Nizamabad District Latest News
-
అమ్మకు అక్షరమాలపై అవగాహన కల్పించాలి
● అమలు తీరుపై అధికారుల సమీక్షబోధన్: ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ ఆఫ్ లైప్లాంగ్ లర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) కార్యక్రమం కింద అమవుతున్న అమ్మకు అక్షరమాల కార్యక్రమం ప్రాధాన్యతపై నిరక్షరాస్యులకు అవగాహన కల్పించాలని జిల్లా వయోజన విద్య ఉపసంచాలకులు పురుషోత్తం సూచించారు. సోమవారం ఎడపల్లిలో వయోజన విద్య ఉద్యోగ, సిబ్బందితో కార్యక్రమం అమలు తీరుపై సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 15 నుంచి 60 ఏళ్ల వయస్సు గల నిరక్షరాస్యులను గుర్తించి ఉల్లాస్ యాప్లో వారి పేర్లను నమోదు చేయాలన్నారు. కార్యక్రమం అమలులో అన్ని విభాగాల అధికారులతో సమన్వయంతో పని చేయాలన్నారు. మండలంలో ఎఫ్ఎల్ఎన్ఏటీ(ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అసిస్మెంట్ టెస్ట్–పునాది అక్షరాస్యత , సంఖ్యా అంచనా పరీక్ష) ఇటీవల నిర్వహించగా, 1074 మందికిగాను 1038 మంది పరీక్షలకు హజరయ్యారని తెలిపారు. అనంతరం స్థానిక తహసీల్దార్ దత్తాద్రిని కలిసి కార్యక్రమం అమలు తీరు పై చర్చించారు. వివిధ శాఖల అధికారులు ఏపీవో అరుంధతి, ఏపీఎం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
కథంతా కమీషన్ చుట్టే..
మాక్లూర్ మండలం నుంచి కదలని ధాన్యం బస్తాలుమాక్లూర్: ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభు త్వం ప్రారంభించి అధికారులపై వదిలేసింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. ధాన్యం కాంటా, లోడింగ్కు కూలీలు ఎప్పటిలాగే సంచికి రూ.15 కమీషన్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నా.. కొందరు అధికారులు మాత్రం రూ.17 నుంచి రూ.18 వసూలు చేయాలని అటు కూలీలపై, ఆ మొత్తాన్ని చెల్లించాలని రైతులపై ఒత్తిడి చేస్తున్న ట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సంచికి తమకు రూ.2 నుంచి రూ.3 చెల్లించాలని అప్పు డే కాంటా చేయిస్తామని అధికారులు కండీషన్ పెడుతున్నట్లు సమాచారం. తాము కమీషన్ అధికంగా వసూలు చేసి మీకెందుకు ఇవ్వాలని కూలీ లు అసలు కొనుగోలు కేంద్రాలకు రాని పరిస్థితి ఏర్పడింది. అటు రైతులు సైతం ఎప్పటిలాగే రూ.15 చెల్లిస్తామని చెబుతుండడంతో ధాన్యం కాంటా నిలిచిపోయింది. మాక్లూర్ సొసైటీ పరిధిలో సుమారు 15 రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగా.. ఇప్పటి వరకు ఒక్క గుంజ్లి కొనుగోలు కేంద్రంలో మాత్రమే కాంటా చేస్తూ ధాన్యాన్ని తరలిస్తున్నారు. ఇక్కడి రైతులు కమీషన్ రూ.18 వరకు చెల్లిస్తుండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం తరలుతోంది. కమీషన్ కండీషన్ పెట్టిన వారిలో ఒకరైన ఓ అధికారి తన సొంత లారీల ద్వారా ధాన్యాన్ని తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మండలంలోని ముల్లంగి(బి), గుత్ప, మా క్లూర్తోపాటు అదనంగా మరో 10 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గుంజ్లి కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం తరలుతుండగా.. మిగ తా 12 చోట్ల మాత్రం రైతులకు పడిగాపులు తప్ప డం లేదు. చాలా కొనుగోలు కేంద్రాలకు ఇప్పటికీ హమాలీలు రాలేదు. కొన్ని కేంద్రాల్లో కొంత మేర ధాన్యం కాంటా అయినప్పటికీ అక్కడి నుంచి త రలించలేదు. ఒక్క గుంజ్లి కొనుగోలు కేంద్రం నుంచి మాత్రమే ఇప్పటి వరకు ధాన్యాన్ని రైస్మిల్లులకు తరలించారని, మిగతా కొనుగోలు కేంద్రాల్లో ఎందుకు కాంటా చేయడం లేదని రైతు లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు కురుస్తుండడంతో ధాన్యం తడవకుండా కాపాడు కునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. అధికారుల తీరుతో విసుగెత్తిన చాలా మంది రైతులు ఇప్పటికే ప్రైవేట్ వ్యక్తులకు ధాన్యాన్ని విక్రయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి మాక్లూర్ సొసైటీ పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో రూ.15 కమీషన్తో కాంటాలు జరిపించాలని రైతులు కోరుతున్నారు. హమాలీల కొరత వల్లే.. హమాలీల కొరత తీవ్రంగా ఉండటం వల్లే సంచికి రూ.15 బదులు రూ.18 కమీషన్ ఇవ్వాలని చెబుతున్నాం. ఇందులో మాకు రావాల్సింది ఏమీ ఉండదు. రూ.15 కమీషన్కు హమాలీలు ముందుకు రావడం లేదు. సంచికి రూ.18 చెల్లిస్తామంటేనే వస్తామంటున్నారు. అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చేసేది లేక సంచికి రూ.18 కమీషన్ ఇస్తామని చెప్పి హమాలీలను తీసుకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయం రైతులతో చెప్పాం. – స్వప్న, మాక్లూర్ సొసైటీ క్లస్టర్ అధికారిణి సంచికి రూ.17 నుంచి రూ.18 కమీషన్ చెల్లిస్తేనే కాంటా.. లేదంటే ఎక్కడి కుప్పలు అక్కడే లేబర్ చార్జీల్లోనూ కక్కుర్తి పడుతున్న అధికారులు! దిక్కుతోచని స్థితిలో రైతులు -
రైతన్నకు కడగండ్లు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో అకాల వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. 20 రోజుల వ్యవధిలో మూడుసా ర్లు పంటలను నష్టపోవడం రైతుల పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రకృతి ప్రకోపానికి జిల్లావ్యాప్తంగా 9,460 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మొత్తం 6,793 మంది రైతులకు నష్టం వాటిల్లింది. పంట చేతికి వచ్చే సమయంలో వడగళ్లతో కురిసిన అకాల వర్షం కారణంగా కలిగిన నష్టానికి ప్రభుత్వం పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో అత్యధికంగా వరికి నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, మామిడి, అరటి, బొప్పాయి. కూరగాయలు తదితర పంటలు కొద్దిమేర విస్తీర్ణంలో దెబ్బతిన్నాయి. అకాల వర్షం, వడగళ్ల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఈనెల 5వ తేదీన ఓ ప్రకటన విడుదల చేశారు. రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ● ఈ నెల 5వ తేదీన కురిసిన అకాల వర్షం, వడగళ్లతో సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, డిచ్పల్లి, సాలూర మండలాల్లోని 22 గ్రామాల పరిధిలో 3,985 మంది రైతులకు చెందిన 6,088 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో అత్యధికంగా వరి 5,065 ఎకరాల్లో, మొక్కజొన్న 826 ఎకరాల్లో, మామిడి 138 ఎకరాల్లో, అరటి, కూరగాయలు 10 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. ● గత నెల 31వ తేదీన కురిసిన అకాల వర్షానికి 14 మండలాల్లో 2,209 మంది రైతులకు చెందిన 2,559 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మామిడి, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో 95 శాతం వరి పంటే దెబ్బతినడం గమనార్హం. మార్చి 31వ తేదీన నిజామాబాద్ మార్కెట్ యార్డులో తడిసిన పసుపు కుప్పలుమార్చి 31న వీచిన ఈదురుగాలులకు నందిపేట మండలం బజార్కొత్తూర్లో నేలకొరిగిన నువ్వు దెబ్బ మీద దెబ్బ కొడుతున్న ‘అకాలం’ 20 రోజుల వ్యవధిలో మూడుసార్లు కన్నెర్రజేసిన ప్రకృతి జిల్లావ్యాప్తంగా 9,460 ఎకరాల్లో పంట నష్టం అత్యధికంగా నష్టపోయింది వరి రైతులే.. ఈ నెల 18, 19 తేదీల్లో వడగళ్లతో కురిసిన అకాల వర్షం కారణంగా సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో 599 మంది రైతులకు చెందిన 813 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నది. సిరికొండ మండలంలోని 9 గ్రామాల పరిధిలో 526 మంది రైతులకు చెందిన 691 ఎకరాల్లో, ధర్పల్లి మండలానికి చెందిన ఒక గ్రామంలో 28 మంది రైతులకు చెందిన 62 ఎకరాల్లో, ఇందల్యి మండలంలోని రెండు గ్రామాల్లో 45 మంది రైతులకు చెందిన 60 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. -
సర్కారు బడుల్లో సౌరకాంతులు
● జిల్లాలో 392 పాఠశాలల ఎంపిక ● 2 నుంచి 10 కిలో వాట్ల వరకు ● కిలో వాట్కు రూ.లక్ష చొప్పున నిధులు ఖలీల్వాడి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్ సమస్యను దూరం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నాబార్డు నిధులతో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు నిర్ణయించింది. ఫలితంగా విద్యుత్ బి ల్లుల భారం తప్పడమే కాకుండా అదనపు ఆదా యం సమకూరే అవకాశం ఉంది. జిల్లాలోని 392 పాఠశాలల్లో కొత్తగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, ప్రభుత్వ, జెడ్పీహెచ్ఎస్, మండల పరిషత్, ప్రాథమికోన్నత, ప్రాథమిక స్కూళ్లు ఉన్నాయి. త్వరలో మిగితా వాటిలో కూడా ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే టెండర్లు.. పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే విద్యుత్ సంస్థకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. సోలార్ విద్యుత్ ఏర్పాటుతో ప్రభుత్వానికి బిల్లుల భారం తగ్గనుంది. సోలార్ ప్యానెల్స్ ద్వారా ఒక్కో పాఠశాలలో రెండు కిలోవాట్స్ విద్యుదుత్పత్తి చేయనున్నారు. ఒక కిలోవాట్కు రూ.50 వేల చొప్పున రెండింటికి కలిపి రూ.లక్ష వరకు ఖర్చవుతోంది. నిర్వహణ ఖర్చులను ప్రభుత్వం భరించనుంది. ఐదు సంవత్సరాలపాటు సంస్థతో నిర్వహణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. త్వరలో ఇందుకు సంబంధించిన టెండర్లను ఆహ్వానించి పనులు ప్రారంభించనున్నారు. కాగా, సోలార్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ను పాఠశాలల్లో అవసరం మేరకు వినియోగించుకొని, మిగిలిన విద్యుత్ను గ్రిడ్ ద్వారా విక్రయించే అవకాశం ఉంది. దీంతో పాఠశాలకు అదనపు ఆదాయం వస్తుంది. వచ్చిన నిధు లను పాఠశాల అభివృద్ధికి కేటాయించనున్నారు. మండలం పాఠశాలల సంఖ్య ఆలూర్ 07 ఆర్మూర్ 28 బాల్కొండ 09 భీంగల్ 16 బోధన్ 21 చందూర్ 01 ధర్పల్లి 12 డిచ్పల్లి 21 డొంకేశ్వర్ 03 ఇందల్వాయి 14 జక్రాన్పల్లి 15 కమ్మర్పల్లి 12 కోటగిరి 03 మాక్లూర్ 09 మెండోరా 07 మోర్తాడ్ 08 మోస్రా 03 మోపాల్ 16 నందిపేట్ 14 నవీపేట్ 15 సిరికొండ 15 వేల్పూర్ 14 వర్ని 09 ఎడపల్లి 16 ఏర్గట్ల 04 మండలాల వారీగా పాఠశాలలు సర్కారు బడులకు మేలు జిల్లాలో 392 పాఠశాలలకు సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు వచ్చాయి. ఈ నిర్ణయంతో స ర్కారు బడులకు మేలు జరగనుంది. పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ వీటి నిర్వహణ చేపట్టనుంది. కొన్ని పాఠశాలల్లో ఇదివరకు పైలెట్ ప్రాజె క్ట్ కింద ఏర్పాటు చేశారు. అది విజయవంతంగా కొనసాగుతున్నాయి. – పార్శి అశోక్, డీఈవో, నిజామాబాద్ -
క్రీడలతో మానసిక, శారీరక చైతన్యం
● జిల్లా జడ్జి భారతలక్ష్మి ● అట్టహాసంగా నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ –2026 ప్రారంభంనిజామాబాద్ అర్బన్: మానసిక, శారీరక చైతన్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని జిల్లా జడ్జి భారతలక్ష్మి అన్నారు. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ – 2026’ను జిల్లా కేంద్రంలోని ఉమె న్స్ కళాశాల గ్రౌండ్లో న్యాయమూర్తి సోమ వారం ప్రారంభించారు. ఉద్యోగుల్లో ముఖ్యంగా పోలీస్, న్యాయశాఖ వంటి శాఖల్లో ఉద్యోగులు విధి నిర్వహణలో ఎంతో ఒత్తిడి లోనవుతారని, ఇటువంటి పరి స్థితుల్లో శారీరక, మానసిక ఉత్సాహం కోసం ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. సీపీ సాయిచైతన్య, అదనపు ఎన్ఎస్ఈ కన్వీనర్, డీసీపీ (అడ్మిన్) జి బస్వారెడ్డి, అదనపు డీసీపీ (ఏఆర్) రామచంద్రరావు, ఎన్ఎస్ఈ జనరల్ సెక్రెటరీ డాక్ట ర్ కవితారెడ్డి , ట్రెజరర్ సంతోష్, స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్రెడ్డి, జాయింట్ సెక్రెటరీ రజనీకాంత్, శివప్రసాద్, దుశ్శంత్, ఎన్ఎస్ఈ ఎగ్జిక్యూటీవ్ మెంబర్లు పాల్గొన్నారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధ న్, సీటీసీ ట్రాఫిక్ ఏసీపీలు ప్రకాశ్, వెంకట్రెడ్డి, శ్రీనివాస్, రాజశేఖర్, మస్తాన్ అలీ, ఫోర్త్ అడిషనల్ జడ్జి దుర్గాప్రసాద్, సెకండ్ అడిష నల్ జడ్జి నారాయణ, పీడీఎం గోపీకృష్ణ, సీఐలు, ఎస్సైలు, అడ్వకేట్లు తదితరులు పాల్గొన్నారు. మొదటి మ్యాచ్లో పోలీస్ టీమ్ విన్ మొదటి మ్యాచ్లో న్యాయశాఖ జట్టుపై 44 పరుగు ల తేడాతో పోలీస్ టీమ్ గెలుపొందింది. మొదట పోలీస్ జట్టు బ్యాటింగ్చేసి 8 ఓవర్లలో ఒక వికెట్ కోల్పొయి 81 పరుగులు చేసింది, అనంతరం బ్యా టింగ్ చేసిన న్యాయశాఖ జట్టు 8 ఓవర్లలో కేవలం 37 పరుగులుచేయగా, 44 పరుగుల తేడాతో పోలీస్ జట్టు విజయం సాధించింది. -
ఆర్టీసీలో సమ్మె సైరన్!
● సంస్థ రక్షణ, డిమాండ్ల సాధన కోసం పోరుబాట ● రేపటినుంచి సమ్మెలోకి..● ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి. ● 2021 వేతన సవరణను 30 శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలి. 2025 వేతన సవరణ చేపట్టాలి. ● మహాలక్ష్మి డబ్బులు రూ. 400 కోట్లను నెలనెలా విడుదల చేయాలి. ● ఆర్టీసీ స్థలాలను ఈవీ బస్సుల కంపెనీలకు ఇవ్వొద్దు. ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలి. ● ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి. ● ఆర్టీసీ ఉద్యోగులపై పనిభారం తగ్గించాలి. కండక్టర్, డ్రైవర్లపై కేఎంపీఎల్, ఏపీకే వేధింపులు మానుకోవాలి. ● 2019సమ్మె కేసులను ఎత్తేయాలి. ● రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి. ● సంస్థలో అన్ని కేటగిరీలలో ఖాళీలను భర్తీ చేయాలి.సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)లో చాలాకాలం తర్వాత కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. ఆర్టీసీ రక్షణ, సమస్యల పరిష్కారమే ఎజెండాగా తెలంగాణ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నుంచి సమ్మెకు దిగుతున్నారు. ఒత్తిడిలో కార్మికులు... కామారెడ్డి డిపోలో 129 బస్సులు, బాన్సువాడ డిపోలో 94, ఆర్మూర్ డిపోలో 94 బస్సులు, బోధన్లో 118, నిజామాబాద్–1 డిపోలో 123, నిజమాబాద్–2 డిపోలో 89 కలిపి మొత్తంగా 647 బస్సులు నడుస్తున్నాయి. బస్సులు దాదాపు రోజూ 2.50 లక్షల కిలోమీటర్ల దూరం తిరుగుతుండగా, రూ. కోటిన్నర ఆదాయం వస్తోంది. అయితే ఖర్చులు తగ్గించుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం టిమ్స్ డ్యూటీలు పెంచుతూ ఇబ్బంది పెడుతోందని జేఏసీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎనిమిది గంటలకు బదులు 12 నుంచి 16 గంటల దాకా పనిచేయిస్తున్నారని, స్పెషల్ ఆప్ కూడా ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు. విరామం లేకుండా పనిచేయాల్సి రావడంతో డ్రైవర్లు, కండక్టర్లు ఇబ్బందులు పడుతున్నారంటున్నారు. మరోవైపు బస్సుల్లో 55 మంది ప్రయాణించా ల్సి ఉండగా మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చాక వంద నుంచి 120 మంది దాకా ప్రయాణిస్తున్నారు. దీంతో కండక్టర్లతోపాటు డ్రైవర్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల డ్రైవర్లకే టికెట్ ఇచ్చే బాధ్యత ఉండడంతో వాహనం నడుపుతూ టికెట్లు ఇవ్వాల్సి రావడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనిభారంతో కార్మికులు మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడుతున్నారని పేర్కొంటున్నారు. -
ఆదర్శం.. నూత్పల్లి
సోమవారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026– 8లో uనూత్పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం నూత్పల్లి.. ఎస్సారెస్పీలో ముంపునకు గురైన గ్రామాల్లో ఇదొకటి. డొంకేశ్వర్ మండలంలో ఉన్న ఈ గ్రామ పంచాయతీ ఇప్పుడు మోడల్ విలేజ్ను తలపిస్తోంది. దశాబ్దాల క్రితమే వేసిన మాస్టర్ ప్లాన్కు తోడుగా ఉపాధిహామీ పథకాన్ని వందశాతం ఉపయోగించుకొని అభివృద్ధికి బాటలు వేసుకుంది. వాణిజ్య పంటలు, పొలాల్లో కల్లాలు, విశాలమైన రోడ్లు, ఇంటికో చెట్టు, వీడీసీ వ్యవస్థ రద్దు, ప్లాస్టిక్ నిషేధం లాంటి నిర్ణయాలు గ్రామాన్ని జిల్లాలోనే ప్రత్యేకంగా నిలబెట్టాయి. పాలకుల సహకారం, ప్రజల భాగస్వామ్యంతో నూత్పల్లి ముందుకు దూసుకుపోతున్నది. డొంకేశ్వర్(ఆర్మూర్): శ్రీరామసాగర్ ప్రాజెక్టులో ముంపునకు గురైన నూత్పల్లి గ్రామాన్ని ఎగువ ప్రాంతంలో నిర్మించుకున్నారు. భవిష్యత్ను ఆలోచించి 1978లోనే ఇంజినీర్తో మాస్టర్ ప్లాన్ తయారు చేయించి ఇళ్ల స్థలాలు, రోడ్లను ఏర్పాటు చేసుకున్నారు. ఆనాడే ఇళ్లను విశాలంగా, ఒక క్రమ పద్ధతిలో నిర్మించుకున్నారు. పర్యావరణంపై మక్కువతో ప్రతి ఇంటి ఎదుట వేపచెట్లను పెంచి గ్రామాన్ని పచ్చదనంతో నింపేశారు. ఓపెన్ జిమ్, సొసైటీ గోదాములు, కమ్యూనిటీ భవనాలు, పాఠశాలలు, బ్యాంకులు సైతం ఏర్పడ్డాయి. ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవడంలో ఈ గ్రామం జిల్లాలో ముందున్నది. ఉపాధిహామీ పథకంతో ఊరిలో అన్ని వీధుల్లో సీసీ రోడ్లు నిర్మించుకున్నారు. జిల్లాలో మరెక్కడా లేని విధంగా రైతుల సౌకర్యార్థం వారి తోటల్లోనే పంటలు ఆరబోసుకోవడానికి వందల్లో సీసీ కల్లాలు, పదుల సంఖ్యలో పశువుల షెడ్లు నిర్మించుకోవడం గమనార్హం. ఐహెచ్హెచ్ఎల్ పథకంలో భాగంగా ఇంటింటికీ మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, తోటలకు మట్టి రోడ్లు నిర్మించుకున్నారు. వాణిజ్య పంటలు సాగు చేయడంలో నూత్పల్లి రైతులకు ప్రత్యేకత ఉంది. వంద ఎకరాల్లో పసుపు, మక్క, జొన్న, సజ్జ, ఆయిల్పాం, వరి పంటలు పండిస్తూ ఆర్థి కంగా ఎదుగుతు న్నారు. ఇప్పుడు ప్రతి రైతు ఇంటి ఎ దుట ఒక ట్రాక్టర్, కారు ఉంది. డొంకేశ్వర్ మండలంలోని నూత్పల్లి గ్రామ ముఖచిత్రంవీడీసీ రద్దు చేసి.. ప్లాస్టిక్ను నిషేధించి..గ్రామంలో అందరూ సమానమే అన్న భావనతో, ఎవరి పెత్తనం ఉండకూడదని కొన్ని నెలల కిందట వీడీసీ వ్యవస్థను రద్దు చేసుకున్నారు. దీంతో గ్రామ పంచాయతీ ద్వారానే ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించి ఆదర్శంగా నిలిచారు. శుభకార్యాల్లో భోజనాల కోసం స్టీల్ ప్లేట్లు, గ్లాసులను గ్రామ పంచాయతీ ఉచితంగా అందిస్తోంది. దశాబ్దాల క్రితమే మాస్టర్ప్లాన్తో ఊరి నిర్మాణం విశాలమైన సీసీ రోడ్లు, ఇంటికో వేప చెట్టు ధాన్యం ఆరబోసేందుకు రైతుల తోటల్లో కల్లాలు ఉపాధి హామీ పథకాన్ని వందశాతం ఉపయోగించుకున్న ఏకై క గ్రామంగా పేరు ఇటీవల వీడీసీ వ్యవస్థ రద్దు, ప్లాస్టిక్ నిషేధంతో ప్రత్యేక గుర్తింపు -
సమష్టి కృషితోనే సుస్థిర అభివృద్ధి
పాలకుల సహకారం, ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామం ఇంతటి అభివృద్ధి సాధించింది. కలిసికట్టుగా తీసుకుంటున్న నిర్ణయాలతో ఊరిలో ఏ భేదాభిప్రాయాలు లేవు. వీడీసీ రద్దు, ప్లాస్టిక్ నిషేధం వంటి నిర్ణయాలు ప్రజల పూర్తి సహకారంతోనే సాధ్యమయ్యాయి. ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి పని చేయడానికై నా గ్రామ పంచాయతీ సిద్ధంగా ఉంది. – సుకరంటి రాజారెడ్డి, సర్పంచ్ ఉపాధిహామీతో ఊరే మారిపోయింది దశాబ్దాల క్రితమే మాస్టర్ ప్లాన్ రూపొందించుకోవడం మా అదృష్టం. నేను సర్పంచ్గా పనిచేసిన కాలంలో ఉపాధిహామీ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాం. ఏ గ్రామంలో లేని విధంగా సీసీ రోడ్లు, కల్లాలు, ఇతర అభివృద్ధి పనులతో ఊరి రూపురేఖలు మారిపోయాయి. – కూనింటి రవి, మాజీ సర్పంచ్ గ్రామ వీధుల్లో ఇళ్ల ముందు వేప చెట్లు -
నేడే రెండో విడత రైతు భరోసా
మోర్తాడ్(బాల్కొండ): రెండో విడత రైతు భరోసా సొమ్మును రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం సోమ వారం జమ చేయనుంది. పాత విధానానికి పూర్తిగా భిన్నంగా ఈసారి రైతు భరోసా సొమ్మును విడుదల చేస్తున్నారు. గతంలో మొదటి రోజు ఒక ఎకరంలోపు వారికి, రెండో రోజు రెండు ఎకరాలలోపు వారికి, మూడో రోజు మూడు ఎకరాల వరకు అంటూ పెట్టుబడి సాయాన్ని జమ చేసేవారు. ఈసారి తొలి విడతలో ఎన్ని ఎకరాలు ఉన్నవారికై నా ఒక ఎ కరం వరకు పెట్టుబడి సాయాన్ని ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేశారు. రెండో విడతలో రెండో ఎకరానికి, మూడో విడతలో మూడో ఎకరానికి అని ప్రభుత్వం వెల్లడించింది. మార్చి 23న తొలి విడత పెట్టుబడి సాయాన్ని విడుదల చేయగా, జిల్లాలోని 2,69,476 మంది రైతుల ఖాతాల్లో రూ.1,34,95,15,004 సొమ్మును జమ అయ్యింది. తొలి విడత సాయం అందించిన నెల రోజులకు రెండో విడత సొమ్మును విడుదల చేయనుండటం గమనార్హం. యాసంగి సీజన్ పంటలు చేతికి వచ్చే దశలో రైతు భరోసా సొమ్మును విడుదల చేస్తుండటంతో వచ్చే వర్షాకాలం సీజన్ ఏర్పాట్ల కోసం ఉపయోగపడుతుందని రైతులు భావిస్తున్నారు. అనేక మంది రైతులు భూసారం పెంచేందుకు నల్లమట్టి, పశువుల పేడను కొనుగోలు చేస్తారు. ఈ నేపథ్యంలో రైతు భరోసా సొమ్ము చేతికి అందుతుండటంతో కొంతైనా సద్వినియోగం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండో ఎకరానికి పెట్టుబడి సాయాన్ని జమ చేయనున్న ప్రభుత్వం పాత విధానానికి భిన్నంగా సాయం వర్షాకాలం పంటలకు పనికొస్తుందంటున్న రైతులు -
మత్తు పదార్థాలతో కుటుంబాలపై తీవ్ర ప్రభావం
నిజామాబాద్అర్బన్: మత్తు పదార్థాల వినియోగంతో కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని డీ అడిక్షన్ మెడిసిన్ స్పెషాలిటీ సెక్షన్ చైర్మన్ డాక్టర్ విశాల్ పేర్కొన్నారు. రాజస్థాన్లోని జైపూర్లో ఆదివారం ఇండియాన్ సైకియాట్రిక్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన పాల్గొని దేశంలో పెరుగుతున్న మత్తుపదార్థాల వినియోగం, ప్రవర్తన, వ్యసనాల సమస్యపై ప్రసంగించారు. ఆల్కాహాల్తో ఏటా ప్రపంచవ్యాప్తంగా 30 లక్షలు, పొగాకు వాడటంతో 80 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించిన డాక్టర్ అంకం గణేశ్ నిజామాబాద్ రూరల్ : మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ నగరంలో ఈ నెల 17, 18, 19 తేదీల్లో నిర్వహించిన ఇండియన్ అకాడమీ ఆఫ్ ఆర్థోసర్జన్ (ఐఏవోఎస్) ఐదో జాతీయ సదస్సులో జిల్లాకు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ అంకం గణేశ్ ప్రసంగించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన 350కి పైగా ప్రముఖ వైద్యుల సమక్షంలో తన క్లినికల్ అనుభవం, ఆధునిక వైద్య విధానాలను ప్రదర్శించారు. అత్యంత క్లిష్టమైన కీలక కేసులను ప్రెజెంట్ చేయడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందవచ్చని పేర్కొన్నారు. ఇందూర్ లలితకు ఉపాధ్యాయ ప్రేరణ అవార్డు బోధన్: బోధన్ పట్టణంలోని తట్టికోట ప్రభు త్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు ఇందూర్ లలిత రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ ప్రేరణ అవార్డు –2026ను అందుకున్నారు. హైదరాబాద్కు చెందిన శారద ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యతోపాటు వివిధ రంగాల్లో ప్రతిభచాటుతూ సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన రాష్ట్రస్థాయిలో 50 మందికి పైగా ఉపాధ్యాయులు, మహిళలను అవార్డుకు ఎంపిక చేసింది. ఆదివారం హైదరాబాద్లోని బిర్లా ప్లానిటోరియం హాల్లో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం చేతుల మీదుగా లలిత అవార్డు అందుకున్నారు. బాన్సువాడ : బీర్కూర్ మండలం భైరాపూర్ సహకార సంఘం కార్యాలయానికి ఆదివారం రైతులు తాళం వేసి నిరసన తెలిపారు. సొసైటీ పరిధిలో ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు చేయడం లేదని, ఇతర గ్రామాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తూ సొసైటీ కార్యాలయానికి తాళం వేశారు. వారం రోజులుగా సొసైటీ కార్యదర్శి విధులకు హాజరుకావడం లేదని, ఫోన్ చేసినా స్పందించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై ధాన్యం కుప్పలు ఉన్నాయని, వాతావరణంలో మార్పులు వస్తుండడంతో ఆందోళనగా ఉందని పేర్కొంటున్నారు. వెంటనే కాంటాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. -
ప్రశాంతంగా మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష
ఖలీల్వాడి: మోడల్ స్కూళ్లలో ప్రవేశం కోసం ఆదివారం జిల్లా కేంద్రంలోని 11 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు డీఈవో పార్శి అశోక్ తెలిపారు. ఉదయం ఆరో తరగతి, మధ్యాహ్నం ఏడు నుంచి పదో తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. ఆరో తరగతి విద్యార్థులు 1,365 మంది దరఖాస్తు చేసుకోగా 1,220 మంది హాజరయ్యారు. ఏడు నుంచి పదో తరగతి విద్యార్థులు 977 మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు 837 మంది హాజరయ్యారు. ఆర్మూర్, బాల్కొండ మోడల్ స్కూళ్లలోని పరీక్ష కేంద్రాలను డీఈవో పరిశీలించారు. మాచారెడ్డి : వడదెబ్బతో ఓ రైతు ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన ఆదివారం పా ల్వంచ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామస్తు లు తెలిపిన వివరాలిలా ఉ న్నాయి. పాల్వంచ గ్రామాని కి చెందిన చాకలి మల్లయ్య(46) ఇటీవల వరి కోసి ధాన్యాన్ని కల్లంలో ఆరబోశాడు. మూడు నాలుగు రోజులుగా ఎండలో ధాన్యాన్ని ఆరబెడుతూ వడ దెబ్బకు గురయ్యాడు. ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై వడ్లపైనే కుప్పకూలిపోయాడు. దీంతో అతడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య శంకరమ్మ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వడదెబ్బతో మరణించిన రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ శేఖర్ ప్రభుత్వాన్ని కోరారు. ముందే వికసించిన ‘మే’ పుష్పం ఖలీల్వాడి: ప్రకృతి ప్రేమికులను కనువిందు చేసే ‘మే’ పుష్పం ముందే వికసించింది. నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ హెడ్మాస్టర్ మాడవేడి పవన్ కుమార్ ఇంట్లో ఉన్న మొక్కకు రెండు పూలు పూశాయి. వాతావరణంలోని మార్పులతో నెల ముందుగానే మే పుష్పాలు వికసిస్తుంటాయి. ఈ అరుదైన పుష్పాల ను కాలనీవాసులు ఆసక్తిగా తిలకించారు. -
పల్లె ఖజానాకు గండి
● మూడేళ్లలో రూ.7.91 కోట్లకు లెక్కల్లేవ్ ● లెక్క తప్పుతున్న ఖర్చులు ● పలు పంచాయతీల్లో అక్రమాలు డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): జిల్లాలోని పలు గ్రామపంచాయతీల ఖర్చులు లెక్క తప్పుతున్నాయి. నిధులు భారీగా దుర్వినియోగవవుతున్నా యి. దుర్వినియోగమైన సొమ్మును ఖజానాలో జమ చేయించేలా ఆడిట్ శాఖ ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు త మకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా గత మూడేళ్లలో 16,621 అభ్యంతరాలకు సంబంధించి రూ.7.91 కోట్లకు లెక్కలు లేకుండాపోయాయి. పలు పనుల్లో అక్రమాలు 2023–24 ఆర్థిక సంవత్సరంలో జక్రాన్పల్లి మండలం అర్గుల్లో 20 అభ్యంతరాలకు సంబంధించి రూ.2.27 లక్షలకు లెక్కలు లేకుండా పోయాయి. అలాగే మునిపల్లిలో రూ. 1.79 లక్షలకు, తొర్లికొండలో రూ.41,620 సొమ్ముకు లెక్కలు లేవు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో కూడా జక్రాన్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో అవకతవకలు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. 2024–25 సంవత్సరంలో జక్రాన్పల్లి మండలంలో ప్రత్యేక అధికారి పాలనలో పడకల్ గ్రామ పంచాయతీలో రూ.55,684 సొమ్ముకు లెక్కలు లేవని ఆడిట్ అధికారులు తేల్చారు. ఇదే గ్రామంలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.7.31 లక్షల సొమ్ము దుర్వినియోగమైంది. ఇలా పరిశీలిస్తూ వెళ్తే జిల్లాలోని చాలా మండలాల్లో వందల సంఖ్యలో అభ్యంతరాలకు సంబంధించి రూ.లక్షల నిధులకు లెక్కలు లేకుండా పోయాయి. సర్పంచులతోపాటు ప్రత్యేక అధికారుల పాలనలో కుడా అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆడిట్ నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. సంవత్సరం ఆడిటెడ్ జీపీలు అభ్యంతరాలు లెక్కలో లేని నిధులు 2022-23 530 7,308 1,93,42,669 2023-24 530 5,940 4,13,23,336 2024-25 530 3,373 1,54,46,503 16621 7,91,12,508ప్రతి ఏటా లక్షల్లో అక్రమాలుగ్రామ పంచాయతీలు సక్రమంగా పనిచేస్తే ప్రజలకు రోడ్లు, మురికి కాల్వలు, మౌలిక సదుపాయాలు సమకూరుతాయి. కానీ కొంతమంది సర్పంచులు ప్రజల సొమ్మును అప్పనంగా మింగేశారు. ఫలితంగా వేలల్లో ఆడిట్ అభ్యంతరాలు నమోదవుతున్నాయి. ఆడిట్శాఖ ప్రతి ఏడాది మే నెల నుంచి పంచాయతీలలో ఆడిట్ నిర్వహించి డిసెంబర్లో ప్రతి గ్రామపంచాయతీకి సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించి ఉన్నతాధికారులకు సమర్పిస్తుంది. 60 రోజుల్లో సరైన బిల్లులు చూపించకపోతే చర్యలు తీసుకోనే అవ కాశం ఉంది. అయితే జిల్లాలో గత మూడేళ్లలో 16,621 అభ్యంతరాలకు సంబంధించి రూ.7.91 కోట్లకు లెక్కలు లేకుండా పో యాయి. సరైన బిల్లులు, ఆధారాలు చూపెట్టడంలో గ్రామ కార్యదర్శులు విఫలమవుతున్నారు. చాలా చోట్ల పనులు జరగకున్నా ఎంబీ రికార్డులు సృష్టించి బిల్లులు లేపుతున్నారు. -
అంబేడ్కర్ ఆశయాలను సాధిద్దాం
తెయూ(డిచ్పల్లి):ప్రపంచ మేధావి,భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలను సాధిద్దామని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జా తీయ కార్యవర్గ సభ్యుడు జీవన్ అన్నారు. ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇటీవల అంబేడ్కర్ జయంతి వేడుకల సందర్భంగా క్రీడోత్సవ్–2026 నిర్వహించగా,ఆదివారం వర్సిటీ కా మర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో బ హుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించా రు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. సమాజంలో పేద, ధనిక,చిన్నకులం, పెద్ద కులం అని తేడాలు ఉండవద్దని, అందరం భర తమాత బిడ్డలమని, అందరికీ సమాన హక్కులు ఉండాలనే ఉద్దేశంతో అంబేడ్కర్ గొప్ప రాజ్యాంగం రచించారన్నారు. గౌరవ అతిథిగా హాజరైన దంతవైద్యుడు, యశ్వి డెంటల్ హాస్పిటల్ అధినేత డాక్టర్ ప్రతాప్ నాయక్ మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ముఖ్యమేనని తెలిపారు. అనంతరం వివిధ క్రీడాపోటీల్లో గెలిపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఏబీవీపీ ప్రతినిధులు శివ, పృథ్వీ, సమీర్, అనూష, హర్షవర్ధన్, అమృత్చారి, అశోక్, అక్షయ్, మోహన్, మనోజ్, అనిల్, లెనిన్, విఘ్నేష్, మహేష్, అఖిల్, దుర్గాదాస్, సూర్య, కార్తీక్, విగ్నేష్, కిరీటి పాల్గొన్నారు. -
బోనమెత్తిన పోచారం
వర్ని: మోస్రా మండల కేంద్రంలో ఆదివారం మహాలక్ష్మి అమ్మవారికి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను నిర్వహించారు. కార్యక్రమంలో బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి పాల్గొని, మహిళలతో కలిసి బోనం ఎత్తారు. గ్రామ ప్రధాన వీధుల గుండా బోనాలతో శోభాయా త్ర నిర్వహించారు. అనంతరం మహాలక్ష్మి అమ్మవారికి బోనాలను సమర్పించారు. గ్రామ దేవతల ఆశీస్సుల వల్ల పాడిపంటలు సమృద్ధిగా పండి, ప్రజలు ఆయురారోగ్యాలతో విలసిల్లుతున్నారని పోచారం వెల్లడించారు. సంఘ అధ్యక్షుడు బిల్ల రాజశేఖర్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి పిట్ల శ్రీరాములు, వర్ని ఏఎంసీ వైస్ చైర్మన్ లక్ష్మణ్, వీడీసీ అధ్యక్షుడు పోతరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ సాయిగౌడ్, నాయకులు గుత్ప విజయభాస్కర్రెడ్డి పాల్గొన్నారు. రెంజల్(బోధన్): మండలంలోని బోర్గాం గ్రా మంలో ఆదివారం అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా వ్యవసాయ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామంలోని స్వాధ్యాయ పరివారులు గ్రామం నుంచి ట్రాక్టర్లు, జోడెడ్లతో అరక, నాగలి వెంట తీసు కుని వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్లారు. అక్కడ పూజలు నిర్వహించి భూమిపూజ చేశారు. నేడు తెయూ పాలకమండలి పరిచయ కార్యక్రమంతెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి (ఈసీ) సభ్యులుగా ప్రభుత్వం ద్వారా నామినేట్ అయిన నూతన సభ్యుల పరిచయ కార్యక్రమాన్ని(గెట్టుగెదర్) సోమవా రం నిర్వహించేందుకు వర్సిటీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈమేరకు వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి నూతన ఈసీ మెంబర్లను వర్సిటీకి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. వీరి ఆహ్వానం మేరకు తెయూ పరిపాలనా భవనంలోని ఎగ్జిక్యూటివ్ హాల్లో సోమవారం ఉదయం 11.30 గంటలకు నూతన ఈసీ మెంబర్లు ఒకచోట కలువనున్నారు. అనంతరం ఈసీ మెంబర్లను సన్మానించనున్నారు. ఈసీ మెంబర్లు సీహెచ్ ఆంజనేయులు, ఆర్.సుధాకర్గౌడ్, కే.సంజీవరావు, దండు స్వామి, మదన్ మోహన్ దేవబక్తుని, చెరుకూరి రజినీకాంత్ (కాకతీయ విద్యాసంస్థలు), అల్లె లావణ్య, మహమ్మద్ ఘాజీ, ఎస్.జయంత్ తెయూకు రానున్నారు. నిజామాబాద్ రూరల్: జిల్లా వంజరి సంఘ కా ర్యవర్గ సమావేశం మామిడిపల్లి వంజరిసంఘ కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మాస్టర్ శంకర్, ప్రధాన కార్యదర్శిగా ధాత్రిక వేణుగోపాల్, కోశాధికారిగా కరిపే మధుసూదన్ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు శంకర్ మాట్లాడుతూ.. త్వరలోనే పూర్తి స్థాయి జిల్లా కమిటీని నియమిస్తానని తెలిపారు. కార్యదర్శి గంగోనే మల్లేష్, కోశాధికారి నవతే నర్సయ్య పాల్గొన్నారు. -
అగ్ని ప్రమాదాలపై అవగాహన ఉండాలి
నిజామాబాద్అర్బన్: ప్రతిఒక్కరూ రోడ్డు ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి పరమేశ్వర్ అన్నారు. నగరంలో ఆదివారం ఆగ్నిమాపకశాఖ వారోత్సవాల సందర్బంగా వాహనాల ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా పరమేశ్వర్ మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాలపై ముందస్తు జాగ్రత్తలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. అగ్నిమాపక శాఖ అధికారి శంకర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం కామారెడ్డి అర్బన్: కామారెడ్డి చరిత్ర తెలిపే ప్రాచీన కోడూరి ఆంజనేయస్వామి ఆలయం జీర్ణోద్ధరణ అనంతరం ఆదివారం భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం విజయవంతమైందని వేదపండితులు ఆంజనేయశర్మ అన్నారు. ఆలయ కమిటీ పిలుపు మేరకు వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు, భక్తులు దాదాపు వెయ్యి మంది ముందుకు వచ్చి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు హన్మాన్ చాలీసా సామూహిక పారాయణం 101 సార్లు చేయగా అదే సమయంలో స్వామివారికి విశేషపూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని శబరిమాత ఆశ్రమంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శబరిమాత దివ్యసమాధి, ప్రతిమ, చిత్రపటాన్ని రకరకాల పూలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపించారు. తాడ్వాయి నుంచే కాకుండా ఇతర గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. -
హిందుత్వమే దేశానికి శ్రీరామరక్ష
నిజామాబాద్ రూరల్: హిందుత్వమే దేశానికి శ్రీరామరక్ష అని ఇందూర్ విభాగ్ సహ సంఘ్ చాలక్ పాలేటి వెంకట్రావ్ అన్నారు. నగరంలోని లక్ష్మీప్రియనగర్లో ఆదివారం నిర్వహించిన హిందూ సమ్మేళనంలో వెంకట్రావు ప్రధాన వక్తగా హాజరై మాట్లాడారు. ఇంట్లోని పిల్లలకు మన సంస్కృతి సంప్రదాయాలతోపాటు క్రమశిక్షణ, పెద్దలను గౌరవించడం వంటి లక్షణాలు నేర్పించాలని కోరారు. అలాగే ఆర్యనగర్లో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత గ్రామ వికాస్ సహ సంఘటక్ వేంపల్లి ప్రతాప్ హాజరై, మాట్లాడారు. విశ్వ కల్యాణం హిందూ ధర్మంతోనే సాధ్యమన్నారు. గాయత్రినగర్లో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో వరంగంటి శ్రీనివాస్ ప్రధాన వక్తగా హాజరై, మాట్లాడారు. మానవాళి హితమే మన హితం అని భావించిన దే శం భారత్ అని అన్నారు. అనంతరం హంపి విద్యారణ్య విరూపక్ష జగద్గురు శంకరాచార్యులు ఆశీర్వాద ప్రసంగం చేస్తూ.. ప్రతి మహిళ సంస్కృతిని, సభ్యతను భావితరాలకు అందచేయాలన్నారు. ప్ర తినిధులు భార్గవ్, రామకృష్ణ, వెంకట కృష్ణ, దాసరి గంగాధర్, శ్రీనివాస్, భూమేశ్వర్ పాల్గొన్నారు. -
ఎన్ఎఫ్బీఎస్ బాధ్యతలు ఎంపీడీవోలకు..
