అయేషా ఫాతిమా తన జన్మదినాన్ని పురస్కరించుకుని పంపిణీ చేశారు. చింతకుంట అనాథ ఆశ్రమంలో వృద్ధులకు దుస్తులు పంపిణీ చేసి, అన్నదానం నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్, మండలాల అధ్యక్షులు నర్సన్న, సంజీవ్, శ్రీరామ్, భూ మారెడ్డి, నర్సింగ్రావు, కౌన్సిలర్లు మౌబీన్, ముషీర్బాబా, నాయకులు అశోక్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, తోట శ్రీనివాస్, శంకర్గౌడ్, గణేశ్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయికి దూరంగా ఉండాలి
వేల్పూర్(మెండోరా): యువత మత్తు ప దార్థాలు, గంజాయికి దూరంగా ఉండా లని ఎస్సై సుహాసిని అన్నారు. మెండో రా మండలం కొడిచర్ల గ్రామంలో శనివారం రాత్రి పోలీసు కళాజాత కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సుహాసిని మాట్లాడుతూ.. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 112కు సమాచారం ఇవ్వాలన్నారు. వాహనదారులు హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ బరువు కాదు బాధ్యత అన్నారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఆ ఏపీఎం మాకొద్దు సారూ..
● నకిలీ బిల్లులతో డబ్బులు తీసుకుంటున్నాడని ఆవేదన ● డీఆర్డీవోకు ఫిర్యాదు చేసిన మహిళా సమాఖ్య సభ్యులు బీబీపేట:మహిళా సంఘాల డబ్బులను సొంతానికి వాడుకోవడంతోపాటు నకిలీ బిల్లులతో నిధులు దు ర్వినియోగం చేస్తున్న ఏపీఎంపై మహిళా సమాఖ్య సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన కార్యాలయ ఫర్నిచర్ కొనుగోలు విషయంలో నకిలీ బిల్లు లు పెట్టి డబ్బులు సొంతానికి వాడుకున్నాడని, వెంటనే అతనిని విధుల నుంచి తొలగించాలని బీబీపే ట మహిళా సమాఖ్య సభ్యులు జిల్లా గ్రామీ ణాభివృద్ధి సంస్థ అధికారి(డీఆర్డీవో)కి ఫిర్యాదు చేశారు. పాత సీపీయూకు రూ. 35 వేల బిల్లు మండల కార్యాలయంలో సీపీయూ అవసరం ఉండగా కామారెడ్డిలోని ఓ దుకాణంలో పాత సీపీయూ కొనుగోలు చేసి రూ. 35 వేల బిల్లును పెట్టి డబ్బు లు తీసుకున్నాడని పేర్కొన్నారు. ఫర్నిచర్ కొనుగో లు విషయంలో కూడా ఎక్కువగా బిల్లులు చూపించి బలవంతంగా సంతకాలు పెట్టించుకొని డబ్బు లు తీసుకున్నట్లుగా వివరించారు. జిల్లా స్థాయి అధికారులు మీటింగ్కు వచ్చినప్పుడల్లా వారి కారులో డీజిల్ పోయించాలని చెప్పి డబ్బులు తీసుకుంటు న్నాడని పేర్కొన్నారు. మరోవైపు మండల కార్యాలయంలో పనిచేసే కొందరు సిబ్బందిని డిప్యూటేషన్ల ద్వారా మరో చోటికి పంపించి, అతనికి అనుకూలంగా ఉండే వారిని ఇతర మండలాల నుంచి బది లీ చేయించుకొని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని తెలిపారు. మండల సమాఖ్య సభ్యులు తిరస్కరించినా జిల్లా సమాఖ్య నుంచి ఆపరేటర్ను తీసుకొచ్చి నియమించారని, కార్యాలయంలో ఒక అకౌంటెంట్ సరిపోగా, మరొకరిని తీసుకున్నట్లు వివరించారు. మండల సమాఖ్య నెలవారీ సమావేశాల్లో మహిళలపై ఇష్టారీతిన, దురుసుగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. జిల్లా అధికారులు స్పందించి ఏపీఎంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించాలి
గాంధారి : ద్విచక్రవాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని, హెల్మెట్ ధరించని వారికి అవగాహన కల్పించాలని సదాశివనగర్ సీఐ వీరయ్య సూచించారు. శుక్రవారం ఆయన గాంధారి పోలీస్టేషన్ సందర్శించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వారికి పలు సూచనలు చేశారు. పెండింగ్ కేసులు లేకుండా ఎప్పటికప్పుడు విచారణ చేయాలన్నారు. నంబరు ప్లేట్లు లేని వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఏఎస్సైలు రవికుమార్, ప్రకాశ్ సిబ్బంది ఉన్నారు. భిక్కనూరు: మండలంలోని జంగంపల్లి గ్రామశివారు లో అడవి పందు ల దాడిలో శుక్ర వారం వేకువజామున మక్క పంట ధ్వంసమైంది. కౌలు రైతు అంద్యాల రమేశ్ సాగు చేస్తున్న మూడు ఎకరాల మక్క పంటను అడవి పందులు ధ్వంసం చేశాయి. -
కుట్టు మిషన్ ఫ్రీ..!
● బీసీ మహిళలకు కొత్త పథకం ● 100 శాతం సబ్సిడీతో అందజేత ● సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తు గడువు డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత, ఆర్థికాభివృద్ధికి ఇందిర మహిళా శక్తి ద్వారా సంక్షేమ పథకాలు, అవకాశాలు కల్పిస్తోంది. తాజాగా బీసీ సామాజికవర్గానికి చెందిన నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా 100 శాతం సబ్సిడీతో ఉచితంగా ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్’ పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా అర్హులైన మహిళల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తోంది. తొలి విడతగా రూ.12 వేల విలువైన ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కుట్టు మిషన్ల ద్వారా బీసీ మహిళలు ఉపాధి పొందే అవకాశం ఉంది. 100 శాతం సబ్సిడీతో ఇస్తున్న ఈ మిషన్లను సద్వినియోగం చేసుకుంటే టైలరింగ్ చేసి ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది. చాలా మంది మహిళలు సెర్ఫ్, మెప్మా, ఇతర శిక్షణ సంస్థల ద్వారా కుట్టు మిషన్లలో శిక్షణ పొంది జీవనోపాధి పొందుతున్నారు. ఈ ఆటోమేటిక్ మిషన్లతో పనిభారం తగ్గి మహిళలకు మేలు చేకూరనున్నది. అర్హులైన బీసీ మహిళలు సెప్టెంబర్ 15 లోపు http:// tgobmms. cgg. gov. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకొని సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో గ్రామీణులు ఎంపీడీవోకు, పట్టణవాసులు మున్సిపల్ కమిషనర్కు సమర్పించాలి. మండలస్థాయి కమిటీలు.. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు కన్వీనర్లుగా ఉండగా,దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హుల జాబితాను జిల్లాస్థాయి కమిటీకి పంపిస్తారు. జిల్లాస్థాయి కమిటీ ఆమోదం పొందిన అనంతరం బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందజేస్తారు. నియోజకవర్గానికి వెయ్యి కుట్టుమిషన్లు.. ప్రతి నియోజకవర్గానికి వెయ్యి కుట్టు మిషన్లు అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, బోధన్ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో వెయ్యి మంది బీసీ మహిళలను ఎంపిక చేయనున్నారు. అర్హతలు ఇవే.. దరఖాస్తుదారులు బీసీ వర్గానికి చెందిన నిరుద్యోగ మహిళలు అయి ఉండాలి. 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిరాశ్రయులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు, టైలరింగ్ ట్రైనింగ్ సర్టి ఫికెట్ ఉన్నవారికి, మేర/మేరు కమ్యూనిటీ మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. కనీస అక్షరాస్యత తప్పనిసరి. 5వ తరగతి పాసైన వారికి అవకాశం. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు. తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి కుల, ఆదాయ ఽధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం. 2023–24 ఆర్థిక సంవత్సరంలో స్వయం ఉపాధి పథకం కింద ఆర్థిక లబ్ధి పొందిన వారు అర్హులు కారు. ప్రభుత్వం బీసీ మహిళల అభ్యున్నతికి ఉచిత ఆటోమేటిక్ కుట్టుమిషన్లు అందించనుంది. ఇంటింటా ఇందిరమ్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వచ్చే నెల 15 లోపు దరఖాస్తు చేసుకోవాలి. – ఉదయ్భాస్కర్, ఎంపీడీవో, డిచ్పల్లి. -
అమ్మ భాష.. తెలుగు
ఆంగ్ల మాధ్యమానికి ప్రభుత్వ పాఠశాలలు సైతం మొగ్గు చూపుతున్న ప్రస్తుత తరుణంలో ఆయా పాఠశాలల్లో తెలుగుభాషను రక్షించడానికి జిల్లాలోని కొందరు ఉపాధ్యాయులు విశేష కృషి చేస్తున్నారు. పాఠశాలల్లో సృజనాత్మక రచనలను నిర్వహించేలా వివిధ సంస్థలు కార్యశాలలను నిర్వహిస్తున్నాయి. వీటి ద్వారా మండల, జిల్లా స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు రచనల వైపు తీసుకెళ్తున్నారు. బాలసాహిత్య వేదిక.. జిల్లాలో ఈ–కవితా, కథా కార్యశాలలు నిర్వహించడంలో ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదిక ప్రధా న భూమిక పోషిస్తోంది. డాక్టర్ కాసర్ల నరేశ్ రావు, ప్రవీణ్ కుమార్ శర్మ, చింతల శ్రీనివాస్ గుప్తా, స్వర్ణ సమత, శారద, కోకిల నాగరాజు, గంట్యాల ప్రసాద్ తదితరుల నేతృత్వంలో సాహిత్య వేదిక రెండు సంవత్సరాల నుంచి విద్యార్థులకు కవితా రచన, కథా రచనపై కార్యశాలలు నిర్వహిస్తూ వస్తోంది. కార్యశాలలకు పేరొందిన బాల సాహిత్య వేత్తలను తీసుకొచ్చి విద్యార్థులు కథా, కవితా రచనల్లో మెలకువలను నేర్పుతోంది. ఇప్పటి వరకు సిర్పూర్, ఏర్గట్ల, చౌట్పల్లి, గుండారం, నీలా, అంబం, రామకృష్ణ విద్యాలయం తదితర పాఠశాలల్లో విద్యార్థులకు కథా రచన, కవితా రచన మెలకువలను అందించేందుకు కార్యశాలలు నిర్వహించారు. అమ్మ భాష.. తెలుగు నీరసిస్తోంది. తెలుగులోని చక్కని సామెతలు, పద్యాలు, గద్యాలను కోల్పోయి టెస్టు పేపర్లు, గైడ్లపై ఆధారపడటం పెరిగింది. ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని.. నాడు విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ప్రశంసించారు. అమ్మ భాష నుంచే పిల్లల్లో నైతికత, మానవీయత అలవడతాయి. అలాంటి వ్యవహార తెలుగు భాష కోసం మహనీయుడు గిడుగు రామ్మూర్తి తపించారు. నేడు ఆయన జయంతి (తెలుగు భాషా దినోత్సవం) సందర్భంగా తెలుగు భాష ప్రభావాన్ని నిలుపుతున్న వారిపై ప్రత్యేక కథనం.. – నిజామాబాద్ రూరల్ పాఠశాలల్లో తెలుగుకు ప్రాధాన్యమిస్తూ కార్యశాలల నిర్వహణ తెలుగు భాషను కాపాడుతున్న ఉపాధ్యాయులు, సంస్థలు నేడు తెలుగు భాషా దినోత్సవం -
నిజామాబాద్
కుట్టు మిషన్ ఫ్రీ.. బీసీ మహిళల కోసం సర్కారు కొత్త పథకం తీసుకువచ్చింది. వంద శాతం సబ్సిడీతో కుట్టుమిషన్లను అందించనుంది. శనివారం శ్రీ 29 శ్రీ ఆగస్టు శ్రీ 2026– 9లో uరోజురోజుకూ మార్కెట్లోకి కొత్త మోడళ్లు వస్తుండడం, అవసరాలు పెరగడం.. కారణమేదైనా నూతన వాహనాల కొనుగోళ్లు జోరందుకుంటున్నాయి. జిల్లాలోని రోడ్లపైకి నూతన వాహనాలు రయ్మని దూసుకొస్తున్నాయి. అటు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు సైతం పెరిగాయి. రవాణాశాఖ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ లు పెరిగాయి. రిజిస్ట్రేషన్లు, ట్యాక్స్ల ద్వారా రవాణాశాఖకు భారీగా ఆదా యం సమకూరుతోంది. 2025 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జూలై వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 22వేలకు పైగా నూతన వాహ నాలు కొనుగోలు చేశారు.ఎలక్ట్రిక్.. -
వాహనాలు
జిల్లాలో కొత్త వాహనాల కొనుగోళ్ల జోరునిజామాబాద్అర్బన్: కొత్త వాహనాలు జిల్లాలోని రోడ్లపైకి రయ్మని దూసుకొస్తున్నాయి. రోజురోజుకూ వాహనాల రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరుగుతోంది. వివిధ వాహనాల కంపెనీలు మార్కెట్లోకి కొత్త కొత్త మోడల్లను విడుదల చేస్తున్నాయి. 2025 ఏప్రిల్ నుంచి 2026 జూలై వరకు జిల్లా వ్యాప్తంగా 22 వేలకుపైగా వివిధ రకాల వాహనాలు రిజి స్ట్రేషన్ అయ్యాయి. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ రవాణా శాఖ కార్యాలయాల పరిధిలో వాహనాల రిజిస్ట్రేషన్లు జోరుగా సాగుతున్నాయి. ప్రతినెలా స గటున 1600 నుంచి 1700 వరకు వాహనాలు రిజి స్ట్రేషన్లు అవుతున్నాయి. పెరుగుతున్న జనాభా, రోజురోజుకు పెరుగుతున్న అవసరాలు వాహనాల కొనుగోళ్లకు కారణమవుతున్నాయి. ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్న వాహనాల్లో ద్విచక్ర వాహనాలు, కార్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. అటు రవాణాశాఖకు రిజిస్ట్రేషన్లతోపాటు లైఫ్, గ్రీన్ పన్నుతో ఆదాయమూ పెరుగుతోంది. 2023 – 24 సంవత్సరంలో రూ.139 కోట్లు, 2024 – 25లో రూ.145 కోట్లు, 2025 – 26లో రూ.101 కోట్ల ఆదాయం సమకూరింది. కొనుగోళ్లు ఇలా.. జిల్లాలో 2025 ఏప్రిల్ నుంచి 2026 జూలై వరకు ద్విచక్ర వాహనాలు 12780, కార్లు 2783, మోటార్ క్యాబ్లు 210, గూడ్స్ వాహనాలు 740, ట్రాక్టర్లు 1220, కమర్షియల్ ట్రాక్టర్లు 277, మినీ బస్సులు 154, ఆటో రిక్షాలు 1380, త్రి చక్ర రవాహనాలు 320 రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇన్సూరెన్స్ విధానం సాధ్యపడేనా? వాహనలకు ఇన్సూరెన్స్ ఉంటేనే పెట్రోల్, డీజిల్ విక్రయించాలనే నూతన విధానాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో ఈ విధానం అమలు కష్టమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ అనే విధానాన్ని గతంలో తీసుకువచ్చినా అది సాధ్యపడలేదు. ఇప్పుడు ఇన్సూరెన్స్ తప్పనిసరి అనే నిబంధన తీసుకువస్తే ఏ మేరకు సాధ్యమవుందనే చర్చ సాగుతోంది. జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య రోజురోజు కూ పెరుగుతోంది. వివిధ కంపెనీలు తక్కువ బడ్జెట్లో వాహనాలను మార్కెట్లోకి తీసుకురావడం, వాహనాలు తేలికగా ఉండడంతోపాటు పెట్రోల్, డీజిల్ ఇబ్బందులు లేకపోవడంతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు పెరుగుతున్నా యి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కొనుగోళ్లు జోరందుకున్నాయి. 2021 నుంచి ఈవీ వాహనాల విక్రయాలు ప్రారంభం కాగా, కొనుగోళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది జూలై వరకు ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలలో ఆటో లు 120, ద్విచక్ర వాహనాలు 1283, కార్లు 148, త్రి చక్ర వాహనాలు (గూడ్స్) 34 రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు టాక్స్ను రిజిస్ట్రేషన్ ఫీజులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెసులుబాటు కల్పిస్తున్నాయి. ప్రభు త్వ ప్రోత్సాహంతో కొనుగోళ్లు జోరుగాసాగుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న రిజిస్ట్రేషన్ల సంఖ్య ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ రవాణాశాఖకు భారీ సమకూరుతున్న ఆదాయం -
రేడియం స్టిక్కర్లు లేవు హెచ్చరిక బోర్డులు కనిపించవు
సిరికొండ నుంచి చీమన్పల్లి వెళ్లే మార్గంలో ఉన్న అటవీ ప్రాంతంలో మూలమలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. ఎక్కడా హెచ్చరిక బోర్డు లు కనిపించవు. రాత్రి వేళ ప్రయాణించే వాహనదారులను అప్రమత్తం చేసేలా రేడియం స్టిక్కర్లు సైతం లేవు. దీంతో వాహనదారులు ప్రాణా లు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ఈ మార్గం గుండా పందిమడుగు, చీమన్పల్లి, జినిగ్యాల, దుప్యతండా, తాటిపల్లి గ్రామాలతోపాటు పదుల సంఖ్యలో తండాలకు చెందిన ప్రజలు మండల కేంద్రానికి, జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతోపాటు వేములవాడ పుణ్య క్షేత్రానికి ఈ మార్గం చాలా దగ్గరవుతుంది. నిజామాబాద్–1 డిపో బస్సు తాటిపల్లి వరకు, సిరిసిల్ల, వేములవాడ డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులు సిరికొండ వర కు నడుస్తుంటాయి. మండల కేంద్రం నుండి మైసమ్మ గుడి వరకు 5 కిలో మీటర్లకు పైగానే అటవీ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో గతంలో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మూలమలుపులు తెలిసేలా హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లను ఏర్పాటు చేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. – సిరికొండ -
అడ్వాన్స్ బుకింగ్ను సద్వినియోగం చేసుకోవాలి
● రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు ● ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కృష్ణమూర్తి నిజామాబాద్ రూరల్: బస్సు ప్రయాణికులు అడ్వాన్స్ టికెట్ బుకింగ్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఎస్వీజీ కృష్ణమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రయాణికులు ముందస్తుగా రిజర్వేషన్ చే సుకుని టికెట్లను బుక్ చేసుకోవడం ద్వారా తమకు అనుకూలమైన సమయానికి సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకోవడం వల్ల ప్ర యాణ సమయంలో ఇబ్బందులు లేకుండా, ఆల స్యం కాకుండా తమ ప్రయాణాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అడ్వాన్స్ టికెట్లను www. tgsrtcbus.in వెబ్సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చని , రిజర్వేషన్ కౌంటర్లో కూడా టికెట్ బుక్ చేసుకునే సౌకర్యం ఉందని తెలిపారు. అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ద్వారా ప్రయాణికుల రద్దీని అంచనా వేసి అవసరానికి అనుగుణంగా అదనపు బస్సు సర్వీసును నడిపే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. -
ఘనంగా రక్షాబంధన్
సీఎం రేవంత్రెడ్డికి రాఖీ కడుతున్న మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్కు రాఖీ కడుతున్న చెల్లెలు భారతిజిల్లా ప్రజలు రక్షాబంధన్ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించుకున్నారు. సోదరీమణులు శుభ గడియల్లో తమ సోదరులకు రాఖీలు కట్టి ఆశీర్వదించారు. అలాగే పద్మశాలీలు, క్షత్రీయులు యజ్ఞోపవీత ధారణను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి పలు చోట్ల అన్నదానాలుచేశారు. మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత సీఎం రేవంత్రెడ్డికి రాఖీ కట్టారు. అలాగే పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్కు ఆయన సోదరి భారతి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా సాగాయి. – నిజామాబాద్ రూరల్ -
అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ ముఠా అరెస్టు
● నకిలీ నోట్లు స్వాధీనం ● ఇతర రాష్ట్రాల్లో సంబంధాలపై కొనసాగుతున్న విచారణ బాన్సువాడ రూరల్: నకిలీ కరెన్సీ కొనుగోలు చేసి చెలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును బాన్సువాడ పోలీసులు రట్టు చేశారు. జిల్లా ఎస్పీ రాజేశ్చంద్ర ఆదేశాలతో చేపట్టిన ప్రత్యేక దర్యాప్తులో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించా రు. శుక్రవారం బాన్సువాడ కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ విఠల్రెడ్డి, రూరల్ సీఐ తిరుపయ్య కేసు వివరాలు వెల్లడించా రు. మహారాష్ట్రలోని పర్బని జిల్లాకు చెందిన రావుసాహెబ్ అనే యువకుడు తనకు పరిచయమైన ఓవ్యక్తి ద్వారా హైదరాబాద్లోని ముదస్సర్ హుస్సే న్ అలియాస్ షాబాబా వద్ద నకిలీ కరెన్సీ దొరుకు తుందని తెలుసుకున్నాడు. తన మిత్రులు ప్రతీక్, భీమ్ శంకర్ రామ్లతో కలిసి వెళ్లి షాబాబా వద్ద రూ.లక్ష అసలు కరెన్సీ ఇచ్చి రూ.2 లక్షల నకిలీ కరె న్సీ తీసుకున్నారు. ఈ నెల 26 న స్వస్థలానికి వెళ్తూ పిట్లం హైవే సమీపంలోని పెట్రోల్ బంకులో రూ.2 వేల పెట్రోల్ పోయించుకొని రూ.500 నకిలీ నోట్లు నాలుగు ఇచ్చారు. అవి నకిలీ నోట్లుగా బంక్ క్యాషియర్ గుర్తించి కారును ఆపే ప్రయత్నం చేయగా ఆ పకుండా వెళ్లిపోయా రు. దీంతో క్యాషియర్ శ్రీకాంత్రెడ్డి ఈ నెల 27న పిట్లం పీఎస్లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. కాగా, మిగిలిన నకిలీ కరెన్సీ నోట్ల ను చెలామణి చేయడానికి ముగ్గురు నిందితులు కారులో హైదరాబాద్ బయలుదేరగా ధర్మారం టోల్ప్లాజా వద్ద పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.500 విలువైన 182 నకిలీ నోట్లు, మొత్తం రూ.91 వేలు, మూడు సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీ సరఫరా చేసిన ఇతర వ్యక్తుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని డీఎస్పీ విఠల్రెడ్డి తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోని సంబంధాలపై కూడా విచారణ జరుగుతోందన్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పిట్లం ఎ స్సై ఆంజనేయులు, బాన్సువాడ రూరల్ సీఐ తిరు పయ్య, పోలీస్ సిబ్బంది శైలేశ్, రాము, వెంకటేశ్ల ను ఎస్పీ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు. -
‘ప్రశస్త్’కు ‘ప్రైవేట్’లో అడ్డంకులు
ఆర్మూర్ : ప్రారంభ దశలోనే విద్యార్థుల్లో దివ్యాంగ లక్షణాలను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘ప్రశస్త్’ యాప్ అమలుకు ప్రైవేట్ పాఠశాలల్లో లొసుగులు అడ్డుగా మారుతున్నాయి. జిల్లాలోని 1,844 ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో 15,642 మంది ఉపాధ్యాయులకు అవగాహన కల్పించాలని జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లాలోని 640 ప్రైవేట్ పాఠశాలల్లో 10,095 మంది ఉపాధ్యాయులు పని చేస్తుండగా, వైకల్య నిర్ధారణ చేయడంపై అవగాహన కల్పించేందుకు వీడియోలు పంపించారు. అయితే శుక్రవారం నాటికి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కలిపి 12,801 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 11,414 మంది వీడియోలు చూశారు. 72.97 శాతం లక్ష్యం మాత్రమే పూర్తయింది. ఈ నెలాఖరులోగా వంద శాతం పూర్తి చేయాలని లక్ష్యం ఉన్నా, ప్రైవేట్ పాఠశాలల తీరుతో పరిస్థితి మెరుగుపడడం లేదు. క్షేత్రస్థాయిలో వెళ్తే.. ప్రశస్త్ వీడియోలపై అవగాహన కల్పించేందుకు స్పెషల్ టీచర్లు, ఐఈఆర్పీలు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తే తలలు పట్టుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాలలో పనిచేసే క్వాలిఫైడ్ ఉపాధ్యాయుల వివరాలు యూడైస్ ప్లస్లో నమోదు చేయాలి. విద్యాశాఖ వద్ద ఉండేది ఈ వివరాలు మాత్రమే. క్షేత్ర స్థాయికి వెళ్తున్న స్పెష ల్ టీచర్లు, ఐఈఆర్పీలకు విద్యా శాఖ నుంచి ఈ ఉపాధ్యాయుల సంఖ్య, సమాచారాన్ని మాత్రమే విద్యా శాఖ ఉన్నతాధికారులు ఇస్తున్నారు. అయితే ఆ వివరాలను తీసుకొని ప్రైవేట్ పాఠశాలకు వెళ్లిన వారు అయోమయానికి గురవుతున్నారు. యూడైస్ ప్లస్లో నమోదైన ఉపాధ్యా యులు చాలా వరకు క్షేత్ర స్థాయిలో పని చేయడం లేదు. నిబంధన ప్రకారం యూడైస్ ప్లస్లో నమోదైన ఉపాధ్యాయులు మాత్రమే తమ ఐడీలతోనే రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రశస్త్ వీడియోలు చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం పని చేస్తున్న టీచర్లు వీడియోలు చూసినా, యాప్లో అప్డేట్ కాకపోవడంతో జిల్లాలో అవగాహన శాతం పెరగడం లేదు. ఇదే పరిస్థితి చాలా ప్రైవేట్ పాఠశాలల్లో ఉందని స్పెషల్ టీచర్లు చెబుతున్నారు. వీడియోల ద్వారా ఉపాధ్యాయులకు అవగాహన కల్పించే కార్యక్రమం ఈ నెలాఖరులోగా వంద శాతం పూర్తి చేసి సెప్టెంబర్ 1 నుంచి ప్రతి ఉపాధ్యాయుడు తమ పాఠశాలలో మొదటి పిల్లల ప్రవ ర్తన, శారీరక లక్షణాలను గమనించి యాప్లో నమోదు చేయాల్సి ఉండగా, ప్రైవేట్లో ఈ లొసుగులు ఇబ్బందిగా మారాయి. ఇదే విషయమై ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను సంప్రదించగా తమ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుల వివరాలు ఎప్పటికప్పుడు యూడైస్ ప్లస్లో నమోదు చేస్తున్నప్పటికీ అది అప్డేట్ కావడం లేదని పేర్కొంటున్నారు. సమస్యను పరిష్కరించకుండా వంద శాతం లక్ష్యం నెరవేర్చడం కింది స్థాయి సిబ్బందికి కష్టంగా మారుతోంది. ఒక ప్రైవేట్ పాఠశాలను పరిశీలిస్తే.. యూడైస్ ప్లస్ ఆధారంగా జిల్లా విద్యాశాఖ నుంచి ఇచ్చిన సమాచారం ప్రకారం జిల్లాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్లు 10 మంది ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పాఠశాలలో సుమారు 40 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరిలో చాలా మందికి విద్యా బోధనకు సరిపడా క్వాలిఫికేషన్ కూడా లేదని తెలుస్తోంది. యూడైస్ ప్లస్లో నమోదైన 10 మంది ఉపాధ్యాయుల్లో చాలా వరకు ప్రస్తుతం ఆ పాఠశాలలో లేకపోవడం సమస్యగా మారింది. స్పష్టమైన ఆదేశాలు ఇస్తాం ప్రైవేట్ పాఠశాలల్లో యూడైస్ ప్లస్ లో నమోదైన ఉపాధ్యాయులు లేక పోవడం మా దృష్టికి వచ్చింది. ప్రశ స్త్ రిజిస్ట్రేషన్ యూడైస్ ప్లస్లో న మోదైన డేటా ఆధారంగానే జరుగుతుంది కాబట్టి ఆ ఉపాధ్యాయులు తప్పనిసరిగా వీడియోలు చూడాలి. ఈ సమస్యను డీఈవో దృష్టికి తీసుకెళ్లి, ప్రైవేట్ పాఠశాలలకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తాం. నెలాఖరులోగా వంద శాతం పూర్తి చేయడమే లక్ష్యం. – వడకంటి శ్రీనివాసరావు, సెక్టోరల్ ఆఫీసర్, సమగ్ర శిక్ష, నిజామాబాద్యూడైస్ ప్లస్.. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల్లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు సమగ్ర సమాచారాన్ని సేకరించడానికి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ రూపొందించిన ఆన్లైన్ డేటా బేస్ పోర్టల్ను యూడైస్ ప్లస్ అంటారు. ఇందులో పాఠశాల ప్రొఫైల్, వసతులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అందుకు గుర్తింపు పొందిన పాఠశాలలకు 11 అంకెల యూడైస్ కోడ్ను కేటాయిస్తారు. యూడైస్ ప్లస్లో ఉపాధ్యాయుల సమాచారానికి.. క్షేత్ర స్థాయిలో సమాచారంలో తేడాలు క్వాలిఫైడ్ టీచర్లు 10 మంది.. పని చేస్తున్నది 40 మంది బయటపడుతున్న లొసుగులు -
జీవించు నూరేళ్లు.. వర్ధిల్లు వెయ్యేళ్లు!
● సోదర భావానికి ప్రతీక రాఖీ పండుగ ● నేడు రక్షాబంధన్ నిజామాబాద్ రూరల్: అన్నాచెళ్లెల్లు, అక్కాతమ్ముళ్ల మధ్య అనుబంధానికి ప్రతీక జరుపుకొనే పండుగ రక్షాబంధన్. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సోదరులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ సోదరీలు రాఖీ కడతారు. మరోవైపు రాఖీ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమిగా పాటిస్తూ ఉపనయనం పొందిన వారు పాత యజ్ఞోపవీతాన్ని (జంధ్యాన్ని) తీసివేసి, గాయత్రీ దేవిని ఆరాధించి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. సందడిగా నగరం రాఖీ పౌర్ణమి నేపథ్యంలో నగరంలో సందడి నెలకొంది. రాఖీలు కొనేందుకు వచ్చిన మహిళలు, పిల్లలతో నగరంలోని కుమార్ గల్లీ, పెద్ద బజార్, పూసలగల్లి, కంఠేశ్వర్ తదితర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. రాఖీలకు గిరాకీ బాగానే ఉంది. మహిళలు ప్రధానంగా వెండి రాఖీలు కొనుగో లు చేసేందుకు ముందుకొస్తున్నారు. రూ.వెయ్యి నుంచి వెండి రాఖీలు అందుబాటులో ఉన్నాయి. – రాము, విక్రేత అన్నాచెల్లెళ్ల ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ. ప్రతి సంవత్సరం నేను మా అన్న, త మ్ముడికి రాఖీ కడతా. వాళ్లు సుఖసంతోషాలతో ఉండాలని ఆశీర్వదిస్తా. – లత, నగరవాసి -
అమ్మా బైబై..
● చిన్నారిని చిదిమేసిన లారీ ● తండ్రితో స్కూల్కు వెళ్తుండగా ప్రమాదం బాన్సువాడ రూరల్ : తండ్రి ద్విచక్రవాహనంపై స్కూల్కు వెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో చిన్నారి దుర్మరణం చెందిన ఘటన బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తాలో చోటుచేసుకుంది. బాన్సువాడ పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని వాసవి కాలనీకి చెందిన మహ్మద్ రఫీ వెల్డింగ్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. రఫీకి కుమారులు అర్హాన్, అయాన్, కూతురు జైనబ్ ఫాతిమా(4) ఉన్నారు. వీరంతా స్థానిక హీరా మాడల్ స్కూల్లో చదువుకుంటున్నారు. రోజూ మాదిరిగినే గురువారం ఉదయం 9 గంటలకు తన ముగ్గు రు పిల్లలను స్కూల్లో వదిలేందుకు మహ్మద్ రఫీ ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. తాడ్కోల్ చౌరస్తాలో సిగ్నల్ పడటంతో ఆగిన రఫీ ద్విచక్రవాహనాన్ని వెనుకనుంచి అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో అందరూ రోడ్డు పై పడ్డారు. లారీ డ్రైవర్ తొందరపాటుతో లారీ చక్రం జైనబ్ ఫాతిమా తలపై నుంచి వెళ్లడంతో అక్కడిక్కకడే మృతి చెందింది. గాయపడిన అర్హాన్, అయాన్తోపాటు తండ్రి మహ్మద్ రఫీని స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పాఠశాలకు చేరాల్సిన చిన్నారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లి రోదించిన తీరు అందరినీ కలిచివేసింది. కాగా, జైనబ్ ఫాతిమా ఎల్కేజీ చదువుతోంది. ప్రమాదానికి కారణమైన మహారాష్ట్ర లారీ, డ్రైవర్ షేక్ మహ్మద్లను అదుపులో తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తుల శ్రీధర్ తెలిపారు. విషయం తెలుసుకున్న ఆగ్రోస్ మాజీ చైర్మన్ కాసుల బాలరాజ్, మున్సిపల్ వైస్ చైర్మన్ రేష్మా ఎజాస్, కౌన్సిలర్లు ఖాలేఖ్, హకీం, మఖ్బూల్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. చిన్నారి మృతితో తాడ్కోల్ చౌరస్తాలో ట్రాఫిక్ జామ్ కావడంతో సీఐ తుల శ్రీధర్ చేరుకొని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న ఆక్రమణలను అధికారులు తొలగించారు. ‘అమ్మా.. బాయ్’ అంటూ తండ్రి బైక్పై ఉత్సాహంగా స్కూల్కు వెళ్తున్న చిన్నారిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. అప్పటి వరకు చిట్టిచిట్టి మాటలతో బైక్పై ఉన్న కూతురు కళ్లెదుటే లారీ చక్రం కింద నలిగిపోయింది. బాన్సువాడ పట్టణంలో గురువారం ఉదయం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం అందరినీ కలిచివేసింది. -
బెల్టు షాపులు నిర్వహించొద్దు
● రెంజల్ జీపీ తీర్మానం రెంజల్: రెంజల్ మండల కేంద్రంలో బెల్టు షాపులను నిర్వహించొద్దని గ్రామసభలో తీర్మానించారు. సర్పంచ్ తిరుపతి లలిత అధ్యక్షతన గురువారం పంచాయతీ పాలకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు గ్రామంలో సుమారు 20 వరకు బెల్టు షాపులు నిర్వహించడంతో రోడ్లపై రాకపోకలకు మహిళలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఎకై ్సజ్ పోలీసులు బెల్టు షాపులను మూసివేయించాలని తీర్మానించారు. కార్యక్రమంలో పాలకవర్గసభ్యులతోపాటు పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ముగిసిన పీజీ సెమిస్టర్ పరీక్షలు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న పీజీ 2, ఐఎంబీఏ 8వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు గురువారం ముగిసినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. చివరి రోజు పరీక్షలకు 605 మంది విద్యార్థులకు గానూ 555 మంది హాజరుకాగా 50 మంది గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. ● 13 మందికి తీవ్రగాయాలు కమ్మర్పల్లి(మోర్తాడ్): మోర్తాడ్ మండల కేంద్రంలో గురువారం పిచ్చికుక్క స్వైరవిహారం చేయడంతో పలువురు గాయాల బారిన పడ్డారు. వీధుల్లో తిరుగుతూ కనిపించిన వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. 13 మందిని కరిచి తీవ్ర గాయాలపాలు చేసింది. ఎనిమిదేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిగతా క్షతగాత్రులను స్థానిక సీహెచ్సీకి తరలించి చికిత్స అందించారు. మోర్తాడ్లో కుక్కల బెడద రోజురోజుకూ తీవ్రమవుతుండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ● అంత్యక్రియలకు హాజరైన జడ్జీలు, న్యాయవాదులు నిజామాబాద్ లీగల్ : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి అలిశెట్టి లక్ష్మీనారాయణ తండ్రి గంగాధర్ అనారోగ్య కారణాలతో బుధవారం రాత్రి మరణించారు. ఆయన భౌతికకాయానికి గురువారం నిజామాబాద్ నగరంలో అంత్యక్రియలు నిర్వహించారు. మెండోరా మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు గంగాధర్ నగరంలోని బైపాస్ రోడ్ సమీపంలో ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. మరణవార్త తెలుసుకున్న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తుకారాంజీ, జస్టిస్ పుల్ల కార్తీక్, జస్టిస్ రామకృష్ణారెడ్డి, జస్టిస్ గౌస్ మీర్ మోహినొద్దీన్లు.. గంగాధర్ భౌతికకాయానికి నివాళులర్పించారు. జస్టిస్ లక్ష్మీనారాయణను ఓదార్చారు. అంత్యక్రియల్లో జిల్లా ఇన్చార్జి జడ్జి హరీష, జూనియర్ సివిల్ జడ్జి హరికుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలకంఠ రావు, సీనియర్ న్యాయవాదులు టక్కర్ హన్మంత్ రెడ్డి, కుమార్ దాస్, బండారి కృష్ణానంద్, మల్లెపూల జగన్మోహన్ గౌడ్, పడిగెల వెంకటేశ్వర్లు, అదనపు పబ్లి క్ ప్రాసిక్యూటర్ నరసింహా రెడ్డి, ఆర్మూర్ బార్ అసోసియేషన్ సభ్యులు లోక్ భూపతి రెడ్డి, మురళి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
సానుకూల నిర్ణయం తీసుకోవాలి
నిజామాబాద్ అర్బన్ : ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ఉ ద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్కుమార్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ధ ర్నా చౌక్లో ఉద్యోగులు గురువారం మహాధ ర్నా నిర్వహించారు. వివిధ శాఖలకు చెందిన ఉ ద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. రెండో పే రి విజన్ కమిటీ నివేదిక అమలు చేయాలని, ఆరు పెండింగ్ డీఏలు విడుదల చేయాలన్నారు. సీపీఎస్ను రద్దుచేసి ఓపీఎస్ను ప్రవేశపెట్టాలన్నా రు. ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసి ఉద్యోగులు, పెన్షనర్లతోపా టు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలందించాలని కోరారు. గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రెండో పే రివిజన్ కమిటీ నివేదికను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండచేశారు. ఉద్యోగులకు తగిన వేతన సవరణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, గత పీఆర్సీ గడువు ముగిసిన మూడేళ్లవుతున్నందున రెండో పీఆర్సీ నివేదికను తక్షణమే అమలు చేయడంతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలన్నారు.తరలివచ్చిన ఉద్యోగులు ఎన్టీఆర్ చౌరస్తాలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనకు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్య లో తరలివచ్చారు. జిల్లా పరిషత్ ఉద్యోగు లు ర్యాలీగా రాగా, ఆయా ఉపాధ్యాయ సంఘాల వారు ప్ల కార్డ్స్ ప్రదర్శిస్తూ నిరస న తెలుపుతూ వచ్చారు. ఒక్కో శాఖకు చెందిన ఉద్యోగులు ఒక్కో విధంగా నిరసన తె లిపారు. టీఎన్జీవోస్ నాయకుడు శేఖర్, రెవె న్యూ అసోసియేషన్ కార్యదర్శి పి శ్రీనివాసరావు, టీఎన్జీవోస్ అసోసియేట్ అధ్యక్షుడు పెద్దోళ్ల నాగరాజు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్రెడ్డి, కార్యదర్శి కిషన్, మాజీ కార్యదర్శి వెంకటేశ్వర్గౌడ్, యూటీఎఫ్ రా ష్ట్ర కార్యదర్శి సత్యానంద్, విజయలక్ష్మి, ర వీందర్సాగర్, సౌమ్య వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు. సీపీఎస్ను రద్దు చేసి ప్రభుత్వం ఓపీఎస్ తీసుకురావాలి ఆరోగ్య పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి వేతన సవరణ ప్రభుత్వ బాధ్యత ఉద్యోగుల జేఏసీ చైర్మన్ నాశెట్టి సుమన్ ధర్నా చౌక్లో ఉద్యోగుల నిరసన -
ఎస్ఎన్ఏ–స్పర్శతో పరేషాన్
నిజామాబాద్● స్కూళ్లకు మొదటి విడుత స్కూల్ గ్రాంట్ విడుదల ● నూతన డిజిటల్ విధానంపై హెచ్ఎంల అసంతృప్తి అమ్మా బైబై.. తండ్రి ద్విచక్రవాహనంపై స్కూల్కు వెళ్తుండ గా వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో బాన్సువాడలో చిన్నారి దుర్మరణం పాలైంది. శుక్రవారం శ్రీ 28 శ్రీ ఆగస్టు శ్రీ 2026– 9లో uజిల్లా ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు నిజామాబాద్ అర్బన్ : సోదరసోదరీమణుల ప్రేమకు ప్రతీక అయిన రక్షాబంధన్ (రాఖీ పండుగ) పర్వదినాన్ని పురస్కరించుకుని జి ల్లా ప్రజలకు ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్రెడ్డి, కలెక్టర్ భవేశ్ మిశ్రా శుభాకాంక్షలు తెలిపారు. ‘రాఖీ’ కుటుంబ బంధాలను బ లోపేతం చేసే వారధి అని పేర్కొన్నారు. మ హిళలకు భద్రత, గౌరవం ఎంతో ముఖ్యమ నే సందేశాన్ని ఈ పండుగ అందిస్తుందని పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమి వేడుకలు ప్రజల మధ్య ఆత్మీయతను మరింత పెంపొందించాలని వారు ఆకాంక్షించారు. సీపీకి రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు.. రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా బ్రహ్మకుమారీలు పోలీస్ కమిషనర్ సాయిచైతన్యకు గురువారం రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. బ్రహ్మకుమారీలు వనజ, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు.. నిజామాబాద్ రూరల్: రాఖీ పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు అవసరమైన చోట్ల అదనపు బస్సులను నడుపుతున్నామని ఆర్టీసీ రీజినల్ మేనేజజర్ కృష్ణమూర్తి అన్నారు. రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తూ టీజీఎస్ఆర్టీసీ అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారన్నారు. నీట్ పీజీ ఎంట్రెన్స్కు బందోబస్తు నిజామాబాద్ అర్బన్: ఈ నెల 30వ తేదీన నీట్ పీజీ ఎంట్రెన్స్ పరీక్ష నేపథ్యంలో పరీక్షకేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సీపీ సాయిచైతన్య గురువా రం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని అర్సపల్లిలో ఉన్న ఏవీ ఎంటర్ర్పైజెస్, మల్లారంలోని ఆయేషా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రెండు సెంటర్లలో పరీక్ష కొనసాగుతుందని పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష కొనసాగనుందని, ఆయా సెంటర్ల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లతోపాటు స్టేషనరీ దుకాణాలను ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసి ఉంచాలని సూచించారు. సెంటర్ల పరిసరాల్లో సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ (సెక్షన్ 144 సీఆర్పీసీ) అమలులో ఉంటుందని తెలిపారు. ‘అంకితభావంతో పనిచేయాలి’ బాన్సువాడ రూరల్: ఐసీటీసీ, ఏఆర్టీ సెంటర్ల ఉద్యోగులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొ సైటీ బేసిక్ సర్వీస్ డివిజన్ జాయింట్ డైరెక్టర్ జయలక్ష్మి సూచించారు. గురువారం ఆమె బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసీటీసీ, ఏఆర్టీ సెంటర్లను తనిఖీ చేసి పలు సూచనలు ఇచ్చారు. ఆమె వెంట కా మారెడ్డి డీపీఎం చల్లా సుధాకర్ ఉన్నారు.