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం రెంజల్(బోధన్): జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్ఎఫ్బీఎస్) బాధ్యతలను ఎంపీడీవోలకు బదలాయిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ పథకం తహసీల్దార్ల పరిధిలో ఉండేది. ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులు ముందుగా అన్ని ధ్రువీకరణ పత్రాలతో మీసేవల్లో దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ శాఖ అధికారులు పరిశీలించి అన్నీ సవ్యంగా ఉంటే క్షేత్రస్థాయిలో విచారించి అమోదం కోసం ప్రభుత్వానికి సమర్పించేవారు. తహసీల్దార్లకు క్షేత్రస్థాయిలో పని ఒత్తిడితోపాటు విచారణలోనూ తీవ్ర జాప్యం తలెత్తడంతో దరఖాస్తులు పెండింగ్లో ఉంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. సమస్యను అధిగమించేందుకు పథకానికి సంబంధించిన పూర్తి బాధ్యతలు, నిధుల విడుదలను ఎంపీడీవోల పరిధిలోకి తీసుకొచ్చింది. పథకం వివరాలు.. నిరుపేద కుటుంబంలోని ప్రధాన సంపాదనపరుడు మృతి చెందితే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం జాతీయ కుటుంబ ప్రయోజన పథకాన్ని అమలు చేస్తోంది. మరణించిన వ్యక్తి వయసు 18 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. అర్హత గల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 20 వేలు అందిస్తోంది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు వేగంగా విచారణ చేపట్టిన వెంటనే నేరుగా ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలి. మంజూరైన నిధులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమవుతాయి. కుటుంబ యజమాని మరణిస్తే త్వరితగతిన సాయం అందించేందుకు ప్రభుత్వం బాధ్యతలను మార్పిడి చేసింది. లబ్ధిదారులకు చెందిన దరఖాస్తులు ఎక్కడ పెండింగ్లో ఉన్నాయో తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. మంజూరైన నిధులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. – కమలాకర్, ఎంపీడీవో, రెంజల్ -
మహిళ బిల్లు–2023ను తీసుకురావాలి
నిజామాబాద్ రూరల్: పార్లమెంట్లో 2023లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లునే అమలు చేయాలని కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనను మహిళా రిజర్వేషన్లకు ముడిపెట్టడంపైనే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అని అన్నారు. నగరంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డుకుందని బీజేపీ ఒక అసత్య దురుద్దేశపూరిత ప్రచారాన్ని సాగిస్తోందని తీవ్రంగా విమర్శించారు. వాస్తవానికి మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు 2023లోనే ఏకగ్రీవంగా ఆమోదించిందన్నారు. ఇటీవల లోక్సభలో విఫలమైంది రిజర్వేషన్ల ముసుగులో దేశవ్యాప్తంగా పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల స్థానాల సంఖ్యను పెంచడానికి, నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడానికి చేసిన ప్రయత్నమే అని అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంటు, రాష్ట్రాల శాసన సభల్లో ఉన్న స్థానాల సంఖ్య ఆధారంగానే మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు. బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టడానికి వాస్తవాలను ప్రజల ముందు ఉంచడానికి కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందన్నారు. నగర కార్పొరేషన్ డీసీసీ కార్యదర్శులు ఉప్పరి స్వప్న, మడుపు స్వప్న, మాజీ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగడం సుమన్, మాజీ కార్పొరేటర్ మురళి, జెండా గుడి చైర్మన్ లవంగ ప్రమోద్, హమాల్వాడి సంతోషీ మాత సాయిబాబా గుడి చైర్మన్ గంగాకిషన్, నాయకులు అష్రఫ్ ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజనను మహిళా రిజర్వేషన్కు ముడిపెట్టడం సరికాదు కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ -
సాహిత్య రంగంలో సాయిలు ప్రతిభ
● వ్యవసాయంతోపాటు అక్షరసేద్యం చేస్తున్న హెగ్డోలి వాసి రుద్రూర్: పోతంగల్ మండలం హెగ్డోలి గ్రామానికి చెందిన నాగం సాయిలు సాహిత్య రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. కీర్తిశేషులు నాగం ఆశన్న కుమారుడైన సాయిలు చిన్ననాటి నుంచే ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులను ఎదుర్కొని చదువును కొనసాగించారు. ఎంఏ తెలుగు, తెలుగు పండిత్ పూర్తి చేయగా, 2012 డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు పోస్టును తృటిలో కోల్పోయాడు. అయినప్పటికీ భాషపై ఉన్న అభిమానం తగ్గకుండా అక్షరసేద్యం కొనసాగిస్తూ వ్యవసాయాన్ని జీవనాధారంగా చేసుకున్నారు. తనకున్న భూమిలో సాగు చేస్తూనే సాహిత్య సేవను కొనసాగిస్తూ ఈ తరం యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సమాజ సమస్యలను ప్రతిబింబించేలా.. సాయిలు కవిత్వంపై ఆసక్తితో డాక్టర్ కాసర్ల నరేష్ రావు మార్గదర్శకత్వంలో సాహిత్య ప్రయాణం ప్రారంభించగా, పద్మశ్రీ డాక్టర్ ఎన్.గోపి ప్రోత్సాహంతో ‘నానీ మీగడలు’ అనే పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తకాన్ని తన తండ్రి ఆశన్నకు అంకితమిచ్చారు. సమాజ సమస్యలను ప్రతిబింబించే నానీ మీగడలు పాఠకులను ఆలోచింపజేస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ, రహదారి భద్రత, సామాజిక బాధ్యత వంటి అంశాలపై ఆయన రాసిన నానీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ‘‘తాబేలులా హెల్మెట్ ధరించు’’ వంటి సందేశాత్మక పంక్తులు యువతలో చైతన్యం కలిగిస్తున్నాయి. సాహిత్య రంగంలో ఆయన చేసిన కృషికి పలువురు కవులు, పండితులు సాయిలును ‘సహజకవి’, ‘రైతుకవి’గా అభివర్ణించారు. ఇందూరు జంట కవులు కందాలై రాఘవాచార్యులు, చందనరావు వంటి ప్రముఖులు ఆయనను ‘ఈ తరం పోతన’గా కొనియాడడం విశేషం. కరోనా కాలంలో కూడా సామాజిక బాధ్యతను ప్రతిబింబించే కవితలు రచించిన సాయిలు, ‘మా నాన్న’, ‘కరోనాకాలంలో నా మిత్రుని సేవ’, ‘మానవత్వం పరిమళించింది’ వంటి కవితలతో పాఠకులను కదిలించారు. వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, రైతుల సేవలను ప్రశంసిస్తూ రాసిన కవితలు పలువురు అభిమానులను సంపాదించాయి.ఇప్పటివరకు పలు కవి సమ్మేళనాల్లో పాల్గొని ప్రశంసలను నాగం సాయిలు అందుకున్నారు. భవిష్యత్లో మరిన్ని కవితలు రచించి గ్రామం, జిల్లా, రాష్ట్రం, దేశానికి పేరు తీసుకురావాలని సాహిత్యాభిమానులు ఆకాంక్షిస్తున్నారు. -
క్రైం కార్నర్
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని పోతంగల్ కలాన్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన గొల్లపల్లి కిష్టయ్య(62) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈనెల 16న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువుల వద్ద వెతికినా ఆచూకీ తెలియ లేదు. గ్రామ శివారులోని మామిడి విఠల్కు చెందిన పొలం వద్ద మంచెకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విఠల్ పొలాన్ని అదే గ్రామానికి చెందిన గైని రాములు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఆదివారం ఉదయం అతడు పొలం వద్దకు వెళ్లగా మంచెకు కిష్టయ్య ఉరివేసుకున్నట్లు గుర్తించాడు. వెంటనే మృతుడి కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. అనారోగ్య కారణాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి భార్య అంజవ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. వేల్పూర్: మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీలో వనందాస్ మహేందర్గౌడ్, శ్రావణ్కుమార్గౌడ్లకు చెందిన ద్విచక్రవాహనాలను శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. బాధితులు ఎప్పటిలాగే తమ వాహనాలను రాత్రి ఇంటివద్ద ఉంచి నిద్రించగా, గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో కాలిపోయినట్లు పేర్కొన్నారు. శ్రావణ్కుమార్గౌడ్కు చెందిన స్కూటీ, మహేందర్గౌడ్కు చెందిన బైక్ కాలిపోవడంతో సుమారు రూ.లక్ష 40వేల నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు. ఘటనపై వేల్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంజీవ్ తెలిపారు. -
ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి
నిజామాబాద్ రూరల్: ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే వ్యాధులు రావని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు గంగారాం, ఇన్నమూరి రవితేజ అన్నారు. జిల్లా కేంద్రంలోని మారుతినగర్లోగల స్నేహా సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో ఆదివారం ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం సందర్భంగా హిమోఫిలియా వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై, మాట్లాడారు. అన్ని వ్యాధుల మాదిరిగానే హిమోఫిలియా కూడా ఒకటని అన్నారు. ఏ వ్యాధికై నా వైద్యులు చెప్పినట్టు జాగ్రత్తలు పాటిస్తే తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవితాన్ని ఆహ్లాదంగా ఆస్వాదించవచ్చన్నారు.. . దాసరి విజయ్ నందరావు, అంబరీష్, యజాస్, రఘు, సంతోష్, జగదీ ష్, సొసైటీ కార్యదర్శి సిద్దయ్య పాల్గొన్నారు. -
రక్తదాతలకు హెల్మెట్ల పంపిణీ
కామారెడ్డి టౌన్: డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సహకారంతో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో రక్త దాతలకు ఆదివారం కామారెడ్డి టౌన్ సీఐ నరహరి చేతుల మీదుగా హెల్మెట్లు పంపిణీ చేశారు. తలసేమియా బాధితుల కోసం రక్తదానం చేసిన 50 దాతలకు రోడ్డు సేఫ్టీలో భాగంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకట్, జిల్లా అధ్యక్షు డు ప్రవీణ్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంగయ్య, ఐవీఎఫ్ చైర్మన్ బాలు, ఆర్కే కళాశాల చైర్మన్ జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ఆదివారం పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. లైసెన్స్లు, పొల్యూషన్, వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు లేనివారితో పాటు సీటు బెల్టులు, హెల్మెట్లు ధరించని వారికి జరిమానాలు విధించారు. అలాగే పెండింగ్ చలానాలు ఆన్లైన్లో కట్టేలా చర్యలు తీసుకున్నారు. ఎస్సై నరేష్, పోలీసు సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు. -
పొలంలోని ఎరువులు, పైపులు దగ్ధం
ధర్పల్లి: మండల కేంద్రం శివారులోని రైతు మామిడి లక్ష్మణ్, రాజశేఖర్ చెందిన వ్యవసాయ చేనులోని డ్రిప్పు పైపులు, ఎరువులు ప్రమాదవశాత్తు దగ్ధమయ్యాయి. ఆదివారం పొలాల సమీపంలోని ట్రాన్స్ఫార్మర్కు మంటలు చెలరేగగా, పక్కనే ఉన్న మొక్కజొన్న సొప్పకు మంటలు అంటుకొని కాలిపోయాయి. భారీ గాలులు వీచడంతో మంటలు వ్యాపించి, లక్ష్మణ్ చేనులోని డ్రిప్ పైపులతోపాటు ఐదు ట్రాక్టర్ల పశువుల ఎరువు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ ఇంజన్తో సిబ్బంది మంటలను ఆర్పారు. సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు. టిప్పర్ క్యాబిన్లో మంటలు నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఎన్హెచ్ 765డి రోడ్డు పనులు చేపడుతున్న కేపీసీకి చెందిన ఓ టిప్పర్ క్యాబిన్లో మంటలు చెలరేగిన ఘటన ఆదివారం మండలంలోని బంజారతండా వద్ద చోటుచేసుకుంది. రోడ్డు పనుల్లో భాగంగా మొరం తీసుకెళ్తున్న టిప్పర్ బంజారతండా వద్దకు చేరుకోగానే క్యాబిన్లో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ గుర్తించి టిప్పర్ను రోడ్డుపక్కన నిలిపి, కిందికి దిగిపోయాడు. మంటలను గమనించిన తండా సర్పంచ్ సురేష్ జీపీ ట్యాంకర్ను తెప్పించి మంటలను అదుపుచేశారు. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి అగ్నిమాపకకేంద్రం ఫైర్ఇన్స్పెక్టర్ వినోద్ ఫైరింజన్తో ఘటనస్థలానికి చేరుకొని టిప్పర్లోని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఘటనాస్థలంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎస్సై భార్గవ్గౌడ్ తన సిబ్బందితో కలిసి రాకపోకలను పునరుద్ధరించారు. నవీపేట: మండలంలోని బినోల గ్రామంలోని తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామంలోని అయిటి నర్సు శనివారం రాత్రి ఇంటికి తాళం వేసి, తన కుటుంబసభ్యులతో కలిసి ఇంటి దాబాపై నిద్రించారు. ఉదయం లేచిచూసేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.5వేల నగదును ఎత్తుకెళ్లారు. పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
మిస్టరీగానే మర్డర్ కేసు..
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చి వెనుక ప్రాంతంలో ఫిబ్రవరి 2న ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి, శరీర భాగాలను ముక్కలుగా కోసి, సంచుల్లో మూటగట్టి ఆ మూటలను అక్కడక్కడా పడేసిన ఉదంతం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో ఈమిస్టరీ మర్డరీ కేసు చేధన పోలీసులకు సవాల్గా మారింది. కలకలం రేపిన ఉదంతం .. ఈ కేసులో మొదట ఓ సంచిలో నడుము నుంచి కిందివైపు భాగం శరీర భాగాలు లభించాయి. రెండు రోజుల తర్వాత కొద్ది దూరంలోని ఓ చిన్న కాలువలో తల, చేతులు ఉన్న మూటను గుర్తించా రు. మిగితా శరీర భాగం లభ్యం కాలేదు. దానిని మరో సంచిలో వేసి పట్టణంలో కాకుండా మరెక్కడైనా దూర ప్రాంతంలో పడేసి ఉండవచ్చని పో లీసులు భావించారు. శివారు ప్రాంతాలన్నీ గాలించినా మిగితా భాగాలు లభ్యం కాలేదు. ఓ వ్యక్తిని ఇంత కిరాతకంగా హత్య చేయడం పట్టణంలో కలకలం రేపింది. లభించిన శరీర భాగాలన్నీ కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో మృతుడిని గుర్తించడం సాధ్యం కాలేదు. పోలీసులు కేసును సవాల్గా తీ సుకుని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. మిస్సింగ్ కేసులు, సీసీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక పరిజ్ణానం ఆధారంగా విచారణ జరిపా రు. చివరకు పక్క రాష్ట్రాల పోలీసులకు సైతం మృతుని ఆనవాళ్లతో కూడిన సమాచారం చేరవేశారు. మృతుడిని గుర్తించినా, కేసుకు సంబంధించిన సమాచారం ఏదైనా ఇచ్చినా రూ.10 వేలు రివార్డు సైతం ప్రకటించారు. అయినా హత్యకు ౖగురయిన వ్యక్తి ఎవరనేది గుర్తించడం సాధ్యం కాలేదు. దీంతో కేసులో ముందడుగు పడలేదు. హతుడు, హంతకులు ఎవరనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఈ హత్య తరువాత జరిగిన పలు హత్య కేసులను పోలీసులు తక్కువ వ్యవధిలోనే ఛేదించారు. కానీ ఈ కేసు మాత్రం పెండింగ్ లోనే ఉంది. చివరికి ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాలి మరి.శరీర భాగాలు లభించిన కేసు లో అన్ని కోణాల్లోనూ విచారణ జరిపాం. శరీర భాగాలు కుళ్లిన స్థితిలో ఉండటంతో చనిపోయి న వ్యక్తి ఎవరనేది తెలియడం లేదు. ఇతర అన్ని కోణాల్లో ప్ర త్యేక బృందాలు దర్యాప్తు జరుపుతున్నాయి. విచార ణ కొనసాగుతోంది. తొందర్లోనే కేసును చేధిస్తాం. – నరహరి, ఎస్హెచ్వో, కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 2న సంచిలో వెలుగుచూసిన మృతదేహం మృతుడు.. హంతకుడు.. ఎవరో తెలియని పరిస్థితి వివరాల కోసం శోధిస్తున్న ప్రత్యేక బృందాలు రూ.10 వేలు రివార్డు ప్రకటించిన పోలీసులు సవాల్గా మారిన కేసు -
చోరీ కేసులో దంపతుల అరెస్ట్
బాన్సువాడ: ఈనెల 13న బాన్సువాడ పోస్టాఫీసులో వాచ్మన్పై దాడి చేసి చోరీకి పాల్పడిన దంపతులను అరెస్ట్ చేసి, రిమాండ్కు పంపనున్నట్లు బాన్సువాడ డీఎస్పీ విఠల్రెడ్డి తెలిపారు. బాన్సువాడ డీఎస్పీ కార్యాలయంలో శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. ఎల్లారెడ్డి మండలం సోమర్పేట్కు చెందిన కుర్మ శివకుమార్, కుర్మలావణ్య భార్యాభర్తలిద్దరు బాన్సువాడ పోస్టాఫీసులో చోరీ చేసేందుకు వచ్చారు. రాత్రి విధులు నిర్వహిస్తున్న వాచ్మన్ సాయిలుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సాయిలు వద్ద ఉన్న రూ.1000 నగదుతోపాటు పోస్టాఫిసులో ఉన్న మూడు సెల్ఫోన్లను దొంగిలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి, నిందితులను గుర్తించారు. శివకుమార్, లావణ్య బాన్సువాడలోని సంగమేశ్వర కాలనీలో ఉండడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా తామె పోస్టాఫీసులో దొంగతనం చేసినట్లు అంగీకరించారన్నారు. అనంతరం నిందితుల నుంచి రూ.1000 నగదు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులిద్దరూ హైదరాబాద్తోపాటు పలు పాంత్రాల్లో సెల్ఫోన్ల చోరీకి పాల్పడ్డారని, వారిపై పలు కేసులున్నాయన్నారు. కేసును చేధించిన సీఐ శ్రీధర్, ఎస్సై, పోలీసు సిబ్బందిని అభినందించారు. -
మహిళా బిల్లును అడ్డుకోవడం దారుణం
సుభాష్నగర్:పార్లమెంట్లో మహిళా బిల్లును అడ్డుకోవడం దారుణమని, అడ్డుకున్న కాంగ్రెస్కు భవిష్యత్లో మహిళలే తగిన గుణపాఠం చెప్తారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయ ణ అన్నారు. నగరంలోని నిఖిల్సాయి చౌరస్తాలో శనివారం బీజేపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయ త్నం చేశారు. ఈక్రమంలో బీజేపీ నాయకులు, పోలీసుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళా బిల్లు కు వ్యతిరేకంగా ఓటు వేసిన కాంగ్రెస్ నిజ స్వరూ పం బయటపడిందన్నారు. 2023లో ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతు పలికినట్టే పలికి ఇప్పుడు వ్యతిరేకించడం సమంజసం కాదన్నారు. డీఎంకే, సమాజ్ వాదీ పార్టీలు కూడా మహిళల పట్ల వారికున్న నైతికతను బయటపెట్టాయని ఆరోపించారు. మోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి వ్యతిరేక పనులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, భవిష్యత్లో వారికి తగిన గుణపాఠం తప్పదన్నారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రవేశపెట్టని మహిళాబిల్లును బీజేపీ ప్రవేశపెడితే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని ఆరోపించారు. రాష్ట్ర కార్యదర్శి స్రవంతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్కర్ లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు బొబ్బిలి సువర్ణ వేణు, బంటు ప్రీతి ప్రవీణ్, ప్రసూన శ్రీనివాస్ రెడ్డి, మల్లేష్ యాదవ్, మల్కాయి మహేందర్, జ్యోతి మురళీ, మహిళా నాయకురాలు వనిత, తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్కు గుణపాఠం తప్పదు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జిల్లాకేంద్రంలో కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం -
క్రైం కార్నర్
చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి ఎల్లారెడ్డి: నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటమునిగి మృతిచెందాడు. వివరాలు ఇలా.. ఎల్లారెడ్డి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన మాటూరి మల్లేష్(33), తన మిత్రుడు సాయితో కలిసి శనివారం రుద్రారం గ్రామశివారులోని నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో చేపలు పట్టేందుకు వెళ్లాడు. కాగా చేపలు పట్టేక్రమంలో మల్లేష్ వలను పట్టుకొని మరో గట్టుకు వెళ్తుండగా వల కాళ్లకు చుట్టుపోయింది. దీంతో అతడు ఈత కొట్టలేక నీటిలో మునిగి మృతిచెందాడు. మృతుడి భార్య సౌజన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నవీపేట: అదృశ్యమైన ఓ యువకుడు గోదావరి నదిలో శవమై తేలాడు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు ఇలా.. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం చించాలం గ్రామానికి చెందిన గట్టుపల్లి రంజిత్ (36) కొన్నేళ్లుగా నిజామాబాద్ జిల్లా బోర్గాం వద్ద గల ఐసీడీఎస్ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్నాడు. వచ్చే నెల 8న అతడికి వివాహం జరగాల్సి ఉంది. ఈనెల 15న అతడు భీంగల్లోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి బైక్పై వెళ్లాడు. మళ్లీ తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువుల ఇళ్లలో కుటుంబ సభ్యులు వాకబు చేశారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో ముధోల్ పీఎస్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. శనివారం ఉదయం గోదావరి నదిలో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రంజిత్ మృతదేహంగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. యువకుని మృతికి కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఇందల్వాయి: ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద గోధుమల లోడ్తో వెళ్తున్న లారీ బోల్తాపడింది. వివరాలు ఇలా.. జబల్పూర్ నుంచి గోదుమల లారీ బెంగళూరుకు బయలుదేరింది. శనివారం ఉదయం ఇందల్వాయి టోల్ప్లాజా వద్దకు చేరుకోగా, ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఘటన సమయంలో లారీ డ్రైవర్ బయటకు దూకడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటన స్థలానికి చేరుకున్న టోల్ప్లాజా సిబ్బంది గోధుమల బస్తాలను మరో లారీని రప్పించి లోడ్ చేశారు. అనంతరం దెబ్బతిన్న లారీ పక్కకు తొలగించారు. -
రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యం
● సీపీ సాయిచైతన్య ● ఎడపల్లిలో ‘అరైవ్–అలైవ్’ నిర్వహణ బోధన్: రోడ్డు ప్రమాదాలు తగ్గించడం, భద్రతావ్యవస్థల బలోపేతం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం అరైవ్ అలైవ్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని సీపీ సాయి చైతన్య అన్నారు. ప్రస్తుతం ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల కారణంగానే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీస్శాఖ అధ్వర్యంలో శనివారం ఎడపల్లిలో ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా సీపీ ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రాఫిక్ నియమాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన ప్రజలు, వాహనదారులనుద్దేశించి మాట్లాడారు. జిల్లాలో ట్రాఫిక్ నియమాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, జాగ్రత్తలపై తమ శాఖ అధికారులు ప్రజలు, వాహనదారుల్లో విస్త్రృత స్థాయిలో ఈ నెల 13 నుంచి శనివారం వరకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనాలు డ్రైవింగ్ చేసి తమతో పాటు ఇతరుల ప్రాణాలు కాపాడాలన్నారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయన్నారు. కోవిడ్ సమయంలో జిల్లాలో సుమారు 200 మంది చనిపోతే 2025 ఏడాదిలో రోడ్డు ప్రమాదాల్లో 302 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్లో అట్టి ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించే వారికి ప్రభుత్వం నుంచి ప్రోత్సహించుటకు రహవీర్ పథకం కింద రూ.25 వేల అందించనున్నట్లు పేర్కొన్నారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయబాబు, ఎంవీఐ శ్రీనివాస్, ఎస్సై శ్రీరామ, మచ్చేంధర్ రెడ్డి, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
అవుట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి
తెయూ(డిచ్పల్లి): రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో విధులు నిర్వహిస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, పీఆర్సీని ప్రకటించాలని తెయూ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బట్టు సురేష్ డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం తెలంగాణ యూనివర్సిటీ పరిపాలనా భవనం ఎదుట అవుట్ సోర్సింగ్ సిబ్బంది నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చి నెలలు గడిచినా, ఇప్పటికీ అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సంఘ ప్రధాన కార్యదర్శి బికోజీ, సభ్యులు నవ్య, వకుల, రవి నాయక్, తిరుపతి,హరీష్,సురేష్రెడ్డి, సతీష్,గులాబ్,ఆసిఫ్, అఖి ల్, దిలీప్, గంగారాం, తదితరులు పాల్గొన్నారు. -
నూతన కార్యవర్గం ఎన్నిక
నిజామాబాద్ రూరల్: నగరంలో శనివారం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో జిల్లా మహిళా సంఘం నూతన కార్య వర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతరం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షుడు కిషన్ నూతన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రలు అందజేశారు. జిల్లా అధ్యక్షురాలిగా మడుపు స్వప్న, ప్రధాన కార్యదర్శిగా పాదం మాధవి, కోశాధికారిగా లత, ఉపాధ్యక్షురాలు సంబోజి కృష్ణవేణి, లీగల్ అడ్వైజర్గా ఝాన్సీ రాణి, ప్రధాన కార్యదర్శిగా స్వర్ణలత, వర్కింగ్ ప్రెసిడెంట్గా రుద్రజడ స్వప్న ఎన్నికయ్యారు. అలాగే సహాయ కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, ముఖ్య సలహాదారు, సలహాదారులను, టౌన్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శిలను సైతం ఎన్నుకొని, నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుద్దాల శ్రీనివాస్, కోశాధికారి నూనె వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ధర్పల్లి: మండలంలోని నడిమి తండా గ్రామపంచాయతీ పరిధిలోని పలు తండాల్లో ప్లాస్టిక్ పేపర్లు, ప్లాస్టిక్ కవర్లు వాడడం నిషేధిస్తూ గ్రామపంచాయతీ శనివారం తీర్మానం చేసింది. అనంతరం ప్లాస్టిక్ వాడడం వల్ల వచ్చే అనర్థాలను సర్పంచ్ తండావాసులకు వివరించారు. ఈసందర్భంగా తండావాసులు స్టీల్ బ్యాంక్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్టీల్ బ్యాంకు ద్వారా జగదాంబ గుడికి 200 స్టీలు ప్లేట్స్,గ్లాసులను ఆలయ నిర్వాహకులకు అందజేశారు. ఉప సర్పంచ్ బనావత్ సతీష్, పెద్దమనుషులు తదితరులు పాల్గొన్నారు. డొంకేశ్వర్(ఆర్మూర్): వైద్య సిబ్బంది సమయపాలన పాటించి, ప్రజలకు వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్వో రాజశ్రీ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం డీఎంహెచ్వో రాజశ్రీ తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది గర్భిణులకు క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించాలని, పిల్లలకు నిర్ధేశిత సమయానికి వ్యాక్సిన్లు వేయాలని సూచించారు. గ్రామాల్లోని ఉప కేంద్రాలను సమయానికి తెరవాలన్నారు. స్థానిక గర్భిణులతో మాట్లాడి వైద్య సేవల గురించి ఆరా తీశారు. మెడికల్ ఆఫీసర్ శుభాకర్, సూపర్వైజర్ సురేంధర్, సిబ్బంది ఉన్నారు. -
చిన్నరాంపూర్లో పెంకుటిల్లు దగ్ధం
బాన్సువాడ రూరల్: మండలంలోని చిన్న రాంపూర్లో ఎర్రోల్ల గంగారాంకు చెందిన పెంకుటిల్లు శనివారం తెల్లవారుజామున దగ్ధమైంది. అంతకుముందు రోజు రాత్రి అతడు కట్టెల పొయ్యిపై వంట చేసిన అనంతరం మంటలను సరిగా ఆర్పలేదని, దీంతో మంటలు వ్యాపించడంతో ఇల్లు దగ్ధమైందని సమాచారం. స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఇంట్లోని సామగ్రి, దుస్తులు, పత్రాలు అన్ని అప్పటికే కాలిబూడిదయ్యాయి. గ్రామంలో అత్యంత నిరుపేద అయిన గంగారం ఒంటరిగా జీవిస్తున్నాడని ప్రభుత్వం అతడిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. రెవెన్యూ అధికారులు పంచనామా చేశారు. దోమకొండలో.. దోమకొండ: మండల కేంద్రంలోని ముత్యంపేట రోడ్డులో శనివారం ఛత్తీస్గడ్కు చెందిన కూలీలు తాత్కాలికంగా వేసుకున్న షెడ్డులో సిలిండర్ పేలి, మంటలు చెలరేగి గుడిసె దగ్ధమైంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రోజు మాదిరిగా సదరు కూలీలు కట్టెల పోయ్యిపై వంట చేసుకుని పనికి వెళ్లారు. ఎండ వేడిమికి కట్టెల పొయ్యిలో మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న సిలిండర్కు మంటలు అంటుకోగా అది పేలింది. దీంతో కాలనీవాసులు తీవ్రంగా భయపడ్డారు. దగ్గరలోని బోరు నుంచి నీటిని తీసుకువచ్చి మంటలను ఆర్పివేశారు. మంటలు చేలరేగి సిలిండర్ పేలిన సమయంలో తాత్కాలికంగా వేసుకున్న షెడ్డులో ఎవరూ లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని కాలనీవాసులు తెలిపారు. -
అదనపు డీసీపీ బస్వారెడ్డి బదిలీ
నిజామాబాద్ అర్బన్: జిల్లా పోలీస్ శాఖలో అదనపు డీసీపీగా పనిచేస్తున్న బస్వారెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన స్థానంలో వరంగల్ ఏఎస్పీగా పనిచేస్తున్న శుభం ప్రకాశ్ను అదనపు డీసీపీ(అడ్మిన్)గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా బస్వారెడ్డికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. బాలుడి హత్య కేసులో తల్లి, ప్రియుడి అరెస్ట్ కామారెడ్డి క్రై మ్: వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి అభం శుభం తెలియని ఐదేళ్ల బాలుడి దారుణ హత్యకు పాల్పడిన తల్లి, ఆమె ప్రియుడిని పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్వో నరహరి వివరాలు వెల్లడించారు. రాజంపేట మండలానికి చెందిన రజిత అలియాస్ లక్ష్మి తన భర్తతో గొడవపడి ఆరు నెలలుగా కామారెడ్డిలోని శ్రీరాంనగర్ కాలనీలో నివాసం ఉంటుంది. ఆమెకు కుమార్తె, కుమారుడు శ్రావణ్ (05) ఉన్నారు. లక్ష్మీనరసింహులు అనే వ్యక్తితో లక్ష్మి కొంతకాలంగా సహజీవనం చేస్తుంది. తమ వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి శ్రావణ్ హత్యకు వారిద్దరూ కలిసి కుట్ర పన్నారు. శుక్రవారం లక్ష్మి కూలీ పనులకు బయటకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చిన లక్ష్మీనరసింహులు శ్రావాణ్ గొంతు పిసికి, నేలకేసి బాది దారుణంగా హత్య చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులైన తల్లి, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. శనివారం సాయంత్రం వారిని రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్వో తెలిపారు. ఎల్లారెడ్డి: ఎస్ఐఆర్పై పోలింగ్కేంద్రాల వారిగా ఓటర్లకు అవగాహన కల్పించాలని ముస్లిం వెల్ఫేర్ నాయకులు శనివారం ఆర్డీవో ప్రభాకర్కు వినతిపత్రం అందించారు. బీఎల్వోలను నియమించి వారికి ఎస్ఐఆర్పై అవగాహన కల్పించాలని అన్నారు. 2002 కంటే ముందు ఉన్న ఓటరు లిస్టు ఆధారంగా సర్వే నిర్వహించాలన్నారు. -
శిలా ఫలకం వేశారు.. పనులు మరిచారు..
● 2023లో స్పైస్పార్క్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం శంకుస్థాపన ● ప్రభుత్వం మారడంతో అటకెక్కిన ఏర్పాట్లు మోర్తాడ్: మహిళా సంఘాల సభ్యులకు స్వయం ఉపాధి కల్పించడంతోపాటు ప్రజలకు నాణ్యమైన సరుకులను అందించడానికి నిర్ధేశించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. 2023 సెప్టెంబర్లో అప్పటి మంత్రి ప్రశాంత్రెడ్డి వేల్పూర్ శివారులోని స్పైస్పార్క్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం శంకుస్థాపన చేశారు. నిర్మాణ అంచనా వ్యయం రూ.39.37లక్షలుగా నిర్ణయించారు. కానీ ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. మహిళా సంఘాలకు ఉపాధి కోసం.. పసుపు, కారం పొడిల ఉత్పత్తి, మసాలాల తయారీతో మహిళా సంఘాల సభ్యులకు చేతినిండా పని కల్పించవచ్చని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ప్రణాళికను రూపొందించారు. జిల్లా లో పసుపు పంట సాగు చేస్తుండటంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో పసుపు ఉత్పత్తులకు శ్రీకారం చుడితే రైతులకు మంచి ధర లభిస్తుంది. పసుపు ఉత్పత్తుల ఎగుమతులతో అనేక మందికి నాణ్యమై న పొడి లభించడానికి అవకాశం ఉంది. అలాగే కారం, మసాలాలను కూడా స్థానికంగానే తయారు చేస్తే మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా బలోపేతమైతారని అందరూ ఆశించారు. బీడీ పరిశ్రమ అంతంత మాత్రంగానే ఉండటంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా కొంతమందికై నా ప్రత్యామ్నా య ఉపాధి లభిస్తుందనే నమ్మకం కలిగింది. కానీ అప్పటి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో శిలాఫలకంతోనే సరిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. నిధులు వెనక్కి వెళ్లాయా.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం శంకుస్థాపన చేయగా అప్పట్లో మంజూరైన నిధులు వెనక్కి వెళ్లిపోయి ఉంటాయనే సందేహం వ్యక్తం అవుతుంది. ప్రభుత్వం అనుకుంటే మరోసారి నిధులను మంజూరు చేసే అవకాశం ఉంది. మహిళా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో సీఎం రేవంత్రెడ్డి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ప్రభుత్వం స్పందిస్తే వేల్పూర్లోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ జీవం పోసుకుంటుందనే అభిప్రాయం వ్యక్తమైతుంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు, పాలకులు స్పందించి నిర్మాణ పనులను ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు వల్ల మహిళలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. మహిళలు వ్యాపారంలో రాణించడానికి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ చేయూతను ఇస్తుంది. ఇప్పటికై నా ప్రస్తుత ప్రభుత్వం పునరాలోచన చేసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను ప్రారంభించాలి. –సురేఖ, మహిళా సంఘం ప్రతినిధి, వేల్పూర్ -
144 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
బోధన్టౌన్(బోధన్): పట్టణంలోని శ్రీనివాస్ నగర్ కాలనీలోగల సాయి ఆగోర ఇండస్ట్రీస్ రైస్మిల్లో 144.2 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీసీఎస్ పోలీసులతోపాటు స్థానిక పోలీసులు పట్టుకున్నారు. పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపిన వివరాలు ఇలా.. రేషన్ బియ్యం కొనుగోలు చేస్తూ రైస్మిల్లో నిల్వ ఉంచారనే సమాచారం రావడంతో నిజామాబాద్ సీసీఎస్ పోలీసులు, స్థానిక పోలీసుల కలిసి రైస్మిల్పై దాడులు నిర్వహించారు. దీంతో రెండు ఆటోలతోపాటు లారీలో లోడ్ చేసిన రేషన్ బియ్యంను గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. సివిల్ సప్లయ్ డిప్యుటీ తహసీల్దార్ హనుమాన్ పంచనామ నిర్వహించగా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. -
బాలికల ఆరోగ్య సంరక్షణకు కృషి
బోధన్: బాలికల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని డీఎంహెచ్వో రాజశ్రీ అన్నారు. ఎడపల్లి పీహెచ్సీ అధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో ప్రపంచ హిమోఫిలియా దినోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి, మాట్లాడారు. 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఇప్పించాలన్నారు. బాలికల ఆరోగ్య రక్షణకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెరుగైన వైద్య సేవలను విస్త్రృతంగా కొనసాగించి, ఆరోగ్య రక్షణ కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. డిప్యూటీ డీఎంహెచ్వో సమత, ఎడపల్లి పీహెచ్సీ వైద్యుడు వినీత్ కుమార్రెడ్డి, వెంకటేశ్, హెచ్ఎం రవికుమార్ సిబ్బంది పాల్గొన్నారు. హీమోఫీలియా బాధితులకు వైద్యసేవలు ముఖ్యం సుభాష్నగర్: హీమోఫీలియా బాధితులు సమయానికి వైద్యసేవలు పొందడం ఎంతో ముఖ్యమని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ అన్నారు. ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సంయుక్తాధ్వర్యంలో శుక్రవారం అవ గాహనా ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా కృష్ణ మోహన్ మాట్లాడుతూ.. ప్రజలకు హీమోఫీలి యా వ్యాధి గురించి అవగాహన కల్పిస్తూ, ముంద స్తు గుర్తింపు, సరైన నిర్ధారణ, తగిన చికిత్స ద్వారా సమస్యలను నివారించవచ్చని తెలియజేశారు. జీజీ హెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ రాములు, వైస్ ప్రిన్సిపాల్స్ తిరుపతి రావు,కిషోర్ కుమార్, హీమో ఫీలియా నోడల్ ఆఫీసర్ పవన్ పాల్గొన్నారు. -
జీజీ కాలేజీలో 6వ సెమిస్టర్ పరీక్షల్లో ఒకరు డిబార్
ఖలీల్వాడి: నగరంలోని జీజీ కళాశాలలో జరుగుతున్న డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్ అయ్యారు. కళాశాలలో శుక్రవారం జరిగిన డిగ్రీ 6వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు 769 విద్యార్థులకు గాను 16 మంది గైర్హాజరయ్యారైనట్లు ప్రిన్సిపల్ రామోహ్మన్రావు తెలిపారు.ఈ పరీక్షల్లో 753 మంది విద్యార్థు లు హాజరు కాగా, ఒకరు డిబార్ అయ్యారు. 2వ సె మిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు 1473 విద్యార్థులకు గా ను 22 మంది గైర్హాజరయ్యారైనట్లు చెప్పారు. 1451 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. పరీక్షలను నియంత్రణాధికారి భరత్ రాజ్ పర్యవేక్షించారు. అమర్నాథ్ యాత్రికులకు ఇబ్బందులు లేకుండా చూడాలి సుభాష్నగర్: అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు మెడికల్ పరీక్షల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని విశ్వహిందూ పరిషత్ విభా గ్ కార్యదర్శి తమ్మల కృష్ణ డిమాండ్ చేశారు. ఈమేరకు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో డిప్యూటీ సూపరింటెండెంట్ రాములును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. భక్తులకు అన్ని పరీక్షలకు సంబంధించి వైద్యులు, ల్యాబ్ ఒకే దగ్గర ఉండేలా చూడాలన్నారు. భక్తుల కు ఇబ్బందులు కలగకుండా సమాచారాన్ని క్లుప్తంగా తెలిసే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని కో రారు.యాత్రికులకు ఎవరికై నా మెడికల్ టెస్టుల వి షయంలో ఇబ్బందులు తలెత్తితే 81060–79789, 83096–31515 నంబర్లను సంప్రదించాలన్నారు. వీహెచ్పీ ప్రాంత గోరక్ష కృషి ప్రముఖ్ ధాత్రిక రమే ష్, కోశాధికారి శేఖర్, నగర అధ్యక్షుడు కోడిమేలా శ్రీనివాస్, నగర కార్యదర్శి నీకేష్, నగర సహా కార్యదర్శి సతీష్, సందీప్, బజరంగ్దళ్ నగర సహా సంయోజక్ అఖిలేష్, తదితరులు పాల్గొన్నారు. నవీపేట: మండల కేంద్రంలోని సుభాష్నగర్ కాలనీలో శుక్రవారం పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. ఆరుబయట ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి మహెరపై పిచ్చికుక్కలు దాడిచేయడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే కుటుంబసభ్యులు గమనించి చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. గ్రామంలో పిచ్చికుక్కలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, పాలకవర్గం తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎలుగుబంటి దాడిలో ఒకరు.. మోపాల్: మండలంలోని మంచిప్ప ఫారెస్ట్ శివారు లో ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడిచేయడంతో స్వల్ప గాయాలయ్యాయి. బాడ్సికి చెందిన గూండ్ల పోశెట్టి గురువారం తూనికాకు సేకరణ కోసం మంచిప్ప ఫారెస్ట్ శివారుకు వెళ్లాడు. ఈక్రమంలో అతడిపై ఎ లుగుబంటి దాడి చేయగా, స్వల్ప గాయాలయ్యా యి. వెంటనే అతడు పీఎంపీ వద్ద చికిత్స చేయించు కున్నారు. విషయం తెలుసుకున్న మంచిప్ప ఫారెస్ట్ సెక్షన్ అధికారి సాయి, బీట్ ఆఫీసర్లు బాధి తుడిని శుక్రవారం పరామర్శించారు. మెరుగైన చికిత్స కో సం అధికారులు ప్రయత్నించగా, స్వల్పగాయాలయ్యాయని పోశెట్టి తిరస్కరించినట్లు తెలిసింది. ట్యాంక్ ఎక్కి కార్మికుడి నిరసన నిజామాబాద్ అర్బన్: నగరంలోని మున్సిపల్ కా ర్మికుడు షేక్ హాజీ శుక్రవారం మున్సిపల్ మూడవ జోన్ కార్యాలయం ఆవరణలోని వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపాడు. తనకు కొన్ని నెలలుగా వేతనాలు రావడం లేదని వెంటనే వేతనాలు ఇప్పించాలని నిరసన చేశారు. ట్యాంక్ పైనుంచి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లగా, కార్మికుడు వారితో వాగ్వాదం చేశాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. -
రెవెన్యూ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం
మాక్లూర్: మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి హాజరు కాగా, రెవెన్యూ అధికారుల తీరుపై మండి పడ్డారు. మాక్లూర్ మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను గత ఎమ్మెల్యే హయాంలో ఎంత కబ్జా చేయాలో అంత చేశారని ఆరోపించారు. అక్కడక్కడ మిగిలి ఉన్న ప్రభుత్వ భూములు, గుట్టలను ఇక్కడి రెవెన్యూ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఇతరులకు అంటగడుతున్నారని ఆరోపించారు. మండల పరిధిలోని రెండు వెంచర్లలో ప్రభుత్వ భూములలను విలీనం చేసుకున్నారన్నారు. ఈ విషయమై నివేదిక ఇవ్వాలని సంబంధిత శాఖ కోరినా ఇప్పటికీ ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. కృతిమ ఇసుక పరిశ్రమలు, అక్రమ మొరం, ఇసుక దందా నడుస్తున్నా అధికారులు పట్టుకోవడం లేదన్నారు. ఆర్ఐ బదిలీ అయి 2 నెలలు కావస్తున్న ఇంకా రిలీవ్ ఎందుకు ఇవ్వటం లేదు. ఇందులో ఇద్దరి లావాదేవీలు ఏమైనా ఉన్నాయా అంటూ తహసీల్దార్ను ప్రశ్నించారు. అధికారుల తీరును ఎండగట్టిన అనంతరం ఎమ్మెల్యే లబ్ధిదారులకు షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఎంపీడీవో బ్రహ్మనందం, తహసీల్దార్ శేఖర్, ఆర్ఐ షపీ తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటివల పోలీసులు డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా, పలువురు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. పోలీసులు శుక్రవారం ముగ్గురిని ఆర్మూర్ కోర్టులో హాజరుపర్చారు. జడ్జి వారిలో ఇద్దరికి రూ. 10వేల చొప్పున జరిమానా విధించగా, ఒకరికి నాలుగు రోజుల సాధారణ జైలు శిక్ష విధించినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. నవీపేట: మండలంలోని జన్నేపల్లి గ్రామంలో విద్యుత్శాఖ సిబ్బంది నిర్లక్ష్యంతో పెంట లక్ష్మి అనే మహిళ మృతి చెందిందని, వారిపై చర్యలు తీసుకోవాలని జన్నేపల్లి గ్రామస్తులు శుక్రవారం ఎస్సై శ్రీకాంత్కు ఫిర్యాదు చేశారు. ట్రాన్స్కో ఏఈతోపాటు లైన్మన్ రమేష్కు కరెంటు సరఫరాలోని సాంకేతిక లోపాలపై గతంలో పలుమార్లు ఫిర్యాదు చేశామన్నారు. కానీ వారు ఫిర్యాదులపై స్పందించకపోవడంతో కరెంటు షాక్కు గురై లక్ష్మి మృతిచెందిందన్నారు. దీంతో ఆమె మృతికి కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. -
బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి
మాక్లూర్: బ్రాహ్మణ సంక్షేమానికి అభ్యున్నతికి బ్రాహ్మణ సంక్షేమ వేదిక నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర నాయకుడు యుగంధర్ అన్నారు. మాక్లూర్ విశ్వేశ్వరాలయం ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం బ్రాహ్మణ సంక్షేమ వేదిక నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బ్రాహ్మణ అర్చకుల అభినందన సన్మాన సభ నిర్వహించారు. కార్యక్రమానికి యుగంధర్ ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బ్రాహ్మణ సంక్షేమానికి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇటీవల బ్రాహ్మణ అర్చకులపై తెలుగు రాష్ట్రాల్లో భౌతిక దాడులు జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. బ్రాహ్మణ అర్చకులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణ అర్చకులను అభినందించే కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఇందులో భాగంగానే జిల్లా కేంద్రంలో గతేడాది 105 మంది అర్చక స్వాములను సత్కరించినట్లు వివరించారు. నాయకులు రాజ్కుమార్ సుబేదార్, రొట్టె రఘునాథ్ శర్మ, కొండపాక చంద్రశేఖర్, రాజేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు. -
పీఎంతో వర్చువల్ భేటీలో పాల్గొన్న విద్యార్థి
రుద్రూర్: మండలంలోని ఆహార శాస్త్ర సాంకేతిక కళాశాలలో రెండో సంవత్సరం చదువుతు న్న విద్యార్థిని శ్రావ్య ప్రధానమంత్రి నరేంద్రమోదీతో వర్చువల్గా భేటీ అయ్యింది. ‘మై భా రత్ బడ్జెట్–2026’ అంశంపై మూడు దశలుగా నిర్వహించిన వర్చువల్ పోటీలలో పాల్గొన్న శ్రావ్య ప్రతిభ కనబర్చి ఎంపికైంది. ఈనెల 12, 13 తేదీల్లో హైదరాబాద్లోని కన్నశాంతి వనంలో నిర్వహించిన జాతీయ స్థాయి ‘వర్చువల్ డైలాగ్ విత్ ప్రైమ్ మినిస్టర్’ కార్యక్రమంలో శ్రావ్య పాల్గొందని కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ వెంకట్రెడ్డి తెలిపారు. పీఎంతో వర్చువల్ భేటీలో పాల్గొన్న శ్రావ్యను అధ్యాపకులు, సహ విద్యార్థులు అభినందించారు.నిజామాబాద్ రూరల్: రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం సీఎం రేవంత్రె డ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాల పై చర్చించారు. అనంతరం ఢిల్లీలోని యము నా నది ఒడ్డున గల జాతిపిత మహాత్మాగాంధీ రాజ్ఘాట్ను రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డితో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా మహాత్ముడిని స్మరించుకొని నివాళులు అర్పించారు. పెర్కిట్(ఆర్మూర్): ఆలూర్ మండల కేంద్రానికి చెందిన జల్లాపురం వినేష్రెడ్డి అమెరికాలోని మైక్రోసాఫ్ట్ కంపెనీలో కొలువు సాధించాడు. ఆలూర్కు చెందిన జల్లాపురం అశోక్ రెడ్డి, భోజకళ రైతు దంపతులకు కూతురు నిఖిత, తర్వాత కవలలు వినీత్ రెడ్డి, వినేష్రెడ్డి కుమారులు ఉన్నారు. కూతరు నిఖితతో పాటు అల్లుడు, కవలల్లో ఒకరైన వినీత్ రెడ్డి ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. కవలల్లో మరొకరైన వినేష్ రెడ్డి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడే ఎంఎస్ పూర్తి చేసి ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తుండగానే భారీ ప్యాకేజితో మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. గ్రామీణ రైతు కుటుంబం నుంచి కష్టపడి చదివి ఏడాదికి రూ.కోటి 27 లక్షల ప్యాకేజితో కొలువు సాధించడంపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ● గ్రామ పంచాయతీ తీర్మానం డొంకేశ్వర్(ఆర్మూర్): ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తూ డొంకేశ్వర్ మండలం నూత్పల్లి గ్రామ పంచాయతీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం జీపీ తీర్మానం చేసింది. ప్లాస్టిక్ వినియోగంతో ప్రజలు క్యాన్సర్ లాంటి వ్యాధుల బారిన పడుతున్నారని సర్పంచ్ సురకంటి రాజారెడ్డి అన్నారు. ఊరి ప్రజలను ప్లాస్టిక్ నుంచి విముక్తి కల్పించడానికి పాలకవర్గ సభ్యులంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఐతే, పెళ్లిళ్లు, ఇతర కార్యాలకు ప్లాస్టిక్ ఇస్తార్లు, గ్లాసులు వినియోగించకుండా జీపీ నుంచి 600 స్టీల్ ప్లేట్లు, 400 గ్లాసులను కొనుగోలు చేశారు. వీటిని గ్రామ ప్రజలు ఉచితంగా తీసుకెళ్లి మళ్లీ తిరిగి ఇచ్చేలా పంచాయతీ అవగాహన కల్పిస్తోంది. దుకాణాలు, హోటళ్లలో కూడా ప్లాస్టిక్ను వాడకూడదని సూచించారు. ఈ నిర్ణయాన్ని మే 1 నుంచి వందశాతం అమలు చేయాల్సిందేనన్నారు. జీపీ నిర్ణయంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
తెయూ సమాచారం....
కీర్తనకు వీసీ అభినందన తెయూ(డిచ్పల్లి): పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఈనెల 14న అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రం తరపున పాల్గొని ప్రసంగించిన తెలంగాణ యూనివర్సిటీ ఆంగ్ల విభాగం విద్యార్థిని కీర్తనను శుక్రవారం వీసీ చాంబర్లో వీసీ యాదగిరిరావు, రిజిస్టార్ యాదగిరి అభినందించారు. వర్సిటీ తరపున రూ.5వేలు ప్రోత్సాహక బహుమతి అందజేశారు. ఆంగ్ల విభాగం అధ్యాపకులు సమత, రమణాచారి, జోత్స్న, ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ అపర్ణ, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఎల్ఎస్ఎస్ఎస్డీసీతో ఎంవోయూ తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ లైఫ్ సెన్సెస్ సెక్టార్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎల్ఎస్ఎస్ఎస్డీసీ), ఏ వింగ్ ఆఫ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ మేరకు శుక్రవారం తెయూ రిజిస్ట్రార్ యాదగిరి, సంస్థ ప్రతినిధులు ఎంవోయూ పత్రాలు మార్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ యూనివర్సిటీ ద్వారా ఉత్తీర్ణులైన ఎంఎస్సీ, బీఎస్సీ బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ విద్యార్థులకు వివిధ లైఫ్ సైన్సెస్ సెక్టార్ కంపెనీల కొరకు ఈ సంస్థ ఇంటర్వ్యూస్ నిర్వహిస్తుంది. అలాగే ఎల్ఎస్ఎస్ఎస్డీసీ వారి సీఎస్ఆర్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థులకు ట్రైనింగ్ ఇండస్ట్రీ రెడీ స్కిల్స్లో ఉచిత శిక్షణ ఇప్పించి ప్రభుత్వ గుర్తింపు పొందిన సర్టిఫికెట్తోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. బయోటెక్నాలజీ విభాగాధిపతి ప్రసన్న శీల, ఎల్ఎస్ఎస్ఎస్డీసీ సంస్థ సౌత్ ఇండియా క్లస్టర్ హెడ్ అమరేంద్రబాబు, కో–ఆర్డినేటర్ కుమారస్వామి, వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. తెయూ పాలకమండలి సభ్యులకు సన్మానం తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి (ఈసీ)కి నూతనంగా నామినేట్ అయిన సభ్యులు ప్రొఫెసర్ సీహెచ్ ఆంజనేయులు, సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ గౌడ్లను శుక్రవారం తెయూలో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ (అటుట్) ఆధ్వర్యంలో సన్మానించారు. వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి, సభ్యులు ఘంటా చంద్రశేఖర్, అపర్ణ, లావణ్య, ఆరతి, రాంబాబు, రవీందర్ రెడ్డి,సంపత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. అలాగే తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టూటా) ఆధ్వర్యంలోనూ ఆంజనేయులు, సుధాకర్గౌడ్లను సన్మానించారు. టూటా అధ్యక్షుడు పున్నయ్య, ప్రధాన కార్యదర్శి మోహన్బాబు, కోశాధికారి నాగరాజు, ప్రొఫెసర్ కనకయ్య, సభ్యులు సత్యనారాయణ, లక్ష్మణ చక్రవర్తి, శిరీష, వాసం చంద్రశేఖర్, నాగరాజు, సాయిలు, రమణచారి తదితరులు పాల్గొన్నారు. వీసీని కలిసిన ఈసీ మెంబర్ ఖలీల్వాడి: నగరంలోని జీజీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ దండుస్వామి తెయూ పాలక మండలి సభ్యుడిగా ఎంపిక కావడంతో శుక్రవారం ఆయన వీసీ యాదగిరిరావు, రిజిస్టర్ యాదగిరిలను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జిసిటిఏ సంఘం ఆధ్వర్యంలో స్వామిని సన్మానించారు. ప్రిన్సిపాల్ రామ్మోహన్రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం, సంఘం అధ్యక్షుడు లింగన్న, అధ్యాపకులు రామస్వామి, పెద్దన్న, అంబర్ సింగ్, ముత్తెన్న, సతీష్, బాబురావు, జయప్రసాద్, భరత్ రాజ్ ఉన్నారు. -
సిలిండర్లు పోయి.. కట్టెల పొయ్యి వచ్చే..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రస్తుతం వాణిజ్యపరమైన గ్యాస్ సిలెండర్ల కొరత కారణంగా చాలా హోటళ్లలో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు. ఇందుకోసం హోటళ్ల వద్ద ప్రత్యేకంగా టెంట్లు వేసి మరి పెద్దఎత్తున కట్టెలు తెప్పించి నిత్యం వంటకాలు వండుతున్నారు. నిజామాబాద్లోని ఓ హోటల్ వద్ద కట్టెల పొయ్యి కోసం ఇలా ప్రత్యేకంగా టెంట్ వేశారు. గతం కంటే ఎక్కువ ధర చెల్లించి ఎప్పటికప్పుడు పెద్దఎత్తున కట్టెలు తెచ్చుకుంటున్నారు. బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్ వద్ద పెద్ద ఎత్తున తెప్పించిన కట్టెలను శుక్రవారం ‘సాక్షి’ క్లిక్మనిపించింది. -
సీపీఆర్పై అవగాహన ఉండాలి
నిజామాబాద్అర్బన్: ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వ్యక్తిని కాపాడడానికి సీపీఆర్ ఎంతో ఉపయోగపడుతుందని, దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగిఉండాలని సీపీ సాయి చైతన్య అన్నారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం సీపీ కార్యాలయంలో సీపీఆర్ పద్ధతిపై పోలీసులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా సీపీ మాట్లాడుతూ.. ప్రస్తుతం గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు తక్షణ సహాయం అందించడంలో సీపీఆర్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. కానీ చాలామందికి ఈ పద్ధతిపై సరైన అవగాహన లేదని, దీంతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీపీఆర్ విధానం ప్రాథమిక ప్రథమ చికిత్స అత్యవసర పరిస్థితిలో ఎలా స్పందించాలి అనే అంశాలను నిపుణుల ద్వారా వైద్యుల ద్వారా పోలీస్ సిబ్బందికి తెలియజేశారు. అదనపు డీసీపీ బస్వారెడ్డి , ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, డీఎంహెచ్వో రాజశ్రీ, వైద్యులు విశాల్, శ్రీశైలం, విఠల్ తదితరులు పాల్గొన్నారు -
నకిలీలకు చెక్ పెట్టేదెలా?
మోర్తాడ్(బాల్కొండ): నకిలీ ట్రావెల్ ఏజెన్సీలు, ఏజెంట్లతో నిరుద్యోగులు మోసపోవడంతోపాటు ఆర్థికంగా నష్టపోతున్నా ప్రభుత్వం వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతుంది. నకిలీ ఏజెంట్లు, సంస్థలు ఇచ్చే వీసాల వల్ల కొంతమంది విదేశాలకు వెళుతున్నా అక్కడకు వెళ్లిన తరువాత సమస్య ఉత్పన్నమైతే పట్టించుకునేవారు కరువయ్యారు. దీంతో విదేశాలకు వెళ్లే వారికంటే మోసపోతున్న వారి సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది. రూ.కోట్లు కొల్లగొడుతూ.. కరోనా విపత్కర పరిస్థితుల తరువాత గల్ఫ్ దేశాలకు వలస వెళ్లడానికి యువత అంతగా ఆసక్తి చూపడం లేదు. యూరప్ దేశాలు, దక్షిణాసియా దేశాలకు వలస వెళ్లాలానుకునే వారి సంఖ్య పెరిగింది. దీంతో కొన్ని ఏజెన్సీలు (లైసెన్స్ లేని సంస్థలు) తాము యూరప్ ఇతర దేశాలకు వీసాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగుల నుంచి రూ.కోట్లు కొల్లగొట్టాయి. మెట్పల్లి కేంద్రంగా పని చేసిన ఒక నకిలీ సంస్థ రూ.1.50 కోట్లకు, నిర్మల్ జిల్లాలోని ముగ్గురు నకిలీ ఏజెంట్లు అర్మెనియా, మాల్టా దేశాలకు పంపిస్తామని చెప్పి రూ.3.50 కోట్లకు కుచ్చుటోపి పెట్టారు. జగిత్యాల్ కేంద్రంగా ముగ్గురు ఏజెంట్లు రూ.6 కోట్ల వరకూ నిరుద్యోగుల నుంచి వసూలు చేసి ఉడాయించారు. ఇలా కోట్లాది రూపాయలు దండుకుని నిరుద్యోగులను ముంచుతున్న నకిలీ ఏజెన్సీలపై పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇమిగ్రేషన్ చట్టంలో ఉన్న లొసుగుల వల్ల నకిలీ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవడంలో పోలీసు యంత్రాంగం విఫలమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిరుద్యోగులను అధిక మొత్తంలో మోసగించిన ఒక ఏజెంట్పై జగిత్యాల్ అధికార యంత్రాంగం పీడీ యాక్టును అమలు చేసినా నకిలీల ఆటలు ఇంకా సాగుతున్నాయి అంటే కఠినమైన చర్యలు లేకపోవడమే కారణం అని స్పష్టమైతుంది. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నకిలీ ఏజెంట్లు, సంస్థల వల్ల మోసపోతున్న వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. మన విదేశాంగ శాఖ ఆధ్వర్యంలోని ఈమైగ్రెంట్ వెబ్పోర్టల్లో నమోదైన లైసెన్స్ ఏజెన్సీలు, బ్రాంచీల సంఖ్య రాష్ట్రంలో 124 మాత్రమే ఉంది. ఈ ఏజెన్సీల ద్వారానే గల్ఫ్ ఇతర దేశాలకు వలస వెళ్లేవారికి వీసాల జారీ ప్రక్రియ చట్టబద్ధంగా సాగుతుంది. గల్ఫ్తో పాటు ఇతర దేశాలకు వలసలు ఎక్కువగా ఉన్న మన జిల్లాతోపాటు పొరుగు జిల్లాల్లో లైసెన్స్డ్ ఉన్న ట్రావెల్స్ ఏజెన్సీలు, బ్రాంచీల సంఖ్య పరిమితంగా ఉండగా నకిలీ సంస్థల జాబితా వేలల్లో ఉంది. నకిలీ ఏజెంట్లు, వారి ఏజెన్సీలు పుట్టగొడుగుల్లా పుట్టుక వస్తున్నా మోసాలకు చెక్ పెట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విదేశాలకు వెళ్లడానికి వీసాల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఏజెంట్లు నకిలీలా లేదా అని పరిశీలించుకోవాలి. లైసెన్స్ ఉన్న ఏజెన్సీల వల్లనే చట్టబద్ధమైన ప్రయాణం సాధ్యమవుతుంది. నకిలీ ఏ జెంట్లు,సంస్థలను ఆశ్రయించకపోవడమే మంచిది. – పొన్నం సత్యనారాయణ, సీఐ, భీమ్గల్ రాష్ట్రంలో వేల సంఖ్యలో నకిలీ ట్రావెల్ ఏజెన్సీలు లైసెన్స్ ఉన్నవి కేవలం 124 నకిలీ ఏజెంట్లు, సంస్థల వల్ల మోసపోతున్న నిరుద్యోగులు -
ఆస్పత్రుల్లో అగ్నిమాపక వారోత్సవాలు
సుభాష్నగర్: జిల్లాలోని పలు ఆస్పత్రుల్లో శుక్రవారం జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి పరమేశ్వర్ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆస్పత్రుల్లోని సిబ్బందికి, ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. నిజామాబాద్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బోధన్, బాల్కొండ, నందిపేట్, భీంగల్ తదితర కేంద్రాల పరిధిలోగల ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. అగ్ని ప్రమాదాలను అరికట్టడానికి, బాధితులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ఫైర్ సిబ్బంది ఆస్పత్రి సిబ్బందితో కలిసి ఎలా స్పందించాలి, రోగులను ఎలా ఖాళీ చేయించాలి, తదితర అంశాలపై అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ‘అగ్ని ప్రమాదాల నివారణ కోసం, సురక్షిత పాఠశాల, సురక్షితమైన ఆస్పత్రి, అగ్ని భద్రతపై అవగాహన కలిగిన సమాజం అవసరం’ అనే నినాదంతో ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తున్నట్లు పరమేశ్వర్ తెలిపారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. -
జూన్ 2లోగా పీఆర్సీని అమలు చేయాలి
● కలెక్టరేట్ ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి ఉద్యోగుల నిరసననిజామాబాద్అర్బన్: జూన్ 2లోగా పీఆర్సీని అమ లు చేయాలని తెలంగాణ ఉద్యోగ గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మిక, పెన్షనర్ల ఐక్యకార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ సుమన్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో కలెక్టరేట్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర అడిషనల్ సెక్రెటరీ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ అనంతరం 10 సంవత్సరాల తర్వాత ఉద్యోగ సమస్యలపై రాష్ట్ర చైర్మన్ జగదీశ్వర్, సె క్రెటరీ శ్రీనివాసరావు అధ్యక్షతన 26 భాగస్వామ్య సంఘాలతో పలుమార్లు విన్నపాలు సమర్పించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పీఆర్సీ కమిటీ వేసి 30 నెలల గడుస్తున్నప్పటికీ నేటికీ నివేదిక తెప్పించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. 51 శాతం ఫిట్మెంట్తో రెండో పీఆర్సీని అమలు చేయాలన్నారు. ఉద్యోగులకు బకా యి ఉన్న రూ.13 వేల కోట్లకు పైగా బిల్లులను ఒకే సారి విడుదల చేయాలన్నారు. ఉద్యోగులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ విధానం, ఆరోగ్య కార్డులను అందజేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ సుమన్ కుమార్ మాట్లాడుతూ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనియెడల రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఉద్యమ కార్యాచరణలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా కోకన్వీనర్ మోహన్ రెడ్డి, కో చైర్మన్లు రమేశ్, రమణారెడ్డి, ధర్మేందర్, శ్రీనివాస్, కృష్ణారెడ్డి, సురేశ్, పండరీనాథ్, వైస్ చైర్మన్ విజయసింగ్, శేఖర్, అమృత్ కుమార్, అంగన్వాడీ, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
నిజామాబాద్
బాలికల ఆరోగ్య.. బాలికల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి రాజశ్రీ పేర్కొన్నారు. శనివారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026– 8లో uనాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఏర్పాటు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే చోట విద్యను అందించేందుకు నిర్ణయించింది. జిల్లాలో ఐదు నియోజకవర్గాల పరిధిలో టీపీఎస్లను ప్రారంభించేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే స్కూళ్లను ప్రారంభించనున్నారు. -
మొక్కలు ఎండిపోకుండా..
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీ నర్సరీల సంరక్షణపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు నర్సరీల తాజా పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ప్రతి ఒక్క నర్సరీ ఫొటోను ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా జిల్లా కార్యాలయానికి తెప్పించుకొని పరిశీలిస్తున్నారు. 44 డిగ్రీల ఎండలకు నర్సరీలో పెరుగుతున్న మొక్కలు వాడి, ఎండిపోకుండా తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని డీఆర్డీవో సాయన్న ఉపాధిహామీ ఉద్యోగులకు ఆదేశాలు జారీచేశారు. ఇందుకోసం మొక్కలకు నీడ ఉండేలా గ్రామ పంచాయతీల నిధులతో షేడ్ నెట్లు కొనుగోలు చేసి ఏర్పాటు చేయాలని సూచించారు. రోజుకు మూడు పూటలా నీళ్లు తప్పకుండా పట్టాలని, నిర్లక్ష్యం చేయొద్దని స్పష్టం చేశారు. 13.78 లక్షల మొక్కలు.. జిల్లాలో ఈ ఏడాది నిర్వహించే వనమహోత్సవ కార్యక్రమానికి 530 గ్రామ పంచాయతీ నర్సరీల్లో పాత మొక్కలు కాకుండా 13.78 లక్షల మొక్కలను పెంచుతున్నారు. వేసవి నేపథ్యంలో తగినంత నీడ, నీళ్లు లేకపోయినా మొక్కలు ఎండిపోయే అవకాశం ఉంది. వేసిన విత్తనాలు కూడా విఫలం అయ్యే ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో నర్సరీలను ఎండల నుంచి గట్టెక్కించడానికి డీఆర్డీవో స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎంపీడీవోలు, ఏపీవోలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులను అలర్ట్ చేశారు. షేడ్ నెట్లు లేనిచోట వెంటనే ఏర్పాటు చేయించాలని సూచించారు. దీంతో ఉపాధి ఉద్యోగులంతా ఇప్పుడే ఇదే పనిలో బీజీగా ఉన్నారు. తక్షణ చర్యలు చేపడుతున్నాం.. ఎండల తీవ్రతకు నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలు ఎండిపోయే అవకాశం ఉంది. అందుకే తక్షణ చర్యల కింద ప్రతి నర్సరీలో మొక్కలకు షేడ్ నెట్లు ఏర్పాటు చేసి మూడు పూటలా నీళ్లు పట్టించాలని ఆదేశాలిచ్చాం. ఈ విషయంలో ఎవరు నిర్లక్ష్యం చేసినా ఉపేక్షించేది లేదని స్పష్టంగా చెప్పాం. – సాయన్న, డీఆర్డీవో, నిజామాబాద్ ఎండల తీవ్రత దృష్ట్యా షేడ్ నెట్ల ఏర్పాటుకు చర్యలు మొక్కలకు మూడు పూటలా నీళ్లు పట్టాలని ఆదేశాలు నర్సరీల పరిస్థితిపై ఫొటోలు తెప్పించుకున్న డీఆర్డీవో -
ప్రతి ఇంటికి శుద్ధ జలాలు అందించాలి
● తాగునీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలి ● అధికారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశంఆర్మూర్: వేసవికాలం నేపథ్యంలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి ఇంటికి శుద్ధజలాలు సరఫరా అయ్యేలా నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గం పరిధిలోని డొంకేశ్వర్, నందిపేట్, మాక్లూర్, ఆలూర్, ఆర్మూర్ మండలాల ఎంపీడీవోలు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు, ఎంపీవోలు, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులతో తాగునీటి సరఫరా తీరుతెన్నులపై కలెక్టర్ సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా నీటి సరఫరా పరిస్థితి, అందుబాటు లో ఉన్న నీటి వనరులు, చేపట్టాల్సిన మరమ్మతు పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈసారి ఎల్నినో ప్రభావంతో సరిపడా వర్షాలు కురిసే అవ కాశాలు లేవని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నందున తాగునీటి వనరులను సమర్ధవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలన్నారు. చుక్క నీరు కూడా వృథా కాకుండా చూడాలన్నారు. ఇబ్బందులుంటే ముందుగానే జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలన్నా రు. వేసవిలో జిల్లాలో ఎక్కడ కూడా నీటి ఎద్దడి నెలకొనకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఎక్కడైనా నీటి కోసం ప్రజలు నిరసనకు ది గితే సంబంధిత ఎంపీడీవోలను బాధ్యులుగా పరిగణిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. చేతి పంపులు, బోరు బావులకు తక్షణమే ఫ్లషింగ్ చేయించాలని అన్నారు. తాగునీటి సరఫరా వ్యవస్థకు ఆటంకం కలిగేలా పైప్లైన్లను ధ్వంసం చేయడం, వాల్వ్లకు నష్టం చేకూర్చే వారిని ఏమాత్రం ఉపేక్షించబోమని, అలాంటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. తాగునీటి ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలని, ఎంపీవోలు, ఏఈలు నిరంతర పర్య వేక్షణ చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆ ర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రాజేందర్, డీపీవో శ్రీనివాస్ రావు, మున్సిపల్ కమిషనర్ ఉమా మహేశ్వర్, మిషన్ భగీరథ ఈఈ రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కోఆప్షన్ పదవులకు గ్రీన్సిగ్నల్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నగరపాలక, పురపాలకాల్లో కోఆప్షన్ పదవుల ఎన్నికకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా మొదట నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కోఆప్షన్ పదవుల ఎంపిక కోసం నోటిఫికేషన్ విడుదలైంది. 21 సంవత్సరాల వయస్సు ఉండి నగరపాలకం పరిధిలో ఓటరుగా నమోదై ఉన్న వ్యక్తులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. గతంలో కార్పొరేటర్లుగా పనిచేసినవాళ్లు, నగరపాలకం పరిధిలో న్యాయవాదిగా పనిచేసినవాళ్లు, కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల్లో గెజిటెడ్ ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయి, పురపాలన, నగరపాలనలో అనుభవం ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. పురపాలకాల్లో ముగ్గురు.. బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల్లోనూ కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు. కౌన్సిల్ ఏర్పాటయ్యాక 90 రోజుల్లోపు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. దీంతో త్వరలో ఈ మూడు మున్సిపాలిటీల్లోనూ కోఆప్షన్ సభ్యులను ఎన్నుకునేందుకు రంగం సిద్ధం చేయనున్నారు. ఈ మూడు పురపాలకాల్లో ముగ్గురు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఒకరు కచ్చితంగా మహిళ ఉండాలి. మరొకరు మైనారిటీ మతాల నుంచి ఉండాల్సి ఉంది. వీటి కోసం పలువురు ఎదురుచూస్తున్నారు.ఐదుగురు సభ్యులు..నిజామాబాద్ నగరపాలక సంస్థలో ఐదుగురు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఐదుగురిలో ముగ్గురు సాధారణం కాగా, మైనారిటీ వర్గాలైన ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, పార్శీ మతాలకు చెందినవారు కచ్చితంగా ఇద్దరు ఉండాలి. రెండు విభాగాల్లోనూ ఒక మహిళ ఉండాలి. ఈ నెల 21వ తేదీలోగా సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అనంతరం ప్రత్యేకంగా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. మెజారిటీ సభ్యుల అభిప్రాయాన్ని చేతులు ఎత్తడం ద్వారా తీసుకొని ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్ తెలిపారు. ఇందూరు నగరపాలకంలో మొదలైన ప్రక్రియ బోధన్, ఆర్మూర్, భీమ్గల్ బల్దియాల్లోనూ త్వరలో నోటిఫికేషన్ -
ఏసీబీకి దొరికిన ఎకై ్సజ్ సీఐ
● రూ. 2 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టివేత ● షాద్నగర్లోని సీఐ నివాసంలో రూ.12 లక్షలు స్వాధీనం బిచ్కుంద(జుక్కల్) : కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఎ క్సైజ్ సీఐ సత్యనారాయణ లంచం తీసుకుంటూ ఏసీ బీ అధికారులకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ శేఖర్గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మద్నూర్లో ఓ కల్లు దుకాణం షిఫ్ట్ విషయంలో సీఐ దుకాణం యజమానిని రూ. 3 లక్షలు డిమాండ్ చేయగా, రూ.2 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా, బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బిచ్కుందలో తాను అద్దె ఉంటున్న ఇంటిలో సీఐ రూ.2 లక్షల నగదు లంచం తీసుకుంటుండగా ఏసీ బీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఆ గదిలో ఉన్న మరో రూ.45,760 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఏకకాలంలో జరిపిన సోదాల్లో ఏసీబీ అధికారులు షాద్నగర్లోని సీఐ ఇంట్లో రూ.12 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి చెందిన ఇతర ఆస్తులపై కూడా విచారణ కొనసాగుతోందని, నిందితుడిని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. అధికారులు ఎవరైనా ప్రజల నుంచి లంచం కోసం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబరు 1064కు కాల్ చేయాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. గతంలోనూ సీఐపై ఎకై ్సజ్ మంత్రికి ఫిర్యాదు.. ఏసీబీకి పట్టుబడ్డ సీఐ సత్యనారాయణ లంచం ఇవ్వాలని వేధిస్తున్నాడని బిచ్కుంద, మద్నూర్ వైన్స్ యజమానులు గత సంవత్సరం మద్నూర్లో పర్యటించిన ఎకై ్సజ్ మంత్రికి ఫిర్యాదు చేశారు. సీఐ వేధింపులపై వైన్స్లు బందు చేసి నిరసన తెలిపారు. -
హెల్మెట్ ధరిస్తే ఐపీఎల్ మ్యాచ్ చూపిస్తా..