ఖలీల్వాడి : ప్రభుత్వ పాఠశాలలకు సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా విడుదలయ్యే కాంపోజిట్ స్కూల్ గ్రాంట్లపై ప్రధోపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. నిధుల వినియోగంలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం ఎస్ఎన్ఏ (సింగిల్ నోడల్ ఏజెన్సీ) – స్పర్శ డిజిటల్ విధానాన్ని తీసుకువచ్చింది. ఈ విధానం కారణంగా హెడ్మాస్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ స్కూళ్లకు వచ్చే నిధులే తక్కువ, అందులో స్కూళ్లకు చేసే పనులకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పాఠశాలలకు అత్యవసర పనులకు ఖర్చు చేసే నిధులను ఈ విధానంలో చూపెట్టలేమని, ముందుగా ఖర్చు చేసే పనులకు సంబంధించి నిధుల హామీ వెండర్లు ఇవ్వడం కష్టసాధ్యమని అంటున్నారు. స్పర్శ అమలు విధానం సర్కారు బడులకు సమగ్రశిక్ష ద్వారా స్కూల్ గ్రాంట్లు, మెయింటెనెన్స్ గ్రాంట్ల బిల్లుల సమర్పణ, నిధుల వినియోగం, చెల్లింపుల ప్రక్రియను డిజిటల్ విధానం ద్వారా చేయాల్సి ఉంటుంది. పాఠశాలకు వచ్చిన గ్రాంట్లను స్కూల్కు కావాల్సిన చాక్పీస్లు, స్టేషనరీ, పరీక్షల నిర్వహణ, సామగ్రి, చిన్నపాటి మరమ్మతులు, విద్యుత్ బిల్లులతోపాటు పరిశుభ్రత నిర్వహణకు ఖర్చు చేస్తారు. ఈ నిధులు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబంధించిన నిధులు స్కూల్ కాంప్లెక్స్ డీడీవో ఖాతాల ద్వారా జమ చేస్తారు. అయితే గతంలో కాకుండా ఖర్చుచేయడానికి జీఎస్టీ బిల్లు పెట్టినప్పుడే లబ్ధిదారునికి లేదా వెండర్కు నిధులు బదిలీ అవుతాయి. దీంతో పాఠశాల ఖాతాలో డబ్బు జమ కావు. దానికి బదులుగా ఐఎఫ్ఎంఐఎస్ పద్ధతి ద్వారా పాఠశాల విద్యార్థుల సంఖ్య ఆధారంగా కొంత డ్రాయింగ్ అమౌంట్ కేటాయించబడుతుంది. స్కూల్ నిర్వహణకు అవసరమైన నిధులను ఎస్ఎంసీ తీర్మానం మేరకు వెండర్ ఖాతాలో జమ చేసే ముందు ఆ వివరాలను స్పర్శ పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే వెండర్ నుంచి జీఎస్టీ బిల్ తీసుకొని సంబంధిత కాంప్లెక్స్ హెడ్మాస్టర్కు సమర్పిస్తే మార్కర్ ఐడీ ద్వారా బిల్లు క్రియేట్ చేసి చెక్కర్ ఐడీ ద్వారా వెండర్ ఖాతాలోకి జమ చేస్తారు. హెడ్మాస్టర్ క్యాష్బుక్, ఓచర్లు సమకూర్చడం వాటి పత్రాల నిర్వహణ చేయాలి. వ్యక్తిగత ఖాతాలోకి మళ్లించడం కుదరదు. అన్ని బిల్లలులను అధికారిక పోర్టర్ల ద్వారా వెండర్ ద్వారా డిజిటల్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత హెడ్మాస్టర్లు ఇబ్బందులు ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు వచ్చే స్కూల్ గ్రాంట్లు చాలా తక్కువగా ఉంటాయి. వీటికి విద్యార్థుల సంఖ్య ఆధారంగా సుమారు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు వస్తుంది. ఈ గ్రాంటు ఆగస్టు నెలలో మొదటి విడత వచ్చింది. జూన్ నుంచి ఆగస్ట్ వరకు పాఠశాలల నిర్వహణకు ఖర్చు చేసిన చిన్న, చిన్న ఖర్చులను ప్రధానోపాధ్యాయులు సొంత నిధులతో ఖర్చు చేశారు. కానీ వచ్చిన గ్రాంటు నుంచి హెచ్ఎంలు ఖర్చు చేసిన డబ్బులు తీసుకునే వెసలుబాటు లేదు. ఖర్చు చేసిన నిధులకు జీఎస్టీ బిల్లులు మార్కెట్లో వ్యాపారులు ఇవ్వడం లేదు. స్కూల్కు చేసే ఖర్చు చేసే ప్రతి పనికి కాంప్లెక్స్ ప్రధానాపాధ్యాయుడిని సంప్రదించాలి. అలాగే వెండర్ను వెతకాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో హెడ్మాస్టర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. స్కూల్ గ్రాంట్ వినియోగంలో నూతన స్పర్శ విధానాన్ని అమలు చేయడం తగదు. స్కూళ్లకు రోజువారి అవసరాలు, అత్యవసర మరమ్మతులు, పాఠశాల నిర్వహణకు సంబంధించిన చిన్న చిన్న ఖర్చులను సకాలంలో చెల్లించడంలో ప్రధానోపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విధానాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. పాత విధానాన్ని అమలు చేయాలి. – అంకం నరేశ్, పీఆర్టీయూ ఆసోసియేట్ అధ్యక్షుడు, నిజామాబాద్సుభాష్నగర్ : అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయి సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ జరగని వారికి, వివిధ కారణాలతో తాజా జాబితాలో పేర్లు రాని ఓటర్లకు హియరింగ్కు రావాలని కోరుతూ బీఎల్వోలు ఇంటింటికి తిరుగుతూ నోటీసులు జారీ చేస్తున్న ప్రక్రియను కలెక్టర్ భవేశ్ మిశ్రా గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరంలోని 19వ డివిజన్ పరిధిలో ఉన్న కంఠేశ్వర్లో సిబ్బంది ఇంటింటికి తిరిగి నోటీసులు అందిస్తున్న విధానాన్ని ఆయన నిశితంగా పరిశీలించారు. ఎంతో ప్రాధాన్యతతో కూడిన ఎస్ఐఆర్ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ధ్రువీకరణ అవసరమున్న ఓటర్ల ఇంటింటికి స్వయంగా వెళ్లి నోటీసులు అందించాలని, సూచించిన సమయానికి ఒకవేళ వారు రాలేకపోతే మరోమారు నోటీసు ఇవ్వాలని సూచించారు. నోటీసు అందించే సమయంలోనే ఎవరైనా ఓటర్లు ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే వాటిని స్వీకరించాలని బీఎల్వోలకు కలెక్టర్ సూచించారు. నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, బీఎల్వో సూపరింటెండెంట్ మురళి, బీఎల్వో లావణ్య తదితరులు ఉన్నారు.నిజామాబాద్ నగరంలో నోటీసులు అందజేసే ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్ భవేశ్ మిశ్రానిజామాబాద్ అర్బన్ : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా ఓటరు ముసాయిదా జాబితాలో తప్పులను గుర్తించి సంబంధిత ఓటర్లకు అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 4,32,405 మందికి నోటీసులు జారీ చేయాల్సి ఉండగా.. 4,32,401 మందికి అందజేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో 63,170, బోధన్ నియోజక వర్గంలో 61,262 మందికి, బాన్సువాడ నియోజక వర్గంలో 52,919 మందికి, నిజామాబాద్ అర్బన్లో 1,09,639 మందికి, రూరల్లో 80,026 మందికి. బాల్కొండ నియోజకవర్గంలో 65,380 మందికి నోటీసులు జారీ చేశారు. సాంఘిక బహిష్కరణ ఘటనలపై కఠినంగా వ్యవహరించాలి ప్రతి నెలా సివిల్ రైట్స్ డేను పక్కాగా నిర్వహించాలి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ భవేశ్ మిశ్రా అట్రాసిటీ కేసుల పురోగతిపై సమీక్ష -
బాధితులకు న్యాయం జరగాలి
నిజామాబాద్ అర్బన్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా కృషి చేయాలని అధికారులకు కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. కలెక్టర్ అధ్యక్షతన గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్న్స్ అండ్ మానిటరింగ్ జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అట్రాసిటీ కేసుల పురోగతిపై నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్ల వారీగా కలెక్టర్ సమీక్షించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, తీసుకున్న చర్యల వివరాలు తెలుసుకున్నారు. పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. అట్రాసిటీ కేసుల్లో బాధితులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం, ఇతర సహాయ సహకారాల విషయంలో ఎలాంటి జాప్యం జరుగకుండా చూడాలన్నారు. కేసుల సత్వర పరిష్కారం కోసం రెవెన్యూ, తదితర శాఖల కార్యాలయాల ద్వారా ఎప్పటికప్పుడు అవసరమైన నివేదికలను, లేఖలను అందజేయాలని సూచించారు. కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా చూడాలన్నారు. ప్రతి నెలా ‘సివిల్ రైట్స్ డే’ను పక్కాగా నిర్వహించాలని, దళిత, గిరిజన వర్గాల ప్రజల హక్కులపై వారికి అవగాహన కల్పించడంతోపాటు వారి సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు జీవనాధారం కోసం ప్రభుత్వం అందజేసిన అసైన్డ్ భూములను ఎవరైనా కబ్జా చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని, బాధితులకు భూభారతి చట్టం ద్వారా న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. గ్రామాల్లో సాంఘిక బహిష్కరణలు వంటి ఘటనలు జరిగినప్పుడు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను తప్పకుండా అమలయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ శుభం నగ్రాలే, జిల్లా రెవెన్యూ అధికారిణి గీత, జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి అధికారిణి రజిత, నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ఏసీపీలు ప్రకాశ్, శ్రీనివాస్, వెంకటేశ్వర్రెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ భాస్కర్తోపాటు సంబంధిత శాఖల అధికారులు, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
గుప్పుమన్న గంజాయి
వేల్పూర్(బాల్కొండ): గంజాయి సేవిస్తున్న 31 మందితోపాటు విక్రయిస్తున్న ఐదుగురిని జిల్లాలోని వేర్వేరు చోట్ల పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. బాల్కొండ మండలం వన్నెల్ (బి) గ్రామ శివారులోని శ్రీరాంసాగర్ వరదకాలువపై గంజాయి సేవిస్తున్నారనే సమాచారం మేరకు ఎస్సై శైలేందర్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. గంజాయి సేవిస్తున్న 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. విక్రేతను పట్టుకుని విచారించారు. పట్టుబడిన వ్యక్తి నుంచి 40 గ్రాముల ఎండు గంజాయి, చిన్నచిన్న జిప్లాక్ కవర్లు, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ అందిన సమాచారం మేరకు మల్లన్నగుట్ట వద్దకు చేరుకున్న పోలీసులు.. అక్కడ గంజాయి సేవిస్తున్న 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 31 మందిని డీ అడిక్షన్ సెంటర్కు తరలించనున్నామని ఎస్సై తెలిపారు. అలాగే గంజాయి విక్రేతను రిమాండ్కు తరలించామన్నారు. రెండు ఘటనలకు సంబంధించి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆర్మూర్లో నలుగురి అరెస్టు ఆర్మూర్టౌన్: పట్టణ శివారులో గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులను బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ తెలిపారు. నలుగురు యువకులు జర్నలిస్టు కాలనీకి చెందిన సమీర్ అనే వ్యక్తి నుంచి గంజాయికి కొనుగోలు చేసి చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలోకి మార్చి యువతకు అమ్ముతు సొమ్మ చేసుకుంటున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. అలాగే వచ్చిన సొమ్ముతో గంజాయి వినియోగిస్తూ మత్తుకు బానిసైనట్లు తెలిపారు. పట్టుబడిన వారిలో నుంచి ఇద్దరు గతంలో గంజాయి కేసులో పట్టుబడి జైలుకు వెళ్లివచ్చారని తెలిపారు. 70 గ్రాముల గంజాయి, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు ఎస్హెచ్వో తెలిపారు. సేవించిన 31 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు శ్రీరాంసాగర్ వరద కాలువపై 18 మంది.. మల్లన్నగుట్ట వద్ద 13 మంది విక్రేత అరెస్ట్.. రిమాండ్ -
ఆపరేషన్ చేస్తుండగా మహిళ మృతి
● ప్రయివేట్ ఆస్పత్రిలో ఘటన ● వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆందోళన కామారెడ్డి టౌన్: గర్భసంచి తొలగింపు ఆపరేషన్ జరుగుతుండగా మహిళ మృతి చెందిన ఘటన కామారెడ్డిలో కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని జీవధాన్ ఆస్పత్రిలో బుధవారం చోటుచేసుకోగా, వైద్యుల నిర్లక్ష్యమే మహిళ మృతికి కారణమని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. బాధితుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. లింగంపేట మండల కేంద్రానికి చెందిన పరిష రాజేశ్వరి అలియాస్ లాస్య (42)కు భర్త నరేందర్, తొమ్మిదేళ్ల కుమార్తె శ్రీవల్లి, ఐదేళ్ల కుమారుడు వైభవ్ ఉన్నారు. కొద్దిరోజులుగా ఆమె అనారోగ్యానికి గురికావడంతో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. వైద్యుల సూచన మేరకు గర్భసంచి తొలగించే ఆపరేషన్ చేయించుకోవడానికి కామారెడ్డిలోని జీవధాన్ ఆస్పత్రిలో రాజేశ్వరి మంగళవారం తన భర్త, అత్త, తల్లితో కలిసి వచ్చి అడ్మిట్ అయ్యారు. బుధవారం మధ్యాహ్నం ఆపరేషన్ థియేటర్కు తీసుకువెళ్లిన వైద్యులు, సిబ్బంది కొద్దిసేపటికే రాజేశ్వరి మృతిచెందిందని కుటుంబసభ్యులకు తెలిపారు. మత్తు(అనస్తీషియా) ఇంజక్షన్ ఇవ్వగానే గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే, కేస్షీట్ రాయకుండా, కుటుంబసభ్యుల సంతకాలు తీసుకోకుండానే ఆపరేషన్ థియేటర్కు ఎలా తీసుకువెళ్లారని బంధువులు ప్రశ్నించారు. పెద్ద ఎత్తున బంధువులు, గ్రామస్తులు ఆస్పత్రికి చేరుకొని ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్హెచ్వో నరహరి, పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని సమగ్ర విచారణ చేపడతామని హామీ ఇచ్చి, ఆందోళనకారులను సముదాయించారు. -
సర్కారు బడుల్లో సైన్స్ ల్యాబ్లు
● ఉమ్మడి జిల్లాలో 23 స్కూళ్ల ఎంపిక ● నిజామాబాద్కు రూ.1.36 కోట్లు, కామారెడ్డికి రూ.4.68 కోట్లు మంజూరు ● 15 రోజుల్లో టెండర్లు ఖలీల్వాడి: సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి సైన్స్ విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి జిల్లాలోని 23 పాఠశాలల్లో అత్యాధునిక సైన్స్ ల్యాబొరేటరీలు నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఒక్కో స్కూల్కు రూ.26 లక్షల చొప్పున నిజామాబాద్ జిల్లాలోని ఐదు పాఠశాలలకు రూ. 1.36 కోట్లు, కామారెడ్డి జిల్లాలోని 18 స్కూళ్లకు రూ.4.68 కోట్ల నిధులు రానున్నాయి. ఈ నిధుల్లో రూ.25 లక్షలు ల్యాబ్రూమ్ నిర్మాణం, వర్క్స్టేషన్, ఫర్నిచర్, ఇంటర్నల్ ఎలక్ట్రిఫికేషన్తోపాటు రూ. లక్షతో ల్యాబ్ పరికరాల కొనుగోలు, సరఫరా, ఇన్స్టలేషన్, టెస్టింగ్ అండ్ కమిషనింగ్ చేయనున్నారు. టీజీఈడబ్ల్యూఐడీసీ ఆధ్వర్యంలో ఈ–టెండర్లును ఆహ్వానిస్తోంది. టెండర్లు పూర్తయిన తర్వాత 15 రోజుల్లో అగ్రిమెంట్ పూర్తి చేసుకొని పనులు చేయాల్సి ఉంటుంది. ల్యాబ్లు అందుబాటులోకి వస్తే 9, 10వ తరగతి విద్యార్థులకు సైన్స్ సబ్జెక్ట్లో ప్రయోగాత్మక నైపుణ్యం పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ బడిలో చదివే విద్యార్థులు ప్రయివేటు స్కూళ్లకు ధీటుగా ప్రయోగాలు చేసి సైన్స్పై పట్టు సాధించే అవకాశాలు ఉంటాయి. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ కేజీబీవీ (ముప్కాల్) సిరికొండ కేజీబీవీ (పెద్దవాల్గోట్) ఎడపల్లి ప్రభుత్వ హైస్కూల్ (ఉర్దూ), నెహ్రూనగర్ సాలూరా ఎంపీహెచ్ఎస్(హున్సా) ఇందల్వాయి కేజీబీవీ (ఇందల్వాయి)కామారెడ్డి జిల్లా.. రాజంపేట్ ఎంపీయూఎస్, అరెపల్లి బిచ్కుంద జెడ్పీహైస్కూళ్లు హస్గుల్, జామామసీద్ హైస్కూల్, కేజీబీవీ, బిచ్కుంద లింగంపేట్ జెడ్పీహైస్కూళ్లు– భవానీపేట్, షేట్పల్లి, పరమళ, లింగంపేట్ (బాలికల) పిట్లం కేజీబీవీ, పిట్లం కామారెడ్డి జెడ్పీహైస్కూళ్లు– కామారెడ్డి ఐఎన్ఆర్, హనుమాన్ మందిర్ హైస్కూల్ నాగిరెడ్డిపేట్ కేజీబీవీ, నాగిరెడ్డిపేట్ బాన్సువాడ జెడ్పీహైస్కూళ్లు–తడ్కోల్, హన్మాజీపేట్ నిజాంసాగర్ కేజీబీవీ, నిజాంసాగర్ డోంగ్లీ జడ్పీ హైస్కూల్, డోంగ్లీ గాంధారి జెడ్పీ హైస్కూల్, పోతంగల్ కమాన్ -
జల ప్రళయం..కన్నీటి జ్ఞాపకం!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో గతేడా ది కురిసిన వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. ఆగ స్టు 26, 27, 28 తేదీల్లో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపా తం నమోదైంది. ఆ మూడు రోజుల్లో కలిపి జిల్లా వ్యాప్తంగా సరాసరిన 40 సెం.మీ. వర్షం కురిసింది. వరదలతో రోడ్లు, చెరువులు, వంతెనలకు భారీ న ష్టం వాటిల్లింది. వాటిని పునర్నిర్మించేందుకు రూ.251.36 కోట్లు అవసరం అవుతాయని జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. కాగా వరదలు, వ ర్షాలతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 1,454 ఇళ్లు దెబ్బతిన్నాయి. 118 పశువు లు, 53,270 కోళ్లు మృత్యువాతపడ్డాయి. 334 గ్రా మాల్లో 37,313 మంది రైతులకు సంబంధించి 50,028 ఎకరాల్లో వివిధ పంటలు, 140 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్ శాఖకు సంబంధించి 38 గ్రామాల్లో 864 స్తంభాలు, 51.84 కిలోమీటర్ల వైర్లు, 589 ట్రాన్స్ఫార్మర్లకు నష్టం వాటిల్లింది. 50,028 ఎకరాల్లో పంటలకు నష్టం జిల్లాలో 50,028 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వరి పంట కొట్టుకుపోవడం, ఇసుక మేటలు వేయడం, నీట మునిగి దెబ్బతినడం ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంచాయతీరాజ్ శాఖకు రూ. 45.50 కోట్లు... పంచాయతీరాజ్ కామారెడ్డి, బాన్సువాడ డివిజన్ల పరిధిలో 122 రోడ్లు, కల్వర్టులు దెబ్బతినగా వాటికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు రూ.8 కోట్లు, పూర్తి స్థాయిలో మరమ్మతులకు రూ.37.50 కోట్లు అవసరమని ఆ శాఖ అధికారులు నివేదికలు రూపొందించారు. నీటిపారుదల రంగానికి రూ.41 కోట్లు... వాగులు పొంగి ప్రవహించడంతో 157 చెరువులు దెబ్బతిన్నాయి. వందేళ్ల క్రితం నిర్మించిన పోచారం ప్రాజెక్టు కొట్టుకుపోతుందేమోనని ఓ దశలో అధికారులు ఆందోళన చెందారు. కట్ట కొంత కోతకు గురవగా తాత్కాలికంగా మరమ్మతులు చేయించారు. కల్యాణి ప్రాజెక్టు, సింగితం రిజర్వాయర్ల కట్టలు కొ ట్టుకుపోయాయి. వాటిని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాల్సి ఉంది. చెరువులు చాలా చోట్ల గండ్లు పడ్డాయి. కాలువలు కూడా కొట్టుకుపోయాయి. వరదల కారణంగా నీటిపారుదల రంగానికి రూ. 41 కోట్ల నష్టం వాటిల్లింది. ఆర్అండ్బీ రోడ్లకు రూ.125.50 కోట్లు.. జిల్లాలో రోడ్లు భవనాల శాఖకు సంబంధించి 65 కిలోమీటర్ల మేర రోడ్డు దెబ్బతినగా, 48 కల్వర్టులు పాడయ్యాయి. వాటికి తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.5.50 కోట్లు, పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడానికి రూ.120 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనాలు రూపొందించారు. కామారెడ్డి –ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై లింగంపేట మండలం లింగంపల్లి కుర్దు గ్రామం వద్ద ఉన్న కల్వర్టు వరదలో కొట్టుకుపోయి రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. నీట మునిగిన కాలనీలు... గతేడాది 26న రాత్రి ప్రారంభమైన వర్షం 27, 28 తేదీలలో ఉగ్రరూపం దాల్చి ప్రళయాన్ని సృష్టించింది. జిల్లా కేంద్రంలోని జీఆర్ కాలనీ, హౌజింగ్బోర్డు కాలనీ, దేవి విహార్, టీచర్స్ కాలనీ, గాంధీనగర్, అయ్యప్పనగర్ తదితర కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. జీఆర్ కాలనీ మొత్తం నీట మునిగిపోవడంతో వందలాది మంది ఇబ్బందిపడ్డారు. వారిని అధికారులు బయటకు తీసుకువచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇళ్లలోని వస్తువులు తడిసిపోయాయి. కార్లు, బైక్లు వరదల్లో కొట్టుకుపోయాయి. మహ్మద్నగర్, ఎల్లారెడ్డి, లింగంపేట తదితర మండలాల్లోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. కామారెడ్డిని ముంచెత్తిన భారీ వరదలకు ఏడాది వేలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు ఓదార్పే తప్ప అందని సాయం మరమ్మతులకు నోచుకోని రోడ్లు, వంతెనలు ఇప్పటికీ కోలుకోని జిల్లా -
నిజాంసాగర్లోకి కొనసాగుతున్న ఇన్ఫ్లో
● నెలలో 7.096 టీఎంసీల చేరిక నిజాంసాగర్: ఉమ్మడి జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో కొనసాగుతోంది. బుధవారం ఎగువ ప్రాంతాల నుంచి 2,450 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి గతనెల 27న ఇన్ఫ్లో ప్రారంభమైంది. అప్పటినుంచి రోజూ ఎంతోకొంత నీరు వచ్చి చేరుతూనే ఉంది. నెలరోజుల్లో 7.096 టీఎంసీల ఇన్ఫ్లో వచ్చిందని అధికారులు తెలిపారు. ఎగువన కురిసిన వర్షాలతోపాటు పోచారం ప్రాజెక్టు, ఘనపురం ఆనకట్ట, హల్దీవాగుల వరద వస్తోందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. బుధవారం సాయంత్రానికి 1,401.48 మీటర్ల (13.051 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని తెలిపారు. వేల్పూర్(మెండోరా): శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో తగ్గిపోవడంతో నీటిమట్టం నిలకడగా ఉంటోంది. ప్రస్తుతం 963 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. అంతే మొత్తంలో అవుట్ ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 44.713 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాకతీయ కాలువ ద్వారా 250 క్యూసెక్కులు, మిషన్ భగీరథ పథకానికి 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా.. ఆవిరిరూపంలో 482 క్యూసెక్కుల నీరు వెళ్తోందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.నిలకడగా ఎస్సారెస్పీ నీటిమట్టం -
ఐక్యంగా ముందుకు సాగాలి
నిజామాబాద్ రూరల్: ప్రజలంతా కుల మతాలకు అతీతంగా ఐక్యంగా ముందుకు సాగాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గంగా, జమునా, తహజీబ్ సంస్కృతి ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. జిల్లా కేంద్రంలోని ఖిల్లా రోడ్లో బుధవారం మిలాద్ ఉన్ నబీ వేడుకలు, ర్యాలీని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధించిన ప్రేమ, శాంతి, సోదరభావం, మానవత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. మతాల మధ్య ఐక్యతే తెలంగాణ బలం అని అన్నారు. మని షిని మనిషిగా గౌరవించడం, ప్రేమించడం, కష్టా ల్లో ఒకరికొకరు అండగా నిలవడమే నిజమైన మానవత్వమని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. కులం, మతం, ప్రాంతం పేరుతో మనుషుల మధ్య విభేదాలు సృష్టించుకోవద్దని పి లుపునిచ్చారు. తెలంగాణ సమాజం ఎప్పటి నుంచో కులమతాలకు అతీతంగా కలిసి జీవించే గొప్ప సంస్కృతిని కలిగి ఉందని, ఈ సామరస్యాన్ని భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ సెక్యు లర్ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే పార్టీ అని పే ర్కొన్నారు. సమాజంలోని అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, డీసీసీ అధ్యక్షుడు నగేశ్ రెడ్డి, కార్పొరేషన్ డీసీసీ అఽ ద్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నుడా చైర్మన్ కేశ వేణు, శేఖ ర్గౌడ్, నరాల రత్నాకర్, జావిద్ అక్రమ్, ఖుద్దూస్, హారున్, కార్పొరేటర్లు సజ్జాద్ రహీల్, నయీమ్ షారాన్, అబ్దుల్ కరీం, అబుద్ బిన్ హందన్, అన్వర్, మొహమ్మద్ అహ్మద్, కో ఆప్షన్ మెంబర్ మహేందర్ సింగ్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త బోధనలు ఆచరించాలి మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జిల్లాలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ -
పంచాయతీల్లో ‘మామూళ్ల’ ఆనవాయితీ!