● సీపీ సాయిచైతన్య ● సర్పంచులు, కార్పొరేటర్లకు అరైవ్–అలైవ్పై అవగాహననిజామాబాద్అర్బన్: జిల్లాలో ద్విచక్ర వాహనంపై ప్రయాణించేవారు హెల్మెట్ ధరిస్తే ఐపీఎల్ మ్యాచ్ ఉచితంగా చూపిస్తామని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య పేర్కొన్నారు. నగరంలోని శ్రీరామ గార్డెన్లో సర్పంచులు, కార్పొరేటర్లకు మన ఊరు మన భద్రత, అరైవ్–అలైవ్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ వ్యవసాయదారులు రోడ్డుపై ధాన్యం ఆరబెట్టినప్పుడు భద్రత కోన్లు లేదా బకెట్ పెట్టి స్టిక్కర్లు అంటించాలన్నారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబై ల్ ఫోన్లు వాడకం నిషేధమన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలన్నారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాహనాల మధ్య తగ్గినంత దూరం ఉండేలా చూడాలన్నారు. యువత మత్తుకు బానిస కాకుండా ప్రతి ఒక్కరూ గమనించాలని, ఆన్లైన్ బెట్టింగ్కు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబసభ్యులు మాట్లాడారు. వారి ఆవేదన, ఇబ్బందులను వివరించారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన మాక్లూర్ మండలానికి చెందిన వ్యక్తిది నిరుపేద కుటుంబం కావడంతో వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని, సమావేశంలో జమ చేసిన డబ్బులను సీపీ అందజేశారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, నగర మేయర్ ఉమారాణి, ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు చిన్న సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి
● కమలాపూర్లో రైతుల ధర్నా డిచ్పల్లి: వరి కోతలు పూర్తయి 20 రోజులు గడస్తున్నా ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం లేదని నిరసిస్తూ గురువారం మండలంలోని కమలాపూర్లో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే అనుచరుడు, స్థానిక కాంగ్రెస్ నాయకుడు కొనుగోలు కేంద్రం ఏర్పాటును అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాన్ని త్వరగా ప్రారంభించాలని డీసీఎంఎస్ మేనేజర్కు విన్నవించినా పట్టించుకోకపోవడంతో ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. 24 గంటల్లో కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని, లేదంటే కలెక్టరేట్ను ముట్టడిస్తామని రైతులు హెచ్చరించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న డిచ్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించి ఆందోళనను విరమింపజేశారు. -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
● కలెక్టర్ ఇలా త్రిపాఠి ● సిరికొండలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సభసిరికొండ: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మండల స్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక అమలు చేస్తోందన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500 గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి తదితర పథకాలను అమలు చేస్తున్నదని వివరించారు. ప్రభుత్వం కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు చేయనుందన్నారు. యంత్రలక్ష్మిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులకు లాభదాయకంగా ఉండేలా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్(ఎఫ్పీవో)లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తు సేద్యంలో ప్రగతి సాధించాలని కోరారు. పసుపు రైతులకు మేలు చేకూర్చడమే ధ్యేయం పసుపు రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ వారికి మేలు చేకూర్చడమే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కలెక్టర్ తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర లభించాలనే ఉద్దేశంతోనే మార్కెట్ యార్డులో పసుపు అమ్మకాలలో బహిరంగ వేలం విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు ఎలాంటి అపోహలకు గురికావొద్దని తెలిపారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్ మాట్లాడుతూ లొంక రోడ్డులో వంతెనల నిర్మాణాలకు అటవీ శాఖ అనుమతి ఇప్పించాలని కలెక్టర్ను కోరారు. భారీ వర్షాలకు ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు చేయించాలని, సిరికొండ ప్రభుత్వ పాఠశాలలో మూడు అదనపు గదులు మంజూరు చేయాలని తెలిపారు. మండల ప్రత్యేకాధికారి నాగోరావు, ఎంపీడీవో కేఆర్ మనోహర్రెడ్డి, తహసీల్దార్ రవీందర్రావు, సర్పంచులు, ఏఈలు, ఐకేపీ ఏపీఎం, సీసీలు, మహిళా సమాఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఖాళీగా పోస్టులు.. కర్షకులకు పాట్లు
మోర్తాడ్: వ్యవసాయమే ప్రధానమైన బాల్కొండ నియోజవర్గంలో మూడు కీలకమైన పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా వ్యవసాయ శాఖ బోసిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భీమ్గల్ సబ్ డివిజన్ ఏడీఏ పోస్టుతోపాటు కమ్మర్పల్లి, భీమ్గల్ వ్యవసాయాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ పనిచేసిన ఏడీఏ మల్లయ్య బదిలీ కావడంతో స్థానంలో బాధ్యతలను స్వీకరించిన శ్రీనివాస్రావు కొన్ని నెలలకే సెలవుపై వెళ్లారు. ఆ తర్వాత మరో అధికారికి పోస్టింగ్ ఇచ్చినా ఆయన ఇక్కడ బాధ్యతలను స్వీకరించకపోవడం గమనార్హం. మరోవైపు కమ్మర్పల్లి, భీమ్గల్ వ్యవసాయాధికారులుగా పని చేసిన ఇద్దరు ఉద్యోగులను కొన్ని కారణాలతో సస్పెండ్ చేశారు. ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉండటంతో పూర్తిస్థాయి వ్యవసాయాధికారులను నియమించలేదు. దీంతో బాల్కొండ వ్యవసాయాధికారి లావణ్యకు ఏడీఏగా, ఏవోగా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఆమె ఏవోగా, ఇన్చార్జీ ఏడీఏగా, ఏవోగా మూడు రకాల బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కమ్మర్పల్లి ఏవోగా సీడ్ టెస్టింగ్ అధికారి రమ్య అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో రైతులు ప్రధానంగా ఆహార పంటలతోపాటు వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. అనేక మంది రైతులు రెండు సీజనులలో మూడు రకాల పంటలను సాగు చేస్తున్నారు. వ్యవసాయానికి ఎంతో ప్రాధాన్యం ఉన్న ఇక్కడ కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండటంతో రైతులకు సేవలు అందించడంలో కొంత అంతరాయం ఏర్పడుతోంది. బోసిపోతున్న వ్యవసాయ శాఖ భీమ్గల్ సబ్ డివిజన్లో ఏడీఏ పోస్టుతోపాటు రెండు ఏవో పోస్టులు ఖాళీ కీలక పోస్టులను ఇన్చార్జీలతోనే నెట్టుకొస్తున్న వైనం -
జూన్ చివరినాటికి బొంకన్పల్లి ఎత్తిపోతలు పూర్తి
మాక్లూర్: రెండు గ్రామాలను కలిపి 1800 ఎకరాలకు నీరందించటమే లక్ష్యంగా చేపట్టిన బొంకన్పల్లి మినీ లిఫ్ట్ పెండింగ్ పనులను జూన్ చివరి నాటికి పూర్తిచేసి రైతుల పంటలకు నీరు అందిస్తామని నీటిపారుదల శాఖ ఎస్ఈ రామకృష్ణ పేర్కొన్నారు. గురువారం బొంకన్పల్లి మినీ లిఫ్ట్ పనులను స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు. లిఫ్ట్ పనులు 80 శాతం పూర్తయ్యాయని చెప్పారు. ప్రస్తుతం పనులు చకచకా సాగుతున్నాయని జూన్ నాటికి నీరు అందిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. మండలంలోని ధర్మోర చెరువును ఆధారంగా చేసుకుని బొంకన్పల్లి, ముల్లంగి(బి) గ్రామాల రైతులకు నీరందించేందుకు గత నాలుగు సంవత్సరాల క్రితం అప్పటి జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు పట్టుపట్టి నిధులు తెచ్చి మినీ లిఫ్ట్ పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎస్ఈ వెంట డీఈ రవి కుమార్, ఏఈ యోగేశ్, బొంకన్పల్లి సర్పంచ్ మధుకర్రావు, ముల్లంగి(బి) సర్పంచ్ ధర్మపతి, ప్రమోద్ రెండు గ్రామాల రైతులు, లస్కర్లు ఉన్నారు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
● ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యమేనని బంధువుల ఆరోపణనవీపేట: మండలంలోని జన్నెపల్లి గ్రామంలో గురువారం వి ద్యుత్ షాక్తో పెంట లక్ష్మి (46) అనే మహిళ మృతి చెందిందని ఎస్సై శ్రీకాంత్ తెలిపా రు. ఇంట్లోని బోరును స్టార్టర్ బాక్స్ ద్వారా ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందిందని పేర్కొన్నారు. మృతురాలికి కొడుకు, కుమారుడు ఉన్నారు. కొడుకు పెంట శివ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. సబ్ స్టేషన్ ఎదుట ఆందోళన.. పెంట లక్ష్మి మృతికి ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు జన్నెపల్లి గ్రామంలోని సబ్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని నేరుగా సబ్స్టేషన్కు తీసుకువచ్చి ఆందోళన చేశారు. దుబ్బ ప్రాంతంలో కొన్ని నెలలుగా కరెంట్ సమస్య ఉందని, షార్ట్ సర్క్యూట్ ఘటనలు జరుగుతున్నాయని ట్రాన్స్కో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లైన్మన్ రమేశ్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రమాదం జరిగిందని మండిపడ్డారు. ఉన్నతాధికారులు వచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశా రు. ఎస్సై శ్రీకాంత్, సర్పంచ్ ముడుసు గంగాధర్, ఉప సర్పంచ్ వీరేందర్రావ్ ఘటనా స్థలానికి చేరు కొని ఆందోళనకారులకు సర్ది చెప్పారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. -
మెట్ల పైనుంచి పడి ఒకరి మృతి
వర్ని: వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలో స్వీపర్గా పనిచేస్తున్న ఖదీర్ (47) ప్రమాదవశాత్తు మెట్ల పైనుంచి పడి మృతి చెందినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. ఈ నెల 15న మార్కెట్ కమిటీ కార్యాలయంలో మెట్లు దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి పడటంతో ఖదీర్కు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందు తూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి భార్య ఆసిఫా బేగం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అనుమానాస్పద స్థితిలో మహిళ ..ఆర్మూర్టౌన్: ఆలూర్ మండలం మచ్చర్ల గ్రామంలో సుంకరి జయపాల (53) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన గురువారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచ్చర్ల గ్రామానికి చెందిన జయపాల భర్త కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందాడు. కూతురికి వివాహం కాగా జయపాల ఒంటరిగా నివసిస్తోంది. కాగా, అదే గ్రామానికి చెందిన సోదరుడు బుధవారం ఉదయం నుంచి జయపాలకు ఫోన్ చేస్తున్నా ఎత్తడం లేదు. దీంతో ఇంటికి వెళ్లిన సోదరిడికి అక్క జయపాల శవమై కనిపించింది. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. జయపాల మూడు రోజుల క్రితమే మృతి చెంది ఉంటుందని, ఒంటిపై గాయాలు కనిపించటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. మృతురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో పేర్కొన్నారు. -
టేకు దుంగల పట్టివేత
సిరికొండ: మండలంలోని న్యావనంది గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు దుంగలను గురువారం పట్టుకున్నట్లు సిరికొండ ఎఫ్ఆర్వో కే నర్సింగరావు తెలిపారు. విశ్వసనీయ సమా చారం మేరకు గ్రామంలో తనిఖీ చేయగా బహిరంగ ప్రదేశంలో 32 టేకు దుంగలు లభ్యం కాగా, వాటిని స్వాధీనం చేసుకొని సిరికొండలోని రేంజ్ కార్యాలయానికి తరలించామన్నారు. దుంగల విలువ రూ. 25 వేల వరకు ఉంటుందని, ఎవరు నిల్వ చేశారనేది విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గంగారం, బీట్ అధికారి నవీన్, బేస్ క్యాంపు సిబ్బంది రమేశ్, గోపాల్, శేఖర్ పాల్గొన్నారు. -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
● సీపీ సాయిచైతన్య ● అంబులెన్స్, ఆటో డ్రైవర్లకు అవగాహన నిజామాబాద్అర్బన్: ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. నగరంలోని రైల్వేస్టేషన్ ఆవరణలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాలికలో భాగంగా గురువారం అంబులెన్స్, ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని వీటిని నివారించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రోడ్డు ప్రమాదాలకు అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, సెల్ ఫోన్ డ్రైవింగ్, నిబంధనలు పాటించకపోవడమే ప్రధాన కారణాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా వాహనం నడిపితే ఇతరుల ప్రాణాలను కూడా కాపాడిన అవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు. నిజామాబాద్ ఇన్చార్జి ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ట్రాఫిక్ ఆర్ఐ వినోద్, ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తదితరులు పాల్గొన్నారు. అరైవ్–అలైవ్ను విజయవంతంగా నిర్వహించాలి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలకు రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కల్పించాలని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. కమిషనర్ కార్యాలయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్నారు. పెండింగ్లో ఉన్న కేసులను ప్రాధాన్యతగా తీసుకొని త్వరితగతిన పరిష్కరించాలన్నారు. కేసుల దర్యాప్తునకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలలో బ్లాక్ స్పాట్లను గుర్తించాలన్నారు. నిత్యం డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేయాలని సిబ్బందికి సూచించారు. -
తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించిన ఎంపీ
ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్: రాష్ట్ర ఏర్పాటును దేశ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీసూర్య తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నా రు. గురువారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ సాధనలో అమరుల త్యాగాలను అవమానించేలా బిజేపీ ఎంపీ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. రాజ్యాంగబద్దంగా చట్టాలకు లోబడి పార్లమెంటు ప్రక్రియ ద్వారా ఒక రాష్ట్రం ఏర్పడడాన్ని దేశ విభజనతో ముడిపెట్టి, శత్రుదేశమైన పాకిస్తాన్తో పోల్చడం క్షమించరాని నేరమని, దేశద్రోహానికి సమానమని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు అదే తరహాలో ఉంటే విభజన బిల్లుకు అప్పట్లో బీజేపీ ఎందుకు మద్దతు తెలిపిందని ప్రశ్నించారు. సభలో తెలంగాణ నుంచి 8 బీజే పీ, 8 కాంగ్రెస్ ఎంపీలు దిష్టిబొమ్మల్లా మిగిలారని ఆరోపించారు. సభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉండి ఉంటే తేజస్వీసూర్యకు తగిన గుణపాఠం చెప్పేవారన్నారు. రాజ్యాంగబద్దంగా ఏర్పడిన తెలంగాణ దేశానికి రోల్ మోడల్గా నిలుస్తుండడాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోందని చెప్పారు. ఎంపీ సూర్య తేజస్వీ వెంటనే తెలంగాణ ప్రజలకు, పార్లమెంటుకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
వేం నరేందర్రెడ్డికి జిల్లా నాయకుల అభినందనలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాజ్యసభ సభ్యు డిగా గురువారం పార్లమెంటులో ప్రమాణస్వీకారం చేసిన వేం నరేందర్రెడ్డిని జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కలిసి అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, మహమ్మద్ అలీ షబ్బీర్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, పొద్దుటూరి వినయ్రెడ్డి, బాస వేణుగోపాల్యాదవ్ తదితరులు వేం నరేందర్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. సుభాష్నగర్: నగరంలోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్గా ఇటీవల బా ధ్యతలు స్వీకరించిన డాక్టర్ నాగమోహన్రావు ను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీ స్ యూనియన్ నాయకులు గురువారం మర్యా దపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయనకు శాలువా,పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. అనంతరం యూనియన్ జిల్లా అధ్యక్షు డు ఘన్పూర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డాక్ట ర్ నాగమోహన్ నాయకత్వంలో ఆస్పత్రి సేవ లు పేద ప్రజలకు ఉపయోగపడేలా మరింత మెరుగుపడతాయన్నారు. కార్యక్రమంలో నా యకులు రాజేందర్, ప్రవీణ్రెడ్డి, రవిగౌడ్, సురే శ్ రెడ్డి, స్వామి, రమేశ్, విద్యా ప్రవీణ, సుధాక ర్,రమేశ్, మోహన్రావు,సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్అర్బన్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ 10వ తరగతి, ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో సెంటర్ల వద్ద ప్రత్యేక ఆంక్షలు విధించినట్లు సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. ఈ నెల 20 నుంచి 27 వరకు కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలులో ఉంటుందని తెలిపారు. ఆటోమొబైల్ షాప్లో అగ్ని ప్రమాదం బోధన్టౌన్(బోధన్): పట్టణంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎదురుగా ఉన్న ఆయిల్ ఆ టో మొబైల్ దుకాణంలో గురువారం అగ్ని ప్ర మాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న యజమాని ముబీన్ దుకాణం వద్దకు రాగా మంటలు చెలరేగుతుండడంతో అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. ప్రమాదంతో సుమారు రూ. 6 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అగ్నిమాపక అధికారి సుభాష్ తెలిపారు. లేగదూడపై చిరుత దాడి ఇందల్వాయి: చిరుత దాడిలో లేగదూడ మరణించిన ఘటన ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. ఫారెస్ట్ రేంజ్ అ ధికారి రవి మోహన్ భట్ తెలిపిన వివరాల ప్ర కారం.. ఎల్లారెడ్డిపల్లె గ్రామానికి చెందిన మద్ది కుంట నర్సయ్య తన దూడను పొలం వద్ద కట్టి ఉంచాడు. పరిసర ప్రాంత అడవుల్లో సంచరిస్తున్న చిరుత బుధవారం రాత్రి దాడి చేయడంతో దూడ మృతి చెందింది. దూడ కళేబరాన్ని మండల పశువైద్యాధికారి గంగప్రసాద్ పరిశీలించి ఘటన స్థలంలోనే పంచనామా నిర్వహించారు. చిరుత దూడ మెడపై దాడి చేసి రక్తం తాగడంతో మృతి చెందినట్లు తెలిపారు. -
ఇంటిగ్రేటెడ్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలోని ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు అప్లయిడ్ ఎకనామిక్స్ 10వ సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమైనట్లు కంట్రోలర్ ప్రొఫెసర్ సంపత్కుమార్ తెలిపారు. మొత్తం 14 మంది విద్యార్థులకు 13 మంది హాజరుకాగా ఒకరు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. రెంజల్(బోధన్): సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి కుమ్మకై ్క 15వ ఆర్థిక సంఘం నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ సాటాపూర్ గ్రామానికి చెందిన యువజన సంఘాల సభ్యులు గురువారం ఫిర్యాదు చేశారు. కలెక్టర్తోపాటు జిల్లా పంచాయతీ అధికారి, బోధన్ డీఎల్పీవోలను కలిసి లిఖిత పూర్వకంగా పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సర్పంచ్, ఉప సర్పంచ్ల జాయింట్ చెక్పవర్లో చట్ట ప్రకారం చెక్కుల ద్వారా నిధులను వినియోగించాల్సి ఉండగా గత నెల 31న సర్పంచ్, కార్యదర్శులు చెక్కులను పాస్ చేసుకొని నిధులను వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నారని ఆరోపించారు. అధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో రఫీక్, అర్జున్, నాగేష్, గంగాధర్ ఉన్నారు. సుభాష్నగర్: నగరంలోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో బోధన్ డివిజన్లోని పీహెచ్సీ, పల్లె దవాఖానలు, ఉప కేంద్రాల్లో పనిచేస్తున్న ఎంఎల్హెచ్పీ, ఏఎన్ఎం, డీఈవోలకు హెచ్ఎంఐఎస్పై డీఎంహెచ్వో రాజశ్రీ గురువారం శిక్షణనిచ్చా రు. గర్భిణుల పేర్ల నమోదు, ప్రసవాలు, వ్యాధి ని రోధక టీకాలు, మాతా శిశు మరణాలు, జీవన శైలి వ్యాధులపై చేస్తున్న నిర్ధారణ పరీక్షలు, తదితర సే వలను హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హె చ్ఎంఐఎస్)లో ఏఎన్ఎంలు వెంటనే నమోదు చేయాలని సూచించారు. గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు వడదెబ్బకు గురికాకుండా అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ వినయ్కుమార్, వెంకటేష్, శ్రావ్య, డీహెచ్ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, సలీం తదితరులు పాల్గొన్నారు. -
యువతి ఆత్మహత్య
వర్ని: మండలంలోని పాత వర్ని గ్రామానికి చెందిన సువర్ణ (23) బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. కొంతకాలంగా వీరి కుటుంబం సత్యనారాయణపురంలో నివసిస్తోందని, కుటుంబకారణాలతో సువర్ణ బలవన్మరణానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. మృతురాలి తండ్రి గంగారాం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. పిట్లం(జుక్కల్): మతిస్థిమితంలేని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లంకు చెందిన గొల్ల శ్రీనివాస్ (30) కొంతకాలంగా మతిస్థిమితంలేక హైదరాబాద్లోని ఎర్రగడ్డ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గురువారం ఉదయం 9 గంటలకు ఇంట్లోంచి వెళ్లగా, 11 గంటలకు శ్రీనివాస్ పెద్ద చెరువులోకి వెళ్లడాన్ని గమనించిన గ్రామానికి చెందిన గొల్ల సాయిలు తండ్రి బాగాయ్యకు ఫోన్ చేసి తెలిపాడు. వెంటనే వారు అక్కకి వెళ్లి చూడగా చెరువు ఒడ్డుపై చెప్పులు కనిపించాయి. జాలర్లను పిలిపించి వెతికించగా ఒడ్డుకు కొద్దిదూరంలో శ్రీనివాస్ మృతదేహం లభించింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
జీవశాస్త్ర పరిశోధనలో మాలిక్యులర్ సాంకేతికతకు ప్రాధాన్యం
తెయూ(డిచ్పల్లి): ఆధునిక జీవశాస్త్ర పరిశోధనలో మాలిక్యులర్ సాంకేతికత ఎంతగానో ప్రాముఖ్యత వహిస్తుందని హైదరాబాద్ యూనివర్సిటీ ప్రొఫెస ర్ రాజగోపాల్ పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘హైమీడియా లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో గురువారం ‘జెనోమిక్ – ప్లాస్మిడ్ డీఎన్ఏ ఐసోలేషన్ అండ్ జెల్ ఎలెక్ట్రోఫోరేసిస్ టెక్నిక్స్’ అనే అంశంపై ఒక రోజు వర్క్షాప్ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ప్రొఫెసర్ రాజగోపాల్ మాట్లాడుతూ డీఎన్ఏ ఐసోలేషన్లో సంప్రదాయ పద్ధతులు, ఆధునిక కిట్ ఆధారిత పద్ధతులపై వచ్చిన మార్పు లపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం హైమీడియా లాబొరేటరీస్ నిపుణులు కిరణ్ కుమార్, రాజేశ్ గౌడ్ ప్రసంగించారు. కార్యక్రమంలో సైన్స్ డీన్ ప్రొఫెసర్ సంపత్కుమార్, విభాగాధిపతి అబ్దుల్ అలీమ్ ఖాన్, బీవోఎస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.అరుణ, ప్రొఫె సర్ విద్యావర్థిని, అధ్యాపకులు డీ శ్రీనివాస్, వీ జలంధర్, పీ సుబ్రమణ్యం, ప్రవీణ్, సంతోష్, అమ్రీన్ ఆరా తదితరులు పాల్గొన్నారు. -
సీబీఎస్ఈ ఫలితాల్లో ఎస్ఎస్ఆర్ ప్రభంజనం
ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ఆర్ డిస్కవరీ స్కూల్ విద్యార్థులు సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు చైర్మన్ డాక్టర్ మారయ్యగౌడ్ గురువారం తెలిపారు. పాఠశాల టీచర్లు, సిబ్బంది శ్రద్ధ, విద్యా ప్రమాణాలపై ఉన్న అంకితభావంతో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు చెప్పారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. మొత్తం 500 మార్కులకు విద్యార్థులు రయాన్ మహ్మద్ అన్సార్ 461, ఖవైష్ శర్మ 446, తనయ నలే 444, ఆకారం విహాన్ 444, భవానీ నందిత 441, గజాలే చరణ్ 440, బస్వచేతన్ జుబ్రే 439, చందా హర్షిత్ 437, మెడికొండ సలోమి 436, సుబియా ఇరామ్ 433, జరుపుల కార్తికేయ పవర్ 422 మార్కులు సాధించారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ భాస్కర్, టీచర్లు, సిబ్బంది ఉన్నారు. ప్రతిభచాటిన ప్రెసిడెన్సీ విద్యార్థులు.. జిల్లా కేంద్రంలోని ప్రెసిడెన్సీ హైస్కూల్ విద్యార్థులు సీబీఎస్ఈ పరీక్షల్లో ఫలితాల్లో జిల్లా టాపర్గా నిలిచినట్లు చైర్పర్సన్ నల్ల శకుంతల గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సమీహా ఫాతిమా 485, మీర్ యాసిన్ అలీ 481, ఏలేటి మిథిలా 480, శ్రీ వెన్నెల 479, సిరివెన్నెల 478, మిథున్ 478, రామర్తి ఉషశ్రీ 476 మార్కులు సాధించారని పేర్కొన్నారు. విద్యార్థుల విజయానికి కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులను యాజమాన్యం, ప్రిన్సిపాల్ పవన్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. -
ఉపాధికి హాజరు తంటాలు
డొంకేశ్వర్(ఆర్మూర్) : ఉపాధిహామీ పథకంలో (వీబీ జీ రామ్జీ) పారదర్శకత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం’ యాప్ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో కూలీలకు శాపంగా మారింది. తాజాగా అమల్లోకి వచ్చిన ముఖ ఆధారిత హాజరు విధానం అనేక సాంకేతిక ఇబ్బందులకు దారితీస్తోంది. కూలీలు గడ్డం పెంచుకున్నా, గుండు గీసుకున్నా, వయస్సు ప్రభావంతో ముఖంలో వచ్చే మార్పుల వల్ల ‘యాప్’ వారిని గుర్తించడం లేదు. కూలీల హాజరును నమోదు చే సేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు అనేక తంటాలు పడుతున్నారు. మూడేళ్ల కిందటి వరకు ఉపాధిహామీ పనులకు వస్తున్న కూలీల హాజరును మస్టర్లలో ఎంట్రీ చేసే వారు. స్మార్ట్ ఫోన్లలో ఫొటో విధానం ఉండేది కాదు. హాజరు విధానాన్ని పటిష్టం చేయడానికి కేంద్రం ఎన్ఎంఎంఎస్ యాప్ను తీసుకొచ్చింది. రెండు నెలల కిందటి వరకు కేవలం గ్రూప్ సభ్యుల ఫొటోను క్యాప్చర్ చేస్తే సరిపోయేది. అయితే మరింత పారదర్శకత కోసం పనికి వచ్చిన ప్రతి ఒక్కరి ఫొటోను నమోదు చేయాలనే నిబంధనను తీసుకొచ్చింది. ఇందుకోసం కూలీలందరి ఆధార్ను అనుసంధానం చేసి కేవైసీ చేశారు. గతంలో తీసుకున్న ఫొటో, కనుపాపల ఆధారంగా కూలీల హాజరును స్కాన్ చేసి తీసుకుంటున్నారు. ప్రస్తుతం కూలీల వయసు పెరిగి ముఖ కవళికలు కొద్దిగా మారాయి. గడ్డం పెంచినా, గుండు ఉన్నా, కళ్లలో మార్పులు వచ్చినా యాప్లో ‘మిస్ మ్యాచ్’ అని చూపిస్తోంది. వెలుతురు సరిగ్గా లేకపోయినా, నీడ పడినా, నెట్వర్క్ లేకపోయినా, ఫీల్ట్ అసిస్టెంట్ల సెల్ఫోన్ కెమె రా క్లారిటీ లేకపోయినా కూలీల హాజరు నమోదుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. కూలీల హాజరు నమోదు కాకపోతే ఆ రోజు వారు ఇంటికి వెళ్లాల్సిందేనని ఫీల్ట్ అసిస్టెంట్లు పేర్కొంటున్నారు. రెండో ఫొటో కోసం నాలుగు గంటలు మొబైల్ యాప్లో కూలీల హాజరును రెండు సార్లు నమోదు చేస్తున్నారు. మొదటి ఫొటోను కూలీలు ఉదయం పనికి వచ్చిన వెంటనే ఒక్కొక్కరిగా తీస్తున్నారు. అప్పుడే పని మొదలు పెడుతున్నారు. నాలుగు గంటల తర్వాత కూలీల గ్రూప్ ఫొటోను తీసి యాప్లో నమోదు చేస్తున్నారు. దీంతో పనికి వచ్చిన వారంతా నాలుగు గంటలు నిరీక్షించాల్సి వ స్తోంది. పని అయిపోయినప్పటికీ రెండో ఫొటో కో సం మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటున్నారు. కూలీలు ఉదయం 7లోపే పనికి రావాలని ఫీల్ట్ అసిస్టెంట్లు సూచిస్తున్నారు. యాప్లో తలెత్తుతున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామని, ఫేస్ మ్యాచ్ కాని కూలీలకు కొత్త ఫొటోను అప్డేట్ చేయిస్తున్నామని డొంకేశ్వర్ మండల ఏపీవో శ్రీవాణి ‘సాక్షి’తో తెలిపారు. గడ్డం పెరిగినా.. గుండు గీసినా ఫేస్ క్యాప్చర్ చేయని మొబైల్ యాప్ హాజరు పడకుంటే ఆ రోజు పనికి దూరం రెండుసార్లు ఫొటో విధానంతో ఫీల్ట్ అసిస్టెంట్లకు తంటాలు -
విద్యాశాఖను వదలని షాడో
● నలుగురు డీఈవోలు మారినా తన సీటు వదలని అధికారిణి ● తనకు నచ్చని ఉద్యోగులపై బదిలీల అస్త్రంఖలీల్వాడి: ఓ విభాగానికి ఫుల్ అడిషనల్ చార్జి(ఎఫ్ఏసీ) హోదాలో పని చేస్తున్న అధికారిణి జిల్లా విద్యాశాఖ మొత్తాన్ని ఏలుతోందని ఆ శాఖ అధికారులు, సిబ్బంది వాపోతున్నారు. నలుగురు డీఈవోలు మారినా సదరు అధికారిణి బదిలీ కాకపోవడం గమనార్హం. సదరు అధికారిణికి ఓ జిల్లాకు డీఈవోగా వెళ్లే అవకాశం వచ్చినా ఇక్కడే తిష్టవేసి ఆటాడుతోంది. శాఖలోని ఆయా సెక్షన్ల నుంచి వచ్చే ఫైల్స్ను తన వద్దే పెట్టుకొని చివరకు సంతకాలు లేకుండా జిల్లా అధికారి వద్దకు పంపించిన ఘటనలున్నాయని ఆ శాఖ సిబ్బంది అంటున్నారు. బదిలీ కోసం ‘విల్లింగ్’ ఇచ్చే సదరు అధికారిణి అసలు సమయానికి తనకు బదిలీ కాకుండా పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్లో ‘మేనేజ్’ చేసుకుంటోందనే ఆరోపణలున్నాయి. తన సీటును వదలని అధికారిణి నచ్చని ఉద్యోగులను విద్యాశాఖ కార్యాలయం నుంచి పాఠశాలలకు బదిలీ చేస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. డీఈవో కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తూ నిక్కచ్చిగా వ్యవహరించిన ఓ సీనియర్ ఉద్యోగిని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఓ పాఠశాలకు జూనియర్ అసిస్టెంట్గా బదిలీ చేయడం గమనార్హం. దీంతో సదరు నాలుగు నెలలపాటు సెలవులో వెళ్లగా, ఆయన దరఖాస్తు సెక్షన్ నుంచి సదరు మహిళా ఆఫీసర్ వద్దకు చేరింది. సెలవుపై వెళ్లిన ఉద్యోగికి నాలుగు నెలల వేతనం మంజూరు కావడంతో తీవ్రస్థాయిలో ఆరోపణలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆ వేతనం మొత్తాన్ని చలాన్ రూపంలో వసూలు చేసిన అధికారిణి.. తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా సెక్షన్లోని పలువురికి మెమోలు ఇచ్చి చేతులు దులుపుకున్నట్లు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ లేకుండా పాఠశాల విద్య డైరెక్టరేట్లో చక్రం తిప్పినట్లు సమాచారం. గతంలో సదరు అధికారిణికి ఇన్చార్జి డిప్యూటీ డీఈవోగా బాధ్యతలు దక్కగా.. కొన్నిరోజుల్లోనే తనకు అనుకూలంగా లేరనే ఉద్దేశంతో కొంత మందిని పాఠశాలలకు, మండలాలకు బదిలీ చేయడం అప్పట్లో చర్చకు దారి తీసింది. విద్యాశాఖలో వివిధ పనుల కోసం ఆయా సెక్షన్ల కు వచ్చే వారిని అటకాయించే అధికారిణి.. సెక్షన్కు ఎందుకు వస్తారు వారిని ఏసీబీకి పట్టించడం, ఆర్టీ ఐ దరఖాస్తు పెట్టండి అంటూ రెచ్చగొడుతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. ఆ అధికారిణి ఉన్నతస్థానంలో ఉండడంతో మిన్నకుండిపోతున్నారు. ఫైనాన్స్ వింగ్కు ఎఫ్ఏసీగా పని చేస్తున్న అధికారిణి కి పనుల్లో నిర్లక్ష్యం కారణంగా షోకాజ్ నోటీసులు అందినట్లు తెలిసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ పబ్లిక్ స్కూళ్లపై ఇటీవల కలెక్టర్ ఇలా త్రిపాఠి సమీక్ష నిర్వహించారు. పదో తరగతి పరీక్షలు ఉండటంతో జిల్లా అధికారి అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్ సదరు మహిళా ఆఫీసర్ను పిలిపించి తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల వివరాలు చెప్పాలనగా.. తన వద్ద సమాచారం లేదని చెప్పడం గమనార్హం. సమాచారం లేనప్పుడు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కలెక్టర్ ఆమైపె మండిపడినట్లు తెలిసింది. -
నిట్ట నిలువు ఎండ!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. దక్షిణ తెలంగాణ జిల్లాలతో పోలిస్తే ఉత్తర తెలంగాణ జిల్లాలు ఎక్కువ ఎత్తులో ఉండడంతో సూర్య కిరణాలు నిట్టనిలువుగా భూమిని తాకుతాయి. ఉత్తర తెలంగాణలో గత వారం రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజాగా గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలోని భీమ్గల్లో 43.5 డిగ్రీలు, సరిహద్దులోని నిర్మల్ జిల్లా తానూరులోనూ 43.5 డిగ్రీలు కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూరులో 43.4 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా భీమారంలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేసవి ప్రారంభం నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడం గమనార్హం. ఈ నెల 12వ తేదీన భీమ్గల్లో 39.11 డిగ్రీలు, 14న ఆలూరు మండలం మచ్చర్లలో 43.2 డిగ్రీలు, 15న 43.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతను పెంచుతున్న పొడిగాలులు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడానికి భౌగోళిక కారణాలు సైతం ఉన్నాయి. ఈ ప్రాంతాలు సముద్ర తీరానికి దూరంగా ఉండడంతో ఇక్కడ ‘టోపికల్ సవన్నా’ (అధిక ఉష్ణోగ్రతలు, స్పష్టమైన వర్షాకాలం) వాతావరణం ఉంటుంది. సముద్రపు గాలుల ప్రభావం లేకపోవడంతో వేడి తీవ్రత నేరుగా ఉంటుంది. దీంతో ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాలు అత్యధికంగా వేడి గాలుల ప్రభావానికి లోనవుతున్నాయి. ఈ ప్రాంతం మీదుగా వీచే పొడిగాలులు ఉష్ణోగ్రతను పెంచుతాయి. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం దేశంలోనే అత్యంత వేడి ప్రాంతాల్లో ఒకటి. ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు విదర్భ ప్రాంతానికి సరిహద్దుల్లో ఉండడంతో అక్కడి నుంచి వీచే పొడి, వేడి గాలులు జిల్లాపై ప్రభావం చూపుతున్నాయి. పైగా వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళంలో కర్కాటక రేఖకు దగ్గరగా ఉంటా డు. ఉత్తర తెలంగాణ భౌగోళికంగా ఆ అక్షంశాల కు దగ్గరగా ఉండడంతో సూర్య కిరణాలు నిలువు గా పడి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అడవుల శాతం తగ్గడం, భవనాలు, రోడ్లు వంటి కాంక్రీట్ నిర్మాణాలు ఎక్కువగా ఉండ డంతో వేడి తీవ్రత పెరుగుతోంది. పైగా నల్లరేగడి, రాతినేలలు ఎక్కువగా ఉండడంతో పగటిపూట పీల్చుకున్న వేడి రాత్రి వేళ్లలో బయటకు వస్తోంది. మరోవైపు కొన్నేళ్లుగా పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ ప్రభావం సైతం ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2నుంచి 3డిగ్రీలు ఎక్కువ పెరిగేందుకు కారణమవుతున్నాయి.విదర్భ వేడి సైతం ఉత్తర తెలంగాణపై.. నల్లరేగడి, రాతినేలలు పీల్చుకున్న వేడితో రాత్రి సమయాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు ఉత్తర తెలంగాణ కర్కాటక రేఖకు దగ్గరగా ఉండడమూ కారణమే గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా భీమ్గల్, తానూరు ప్రాంతాల్లో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు -
బహిరంగ వేలంలోనే పసుపు కొనుగోళ్లు
● ఈ – నామ్ 2.0లో కొనసాగిన సాంకేతిక సమస్యలు ● రైతుల విజ్ఞప్తి మేరకు ఓపెన్ ఆక్షన్లోనే క్రయవిక్రయాలు సుభాష్నగర్: నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్యార్డులో గురువారం బహిరంగ వేలం విధానంలోనే పసుపు కొనుగోళ్లు చేపట్టారు. ఈ – నామ్ 2.0లో సాంకేతిక సమస్యల కారణంగా రైతుల విజ్ఞప్తి మేరకు ఓపెన్ ఆక్షన్లోనే క్రయవిక్రయాలు కొనసాగించారు. అంతకుముందు చైర్మన్ ముప్ప గంగారెడ్డి వ్యాపారులు, మార్కెట్ కమిటీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆన్లైన్ విధానంలోనే క్రయవిక్రయాలకు సులువుగా ఉందని వ్యాపారులు ముక్తకంఠంతో చెప్పారు. సాంకేతిక సమస్యలు పరిష్కరిస్తే ఈ–నామ్ 2.0ను కొనసాగిస్తామని మార్కెట్ అధికారులు సైతం ప్రకటించారు. కానీ గురువారం ఈ – నామ్ 2.0లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. రైతుల విజ్ఞప్తి మేరకు మైక్లో బహిరంగ ప్రకటన చేశారు. పంట విక్రయాన్ని రైతుల ఇష్టానికే వదిలేశారు. రైతుల విజ్ఞప్తి మేరకు బహిరంగ వేలం విధానంలోనే కొనుగోళ్లు చేపట్టారు. -
నేడు టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో నిరసన
నిజామాబాద్అర్బన్ : పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ సుమన్ కుమార్ తెలిపారు. గురువారం కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు మేరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన చేపడుతున్నామని తెలిపారు. మీ సేవ కేంద్రంలో ఏసీబీ తనిఖీలు నిజామాబాద్అర్బన్: నగరంలోని శివాజీ చౌక్లో సాయికృపా ఆన్లైన్ మీసేవ కేంద్రంలో గురువారం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మీసేవ కేంద్రాలలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దరఖాస్తుదారుల నుంచి అనధికారికంగా డబ్బులు వసూలు చేయడం, మధ్యవర్తులు, ఏజెంట్ల ద్వారా అక్రమ లావాదేవీలు, నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫికెట్ల జారీ తదితర ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపడుతున్నారు. కీటక జనిత వ్యాధుల నియంత్రణకు కృషి చేయాలి సుభాష్నగర్: కీటక జనిత వ్యాధుల నియంత్రణకు వైద్యారోగ్య శాఖ సిబ్బంది కృషి చేయాలని డీఎంహెచ్వో డాక్టర్ బి రాజశ్రీ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో గురువారం కీటక జనిత వ్యాధుల నియంత్రణపై సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ.. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల ప్రణాళికలో భాగంగా గురువారం నుంచి మే 15వ తేదీవరకు కీటక జనిత వ్యాధుల నియంత్రణ, వడదెబ్బ నియంత్రణ, టీబీ ముక్త్ భారత్పై కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కీటక జనిత వ్యాధుల నియంత్రణలో పని చేసే సబ్ యూనిట్ అధికారులు, పర్యవేక్షక అధికారులు, ల్యాబ్ టెక్నీషియన్లు విధుల్లో నాణ్యమైన సేవలు అందించాలన్నారు. 30 రోజుల కార్యక్రమానికి సంబంధించి ప్రతిరోజూ రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుందన్నారు. సమీక్షలో డీఎంవో వినయ్కుమార్, ఏఎంవో షేక్ సలీం, సబ్ యూనిట్ అధికారులు, పర్యవేక్షక అధికారులు, ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం సుభాష్నగర్: నగరంలోని వినాయక్నగర్ డీ–4 సెక్షన్ పరిధిలో 11 కేవీ లైన్ల కింద చెట్ల కొమ్మలు నరికివేత కారణంగా శుక్రవారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని టౌన్–3 ఏడీఈ వినోద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాందేవ్ సూపర్మార్కెట్ ఏరియా, దుర్గామాత టెంపుల్ ప్రాంతం, గణపతుల బావి కాలనీ, రిలయన్స్ మాల్ ఏరియా, వెస్ట్ సైడ్ షాపింగ్ మాల్, తొలి మేయర్ కమాన్ ఏరియా, ఐదు చేతుల పోచమ్మ గుడి ప్రాంతం, యాదగిరి బాగ్, హనుమాన్ నగర్, పద్మానగర్ రోడ్ నెంబర్ 1 నుంచి 4 వరకు, రైతుబజార్ బ్యాక్ సైడ్, మైసమ్మగల్లి, చైతన్య స్కూల్ ఎదురుగల్లి, పాటిగల్లి, బజరంగ్ కాలనీ, చింతచెట్టు మైసమ్మ కమాన్ ఏరియాల్లో విద్యుత్ సరఫరాను నిలిపేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని వినోద్ కోరారు. -
ఆంజనేయులు ప్రొఫెసర్
తెయూ నూతన పాలకమండలి తెయూ(డిచ్పల్లి) : తెలంగాణ యూని వర్సిటీ నూ తన పాలకమండలి (ఈసీ) సభ్యులను ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం నియమించింది. పాలకమండలి నామినేటెడ్ సభ్యులుగా తెయూ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ప్రొఫెసర్ సీహెచ్ ఆంజనేయులు, సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్ ఆర్.సుధాకర్ గౌడ్, వర్సిటీ అనుబంధ కళాశాల గౌతమి పీజీ కళాశాల ప్రిన్సిపాల్ కే.సంజీవరావు, ప్రభుత్వ గిరిరాజ్ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ దండు స్వామి, ఇందూరు పీజీ కాలేజ్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ మదన్మోహన్ దేవబక్తునితోపాటు పలు సామాజిక విభాగాల నుంచి చెరు కూ రి రజినీకాంత్ (కాకతీయ విద్యాసంస్థలు), అల్లె లావణ్య, మహమ్మద్ ఘాజీ, ఎస్.జయంత్ను ప్రభుత్వం నియమించింది. పాలకమండలి క్లాస్–1 సభ్యులుగా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, ఆ ర్థిక శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, కళాశాల వి ద్యా శా ఖ కమిషనర్ శ్రీదేవసేనతో పాటు పా లకమండలి చైర్మన్గా వైస్ చా న్స్లర్ ప్రొఫె సర్ టి.యాదగిరిరావు, కార్యదర్శిగా రిజిస్ట్రా ర్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి వ్యవహరిస్తారు. గత పాలకమండలి గడువు ఫిబ్రవరి 2024 ముగియగా, రెండేళ్ల రెండు నెలల సుదీర్ఘ కాలం తర్వాత ప్రభుత్వం పాలకమండలి నియమించడంతో వర్సిటీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. నూతన పాలక మండలి సభ్యులుగా నియమితులైన వారికి పలురువు శుభాకాంక్షలు తెలిపారు. రజినీకాంత్ కాకతీయ సంస్థలు -
కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే..