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో గ్రామ పంచాయతీల నిధుల లెక్కల పరిశీలన (ఆడిట్) ప్రక్రియ తీవ్ర వి మర్శలకు దారితీస్తోంది. రికార్డుల తనిఖీల్లో అక్రమ వసూళ్ల పర్వం బహిరంగగానే సాగుతోంద నే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో ఆర్థిక లోపాలను, రికార్డుల్లోని తప్పులను దాచిపెట్టి క్లీన్ చిట్ ఇచ్చేందుకు కొంతమంది అధికారులు భారీగా ముడుపులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని చోట్ల ‘మా మూళ్లు’ సైతం జీపీ ఖాతాల నుంచి చెల్లించినట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 545 గ్రామ పంచాయతీల్లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధుల ఆడిట్ ఇటీవల ప్రారంభమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా నిధులతోపాటు స్థానిక సంస్థల సొంత వనరుల ఖర్చుల లెక్కలను ఆడిట్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. సుమారు 450 జీ పీల్లో ఆడిట్ పూర్తయ్యింది. మిగతా వాటిల్లో కొనసాగుతోంది. నిధుల దుర్వినియోగాన్ని బయటపెట్టాల్సిన ఆడిట్ వ్యవస్థే.. మామూళ్ల మత్తులో మునిగిపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అడిగినంత ఇవ్వకపోతే.. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఆడిట్ అధికారులు ముడుపుల కోసం ఒత్తిడి తెచ్చారని పలువురు పంచాయతీ కార్యదర్శులు అంతర్గతంగా వాపోతున్నారు. తమ గ్రామ పంచాయతీల్లో ఎటువంటి లోపాలు లేకున్నా ‘ఆనవాయితీ’ కొనసాగించాలని ఒత్తిడి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడిగినంత ఇచ్చుకోకపోతే, చిన్న చిన్న సాంకేతిక లోపాలను కూడా పెద్దవిగా చూపిస్తూ అభ్యంతరాలు రాస్తారని, తద్వారా తమ ఉద్యోగాలకు ఇబ్బందులు వస్తాయనే భయంతో ఈ ముడుపులు ఇవ్వాల్సి వచ్చిందని కొందరు కార్యదర్శులు వాపోతున్నారు. ఆడిట్ లొసుగులు బయటపెట్టకుండా ఉండేందుకు ముడుపులు? మేజర్ జీపీల్లో ఒకలా.. సాధారణ జీపీల్లో మరోలా.. జిల్లాలో ఆఖరు దశకు చేరుకున్న 2025–26 లెక్కల పరిశీలన ఆర్మూర్ డివిజన్లో పరిధిలో ఉన్న ఓ మారుమూల మండలంలోని గ్రామ పంచాయతీల్లో ఇటీవల ఆడిట్ జరిగింది. ఆడిట్ అధికారులు అన్ని గ్రామ పంచాయతీలకు వెళ్లకుండా ఒక జీపీని కేంద్రంగా చేసుకుని లెక్కాపత్రాలను పరిశీలించారు. లెక్కల్లో లోపాలు, అభ్యంతరాలు లేవనెత్తకుండా ఉండేందుకు జీపీ కార్యదర్శులు ఎప్పటిలాగే ‘ఆనవాయితీ’ని కొనసాగించారు. మేజర్ జీపీలకు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు అలాగే సాధారణ జీపీ అయితే రూ.10వేల నుంచి రూ.20వేల వరకు ఆడిట్ అధికారులకు ముట్టజెప్పినట్లుగా తెలిసింది. జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు సాగిందనే ఆరోపణలున్నాయి. -
బీఆర్ నేతకు మేజర్ ధ్యాన్చంద్ అవార్డు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ విభాగంలో ఫిజికల్ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న బీఆర్ నేత ధ్యాన్చంద్ ఎక్సలెన్స్ అవార్డు–2026కు ఎంపికయ్యారు. ఈ అవార్డును ప్రతి సంవత్సరం జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా ఒలంపిక్స్లో ప్రఖ్యాతిగాంచిన హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకొని బహూకరిస్తారు. ఈనెల 29న హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్క్లబ్ ఆడిటోరియంలో అవార్డును ప్రదానం చేయనున్నట్లు తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ (తెలంగాణ ఇంటెలెక్చువల్స్ ఫోరం) అధ్యక్షుడు డాక్టర్ రాజ్నారాయణ ముదిరాజ్ బుధవారం తెలిపారు. తెలంగాణ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది వ్యాయామ విద్య, క్రీడలలో సేవలందించిన వారికి ఈ ప్రతిష్టాత్మక అవార్డును బహుకరిస్తామని ఆయన తెలిపారు. హత్యారాజకీయాల చరిత్ర ఎవరిదో ప్రజలకు తెలుసు ● మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి విమర్శ డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): హత్యా రాజకీయాల చరిత్ర ఎవరిదో బాన్సువాడ ప్రజలందరికీ తెలుసని, ఆది నుంచి హత్యారాజకీయాల్లో మునిగి తేలింది పోచారం శ్రీనివాస్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, కొద్ది మంది అనుచరులని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలో జరుగుతున్న వాస్తవాలు తెలిసినా తెలియనట్లు నటిస్తూ, అనుచరులు చేస్తున్న అరాచకాలను కప్పిపుచ్చుకోవడానికి తన కుటుంబంపై అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటని బాజిరెడ్డి పేర్కొన్నారు. కోటగిరి, వర్ని మండలాల్లో జరిగిన హత్యల వెనుక వాస్తవాలను నిగ్గు తేల్చాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసు యంత్రాంగం అధికార ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరారు. ప్రజల కోసం ప్రాణాలిచ్చే కుటుంబం తమదని, అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీఐల బదిలీలు నిజామాబాద్ అర్బన్: మల్టీజోన్–1 పరిధిలోని పలువురు సీఐలను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. నిజామాబాద్ కమిషనరేట్లోని పీసీఆర్ విభాగంలో పనిచేస్తున్న సండ్ర వీరయ్యను కామారెడ్డి జిల్లా సదాశివనగర్ సీఐగా, బండి సంతోష్ కుమార్ను కామారెడ్డి సీసీఎస్ పోలీస్ విభాగానికి బదిలీ చేశారు. కామారెడ్డి సీసీఎస్ విభాగంలో పనిచేస్తున్న సీఐ రామన్ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో పీసీఆర్ విభాగానికి బదిలీ అయ్యారు. నేటి నుంచి ‘సర్’ గ్రామసభలు నిజామాబాద్ అర్బన్: జిల్లా వ్యాప్తంగా నేటి (గురువారం) నుంచి ఎస్ఐఆర్ గ్రామ సభలు నిర్వహించనున్నారు. ప్రతి గ్రామపంచాయతీలో గ్రామసభ నిర్వహించి ఎన్నికల నూతన ముసాయిదా ఓటరు జాబితాను ప్రదర్శించనున్నారు. లిస్ట్లో పేర్లు లేని వారికి నోటీసులు అందించి వారి నుంచి వివరణ తీసుకోవడం, జాబితాలో తప్పులపై గ్రామ సభల్లో చర్చించనున్నారు. గ్రామ సభకు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ సెక్రెటరీ, గ్రామస్తులు, బీఎల్ఏలు, బీఎల్వోలు హాజరుకానున్నారు. 18 సంవత్సరాలు పూర్తి చేసిన వారికి నూతన ఓటు నమోదుకు సంబంధించి ఫారం–6పై అవగాహన కల్పిస్తారు. భారతీయ పౌరుడై ముసాయిదా ఓటరు జాబితాలో పేరు లేని వ్యక్తుల వివరాల నమోదు ప్రక్రియపై చర్చిస్తారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో అనర్హుల పేర్లు ఉంటే అభ్యంతరాలు, ఫిర్యాదులు సమర్పించే విధానంపై అవగాహన కల్పిస్తారు. -
కాపర్ కాయిల్స్ చోరీ ముఠా అరెస్ట్
● ఎనిమిది పోలీస్స్టేషన్ల పరిధిలో కేసులు మోపాల్: ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను నిజామాబాద్ జిల్లా మోపాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మోపాల్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఎస్సై సుస్మిత తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కంజర్ గ్రామశివారులో బుధవారం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా.. కాపర్ కాయిల్స్తో వెళ్తున్న ట్రాలీ వాహనం కనిపించింది. అందులో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ట్రాన్స్ఫార్మర్ల చోరీలు వెలుగులోకి వచ్చాయి. పగటి పూట రెక్కీ.. రాత్రి పూట చోరీ.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన కడారి రవీందర్, నిజామాబాద్ జిల్లా ఇంద్రాపూర్ కాలనీకి చెందిన బంగారు కళ్ల మహేశ్, మందా దీపక్, అడవు ఆకాశ్, సాయినగర్కు చెందిన అగుల్ల రాజేశ్, సిద్ధార్థనగర్కు చెందిన సనం చంద్రకాంత్ ముఠాగా ఏర్పడ్డారు. వీరు నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో పగటిపూట ట్రాన్స్ఫార్మర్ల రెక్కీ నిర్వహించేవారు. రాత్రివేళల్లో జీప్, ట్రాలీ వాహనాల్లో వెళ్లి ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి వాటిలోని కాపర్ కాయిల్స్, ఆయిల్ను దొంగిలించేవారు. వీటిని ప్రధానంగా కడారి రవీందర్ ద్వారా హైదరాబాద్లోని దక్కన్ ట్రేడర్స్ సంస్థకు చెందిన ఎంఏ నఫే అన్సారీకి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కొన్నిసార్లు కాపర్ కాయిల్స్ను కరీంనగర్కు చెందిన నూనె విష్ణుకు కూడా విక్రయించినట్లు నిందితులు చెప్పారని ఎస్సై తెలిపారు. వీరిపై మోపాల్, మాక్లూర్, డిచ్పల్లి, నవీపే ట్, వర్ని, నిజామాబాద్ రూరల్, భీంగల్, జక్రాన్పల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో ట్రాన్స్ఫార్మర్ చోరీ కేసు లు ఉన్నాయని పేర్కొన్నారు. నిందితుల నుంచి సుమారు 10 కిలోల కాపర్ వైర్, కాయిల్స్, అశోక్ లేలాండ్ వాహనం, టాటా జీప్, ట్రాలీ, కట్టర్, 13 ఇనుప పానలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకు న్నామన్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించామని పేర్కొన్నారు. కేసు ఛేదనలో కీలకపాత్ర పోషించిన సీసీఎస్ సీఐ ఏ సురేశ్, సీసీ ఇన్స్పెక్టర్ డీ సాయినాథ్, సీసీఎస్ టీమ్ హెడ్కానిస్టేబుల్ వెంకట్రాం, కానిస్టేబుళ్లు అప్సర్, సర్దార్, వసీం, నరేశ్ను సీపీ సాయిచైతన్య అభినందించారు. -
చిరువ్యాపారాలతో స్వయం ఉపాధి
● మహిళా సంఘాలకు పీఎంఎఫ్ఎంఈ రుణాలు ● డీపీఎం రాచయ్య కమ్మర్పల్లి(భీమ్గల్): మహిళలు చిరు వ్యాపా రాలతో స్వయం ఉపాధి పొందాలని డీపీఎం రాచ య్య సూచించారు. మహిళా సంఘాల సభ్యుల కు ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రా సెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పీఎం ఎఫ్ఎంఈ) పథకం ద్వారా ఆహార ఉత్పత్తుల తయారీ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ తదితర చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు సబ్సిడీపై రుణాలను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన భీమ్గల్ మండల సమాఖ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పీఎంఎఫ్ఎంఈ రుణాలకు 35 శాతం వరకు సబ్సిడీ ఉంటుందని వివరించారు. మహిళలు పప్పులు, పిండి పదార్థాలు, పచ్చళ్లు, మసాలా దినుసులు, చిరుధాన్యాల ఉత్పత్తులు, ఇతర ఆహార పదార్థాల తయారీ వంటి చిన్న వ్యాపారాలను ప్రారంభించి స్వయం ఉపాధి పొందవచ్చని సూచించారు. అనంతరం మహిళా సమాఖ్య సభ్యుల ఆధ్వర్యంలో స్కూల్ యూనిఫామ్ల కుట్టు పనులను పరిశీలించారు. ఐకేపీ ఏపీఎం ప్రమీల, సీసీలు కుంట శ్రీనివాస్, వి. శ్రీనివాస్, రఘుపతి, గంగ సాయిలు, భాస్కర్, గంగాధర్, సుమలత, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సత్తెమ్మ తదితరులు పాల్గొన్నారు. -
నిధుల దుర్వినియోగంపై విచారణ ప్రారంభం
బోధన్: ఎడపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఎరువులు విక్రయించిన డబ్బులు రూ.28 లక్షలు దుర్వినియోగంపై సహకార శాఖ అధికారులు స్పందించారు. వాస్తవాలు తేల్చేందుకు ఆ శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ రమావతిని విచారణ కు ప్రత్యేక అధికారిణిగా నియమించారు. ఈ నేపథ్యంలో సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో ప్రత్యేక అధికారిణి రమావతి విచారణ ప్రారంభించారు. అధ్యక్షుడు పోల మల్కారెడ్డి, డైరెక్టర్ల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా పోల మ ల్కారెడ్డి మాట్లాడుతూ ఎరువుల డబ్బులు దుర్వినియోగం విషయంలో బాధ్యుల నుంచి ఆ డబ్బుల ను కచ్చితంగా రికవరీ చేస్తామన్నారు. పాలకవర్గం ఆమోదంతో బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ప్రత్యేక అధికారిణి తెలిపారు. -
అధ్యాపకుల పదోన్నతులకు పచ్చజెండా
● హైదరాబాద్లో తెయూ పాలకమండలి సమావేశం ● 12 అంశాలకు ఏకగ్రీవ ఆమోదంతెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో 2014లో నియమితులైన అధ్యాపకుల పదోన్నతులకు సుదీర్ఘకాలం తర్వాత ఎట్టకేలకు పాలకమండలి (ఈసీ) ఆమోదం లభించింది. వీసీ టీ యాదగిరిరావు అధ్యక్షతన హైదరాబాద్లోని సెక్రటేరియట్లో వర్సిటీ పాలకమండలి సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈసీ కన్వీనర్, రిజి స్ట్రార్ ఎం యాదగిరి, పాలకమండలి సభ్యులు తెలిపిన సమావేశం వివరాలు.. ఎజెండాలోని 12 అంశాలపై చర్చించిన సభ్యులు వాటికి ఆమోదం తెలిపారు. ముఖ్యంగా 2014 అధ్యాపకుల పదోన్నతులపై సుదీర్ఘంగా చర్చ సాగింది. పదోన్నతుల విషయమై వర్సిటీ ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ద్వారా న్యాయ సలహా కోరగా ఆయన పంపించిన సీల్డ్ కవర్ను పాలకమండలి సభ్యుల సమక్షంలో తెరిచారు. అధ్యాపకులకు షరతులతో కూడిన పదోన్నతుల ప్రక్రియను కొనసాగించాలని ఏజీ సూచించారు. దీంతో ఈసీ ఎక్స్అఫీ షియో సభ్యులు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా, కళాశాల విద్యా కమిషనర్ దేవసేన, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తాపట్నాయక్తోపాటు సభ్యులందరూ ఏజీ సూచన మేరకు అధ్యాపకులకు కండిషనల్ ప్రమోషన్స్ ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. బీఫార్మసీ కోర్సు.. తెలంగాణ యూనివర్సిటీలో కొత్తగా బీఫార్మసీ కోర్సు ప్ర వేశపెట్టడానికి వర్సిటీ పాలకమండలి ఏకగ్రీవంగా ఆమో దం తెలిపింది. వర్సిటీలో కోర్సు నిర్వహణకు అవసరమైన అన్ని వసతి సౌకర్యాలు ఉన్నందున కోర్సు ప్రారంభించాలని, ఇందుకోసం పూర్తి వివరాలతో కూడిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాలని ఈసీ తీర్మానించింది. ప్ర భుత్వ అనుమతి లభిస్తే ఈ విద్యాసంవత్సరం 2026–27 నుంచే కోర్సు ప్రారంభించాలని తీర్మానం చేశారు. వర్సిటీ బడ్జెట్ ఆమోదం, ఇతర అభివృద్ధి, పాలనాపరమైన అంశా లపై చర్చించి ఆమోదించారు. ఎక్స్ అఫీషియో సభ్యులతోపాటు సభ్యులు సీహెచ్ ఆంజనేయులు, సుధాకర్గౌడ్, రజినీకాంత్, దండు స్వామి, మదన్ మోహన్, జయంత్రెడ్డి, సంజీవరావు, ఘాజా, లావణ్య పాల్గొన్నారు. -
ఏర్పాట్ల పరిశీలన
నిజామాబాద్ అర్బన్: గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటన నేపథ్యంలో కలెక్టర్ భవేశ్మి శ్రా, పోలీస్ కమిషనర్ పి సాయిచైతన్య సో మవారం క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. గవర్నర్ పర్యటించనున్న ప్రతి చోట పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్, సీపీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. ప్రొటోకాల్ ను పాటించాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, మెడికల్ టీం, 108, 104, ప్రత్యేక డాక్టర్ల బృందాలను అందుబాటులో ఉంచాలని, వేదిక, సీటింగ్ను సరి చూసుకోవాలని, తాగునీరు, శానిటేషన్ పక్కా గా ఉండాలని సంబంధిత అధికారులకు బా ధ్యతలు పురమాయించారు. అనుమతి ఉన్న వారిని మాత్రమే గవర్నర్ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు అనుమతిస్తామని సీపీ అన్నారు. -
ప్రతి దశలో సత్వర చర్యలు తీసుకోవాలి
● పోలీస్ కమిషనర్ సాయిచైతన్య ● కేసుల దర్యాప్తుపై అటవీ అధికారులకు ఒక రోజు శిక్షణనిజామాబాద్అర్బన్: కేసు నమోదు, ఎఫ్ఐఆర్ దశ నుంచి దర్యాప్తు, చార్జిషీట్ దాఖలు చేసే వరకు ప్రతి దశలోనూ సత్వర చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య సూచించారు. కమిషనరేట్ కార్యాలయంలో నేర పరిశోధన, కేసుల ద ర్యాప్తుపై అటవీశాఖ సిబ్బందికి సోమవారం ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నేరానికి సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం, నిందితులపై నేరం రుజువయ్యే వరకు పక్కా ఆధారాలను సేకరించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. బీఎన్ఎస్ఎస్లో దర్యాప్తునకు సంబంధించిన సెక్షన్లు 176 నుంచి 193 వరకు అలాగే స మన్లు, వారెంట్ల అమలుకు సంబంధించి నిబంధనలను పొందుపరిచారని తెలిపారు. సాంకేతిక, శాసీ్త్రయ ఆధారాల ప్రాధాన్యతను వివరించారు. కే సు నమోదు చేయడం మాత్రమే కాకుండా కోర్టులో నేరాన్ని నిరూపించి నిందితుడికి చట్టప్రకారం శిక్ష పడేవిధంగా పక్కా దర్యాప్తు చేపట్టాలన్నారు. అటవీ నేరాలకు సంబంధించిన కేసుల్లో పోలీస్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం, శాసీ్త్రయ ద ర్యాప్తు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, న్యాయపరమైన ప్రక్రియపై అవగాహన కల్పించారు. సీసీఆర్బీ ఏసీపీ గురునాయుడు, ఇన్స్పెక్టర్ అంజయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్రెడ్డి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవి మోహన్భట్, ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్స్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ పాల్గొన్నారు.శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న సీపీ సాయిచైతన్య.. హాజరైన ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది -
సర్పంచుల సమస్యలు పరిష్కరిస్తా..
● సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మునిపల్లి చిన్నసాయిరెడ్డి నిజామాబాద్ రూరల్: సర్పంచుల సమస్యలను పరిష్కరిస్తూ, అందరిని కలుపుకొని ముందుకు వెళ్తానని సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మునిపల్లి చిన్నసాయిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం నగరంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని సర్పంచ్లకు, 32 మండలాల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులకు ఎలాంటి సమాచా రం ఇవ్వకుండా ఓ వ్యక్తి తానే జిల్లా సర్పంచు ఫో రం అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం పూర్తిగా అవాస్తవమని అన్నారు. సర్పంచ్ల ఫోరం అధ్యక్షుల అభిప్రాయాలు, సమన్వయం లేకుండా స్వయంగా జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం సరైన విధా నం కాదని స్పష్టంచేశారు. ఫోరం ప్రతినిధులు మా ట్లాడుతూ మునిపల్లి సాయిరెడ్డికి జిల్లాలోని అన్ని మండలాల సర్పంచ్ల మద్దతు ఉందని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రి సీతక్క, జిల్లా ప్రజాప్రతినిధులు జీపీల సమస్యలు, సర్పంచ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై దృష్టి సారించి, వా టి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారని పే ర్కొన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అరికెల జనార్దన్, ఉపాధ్యక్షులు చింతం ఉమారాణి సంజీవ్, మండలాల అధ్యక్షులు వాసు, సుదర్శన్, భూమేశ్, శ్రీను, జలేందర్, రాజు, మోహన్, నీలి మా సాయగౌడ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
డిచ్పల్లి: డిచ్పల్లి మండలం బీబీపూర్ తండా గ్రామ శివారులో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందినట్లు ఎస్సై మహమ్మద్ ఆరీఫ్ తెలిపారు. డిచ్పల్లి ఖిల్లా గ్రామానికి చెందిన నాయికిడి నరేశ్(30) తన మిత్రుడితో కలిసి ఆదివారం సాయంత్రం పని నిమిత్తం ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. రాత్రి సుమారు 12.30 గంటలకు తిరిగి బైక్పై వస్తుండగా బీబీపూర్ తండా సమీపంలోని దాబా యూటర్న్ వద్ద హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన నరేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చెరువులో పడి యువకుడు .. నవీపేట: మండలంలోని బినోలా గ్రామానికి చెందిన పాతర్ల మోహన్ (30) అనే యువకుడు చెరువు లో పడి మృతి చెందిట్లు ఎస్సై శ్రీకాంత్ సోమవారం తెలిపారు. కొంత కాలంగా మోహన్ మద్యానికి బానిస కావడంతో భార్య లాస్య వేరుగా ఉంటుందని పేర్కొన్నారు. ఆదివారం చెరు వుగట్టుపై మద్యం సేవిస్తూ కనబడిన మోహన్ సోమవారం చెరువులో పడి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి కుమార్తె ఉన్నట్లు పేర్కొన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యుదాఘాతంతో ఆవు మృత్యువాత ధర్పల్లి: విద్యుదాఘాతానికి ఒక ఆవు మృతి చెందగా, మరో ఆవుకు తీవ్రగాయాలైన ఘటన మండలంలోని దుబ్బాక గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. కూర నరసయ్యకు చెందిన ఆవులు మేతకు వెళ్లి ఇంటికి వస్తున్న క్రమంలో స్తంభానికి ఉన్న సపోర్ట్ వైర్కు విద్యుత్ ప్రవహించడంతో విద్యుదాఘాతానికి గురయ్యాయి. ఆవు విలువ రూ.50 వేల వరకు ఉంటుందని తెలిపారు. -
బెటాలియన్ కమాండెంట్ బదిలీ
డిచ్పల్లి: రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్ కమాండెంట్ పి.సత్యనారాయణ ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీ అయ్యారు. సోమవారం సాయంత్రం బెటాలియన్ అధికారులు, సిబ్బంది కమాండెంట్ సత్యనారాయణకు ఘనంగా వీడ్కోలు పలికారు. తొలుత బెటాలియన్ అడిషనల్ కమాండెంట్గా వచ్చిన సత్యనారాయణ మే నెలలో కమాండెంట్గా పదోన్నతి పొందారు. కమాండెంట్ సత్యనారాయణ దంపతులను సిబ్బంది ఘనంగా సత్కరించారు. అనంతరం సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. ఆయన స్థానంలో ఏడో బెటాలియన్ ఇన్చార్జి కమాండెంట్గా పీజేపీసీ ఛటర్జీ (17వ బెటాలియన్ కమాండెంట్) నియామకయ్యారు. -
వలస కార్మికుల కోసం పటిష్టమైన విధానం
నిజామాబాద్ రూరల్: వలస కార్మికుల సంక్షేమం కోసం మరింత పటిష్టమైన విధానాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి అన్నారు. తమ దేశ పౌరుల కోసం ఫిలిప్పీన్స్ ప్రభుత్వం అమలు చేస్తున్న వలస సంక్షేమ విధానాలను అధ్యయనం చేసి, తెలంగాణలోనూ అనుసరించే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. క్యాప్ కార్యాలయంలో సో మవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నా రై పాలసీ తీసుకురావడంతోపాటు గల్ఫ్ వెల్ఫేర్ బో ర్డు ఏర్పాటు చేయాలని ఎన్నికలకు ముందే పీసీసీ అధ్యక్షుడి నేతృత్వంలో నిర్ణయించామని గుర్తు చేశా రు. తమ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నారై అడ్వైజరీ బోర్డును ఏర్పాటు చేసిందని, నిపుణులతో ఏర్పాటైన కమిటీలో తాను సైతం సభ్యుడిగా ఉన్నానని అన్నారు. ఫిలిప్పీన్స్కు గల్ఫ్ దేశాలతో సంబంధం ఏమిటని కొందరు ప్రశ్నించినప్పటికీ.. ఆ దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో ఇతర దేశాలకు వలస వెళ్తున్నందున, అక్కడి వారి సంక్షేమం కోసం ఫిలిప్పీన్స్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను పరిశీలించడమే తమ కమిటీ పర్యటన ఉద్దేశమని స్పష్టం చేశారు. 1990 నుంచే అక్కడ వలస కార్మికుల కోసం సమగ్ర చట్టాలు, విధానాలు అమల్లో ఉన్నాయన్నారు. తమ పర్యటనకు సంబంధించిన సమగ్ర నివేదికను మరికొన్ని రోజు ల్లో సీఎం రేంత్రెడ్డికి అందజేస్తామన్నారు. కేంద్రం నిధులు ఇవ్వడం లేదు రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచినా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అనేక హామీలు ఇంకా పూర్తిగా అమలు కాలేదని భూపతిరెడ్డి ఆరోపించారు. తెలంగాణ నుంచి కేంద్రానికి ఆదాయం వెళ్తున్నప్పటికీ, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తగిన న్యాయం చేయడం లేదని విమర్శించారు. తెలంగాణ యువత కోసం ఉపాధి, పెట్టుబడులు, పరిశ్రమలు తీసు కురావడం, అంతర్జాతీయ అవకాశాలను పెంచడం కోసం సీఎం రేవంత్రెడ్డి విదేశీ పర్యటనలు చేస్తున్నారని, ఆయన ప్రయత్నాలను రాజకీయ కారణాలతో కేంద్రంలోని బీజేపీ అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శులు భాస్కర్రెడ్డి, పొలసాని శ్రీనివాస్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు సాయిరెడ్డి, నాయకులు బాగారెడ్డి, అంబర్సింగ్, చింతల కిషన్, మోహన్, హన్మాండ్లు, జలంధర్రెడ్డి, రాంచందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ఆర్ఐల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఫిలిప్పీన్స్ మోడల్ను తెలంగాణలోనూ అమలు చేస్తాం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి -
రైతుల భూములను రక్షించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యం
రెంజల్: రైతులు భూములను రక్షించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ ప్రధాన సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అన్నారు. రెంజల్ తహసీల్ కార్యాలయంలో అధికారులు, నాయకులతో సోమవారం సమీక్షాసమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభు త్వం రైతులకు అండగా ఉంటుందని, రెవెన్యూ అధికారులు, సబ్ రిజిస్ట్రార్లు సమన్వయంతో రైతుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. రైతు లు ఆందోళన చెందొద్దని, కొందరు అధికారులు, అవినీతి పరుల కారణంగా ప్రభుత్వం 22 ఏ తీసుకువచ్చిందని గుర్తు చేశారు. వివాదాస్పద భూముల సమస్యలకు సత్వరం పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు. నిషేధిత జాబితాలో ఉ న్న భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు గ్రామాల్లో రీ సర్వే నిర్వహించి పరిష్కారం అందిస్తున్నట్లు వివరించారు. రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. కారోబార్ వ్యవస్థను తొలగించాలి గ్రామా పంచాయతీ కార్యాలయాల్లో కారోబా ర్ వ్యవస్థను తొలగించాలని అధికారులను ఆ దేశించారు. గ్రామాల్లో గతంలో పనిచేసిన వీఆర్ఏలతో భూసమస్యలు వచ్చాయని గుర్తుచేశా రు. అదే కోవలో కారోబార్ వ్యవస్థ ఉందన్నా రు. నీలా గ్రామ పంచాయతీలో నిధులు దు ర్వినియోగంలో కారోబార్ పాత్ర ఉన్నట్లు తెలుస్తోందని, వెంటనే విచారణ చేపట్టి అతడిపై పోలీసు కేసు నమోదు చేయించాలని ఎంపీడీవోను ఆదేశించారు. గ్రామాల్లో ఉపాధి కూలీలతో ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు చేయించాలని అధికారులకు సూచించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మొబిన్ఖాన్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, డీసీసీ అధ్యక్షు డు నగేశ్రెడ్డి, అంతరెడ్డి రాజారెడ్డి, మాజీ జెడ్పీ టీసీ నాగభూషణంరెడ్డి, సర్పంచ్లు ధనుంజయ్, జుబేర్, తెలంగాణ శంకర్తోపాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రైతులు ఆందోళన చెందొద్దు గ్రామాల్లో అవినీతిని అరికట్టాల్సింది అధికారులే ఇప్పటికే వీఆర్ఏలతో భూసమస్యలు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సుదర్శన్రెడ్డి -
ప్రయివేటు స్కూళ్లకు భద్రత కల్పించాలి
ఖలీల్వాడి: ప్రయివేటు పాఠశాలలకు, ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలని ట్రస్మా రాష్ట్ర కోశాధికారి జయసింహాగౌడ్, జిల్లా అధ్యక్షుడు నిత్యానందం పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో పాఠశాల కరస్పాండెంట్ రూపారెడ్డి దారుణహత్యను ఖండిస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ధర్నా, ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీపీ సాయిచైతన్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూపారెడ్డి హత్యకు గురైన ఘటన విద్యారంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఇలాంటి ఘటనలతో విద్యారంగంలో పనిచేస్తున్న వారిలో భయాందోళనలు పెరుగుతున్నాయని చెప్పారు. రూపారెడ్డి హత్య కేసును అత్యంత ప్రాధాన్యతతో దర్యాప్తు చేసి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రస్మా జిల్లా సెక్రెటరీ అరుణ్, కోశాధికారి ఉప్పల మధు, ప్రతినిధులు నరసింహారావు, మోహన్, జనార్దన్, పృథ్వీ, పాఠశాల శ్రీనివాస్, నాగరాజు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
గోవూర్ శివారులో చిరుత సంచారం
వర్ని: మోస్రా మండలం గోవూర్ శివారు లోని పంట పొలాల్లో చిరుత పాదముద్ర లను అటవీశాఖ అధికారులు సోమవారం గుర్తించారు. ఆదివారం ఈ ప్రాంతంలో చి రుత సంచరించినట్లు పాదముద్రలను ఆధారంగా అధికారులు గుర్తించారు. మోస్రా, చింతకుంట, తిమ్మాపూర్, చే నంబర్ తండా అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తోందని అధికారులు తెలిపారు. రైతులు పంట పొలాల్లోకి ఒంటరిగా వెళ్లొద్దని, చప్పుడు చేస్తూ వ్యవసాయ పనులు చేసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజావాణికి 103 ఫిర్యాదులు నిజామాబాద్ అర్బన్: ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ భుజంగరావు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవా రం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 103 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివి ధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారు లు తమ సమస్యలను వివరిస్తూ అదనపు కలెక్టర్ భుజంగరావుతోపాటు ట్రెయినీ కలెక్టర్ సురేశ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, డీపీవో శ్రీనివాస్రావుకు అర్జీలు అందజేశారు. ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. పోలీస్ ప్రజావాణికి 32.. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన ప్రజావాణికి 32 ఫిర్యా దులు అందాయి. సీపీ సాయిచైతన్య బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా తమ సమస్యలను పోలీసులకు తెలుపాలని ఆయన సూచించారు. భీమ్గల్లో ప్లాస్టిక్ నిషేధం కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, గ్లాసులు, కవర్లను నిషేధించినట్లు కమిషనర్ గజానంద్ తెలిపారు. ఈమేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. పట్టణంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, ఫాస్ట్ఫు డ్ సెంటర్లు, కిరాణా దుకాణాలు, పండ్లు, కూరగాయల దుకాణాలు, చికెన్ సెంటర్లు, మటన్, ఫిష్ మార్కెట్లు, ఇతర అన్ని వ్యా పార, వాణిజ్య సముదాయాల యజమాను లు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు, క్యారీ బ్యాగులను వినియోగించవద్దని సూచించారు. తమ ఆదేశాలను కాదని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వినియోగించినట్లయితే తనిఖీ నిర్వహించి జరిమానాలు విధించడంతో పాటు చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కళ్యాపూర్ గ్రామంలో.. రెంజల్: మండలంలోని కళ్యాపూర్ గ్రామంలో ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, కవర్లను నిషేధిస్తూ జీపీ పాలకవర్గం తీర్మానించారు. గ్రా మంలోని జీపీ కార్యాలయంలో సోమవారం సర్పంచ్ భానుచందర్ అధ్యక్షతన సమావే శం నిర్వహించి, సభ్యులు తీర్మానం చేశారు. ఎవరైనా నిబంధన ఉల్లంఘిస్తే జరిమానా వసూలు చేస్తామన్నారు. ఉప సర్పంచ్ శ్రీకాంత్, వార్డు సభ్యులు, వ్యాపారులు పాల్గొన్నారు. -
నేడు జిల్లాకు గవర్నర్
● ఉదయం 10.20 గంటలకు హెలికాప్టర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్కు.. ● 10.30 గంటలకు సుభాష్నగర్లోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్కు చేరుకుంటారు. ● 11 గంటలకు భూమారెడ్డి కన్వెన్షన్లో నిర్వహించనున్న ‘నషా ముక్త్ భారత్ అభియాన్’లో పాల్గొంటారు ● 12.15 గంటలకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో ‘సునహరీ మిట్టీ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు ● మధ్యాహ్నం ఒంటి గంట వరకు మార్కెట్ లింకేజీ ప్రోగ్రాంలో భాగంగా పసుపు రైతులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ● 1.50 గంటలకు బర్దీపూర్ శివారులోని పీహెచ్ఆర్ కన్వెన్షన్లో అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొ ని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేస్తారు. ● 3.20 గంటలకు హెలికాప్టర్ ద్వారా హైదరా బాద్కు తిరుగుపయనమవుతారు.సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మంగళవారం (నేడు) పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని జాతీయ పసుపుబోర్డు కార్యాలయంలో ‘సునహరీ మిట్టి అభియాన్ – పసుపు మార్కెట్ లింకేజీ’ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలువురు పసుపు రైతులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా జిల్లాకేంద్రంలోని భూమారెడ్డి కన్వెన్షన్లో చేపట్టనున్న అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. పసుపు మార్కెట్ లింకేజీకి శ్రీకారం పసుపు పంటకు మార్కెట్ లింకేజీని కల్పిస్తూ, మార్కెట్ సౌకర్యాలను పెంపొందించేందుకు జిల్లా కేంద్రంలోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో ‘సునహరీ మిట్టి అభియాన్’ కార్యక్రమాన్ని గవర్నర్ ప్రారంభించనున్నారు. పసుపు ధరకు మెరుగైన మద్ధతు ధర అందించడం, ధరలను స్థిరీకరించడం, మెరుగైన మార్కెట్ సౌకర్యాలను కల్పించేందుకు పసుపు రైతులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. జిల్లాకు చెందిన ఆర్గానిక్ పసుపు రైతు లు అశోక్, లక్ష్మీనర్సయ్య, శ్రీదేవి, పాపారావు తదితరులు గవర్నర్ సమావేశంలో పాల్గొననున్నారు. ఆర్గానిక్ పంటను ప్రోత్సహిస్తూ పసుపు పంటకు మెరుగైన మార్కెట్ లింకేజీ సౌకర్యాలను కల్పించడంపై పసుపు రైతులతో చర్చించనున్నారు. అర్వింద్ ఫౌండేషన్ కార్యక్రమానికి.. ఎంపీ అర్వింద్ పుట్టినరోజు సందర్భంగా బర్దీపూర్ లో ఉన్న పీహెచ్ఆర్ కన్వెన్షన్లో ‘అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్’(ఏడీఎఫ్) నిర్వహించే కార్యక్రమంలో గవర్నర్ పాల్గొననున్నారు. చిన్నారుల వైద్య సహాయం, బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సహాయం కోసం ఏడీఎఫ్ ఫౌండేషన్ ద్వారా చెక్కులను లబ్ధిదారులకు అందజేయనున్నారు. భారీ బందోబస్తు నిజామాబాద్ అర్బన్: గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటన నేపథ్యంలో పోలీసుశాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. సుమారు 500 మంది సిబ్బంది బందోబస్తు విధులు నిర్వర్తించనున్నారు. ఆరుగురు ఏసీపీలు, 26 మంది సీఐలు, 52 మంది ఎస్సైలతోపాటు పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొంటారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక ఆంక్షలు అమలు చేయనున్నారు. జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని సందర్మించి.. ‘సునహరీ మిట్టి అభియాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న శివప్రతాప్ శుక్లా జిల్లాకు చెందిన ఆర్గానిక్ రైతులతో ప్రత్యేక సమావేశానికి ఏర్పాట్లు పసుపు మార్కెట్ లింకేజీ సౌకర్యాల కల్పనపై చర్చ.. ‘నషా ముక్త్ భారత్ అభియాన్’లో పాల్గొననున్న శుక్లా పర్యటన షెడ్యూల్ -
వార్డు మెంబర్ల కమిటీ అధ్యక్షుడిగా సతీశ్
వేల్పూర్(ముప్కాల్): ముప్కాల్ మండల వార్డు మెంబర్ల కమిటీ అధ్యక్షుడిగా కంచు సతీశ్ను సభ్యులు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా సురేశ్, దీపక్, రాజు, ప్రధానకార్యదర్శిగా ప్రదీప్, కోఆర్డినేటర్లుగా రాజేశ్వర్, మల్లయ్య, సలహాదారులుగా సాయిలు, సవిత, అంజలి, రాజు, సభ్యులుగా సవిత, మయూర్, రాజు, సోని, గంగాధర్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జిల్లా వార్డు మెంబర్ కమిటీ ఇన్చార్జి కర్బ సాయిలు, కో ఇన్చార్జి సిరికొండ కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. రేణుకా ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థలం వితరణ వేల్పూర్(బాల్కొండ): బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలో రేణుకా ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి గ్రామానికి చెందిన లింగన్న పాటిల్ ఆయన కుమారుడు వెంకటేశ్ స్థలాన్ని వితరణ చేసినట్లు బిజేపీ నాయకుడు అబ్బగోని అశోక్గౌడ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆలయ నిర్మాణానికి స్థలాన్ని వితరణ చేసిన లింగన్నపాటిల్, వెంకటేశ్కు గౌడ కులస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఇందల్వాయి: మండలంలోని గన్నారం గ్రామ శివారులోగల 44వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం వేకువజామున హైదరాబాద్ వైపు నుంచి నాగ్పూర్ వైపు వెళ్తున్న నారింజ పండ్ల లారీ బోల్తాపడింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని ఎస్సై సుమలత తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా టోల్ప్లాజా సిబ్బంది సహకారంతో లారీని తొలగించినట్లు ఎస్సై తెలిపారు. ఘనంగా తీజ్ ఉత్సవాలు నిజామాబాద్ రూరల్: జిల్లాకేంద్రంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్లో ఆదివారం తీజ్ కమిటీ ఆధ్వర్యంలో బంజారాల సంస్కృతికి అద్దం పట్టే తీజ్ ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి. ఈసందర్భంగా మహా భోగ్ బండార్, పూజా కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు మొలకెత్తిన (నవరాత్రులు) జవారాలను మహిళలు తలపై మోసుకెళ్లి, అమ్మవార్లకు భక్తితో సమర్పించారు. అనంతరం ప్రజలు భోగ్ బండార్ను తిలకించి, ప్రసాదం స్వీకరించారు. ఊరేగింపులో మహిళలు, యువతులు బంజారా సంప్రదాయ వస్త్రధారణలో నృత్యాలు చేస్తూ సందడి చేశారు. బంజార ప్రజలు, నాయకులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. తండాల్లో ఘనంగా తీజ్ డిచ్పల్లి/ నిజామాబాద్ రూరల్: డిచ్పల్లి మండలంలోని సాంపల్లి మేలయ తండాలో ఆదివారం తీజ్ వేడుకలను బంజారాలు ఘనంగా నిర్వహించారు. పెళ్లికాని యువతులు, మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. కార్యక్రమంలో తండాపెద్దలు పాల్గొన్నారు. మోపాల్ మండలంలోని కులాస్పూర్ తండాలో తీజ్ వేడుకలను తండా వాసులు ఘనంగా నిర్వహించారు. తండా నాయకులు బాలు నా యక్, శీను నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగ యువత ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
మాక్లూర్: పోలీసుశాఖ నిర్వహించనున్న ఉచిత పోలీస్ శిక్షణ కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సీపీ సాయిచైతన్య అన్నారు. పోలీస్ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో ఉన్న నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందుకోసం మండలంలోని దాస్నగర్ వద్దగల విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ హాజరై పరీక్ష తీరును పరిశీలించారు. స్క్రీనింగ్ టెస్ట్లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను ఎంపిక చేసి పోలీస్ కానిస్టేబుల్, ఇన్స్పెక్టర్ నియామక పరీక్షలకు అవసరమైన రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్స్పై పూర్తిస్థాయిలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు సంబంధిత అధికారి తెలిపారు. అదనపు డీసీపీ శుభం ప్రకాష్, ఎస్సైలు, సీఐలు తదితరులు పాల్గొన్నారు. మండలాల్లో ప్రజావాణి నిజామాబాద్అర్బన్: ఇక నుంచి ప్రతి సోమవారం మండలస్థాయిలో ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ భవేశ్ మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ విన్నపాలను మండలస్థాయిలో సమర్పించాలన్నారు. కాగా జిల్లాస్థాయిలో ప్రతి సోమవారం ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుందన్నారు. మండలస్థాయి అధికారులు విన్నపాలను స్వీకరించి త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలన్నారు. -
పదోన్నతులే ప్రధాన ఎజెండా
● నేడు తెయూ పాలకమండలి సమావేశం తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పాలక మండలి సమావేశం సెక్రటేరియట్(హైదరాబాద్)లోని ఉన్నత విద్యాశాఖ కార్యాలయంలో సోమ వారం జరగనుంది. వీసీ టీ యాదగిరిరావు అధ్యక్షతన నిర్వహించే ఉన్నతస్థాయి భేటీకి ఈసీ ఎక్స్అఫీషియో సభ్యులైన రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, కళాశాల విద్యాకమిషనర్ దేవసేనతోపాటు వర్సిటీ రిజిస్ట్రార్, నూతన ఈసీ సభ్యులు హాజరుకానున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీ నూతన పాలక మండలిని నియమించిన తర్వాత జరుగుతున్న మొదటి కీలక సమావేశం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. పదోన్నతులే.. గత రెండేళ్లుగా పాలకమండలి పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో క్యాంపస్లో పలు అభివృద్ధి పనులు, బడ్జెట్ ఆమోదం, కీలకమైన నిర్ణయాలు వంటివి నిలిచిపోయాయి. పాలనాపరమైన స్తబ్దత వీడేలా, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేలా నేటి భేటీలో స్పష్టమైన, కీలక నిర్ణయాలు తీసుకుంటారని వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు భావిస్తున్నారు. 2014 (2012–13) అద్యాపకుల పదోన్నతుల అంశమే ప్రధాన ఎజెండాగా ఈసీ సమావేశంలో చర్చించనున్నారు. తాము 13 ఏళ్ల నుంచి పదోన్నతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కనీసం షరతులతో కూడిన కండిషనల్ పదోన్నతులైనా కల్పించాలని అధ్యాపకులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే వీరి నియామకాలపై ఇటీవల చోటు చేసుకున్న ఘటనలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే నూతనంగా మంజూరైన ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకుల కొరత, బోధనేతర సిబ్బంది నియామకాలపై చర్చించనున్నారు. 2024–25, 2025–26 వార్షిక బడ్జెట్కు ఆమోదం, మహిళా హాస్టల్స్, బాయ్స్ హాస్టల్ నూతన భవన నిర్మాణాల పనుల పురోగతిపై చర్చ, అనుబంధ కళాశాలల అనుబంధ గుర్తింపు, పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. చీఫ్ సెక్రెటరీకి ఫిర్యాదు.. పాలక మండలికి వినతి తెలంగాణ యూనివర్సిటీలో 2014లో నియా మకమైన అధ్యాపకులకు పదోన్నతులు కల్పించవద్దంటూ 2012 నియామక ప్రక్రియ బాధితుడు ఆంగోత్ వెంకట్నాయక్ చీఫ్ సెక్రెటరీ సంజయ్ జాజుకు ఫిర్యాదు చేశారు. గతేడాది నియామకాలను రద్దు చేస్తూ ఇచ్చిన హై కోర్టు తీర్పుపై పాలకమండలిలో చర్చించకుండా ఏకపక్షంగా హై కోర్టులో అప్పీలుకు వెళ్లి, డివిజన్ బెంచ్లో కేసు పెండింగ్లో ఉండగా పదోన్న తులు కల్పించే ప్రయత్నంపై ఆయన ఫిర్యాదు చేశారు. అలాగే తెయూ పాలకమండలి సభ్యులను వ్యక్తిగతంగా కలిసి పదోన్నతుల అంశం తీర్మానాన్ని ఆమోదించవద్దని కోరినట్లు సమాచారం. -
పీసీసీ అధ్యక్షుడిని కలిసిన నాయకులు
మాక్లూర్: పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ను ఆదివారం జిల్లా కేంద్రంలో ఆలూర్ మండలం కల్లెడి గ్రామ కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. నాయకులు దేగ పోశెట్టి, గంగారాం, నీలగిరి శ్రీనివాస్, మహేశ్, కార్యకర్తలు ఉన్నారు. కోటగిరిలో వైద్య శిబిరం రుద్రూర్: కోటగిరి మండల కేంద్రంలోని వివేకానంద పాఠశాలలో రామకృష్ణ మఠం హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. శిబిరంలో 528 మంది రోగులకు వివిధ విభాగాల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బర్ల మధుకర్, కోనేరు శశాంక్, రామకృష్ణ మఠం గ్రామశ్రీ సేవల కోఆర్డినేటర్ వేణు, కోటగిరి రామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు గోగినేని శివశ్రీనివాస్, సభ్యులు హన్మంత్రావు, నితిన్చంద్ర, తోట శ్రీకాంత్, గర్దాస్ గంగాధర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణ పనులకు సహకారం రెంజల్: రెంజల్లో పునర్నిర్మాణం చేపడు తున్న విఠలేశ్వర్ ఆలయ పనులకు గ్రామంలో దాతలు విరాళాలను అందిస్తున్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు దాతలను సత్కరిస్తున్నారు. ఆదివారం గ్రామంలో విరాళాల సేకరణకు స్పందన లభించింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు అమ్రాది శేఖర్, ప్రతినిధులు అరవింద్రెడ్డి, తగిలేపల్లి పండరి రెడ్డి, భూంరెడ్డి, వేణు, ఇందిరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏకచక్రేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు బోధన్రూరల్: శ్రావణమాసాన్ని పురష్కరించుకుని పట్టణంలోని ఏకచక్రేశ్వర శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు అధికసంఖ్యలో ఆలయంలోని ప్రత్యేకాభిషేకా లు, పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ అర్చకులు గణేశ్ మహరాజ్, మహే శ్ పఠాక్, శివ కుమార్, పట్టణ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. -
పట్టణ రైతులకు యూరియా కష్టాలు
ఆర్మూర్: వర్షాలు సరిగా లేకున్నా భూగర్భ జలాలపై ఆధారపడి ఖరీఫ్లో పంటలు పండిద్దామని నడుం బిగించిన జిల్లాలోని పట్టణ ప్రాంత రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఫెర్టిలైజర్ యాప్లు కష్టాలను తెచ్చి పెట్టాయి. వ్యవసాయం పనుల్లో బిజీగా ఉండాల్సిన రైతులు రోడ్లెక్కి నిరసన తెలుపుతూ ప్రజాప్రతినిధులు, అధికారులకు వినతులు ఇస్తున్నారు. యూరియా, డీఏపీ, పొటాష్, కాంప్లెక్స్ ఎరువుల సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం మొదట ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ప్రవేశపెట్టింది. ఈ యాప్తోనే రైతులు ఇక్కట్లు పడుతుండగానే కేంద్ర ప్రభుత్వం ‘ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ యాప్’ను ప్రవేశపెట్టింది. ఈ నెల 6వ తేదీన కొత్త యాప్ అమలులోకి రాగా, నిజామాబాద్ నగరంతోపాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ పట్టణాల పరిధిలోని రైతుల రిజిస్ట్రేషన్ కావడం లేదు. దీంతో వరి, మొక్కజొన్న, సోయాబీన్ తదితర పంటలకు యూరియా దొరకక రైతులు రోడ్లెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు రెండు వేల సర్వే నంబర్లలో ఆరు నుంచి ఏడు వేల ఎకరాల్లో వ్యవసాయ భూములు ఉన్నాయి. అదే విధంగా నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్, భీమ్గల్ ము న్సిపాలిటీల పరిధిలో సైతం వ్యవసాయ భూమి వేల ఎకరా ల్లో ఉంది. పట్టణ ప్రాంత రైతుల యూరియా కష్టాలపై ఉన్నతాధికారులు స్పందిస్తూ.. త్వరలో మార్పులు చేస్తామని బుజ్జగిస్తున్నప్పటికీ సమస్య మరో వారం, పది రోజుల వర కు పరిష్కారమయ్యే పరిస్థితి లేదనే అభిప్రాయం వ్యక్తమవు తోంది. సకాలంలో యూరియా వేయకపోతే వరి, మొక్కజొ న్న పంటల దిగుబడి గణనీయంగా తగ్గిపోయి రైతులు నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయి. యూరియా యాప్లతో సంబంధం లేకుండా వ్యవసాయ భూమి ఆధారంగా ఎకరా నికి రెండు యూరియా బస్తాలను సొసైటీల ద్వారా సరఫరా చేయాలని పట్టణ ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డికి వినతి ఆర్మూర్ పట్టణానికి చెందిన ఆరు పంతల సంఘం రైతులు అంకాపూర్లో ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డిని ఆదివారం కలిసి సమస్యను వివరిస్తూ వినతిపత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు ఫోన్ చేసి సమస్యను వివరించారు. మంత్రి స్పందిస్తూ యాప్లో సాంకేతిక సమస్య ఉన్నందున ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేసిన వారిలో రైతు నాయకులు కలిగోట గంగాధర్, యామాద్రి భాస్కర్ పటేల్ తదితరులున్నారు. ఎఫ్ఎఫ్ఎస్ యాప్తో మున్సిపాలిటీల పరిధిలో ఎరువుల బుకింగ్కు ఇబ్బందులు నిజామాబాద్ నగరం, ఆర్మూర్, బోధన్, భీమ్గల్ పట్టణాల్లో అందని యూరియా నిరసనలు, వినతులతో పంట పొలాలను వీడి రోడ్లపైకి వస్తున్న రైతులు -
రైతు వేదికలో స్వచ్ఛ భారత్
ఆర్మూర్టౌన్: పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఉన్న రైతు వేదిక ప్రాంతాన్ని ఆర్మూర్ మహాత్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. రైతు వేదిక ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించారు. అనంతరం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతు వేదిక వద్దకు వెళ్లేందుకు సరైన మార్గం లేక పోవడంతో శుభ్రంగా చేశామన్నారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు సుంకె నిశాంత్, వేద జీడి రాజ్కుమార్, కుకింగ్ నరేశ్, గణేశ్, రమేశ్, వేణు, కృషివర్ధన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.ఉత్తమ అంగన్వాడీ టీచర్గా ప్రేమలత కమ్మర్పల్లి(మోర్తాడ్): ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన అంగన్వాడీ ఉపాధ్యాయురాలు ప్రేమలత ఉత్తమ అంగన్వాడీ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జీఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసై టీ ఆధ్వర్యంలోస్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో ప్రేమలత ఉత్తమ అంగన్వాడీ ఉపాధ్యాయురాలిగా ప్రశంసా పత్రం అందుకున్నా రు. విధి నిర్వహణలో చిన్నారులకు, గర్భిణు లు, బాలింతలకు మెరుగైన సేవలు అందించినందుకు గాను ఈ అవార్డును అందించినట్లు తెలిపారు. ప్రేమలతకు ఈఅవార్డు రావడంపై గ్రామస్తులు, అంగన్వాడీ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. సీపీఎస్ను రద్దు చేయాలి రుద్రూర్: సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ వి ధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వ ర్యంలో నిర్వహించిన జన జాగరణ యాత్రకు రుద్రూర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రా ష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన కేంద్రం టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు ఆదివారం హైదరాబాద్కు బయలుదేరారు. ఎల్బీ స్టేడియంలో లక్ష మందితో నిర్వహించే భారీ బ హిరంగ సభలో పాల్గొననున్నట్లు వారు తెలిపారు. సీపీఎస్ వల్ల ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రత దెబ్బతింటోందని పే ర్కొన్నారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కా ర్యక్రమంలో షేక్ ఈసా, అనిల్, మైముద్ అలీ, ఖదీర్, సాయిలు, వహీద్, లలిత, మంజుల తదితరులు పాల్గొన్నారు. ధ్వజస్తంభం ప్రతిష్ఠాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే వేల్పూర్: అంక్సాపూర్ సంతమల్లన్న ఆలయం వద్ద ఆదివారం నిర్వహించిన ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపనలో ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి పాల్గొన్నారు. గ్రామానికి చెందిన తుమ్మల ప్రతీశ్రెడ్డి దంపతులు ఏర్పాటు చేయించిన ధ్వజస్తంభానికి ఎ మ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించగా, వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రతిష్ఠించారు. అనంతరం సంతమల్లన్న స్వామిని ఎ మ్మెల్యే దర్శించుకున్నారు. కార్యక్రమంలో అంక్సాపూర్ సర్పంచ్ తీట్ల శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ పాశపు రాజేందర్రెడ్డి, బీఆర్ఎస్ రైతు విభాగం జిల్లా నాయకుడు మిట్టపల్లి మహిపాల్, సుంకెట పెద్దమల్లారెడ్డి, గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
జలసిరితో భూగర్భ జలాలు వృద్ధి
నందిపేట్: వర్షపు నీటిని వృథా చేయకుండా జలసిరితో భూగర్భ జలాలను వృద్ధి చేయాలని నందిపేట సర్పంచ్ ఎర్రం లింగం అన్నారు. మండల కేంద్రంలోని రాజనగర్ దుబ్బా ప్రాంతంలోని వస తి గృహం వద్ద వెర్టికల్ సోక్ పిట్ పనులను ఆదివారం ప్రారంభించారు. వెరిక్టర్ సోక్ పిట్ ఏర్పాటు చేయడం ద్వారా వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేసి భూగర్భ జలాల పెరుగుదలకు దోహదపడతాయని అన్నారు. భవిష్యత్తులో నీటి సంరక్షణకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ వాసరి రాంచందర్, వార్డు సభ్యులు కాంతం చిన్నయ్య, చింత శ్రీనివాస్, నాయకులు భాస్కర్, గంగన్న పాల్గొన్నారు. -
రేపు గవర్నర్ రాక
నిజామాబాద్అర్బన్: జిల్లాకేంద్రానికి ఈనెల 25న రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల రానున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం హెలికాప్టర్లో ఆయన బయలుదేరి, జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్కు చేరుకోను న్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా ఆర్అండ్బి గెస్ట్హౌజ్కు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి పోలీసు పరేడ్గ్రౌండ్కు చేరుకొని, యాంటిడ్రగ్ అవేర్నేస్ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే ఆర్యనగర్లోని పసుపుబోర్డు కార్యాలయంలో ని ర్వహించే వివిధ పరికరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. డిచ్పల్లి మండలం ధర్మారం వద్ద గల పీహెచ్ఆర్ కన్వెషన్లో నిర్వహించే సమావేశంలో పాల్గొని, అక్కడి నుంచి మళ్లీ కలెక్టరేట్కు వెళ్లనున్నారు. హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరిగి వెళ్లిపోతారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేస్తున్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక నిజామాబాద్అర్బన్: నగరంలో ఆదివారం బాసర జోన్ ప్రోహిబిషన్, ఎకై ్సజ్శాఖ హెడ్కానిస్టేబుల్, కానిస్టేబుల్ సంఘం నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. చైర్మన్గా చంద్రమోహన్, కై లాస్ పవర్ పోటీపడగా ఇద్దరికి సమాన ఓట్లు రావడంతో, డ్రా పద్ధతిలో కై లాస్ పవర్ చైర్మన్గా ఎన్నికయ్యా రు. వైస్ చైర్మన్గా లింబాద్రి ఎన్నికయ్యారు. కోశాధికారిగా చల్లబాబు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మ ల్, జగిత్యాల్ జిల్లాలకు చెందిన అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కార్యవర్గ సభ్యు లు ఓట్లు వేశారు. ఎలక్షన్ అధికారిగా విలాస్, బాలకిషన్ వ్యవహరించారు.‘22 ఏ’ భూములపై చర్చకు సిద్ధమా? నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ నగరం పరిధిలోని 22 –ఏ భూముల అంశంపై తా ను బహిరంగ చర్చకు సిద్ధమని, ఎక్కడికి రమ్మన్నా వస్తానని బీజేపీ జిల్లా అద్యక్షుడు దినేశ్పటేల్ కులాచారి అన్నారు. కాంగ్రెస్ నాయకులు చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆ దివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 22–ఏ అంశంపై పూర్తి అవగాహన, విషయ పరిజ్ఞానం ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరైనా చర్చకు రావొచ్చన్నారు. 22–ఏ కారణంగా పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల ను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు వెళ్లిన తమ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తు న్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల స మస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ప్రతి రాజకీయ పార్టీకి హక్కు అని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, ఫ్లోర్ లీడర్ ప్రమోద్కుమార్, డిప్యుటీ ఫ్లోర్ లీడర్ దాంపల్లి జ్యోతి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, కార్పొరే టర్లు, మోర్చాల నాయకులు పాల్గొన్నారు. ఎస్సారెస్పీలోకి స్వల్ప ఇన్ఫ్లో వేల్పూర్(మెండోరా): శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి స్వల్ప ఇన్ఫ్లో వస్తోంది. ఆదివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తుండడంతో 1013 క్యూసెక్కు ల ఇన్ఫ్లో రాగా.. రాత్రి సమయానికి 2,640 క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టులో ప్రస్తు తం 44.266 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసె క్కు లు, మిషన్ భగీరథ పథకానికి 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా.. 482 క్యూసెక్కుల నీరు ఆవిరిరూపంలో పోతోందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ‘సాగర్’లోకి 1,069.. నిజాంసాగర్(జుక్కల్): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఆదివారం సాయంత్రం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 1,069 క్యూసెక్కుల వరద వస్తోందని అధికారులు తెలిపారు. క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు దంచికొడుతుండటంతో ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతోందని పేర్కొన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు 17.8 టీఎంసీలకు గాను ప్రస్తుతం 1400.88 అడుగుల (12.330 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. -
పాదయాత్ర భక్తులకు అల్పాహారం
బోధన్ రూరల్: శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని లోకకల్యాణం, గ్రామాల అభివృద్ధి, ప్రజల సుఖసంతోషాలను కాంక్షిస్తూ మల్లారం గుట్ట లింగేశ్వర ఆశ్రమానికి మండలంలోని కల్దుర్కి, రాంపూర్, ఖండ్గావ్, సిద్ధాపూర్ గ్రామాలకు చెందిన భక్తులు పాదయాత్ర చేపట్టారు. ఆదివారం ఎరాజ్పల్లి గ్రామ కమాన్ వద్దకు చేరుకున్న భక్తులకు విజయలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్ యాజమాన్యం ఆధ్వర్యంలో అల్పాహారం అందించారు. భక్తులకు సేవ చేసే అవకాశం లభించడం సంతోషంగా ఉందని దాతలు బొందుగుల శ్రీనివాస్ గుప్తా, నాగరాజు గుప్తా, వెంకటేషం గుప్తా తెలిపారు. అల్పాహారం అందించిన దాతలను గ్రామస్తులు శాలువాలతో సత్కరించి అభినందించారు. శివభక్తులు, భజన మండలి మ హిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో జెండా జాతర
ఆర్మూర్టౌన్: పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో ఆదివారం సర్వసమాజ్ ప్రజాఐక్య సమితి ఆధ్వర్యంలో జెండా జాతరను ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్తో పాటు చుట్టుపక్కల ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి జెండాను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరిరఘు కుటుంబ సమేతంగా, ఈఆర్ ఫౌండేషన్ ఈర వత్రి రాజశేఖర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వ హించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సర్వసమాజ్ అధ్యక్షుడు కొట్టల సుమన్ అ న్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం సర్వసమాజ్ సభ్యులు జెండాను ప్రతి ఏడాది లాగే ఆర్మూర్ శివారులోని అంకాపూర్ గ్రామస్తులకు అందజేశారు. ఎ లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును నిర్వహించారు. కార్యక్రమంలో సర్వసమాజ్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. -
కష్టపడే వారికే ప్రాధాన్యత
● 70 శాతం పదవులు పాతవారికే.. ● వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు గెలిచి తిరిగి అధికారంలోకి వస్తాం ● టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్నిజామాబాద్ రూరల్: కాంగ్రెస్లో కష్టపడిన కార్య కర్తలకు పదవుల్లో ప్రాధాన్యత లభిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ అ న్నారు. జిల్లా కేంద్రంలోని లక్ష్మీ కల్యాణమండపంలో ఆదివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. మహేశ్కుమార్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీలో కింది స్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలకు కూడా పదవులు ఇవ్వాలని డిమాండ్ వస్తోందని, పదవుల భర్తీలో అన్ని వర్గాలకు సమతుల్యత పాటిస్తామన్నారు. కార్యకర్తల కృషితోనే పార్టీకి అధికారం వచ్చిందని, 70 శాతం పదవులను పాత కార్యకర్తలకే ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పార్టీ ఇన్చార్జీతో కలిసి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఏఐసీసీ స్థాయిలో అనుసరిస్తున్న విధా నం కూడా ఇదేనని పేర్కొన్నారు. ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్తోపాటు పార్టీని అంటిపెట్టుకుని పనిచేస్తున్న కార్యకర్తలకు తొలి ప్రాధాన్యత ఇస్తామ ని స్పష్టం చేశారు. మార్కెట్ కమిటీలకు సంబంధించి అప్రూవల్ ఇవ్వాలని మంత్రి సీతక్క సూచించారన్నారు. రాబోయే ఎన్నికల్లో సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో వంద సీట్లతో తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నగేశ్రెడ్డి, నగర డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, మానాల మెహన్రెడ్డి, ఈరవత్రి అనిల్, సునీల్కుమార్రెడ్డి, విపుల్గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
జిల్లాలో ఇందిరమ్మ టవర్స్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాకు ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం కేటాయించిందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ అన్నారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్యే భూపతిరెడ్డితో కలసి జిల్లాకేంద్రంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలోనే జిల్లా అభివృద్ధి చెందిందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటుతోపాటు మెడికల్ కళాశాల మంజూరైందన్నారు. ఇప్పుడు కూడా హైదరాబాద్ తర్వాత జిల్లాలోనే హైరైజ్ భవనాలను నిర్మించి పేదలకు ఇస్తామన్నారు. మొదటి విడతలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం చేపడుతామన్నారు. నిజామాబాద్ నగరా నికి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో ఇబ్బందులను అధిగమిస్తామని చెప్పారు. కార్పొరేషన్ హోదా ఉన్న నిజామాబాద్ను బీఆర్ఎస్ కనీసం స్మార్ట్సిటీగా చేయలేకపోయిందని విమర్శించారు. రానున్న రెండున్నరేళ్లలో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. సకల వసతులతో యంగ్ ఇండియా స్కూళ్లు అన్ని వర్గాల విద్యార్థులకు ఒకే చోట నాణ్యమైన ప్రభుత్వ విద్య అందించేందుకు యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపట్టామని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో కమీషన్లు, స్వార్థం కోసమే ప్రాజెక్టులు నిర్మించారన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్రెడ్డి, నగర డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నరాల రత్నాకర్, గన్రాజ్ తదితరులు పాల్గొన్నారు.మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, సుదర్శన్రెడ్డి, భూపతిరెడ్డి రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు వైఎస్సార్ హయాంలో యూనివర్సిటీ ఏర్పాటు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ -
మొక్కలు అందిస్తూ.. అవగాహన కల్పిస్తూ..
● ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో పచ్చదనం పెంచే లక్ష్యం ● ప్రతి ఇంటికి రెండు మొక్కల పంపిణీఆర్మూర్టౌన్: ప్రభుత్వం చేపడుతున్న వన మహోత్సవ కార్యక్రమం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో విజయవంతంగా చేపట్టేందుకు పాలకవర్గం ముందుకు సాగుతోంది. ఆర్మూర్ మున్సిపల్లో పర్యావరణ సంరక్షణ, హరితహారం లక్ష్యాల సాధనకు మున్సిపల్ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి ప్రారంభించారు. మున్సిపల్ పరిధిలోని 36 వా ర్డుల్లో ఇంటింటికి రెండు చొప్పున మొక్కలను ము న్సిపల్ చైర్పర్సన్ గోనెల లహరి, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, స్థానిక వార్డు కౌన్సిలర్లతో కలిసి ప్రజలకు అందించారు. మొక్కలు నాటి సంరక్షించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆర్మూర్ మున్సిపల్కు రెండు లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇప్పటి వరకు సుమారు 40 వేల మొక్కలు నాటామని మున్సిపల్ అధికారులు తెలిపారు. పండ్ల మొక్కలు, నీడనిచ్చే వేప, కానుగ, అల్లనేరేడు వంటి స్థానిక జాతు ల మొక్కలను ప్రజల అభిరుచి మేరకు అందజేస్తున్నారు. వాటిని సంరక్షించే బాధ్యత, రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి అందించాలంటే ప్రతి ఒక్క రూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని ప్రజ లకు సూచిస్తున్నారు. మున్సిపల్ పరిధిలోని కాలనీలు, పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల ఆవరణలు, ఖాళీ స్థలాల్లో విస్తృతంగా మొక్క లు నాటుతున్నారు. దీంతో ఆర్మూర్ వీధులు, పాఠ శా ల ప్రాంగణాలు ఆకుపచ్చగా మారేందుకు వి శేషంగా కృషి చేస్తున్నారు. వనమహత్సోవానికి జనరల్ ఫండ్ నుంచి రూ. ఐదు లక్షల నిధులు కేటాయించారు. టెండర్ ద్వారా, ఫారెస్ట్ శాఖ నుంచి మొక్క లు తీసుకోవడం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రత్యేక చర్యలు చేపట్టాం వనమహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నాం. నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలకు నాటి సంరక్షించాలి. మున్సిపల్ పరిధిలోని 36 వార్డుల్లో ఇంటింటికి రెండు మొక్కలను అందిస్తున్నాం. – ఽశ్రీహరిరాజు, మున్సిపల్ కమిషనర్ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి ఆర్మూర్ మున్సిపల్ పరిధిని పచ్చదనంతో కళకళలాడించడమే మా లక్ష్యం. మున్సిప ల్ ఆధ్వర్యంలో అందిస్తున్న రెండు మొక్కలను ప్రతి ఒక్కరూ నాటి, వాటిని సంరక్షించాలి. రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి అందించాలంటే మనం మొక్కలు నాటాలి. చెట్లు ఉంటేనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. – గోనె లహరిరఘు, మున్సిపల్ చైర్పర్సన్ -
అమ్మ ఒడిలో సురక్షిత ప్రయాణం
డొంకేశ్వర్ : గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులకు మెరుగైన, సురక్షితమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అమ్మ ఒడి–102’ ఉచిత వాహన సేవలు డొంకేశ్వర్ మండలంలో విజయవంతంగా కొనసాగుతున్నాయి. మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి ఆశా వర్కర్లు గర్భిణులను ఈ ప్రత్యేక వాహనం ద్వారా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పీహెచ్సీ) ఉచితంగా తీసుకువస్తున్నారు. ఆస్పత్రికి చేరుకున్న గర్భిణులకు వైద్యాధికారులు ఉచితంగా అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు, అవసరమైన మందులు అందజేస్తున్నారు. వైద్య, రక్త పరీక్షల ప్రక్రియ పూర్తయిన తర్వాత సదరు గర్భిణులను తిరిగి అదే వాహనంలో అత్యంత సురక్షితంగా వారి సొంత ఇళ్లకు చేరవేరుస్తున్నారు. గతంలో గ్రామాల నుంచి మండల కేంద్రంలోని ఆస్పత్రికి రావడానికి గర్భిణులు ఆటోలు, బై క్లపై వచ్చేవారు. ఆర్థికంగా భారం కావడమే కా కుండా ప్రయాణాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ప్రస్తుతం ‘అమ్మ ఒడి–102’ వాహన సేవలు అందుబాటులోకి రావడంతో గర్భిణులకు ప్రతీ వారం క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించు కోవడం ఎంతో సులువైంది. ఊచిత రవాణా సేవలపై గర్భిణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే వాహనంలో ఆస్పత్రుల్లో డెలివరీ కోసం తీసుకెళ్లడం, బిడ్డను ప్రసవించిన అనంతరం తిరిగి ఇంటికి తీసుకొచ్చి దింపడం లాంటి సేవలు సైతం అందుతున్నాయి.ఆటోలో వెళ్లి రావాలంటే కు దుపుల వల్ల భయంగా ఉంటుంది. ప్రభుత్వం గర్భిణు ల క్షేమాన్ని ఆలోచించి ఏ ర్పాటు చేసిన అమ్మ ఒడి వా హనాలు ఎంతో మేలు చేస్తున్నాయి. ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా ప్ర యాణించి వారం వారం వైద్య పరీక్షలు చేయించు కుంటున్నాం. – తొగరి మనుష, గర్భిణి, అన్నారం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అ మ్మ ఒడి ఉచిత వాహన సే వలతో గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా మంది గర్భిణులు పరీక్షలు చేయించుకోవడానికి వస్తున్నారు. ఇక్కడ వారికి ఉచితంగా రక్త పరీక్షలు, స్కానింగ్ నిర్వహించి అవసరమైన మందులు అందజేస్తున్నాం. – శరత్చంద్ర, మండల వైద్యాధికారి, డొంకేశ్వర్ గర్భిణులకు వరంగా మారిన 102 వాహన సేవలు ఉచితంగా ఆరోగ్య కేంద్రాలకు చేరవేత వైద్య పరీక్షల అనంతరం తిరిగి క్షేమంగా ఇంటి వద్దకు -
పీజీ పరీక్షలకు 132 మంది గైర్హాజరు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న పీజీ 2వ, ఐఎంబీఏ 8వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలకు 132 మంది గైర్హాజరైనట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ శనివారం తెలిపారు.పరీక్షలకు మొత్తం 2,009 మంది వి ద్యార్థులకు గానూ 1,877 మంది హాజరు కాగా 132 మంది గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. డిచ్పల్లి: ఫిలిప్పీన్స్ దేశ పర్యటన ముగించుకుని శనివారం జిల్లాకు వచ్చిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డికి డిచ్పల్లి మండల కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. డిచ్పల్లి నాగ్పూర్ గేట్ వద్ద పార్టీ మండల అధ్యక్షుడు అంబర్సింగ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ రాంచందర్గౌడ్, సర్పంచ్ విజయ్ చౌహాన్ తదితరులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సన్మానించారు. జక్రాన్పల్లి: జిల్లా కేంద్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని కలిసి మెమోరాండం సమ ర్పించడానికి వెళ్లిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, పార్టీ నాయకులను పోలీసు లు అరెస్ట్ చేయడం సరైంది కాదని పార్టీ మండల అధ్యక్షుడు కన్నెపల్లి ప్రసాద్ అన్నారు. శని వారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాల యంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం భూభారతిలో తీసుకొచ్చిన భూముల జాబితాలో దొర్లిన తప్పిదాలను సరి చేయాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన బీజే పీ నాయకులను అరెస్ట్లు చేయడం శోచనీయమన్నారు. సిరికొండ: మండలంలోని గోప్య తండా గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సర్పంచ్ బుక్యా మంజులసంతోష్నాయక్ తెలిపారు. చైర్మన్గా బుక్యా పరశురాం, వైస్ చైర్మన్గా హైదర్ బడే ఎన్నికయ్యారు. ఉప సర్పంచ్ రమేశ్, వార్డు సభ్యులు వినోద్కుమార్, మాజీ సర్పంచ్ రాంచందర్, తండావాసులు రాములు, శివరాం, సుమన్, హైదర్, బన్నాజీ, అంబర్లాల్, గజన్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. ● అనుమతించని అధికారులు నిజామాబాద్ రూరల్: గూపన్పల్లి శివారులో అభివృద్ధి పనుల ప్రారంభమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ శనివారం వచ్చారు. ఇళ్లు లేని తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ ఆర్టీసీ కాలనీవాసులు మంత్రి వద్దకు వస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. అధికారుల తీరుపై స్థానిక కార్పొరేటర్ చింత ప్రసునశ్రీనివాస్రెడ్డి, కాలనీవాసులు అసహ నం వ్యక్తం చేశారు. -
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
ఆర్మూర్టౌన్: యూరియా అందకపోవడంతో మొక్కజొన్న పంట ఎర్రబారి దెబ్బతింటోందని, గ త కొన్ని రోజులుగా యూరియా కొరత ఎదుర్కొంటున్నామని ఆర్మూర్ పట్టణ పరిధిలోని రైతులు శనివారం నిజాంసాగర్ కెనాల్పై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంటలను కాపాడేందుకు తక్షణమే సొసైటీ ద్వారా యూరియా అందజేయాలన్నారు. యాప్లో ఆర్మూ ర్ పేరు, సర్వే నంబర్లు, ఆధార్ కార్డు నంబర్లు చూపించకపోవడంతో పట్టణ పరిధిలోని తమకు యూరియా పంపిణీలో జాప్యం జరుగుతోందని, రైతు సంఘాల ప్రతినిధులు గత 10 రోజులుగా అధికారులకు విన్నవిస్తున్నా, ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా పరిష్కారం కావడం లేదన్నారు. యాప్కు సంబంధం లేకుండా తమకు అవసరమైన మేర యూరియా అందించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. అనంతరం రైతు ల ధర్నాను విరమించి సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మా ల్వియా వద్దకు వెళ్లి సమస్యను వివరించారు. ధర్నా కారణంగా నిలిచిపోయిన ట్రాఫిక్ను ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ సిబ్బందితో కలిసి క్లియర్ చేశారు. -
రాఖీ మెయిల్ బుకింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు
నిజామాబాద్ రూరల్: రక్షాబంధన్ నేపథ్యంలో సోదరీమణులు దూరప్రాంతాల్లోని తమ సోదరులకు రాఖీలు పంపించేందుకు భారతీయ తపాలా సేవలను వినియోగించుకోవాలని నిజామాబాద్ డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్ కె జనార్దన్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో కోరారు. రాఖీ మెయిల్ను సులభంగా బుక్ చేసుకునేందుకు నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డి హెడ్పోస్టాఫీసులను ఆదివారం, సెలవు దినాల్లో కూడా తెరిచి ఉంచి సేవలందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాఖీ మెయిల్ బుకింగ్పై పది శాతం ప్రత్యేక డిస్కౌంట్ అందుబాటులో ఉందని తెలిపారు. శక్తి స్కీమ్ను వెంటనే రద్దు చేయాలి ఖలీల్వాడి: పాలిటెక్నిక్ డిప్లొమా, ఐటీఐ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకోవడానికి ఉద్దేశించిన శక్తి స్కీమ్ను ప్రభుత్వం రద్దు చేయాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు ఆర్ గౌతమ్కుమార్, నగర అధ్యక్షుడు సిర్రం పవన్ డి మాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ పాలిటెక్నిక్ కాలేజీ వద్ద పీడీఎస్యూ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ సాంకేతిక విద్యను ప్ర యివేట్ పరం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని, పేద, మధ్యతరగతి విద్యార్థులు సాంకేతిక విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతోందని విద్యార్థి నాయకు లు ఆవేదన వ్యక్తం చేశారు. పీడీఎస్యూ నగర నాయకులు మహేశ్, హరికృష్ణ, ప్రమోద్, వంశీ, శ్రావణ్, బీరప్ప తదితరులు పాల్గొన్నారు. బాల్బ్యాడ్మింటన్ ఉమ్మడి జిల్లా జట్టు ఎంపిక ఆర్మూర్: తెలంగాణ రాష్ట్ర స్థాయి 45వ సబ్ జూనియర్ బాల్బ్యాడ్మింటన్ క్రీడా పోటీలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్టు ను ఎంపిక చేసినట్లు బాల్బ్యాడ్మింటన్ సంఘం జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రావణ్రెడ్డి, ప్ర ధాన కార్యదర్శి బోనగిరి శ్యాం శనివారం తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని విజయ్ హైస్కూల్ మైదానంలో ఎంపిక పోటీలు ని ర్వహించగా 130 మంది క్రీడాకారులు పోటీ పడగా.. ప్రతిభ కనబర్చిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారు లు ఈ నెల 28వ తేదీ నుంచి మూడు రోజులపాటు సంగారెడ్డి జిల్లా బీహెచ్ఈఎల్లో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని శ్రావణ్ తెలిపారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సునీత, కామారెడ్డి జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి, కోశాధికారి రాజేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ నాగేశ్, సభ్యులు సురేశ్, విజయ్ హైస్కూల్ కరస్పాండెంట్ కవిత దివాకర్, హెచ్ఎం రమాదేవి, సీనియర్ క్రీడాకారులు ఆనంద్, కార్తీక్, సాయికుమార్, శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు శ్యామల, మహేశ్, యూ మహేశ్, శివ, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్లోకి దూసుకొచ్చిన బీజేపీ శ్రేణులు
● సమావేశం గది ఎదుట బైఠాయింపు ● బీజేపీ, కాంగ్రెస్ నాయకుల వాగ్వాదం ● చెదరగొట్టిన పోలీసులు ● 30 మందిపై కేసు నమోదునిజామాబాద్ అర్బన్: నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివా స్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తుండగా బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా దూసుకొచ్చాయి. సెక్షన్ 22(ఏ) నిబంధనలో తప్పులు జరిగినట్లు ఒప్పుకున్న మంత్రి పొంగులేటి బాధ్యుడిగా రాజీనామా చేయాలంటూ హా ల్ ఎదుట బైఠాయించారు. ఆందోళన విషయం తె లుసుకున్న కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులపైకి దూసుకెళ్లారు. ఇరువురి మధ్య తీవ్ర తోపులా ట జరిగింది. మధ్యాహ్నం వేళ పోలీసులు భోజనం చేసేందుకు వెళ్లగా, అదే సమయంలో బీజేపీ నాయ కులు దూసుకురావడంతో ఉద్రిక్తత నెలకొంది. అక్కడే ఉన్న ఏసీపీ ప్రకాశ్ యాదవ్, రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్ అడ్డుకునే ప్రయత్నం చేసినా సాధ్యపడలేదు. వెంటనే స్పందించిన పోలీసులు సమావేశ మందిరం నుంచి బీజేపీ నాయకులను చెదరగొట్టుకుంటూ బయటికి లాక్కెళ్లారు. బీజేపీ జిల్లా అ ధ్యక్షుడు దినేశ్ పటేల్, కార్పొరేటర్ స్రవంతి రెడ్డి, ఇతర నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగా రు. అనంతరం నాయకులను అరెస్టు చేసి మాక్లూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా, కలెక్టరేట్లో నిరసన చేపట్టిన 30 మంది బీజేపీ నాయకులపై రూరల్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసులు నమోదై న వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, కార్పొరేటర్ స్రవంతి తదితరులు ఉన్నారు. -
వెంకన్న కొండకు ముడుపుల జెండా
● ఆర్మూర్ నుంచి తిరుమలకు జెండా బాలాజీ ప్రయాణం ● 220 ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ ● నేడు ఆర్మూర్లో జెండా జాతరఆర్మూర్ : పట్టణంలోని వేంకటేశ్వర ఆలయ ఆవరణలో ఉ న్న జెండా మందిరంలో ఆదివారం ఏకాదశిని పురస్కరించుకొని జెండా జాతర నిర్వహించనున్నారు. రెండు శతాబ్దాల క్రితం నుంచి జెండా జాతర ఆనవాయితీగా వస్తోంది. ఆర్మూర్ మండలం అంకాపూర్ కేంద్రంగా పాలన సా గించిన దొర గడ్డం వెంకట భూమారెడ్డి తిరుమల తిరు పతికి వెళ్లలేని భక్తుల కోసం ప్రారంభించినట్లు చెప్తుంటా రు. అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులతోపాటు ఆర్మూర్ సర్వసమాజ్ సభ్యు లు బాధ్యతగా భావించి భక్తి శ్రద్ధలతో కొనసాగిస్తున్నారు. ఆక్షేపణలను అధిగమించి.. నిజాం నవాబుల కాలంలో జెండా పండుగ నిర్వహణకు చాలా అడ్డంకులు ఉండేవని పెద్దలు చెబుతుంటారు. జాతర జరపాలంటే జెండా కర్రకు వారికి నచ్చే రంగు, గుర్తులు ఉండేలా ఆదేశించేవారని, అయినా కూడా ఇక్కడి ప్రజలు హిందూ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చినట్లు చెప్తుంటారు. జాతర కోసం తొమ్మిది రోజుల ముందు జెండా కర్రకు స్థానికంగా నేసిన 20 మీటర్ల పట్టు వస్త్రాన్ని ఉంచి దానిపై ఓం గుర్తును పెడతారు. జెండాను ప్రతిష్టించిన అనంతరం తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు, యజ్ఞం నిర్వహిస్తుంటారు. అనంతరం సర్వసమాజ్, ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జాతరను నిర్వహిస్తారు. ఆ తర్వాత ఊరేగింపుగా జెండా మందిరం నుంచి కాశీ హనుమాన్ వీధి, ఆలూర్ గైని, ధోబీఘాట్ మీదుగా అంకాపూర్ శివారు వరకు తీసుకెళ్లి అంకాపూర్ గ్రామస్తులకు అప్పగిస్తారు. అంకాపూర్లో 22 రోజులపాటు పూజలందుకుంటుంది. వినాయకచవితి తర్వాతి రోజు ఊరేగింపుగా జక్రాన్పల్లి మండలం అర్గుల్ వరకు తీసుకెళ్తారు. ఈ జెండాను గతంలో ముడుపులు కట్టి గ్రామగ్రామాన ఊరేగిస్తూ కాలినడకన తిరుమల తిరుపతిలోని వేంకటేశ్వర స్వామి ఆలయానికి చేర్చేవారు. ప్రస్తుతం ప్రత్యేక వాహనంలో జెండాను తరలిస్తున్నారు. నిజాం నవాబుల అడ్డంకులను ఎదుర్కొందీ జెండా. తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్లలేని భక్తుల కోసం ఏర్పడిందీ జెండా. 220 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ జెండాకు ముడుపు కడితే చాలు మొక్కులు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఆర్మూర్లో ప్రారంభమై తిరుమల తిరుపతికి చేరుకునే ఈ జెండా జాతరపై ‘ఆదివారం’ ప్రత్యేక కథనం..హిందూ సంప్రదాయ పరిరక్షణే లక్ష్యం హిందూ సంప్రదాయాలను పరిరక్షించడమే లక్ష్యంగా 1973 నుంచి ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నాను. ఆచారం ప్రకారం ముడుపులు కట్టి జెండాను తిరుమల వరకు చేర్చడం పూర్వజన్మలో చేసుకున్న సుకృతంగా భావించి భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. – జెండా సగ్వయ్ మధుకర్శర్మ, పూజారి, జెండా బాలాజీ మందిరం, ఆర్మూర్జెండాకు ఘన చరిత్ర నిజాములను ఎదురించి హిందూ సంప్రదాయాలను కొనసాగించిన ఆర్మూర్ ఘన చరిత్ర నేటికి జెండా రూపంలో కనబడుతూనే ఉంటుంది. ఆర్మూర్ ప్రాంత హిందూ భక్తుల ఆత్మస్థైర్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఏటా జెండా పండుగలో ఇంటిల్లిపాదిమీ పాలు పంచుకుంటాం. – పడాల్ మేయర్, భక్తుడు, ఆర్మూర్ పట్టణం -
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు
సుభాష్నగర్: ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు, ల్యాబ్లు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు త ప్పవని డీఎంహెచ్వో రాజశ్రీ హెచ్చరించారు. నిజామాబాద్ నగరంలోని పలు ప్రయివేట్ ఆస్పత్రుల ను డీఎంహెచ్వో శనివారం తనిఖీ చేశారు. ఎస్ఎస్ బాలాజీ ఆస్పత్రిలో పార్కింగ్ స్థలం, ర్యాంపు లేకపోవడంతోపాటు బయో మెడికల్ వ్యర్థాల తొలగింపు ధ్రువపత్రం లేకపోవడం, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను ప్రదర్శించకపోవడంపై మండిపడ్డారు. అలాగే అయ్యప్ప ఆస్పత్రి బోర్డుపై రిజిస్ట్రేషన్ నంబర్ ఏ ర్పాటు చేయలేదని, ఫారం–ఎఫ్లో సమాచారం అసంపూర్తిగా ఉందని యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాంబే నర్సింగ్ హోంలో పలు లోపాలను గుర్తించారు. డీఎంహెచ్వో వెంట సీఈఏ విభాగం అధికారులు సుప్రియ, రామకృష్ణ, ప్రవీణ్, కీర్తన, డీహెచ్ఈ వేణుగోపాల్, తదితరులు ఉన్నారు. -
బోధన్ డివిజన్లో విజృంభిస్తున్న డెంగీ
● ఇప్పటికే 25 కేసులు నమోదు ● అప్రమత్తమైన వైద్యాధికారులు బోధన్టౌన్(బోధన్): బోధన్ డివిజన్లోని గ్రామాలతోపాటు పట్టణంలో డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. పట్టణంతో పాటు డివిజన్ మొత్తంలో అధికారికంగా ఇప్పటికే 25 కేసులు నమోదు అయ్యాయి. రెంజల్, రుద్రూర్, పోతంగల్ మండలలతో పాటు ఇతర మండలాల్లో 19 కేసులు, పట్టణంలోని శక్కర్నగర్, రాకాసీపేట్, ఆటోనగర్, పాండుఫారంతోపాటు ఇతర కాలనీల్లో 6 డెంగీ కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన వైద్యాధికారులు గ్రామాలతోపాటు పట్టణంలో సర్వేలు నిర్వహించి, వైద్య చికిత్స అందిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతోపాటు వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు, దోమల బెడద గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణంలోఽ అధికమయింది. పారిశుద్ధ్య నిర్వహణ లోపం వల్ల అనేక మంది ప్రజలు విషజ్వరాల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. అయినా పారిశుద్ధ్యంపై సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కొత్తపల్లిలో ఒకరికి.. రుద్రూర్: కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో డెంగీ పాజిటివ్ కేసు నమోదైంది. గ్రామానికి చెందిన ఓ యువకుడికి డెంగీ పాజిటివ్గా నిర్ధారణ కావడంతో వైద్య సిబ్బంది అప్రమత్తమై, దోమల నివారణ చర్యలు చేపట్టారు. గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. -
బోధనకు సమయమేదీ?