● రైతులకు ఇబ్బందులు ● డీసీసీ అధ్యక్షుడు నగేష్రెడ్డి నిజామాబాద్ రూరల్: కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను మార్కెట్ కమిటీ చైర్మన్గా కొనసాగిన సమయంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని సమయస్ఫూర్తితో పరిష్కరించినట్లు గుర్తు చేశారు. దేశంలోనే 10 లక్షల క్వింటాళ్ల పసుపు వచ్చే నిజామాబాద్ మార్కెట్కు సాంగ్లీ, ఈ–రోడ్ మార్కెట్లతో పోటీ ఉంటుందని అన్నారు. 2016లో ఆన్లైన్ సాఫ్ట్వేర్ పద్ధతిని ప్రారంభించామని, రెండు నెలల క్రితం వరకు అదే సాఫ్ట్వేర్ కొనసాగిందని, కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 2.0 సాఫ్ట్వేర్లో నిజామాబాద్ మార్కెట్ను పొందుపర్చకపోవడంతో ఇబ్బందులు వచ్చినట్లు పేర్కొన్నారు. జిల్లాలో పసుపు బోర్డు ఉన్నప్పటికీ ఎందుకు నమోదు చేయలేదని బీజేపీ నాయకులను నగేష్రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి మార్కెట్ కమిటీ చైర్మన్ సాంగ్లీ మార్కెట్లో ఉన్న ధరను ఇక్కడ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారని రైతులు ఆందోళన చెందొద్దని తెలిపారు. ఎంపీ అర్వింద్ పసుపు బోర్డు తెచ్చానని గొప్పలు చెప్పుకుంటున్నాడని, బోర్డు ద్వారా ప్రయోజనం ఉంటే రైతులు ఎందుకు ధర్నాలు చేస్తున్నారో చెప్పాలన్నారు. సమావేశంలో డీసీసీ కోశాధికారి భక్తవత్సలం, డీసీసీ ఉపాధ్యక్షుడు కౌడపు శరత్ కుమార్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు యాదగిరి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
న్యాల్కల్లో మహిళ హత్య!
నిందితుల కోసం గాలింపు చర్యలు మోపాల్: మండలంలోని న్యాల్కల్ శివారులోగల ఫౌల్ట్రీ ఫామ్లో పూజిత (30) మంగళవారం అర్ధరాత్రి హత్యకు గురైంది. భర్త అర్జున్ రాథోడ్, ఆయన పెద్ద భార్య రాధ ఆమెను హత్య చేసి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీఐ సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. న్యాల్కల్ శివారులోని కంటేగారి నవీన్రావుకు లక్ష్మీనర్సింహ ఫౌల్ట్రీ ఫామ్ ఉంది. ఆ ఫామ్లో పని చేయడానికి నెల రోజుల క్రితం మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన అర్జున్ రాథోడ్ తన ఇద్దరు భార్యలు రాధ, పూజితతో వచ్చాడు. పక్కనే ఉన్న రేకుల షెడ్డులో ఉంటూ పని చేస్తున్నారు. ఈ క్రమంలో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు యజమాని నవీన్రావు సముదాయించి సర్ధి చెప్పారు. తాజాగా మంగళవారం కూడా ముగ్గురి మధ్య గొడవ జరిగింది. అర్జున్ రాథోడ్ చిన్న భార్య పూజితను కర్రతో చితకబాది హత్య చేసి పెద్ద భార్య రాధతో కలిసి పరారయ్యాడు. రోజూవారీలాగే యజమాని నవీన్రావు పౌల్ట్రీ ఫామ్ వద్దకు వచ్చి చూడగా కోళ్లు అరుస్తున్నాయి. వెంటనే అర్జున్ రాథోడ్కు ఫోన్ చేయగా ఆయన భార్య రాధ ఫోన్ లిఫ్ట్ చేసింది. ఆరోగ్యం బాగోలేకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చామని, అర్జున్ మెడికల్ షాప్కు వెళ్లాడని చెప్పింది. కోళ్లు అరుస్తున్నాయని, దాణా పెట్టలేదా అని అడగగా, పూజితకు పని చెప్పు అని ఫోన్ కట్ చేసింది. పూజితను లేపేందుకు ప్రయత్నించగా, అప్పటికే మృతిచెంది ఉంది. యజమాని నవీన్రావు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన సీఐ.. మహిళ హత్యకు గురైన విషయం తెలుసుకున్న సీఐ సురేష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూజిత మృతదేహాన్ని పరిశీలించగా ఒళ్లంతా గాయాలు కనిపించాయి.క్లూస్టీం, డ్వాగ్స్క్వాడ్ను పిలిపించారు. పక్కనే కర్రను గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యజమాని నవీన్రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాగా పూజితను అర్జున్ రాథోడ్, రాధ హత్య చేసి పరారయ్యారని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. -
రుణం బంగారమాయె
ఆర్మూర్: సాధారణ, మధ్య తరగతి కుటుంబీకులకు బంగారమంటే కేవలం అలంకరణే కాదు ఆపద నుంచి గట్టెక్కించేది కూడా. వ్యక్తిగత, వ్యాపార, తదితర స్వల్పకాలిక, దీర్ఘకాలిక అవసరాల్లో తక్షణమే పొందగలిగేది పసిడి రుణం మాత్రమే. మొన్నటివరకు బ్యాంకుల్లో చాలా సులభంగా పొందే గోల్డ్ లోన్ ప్రస్తుతం కఠినతరంగా మారింది. ఆర్బీఐ తాజా నిబంధనల కారణంగా సాధారణ, మధ్య తరగతి కుటుంబీకులకు ఇబ్బందులు తప్పడం లేదు. నూతన నిబంధనలు ఇలా.. బంగారం రుణాలను అగ్రి లోన్స్, నాన్ అగ్రి లోన్స్ అంటూ రెండు భాగాలుగా విభజించారు. రూ.2.25 లక్షల రుణం తీసుకొనే వారికి నిబంధనలు కాస్త సరళతరంగా ఉన్నాయి. కానీ అంతకు మించి వ్యవసాయదారుడు రుణం తీసుకోవాలి ఉంటే పట్టాదారు పాసు పుస్తకంతో పాటు తహసీల్దార్ ధృవీకరించిన ఆదాయ ధృవీకరణ పత్రం, భూమికి చెందిన 1బీ, పశువుల వివరాలు, వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకానికి సంబంధించిన రసీదులు సమర్పించాల్సి ఉంటుంది. ఇక నాన్ అగ్రి రుణం తీసుకొనే వారికి ఐటీఆ ర్, సిబిల్, ఆదాయ ధృవీకరణ చేసుకున్నాకనే రు ణం మంజూరు చేస్తారు. గతంలో డిఫాల్టర్గా ఉండి సెటిల్మెంట్ చేసుకున్న వారికి బంగారంపై రు ణాలు ఇవ్వబడవు. ఆదాయాన్ని బట్టి ఒక్కరు మూ డు నుంచి ఐదు రుణాలను మాత్రమే తీసుకోవడానికి అర్హులు. ఆదాయ వనరులు, ఆదాయం లేని వారు రుణం పొందడానికి అనర్హులు. రెన్యూవల్లో మాత్రం నిబంధనలను సడలించింది. ఏడాదిలోపు రుణంను రెన్యూవల్ చేసుకునే వారికి వడ్డీ మాత్రమే చెల్లించేలా వెసులుబాటును కల్పించింది. ఈ వెసు లుబాటు కేవలం మూడు పర్యాయాలు మాత్రమే వర్తించనుంది. అలాగే బంగారం రుణాల మంజూ రు ప్రక్రియలో రుణగ్రహీత నిధులను ఎందుకోసం ఖర్చు చేయనున్నారనే విషయంపైనా కన్నేసి ఉంచా లని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశించినట్లు సమాచారం. అంతేకాదు, రుణగ్రహీతల బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయాలని, తాకట్టు పెట్టిన బంగారం వాస్తవ హ క్కుదారు ఎవరనేదీ తెలుసుకోవాలని నిర్దేశించిన ట్లు సమాచారం. పసిడి రుణాల వ్యాపారంలో అనైతిక వ్యవహారాలకు చెక్ పెట్టడంతోపాటు ఆర్థిక వ్య వస్థ స్థిరత్వానికి భంగం కలగకుండా చూడటమే ఆర్బీఐ ఉద్దేశంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఆర్మూర్కు చెందిన వ్యాపారి వెంకటేష్ (పేరు మార్చాము) వ్యక్తిగత అవసరాల కోసం ఇంట్లో ఉన్న బంగారు నగలను తాకట్టు పెట్టి అతి తక్కువ వడ్డీతో రుణం తీసుకోవడానికి స్థానిక జాతీయ బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకు సిబ్బంది అతడికి ఆర్బీఐ సవరించిన నిబంధనలను వివరించడంతో సదరు వ్యక్తి అయోమయానికి గురికావాల్సి వచ్చింది. గతంలో ఆ బ్యాంకులో అకౌంట్ ఉంటే చాలు బంగారం తీసుకొని వెళితే నిమిషాల వ్యవధిలో రుణం మంజూరు చేసే వారు. కానీ తాజా నిబంధనల ప్రకారం తన సొంత బంగారాన్ని తాకట్టు పెట్టడానికి కూడా అతడి ఆదాయాన్ని ధృవీకరించే ఇన్కం టాక్స్ రిటన్స్ (ఐటీఆర్) సమర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా సిబిల్ను పరిశీలించి రుణం తీసుకోవడానికి అర్హత ఉంటేనే రుణం ఇస్తామంటూ వివరించారు. సదరు వ్యక్తికి అప్పటికే ఇంటిపై, కారుపై రుణాలు ఉండటంతో బంగారం తనఖాతో రుణం తీసుకోవడానికి అనర్హుడిగా పేర్కొన్నారు. దీంతో అతడు నిరాశతో వెనుదిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆర్బీఐ బంగారం తనఖా రుణాలపై తెచ్చిన నిబంధనలు రుణ గ్రహీతలకు ఇబ్బందికరంగా ఉంటుందన్నది తెలుస్తోంది. తాజా నిబంధనలతో బంగారం రుణాలు తగ్గిపోయే అవకాశం ఉంది. ఆర్బీఐ నిబంధనలను అమలు చేస్తూ ఏడాది పూర్తిచేసుకోనున్న బంగారు రుణాలను వడ్డీ మాత్రమే తీసుకొని రెన్యూవల్ చేస్తున్నాం. – సుంకం వీర గణేష్ చారి, గోల్డ్ అప్రైజర్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆర్మూర్ గోల్డ్లోన్ నిబంధనలు కఠినతరం చేసిన ఆర్బీఐ ఆదాయం లేని వారు రుణం పొందడానికి అనర్హులు రెన్యూవల్కు మాత్రం మినహాయింపు -
పుస్తక పఠనం నిరంతరం కొనసాగాలి
● తెయూ వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు ● లైబ్రరీ ఫెస్ట్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు తెయూ(డిచ్పల్లి): పుస్తక పఠనం నిరంతరం కొనసాగాలని, విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకొని వాటి సాధనకు కృషి చేయాలని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు సూచించారు. తెయూ సెంట్రల్ లైబ్రరీలో బుధవారం నిర్వహించిన లైబ్రరీ ఫెస్ట్–2026 కార్యక్రమానికి వీసీ ముఖ్యఅతిథిగా హాజరైన ప్రసంగించారు. తరగతి గది బోధనతోపాటు లైబ్రరీలో నేర్చుకునే విద్యకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన, ఉపయోగకరమైన అన్నిరకాల పుస్తకాలను అందుబాటులో ఉంచేందుకు యూనివర్సిటీ కట్టుబడి ఉందని చెప్పారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి మాట్లాడుతూ పుస్తక పఠనం విద్యార్థుల్లో లోతైన అవగాహనతోపాటు విశ్లేషణాత్మక దృష్టిని పెంపొందిస్తుందన్నారు. విద్యార్థులు ప్రతిరోజూ ల్రైబరీలో పుస్తక పఠనం కోసం సమయం కేటాయించాలని సూచించారు. కీనోట్ స్పీకర్ ప్రొఫెసర్ సీహెచ్ ఆంజనేయులు మాట్లాడుతూ.. పుస్తక పఠనం ద్వారా పద సంపద, వ్యాకరణం మెరుగుపడతాయని తెలిపారు. విద్యార్థులు ప్రముఖ, గొప్ప రచయితలు రాసిన ప్రేరణాత్మక పుస్తకాలను చదవాలని సూచించారు. లైబ్రరీ ఇన్చార్జీ, ప్రోగ్రాం కన్వీనర్ ప్రొఫెసర్ కే.లావణ్య ‘పుస్తకం వనితా విత్తం’ అనే సంస్కృత నీతి శ్లోకాన్ని ఉదహరిస్తూ, పుస్తకం, సీ్త్ర, ధనం పరాయి చేతుల్లోకి వెళ్తే తిరిగిరావని, ఒకవేళ తిరిగి వచ్చినా తరుగుతాయని వివరించారు. కార్యక్రమంలో తెలుగు విభాగాధిపతి ప్రొఫెసర్ కనకయ్య, వైస్ ప్రిన్సిపాల్ సీహెచ్ లక్ష్మణచక్రవర్తి, కోకన్వీనర్ డి.సత్యనారాయణ, వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కన్వీనర్ ప్రొఫెసర్ లావణ్య వీసీ, రిజిస్ట్రార్తోపాటు వక్తలకు ప్రముఖ రచయిత అద్దంకి శ్రీధర్ బాబు రచించిన ‘సక్సెస్ సాధనకు 30 సూత్రాలు’ అనే పుస్తకాన్ని బహూకరించారు. అంతకుముందు లైబ్రరీ ఫెస్ట్లో భాగంగా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను వీసీ, రిజిస్ట్రార్లు తిలకించి నిర్వాహకులను అభినందించారు. -
స్కానింగ్ సెంటర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
● అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ సుభాష్నగర్: జిల్లాలోని స్కానింగ్ సెంటర్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్, రెన్యూవల్ చేయించుకోవాలని అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో బుధవారం జిల్లాస్థాయి మ ల్టీమెంబర్ అప్రొప్రయేట్ అథారిటీ సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్కుమార్ మా ట్లాడుతూ స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయకూడదన్నారు. స్కానింగ్ సెంటర్ నిర్వాహకులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. డీఎంహెచ్వో రాజశ్రీ మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లు తప్పనిసరిగా రెన్యూవల్ చేసుకోవాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తన దృష్టికి వస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్తగా ఒక స్కానింగ్ సెంటర్, మూడు రెన్యూవల్, రెండు స్కానింగ్ సెంటర్ల మూసివేతకు కమిటీ ఆమోదం తెలిపింది. సమావేశంలో అథారిటీ సభ్యులు డాక్టర్ సుప్రియ, డాక్టర్ శిఖర, డాక్టర్ శ్వేత, స్పెషల్ బ్రాంచ్ సబ్ ఇన్స్పెక్టర్, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య పాల్గొన్నారు. -
హెచ్చరికలు పట్టవా?
రహదారులపై ధాన్యం ఆరబెట్టడంతో నిత్యం ఏదో ఒకచోట వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ రహదారులపై ధాన్యం ఆరబోయకూడదని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. హెచ్చరిక బోర్డులనూ ఏర్పాటు చేస్తున్నారు. అయినా కూడా కొందరు రోడ్లపైనే ధాన్యం ఆరబోస్తున్నారు. సిరికొండ మండల పరిధిలోని భీమ్గల్ – కామారెడ్డి ప్రధాన రహదారిపై పోలీసులు ఒకవైపు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా అవేమీ పట్టనట్లు కొందరు రైతులు రోడ్డుపైనే ధాన్యం ఆరబోశారు. అయితే గిడ్డంగులు, ఎండబెట్టే ప్రదేశాలు లేకపోవడంతోనే రోడ్లపైన ధాన్యం ఆరబోస్తున్నామని రైతులు చెప్తున్నారు. – సాక్షి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
మంత్రికి ప్రముఖుల స్వాగతం
నిజామాబాద్ అర్బన్: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా బుధవారం నగరంలో నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఆయనకు కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయి చైతన్య, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. కలెక్టరేట్లోని హెలిప్యాడ్ వద్ద కలెక్టర్, సీపీతోపాటు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మేయర్ ఉమారాణి, అదనపు కలెక్టర్ దిలీప్కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, ఇతర జిల్లా అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కంఠేశ్వర్ బైపాస్ వద్ద నిర్వహించిన మానవహారంలో పాల్గొన్నారు. -
అడ్వకేట్స్ సొసైటీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం
నిజామాబాద్ లీగల్: జిల్లా న్యాయవాదుల పరస్పర కో–ఆపరేటివ్ సొసైటీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం న్యాయవాదులు నామినేషన్ పత్రాలు తీసుకున్నట్లు ఎన్నికల అధికారులు డాక్టర్ పులి జైపాల్, జగన్మోహన్ గౌడ్ తెలిపారు. డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామశివారులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాలకు చెందిన విద్యార్థిని భావన జాతీ యస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ నళిని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల మహబూబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ అండర్–14 స్కూల్ గేమ్స్ పోటీలలో ప్రతిభను కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. ఈనెల 16 నుంచి 22 వరకు న్యూఢిల్లీలో జరగబోయే జాతీయస్థాయి అండర్ –14 సాఫ్ట్బాల్ పోటీలలో భావన పాల్గొంటుందని ప్రిన్సిపాల్ తెలిపారు. భావనను ప్రిన్సిపాల్ నళినితోపాటు జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ వనిత, పీటీ నర్మద, సాఫ్ట్బాల్ అకాడమీ కోచ్ వేముల మౌనిక, ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు. ఖలీల్వాడి: పదో తరగతి వార్షిక పరీక్షలకు 32 మంది గైర్హాజరైనట్లు డీఈవో పార్శి అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం జరిగిన వొకేషనల్ పరీక్షకు 2,207 మంది విద్యార్థులకు 2175 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. 21 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించారు. ముగ్గురు డిబార్ ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశా ల (స్వయం ప్రతిపత్తి) బుధవారం 6వ, 3వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు కొనసాగుతున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రామోహ్మన్రెడ్డి తెలిపారు. ఈ పరీక్షల్లో 1071 విద్యార్థులకు 1052 మంది హాజరుకాగా, 19 మంది గైర్హాజరయ్యారు. ముగ్గురు విద్యార్థులు డిబారయ్యారని పరీక్షల నియంత్రణాధికారి భరత్రాజ్ తెలిపారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయంలో పీజీ ఇంటిగ్రేటెడ్ అప్లయిడ్ ఎకనామిక్స్, ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ కోర్సుల 8 సెమిస్టర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు తనిఖీ చేశారు. వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా తగినచర్యలు తీసుకోవాలని అధ్యాపకులకు సూచించారు. ఆయన వెంట అడిషనల్ కంట్రోలర్ సంపత్ ఉన్నారు. ఈ పరీక్షల్లో 45 మంది విద్యార్థులకు 45 మంది హాజరైనట్లు కంట్రోలర్ ప్రొఫెసర్ సంపత్కుమార్ తెలిపారు. -
పార్లమెంటులో ప్రసంగించిన తెయూ విద్యార్థిని
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయ ఎంఏ ఇంగ్లిష్ విద్యార్థిని, ఎన్ఎస్ఎస్ వాలంటీర్ కీర్తన జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కించుకుంది. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్లో జరిగిన ‘నో యువర్ లీడర్’ కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. లోక్సభ సెక్రటేరియట్ ఆధ్వ ర్యంలో దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీలో ఎంపికై న 36 మంది ప్రతిభావంతులలో కీర్తన ఒకరిగా నిలిచారు. ‘డాక్టర్ అంబేడ్కర్ విజన్ ఫర్ ఇండియాస్ డెమోక్రసీ‘ అనే అంశంపై ఆమె ప్రసంగించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా కీర్తన లోక్సభ స్పీకర్ను కలవడంతోపాటు పార్లమెంటు భవనాన్ని సందర్శించారు. జాతీయ వేదికపై తెలంగాణ యూనివర్సిటీ కీర్తిని చాటిన కీర్తనను వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు. -
వివాహిత ఆత్మహత్య
నవీపేట: మండలంలోని జన్నెపల్లి గ్రామానికి చెందిన కోట గంగామణి(26) జీవితంపై విరక్తితో గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్రీకాంత్ బుధవారం తెలిపారు. నిజామాబాద్ మండలంలోని తిర్మన్పల్లి గ్రామానికి చెందిన సాయిలుతో ఏడేళ్ల కిందట వివాహం జరగ్గా, ముగ్గురు పిల్లలు ఉన్నారని పేర్కొన్నారు. రెండేళ్ల కిందట భర్త సాయిలు అనారోగ్యంతో మృతి చెందగా జన్నెపల్లిలోనే భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. జీవితంపై విరక్తితో మంగళవారం సాయంత్రం యంచ శివారులోని గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. తండ్రి భిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ పట్టణంలోని బాపూజీనగర్ కాలనీలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. చందు, కమలేశ్ అనే వ్యక్తులు బాపూజీనగర్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. బుధవారం పోలీసులకు అందిన సమాచారం మేరకు వ్యభిచార గృహంపై దాడి చేశారు. ఇద్దరు విటులను పట్టుకొని, వారి నుంచి రూ. 2,450 నగదుతోపాటు నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మహిళలను సురక్షిత ప్రాంతానికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రేషన్ బియ్యం పట్టివేత రామారెడ్డి: మండలంలోని జగదాంబ తండా చౌరస్తాలో బుధవారం ఉదయం పోలీసులు రేషన్ బియ్యం పట్టుకున్నారు. మండలానికి చెందిన జూలూరి శ్రీ చరణ్, దుద్దెల్లా రమేశ్ రెండు వాహనాల్లో 8 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేసి రెవెన్యూ సిబ్బందికి అప్పగించినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. -
ఈ నెల 24 నుంచి ఎంఈడీ పరీక్షలు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఎంఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కే సంపత్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యా హ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయని పే ర్కొన్నారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ www.telanga nauniversity.ac.inను సంప్రదించాలని సూచించారు. ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఖలీల్వాడి: ఇంటర్మీడియెట్లో ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలని డీఐఈవో తిరుమలపూడి రవికుమార్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఖిల్లా వద్ద ఉన్న ఇంటర్మీడియెట్ కార్యాలయంలో ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్లతో సమీక్ష నిర్వహించారు. అధ్యాపకుల తో వెంటనే సమావేశాలు నిర్వహించి ఫెయి ల్ అయిన విద్యార్థుల కోసం సబ్జెక్ట్ల వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని డీఐఈవో ఆదేశించారు. ప్రత్యేక తరగతులకు విద్యార్థులు, అధ్యాపకులు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చూడాలని, తక్కువ ఫలితాలు సాధించిన కళాశాలల ప్రిన్సిపాల్ లు తగిన శ్రద్ధ వహించాలని అన్నారు. కళాశాలలు పునఃప్రారంభించేలోగా అన్ని సివిల్ పనులు పూర్తి చేయించాలని, పనులకు కావాల్సిన నిధుల వినియోగంపై యుటిలైజేషన్ సర్టిఫికెట్లను డీఐఈవో ఆఫీస్లో అందజేయాలని ప్రిన్సిపాల్లకు సూచించారు. బహిరంగ వేలంతో రైతులకు నష్టం సుభాష్నగర్: పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని, నిజామాబాద్ మార్కెట్యార్డ్లో బహిరంగ వేలం ద్వారా పసుపు కొనుగోళ్లు చేపట్టడంతో మద్దతు ధర పొందలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు గంజ్లో ధర్నా చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. మార్కెట్ యార్డ్కు భారీగా పసుపు వచ్చినప్పటికీ, ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో కొనుగోళ్లు సక్రమంగా జరగడంలేదని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ అర్వింద్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ఉండి కూడా లాభం లేకుండా పోయిందని ఆరోపించారు. ఇటీవల ఎంపీ అర్వింద్ ‘ఈ–నామ్ 1.50’ కింద కొనుగోళ్లు ప్రారంభిస్తామని ప్రకటించినా.. కార్యరూపం దాల్చలేదన్నారు. దళారులు కుమ్మౖకై ్క బహిరంగ వేలం ద్వారా తక్కువ ధరకు పసుపు కొను గోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితిని సహించబోమని, రైతుల సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రశాంత్రెడ్డి హెచ్చ రించారు. ఈ–నామ్ విధానంలోనే కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. 30 డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లు స్వాధీనం సుభాష్నగర్: నగరంలోని పలు హోటళ్లలో టాస్క్ఫోర్స్ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హోటళ్లలో వినియోగిస్తున్న గృహ వినియోగ 30 ఎల్పీజీ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాణిజ్య ప్రయోజనాల కోసం డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లను వాడొద్దని, కమర్షియల్ సిలిండర్లను వాడాలని ఆదేశించారు. హోటళ్లలో డొమెస్టిక్ సిలిండర్లు వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దాడిలో టాస్క్ఫోర్స్ ఓఎస్డీ శ్రీధర్రెడ్డి, టాస్క్ఫోర్స్ డీఎస్పీ శేఖర్రెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్లు (సివిల్ సప్లయ్) పవన్కుమార్, ఎం శ్రీనివాస్, నిఖిల్ రాజ్, వినోద్, మహేష్కుమార్ పాల్గొన్నారు. -
ఏళ్ల కల నెరవేరడం గొప్పవిషయం
మహిళలకు చట్టసభల్లో కోటా కోసం బిల్లు అమోదం పొందడం హర్షణీయం. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అంశం ఇది. ఇంటిని చక్కదిద్దే మహిళలు మైక్రో (సూక్ష్మ) మేనేజ్మెంట్ నుంచి మాక్రో (స్థూల) మేనేజ్మెంట్ వరకు సమాజాన్ని దిశానిర్దేశం చేయడంలో స్ఫూర్తిదాయకంగా ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో చట్టసభల్లోనూ సముచిత స్థానం దక్కడం గర్వకారణం. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించే విషయంలో వ్యవస్థలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో భారతీయ మహిళలకు తిరుగులేని స్థానం ఉంది. – నల్ల స్రవంతిరెడ్డి, వ్యాపారి -
మార్పు రానంత వరకు ప్రమాదాలను నివారించలేం
నిజామాబాద్ అర్బన్: ‘ప్రజాపాలన – ప్రగతి ప్ర ణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా పో లీస్, రవాణా శాఖలు సంయుక్తంగా జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. హెలీకాప్టర్ ద్వా రా మధ్యాహ్నం మూడు గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకున్న మంత్రి ముందుగా నగరంలో ని ర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కోసం చేపట్టిన బైక్ ర్యాలీ ని మంత్రి పాలిటెక్నిక్ కళాశాల వద్ద జెండా ఊ పి ప్రారంభించారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని బైపాస్ చౌరస్తా వరకు డ్రైవ్ చేశారు. కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తాలో విద్యార్థులతో కలిసి మానవహారాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా అధికారులతోపాటు నగ ర మేయర్ ఉమారాణి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ తదితరులు మానవహారంలో భాగస్వాములు అయ్యారు. ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిజ్ఞ చేయించారు. అన్ని వర్గాల వారు ‘అరైవ్ – అలైవ్’లో పాల్గొని ప్రమాదాల నివారణకు తమవంతు దోహదపడాలని పిలుపునిచ్చారు. ‘‘ఎన్ని చట్టాలు, నిబంధనలు అమలు చేసినా ప్రజల్లో మార్పు రానంత వరకు ప్రమాదాలను నివారించడం సాధ్యం కాదు. అతివేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. బాధిత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.’’ – రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ -
నీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి
కమ్మర్పల్లి(భీమ్గల్): తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా మండలాల ఎంపీడీవో లు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు, ఎంపీవోలతో భీమ్గల్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సమీ క్షా సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా నీటి సరఫరా పరిస్థితి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, చేపట్టాల్సి మరమ్మతులు తదితర వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. వేసవి సీజన్ను దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరా వ్యవస్థను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించాలని సూచించా రు. అవసరమైన చోట యుద్ధప్రాతిపదికన పనులు చేప ట్టాలని ఆదేశించారు. పనులు చేపట్టే ముందు స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించాలని సూ చించారు. నివాస ప్రాంతాలతో పాటు అన్ని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలకు సమృద్ధిగా శుద్ధి జలాలు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రాజేందర్, డీపీవో శ్రీనివాస్రావు, మిషన్ భగీరథ ఈఈ రాకేశ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి.. గోన్ గొప్పుల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణను పరిశీలించిన కలెక్టర్.. తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి అనువుగా ఉందన్నారు. ఆమె వెంట డీఈవో అశోక్, ఎంఈవో స్వామి, ఎంపీడీవో సంతోష్కుమార్, తహసీల్దార్ మహ్మద్ షబ్బీర్ తదితరులు ఉన్నారు. అవసరమైన చోట్ల యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలి అధికారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం భీమ్గల్ మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష -
నిజామాబాద్
మహిళల పాత్రతో దేశానికి మేలుగురువారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026చట్టాలను రూపొందించే పార్లమెంటు, శాసన సభల్లోకి మహిళలు గణనీయమైన స్థాయిలో వెళ్లే అవకాశం రావడం చరిత్రాత్మకం. చట్టాల రూపకల్పనలో మహిళలకు కీలక పాత్ర కల్పించడంతో దేశానికి చాలా మేలు కలుగుతుంది. ఇప్పటికే మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో శాస్త్రవేత్తలుగా, టెక్నోక్రాట్లుగా, మరోవైపు న్యాయ మూర్తులుగా చరిత్రాత్మక తీర్పులు ఇస్తున్న నేప థ్యం ఉంది. న్యాయవాదులుగా కీలకమైన కేసు లు వాదిస్తూ విజయం సాధిస్తున్నారు. కార్య నిర్వాహక విభాగాల్లో, క్రీడారంగంలో, వ్యాపార రంగంలో అద్భుతాలు సాధిస్తున్నారు. చట్టసభ ల్లోనూ తిరుగులేని పాత్ర పోషిస్తారనడంలో సందేహం లేదు. – కాటిపల్లి సరళ మహేందర్రెడ్డి, హైకోర్టు న్యాయవాది -
నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్లే ప్రమాదాలు
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చే సుకుని ఎంతోమంది నిండు ప్రాణాలను కోల్పో తున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా డిచ్పల్లి మండలం బర్ధిపూర్ శివారులోని సుగుణ గార్డెన్స్లో పోలీస్, రవాణా శాఖలు సంయుక్తంగా బుధవారం నిర్వహించిన ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమానికి మంత్రి పొన్నం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజల ఆలోచనా విధానంలో మా ర్పు రావాలని, ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్క రూ స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అజాగ్రత్తగా, అతివేగంగా వాహనాలు నడపడం, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం, హెల్మెట్, సీట్బెల్ట్ ధరించకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అవుతున్నాయన్నారు. ఎవరికివారు తమవంతు బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ ను విధిగా పాటించినప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని హితవు పలికారు. జిల్లాకు త్వరలోనే కొత్త బస్ డిపో రానుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. రూరల్, అర్బన్ ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, ధన్పాల్, మేయర్ ఉమారాణి, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య తదితరులు ప్రసంగించారు. నిజామాబాద్ బస్టాండ్ను ప్రయాణీకుల తాకిడికి అనుగుణంగా నిర్మించాలని మంత్రి పొన్నం ప్రభాకర్కు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వినతిపత్రం అందజేశారు. అనంతరం వాల్ పోస్టర్లను, కర పత్రాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. రెడ్ క్రాస్ సొసైటీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజిరెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, డాక్టర్ కవితారెడ్డి, డీటీసీ దుర్గా ప్రమీల, విద్యార్థు లు, మహిళలు, యువకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలి రోడ్డు ప్రమాదాల నివారణకు స్వీయ నియంత్రణ తప్పనిసరి నిజామాబాద్ జిల్లాకు కొత్త బస్డిపో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ -
ఎన్ఆర్ఐల భద్రతకు ప్రత్యేక విభాగం
● సీపీని కలిసిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సుధాకర్గౌడ్సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎన్ఆర్ఐలు, వారి కుటుంబాల రక్షణ, భద్రత కోసం నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లు కమిషనర్ సాయిచైతన్య తెలిపారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ (లండన్) ఉపాధ్యక్షుడు ఆర్ సుధాకర్గౌడ్ సీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐలు, గల్ఫ్, అరబ్ దేశాల్లో పనిచేస్తున్న కార్మికులు, వారి కుటుంబాల భద్రత, రక్షణ విషయమై చర్చ జరిగింది. ఎన్ఆర్ఐల తరఫున సుధాకర్గౌడ్ సీపీకి రిప్రజెంటేషన్ ఇచ్చారు. వివిధ దేశాల్లో పనిచేసే ఎన్ఆర్ఐల ఆస్తుల విషయంలో కొందరు వడ్డీ వ్యాపారులు అక్రమంగా దక్కించుకునేందుకు ప్రయత్నా లు చేస్తున్నారన్నారు. ఎన్ఆర్ఐలు, వారి కుటుంబ సభ్యుల మీద వక్రమార్గాల్లో కేసులు పెట్టిస్తామని సదరు వడ్డీ వ్యాపారులు భయపెట్టిస్తున్నారన్నారు. తిరిగి ఇతర దేశాలకు వెళ్లే అవకాశం లేకుండా కేసులు పెట్టిస్తామని కొందరు బెదిరింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా ఇతర దేశాల్లో మరణించిన వారికి సంబంధించి ఆయా కుటుంబ సభ్యులను భార్యలను, పిల్లలను, ఒంటరి మహిళలను భయభ్రాంతులకు గురిచేసేవాళ్ల ఆగడాలు అరికట్టాలని కోరారు. ● స్పందించిన సీపీ.. ఎన్ఆర్ఐల కోసం సెక్యూరిటీ కౌన్సిల్లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్ఆర్ఐలు వారి తల్లిదండ్రుల, కుటుంబ సభ్యుల వివరాలు ఇస్తే ప్రతి నెలా పోలీసు శాఖ ద్వారా పరామర్శించి వారికి న్యాయపరమైన సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని సీపీ తెలిపారు. -
బహిరంగ వేలం వద్దు
సుభాష్నగర్: నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు కొనుగోళ్లు బహిరంగ వేలం విధానంలో చేపట్టవద్దని రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. వ్యాపారులు కుమ్మకై ్క పసుపు ధరకు తగ్గిస్త్తున్నారని, ఆన్లైన్ విధానంలోనే కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులంతా ఒక్కసారిగా మార్కెట్ కమిటీ కార్యాలయంలోకి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అ డ్డుకోగా, కార్యాలయ గేట్ వద్దే బైఠాయించి నినా దాలు చేశారు. దీంతో మార్కెట్ కమిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ధర పడిపోయిందని.. శుక్రవారంతో పోలిస్తే బుధవారం నాడు క్వింటాల్ కు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు వ్యాపారులు ధర తగ్గించారని రైతులు ఆరోపించారు. పసుపు కు ప్పల వద్దకు ఎక్కువ సంఖ్యలో రాకుండా కుమ్మక్కై ధర తగ్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయ గేట్ వద్ద బైఠాయింపు.. కార్యాలయం లోనికి చొచ్చుకెళ్లిన రైతులను పోలీ సులు బయటికి పంపించారు. ఒకదశలో పోలీసులు, రైతులకు మధ్య వాగ్వావాదం, తోపులాట చోటు చేసుకుంది. ఇన్చార్జి ఏసీపీ రాజా వెంకట్రెడ్డి, సీఐ శ్రీనివాస్రాజు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు చేపట్టారు. కోపోద్రిక్తులైన రైతులు గేట్ వద్దే బైఠాయించి అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మార్కెట్ అధికారులు ఈ– నామ్ ప్రతినిధులను ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ.. వారు అందుబాటులోకి రాలేదు. విషయాన్ని కలెక్టర్, మార్కెటింగ్శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ.. రైతులు మార్కెట్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీగా తరలివచ్చారు. అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ అక్కడికి చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినలేదు. ఆన్లైన్ (ఈ–నామ్) విధానంలోనే పసుపు కొనుగోళ్లు చేప డతామని అదనపు కలెక్టర్ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. నేటి నుంచి ఆన్లైన్ ద్వారానే.. మార్కెట్ యార్డులో గురువారం నుంచి పసుపు, ఇతర పంట ఉత్పత్తుల కొనుగోళ్లు ఆన్లైన్ ద్వారానే చేపట్టాలని నిర్ణయించినట్లు సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ అపర్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ–నామ్ 2.0లో సాంకేతిక సమస్యల వల్ల ఏప్రిల్ 3 నుంచి ఆన్లైన్ వేలంలో కాకుండా బహిరంగ వేలం ద్వారా క్రయవిక్రయాలు చేపట్టామన్నారు. కలెక్టర్, మార్కెటింగ్శా ఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆన్లైన్లోనే క్రయవిక్రయాలు చేపట్టాలని నిర్ణయించామని పే ర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్యార్డులో ఉన్న సరు కు పూర్తిగా అమ్మిన తర్వాతే కొత్త సరుకును అనుమతిస్తామని, రైతులు గమనించాలని కోరారు. పసుపు కొనుగోళ్లు ఆన్లైన్లోనే చేపట్టాలి వ్యాపారులు కుమ్మకై ్క ధర తగ్గిస్తున్నారని రైతుల ఆందోళన మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ హామీతో నిరసన విరమించిన రైతులు -
మండల సభలకు పకడ్బందీ ఏర్పాట్లు
● అందరినీ భాగస్వాములను చేయాలి ● టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి దిశానిర్దేశం నిజామాబాద్ అర్బన్: ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 16న మండల కేంద్రాలు, మున్సిపల్ పట్టణాల్లో నిర్వహించనున్న సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి కలెక్టర్ టెలీకాన్ఫరెనన్స్ ద్వారా అధికారులతో మంగళవా రం మాట్లాడారు. ముందస్తుగానే సభా వేదికలను సందర్శించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించాలని మండల ప్రత్యేక అధికారులను ఆదేశించా రు. ఎంపీడీవోలు, తహసీల్దార్లతోపాటు ఇతర మండల స్థాయి అధికారులతో సమావేశమై తగిన సూచనలు చేయాలన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఉదయం 8 నుంచి 10.30 గంటలలోపు సభలు ముగిసేలా చర్యలు తీసుకోవాలని, సభా ప్రాంగణాల వద్ద నీడ, తాగునీటి వసతులు కల్పించాలన్నారు. రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వంటి వాటికి సంబంధించి గ్రామ సభల్లో వచ్చిన అర్జీలను మండల సభలకు ముందు తప్పనిసరిగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సభలకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించడంతోపాటు అందరినీ భాగస్వాములను చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంపొందించేందుకు ఉద్దేశించిన ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమం గురించి సభల్లో తెలియజెప్పాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు కిరణ్కుమార్, దిలీప్కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మ హతో, అభిగ్యాన్ మాల్వియా, జెడ్పీ సీఈవో సా యాగౌడ్, డీఆర్డీవోలు సాయన్న, రాజేంద్రకుమార్, డీపీవో శ్రీనివాస్రావు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
ఆలోచనల్లో అగ్రికల్చర్
డొంకేశ్వర్(ఆర్మూర్): నేటి కాలంలో చదువుకున్న యువత ఉద్యోగాల కోసం పోటీ పడుతుంటే.. జిల్లాకు చెందిన ఓ 25ఏళ్ల యువకుడు మాత్రం తన చదువును మట్టిలో బంగారం పండించడానికి ఉపయోగిస్తున్నాడు. తాను చదివిన బీఎస్సీ అగ్రికల్చర్ విద్యను స్వగ్రామంలోనే అమలు చేస్తూ ప్రకృతి వ్యవసాయంలో అద్బుతాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు డొంకేశ్వర్ మండలం నికాల్పూర్ గ్రామానికి చెందిన జైడి గౌతమ్రెడ్డి. పైగా ఒకే భూమిలో పది రకాల పంటలు పండిస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు. ఈ యువరైతు సాగులో చూపిస్తున్న ఉత్సాహాన్ని, తెలివితేటలను చూసి తోటి రైతులు శభాష్ గౌతమ్ అని ప్రశంసిస్తున్నారు. గౌతమ్రెడ్డిది వ్యవసాయ కుటుంబం. వ్యవసాయం అంటే తనకు చిన్నప్పటి నుంచి ఇష్టం. తండ్రి జైడి తిరుపతిరెడ్డితో కలిసి వ్యవసాయ పనులకు వెళ్లేవాడు. పదో తరగతి పూర్తి కాగానే సాగు చేయాలనే తపన మరింత పెరిగింది. అందుకు తగ్గట్లుగా ఏదైనా చదువు చదువాలని నిర్ణయించుకుని హైదరాబాద్లో బీఎస్సీ అగ్రికల్చర్ను మూడేళ్ల క్రితం పూర్తి చేశాడు. తాను చదివిన చదువుకు కార్పొరేట్ కంపెనీల్లో లేదా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే అవకాశం ఉన్నా వ్యవసాయం చేయాలన్న ఆకాంక్ష ఉండి.. అన్నదాతల కష్టాలు తెలిసిన వాడు కావడంతో తన చదువును, విజ్ఞాన్ని ఉపయోగించి ప్రకృతి వ్యవసాయాన్ని మొదలు పెట్టాడు. గౌతమ్రెడ్డి ఐడియాతో ఆయిల్పాం తోటలో అంతర పంటగా సాగవుతున్న అరటి తోట జీవామృతం ఎరువును తయారు చేస్తున్న గౌతమ్రెడ్డి అంతటా బిందు సేద్యంప్రస్తుతం గౌతమ్రెడ్డి తన పొలలంలో ఎటువంటి రసాయనాలు, ఎరువులు వాడకుండా పూర్తి ప్రకృతి సిద్ధమైన పద్ధతుల్లో సాగు చేస్తున్నాడు. బెల్లం, పిండి, ఆవుపేడ, ఆవు మూత్రం, నీళ్లు తగు మోతాదులో కలిపి జీవామృతాన్ని తయారు చేసి పంటలకు అందిస్తున్నాడు. విశేషం ఏమిటంటే.. ఒకే క్షేత్రంలో జామ, ఆయిల్పామ్, అరటి, బొప్పాయి, మునగ, గోధుమ, వరి, పప్పుదినుసులు, కూరగాయలు, పసుపు పంటలు పండిస్తున్నా డు. అంతర పంటల పద్ధతిని పాటిస్తూ తక్కు వ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధిస్తున్నాడు. కాగా, వరిలో దేశీ రకాలను మాత్రమే సాగు చేస్తున్నాడు. అలాగే నీటిని పొదుపు పా టించడానికి వంద శాతం డ్రిప్ సిస్టమ్ను విని యోగిస్తున్నాడు. కూలీల అవసరం లేకుండా యాంత్రీకరణను కూడా సద్వినియోగం చేసుకుంటున్నాడు. అయితే, తన కొడుకు చేస్తున్న ప్రయోగాలు, వాటి ఫలితాలను చూసి తండ్రి తిరుపతిరెడ్డి మురిసిపోతున్నాడు. రైతు కొడుకు రైతుగా రాణిస్తున్నాడు. తమ కుటుంబానికి అన్నం పెట్టిన వ్యవసాయరంగంలోనే ఉన్నతవిద్యాభ్యాసం పూర్తి చేసి తాను పుట్టిపెరిగిన ఊరిలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. చిన్ననాటి నుంచి తండ్రి అడుగుల్లో అడుగులు వేస్తూ వ్యవసాయాన్ని దగ్గరుండి గమనించిన ఆ యువకుడు.. తన ఆలోచనల్లోనే అగ్రి‘కల్చర్’ ఉందని నిరూపిస్తున్నాడు. సాగులోనే సంతృప్తి ఉంది ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా అటు భూసారం దెబ్బతినదు, ఇటు ప్రజలకు నాణ్యమైన ఆహారం అందుతుంది. చదువుకున్న వారు వ్యవసాయంలోకి వస్తే వినూ త్న మార్పులు తీసుకురావొచ్చు. సంపాదనకు ఉద్యోగాలు మాత్రమే మార్గం కాదు. తలుచుకుంటే వ్యవసాయం కూడా లాభదాయకమే. నేను అదే దారిలో వెళ్లడం వలన తద్వారా సాగులో అసలైన సంతృప్తి లభిస్తోంది. – జైడి గౌతమ్ రెడ్డి, యువరైతు బీఎస్సీ అగ్రికల్చర్ చదివి ప్రకృతి సేద్యం ఆరు ఎకరాల్లో పది రకాల పంటలు ఉద్యోగాలను కాదనుకొని ఊరిలో అద్భుతాలు ప్రశంసలు పొందుతున్న యువ రైతు గౌతమ్రెడ్డి -
నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ రాక
నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం (నేడు) జిల్లాకు రాను న్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ‘అరైవ్ – అలైవ్’ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. పాలిటెక్నిక్ గ్రౌండ్ నుంచి డీఎస్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ, చౌరస్తాలో మానవహారం ఏర్పాటు చేయనున్నారు. అనంతరం సుగుణ గార్డెన్స్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మంత్రి మధ్యాహ్నం 2.45 గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకోనున్నారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం సుభాష్నగర్: నిజామాబాద్ నగరంలోని డీ–4 సెక్షన్ పరిధిలోగల పలు ప్రాంతాలకు బుధవారం ఉదయం 8.30 నుంచి మధ్యా హ్నం 12.30గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని టౌన్–3 ఏడీఈ వినోద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 11 కేవీ లైన్ కింద చెట్ల కొమ్మలు నరికివేత కారణంగా శ్రీనగర్ కాలనీ, ఏబీఎస్ వెంచర్, బాల హనుమాన్ టెంపుల్ ఏరియా, ఫ్రుడెన్స్ ఆస్పత్రి, శ్రీకృష్ణ ఆస్పత్రి, యెండల టవర్స్, ప్రశాంతి హో మ్స్, కేఎస్ఆర్ అపార్ట్మెంట్స్, రుక్మిణి అపార్ట్మెంట్, స్వరూప అపార్ట్మెంట్ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు వివరించారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని వినోద్ కోరారు. కామారెడ్డి అర్బన్: కామారెడ్డి మండలం గర్గుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వి ద్యార్థిని కలిగోట వీణ అండర్–18 జాతీయ హాకీ జట్టుకు ఎంపికయ్యింది. ఇటీవల రాంచీలో నిర్వహించిన సబ్ జూనియర్ నేషనల్ హాకీ చాంపియన్షిప్లో అద్భుత ప్రతిభ చూపడంతో జాతీయ జట్టుకు ఎంపిక చేశారని పాఠశాల పీఈటీ మధుసూదన్రెడ్డి తెలిపారు. ఈనెల 19 నుంచి భోపాల్లో నిర్వహించే ఇండియన్ టీం క్యాంప్లో పాల్గొటుందని పేర్కొన్నారు. అనంతరం జపాన్లో నిర్వహించే సబ్ జూనియర్ అండర్ –18 ఆసియా కప్ హాకీ పోటీల్లో భారత జట్టు తరఫున పాల్గొంటుందని పేర్కొన్నారు. మోడల్ స్కూళ్లకు ప్రవేశ పరీక్ష ఖలీల్వాడి: తెలంగాణ మోడల్ పాఠశాలల ప్రవేశ పరీక్ష ఈనెల19న నిర్వహించనున్నట్లు డీఈవో పార్శి అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉద యం ఆరో తరగతి, మధ్యాహ్నం ఏడో తరగ తి విద్యార్థులకు పరీక్ష ఉంటుందని పేర్కొ న్నారు. ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసు కున్న విద్యార్థులు సంబంధిత వెబ్సైట్ నుంచి హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవాల ని సూచించారు. మరిన్ని వివరాలకు 93912 66444 నంబర్ను సంప్రదించాలన్నారు. -
రాజ్యాంగ స్ఫూర్తితో అభివృద్ధి ఫలాలు
ఖలీల్వాడి: భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం స్ఫూర్తితోనే దేశంలోని అన్ని వర్గాల వారికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఆలిండియా సర్వీసెస్ను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగంలో పొందుపర్చిన ఆర్టికల్ 311 ద్వారానే తాను ఐఏఎస్ కాగలిగానని గుర్తు చేశారు. అంబేడ్కర్ 135వ జయంతిని జిల్లాలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఫూలాంగ్ చౌరస్తాలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, నగర మేయర్ ఉమారాణి, మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్, కాంగ్రెస్, దళిత సంఘాల నాయకులు ఘన నివాళులు అర్పించారు. ‘అరైవ్ – అలైవ్’ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తామని, ప్రమాదాల నియంత్రణకు కషి చేస్తామని ఈ సందర్భంగా కలెక్టర్, సీపీ అక్కడ ఉన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి కార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని, ఆ మహనీయుని స్ఫూర్తి తో విద్యార్థులు ఉన్నత విద్యభ్యాసం చే యాల ని అన్నారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య అందించేందుకు కృషి చేస్తోందన్నారు. వసతి గృహాలు, గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ప్రతి ఏటా సుమారు రూ.లక్షా ఎనిమిది వేల చొప్పున నిధులను ఖర్చు చేస్తోందని తెలిపారు. రాజ్యాంగం ఆధారంగానే అధికార యంత్రాంగం ప్రభు త్వ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. నిజామాబాద్ నగరంలో అంబేడ్కర్, పూలే వంటి మహనీయుల విగ్రహాల ఏర్పాటు విషయంలో అందరితో చర్చించి జిల్లా యంత్రాంగం సముచిత నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. మేయర్ కే.ఉమారాణి మాట్లాడుతూ.. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ హక్కులు కల్పించిందని, ఆయన ఆశయ సాధన కోసం అంకిత భావంతో కృషి చేద్దామని పిలుపునిచ్చారు. వ్యాస రచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ముఖ్య అతిథులు నగదు పారితోషికంతోపాటు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించాలి అంబేడ్కర్ జయంతి వేడుకల్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి -
నిజామాబాద్
హిందూ ధర్మాన్ని ఆచరించాలి హిందువుల అన్ని సమస్యలకు పరిష్కారం సనాతన ధర్మాన్ని ఆచరించడమేనని విద్యాభారతి ప్రతినిధి లక్ష్మణరావు అన్నారు. వాతావరణం ఉదయంనుంచే ఎండ తీవ్రత పెరుగుతుంది. మధ్యాహ్నం ఉక్కపోతగా ఉంటుంది. వడగాలులు వీస్తాయి. రాత్రి నిర్మలంగా ఉంటుంది.బుధవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026– 8లో uనిజామాబాద్అర్బన్: భానుడు భగ్గుమంటున్నాడు. రాష్ట్రంలోనే జిల్లాలో మంగళవారం అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఆలూర్ మండలం మచ్చర్లలో 43.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదుకావడంతో జనాలు అల్లాడారు. జిల్లాపై భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండడంతో గత వారం రోజులుగా క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు ముగియగా, పాఠశాల స్థాయిలో కొనసాగతున్నాయి. స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండలతో హడలిపోయిన జనం... జిల్లాలో ఎండ తీవ్రత పెరిగిపోవడంతో జనం హడలిపోతున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకే ఎండ మండిపోవడంతో జనం రోడ్లపై తిరగడానికి ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం పూట ఎక్కువగా ఇళ్లకే పరిమితమయ్యారు. పెళ్లిళ్లు, ఫంక్షన్ల సీజన్ కావడతో షాపింగ్, ఇతర పనుల కోసం బయటకు వెళ్లాలన్నా జంకుతున్నారు. వడగాలులు కూడా వీస్తుండడంతో ఇబ్బందిపడుతున్నారు.మచ్చర్ల43.2 -
సిరులు కురిపిస్తున్న సీడ్ మక్క
● రైతులతో ప్రయివేట్ కంపెనీ ఒప్పందం ● వేయి ఎకరాల్లో సాగు చేసిన రైతులు మోర్తాడ్(బాల్కొండ): మొక్కజొన్న రైతుల ఇంట సి రులు కురిపిస్తోంది. విత్తనోత్పత్తి కోసం రైతుల తో ప్రయివేట్ సీడ్ కంపెనీ ఒప్పందం చేసుకుని సాగు చేయించింది. ఎర్రజొన్న సీడ్ వ్యాపారులు సిండికేట్ గా మారి ధర దక్కకుండా చేయడంతో రైతులు యాసంగిలో సీడ్ మొక్కజొన్న సాగుపై దృష్టి సారించారు. ఓ కంపెనీ వెయ్యి ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయించగా, ఎకరానికి 45 నుంచి 55 క్వింటాళ్ల దిగుబడి రాగా, క్వింటాల్కు రూ.2,200 ధర నిర్ణయించారు. కంకుల నుంచి మక్కలను వేరు చే యకుండా అలాగే తూకం వేయించి కంపెనీకి తరలించారు. ఎకరానికి రైతులకు రూ.లక్ష నుంచి రూ.1.20లక్షల ఆదాయం సమకూరింది. విత్తనోత్ప త్తితోపాటు పాప్కార్న్ తయారీ కంపెనీలకు మొక్కజొన్నను సరఫరా చేసినట్లు రైతులు వెల్లడించారు. -
ట్రాఫిక్ నిబంధనలను అలవాట్లుగా మార్చుకోవాలి
● ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి ● డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్రెడ్డి ● ఎన్హెచ్ 44పై వీఐడీఎస్ ప్రారంభం ఇందల్వాయిలో ఎన్హెచ్ 44పై వీఐడీఎస్ని ప్రారంభిస్తున్న డీజీపీ శివధర్రెడ్డి కామారెడ్డిలో ప్రసంగిస్తున్న డీజీపీ శివధర్రెడ్డిఇందల్వాయి: హెల్మెట్, సీట్ బెల్ట్ ధారణ, నిర్ణీత వేగం, ట్రాఫిక్ నియమాలు పాటించడం నిత్య జీవితంలో అలవాటుగా మార్చుకోవాలని డీజీపీ బి శివధర్రెడ్డి సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా చంద్రయాన్పల్లి గ్రామం వద్ద మంగళవారం నిర్వహించిన ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజీపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా 44వ నంబరు జాతీయ రహదారిపై వీడియో సంఘటన గుర్తింపు వ్యవస్థ (వీఐడీఎస్)ని ప్రారంభించారు. వీ ఐడీఎస్ వ్యవస్థ మానవ ప్రమేయం లేకుండా ఏఐ విశ్లేషణతో కూడి అధునాతన కెమెరాలతో పనిచేస్తుందని డీజీపీ వివరించారు. అనంతరం గ్రామస్తు లతో ‘అరైవ్ – అలైవ్’ కార్యక్రమానికి సంబంధించి ప్రతిజ్ఞ చేయించారు. సీపీ సాయిచైతన్య, అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీలు రాజారెడ్డి వెంకటరెడ్డి, వెంకట్రెడ్డి, డిచ్పల్లి సీఐ వినోద్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ వినోద్, డిచ్పల్లి, ఇందల్వాయి ఎస్సైలు ఆరిఫ్, సందీప్, ఈ–డార్ మేనేజర్ వర్ష, ప్రాజెక్ట్ మేనేజర్ వీరబాలు, సర్పంచ్ రఘు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు స్థలం వితరణ
బోధన్: పట్టణంలోని గౌడ్స్ కాలనీలో అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపన,భవన నిర్మాణం కోసం 47 గజాల స్థలాన్ని పట్టణ కేంద్రానికి చెందిన చల్లా మమత శ్రీనివాస్( పూజారి శ్రీనివాస్) వితరణ చేశారు.ఆ స్థలంలో గ్రౌండ్ ఫ్లోర్లో లైబ్రరీ,మొదటి అంతస్తు లో మీటింగ్ హాల్, రెండో అంతస్తులో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టు నిర్వాహకులు తె లిపారు. మంగళవారం గౌడ్స్ కాలనీలో దాత వితరణ చేసిన స్థలంలో అంబేడ్కర్ జయంతిని నిర్వహించి స్థల దాతను కాలనీవాసులు సన్మానించారు.అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాధవరావు, వ్యాపారే గంగాధర్,మెస్రా మండల ఎంఈవో నాగ్నాథ్,మాజీ ఎంపీటీసీ సూ ర్య నాగన్న, కాలనీవాసులు, విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు. -
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి
● అంబేడ్కర్ జయంతిలో వక్తలు ● నివాళులు అర్పించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులుఆర్మూర్, బాల్కొండ, బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల్లో మంగళవారం అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వక్తలు మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీల, సంఘాల నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. సాక్షి, నెట్వర్క్ -
అంబేడ్కర్ ఆదర్శప్రాయుడు
నందిపేట్(ఆర్మూర్): బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన బీఆర్ అంబేడ్కర్ అందరికీ ఆదర్శప్రాయుడని జిల్లా కాంగ్రెస్ కమి టీ అధ్యక్షుడు కాట్పల్లి నగేశ్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని వెల్మల్ గ్రా మంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్పల్లి నగేశ్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈసందర్భంగా నగేశ్ మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి సహాపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం, సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకష్ణ, మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గాదరి గోపి, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, సర్పంచ్ లు ఎర్రం లింగం, గాదరి నవీన్, సంతోష్ గౌడ్, ఆర్మూర్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. -
తాగునీటిఎద్దడి లేకుండా చూడాలి
● ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి బోధన్టౌన్(బోధన్): వేసవిలో తాగు నీటిఎద్దడి లేకుండా చూడాలని బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ స లహాదారు సుదర్శన్రెడ్డి అన్నారు. మంగళవారం బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో బల్దియా, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్షా నిర్వహించారు. పాత ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పునరుద్ధరణ పనులను ప్రారంభించడంతో పాటు పనులను వేగవంతం చేయాలని పైప్ లైన్ పనులు చేపట్టాలన్నారు. డబుల్ బెడ్రూం లబ్ధిదారుల జాబితా ఖరారు ప్రక్రియను సబ్ కలెక్టర్, తహసీల్దార్లు పర్యవేక్షించాలని సూచించారు. డ్రైవర్లదే బాధ్యత బోధన్ బల్దియా పరిధిలోని 38 వార్డుల్లో చెత్త సేకర ణ కోసం నూనతంగా కొనుగోలు చేసిన ఆటోల ఇంధన, నిర్వహణ బాధ్యత డ్రైవర్లదే అని సుదర్శన్ రెడ్డి అన్నారు. ఇంటింటికి చెత్త చెత్త సేకరణ చేస్తూ యూజర్ చార్జీలు వసూలు చేపట్టేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన నలుగురు డ్రైవర్లకు ఆటోలను అందించారు. పట్టణంలోని 35 వ వార్డులో పర్యటించారు. డ్రెన్ల డిసిల్టింగ్ కోసం నూతనంగా కొనుగోలు చేసిన మినీ ఎక్స్వేటర్ పని తీరును పరి శీలించారు. అనంతరం అంబేడ్కర్ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి సుదర్శన్రెడ్డి, సబ్ కలెక్టర్ వి కాస్ మహతో. మున్సిపల్ చైర్ పర్సన్ తూము ప ద్మాశరత్ రెడ్డి, అధికారులు దళిత సంఘాల నాయకులు నివాళులు అర్పించారు 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమాన్ని పట్టణ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించారు. సుదర్శన్రెడ్డి, సబ్ కలెక్టర్ వికాస్ మహతో, మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మాశరత్ రెడ్డి, పట్టణ సీఐ వెంకట నారాయణ అధికారులతో పాటు ఇతర నాయకులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. బోధన్ : ఎడపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ప్రభుత్వ సలహదారు, ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి పొల్గొని అంబేడ్కర్ చిత్రపటానికి పూల మాలలు వేశారు. సర్పంచ్ కందగట్ల రాంచందర్, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి లో కుర్నాపల్లి నుంచి బోధన్ మండలంలోని ఏరాజ్పల్లి వరకు ఏడున్నర కిలోమీటర్ల పొడువు గల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.5 కోట్ల 10 లక్షలతో చేపట్టే పనులకు ఎమ్మెల్యే , ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. -
విద్యార్థులకు సన్మానం
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల నలంద హైస్కూల్, లిల్లిపుట్ పాఠశాలలో ఉత్తమ ఒలింపియాడ్ పాఠశాలలుగా ఎంపికయ్యాయి. హైదరాబాద్కు చెందిన ఈ అభ్యాస్ అకాడమీ ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థా యి ఒలింపియాడ్ పరీక్షల్లో రెండు పాఠశాలలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. దీంతో హైదరబాద్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో రెండు పాఠశాలల విద్యార్థులను అకాడమీ ప్రతినిధులు ప్రశంస పత్రాలు అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నలంద ప్రసాద్,నలంద సాగర్, లిల్లిపుట్ రామకృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు. -
మజ్జిగ పంపిణీ
ఆర్మూర్టౌన్: పట్టణంలోని అంబేడ్కర్చౌరస్తా వద్ద మంగళవారం అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ యువజన నాయకుడు విజయ్ అగర్వాల్ ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరిరఘు, ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా యువజన నాయకుడు విజయ్ అగర్వాల్ను అభినందించారు. ఈకార్యక్రమంలో కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నూత్పల్లిలో మక్కల కొనుగోలుకు అనుమతి డొంకేశ్వర్(ఆర్మూర్): డొంకేశ్వర్ మండలం నూత్ పల్లిలో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు సొసైటీ సీఈవో కృష్ణ కుమార్ తెలిపారు. ఈ మేరకు మార్క్ఫెడ్ అధికారుల నుంచి ఆదేశాలు అందాయన్నారు. ఈ కేంద్రాన్ని బుధవారం నూత్పల్లిలో ప్రారంభించి మక్కలను కొనుగోలు చేస్తామన్నారు. -
అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ
నందిపేట్ (ఆర్మూర్): మండల కేంద్రంలో మంగళవారం అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను ఎంపీడీవో శ్రీనివాసరావు అధికారుల తో కలిసి ఆవిష్కరించారు. మంగళవారం నుంచి నుంచి ఏప్రిల్ 20వ తారీకు వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని నందిపేట స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రావుల నరేశ్ తెలిపారు. అగ్ని ప్రమాదాలలో అసువులు బాసిన సిబ్బంది స్మారకార్థము ప్రతిఏడాది వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఐలాపూర్ సర్పంచ్ మీసాల లక్ష్మీనారాయణ, పంచాయతీ కార్యదర్శులు, అగ్నిమాపక సిబ్బంది, మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ రుద్రూర్: మండల కేంద్రంలో ఆరుగురు బా ధితులకు మంజూరైన రూ.1.99 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంగళవారం ఏఎంసీ డైరెక్టర్ పార్వతి ప్రవీణ్, విండో మాజీ చైర్మన్ పత్తి రాము పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వ సలహదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సహకారంతో సీఎంఆర్ఎఫ్ నిధులు విడుదలైనట్లు వారు తెలిపారు. వార్డు సభ్యులు ఇమ్రాన్, కాంగ్రెస్ నాయకులు అక్కపల్లి నాగేందర్, నర్సయ్య, ఖాజా, పత్తి నవీన్, ఈర్వ నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులకు వీల్ ౖచైర్ల పంపిణీకమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ మండలం మెండోర గ్రామంలో పీపుల్స్ వెల్ఫేర్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో మంగళవారం దివ్యాంగులకు వీల్ చైర్లను పంపిణీ చేశారు. శారీరక ఇ బ్బందులు, అంగవైకల్యం కలిగిన, వృద్ధులకు కలిపి 28 మందికి వీల్ చైర్లను అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ప్రతినిధి సీహెచ్ డానియల్, సర్పంచ్ కుంట లక్ష్మి, ఉప సర్పంచ్ రమేష్ కంఠం సత్యం, స్పెషల్ వర్కర్ అశోక్, మనోహర్, అశోక్; కొత్తూరు నరేష్, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. చలివేంద్రం ప్రారంభం డొంకేశ్వర్(ఆర్మూర్): మండలంలోని దత్తాపూర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బస్టాండ్ ఆవరణలో మంగళవారం చలివేంద్రాన్ని సర్పంచ్ మూడ్ ప్రకాష్ ప్రారంభించారు. ఉప సర్పంచ్ గోనే గంగాధర్, వార్డు సభ్యులు, కారోబార్ లక్ష్మినారాయణ పాల్గొన్నారు. రక్తదాన శిబిరాలకు స్పందన రెంజల్/వర్ని: అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని రెంజల్, బోర్గాం గ్రామాల్లో మంగళవారం రక్తదాన శిబిరాలను నిర్వహించారు. యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం ప్రాణదానంతో సమానమ ని ఎస్సై చంద్రమోహన్, సర్పంచ్లు తిరుపతి లలిత, జ్యోతీకార్తీక్యాదవ్లు పేర్కొన్నారు. రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. వర్నిలో స్వామి వివేకానంద బ్లడ్ డోన ర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా తలసేమియా వ్యాధి చిన్నారుల కోసం శిబిరాన్ని నిర్వహించినట్లు అసోసియేషన్ వ్యవస్థాపకులు సంతోష్ తెలిపారు. పోగొట్టుకున్న ఫోన్ల అందజేత ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పోలీస్స్టేషన్ పరిధిలో పొగొట్టుకున్న ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ద్వా రా సేకరించి మంగళవారం బాధితులకు అందజేసినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. సంతోష్, విజయ్భాస్కర్, రవీందర్లకు ఫోన్లు అందజేశామన్నారు. -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
ఆర్మూర్ అంబేడ్కర్ చౌరస్తాలో ప్రతిజ్ఞ చేస్తున్న నాయకులు పచ్చలనడ్కుడలో ట్రాఫిక్ నియమాలపై ప్రతిజ్ఞ చేయించిన ఎస్సై సంజీవ్ఆర్మూర్టౌన్/వేల్పూర్/రుద్రూర్/నందిపేట్ : ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే, రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని జాతీయ పసుపుబోర్డు చైర్మన్పల్లెగంగారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరిరఘు, కాంగ్రెస్ పార్టీ నియెజకవర్గ ఇన్చార్జి వినయ్రెడ్డిలు అన్నారు. పట్టణంలో అంబేడ్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆర్మూర్ పోలీస్శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మద్యం సేవించి, హెల్మెట్ లే కుండా వాహనాలు నడుపొద్దన్నారు, ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజు, మార్కెట్కమిటీ చైర్మన్సాయిబాబాగౌడ్, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం, మైనారిటీ నాయకులు, దళిత సంఘాల నాయకులు, ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వేల్పూర్, పచ్చలనడ్కుడ, పడగల్, అమీనాపూర్, అక్లూర్ గ్రామాలలో ట్రాఫిక్ నియమాలపై వేల్పూర్ ఎస్సై సంజీవ్ గ్రామస్తులచే ప్రతిజ్ఞ చేయించారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తానని, హెల్మెట్, సీటు బెల్టు ధరిస్తానని, మద్యం తాగి వాహనం నడుపకుండా ఉంటానని ప్రతిజ్ఞ చేయించారు. రుద్రూర్ మండలం అక్బర్నగర్, మండల కేంద్రంలో అంబేడ్కర్ విగ్ర హల వద్ద ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఈకార్యక్రమానికి సర్కిల్ ఇనన్స్పెక్టర్ కృష్ణ హాజరై రహదారి ని యమాల ప్రాముఖ్యతను వివరించారు.అనంతరం పోలీసులు, స్థానిక ప్రజలు రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేశారు. అంతకు ముందు సీఐ కృష్ణ, ఎస్సై సాయన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూ ల మాలలు వేసి నివాళులు అర్పించారు. నందిపేట మండలం మాయాపూర్ గ్రామంలో నందిపేట పో లీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీపై అవగాహన క ల్పించారు. గ్రామ ప్రజల చేత రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటిస్తామని ఎస్ఐ శ్యామ్ రాజ్ ప్రతిజ్ఞ చేయించారు. గ్రామానికి చెందిన శ్రీసాయి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్ కాసిరే సతీష్ తమ వంతు సామాజిక బాధ్యతగా గ్రామ ప్రజల భద్రత కోసం లక్కీ డ్రా ద్వారా హెల్మెట్లు పంపిణీ చేశారు. సర్పంచ్ బి. జీవన్, ఉప సర్పంచ్ కె. విష్ణు, వార్డు సభ్యులు ఎ. చిన్న గంగాధర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. -
ప్రజావాణికి 124 ఫిర్యాదులు
నిజామాబాద్అర్బన్: ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 124 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తోపాటు సబ్ కలెక్టర్ వికాస్ మహతో, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్నకు విన్నవిస్తూ అర్జీలు అందజేశారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆస్తి లాక్కుని పట్టించుకోవడం లేదు తన ఆస్తి లాక్కున్న పెద్ద కుమారుడు తనను పట్టించుకోవడం లేదని ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామానికి చెందిన జోరిగె రాజుబాయి సోమవారం ప్రజావాణిలో అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఇద్దరు కుమారులు గంగామోహన్, నవీన్ ఉన్నారని, భర్త రెండేళ్ల క్రితం చనిపోయాడన్న వృద్ధురాలు.. తమకున్న 8 ఎకరాల భూమిని పెద్ద కుమారుడు అక్రమంగా పట్టా చేయించుకున్నాడని, తన ఆభరణాలతోపాటు విలువైన డాక్యుమెంట్లు తీసుకున్నాడని తెలిపింది. మూడు నెలలపాటు హైదరాబాద్లో తన వద్ద ఉంచుకొని తీవ్రంగా హింసించి తనకున్న అర ఎకరం పొలాన్ని సైతం తన పేరు మీద పట్టా చేసుకున్నాడని భోరుమన్నది. కాలు విరిగి నడవలేని స్థితిలో ఉన్న తనను పెద్దకుమారుడు పట్టించుకోవడం లేదని, అతడిపై చర్యలు తీసుకుని తన ఆస్తిని తనకు ఇప్పించాలని విన్నవించింది. -
అర్హులకు టీకాలు తప్పనిసరి
● అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ ● సమన్వయ కమిటీ ఏర్పాటు నిజామాబాద్అర్బన్:అర్హులైన బాలికలకు హెచ్పీవీ టీకాలు తప్పనిసరి వేయాలని అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ పేర్కొన్నారు. హెచ్పీవీ టీకాల కార్యక్రమ పర్యవేక్షణకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా ఉండేందుకు 14 సంవత్సరాల బాలికల కోసం హెచ్పీవీ టీకాలు వేస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కన్వీనర్గా జిల్లా స్థాయి సమన్వయ కమిటీ పని చేస్తుందన్నారు. జిల్లాలో కీటక జనిత వ్యాధులు ప్రబలకుండా అన్ని శాఖల అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అన్ని వసతి గృహాలు పరిశుభ్రతను పాటించేలా, విద్యార్థులకు కీలక జనిత వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీలు ఏర్పా టు చేయాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్వో రాజశ్రీ, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, జడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్ రావు, డీఎంహెచ్వో రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్ల గణన పారదర్శకంగా నిర్వహించాలి
● వీసీలో జనగణన రాష్ట్ర సంచాలకురాలు భారతి హోళీకేరి నిజామాబాద్ అర్బన్: జనగణనలో భాగంగా చేపట్టనున్న హౌస్ లిస్టింగ్ (ఇళ్ల గణన) ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జనగణన రాష్ట్ర సంచాలకురాలు భారతి హోళీకేరి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ఇళ్ల గణన కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనగణనలో భాగంగా మే 11 నుంచి నిర్వహించే ఇళ్ల గణన ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. ఇళ్ల జాబితా బ్లాక్లను రూపొందించాలని, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకం, మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయాలని అన్నారు. ఇళ్ల గణన, జనగణన జాబితా ప్రకారం అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో దోహదపడతాయని తెలిపారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ హౌస్ లిస్టింగ్ ప్రక్రియను చేపట్టేందుకు వీలుగా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇళ్ల గణన కోసం ఆరు మండలాలు మినహా జిల్లా వ్యాప్తంగా అన్నిచోట్ల సరిహద్దుల నిర్ధారణ పూర్తయ్యిందని, మిగిలిన మండలాల్లోనూ 15వ తేదీ నాటికి పూర్తి చేస్తామని అన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీ కార్యాలయం ప్రారంభం
నిజామాబాద్అర్బన్: నగరంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అవినీతి నిరోధక శాఖ కార్యాలయాన్ని కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య సోమవారం ప్రారంభించారు. ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనంలో ఉండకూడదని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసింది. ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ (వెస్ట్ జోన్) కమలాకర్ రెడ్డి, డీఎస్పీ శేఖర్ గౌడ్, ఇన్స్పెక్టర్ వేణుకుమార్, నాగేశ్ పాల్గొన్నారు. సుభాష్నగర్: వాహనదారులు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని టీజీఎస్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జ్యోత్స్న తెలిపారు. సోమవారం సాయంత్రం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్.. అలైవ్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ వాహనదారులు హెల్మెట్ ధరించాలని, వేగ నియంత్రణ పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం మధుసూదన్, ఏఎంవీఐ పవన్కల్యాణ్, ఆరు డిపోల మేనేజర్లు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనాథ వృద్ధుల సంక్షేమం ప్రతి ఒక్కరి బాధ్యత ● సీపీ సాయి చైతన్య నిజామాబాద్ రూరల్: సమాజంలోని అనాథ వృద్ధుల సంక్షేమం ప్రతి ఒక్కరి బాధ్యత అని కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయిచైతన్య పేర్కొన్నారు. మండలంలోని శాస్త్రీనగర్ నిర్మల భవ న్ అనాథ వృద్ధాశ్రమాన్ని సోమవారం సీపీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి ఆత్మీయంగా మాట్లాడారు. వారి ఆరోగ్యం, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఏసీపీ రాజావెంకట్రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సౌత్ రూరల్ సీఐ సతీశ్కుమార్, ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ఆర్ఐ వినోద్, ఎస్సై వెంకట్రావు, సర్పంచ్ నరాల జ్యోతి పాల్గొన్నారు. ఆల్ప్రాజోలం పట్టివేత ఎల్లారెడ్డి: నిషేధిత మత్తు పదార్థం ఆల్ప్రాజోలంను విక్రయించేందుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎల్లారెడ్డి సీఐ రాజిరెడ్డి సోమవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన పులి రమేశ్ తన స్నేహితుడైన ఓలెపు రమేశ్, మధ్యవర్తి హసన్పల్లి అనిల్కుమార్ ద్వారా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన చేపర్తి ఈశ్వర్గౌడ్కు ఆల్ప్రాజోలంను విక్రయించేందుకు రూ.5 వేలకుఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 11న సాయంత్రం పులి రమేశ్ సూచనల మేరకు కొనుగోలుదారుకు సాంపిల్ చూపించేందుకు 101 గ్రాముల మత్తు పదార్థాన్ని తీసుకొని ఓలెపు రమేశ్, అనిల్ కుమార్ గండిమాసానిపేట గేట్ వద్దకు బైక్పై వచ్చారు. పోలీసులు నిందితులను పట్టుకొని 101 గ్రాముల ఆల్ప్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. -
క్రైం కార్నర్
ఈతకు వెళ్లి ఒకరి మృతి మోపాల్: మండలంలోని న్యాల్కల్ చెరువులో ఈతకు వెళ్లి ఒకరు మృతి చెందినట్లు ఎస్సై జాడె సుస్మిత సోమవారం తెలిపారు. ఆమె కథనం ప్రకారం.. బిచ్కుంద గ్రామానికి చెందిన సంజీవ్(37), కమ్మరి రేఖ దంపతులు. ఇద్దరు పిల్లలతో కలిసి నగరంలోని ఆనంద్నగర్లో నివాసముంటూ కార్పెంటర్గా ప ని చేస్తున్నాడు. సంజీవ్కు కల్లు తాగే అలవాటు ఉంది. ఆదివారం సాయంత్రం న్యాల్కల్లో కల్లు తాగేందుకు తన కొడుకు లక్ష్మణ్తో కలిసి బైక్పై వెళ్లాడు. కల్లు తాగిన తర్వాత సంజీవ్లో చెరువులోకి ఈత కోసం దిగి నీటమునిగాడు. ఈ విషయాన్ని కొడుకు లక్ష్మణ్ తల్లి రేఖకు తెలపగా, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోమవారం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. భార్య రేఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై సుస్మిత తెలిపారు. బాన్సువాడ: కాలినగాయాలతో చికిత్స పొందుతున్న ఒకరు మృతి చెందినట్లు సీఐ శ్రీధర్ సోమవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా హత్నూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ యూసుఫ్(40) మద్యానికి బానిసయ్యాడు. ఇంట్లో నుంచి వెళ్లి ఐదారు రోజులైన తిరిగి వెళ్లేవాడు కాదు. ఈ నెల 4న ఇంటి నుంచి వెళ్లిన యూసుఫ్ తిరిగి ఇంటికి రాలేదు. 8న బాన్సువాడలోని ఓ షాపింగ్ మాల్ పక్కన తనకు తాను పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించగా, సోమవారం మృతి చెందినట్లు సీఐ తెలిపారు. మృతుడి భార్య పర్వీన్ సుల్తానా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఇందల్వాయి: జాతీయ రహదారి 44పై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఇందల్వాయి ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్కు చెందిన సయ్యద్ అహ్మద్(41) కొంతకాలంగా కుటుంబంతో కలిసి ఇందల్వాయి మండలం తిర్మన్పల్లి గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి సయ్యద్ అహ్మద్ తన కొడుకు ఇస్మాయిల్తో కలిసి మండల కేంద్రంలో అన్నం అడుక్కునేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా రహదారి దాటే క్రమంలో హైదరాబాద్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన సయ్యద్ అహ్మద్ మృతి చెందాడు. మృతుడి భార్య గౌసియా బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఇరవై లక్షల ఎకరాలకు విత్తనాలందిస్తాం
● తెలంగాణ రాష్ట్ర విత్తన సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి ● నాగిరెడ్డిపేట, లింగంపేటలో రైతులతో సమావేశం నాగిరెడ్డిపేట/లింగంపేట : వచ్చే వానాకాలంలో తెలంగాణ రాష్ట్ర విత్తనసంస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాలకు నాణ్యమైన విత్తనాలు అందిస్తామని తెలంగాణ రాష్ట్ర విత్తన సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లి, లింగంపేట మండలం శెట్పల్లి గ్రామాల్లో ఆయన రైతులతో ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజన్కు అవసరమైన వరి విత్తనాలు సన్నరకాలైన బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, కేఎన్ఎం 1638, దొడ్డు రకాలు కేఎన్ఎం 118, ఎంటీయూ 1010 సమృద్ధిగా నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. జీలుగ, జనుము విత్తనాలను సకాలంలో అందజేస్తామన్నారు. రైతులు నిరంతరం వరి మాత్రమే సాగు చేయకుండా పంట మార్పిడి చేయాలని సూచించారు. రసాయన మందులను వినియోగించి వ్యవసాయం చేస్తున్నారని, ప్రస్తుత పరిస్థితుల కారణంగా ప్రకృతి వ్యవసాయం చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకు తక్కువ ధరకు నాణ్యమైన విత్తనాలను అందిస్తోందని, కానీ రైతులు మాత్రం మార్కెట్లో ఎక్కువ ధరకు లభించే ప్రయివేట్ కంపెనీల విత్తనాలే నాణ్యమైనవిగా భావించి కొనుగోలు చేస్తున్నారన్నారు. కాగా, మార్కెట్లో కొనుగోలు చేసిన విత్తనాలతో నష్టపోయే రైతులకు తగిన పరిహారం అందించేలా ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టిందన్నారు. సమావేశంలో ఆత్మ కమిటీ చైర్మన్ దశరథ్ నాయక్, సర్పంచులు జ్యోతిరెడ్డి, అట్టెం శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సకృనాయక్, ఆత్మకమిటీ డైరెక్టర్ కిష్టయ్య, నాగిరెడ్డిపేట ఎంపీడీవో ప్రవీణ్కుమార్, ఎస్సై భార్గవ్గౌడ్, ఏవో సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఆల్ఫోర్స్’ ప్రభంజనం
ఖలీల్వాడి: ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో జిల్లాలో ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకున్నట్లు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి వెల్లడించారు. నగరంలోని గంగాస్థాన్ ఆల్ఫోర్స్ జూనియర్ కాలేజీలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో అత్యుత్తమ మార్కులను సాధించిన విద్యార్థులను ఆయన సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మూడేళ్ల క్రితం ఆల్ఫోర్స్ కళాశాల ఏర్పాటు చేసేటప్పుడు ఆనేక ఆటంకాలు సృష్టించారని, వాటిటన్నింటినీ తట్టుకొని నిలబడి రాష్ట్ర, జిల్లాస్థాయి ర్యాంకులు సాధించామన్నారు. అధ్యాపకులు, సిబ్బంది సహకారంతోపాటు విద్యార్థుల క్రమశిక్షణతో అత్యుత్తమ మార్కులు సాధించామని తెలిపారు. జేఈఈ(మెయిన్స్), జేఈఈ(అడ్వాన్స్డ్), నీట్, ఐఐటీతోపాటు ఎంసెట్ వంటి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తారని చెప్పారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో వై.శ్రీనిత్య 996 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఎం.విరేష్ని 991, కే సోనాలిక 990, ఎం అస్మిత 990 మార్కులతో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారన్నారు. బైపీసీలో హిరణ్య 987, ఎల్.అశ్విని 987, బి.అదితి 914 మార్కులు సాధించారని తెలిపారు. ఫస్టియర్ ఎంపీసీలో వినీష 469, జి.అక్షర 469 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం స్ఫూర్తిదాయకమన్నారు. డీ పూజ 468, జి.రాజేశ్వరి 468, ఎం.స్మిత 467, కే.గంగోత్రి 467, జి.యక్షిత్ 467, కే.మనీషా, మనోజ్ఞ 466, కే సూర్యకు 465 మార్కులు వచ్చాయని పేర్కొన్నారు. మరో 61 మంది విద్యార్థులకు 464 మార్కులు, 176 మంది విద్యార్థులకు 463 పైగా మార్కులు సాధించినట్లు తెలిపారు. బైపీసీలో ఎస్.జాగృతి 439, హస్విత 439, ఖాన్సా అలియా 439, కే.రిషిత 435, ఎస్.కారుణ్య 435, గ్రీష్మ 432, వరలక్ష్మి 428 మార్కులు సాధించారు. ఎంఈసీ విభాగంలో ఎం. ప్రంజల్ పాండే 448 మార్కులు సాధించారని చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. -