● ప్రభుత్వ ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారం ● యాప్లు, ఆన్లైన్లో వివరాల నమోదుతోనే గడిచిపోతున్న సమయం సిరికొండ: ఒకప్పుడు పాఠ్యాంశాలు బోధిస్తూ తీరిక లేకుండా గడిపే ప్రభుత్వ ఉపాధ్యాయులకు నేడు బోధనేతర పనులతో బోధనకే సమయం దొరకడం లేదు. పాఠశాలకు ఉదయం వచ్చినప్పటి నుంచి యాప్, ఆన్లైన్ పనులతో కుస్తీ పడుతున్నారు. రా ష్ట్ర విద్యాశాఖతోపాటు జిల్లా, మండల స్థాయి అధికారులు అడిగే నివేదికలు పంపేందుకే ఉపాధ్యాయులు సమయం కేటాయిస్తున్నారు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందటం లేదనే విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి. పైతరగతికి పంపే పనితో ప్రారంభమై ఒకటవ తరగతిలో నూతన విద్యార్థుల నమోదు, ఇతర పాఠశాలల నుంచి వచ్చిన పిల్లలను చేర్చుకోవడం, వారికి సంబంధించిన సమగ్ర సమాచారం(జీపీ ఈపీఎఫ్పీ), టెక్ట్స్బుక్స్, నోటు బుక్స్, వర్క్ బుక్స్, ఏకరూప దుస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం వంటి పనులు మొదటి మూడు నెలలూ ఉంటాయి. అలాగే నాలుగు నిర్మాణాత్మక పరీక్షలు, రెండు సంగ్రహణాత్మక పరీక్షలకు సంబంధించి విద్యార్థుల వివరాలు నమోదు చేయాలి. దేనికెంత సమయం.. 20 నిమిషాలు : డీఎస్ఈ–ఎఫ్ఆర్ఎస్, 20 నుంచి 25 నిమిషాలు : రాగిజావ, 10 నుంచి 20 నిమిషాలు : కులాల వారీగా హాజరు, 1 నుంచి రెండు గంటలు : యూడైస్ బోధనకు మూడు గంటలే.. ఇటీవల విడుదల చేసిన విద్యా కమిషన్ నివేదికలో ఉపాధ్యాయులు బోధనేతర పనులతో కేవలం మూడు గంటలు మాత్రమే బోధనకు సమయం కేటాయిస్తున్నారని పేర్కొంది. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో ఒకరిద్దరూ ఉపాధ్యాయులు ఉన్నచోట ప్రధానోపాధ్యాయులు డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా మారిపోయారు. ఎఫ్ఎల్ఎన్కు సంబంధించి ఆన్లైన్ పనులు యూ డైస్, ప్రశస్త యాప్తో ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ప్రతిరోజు బోధనేతర పనులతో రెండు గంటల సమయం వృథా అవుతుంది. విముక్తి కల్పించండి రోజురోజుకూ పెరుగుతున్న ఆన్లైన్ పనులతో ఉపాధ్యాయులు తీవ్ర మా నసిక ఒత్తిడికి గురై బోధనపై దృష్టి పెట్టలేకపోతున్నారు. వీలైనంత వర కు బోధనేతర పనులు తగ్గించాలి. ప్రా థమిక పాఠశాల ఉపాధ్యాయుల కు బోధనేతర పనులతో కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కంప్యూటర్లను ఇవ్వాలి. – అంకం నరేశ్, పీఆర్టీయూ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు -
జిల్లా కేంద్రంలో పర్యటించిన మంత్రి
పాలిటెక్నిక్ విద్యార్థులతో మాట్లాడుతున్న మంత్రిసాక్షి నెట్వర్క్: జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి శనివారం ప్రారంభించారు. అనంతరం పాములబస్తీలో పర్యటించి ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులతో మాట్లాడారు. అలాగే కలెక్టరేట్ వెనుక భాగంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించి తక్షణమే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రూరల్ తహసీల్ కార్యాలయాన్ని అధికారులతో కలిసి ప్రారంభించారు. పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులు మంత్రిని కలిసి సమస్యలను విన్నవించారు. రాజీవ్గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
నగరంలో ఉచిత మెగా ఆరోగ్యశిబిరం
సుభాష్నగర్: లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఫోర్ట్ సిటీ, వాసవి క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో యశోద ఆస్పత్రి సౌజన్యంతో శనివారం నగరంలోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించారు. సుమారు మూడు వందల మందికి బీఎండీ, షుగర్, బీపీ, ఈసీజీ పరీక్షలను ఉచితంగా చేశారు. కార్యక్రమంలో లయన్స్ పూర్వ గవర్నర్ ఇరుకుల వీరేశం, జిల్లా కార్యదర్శులు డీ యాదగిరి, పీ లక్ష్మీనారాయణ, లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఫోర్ట్సిటీ అధ్యక్ష, కార్యదర్శులు పీ రవీంద్ర కుమార్ గుప్తా, శివరాజం, ప్రాజెక్టు చైర్మన్లు డీ నాగేశ్వరరావు, బిర్ల రామారావు, కోశాధికారి పెద్ది రాజేందర్, లయన్స్, వాసవి క్లబ్ ప్రతినిధులు రాఘవేందర్, చింతల గంగాదాస్, మండవ రామకృష్ణ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
నగరంలో ఇందిరమ్మ టవర్స్
రీ సర్వేపై రైతులు ఏమంటున్నారు?ఆదివారం శ్రీ 23 శ్రీ ఆగస్టు శ్రీ 2026– 8లో uనిజామాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలో హైదరాబాద్ తరహా ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తామని, మరో 10 నుంచి 20 రోజుల్లో కార్యాచరణను ప్రారంభిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం పర్యటించిన ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లబ్ధిదారులకు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోనూ స్థలం లేని వారికి ఇళ్లు కేటాయించేందుకు ప్రభుత్వ స్థలంలోనే ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటిని కేటాయించేలా చూస్తామన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేసి వారి ఆత్మ గౌరవాన్ని పెంపొందించడమే ప్రజాప్రభుత్వ సంకల్పమని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిర్మాణ వ్యయాన్ని తగ్గించేందుకు సిమెంట్ బ్యాగులు కేవలం రూ.230కి అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. లబ్ధిదారుల ఎంపికపై గతంలో విమర్శలు వ చ్చాయని, ప్రస్తుతం ఎలాంటి వివాదాలు లేకుండా అర్హులను ఎంపిక చేశారని అధికారులను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి అభినందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, మరిన్ని సంక్షేమ పథకాలు చేస్తుందన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో మరిన్ని ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామన్నారు. ఇందిరమ్మ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలన.. నగరంలోని నాగారం ప్రాంతంలో నిర్మించిన డబు ల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి ఉదయం ఏడు గంటలకే పరిశీలించారు. కలెక్టర్ భవేశ్ మిశ్రాతో మా ట్లాడి వివరాలు తెలుసుకున్నారు. లబ్ధిదారులకు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్లతోపాటు ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. అనంతరం 43వ డివిజన్ పరిధిలోని పాములబస్తీలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులతో మాట్లాడారు. ఇంటి నిర్మాణ పూర్తి చేసుకున్న లబ్ధిదారుకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాణంలో ఉన్న ఇంటిని పరిశీలించారు. ఆయనవెంట అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, నగర మేయర్ ఉమారాణి, హౌసింగ్ ఎండీ గౌతమ్, కలెక్టర్ భవేశ్ మిశ్రా, డీఆర్వో గీత, నుడా చైర్మన్ కేశ వేణు తదితరులు ఉన్నారు.రాజీవ్గాంధీ ఆడిటోరియంలో లబ్ధిదారుకు ఇందిరమ్మ ఇంటి మంజూరుపత్రాన్ని అందజేస్తున్న మంత్రి పొంగులేటి, పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ తదితరులునాగారంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే ధన్పాల్ప్రజలకు మరింత చేరువలో పరిపాలన నిజామాబాద్ రూరల్ : ప్రజలకు పాలన మరింత చేరువయ్యేందుకు ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నగరంలోని గూపన్పల్లి శివారులో రూ.2.25 కోట్లతో నిర్మించనున్న నిజామాబాద్ రూరల్, మోపాల్, ఇందల్వాయి తహసీల్ కార్యాలయాలు, రూ.కోటీ75 లక్షలతో నిర్మించనున్న భీమ్గల్, నిజామాబాద్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, రూ.2.22 కోట్లతో నిర్మించనున్న ఏర్గట్ల, డొంకేశ్వర్, సాలూర తహసీల్ కార్యాలయాలకు సంబంధించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆధునిక వసతులతో నిర్మించనున్న ఈ కార్యాలయాలు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన పరిపాలనా సేవలు అందించేందుకు దోహదపడనున్నాయన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించాలి పలువురు రెవెన్యూ అధికారులపై మంత్రి పొంగులేటి ఆగ్రహం రెవెన్యూ, గృహ నిర్మాణ కార్యక్రమాలపై ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష నిజామాబాద్ అర్బన్: జిల్లాలో చేపడుతున్న భూముల రీ సర్వేపై రైతులు ఏమంటున్నారని, ప్రభుత్వంపై వారి అభిప్రాయం ఎలా ఉందని రా ష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలో శనివారం పర్యటించిన మంత్రి.. రెవె న్యూ అంశాలు, గృహ నిర్మాణ కార్యక్రమాలపై ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధికా రులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ భారతి సదస్సులు సాదా బైనమా ఆర్జీలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలను ఇబ్బంది పెడి తే ఎంతటి వారిన ఉపేక్షించేది లేదని మంత్రి తేల్చి చెప్పారు. రీ సర్వే కొనసాగుతున్న గ్రా మాల్లో తహసీల్దార్లు తప్పనిసరిగా పాల్గొనాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రీ సర్వేను ఏడాదిలోగా కచ్చితంగా పూర్తి చేయాలని, లైసెన్డ్స్ సర్వేయర్ల సేవలు వినియోగించుకోవాలన్నారు. ప్రజల కోసమే తమ ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని, వారికి జవాబుదారీగా ఉండాలని మంత్రి స్ప ష్టం చేశారు. రెవెన్యూ అధికారులను ఆదేశించా రు. సర్వే, రిజిస్ట్రేషన్లపై సమాధానం చెప్పడంలో తడబడిన ఇందల్వాయి తహసీల్దార్ను మంత్రి దగ్గరికి పిలుచుకుని వివరాలు తెలుసుకున్నా రు. ఓ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ను ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశించిన మంత్రి.. ఆ అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. జక్రాన్పల్లి మండలం పరిధిలో ఫారెస్ట్కు సంబంధించిన భూ వివాదం గురించి తెలుసుకున్నారు. అలాగే నిజామాబాద్ రూరల్ తహసీల్దార్తో మాట్లాడి అసైన్మెంట్ భూముల వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో రీ సర్వేలో కలెక్టర్లు, రెవె న్యూ అధికారులు పాల్గొని అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ‘డబుల్’ ఇళ్లపై.. కలెక్టరేట్ సమీపంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను తక్షణమే పూర్తి చేసి హౌసింగ్ శాఖకు అప్పగించాలని సంబంధిత శాఖ అధికారులు ఆదేశించా రు. పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. నిధుల కొరత లేదని పనులు పూర్తయిన 24 గంటల్లోనే బిల్లులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్రెడ్డి, పోచారం శ్రీనివాస్రెడ్డి, పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్, ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, ధన్పాల్ సూర్యనారయణ, పైడి రాకేశ్రెడ్డి, రెవె న్యూ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ లోకేశ్కుమార్, స్పెషల్ సెక్రెటరీ రాజీవ్గాంధీ హనుమంతు, గృహనిర్మాణ సంస్థ ఎండీ గౌతమ్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు భవేశ్ మిశ్రా, ఆశిష్ సంగ్వాన్ తదితరులు పాల్గొన్నారు. పేదల సొంతింటి కల సాకారమే ప్రభుత్వ సంకల్పం సిమెంట్ బ్యాగును రూ.230కే అందిస్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి -
యువత భవిష్యత్తు కాపాడేందుకే రాహుల్గాంధీ తపన
నిజామాబాద్ రూరల్: యువత భవిష్యత్తును కాపాడేందుకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ తపన పడుతున్నారని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్ అన్నారు. శనివారం విఫుల్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో నిర్వహించిన ‘ఛాత్రోన్ గూంజ్’ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో కలిసి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పుణేలో నిర్వహించిన ‘ఛాత్రోన్ గూంజ్’’ లైవ్ కార్యక్రమాన్ని వీక్షించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్ రెడ్డి, మేయర్ ఉమారాణి, రామకృష్ణ, తాహెర్ బిన్ హందాన్, శేఖర్ గౌడ్, పీపీ దయాకర్ గౌడ్, మనాల మోహన్ రెడ్డి, నరాల రత్నాకర్, మజీద్ ఖాన్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఐఎంఏ షాపింగ్ కాంప్లెక్స్కు భూమిపూజ
సుభాష్నగర్: నిజామాబాద్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్కు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్రెడ్డి శనివారం భూమిపూజ చేశారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్న్పాల్ సూర్యనారాయణ, తాహెర్బీన్ హందాన్, పలు కార్పొరేషన్ల చైర్మన్లు చంద్రశేఖర్ గౌడ్, కవితారెడ్డి, మేయర్ ఉమారాణి, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, బొబ్బిలి రామకృష్ణ, కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్, ఐఎంఏ అధ్యక్షుడు విశాల్ ఆకుల, ప్రధానకార్యదర్శి హరీష్ స్వామి, కార్పొరేటర్లు, వైద్యులు, ఐఎంఏ ప్రతినిధులు పాల్గొన్నారు. -
మంత్రిని కలిసిన నాయకులు
డిచ్పల్లి: జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి శనివారం డిచ్పల్లి మండలం బర్ధిపూర్ శివారులోని కృష్ణ కాంటినెంటల్ హోటల్లో కొద్దిసేపు బస చేశారు. ఆయన వెంట రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఉన్నారు. మంత్రి శ్రీనివాస్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన డీసీసీ ఉపాధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ శాలువాతో సత్కరించారు. జక్రాన్పల్లి: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సొప్పరి వినోద్ డిచ్పల్లి మండలం ధర్మారంలో మర్యాద పూర్వకంగా కలిశారు. నిజామాబాద్అర్బన్: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి జిల్లా కేంద్రానికి రావడంతో రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ్రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. నాయకులు ప్రశాంత్, శ్రీనివాసరావు, బాలరాజు ఉన్నారు. నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం జిల్లా కేంద్రానికి వచ్చారు. ప్రయివేటు హోటల్లో రాత్రి బస చేశారు. అంతకుముందు కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ సాయి చైతన్యమంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని సీఐటీ యూ కార్యాలయంలో ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 24న నిర్వహించే రాష్ట్ర వ్యాప్త సమ్మెకు సంబంధించిన పోస్టర్లను శనివారం ఆవిష్కరించారు. నాయకులు ఏ రమేశ్ బాబు, ఉద్ధవ్, అబ్దుల్, వసీం, సాహెబ్ పాల్గొన్నారు. సిరికొండ: మండలంలోని గోప్యానాయక్ తండాలో సిరికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని సర్పంచ్ మాలావత్ సుబ్బరవినాయక్ ప్రారంభించారు. ఉపసర్పంచ్ బంకట్లాల్, జీపీ కార్యదర్శి సుమన్, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు, మాజీ సర్పంచ్ శంకర్లాల్ పాల్గొన్నారు.