సెంటర్ల తనిఖీ
ఆర్మూర్ : పట్టణంలోని రాంమందిర్ జెడ్పీ ఉన్నత పాఠశాల ఎస్సెస్సీ సెంటర్తోపాటు మామిడిపల్లిలోని సెయింట్ పాల్స్ హైస్కూల్ సెంటర్ను కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరు, విద్యార్థులకు కల్పించిన సదుపాయాలను పరిశీలించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సత్యనారాయణ, పరీక్షల నిర్వహణ సిబ్బంది ఉన్నారు. ఏడాదంతా కష్టపడి చదివిన పదో తరగతి విద్యార్థులు తమకు ‘పరీక్ష’ ముగిసిందని ఆనందం వ్యక్తం చేశారు. సోమవారం సాంఘికశాస్త్రం పరీక్ష నిర్వహించారు. సుమారు నెలరోజులపాటు పరీక్షలు కొనసాగాయి. పరీక్షలు ముగియడంతో ఎగ్జామినేషన్ సెంటర్ల వద్ద విద్యార్థులు కేరింతలు కొడుతూ ఆనందంగా ఇంటిబాటపట్టారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ సోషల్ ఎగ్జామ్కు 44 మంది గైర్హాజరు ఖలీల్వాడి: ఎస్సెస్సీ పరీక్షల్లో భాగంగా సోమవారం సోషల్ ఎగ్జామ్ నిర్వహించగా 44 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో పార్శి అశోక్కుమార్ తెలిపారు. 24,401 మంది రెగ్యులర్ విద్యార్థులతోపాటు ఎనిమి ది మంది ప్రయివేట్ విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా, రెగ్యులర్ విద్యార్థులు 41 మంది, ప్రయివేట్ విద్యార్థులు ముగ్గురు గైర్హాజరయ్యారన్నారు. 144 సెంటర్లకుగాను 67 సెంటర్లను తనిఖీ చేయడం జరిగిందన్నారు. కలెక్టర్ రెండు సెంటర్లను తనిఖీ చేశారన్నారు. -
సహజీవనం చేస్తున్న వ్యక్తిని హత్య చేసిన మహిళ
నిజామాబాద్ అర్బన్: నగరంలోని వినాయక్నగర్లో సహజీవనం చేస్తున్న వ్యక్తిని ఓ మహిళ చీరతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు 4వ టౌన్ ఎస్సై సందీప్ సోమవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మోహన్(40) వినాయక్నగర్లో ఉంటూ మేసీ్త్ర పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన బద్ద సౌందర్యతో ఎనిమిదేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఈ నెల 12 ఉదయం 3 గంటలకు సౌందర్య తన చీరను మోహన్ మెడకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మోహన్ కుటుంబానికి సంబంధించిన వివరాలు తెలియడం లేదన్నారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే 8712659840 నంబర్ను సంప్రదించాలని తెలిపారు. -
చిన్న నిర్లక్ష్యంతో పెద్ద ప్రమాదం
ఆర్మూర్/నిజామాబాద్ రూరల్ : చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందని, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కలిసికట్టుగా కృషి చేద్దామని కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య పిలుపునిచ్చారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రో జుల కార్యాచరణలో భాగంగా ‘అరైవ్ – అలైవ్’ కా ర్యక్రమాల అమలుపై సోమ వారం జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో సర్పంచ్ల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. ఆర్మూ ర్ మండలం పిప్రిలో నిర్వహించిన గ్రామ స భకు కలెక్టర్ ఇలా త్రిపాఠి, నిజామాబాద్ రూర ల్ మండలం శాస్త్రినగర్లో నిర్వహించిన సభకు సీపీ సాయిచైతన్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామ సభల్లో పలు తీర్మానాలు చేయడంతోపాటు రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆయా సభల్లో కలెక్టర్, సీపీ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కన్నా రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు గ్రామ స్థా యి నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం ‘అరైవ్ – అలైవ్’ కార్య క్రమ ప్రధాన లక్ష్య మని పేర్కొన్నారు. రోడ్డు ప్రమా దాలు జరిగిన సమయంలో క్షతగాత్రులకు తక్షణ సహాయం అందించేందుకు చొరవ చూపాలని కోరా రు. ఈ తరహా చొరవ చూపిన వారికి ప్రభుత్వం ‘రహ్–వీర్’ కింద రూ.25 వేల ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందజేస్తుందని తెలిపారు. క్షతగాత్రులకు సహాయపడితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందేమోననే అపోహను వీడి విలువైన నిండు ప్రాణాలను కాపాడేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చా రు. ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరిస్తే శాస్త్రి నగర్ నుంచి ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్ తిలకించేందుకు పంపిస్తామని సీపీ ప్రకటించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్ కిరణ్, నరాల జ్యోతి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దుర్గాప్రమీల, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు, ఎంపీడీవో శివాజీ, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీవో శ్రీనివాస్, ఆర్మూర్ ఎస్హెచ్వో స త్యనారాయణ, ఎంవీఐ రాహుల్ కుమార్, నిజామాబాద్ ఇన్చార్జి ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, నిజామాబాదు సౌత్ రూర ల్ సీఐ సురేశ్కుమార్, ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ వినోద్, ఆరోటౌన్ ఎస్సై వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. శాస్త్రినగర్లో వాల్పోస్టర్లను ఆవిష్కరిస్తున్న సీపీ సాయిచైతన్య, తదితరులు పిప్రిలో వాల్ పోస్టర్లను ఆవిష్కరిస్తున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి, అధికారులు రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమష్టిగా కృషి చేద్దాం బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలి ‘అరైవ్ – అలైవ్’ కార్యక్రమాల్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య -
ప్రజాపాలనలో అభివృద్ధి
● పేదవాడి ముఖంలో చిరునవ్వే లక్ష్యంగా ముందుకు.. ● పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ నిజామాబాద్అర్బన్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే అనేక పనులు చేపట్టడంతోపాటు హామీలను నెరవేర్చిందని పీసీ సీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతోకలిసి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మహేశ్కుమార్గౌడ్ సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ప్రజాపాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందన్నారు. అభివృద్ధిని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ వంటి పథకాలు ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. వీటికి తోడు ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, రైతు భరో సా, యువతకు ఉద్యోగాల కల్పన, సన్న బియ్యం పథకాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన 591 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్రెడ్డి, కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నగర మేయర్ ఉమారాణి, నుడా చైర్మన్ కేశ వేణు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
అద్విత.. ఆలోచన అద్భుతం
● అభినందించిన సీపీ నిజామాబాద్ అర్బన్: గూపన్పల్లి గ్రామానికి చెందిన అద్వితను సీపీ సాయిచైతన్య అభినందించారు. గత కొన్ని నెలలుగా అద్విత తాను దాచుకుంటున్న డబ్బులతో హెల్మెట్లను కొనుగోలు చేసి ఉచితంగా పంపిణీ చేస్తోంది. తన తండ్రి బేనీ ఇచ్చిన డబ్బులను దాచుకొని హెల్మెట్లు అందజేయాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సోమవారం శాస్త్రీనగర్లో పోలీస్శాఖ నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమంలో తనవంతుగా గ్రామస్తులకు హెల్మెట్లను పంపిణీ చేసింది. దీంతో పోలీస్ కమిషనర్ అద్వితను అభినందించారు. -
ఆరు ఇళ్లలో చోరీ
● బంగారం, వెండి, నగదు అపహరణ నస్రుల్లాబాద్: మండలంలోని నాచుపల్లి గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఆరు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన గడిగళ్ల రాములు, గైని లచ్చవ్వ, మేత్రి సాయిలు, ప్రసాద్, అప్పాజి ఇళ్లకు తాళ వేసి ఉండటంతో దుండగులు దొంగతనం చేశారు. రెండు తులాల బంగారం, 30 తులాల వెండి, సుమారు రూ.70 వేల నగదు అపహరించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్సై రాఘవేంద్ర కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భిక్కనూరు: మండల కేంద్రంలోని టోల్ప్లాజా వద్ద టాస్క్ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులు సోమవారం వేకువజామున అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. ఓఎస్డీ శ్రీధర్రెడ్డి, డీఎస్పీ శేఖర్రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ కిష్టయ్య, భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు హైదరాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న లారీని నిలిపివేసి తనిఖీ చేయగా అందులో 280 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. రవాణాకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతోపాటు డ్రైవర్ సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో కేసు నమోదు చేసుకొని బియ్యంను జంగంపల్లిలోని ప్రభుత్వ గోదాముకు తరలించారు. -
బాధ్యతలు స్వీకరించిన జీజీహెచ్ సూపరింటెండెంట్
సుభాష్నగర్: జిల్లా కేంద్ర ప్రభు త్వ జనరల్ ఆస్ప త్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్గా ఫోరెన్సిక్ వి భాగాధిపతి డాక్టర్ నాగమోహన్రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యు లు, సిబ్బంది సహకారంతో రోగులకు నా ణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ నాగమోహన్రావును జీజీహెచ్ వైద్యులు, సిబ్బంది డాక్టర్ రాము లు, మెడికల్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ సూప రింటెండెంట్ నాగరాజు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా ● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ పీవీ రాజేశ్వర్రావు సుభాష్నగర్: నిజామాబాద్ సర్కిల్ పరిధిలో వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ను అంతరాయం లేకుండా సరఫరా చేస్తున్నామని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సూపరింటెండింగ్ ఇంజినీర్ పీవీ రాజేశ్వర్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం 2024–2025తో పోల్చితే 2025–2026 సంవత్సరంలో విద్యుత్ సరఫరా వ్యవస్థలో గణనీయమైన మెరుగుదల కనిపించిందన్నారు. 11 కేవీ బ్రేక్డౌన్స్ గతేడాదితో పోలిస్తే ఈఏడాది 41 శాతం తగ్గగా, ట్రిప్పింగ్స్ 39 శాతం తగ్గినట్లు తెలిపారు. ఈసంవత్సరంలో ఓవర్ లోడ్ సమస్యలను నివారించేందుకు 344 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, 19 పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంతోపాటు కొత్తగా 15 సబ్స్టేషన్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. లైన్ల నిర్వ హణ, జంపర్లు సరిదిద్దడం, వంగిన విద్యుత్ స్తంభాల సవరింపు వంటి చర్యల ద్వారా సరఫరా స్ధిరత్వాన్ని పెంచామని పేర్కొన్నా రు. లో ఓల్టేజీ సమస్య నివారణకు 40 కెపా సిటర్ బ్యాంకులను క్షేత్ర స్థాయిలో ఏర్పాటుచేశామని తెలిపారు. విద్యుత్సరఫరాలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వినియోగదారులు సమీప సెక్షన్ కార్యాలయం, లైన్మెన్ దృష్టికి తీసుకెళ్లాలని, అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నంబర్ 1912 ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని ఎస్ఈ తెలిపారు. పోలీస్ ప్రజావాణిలో 24 ఫిర్యాదులు నిజామాబాద్అర్బన్: జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు పోలీస్ ప్రజావాణిలో సోమవారం తమ ఫిర్యాదులను అందజేశారు. సీపీ సాయిచైతన్య మొత్తం 24 ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులు తమ సమస్యలను విన్నవించగా, వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులను సీపీ ఆదేశించారు. కేజీబీవీలో 86.36 శాతం ఉత్తీర్ణత ఖలీల్వాడి: ఇంటర్ ఫలితాల్లో జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల విద్యార్థులు 86.36 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు డీఈవో పార్శి అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 16 కేజీబీవీ లు ఉండగా, 11 స్కూళ్లలో ఇంటర్ సెకండియర్, 16 స్కూళ్లలో ఫస్టియర్ పరీక్షలు జరిగాయన్నారు. ద్వితీయ సంవత్సరంలో 528 మందికి 456 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. ఫస్టియర్లో 800 మంది విద్యార్థినులకు 596 మంది పాసైనట్లు పేర్కొన్నారు. -
ప్లాస్టిక్పై సమరం
పల్లెల్లో ● క్షేత్ర స్థాయిలో నివారణకు చర్యలు ● దశల వారీగా నిషేధం అమలు చేసే యోచన ప్లాస్టిక్ కవర్లు వినియోగించవద్దని వ్యాపారులకు సూచిస్తున్న కమ్మర్పల్లి ఉప సర్పంచ్ అశోక్మోర్తాడ్(బాల్కొండ): ప్లాస్టిక్ వినియోగంతో కలిగే అనర్థాలపై క్షేత్రస్థాయిలో వ్యాపారులకు, ప్రజలకు పలు గ్రామ పంచాయతీలు అవగాహన కల్పిస్తున్నాయి. దశల వారీగా పాలిథిన్ నిషేధం వైపు అడుగులు వేస్తున్నాయి. ప్లాస్టిక్ కవర్ల నిషేధం అమలుకు శ్రీకారం చుడుతున్నాయి. ఇప్పటి వరకు గంజాయి, సిగరెట్లు, గుట్కావంటి మత్తు పదార్థాల విక్రయాలపై కఠిన నిబంధనలను విధించి అమలు చేస్తూ అనేక పంచాయితీలు ఆదర్శవంతంగా నిలిచాయి. తాజాగా మోర్తాడ్, తిమ్మాపూర్, కమ్మర్పల్లి గ్రామ పంచాయతీల్లో ప్లాస్టిక్ కవర్ల నిషేధం అమలుపై పాలకవర్గాలు ఒక అడుగు ముందుకు వేశాయి. మొదట వ్యాపారులకు అవగాహన కల్పించి తరువాత ప్రజలలో చైతన్యం తీసుకరావాలని నిర్ణయించాయి. కమ్మర్పల్లిలో శనివారం అంగడి సాగగా అక్కడ ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, వార్డు సభ్యులు, కార్యదర్శితో కలిసి వ్యాపారులు ప్లాస్టిక్ కవర్లలో సరుకులు పెట్టి ఇవ్వకూడదని సూచించారు. 15 రోజుల తరువాత ప్లాస్టిక్ కవర్లు వ్యాపారుల వద్ద కనిపిస్తే రూ.500ల నుంచి రూ.వెయ్యి వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అంగడికి వచ్చే వినియోగదారులు కూడా బట్ట సంచులు తీసుకుని రావాలని ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల జరిగే నష్టాల గురించి వివరించారు. తిమ్మాపూర్లో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణకు ప్రతి వీధిలో ఒక డబ్బాను ఏర్పాటు చేసి అందులో ప్రజలు ప్లాస్టిక్ కవర్లు, ఇతర వస్తువులు అందులో వేసేలా అవగాహన కల్పించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వ్యాపారులతో సమావేశాలను నిర్వహించి ప్లాస్టిక్ కవర్లు కొనుగోలు చేయకుండా ఉండేలా చొరవ తీసుకుంటున్నారు. బట్ట సంచులు, కాగితపు కవర్లు తయారు చేసే యంత్రాలను కొనుగోలు చేసేవారికి సబ్సిడి రుణాలు ఇప్పించాలని పాలకవర్గం నిర్ణయించడం విశేషం. మోర్తాడ్లో వ్యాపారులతో సమావేశంను నిర్వహించి మహిళా సంఘాలు, కుల సంఘాల సహారంతో ప్లాస్టిక్ కవర్ల నిషేధంను అమలు చేయాలని నిర్ణయించారు. ఇలా ప్లాస్టిక్పై మూడు గ్రామ పంచాయితీలు చేపట్టిన సమరం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచి అంతటా ప్లాస్టిక్ కవర్లపై నిషేధం అమలు చేయాలని పలువురు కోరుతున్నారు. ప్లాస్టిక్ రహిత గ్రామంగా తిమ్మాపూర్ ప్లాస్టిక్ రహిత గ్రామంగా తిమ్మాపూర్ను అగ్రభాగాన ఉంచుతాం. వ్యాపారులు, ప్రజలకు ప్లాస్టిక్ వినియోగం వల్ల జరిగే నష్టంపై అవగాహన కల్పించి దశల వారీగా కవర్ల నిషేధం అమలు చేస్తాం. రీసైక్లింగ్ చేయడానికి వీలు ఉండే ప్లాస్టిక్ సామగ్రి సేకరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. – పుప్పాల నరేశ్, సర్పంచ్, తిమ్మాపూర్అందరి సహకారంతో.. గ్రామ ప్రజలు, అధికారుల సహకారంతో ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై నిషేధం అమలు చేస్తాం. ప్రజలు సరుకులు కొనుగోలు చేయడానికి వెళ్లే సమయంలో బట్ట సంచులు తీసుకవెళ్లాలి. వ్యాపారులు కవర్లలో సరుకులు ఇవ్వొద్దు. అవసరమైతే బట్ట సంచులు విక్రయించాలి. – భోగ ఆనంద్, సర్పంచ్, మోర్తాడ్ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల ప్రజల ఆరోగ్యంపై పరోక్షంగా దెబ్బ పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్యం కాపాడటానికి ప్లాస్టిక్ కవర్ల నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించాం. ప్రజల సహకారంతో కమ్మర్పల్లిని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దుతాం. – కొత్తపల్లి హారిక, సర్పంచ్, కమ్మర్పల్లి పాలిథిన్ ముప్పుపై గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో అవగాహన -
వృద్ధురాలిపై దాడి కేసులో నిందితుడి అరెస్టు
భిక్కనూరు: మండల కేంద్రంలో వృద్ధురాలిపై దాడి చేసిన కేసులో నిందితుడిని మూడు గంటల్లోనే భిక్కనూరు పోలీసులు పట్టుకున్నారని ఏఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. సోమవారం భిక్కనూరులో విలేకరుల సమావేశంలో ఆమె తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రంలో ఆదివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఉప్పరి లచ్చవ్వ ఇంట్లోకి చొరబడిన దుండగుడు.. ఆమె తలపై రోకలి బండతో దాడి చేసి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. భిక్కనూరు సీఐ సంపత్కుమార్, ఎస్సై ఆంజనేయులు వెంటనే స్పందించి నిందితుడి కోసం గాలించారు. రాత్రి 11.30 గంటల సమయంలో మండల కేంద్రంలోని చర్చి ప్రాంతంలో నిందితుడు, మండలకేంద్రానికి చెందిన గజ్జె స్వామిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి వద్దనుంచి నాలుగు తులాల బంగారు పుస్తెల తాడు, తులం బంగారు గుండ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి సెల్ఫోన్, బైక్ను స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ తెలిపారు. బంగారం ధర భారీగా పెరిగినందున మహిళలు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మూడు గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులను అభినందించారు. -
హత్య కేసులో నిందితుడి అరెస్టు
మాక్లూర్: హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నార్త్ జోన్ సీఐ శ్రీనివాస్, మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ పేర్కొన్నారు. మాక్లూర్ పీఎస్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని మెట్టు గ్రామానికి చెందిన బుగ్గ ఆంటోనీ(55) ఈ నెల 10న హత్యకు గురయ్యాడు. మృతుడి తమ్ముడు అబ్రహాం ఫిర్యాదు మేరకు విచారించగా ఈ నెల 10న రాత్రి ఆంటోనీ, అదే గ్రామానికి చెందిన ప్రాంచీస్ కలిసి ప్రకృతి వనం వద్ద మద్యం సేవించారు. మత్తులో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో ప్రాంచీస్ పెద్ద బండరాయితో ఆంటోనీ తలపై కొట్టడమే కాకుండా కొంతదూరం వరకు ఈడ్చుకుంటూ వెళ్లడంతో ప్రాణాలు విడిచాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ప్రాంచీస్ ఇంటికి వెళ్లి స్నా నం చేసి పరారయ్యాడు. సోమవారం ప్రాంచీస్ను పట్టుకొని విచారించగా హత్యకు ఉపయోగించిన బండరాయి, దుస్తులు స్వాధీనం చేసుకొని ప్రాంచీస్ను రిమాండ్కు తరలించామన్నారు. -
ఎస్సెస్సీ సీజీఎల్లో ఆల్ ఇండియా 102వ ర్యాంకు
ఖలీల్వాడి/ సుభాష్నగర్ : జాతీయ స్థాయిలో నిర్వహించిన ఎస్సెస్సీ (స్టాఫ్ సెలక్షన్ కమిషన్) సీజీఎల్(కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్)లో విద్యుత్ సంస్థ ఉద్యోగి శంక్రావు కుమారుడు ప్రణయ్ సత్తాచాటి ఆల్ ఇండియా 102వ ర్యాంకు సాధించాడు. ప్రణయ్ కస్టమ్స్ ఇన్స్పెక్టర్న్ (ఎగ్జామినర్) ఉద్యోగానికి ఎంపికయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం లలితపురం గ్రామానికి చెందిన జక్కుల శంకర్ నిజామాబాద్లో ట్రాన్న్స్ కో విజిలెన్స్ సీఐగా పని చేస్తున్నారు. గతంలో కూడా ప్రణయ్ ఎస్సెస్సీలో పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగంతోపాటు వివిధ బ్యాంకుల్లో మొత్తం ఆరు ఉద్యోగాలు సాధించారు. తెయూ విద్యార్థినికి అరుదైన అవకాశం తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివ ర్సిటీ ఇంగ్లిష్ విభా గం ఫస్టియర్ విద్యార్థి ని కే.కీర్తనకు అరుదైన అవకాశం లభించింది. పార్లమెంటరీ రీసె ర్చ్ అండ్ ట్రెయినింగ్ ఇన్స్టి ట్యూట్ ఫర్ డెమోక్రసీ (పీఆర్ఐడీఈ) ఆధ్వర్యంలో 2022 నుంచి నిర్వహిస్తున్న ‘నో యువర్ లీడర్’ కార్యక్రమంలో ఈ నెల 14న కీర్తన పాల్గొననున్నారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లో భాగంగా పార్లమెంట్లో రా జ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన గు రించి కీర్తన ప్రసంగించనున్నారు. రాష్ట్రం నుంచి కీర్తన ఒక్కరే ఎంపిక కావడం తెలంగాణ యూనివర్సిటీకి గర్వకారణమని తె యూ వీసీ టీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఎం యాదగిరి, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ కే.అపర్ణ, అధ్యాపకులు అభినందించారు. ఖరీఫ్కు సాగు నీరందించాలి వర్ని: సిద్దాపూర్ రిజర్వాయర్ ద్వారా ఖరీఫ్ పంటలకు సాగునీరందించాలని వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచా రం శ్రీనివాస్రెడ్డి అధికారులను, కాంట్రాక్టర్ను ఆదేశించారు. వర్ని మండలం సిద్ధాపూర్ శివారులో కొనసాగుతున్న రిజర్వాయ ర్ పనులను పోచారం ఆదివారం పరిశీలించారు. రైతులు దగ్గరుండి పనులను పర్యవేక్షించాలని, అప్పుడే నాణ్యతగా పనులు జరుగుతాయని సూచించారు. రిజర్వాయర్ పనులు పూర్తయితే 9 గ్రామాల రైతులకు చెందిన పదివేల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. ఆయనవెంట వర్ని మార్కెట్ కమిటీ అధ్యక్షుడు సురేశ్బాబా, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వెలగపూడి గోపాల్, సిద్ధాపూర్ సర్పంచ్ బాల్సింగ్, జాకోరా సర్పంచ్ సాయిలు, నాయకులు గిరి, బారి పాల్గొన్నారు. ఐఎంఏ అధ్యక్షుడికి కీలక బాధ్యతలు సుభాష్నగర్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అధ్యక్షుడు, ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ ఆకులకు అడిక్షన్ మెడిసిన్ స్పెషాలిటీ సెక్షన్ చైర్మన్గా జాతీయస్థాయి బాధ్యతలను అప్పగించినట్లు ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ (ఐపీఎస్) అధ్యక్షుడు డాక్టర్ టి సత్యనారాయణ, ప్రధానకార్యదర్శి డాక్టర్ అరుణ్ మార్వాలే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మానసిక వైద్యంలో, ముఖ్యంగా వ్యసన సంబంధిత రుగ్మతల చికిత్సలో ఆయనకు ఉన్న విశేష అనుభవం, నైపుణ్యం, సేవలను గుర్తిస్తూ ఈ బాధ్యతను అప్పగించినట్లు విశాల్ ఆకుల పేర్కొన్నారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీలోని అడిక్షన్ మెడిసిన్ స్పెషాలిటీ సెక్షన్ దేశవ్యాప్తంగా వ్యసన వ్యాధులపై అవగాహన పెంపొందించడం, చికిత్స మార్గదర్శకాలు రూపొందించడం, పరిశోధనలకు ప్రోత్సాహం అందించడం వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. అదేవిధంగా ఏప్రిల్ 18న రాజస్తాన్లోని జైపూర్లో నిర్వహించనున్న నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశానికి డాక్టర్ విశాల్ను ఆహ్వానించారు. -
ప్రభుత్వ కాలేజీల్లో ఉత్తమ మార్కులు
సాక్షి, నెట్వర్క్ : ఇంటర్ ఫలితాల్లో జిల్లా కు చెందిన పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు ప్రతిభచాటారు. మా క్లూర్ మండలంలోని మహాత్మా జ్యోతీబా ఫూలే బాలికల కళాశాల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ బైపీసీలో జి.రుచితకు 438, శెట్టి తేజకు 436 మార్కులు వచ్చాయి. ఇందల్వాయి కేజీబీవీ విద్యార్థిని బదావత్ మనీషా ఫస్టియర్ ఎంపీసీలో 465 మార్కులు సాధించారు. డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్ సెకండియర్ 100 శాతం, ఫస్టియర్లో 97 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఎడపల్లిలోని టీజీఆర్జేసీ విద్యార్థులు ఎంపీసీ ఫస్టియర్లో శ్రీజ, దీపికా, చందనా, శ్రీనిధి 466 మార్కులు, ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో అమృత 992, భవానీ 991, బైపీసీలో వర్ష 989, భార్గవి 987 మార్కులు సాధించారు. రుద్రూర్ కేజీబీవీ విద్యార్థులు ఫస్టియర్లో 98.2 శాతం పాసయ్యారు. ఎంపీసీలో ఎం.మధుశ్రీకి 466 మార్కులు వచ్చాయి. మోపాల్ మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల విద్యార్థినులు సెకండియర్లో 76 మందికి 72 మంది ఉత్తీర్ణత సాధించారు. -
సామాజిక విప్లవకారుల స్ఫూర్తిని కొనసాగిద్దాం
సుభాష్నగర్: డాక్టర్ అన్నాభావు సాఠే విగ్రహం మనకు నిరంతరం పోరాట పటిమను గుర్తు చేస్తుందని, సామాజిక విప్లవకారుల స్ఫూర్తిని కొనసాగిద్దామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అ డ్లూరి లక్ష్మణ్కుమార్ పిలుపునిచ్చారు. నగరంలోని చంద్రశేఖర్ కాలనీ చౌరస్తాలో డాక్టర్ అన్నాభావు సాఠే విగ్రహాన్ని ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మ హేశ్కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్, నగర మేయర్ కూరగాయల ఉమారాణితో కలిసి మంత్రి ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ దళిత సమాజం ఆర్థికంగా, రాజకీ యంగా ఎదిగినప్పుడే నిజమైన సామాజిక మార్పు సాధ్యమని, మాదిగ సామాజికవర్గం నుంచి గెలుపొందిన సర్పంచులు, కౌన్సిలర్లు తమ ప్రాంత అభివృద్ధిలో ఆదర్శంగా నిలవాలని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ బహుజన పక్షపాతిగానే ఉంటుందని, సామాజిక సమానత్వం కోసం పోరాడిన మహనీయుల విగ్రహాలను ప్రతి ష్టించుకోవడం మన బాధ్యత అని పేర్కొన్నారు. బలహీన వర్గాల సాధికారత కోసమే కులగణన వంటి కీలక నిర్ణయాలను ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లాలోని మాదిగ సామాజికవర్గానికి చెందిన సర్పంచులు, వార్డుసభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను ఘనంగా సన్మానించారు. కా ర్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, నాందేడ్ ఎంపీ రవీంద్ర వసంత్రావుచౌహాన్, అన్నాభావు సాఠే మనవ డు సచిన్ భావుసాఠే, నాయకులు పిడమర్తి రవి, జి ల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాట్పల్లి నగేశ్రెడ్డి, కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నుడా చైర్మన్ కేశ వేణు, ఎస్సీ, ఎస్టీ కోర్టు పీపీ దయాకర్గౌడ్, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ముత్యాల సునీల్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలి త, మాజీ మేయర్ ఆకుల సుజాత, స్థానిక కార్పొరేటర్ పూజితాప్రవీణ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ కాంగ్రెస్ ఎప్పుడూ బహుజన పక్షపాతి ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ జిల్లా కేంద్రంలో డాక్టర్ అన్నాభావు సాఠే విగ్రహావిష్కరణ -
మళ్లీ బాలికలదే హవా
ఫస్టియర్లో 56.64 శాతం ఉత్తీర్ణత.. 25వ స్థానం సోమవారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026– 8లో uసెకండియర్లో 66.19 శాతం ఉత్తీర్ణత.. 29వ స్థానం ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికల హవా మళ్లీ కొనసాగింది. ఫలితాలు ఆదివారం విడుదల కాగా, ఫస్టియర్(జనరల్)లో 56.64 శాతం, సెకండియర్లో 66.19 శాతం, ఒకేషనల్ ఫస్టియర్లో 49.65 శాతం, సెకండియర్లో 67.68 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు డీఐఈవో తిరుమలపూడి రవికుమార్ వెల్లడించారు. ఇంటర్ సెకండియర్లో 9,187 మంది, ఫస్టియర్లో 8,806 మంది, ఒకేషనల్ ఫస్టియర్లో 1,272, సెకండియర్లో 1,587 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. రాష్ట్రస్థాయి సెకండియర్ ఫలితాల్లో జిల్లా 29వ స్థానం, ఫస్టియర్లో 25వ స్థానంలో నిలిచిందన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 7.98 శాతం ఉత్తీర్ణత పెరిగిందన్నారు. 2024–25 సెకండియర్లో 58.21 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈసారి 66.19 శాతం పాసయ్యారు. ఫస్టియర్ 2024–25లో 53.37 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈసారి 56.64 శాతం మంది పాసయ్యారు. – ఖలీల్వాడి ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థినులు జిల్లా విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు గతేడాది కన్నా 7.98 శాతం పెరిగిన ఉత్తీర్ణత మే 13 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 20 వరకు ఫీజు చెల్లింపునకు గడువు -
ఎడ్లను తరలిస్తున్న వాహనం పట్టివేత
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్ గ్రామశివారులో అక్రమంగా 10 ఎడ్లను తరలిస్తున్న వాహనాన్ని ఆదివారం పట్టుకున్నట్లు ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపారు. ఈమేరకు వాహన యాజమాని అబ్దుల్ రహీంతోపాటు డ్రైవర్ సాయిలుపై కేసునమోదు చేసినట్లు ఆయన చెప్పారు. పట్టుబడిన వాహనంలోని ఎడ్లను మెదక్ మండలంలోని గోశాలకు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. ఎల్లారెడ్డిలో.. ఎల్లారెడ్డిరూరల్: ఆవులను తరలిస్తున్న వాహనాన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు బజరంగ్దళ్ నాయకులు ఆదివారం తెలిపారు. బాన్సువాడ వైపు నుంచి హైదరాబాద్ వైపునకు బొలేరో వాహనంలో పది ఆవులను తరలిస్తుండగా, ఎల్లారెడ్డిలో వాహనాన్ని ఆపి పట్టుకున్నట్లు వారు తెలిపారు. అనంతరం పోలీసులకు అప్పగించినట్లు వారు తెలిపారు. పోలీసులు ఆవులను గోశాలకు తరలించారు. -
క్రైం కార్నర్
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి కామారెడ్డి రూరల్: చెరువులో ఈతకు వెళ్లిన ఓ వి ద్యార్థి ప్రమాదవశాత్తు నీటమునిగి మృతిచెందా డు.వివరాలు ఇలా..కామారెడ్డి మున్సిపాలిటీ పరిధి లోని టేక్రియాల్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల రాకేష్ (15) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగ తి చదువుతున్నాడు. ప్రస్తుతం పరీక్షలు కొనసాగుతున్నాయి. అయితే ఆదివారం కావడంతో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి గొర్లు మేపడానికి వెళ్లారు. మధ్యాహ్నం చెరువులో ఈత కొట్టడానికి ముగ్గురు వెళ్లారు. ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు రాకేష్ చెరువులో ఉన్న గుంతలో ఊపిరాడక మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ షాక్తో ఆవు .. లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని అయ్యపల్లి తండాలో కేతావత్ జీలియా నాయక్కు చెందిన జెర్సీ ఆవు విద్యుత్ షాక్తో మృతి చెందింది. రోజూ మాదిరిగానే ఆవు గ్రామ శివారులోని పంట చేనులో మేతకు వెళ్లగా సర్వీసు వైరుకు తాకడంతో విద్యుత్ షాక్ రావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో సుమారు రూ. 80వేలు నష్టం జరిగినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్కో అధికారులు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. -
దత్తాపూర్లో ఘనంగా హిందూ సమ్మేళనం
డొంకేశ్వర్(ఆర్మూర్): డొంకేశ్వర్ మండలం దత్తాపూర్ గ్రామంలోని శివదత్త ఆశ్రమం వేదికగా ఆదివారం రాత్రి నిర్వహించిన ‘హిందూ సమ్మేళనం’ ఘనంగా కొనసాగింది. నందిపేట్ పలుగుట్ట వ్యవస్థాకుడు కేదారానంద మహారాజ్, అంక్సాపూర్ జగత్ మహారాజ్, అమ్దాపూర్ అగ్గుస్వామి మహారాజ్, కంఠేశ్వర్ ఇస్కాన్ రామానంద ప్రభు, జాతీయ సాహిత్య పరిషత్ రాష్ట్ర కార్యదర్శి సూర్యనారాయణ, రాష్ట్ర సేవికా కమిటీ పొద్దుటూరి రూప సమ్మేళనానికి హాజరై మాట్లాడారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతి హిందువు బాధ్యతని వారు పేర్కొన్నారు. మహిళలను రుగ్మతల నుంచి రక్షించుకోవాలని, ప్రతి హిందూ కుటుంబంలో ధార్మిక అవగాహన పెరగాలన్నారు. పర్యావరణ హితవు కోసం అన్నదాన కార్యక్రమంలో స్టీల్ ప్లేట్లు, గ్లాసులను వినియోగించారు. సర్పంచ్ మూడ్ ప్రకాష్, హిందూ సమ్మేళన ఉత్సవ కమిటీ సభ్యులు, హిందూ బంధువులు, మహిళలు పాల్గొన్నారు. -
2029 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్ అమలు
సుభాష్నగర్: 2029 ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్ అమలు కానుందని, ఈ బిల్లు ఆమోదం దేశ రాజకీయాల్లోనే చరిత్రాత్మక ఘట్టమని ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడం బీజేపీ చిత్తశుద్ధి, నిబద్ధతకు నిదర్శనమన్నారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మహిళలకు రిజర్వేషన్లు ఉన్నాయని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజనతోపాటు మహిళా రిజర్వేషన్ అమలవుతుందని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో ప్రజాస్వామ్యం బలోపేతం కావడంతోపాటు అవినీతి తగ్గుతుందని, మంచి పాలన అందుతుందని అభిప్రాయం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ మహిళలు, కులాలను రాజకీయాలకు వాడుకుందని ఆరోపించిన అర్వింద్.. 30 ఏళ్ల మహిళా రిజర్వేషన్ బిల్లుకు నేటి మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదింపజేసి వారి కలను సాకారం చేసిందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో కొందరు ప్రజాప్రతినిధులు అపోహలు, అభద్రతకు లోనవుతున్నారని, నియోజకవర్గ పునర్విభజనతో పెరిగే సీట్లతో వారికి అవకాశం కలుగుతుందని అన్నారు. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు చేపడతారని స్పష్టంచేశారు. 543 ఎంపీ స్థానాల నుంచి 816కు పెరుగుతున్నాయని గుర్తుచేశారు. అసత్య ప్రచారం.. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారతదేశంలో సీట్లు కోల్పోతామని, జనాభా నియంత్రణ పాటిస్తున్న రాష్ట్రాలకు పునర్విభజనతో నష్టం జరుగుతుందని కొన్ని పార్టీలు అసత్యప్రచారానికి తెర లేపుతున్నాయని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. దేశంలోని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో 50శాతం స్థానాలు పెరుగుతాయని స్పష్టంచేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి, రాష్ట్ర కార్యవర్గసభ్యులు మేడపాటి ప్రకాశ్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, కార్పొరేటర్లు న్యాలం రాజు, ప్రమోద్కుమార్, విజయలక్ష్మి, మల్లేశ్యాదవ్, బంటు రాము, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. మహిళా బిల్లు ఆమోదం దేశ రాజకీయాల్లోనే చరిత్రాత్మక ఘట్టం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 50శాతం సీట్ల పెంపు మహిళలు, కులాలతో కాంగ్రెస్ రాజకీయం మీడియాతో ఎంపీ అర్వింద్ ధర్మపురి -
ఎస్ఎస్ఆర్ విద్యార్థుల ప్రతిభ
అబ్దుల్ నబీర్ 960(ఎంఎల్టీ)ఆర్బియానాజ్ 954(ఎంఎల్టీ)జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాలలో ఉత్తమ ఫలితాలను సాధించినట్లు విద్యాసంస్థల చైర్మన్ మారయ్యగౌడ్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను అభినందించారు. నాన్ రెసిడెన్షియల్ కళాశాలలో రాష్ట్ర, జిల్లా స్థాయి మార్కులను సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. ఒకేషనల్ విభాగంలో తమ విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారన్నారు. ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ ఎంఎల్టీ కోర్సులో అబ్దుల్ నబీర్ 960/1000, ఆర్బియా నాజ్ 954/1000 సాధించారని తెలిపారు. జనరల్ విభాగం ద్వితీయ సంవత్సరంలో కుందేన అఖిల్ 869/1000 (ఎంపీసీ), వోడేపు విష్ణు ప్రియ 857/1000 (ఎంపీసీ), ప్రథమ సంవత్సరంలో సాహితి 423/440 (బైపీసీ), షీజ కౌసర్ 422/470(ఎంపీసీ), ఒకేషనల్ విభాగం ఫస్టియర్లో కాలూరి ప్రణీత్ కుమార్ 474/500 (ఎంఎల్టీ), గోరకంటి మమత 443/500 (ఎంపీహెచ్డబ్ల్యూ) సాధించారన్నారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల డైరెక్టర్ ఎం.హర్షిత్ గౌడ్, ప్రిన్సిపాల్ డా క్టర్ ఎన్. రవీందర్ గౌడ్, అధ్యాపక బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ఎస్ఆర్ ప్రభంజనం
ఎస్ఆర్ విద్యా సంస్థల విద్యార్థులు ఇంటర్ ఫలితాలలో రాష్ట్రస్థాయిలో మరోసారి సత్తా చాటినట్లు డీజీఎం గోవర్థన్ రెడ్డి ఆదివారం తెలిపారు. గంగాస్థాన్లోని ఎస్ఆర్ కాలేజీలో ప్రతిభచాటిన విద్యార్థులను సన్మానించారు. ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీలో ఎస్. చందన, ఆస్మిత్ గౌడ్, సరియన్ స్పందన, అఖిలేశ్ 470 గాను 468 సాధించి జిల్లా టాపర్స్గా నిలిచినట్లు తెలిపారు. 205 మంది విద్యార్థులు 467 నుంచి 460 మార్కులు సాధించారని పేర్కొన్నారు. బైపీసీలో ఆసియా అంజుమా, మనుశ్రీ, అనూష, స్నే హ 440 మార్కులకు 438 మార్కులు సాధించా రు. 78 మంది విద్యార్థులు 437 నుంచి 430 మా ర్కులు సాధించినట్లు చెప్పారు. సీఈసీలో హనీ యాసిద్దిమ్ 500 మార్కులకు 482 మార్కులు, శ్రీ చందన 481 మార్కులు సాధించారన్నారు. ఇంటర్ సెకండియర్ ఎంపీసీలో నడ్కుడ దినేశ్ 995/1000 మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచారు. మరో 27 మంది విద్యార్థులు 993 నుంచి 990 వరకు మార్కులు సాధించారు. బైపీసీలో ఉపాజఫీన్, హన్మిత, తిరుమల 991/1000 మార్కులతో ప్రతిభ కనబర్చారు. ఏడుగురు విద్యార్థులు 990/1000 మార్కులు సాధించారు. సీఈసీలో సంకీర్తన 967/1000 సాధించగా, ఎంఈసీలో జడల దీపికకు 955/1000 మార్కులు వచ్చాయి. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఎనగందుల, వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, సీఈవో సురేందర్ రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో అకాడమీ డీన్ రాంబాబు, జోనల్ ఇంచార్జి శ్రీకాంత్, ప్రిన్సిపాళ్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
పొంచి ఉన్న ప్రమాదం!
పాల్గొన్న మహిళలు మండలంలోని నల్లవెల్లి శివారులోగల రోడ్డుపై ఉన్న కల్వర్టు కుంగి పెద్ద గుంత పడింది. నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించే ఈ దారిలో గుంత పడటంతో పెను ప్రమాదం పొంచి ఉంది. గుంత పడి నెల రోజులు గడుస్తున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన నేపథ్యంలో పెద్ద లారీలు టన్నుల బరువుతో వెళ్లనున్నాయని, ప్రమాదం జరగకముందే మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. –ఇందల్వాయి -
ఇంటర్ విద్యార్థి అదృశ్యం
నందిపేట్(ఆర్మూర్): మండల కేంద్రంలోని ఓ ఇంటర్ విద్యార్థి అదృశ్యమైనట్లు ఎస్సై శ్యామ్రాజ్ ఆదివారం తెలిపారు. వివ రాలు ఇలా.. డొంకేశ్వర్ మండలం జిజి నడ్కుడ గ్రామానికి చెందిన అరవింద్ రెడ్డి అనే ఇంటర్ విద్యార్థి కుటుంబం కొన్నే ళ్లుగా నందిపేటలోనే నివాసం ఉంటున్నారు. అరవింద్రెడ్డి ని జామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆల్ఫోర్స్ కాలేజీలో ఇంటర్ ఫ స్టియర్ చదువుతున్నాడు. ఆదివారం ఇంటర్ రిజల్ట్ వచ్చిన త ర్వాత అతడు కనిపించకుండా పోయా డు. ఉదయం కిరాణా షాపులోకి వెళ్లివస్తానని చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్లగా ఇప్పటికీ తిరిగి రాలేడు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా అతడి ఆచూ కీ లభించలేదు. విద్యార్థి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నట్లు ఎస్సై శ్యామ్రాజ్ తెలిపారు. ఇదిలా ఉండగా ఇంటర్ ఫలితాల్లో అరవింద్ ఫెయిల్ అయ్యాడని సమాచారం. -
సత్తా చాటిన ప్రభుత్వ కళాశాలలు
ఖలీల్వాడి: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న బాలబాలికలు అత్యుత్తమ మార్కులను సాధించారని డీఐఈవో తిరుమలపుడి రవికుమార్ తెలిపారు. నిజామాబాద్ బాలికల జూనియర్ కళాశాలలో బైపీసీ సెకండియర్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థిని మదిహ శహవర్ 1000 మార్కులకు గాను 983 మార్కులు సాధించారన్నారు. అలాగే ఉమేమా అంజిర్ 982 మార్కులు సాధించారన్నారు. ఎంపీసీలో ఇంగ్లీష్ మీడియం విద్యార్థిని సాయిబా తహసిన్ 978 మార్కులు, శ్రీమయి 977 మార్కులు సాధించారని తెలిపారు. హెచ్ఈసీ గ్రూప్లో ఆర్మూర్ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని రమ్య 946 మార్కులు సాధించారని, సీఈసీలో నిజామాబాద్ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని అయేషా ఫాతిమా 904 మార్కులు సాధించారని తెలిపారు. బాలికల జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం ఎంపీసీలో తాళ్ల హర్షినీ 470 మార్కులకు గాను 462 మార్కులను పొందారని, బైపీసీలో సమీరా 440 మార్కులకు గాను 425 మార్కులు సాధించారని తెలిపారు. అలాగే సీఈసీలో మహేక్ ఫిర్దోస్ 500 మార్కులకు గాను 470 మార్కులు, హెచ్ఈసీలో 500 మార్కులకు గాను 432 మార్కులు సాధించారని తెలిపారు. పెర్కిట్ మోడల్ స్కూల్.. పెర్కిట్(ఆర్మూర్): పెర్కిట్లోని మోడల్ స్కూల్ విద్యార్థిని బీ నితీష ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో 1000 మార్కులకు గాను 987 మార్కులు సాధించింది. అలాగే హెచ్ కౌసర్ బైపీసీలో 981, శ్రీవాణి సీఈసీలో 958 మార్కులు సాధించింది. మొదటి సంవత్సరంలో జల్ద శ్రీమాయి ఎంపీసీలో 454 మార్కులు, సిద్ర హఫీజా బైపీసీలో 418 మార్కులు, గట్ల ప్రణవి సీఈసీలో 479 మార్కులు సాధించింది. ఎడపల్లి బాలికల గురుకుల కళాశాల.. బోధన్: ఎడపల్లి శివారులోని టీజీ ఆర్జేసీ(తెలంగాణ బాలికల గురుకుల కళాశాల) విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని కళాశాల ప్రిన్సిపల్ గంగాశంకర్ తెలిపారు. ఎంపీసీ ఫస్టియర్లో 43 మందికిగాను 37 మంది, సెకండియర్లో 34మందికిగాను 33 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. బైపీసీ ఫస్టియర్లో 42 మందికి గాను 37 మంది, సెకండియర్లో 29 మందికిగాను 29 మంది ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణులయ్యాన్నారు. ఎంపీసీ ఫస్టియర్లో శ్రీజా, దీపికా, చందనా, శ్రీనిధి 470 మార్కులకుగాను 466 మార్కులు సాధించారన్నారు. మానస్నితా, శివాణి 464 మార్కులు, బైపీసీ ఫస్టియర్లో 440 మార్కులకుగాను గంగు 436, ప్రణవి 434 మార్కులు సాధించారన్నారు. ఎంపీసీ సెకండియర్లో అమృతా 992, భవానీ 991, బైపీసీ ద్వితీయ సంవత్సరంలో వర్షా 989, భార్గవి 987 మార్కులు సాధించారని ప్రిన్సిపల్ తెలిపారు. ఇందల్వాయి కేజీబీవీ.. ఇందల్వాయి: ఇందల్వాయి కేజీబీవీలో 33 మంది విద్యార్థినులు మొదటి సంవత్సరం పరీక్షలు రాయగా 70 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రత్యేక అధికారి వర్ష తెలిపారు. ధర్పల్లి మండలం దుబ్బాకకు చెందిన బదావత్ మనీషా ఎంపీసీలో 465/470 మార్కులు సాధించినట్లు వివరించారు. -
కంజర్ బాలికల గురుకుల కళాశాల
706 ః డి హాస్పియా 981 మార్కులు ఎంపీసీ సెకండియర్ఎస్ నివేత 463మార్కులు ఎంపీసీ ఫస్టియర్ బి జీవిత 975మార్కులు బైపీసీ సెకండియర్ సుమ శ్రీ 979మార్కులు ఎంపీసీ సెకండియర్ జి సుమలత 460 మార్కులు ఎంపీసీ ఫస్టియర్ మోపాల్: మండలంలోని కంజర్ శివారులోగల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఎంపీసీ, బైపీసీ సెకండియర్లో 76 మంది విద్యార్థినులకుగాను 72 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీలో విద్యార్థినులు హస్పియా 981 మార్కులు, సుమశ్రీ 979 మార్కులు సాధించారు. బైపీసీలో జీవిత 975 మార్కులు, సీహెచ్ శ్రీజ 965 మార్కులు సాధించారు. అలాగే ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీలో మొత్తం 77 మంది విద్యార్థినులకుగాను 69 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీలో ఎస్ నివేత 463 మార్కులు, జి సుమలత 460 మార్కులు సాధించారు. విద్యార్థినులను ప్రిన్సిపాల్ విజయలలిత అభినందించారు. -
25 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహితులు
బీబీపేట: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2000–01లో పదవ తరగతి చదివిన విద్యార్థులు 25 ఏళ్ల తర్వాత మళ్లీ ఒక్కచోట కలుసుకున్నారు. పాఠశాలలో ఆదివారం వారంతా కలిసి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఏళ్ల తర్వాత విద్యార్థులు మళ్లీ కలుసుకోవడంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకొని, ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆనాడు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను, కార్యక్రమానికి ఆహ్వానించి, సన్మానించారు. ఉపాధ్యాయులు కాశీనాథం, రమేష్ శర్మ, గంగాధర్, అంజయ్య, కిష్టారెడ్డి, విజయ్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, విశ్వ మోహన్, ఎల్లం, వెంకటేశం, విద్యార్థులు పాల్గొన్నారు. -
టాపర్లు వీరే..
సాక్షి, నెట్వర్క్ : ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభచాటారు. సెకండియర్ ఎంపీసీలో శ్రీనాథియా 996 (ఆల్ఫోర్స్), బైపీసీలో తౌరా తమ్సిల్ 994 (విద్యా వికాస్, బోధన్), ఫస్టియర్ ఎంపీసీలో సత్యం 469 (క్షత్రియ జూనియర్ కళా శాల) మార్కులు సాధించారు. విద్యార్థులను కళాశాల ప్రతినిధులు అభినందించారు. తౌరా తమ్సిల్ 994 మార్కులు బైపీసీ సెకండియర్ ఆర్ సత్యం, 469 మార్కులు ఎంపీసీ ఫస్టియర్ -
బోరుమోటార్ చోరీ
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మాసాన్పల్లి గ్రామశివారులో బోరుమోటార్ చోరీకి గురికాగా, ఆదివారం కేసునమోదు చేసినట్లు ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపారు. గ్రామంలోని సూర్యకుమార్కు చెందిన పొలం సమీపంలోగల నిజాంసాగర్ బ్యాక్వాటర్ చెరువు గండి నుంచి ఓపెన్ వెల్ మోటార్ను గుర్తుతెలియని దొంగలు దొంగిలించారు. దీంతో బాధితుడు పోలీసులకు సమాచారం అందించగా, ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. బాధితుడి నుంచి ఫిర్యాదు తీసుకొని కేసునమోదు చేసినట్లు ఆయన చెప్పారు. -
ప్రతిభ చాటిన ప్రయివేట్ కాలేజీలు
ఖలీల్వాడి: జిల్లాలోని పలు ప్రయివేట్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించారు. నగరంలోని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. సెకండియర్ ఎంపీసీలో శ్రీనాథియా 996 మార్కులు, బైపీసీలో హిరణ్య, ఆశ్విని 987 మార్కులు సాధించారు. ఫస్టియర్ ఎంపీసీలో 470 మార్కులకు గాను రాజేశ్వరి, పూజిత, అక్షిత 468 మార్కులు సాధించారు. ఫస్టియర్ బైపీసీలో 440 మార్కులకు గాను నిశిత, కారుణ్య 435 మార్కులు, గిర్మిష 432 మార్కులు సాధించారు. ఫస్టియర్ ఎంఈసీలో ప్రజ్వల్ పాండే 448/500 మార్కులను సాధించారు. విద్యార్థులను ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్రెడ్డి అభినందించారు. సత్తా చాటిన బన్సల్ విద్యార్థులు నగరంలోని బన్సల్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చారు. ఎంపీసీ ఫస్టియర్లో నమిత్, శ్రీహిత 468 మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచారు. బైపీసీ ఫస్టియర్లో తీన్యశ్రీ 435 మార్కులు, శ్లోకా జాదవ్ 433 మార్కులు సాధించారు. ఎంపీసీ సెకండియర్లో ధనుష్ 974 మార్కులు, రోనిత్ 973 మార్కులు సాధించారు. బైపీసీ సెకండియర్లో ప్రవీణ్ 971 మార్కులు, నరేష్ 961 మార్కులు సాధించారు. విద్యార్థులను కాలేజీ ప్రిన్సిపాల్, సిబ్బంది అభినందించారు. నారాయణ స్టేట్ ఫస్ట్.. ఇంటర్మీడియట్ ఫలితాలలో నారాయణ జూనియర్ కాలేజ్ విద్యార్థిని గట్ల వరేణ్య ఎంపీసీ ఫస్టియర్లో 469 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించినట్లు ఏజీఎం కుంట లక్ష్మారెడ్డి, కళాశాల డీన్ మంజుల, ప్రిన్సిపాల్ సిహెచ్ రవిగౌడ్ తెలిపారు. అలాగే ఎంపీసీ సెకండియర్లో అయేషా ఆఫీఫా 994 మార్కులు సాధించారన్నారు. సింధు హర్షిని, సద్ధి అక్షిత 992 మార్కులు, కార్తీక 988, బండ సాహితి 984, విరాజ్ 982 మార్కులు సాధించారు. విద్యార్థులకు కళాశాల యాజమాన్యం అభినందించారు. -
మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు ఘన స్వాగతం
సుభాష్నగర్: నిజామాబాద్ నగర పర్యటనకు ఆదివారం సాయంత్రం విచ్చేసిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు ఇన్చార్జి అదనపు కలెక్టర్ దిలీప్కుమార్ ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా మంత్రిని దిలీప్కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. మంత్రి వెంట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, నగర మేయర్ ఉమారాణి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి తదితరులు ఉన్నారు. కామారెడ్డి అర్బన్: ప్రతి హిందువు సంస్కృతి, సాంప్రదాయాలను పాటించడంతో పాటు మనసా, వాచా, కర్మణా హిందూ ధర్మానికి కట్టుబడి ఉండాలని జుక్కల్ సద్గురు గోపాల్రాందాస్ మూలే అన్నారు. కామారెడ్డి ఎన్జీవోస్ కాలనీ, కాకతీయనగర్ బస్తీ హిందూ ధర్మ సమ్మేళనం ఆదివారం రాత్రి శిశుమందిర్ హైస్కూల్ మైదానంలో నిర్వహించగా 2 వేల కు పైగా జనం తరలివచ్చారు. తొలుత గోమా తలకు పూజలు నిర్వహించారు. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ప్రధాన వక్త నర్రా వెంకట శివకుమార్, ప్రతినిధులు లక్ష్మీనర్స య్య, రాహుల్గౌడ్, మున్సిపల్ మాజీ చైర్పర్స న్ ఇందుప్రియ, కౌన్సిలర్లు హర్షిత, ప్రభాకర్ యాదవ్,వినోదబాయి పాల్గొన్నారు. భట్రాజు సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక కామారెడ్డి అర్బన్: తెలంగాణ రాష్ట్ర భట్రాజు సంఘం కామారెడ్డి జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడిగా అర్వరాజు నరేందర్ రాజు, యూత్ అధ్యక్షుడిగా సాయి సుమంత్ విశ్వరాజు, మహిళా విభాగం అధ్యక్షురాలిగా బట్టు పద్మజ ఎన్నికయ్యారు. జిల్లాలో భట్రాజుల అభివృద్ధి, ఐక్యత, సామాజిక సేవల కోసం కృషి చేస్తామని ప్రమాణం చేశారు. మాచారెడ్డి: అక్కాపూర్, ఘన్పూర్(ఎం) గ్రామాల్లో ఆదివారం మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేదింటి కల సాకారమైందని అన్నారు. అక్కాపూర్, ఘన్పూర్ గ్రామాల్లో మూడేసి ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు కట్న కానుకలు సమర్పించారు. సర్పంచులు, ఉప సర్పంచులు, నాయకులు నరసింహారెడ్డి, చంద్రునాయక్, రామ్మోహన్, శ్రీనివాస్చారి, సతీష్ ఉన్నారు. -
భారమైన కువైట్ ప్రయాణం
మోర్తాడ్(బాల్కొండ): ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధ విరామం ఏర్పడినా గల్ఫ్ దేశమైన కువైట్కు వెళ్లి రావాలంటే ప్రయాణం భారంగా మారింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల సమయంలో ఇరాన్ బాంబుల దాడులతో కువైట్ ఎయిర్పోర్టు పూర్తిగా దెబ్బతిన్నది. మరమ్మతులు పూర్తి చేయడానికి ఇంకా సమయం ఉండటంతో కువైట్కు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. కువైట్లో ఉపాధి కోసం వీసాలు జారీ అవుతున్నా అక్కడికి వెళ్లాలంటే సామాన్య వలస కార్మికులపై భారీగా ఆర్థిక భారం ఏర్పడుతోంది. కువైట్ నుంచి ఇంటికి రావాలన్నా అదే పరిస్థితి నెలకొనడంతో వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కువైట్కు నేరుగా విమానాలు లేక పోవడంతో సౌది అరేబియా మీదుగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. కువైట్ నుంచి ఇంటికి రావాలన్నా ఇక్కడి నుంచి అక్కడకు వెళ్లాలన్నా సౌది అరేబియాకు సంబంధించిన విజిట్ వీసాను కొనుగోలు చేయాల్సి వస్తోంది. సౌది విజిట్ వీసాకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు ఖర్చు అవుతోంది. గతంలో కువైట్కు వెళ్లాలంటే విమాన చార్జీలు రూ.10 వేల నుంచి రూ.15 వేలు అయ్యేవి. రంజాన్ సమయంలో మాత్రమే రూ.30 వేల చార్జీలు ఉండేవి. ప్రస్తుత పరిస్థితుల్లో సౌది మీదుగా ప్రయాణం చేయాల్సి రాగా, మరోవైపు విమాన చార్జీలను ఆయా ఏవియేషన్ సంస్థలు భారీగా వసూలు చేస్తున్నాయి. ఒక్కో విమాన టిక్కెట్ ధర రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు పెరిగింది. విజిట్ వీసా, విమాన చార్జీలు అధికం కావడంతో వలస కార్మికులపై తీవ్ర ఆర్థిక భారం ఏర్పడుతోంది. సకాలంలో కువైట్కు చేరుకోకపోతే వీసా గడువు ముగిసిపోతుందనే ఆందోళనతో ఆర్థి భారమైనా వలస కార్మికులు ప్రయాణం సాగిస్తున్నారు. మన విదేశాంగ శాఖ చొరవ తీసుకుని కువైట్కు వలస వెళ్లే కార్మికులపై ఏర్పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలని పలువురు కోరుతున్నారు. ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న కువైట్ విమానాశ్రయం నిలిచిపోయిన విమాన సర్వీసులు సౌదీ నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో అదనంగా విజిట్ వీసాకు చార్జీలు వలస కార్మికులకు ఆర్థిక ఇబ్బందులు కువైట్లో ఉపాధి పొందాలనుకునే వలస కార్మికులకు సౌది మీదుగా ప్రయాణం చేయడం భారంగా మారింది. విదేశాంగ శాఖ చొరవ తీసుకుని విమాన చార్జీల విషయంలోను, సౌది విజిట్ వీసా అంశంపై అక్కడి విదేశాంగ శాఖతో చర్చలను నిర్వహించాలి. వలస కార్మికులపై ఆర్థిక భారం తగ్గించేలా చూడాలి. – గుల్లె రాజేశ్వర్, కువైట్లో వ్యాపారి (ఏర్గట్ల) -
క్రైం కార్నర్
చేపలవేటకు వెళ్లి ఒకరి మృతి బాన్సువాడ: చేపల వేట కోసం వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతిచెందాడు. బీర్కూర్ ఎస్సై రాములు తెలిపిన వివరాలు ఇలా..బీర్కూర్ మండలం రైతునగర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ (45) అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం చించొల్లి గ్రామంలో ఉన్న చెరువులో చే పలు పట్టేందుకు వెళ్లాడు.చెరువులో నీళ్లు ఎక్కువగా ఉండడంతో ప్రమాదవశాత్తు గుంతలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు శనివారం ఉదయం శ్రీనివాస్ మృతదేహాన్ని చెరువులో నుంచి బ యటకి తీశారు.పంచనామా చేపట్టి వివరాలు సేకరించారు. మృతుడి భార్య సురేఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. రైలు ఢీకొని వృద్ధురాలు.. మోర్తాడ్(బాల్కొండ): మోర్తాడ్ మండలం దొన్కల్ శివారులోని రైల్వేపట్టాలను ఓ వృద్ధురాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా..సంతోష్నగర్కు చెందిన దండుగుల లక్ష్మమ్మ(80) అనే వృద్ధురాలు శనివారం దొన్కల్ శివారులోని రైల్వేపట్టాలను దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మరణించింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రైల్వే హెడ్కానిస్టేబుల్ హన్మాగౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహంను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. కెనాల్లో నీటమునిగి రైతు.. నిజామాబాద్ రూరల్: మండలంలోని కొత్తపేట్ గ్రామంలోగల కెనాల్లో ఓ రైతు ప్రమాదవశాత్తు నీటమునిగి మృతిచెందాడు. రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని కొత్తపేట్ గ్రామానికి చెందిన నిరడి అబ్బులు(43) అనే రైతు శుక్రవారం సాయంత్రం తన పొలానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో శనివారం కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లారు. పొలం పక్కన ఉన్న కెనాల్లో అతడు విగతజీవిగా కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కెనాల్లోని మోటార్ జాలికి చెత్త పేరుకుపోవడంతో దానిని తొలగించడానికి మృతుడు నీటిలోకి వెళ్లగా, ప్రమాదవశాత్తు కాలుజారి మునిగిపోయినట్లు తెలిపారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు.. బాన్సువాడ రూరల్: మండలంలోని తిర్మలాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. నిజాంసాగర్ మండలం గాలిపూర్కు చెందిన జండ గంగారాం(35) శనివారం రాత్రి టీవీఎస్ ఎక్సెల్పై గాలిపూర్ వైపు బయలుదేరాడు. తిర్మలాపూర్ గ్రామ సమీపంలోని బాన్సువాడ–ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై అతడి ఎక్సెల్ను బాన్సువాడ వైపు అతివేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. దీంతో గంగారాం ఘటన స్థలంలోనే మృతి చెందాడు. రోడ్డు విస్తరణ పనులకు వినియోగిస్తున్న టిప్పర్లు అతివేగం, అజాగ్రత్తతో నడుపుతుండటంతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. -
వా‘ఢీ’.. వేడి
● బహిరంగ చర్చకు బీజేపీ, కాంగ్రెస్ నేతల సవాల్ ● నిర్ణీత స్థలానికి వచ్చిన దినేశ్ కులాచారి ● వాడిలో ఉద్రిక్తత ధర్పల్లి: వరదలు, అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించడంపై అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు, బీజేపీ జిల్లా అధ్యక్షుడి సవాళ్లు ఉద్రిక్తతకు దారితీశాయి. సోషల్ మీడియా వేదికగా శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి గతంలో వరదలు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎంత పరిహారం ఇచ్చారో, ఎంతమంది రైతులను ఆదుకున్నారో బహిరంగ చర్చకు ధర్పల్లి మండలం వాడి గ్రామంలోని పెద్దమ్మ గుడి వద్దకు రావాలంటూ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి సవాల్ విసిరారు. దీంతో కాంగ్రెస్ నాయకులు సైతం దినేశ్ కులాచారి చేసిన సవాలుకు ప్రతిసవాల్ విసురుతూ తాము చర్చకు సిద్ధమంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వాడి గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ భిక్షపతి ఆధ్వర్యంలో శనివారం పోలీసులు భారీ బందోబస్తును నిర్వహించారు. ఉదయం ధర్పల్లికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అయితే, దినేశ్ కులాచారి చెప్పినట్లే శనివారం ఉదయం 11 గంటల సమయానికి వాడి గ్రామంలోని పెద్దమ్మ ఆలయానికి చేరుకున్నారు. పోలీసులు అయన్ని అరెస్టు చేయడానికి ప్రయత్నించగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతరం దినేశ్ను అరెస్టు చేసి మోపాల్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా మీడియాతో దినేశ్ కులాచారి మాట్లాడుతూ.. రైతుల సమస్యలపై నిలదీస్తే తమ నాయకులు, కార్యకర్తలను దౌర్జన్యంగా అరెస్టు చేయడం సిగ్గుచేటు అన్నారు. గతంలో కామారెడ్డిలో వరదలతో నష్టం వాటిల్లితే బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రజలకు పరిహారం ఇప్పించాడని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పుడు ఎమ్మెల్యే భూపతిరెడ్డి నష్టపరిహారం ఎందుకు ఇప్పించడం లేదని ప్రశ్నించారు. పరిహారం ఎవరికీ ఇప్పించారో ప్రజలకు తెలియాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు రూ.50 వేల పరిహారాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
జ్యోతీబాఫూలే సేవలు ఆదర్శం
నిజామాబాద్ రూరల్: మహాత్మా జ్యోతీబాఫూలే బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడని, ఆయన సేవలు సమాజానికి ఆదర్శమని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. దుబ్బలోని మున్నూరుకాపు కల్యాణ మండపంలో శనివారం పూలే జయంతి వేడుక నిర్వహించారు. అంతకుముందు వినాయకనగర్లోని పూలే విగ్రహానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మేయర్ ఉమారాణి, ఇన్చార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, బీసీ సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఆనాటి సమాజంలో నెలకొన్న రుగ్మతలను పారద్రోలేందుకు పూలే కొనసాగించిన కృషి అమోఘమన్నారు. పూలే చూపిన బాటలో పయనిస్తూ, ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని పిలుపునిచ్చారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, బీసీ సంఘాల బాధ్యులు బుస్స ఆంజనేయులు, నరాల సుధాకర్, నరేందర్ గౌడ్, రవీందర్ తదితరులున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.. సుభాష్నగర్: నగరంలోని కాంగ్రెస్ భవన్లో జ్యోతీబాఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కార్యాలయంలో పూలే చిత్రపటానికి, అనంతరం వినాయక్నగర్లోని ఆయన విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఫూలే సత్యశోధక్ సమాజ్ ద్వారా కుల వివక్షకు వ్యతిరేకంగా, సమానత్వం కోసం జీవితాంతం కృషి చేశారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాట్పల్లి నగేష్రెడ్డి, నిజామాబాద్ కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ కొనియాడారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ కుంట రమేష్రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, డీసీసీ నాయకులు భక్తవత్సలం, కౌడపు శరత్, ఓబీసీ అధ్యక్షుడు రాజ నరేందర్ గౌడ్, సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, ఏఐసీసీ కో ఆర్డినేటర్ ఘన్ రాజ్, కార్పొరేటర్లు ప్రవీణ్, మనోహర్, వినయ్, జెండా గుండి చైర్మన్ లవంగం ప్రమోద్కుమార్, కోనేరు సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు. -
సర్వే పేరుతో ఇంట్లోకి చొరబడి చోరీ
● మహిళను కట్టివేసి, బంగారం, వెండిని అపహరించిన దుండగులు బోధన్టౌన్(బోధన్): జనగణన సర్వే పేరు తో గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంట్లోకి చొర బడి, మహిళను కట్టేసి బంగారం, వెండిని అపహరించిన ఘటన పట్టణంలో కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. రాకాసీపేట్లోని గౌడ్స్ కాలనీ లో మౌనిక అనే మహిళ ఇంటికి శనివారం మధ్యాహ్నం ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు జనగణన సర్వే చేస్తున్నామంటూ వచ్చారు. కుటుంబసభ్యుల వివరాలు తెలుపాలంటూ, మంచినీళ్లు కావాలని మహిళను అడిగా రు. ఆమె నీళ్ల కోసం వెళ్లగా, దుండగులు ఇంట్లోకి ప్రవేశించి, చున్నీతో ఆమె కాళ్లు, చేతు లను కట్టేసి, చంపుతామని బెదిరించారు. అనంతరం ఆమె మెడలోని బంగారు ఆభరణాలు, ఇంట్లో ఉన్న వెండి వస్తువులను ఎ త్తుకుపోయారు. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి, పోలీసులకు సమా చారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. ఈ ఘటనలో 4.7తులాల బంగారం, 68 తులాల వెండి చోరీకి గురైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా మని సీఐ వెంకటనారాయణ వెల్లడించారు. ఖరీఫ్కు ముందే నీటి సరఫరా ● మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజామాబాద్ అర్బన్: జిల్లా రైతులకు భారీ ఊతమిచ్చే జాకోరా, చందూర్, చింతకుంట లిఫ్ట్ ఇరిగేషన్ పథకం త్వరలోనే ప్రారంభించి ఖరీఫ్ సీజన్కు ముందే సాగునీరు అందించనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.106.04 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ద్వారా వర్ని, చందూర్, మోస్రా మండలాల్లోని 7,975 ఎకరాలకు సాగునీరు అందనున్నదని, ప్రధానంగా బాన్సువాడ నియోజకవర్గ రైతులకు మేలు చేస్తుందని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ పనులు పూర్తి దశకు చేరుకున్నాయని, ఇప్పటికే ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించామని మంత్రి వెల్లడించారు. ఆధునిక పంప్హౌస్లు, పైప్లైన్లు, కాలువల నెట్వర్క్తో నీటి పంపిణీ వ్యవస్థను సమర్థంగా రూపొందించినట్లు తెలిపారు. కొద్దివారాల్లోనే ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రారంభించి, ప్రాంతీయ రైతులకు అంకితం చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పిల్లలను క్రమశిక్షణతో పెంచాలి ● పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ● జీజీహెచ్లో డీ అడిక్షన్ కేంద్రం ప్రారంభం సుభాష్నగర్: పిల్లలను విద్యార్థి దశ నుంచే మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా తల్లిదండ్రులు క్రమశిక్షణతో పెంచాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని ప్రభు త్వ జనరల్ ఆస్పత్రి రెండో అంతస్తులో డ్ర గ్స్కు బానిసైన వారి చికిత్స కేంద్రాన్ని (డీ అడిక్షన్ ట్రీట్మెంట్ సెంటర్) ఆయన ప్రా రంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా అవగాహన కల్పించాలన్నారు. డ్రగ్స్, ఆల్కాహాల్ను ఏ రూపంలో తీసుకున్నా.. ఎంత మొత్తంలో తీసుకున్నా.. డ్రగ్స్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారం చట్ట వ్యతిరేకం అవుతుందని వివరించారు. అనంతరం ఫార్మసీ, మెడికల్ కళాశాలలో డ్ర గ్స్, వివిధ అంశాలపై నిర్వహించిన వ్యాస రచన, క్విజ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సీపీ సాయిచైతన్య, డీఎంహెచ్వో రాజ శ్రీ ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్ట ర్ శ్రీనివాస్, ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ నాగమోహన్, పీవో ఎన్సీడీ డాక్టర్ వెంకన్న, సైకియాట్రిస్ట్ రవితేజ, రాజేందర్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు శ్రీకాంత్, శ్రీలత, వైద్య కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
ధాన్యం కుప్పను ఢీకొని ఒకరికి గాయాలు
నవీపేట: నవీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ గ్రామ శివారులో శుక్రవారం రాత్రి ధాన్యం కుప్పను ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలైనట్లు ఎస్సై శ్రీకాంత్ శనివారం తెలిపారు. వివరాలు ఇలా.. అనంతగిరి గ్రామానికి చెందిన మహేష్ జిల్లాకేంద్రంలోని మెడికవర్ ఆస్పత్రిలో వాచ్మన్గా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి అతడు పని నిమిత్తం జిల్లాకేంద్రానికి బైక్పై బయలుదేరాడు. మార్గమధ్యలో మల్కాపూర్లోని రోడ్డుపై వరి ధాన్యం కుప్ప అంచుల వెంబడి వేసిన రాళ్లను అతడు ఢీకొనడంతో కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో మహేష్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన వరి కుప్ప యజమాని ఈర్ల ఉస్సేన్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
ధాన్యలక్ష్ములకు మరింత ప్రాధాన్యం
● ఎస్హెచ్జీలకు 259 కొనుగోలు కేంద్రాలు కేటాయింపు ● సహకార సంఘాలతో పోటీగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మోర్తాడ్(బాల్కొండ): వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం మహిళా సంఘాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. మహిళా సంఘాల సభ్యులను ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు వ్యాపారంలో రాణించేలా కృషి చేయాలనే సంకల్పంతో ప్ర భుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. ఇందులో భాగంగానే ఈసారి జిల్లాలో 259 కొనుగోలు కేంద్రాలను మహిళా సమాఖ్యలు, సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఇప్పటికే పలుచోట్ల కొనుగోలు కేంద్రాలను ఆరంభించారు. గత సీజన్లో మహిళా సంఘాలకు సుమారు 250కి పైగా కొనుగో లు కేంద్రాలు కేటాయించారు. కానీ కేటాయింపులు ఆలస్యం కావడంతో పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో 669 కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేయనుండగా ఇందులో మహిళా సంఘాలకే 259 కేటాయించడం విశేషం. 410 కొనుగోలు కేంద్రాలు సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనసాగనున్నాయి. మహిళా సంఘాల సభ్యులు అంటే బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి, ప్రైవేటు బ్యాంకులు ఇలా పలు ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం, సక్రమంగా చెల్లించడమే కాకుండా వ్యాపారంలోనూ రాణిస్తామని వారు గొప్పగా చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణతో మహిళా సంఘాల సభ్యులకు కమీషన్ జమ అవుతుంది. సమర్థవంతంగా నిర్వహిస్తారు మహిళా సంఘాల సభ్యులు వరి ధాన్యం కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహిస్తారు. గతంలో ఉన్న అనుభవంతో ఈసారి కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచాం. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ కొనుగోలు కేంద్రాల నిర్వహణ ఎంతో దోహదపడుతుంది. – సాయన్న, పీడీ, జిల్లా పేదరిక నిర్మూలన సంస్థ -
కందకుర్తికి ముగ్గురు సర్ సంఘ్చాలక్లు
● 1993లో బాలాసాహెబ్ దేవరాజ్ ● 1994లో రాజేంద్రసింహ్ ● తాజాగా మోహన్ భగవత్ కందకుర్తిలోని కేశవ స్ఫూర్తి మందిరంలో బుక్లో రాసి సంతకం చేస్తున్న ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ సంచాలక్ మోహన్రావ్ భగవత్.. సభలో ప్రార్థన చేస్తూ..రెంజల్(బోధన్): శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా వందేళ్లు పూర్తి చేసుకున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు ఇప్పటి వరకు ఆరుగురు సర్ సంఘ్చాలక్లు పనిచేశారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రస్థానంలో ఇప్ప టి వరకు ముగ్గురు సర్ సంఘ్చాలక్లు మండలంలోని కందకుర్తిని సందర్శించారు. వారిలో 1993లో 3వ సర్ సంఘ్చాలక్ బాలాసాహెబ్ దేవరాజ్జీ, 94లో 4వ సర్ సంఘ్చాలక్ రాజేంద్రసింహ్ రజ్జుభయ్యా సందర్శించారు. శనివారం 6వ సర్ సంఘ్ చాలక్ మోహన్రావ్ భగవత్జీ సందర్శించారు. భగవత్జీ పర్యటన చారిత్రాత్మకం: మోహన్ భగవత్జీ పర్యటన చారిత్రాత్మకంగా మారింది. కందకుర్తి చరిత్రను భావితరాలకు అందిచాలనే సంకల్పంతో నిర్మించిన స్ఫూర్తి మందిరాన్ని ఆయన ప్రారంభించారు. స్ఫూర్తి మందిరంలో ఏ ర్పాటు చేసిన ఫోటో, ఆర్ట్ గ్యాలరీని ఆయన పరిశీలించారు. అయోధ్యలోని బాలరాముని విగ్రహా న్ని తయరు చేసిన అరుణ్ యోగిరాజ్తో భరత మాత, డాక్టర్జీ విగ్రహాలను తయారు చేయించా రు. కింది అంతస్తులో డాక్టర్జీ విగ్రహం, పైఅంతస్తులో భరతమాత విగ్రహాలను ఏర్పాటు చేశారు. డాక్టర్జీ జీవిత చరిత్రను తెలుసుకునేలా మినీ థియేటర్ను సందర్శించారు. సందర్శకుల రిజిస్టర్లో స్ఫూర్తి కేంద్రం రాబోయో తరాలకు స్ఫూర్తి కలిగించాలని ఆయన సంతకం చేశారు. భారీ బందోబస్తు: భగవత్జీ పర్యటన సందర్భంగా కందకుర్తిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సీపీ సాయిచైతన్య ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. బాంబ్స్క్వాడ్ పోలీసులు సభా వేదికతో పాటు స్ఫూర్తి మందిరాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సభలో నేరుగా భగవత్జీతోనే మాట్లాడించారు. 22 నిమిషాల పాటు ఆయన ప్రసంగం కొనసాగింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల స్వయం సేవకులు, బీ జేపీ నాయకులు సుమారు 5వేల మంది తరలివచ్చారు. వేదికపైన మోహన్ భగవత్జీతో పాటు తెలంగాణప్రాంత మాననీయ సంఘ చాలకులు సుందర్రెడ్డి, దక్షిణ మధ్య క్షేత్ర మాననీయ సహ సంఘ చాలకులు దూసి రామకృష్ణ, మోహన్రెడ్డి, తెలంగాణ ప్రాంత సేవాభారతి అధ్యక్షులు దుందురపు దుర్గారెడ్డి, వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త సీబీఆర్ ప్రసాద్, ఏవీఎన్ రాజు, కేశవ స్ఫూర్తి మందిరం అధ్యక్షుడు సుధాకర్రెడ్డి పాల్గొన్నారు. -
భానుడి భగభగలు
● భీమ్గల్లో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు ● వారం రోజులపాటు అధిక ఎండలు నిజామాబాద్అర్బన్ / ఆర్మూర్టౌన్: ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో జనం బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా రాబోయే వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అందులో భాగంగా పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా, నిజామాబాద్ జిల్లాలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పిల్లలు, వృద్ధులూ జాగ్రత్త.. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రాబోయే వారం రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు. అయితే, ప్రధానంగా పసిపిల్లలు ఎండకు తొందరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. చిన్నారులు వడదెబ్బకు గురైతే జ్వరం, దద్దుర్లు, వాంతులు, విరోచనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృద్ధులపైనా ఎండ తీవ్రత ప్రమాదకరంగా ఉంటుందని, రైతులు, కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రోజురోజుకూ.. జిల్లాలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాధారణంగా 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉండగా శనివారం జిల్లాలోని భీమ్గల్ మండలంలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాది ఇదే రోజు 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భీంగల్, బాల్కొండ, మాక్లూర్, నందిపేట్, డిచ్పల్లి, జక్రాన్పల్లి, ఆర్మూర్ ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం.వడదెబ్బ తగిలితే ఆస్పత్రికి వెళ్లాలి.. ప్రజలు ఇంట్లో నుంచి వెళ్లే సమయంలో వడదెబ్బ తగలకుండా గొడుగు, తలకు టవాల్ కట్టుకోవాలి. ఉదయం 11 గంటలలోపు సాయంత్రం 5 గంటల తర్వాత పనులు చేసుకోవాలి. జాగ్రత్తలు పాటిస్తే వడదెబ్బ తగలకుండా ఉండొచ్చు. వడదెబ్బ తగిలితే వెంటనే ఏరియా ఆస్పత్రికి వచ్చి వైద్యం చేయించుకోవాలి. – ప్రమీదరెడ్డి, ఆర్మూర్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ ముందస్తు జాగ్రత్త మేలు ఉష్ణోగ్రతలు అధికమవుతు న్న నేపథ్యంలో ప్రజలు తరచూ నీరు తీసుకోవాలి. అధిక ఎండ ఉన్న సమయంలో బయటికి వెళ్లొ ద్దు. వృద్ధులు, పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఉదయం 11 గంటలలోపు, సాయంత్రం 5 గంటల తర్వాత పనులు చేసుకోవాలి. – డాక్టర్ జలగం తిరుపతిరావ్, అసోసియేట్ ప్రొఫెసర్ ప్రభుత్వ వైద్య కళాశాల


