breaking news
Nizamabad District Latest News
-
కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ
సుభాష్నగర్: ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను శుక్రవారం నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల వచ్చిన ప్రభుత్వ టీచర్లకు టెట్ తప్పనిసరి నిర్ణయంపై కేంద్రమంత్రికి లేఖ అందజేశారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో దాదాపు 3వేల మంది ఉపాధ్యాయులపై ఈ టెట్ తప్పనిసరి ప్రభావం చూపుతోందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిశీలించి, చాలా ఏళ్లుగా సేవ చేస్తున్న ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రిని ఆయన కోరారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు శుక్రవా రం ప్రశాంతంగా కొనసాగాయని అకడమిక్ ఆడి ట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన 30 పరీక్ష కేంద్రాలలో 3,883 మంది విద్యార్థులకు గాను 3,633 మంది హాజరు కాగా 250 మంది గైర్హాజరు అయినట్లు ఆయన తెలిపారు. ఉదయం జరిగిన 2వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షకు 706 మందికి గాను 648 మంది హాజరు కాగా 58 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. మధ్యాహ్నం జరిగిన 3వ సెమిస్టర్ రెగ్యులర్, 4వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షకు 3,177 మందికి గాను 2,985 మంది హాజరు కాగా 192 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. నిజామాబాద్, కామా రెడ్డి జిల్లాలలోని పలు పరీక్ష కేంద్రాలను ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్, జాయింట్ డైరెక్టర్ అతిక్ సుల్తాన్ తనిఖీ చేశారు. కమ్మర్పల్లి: మండలంలోని చౌట్పల్లి జెడ్పీహెచ్ఎస్లో శుక్రవారం ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాని కి ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న మండలంలోని నాగాపూర్ వాసి గడ్డం శ్యామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం ఆర్మీలో పని చేయడం గర్వంగా ఉందని తెలియజేశారు. ఆర్మీలోని అనుభవాలను విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి రూ. 4057 విరాళాలను సైనిక్ వెల్ఫేర్ కోసం సేకరించారు. హెచ్ఎం మధుబాబు, ఉపాధ్యాయులు బంతిలాల్, రాజు, రమేష్, గంగాధర్, నరేంధర్, వర్ష, నవ్య, శ్రీలత, రంజిత్, ప్రవళ్లిక, అభిజ్ఞ తదితరులు పాల్గొన్నారు. -
నామినేషన్ తల్లిది.. ప్రచారం కొడుకుది
● కేసు నమోదు చేసిన పోలీసులు రుద్రూర్: అభ్యర్థికి బ దులు ఆమె తనయుడు తన ఫొటోను వాల్ పో స్టర్లపై వేసుకుని ఎన్నిక ల ప్రచారం నిర్వహించగా పోలీసులు కేసు నమోదు చేశారు. వివరా లు ఇలా.. పొతంగల్ మండలం హంగర్గా ఫా రం సర్పంచ్ అభ్యర్థిగా రజియా బేగం నామినేషన్ వేశారు. ఎన్నికల ప్రచారంలో మాత్రం స ర్పంచ్ అభ్యర్థి పేరు, ఫొటో లేకుండా ఆమె కు మారుడు మహ్మద్ ఫెరోజ్ తన ఫొటోతో వాల్ పోస్టర్లు తయారు చేసి గోడలకు అతికించాడు. ఈ విషయాన్ని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల నియమావళి ధిక్కరించినట్లు గుర్తించిన అధికారులు శుక్రవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోతంగల్ డిప్యూ టి తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సునీల్ తెలిపారు. ఎల్లారెడ్డి: సార్వత్రిక ఎన్నికలలో మాత్రమే కనిపించే నోటా (నన్ ఆఫ్ ద ఎబో)ను ఈ సారి జరగనున్న గ్రా మ పంచాయతీ ఎన్నికలలో కూడా ప్రవేశపెట్టారు. నోటా విష యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో పోటీలో ఉన్న అభ్యర్థులు నచ్చకపోతే నోటా ఆప్షన్ను ఎంచుకునే వెసులుబాటు కలిగింది. గతంలో పంచాయతీ ఎన్నికలలో నోటా ఆప్షన్ లేనందు వల్ల ఎవరికో ఒకరికి తప్పనిసరిగా ఓటు వే యాల్సి వచ్చేది. కాని ఈసారి నుంచి స్థానిక ఎ న్నికలలో సైతం బ్యాలెట్ పేపర్లో నోటాను పొందుపర్చారు. అలాగే పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు రెండు వేర్వేరు రంగులలో బ్యాలెట్ పేపర్లు ఉండబోతున్నాయి. సర్పంచ్ స్థానానికి గులాబీ రంగు, వార్డు సభ్యుడి ఎన్నికకు తెలుపు రంగులో బ్యాలెట్ పేపర్లు ఉండబోతున్నాయి. నిజామాబాద్ నాగారం: జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ కోసం కరాటే శిక్షణ ఇవ్వడానికి శిక్షకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి పవన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల కరాటే శిక్షకులు ఈనెల 8న ఉదయం 10 గంటలకు నిజామాబాద్లోని పాత కలెక్టర్ మైదానంలో హాజరు కావాలని తెలిపారు. శిక్షణ నిచ్చే మాస్టర్లు తప్పనిసరిగా బ్లాక్ బెల్ట్ కలిగి ఉండి, సర్టిఫికెట్ తమ వెంట తీసుకురావాలని తెలిపారు. -
అభ్యర్థులకు గుర్తులు ఎలా కేటాయిస్తారంటే ?
బోధన్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను తెలుగు బాషలో రిటర్నింగ్ ఆఫీసర్ తయారు చేస్తారు. ఈ జాబితాలో అభ్యర్థుల పేర్లు తెలుగు అక్షర క్రమంలో ఉండి, నామినేషన్ పత్రంలో పేర్కొన్న విధంగా పేర్ల అమరిక ఉంటుంది. అభ్యర్థి పేరులోని తొలి అక్షరం ఆధారంగా పేర్ల క్రమం నిర్ణయిస్తారు. ఎన్నికల సంఘం ప్రకటించిన ఎన్నికల గుర్తుల జాబితాలోంచి వరుస క్రమంలో అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్కు బ్యాలెట్ పేపర్ను వినియోగిస్తారు. బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తులు నిబంధనల ప్రకారం ఓ క్రమంలో అమర్చుతారు. బ్యాలెట్ పేపర్లో పోటీ చేస్తున్న చివరి అభ్యర్థి గుర్తు క్రింది భాగంలో నోటా ఆప్షన్ సూచించే గుర్తు ఉండేలా బ్యాలెట్ పేపర్ను ముద్రిస్తారు. అభ్యర్థులు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందికి ఒకే పేరు, ఇంటి పేర్లు వేర్వేరుగా ఉన్నట్లయితే, ఇంటి పేర్లను సూచిస్తూ అక్షర క్రమంలో గుర్తులు కేటాయిస్తారు. ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఓకే పేరు, ఒకే ఇంటి పేరు ఉన్నట్లయితే, వారి వృత్తి, నివాసం, చిరునామాల ప్రాతిపదికన జాబితాలో చేర్చాలి. అభ్యర్థి ఏదైనా గౌరవప్రదం, విద్యాపరం, వారసత్వ, వృత్తిపరమైన లేదా ఏదైనా ఇతర బిరుదులను జత చేయడానికి ఎటు వంటి ఆక్షేపణ ఉండదు. అయితే అక్షర క్రమంలో పేర్లు అమర్చు జాబితాలో అట్టిబిరుదును ఎట్టి పరిస్థితిలో పరిగణలోకి తీసుకొనకూడదు. సర్పంచ్ అభ్యర్థుల గుర్తులను ఎన్నికల సంఘం 30 గుర్తులను ప్రకటించింది. ఇందులో ఉంగరం, కత్తెర, బ్యాట్, చెత్తడబ్బా, నల్లబోర్డు ఇలా ఉన్నాయి. వార్డు సభ్యులకు 20 గుర్తులు గౌను, గ్యాస్పొయ్యి, బీరువా, విజిల్ వంటివి ఉన్నాయి. -
సకాలంలో దరఖాస్తులు చేయించాలి
నిజామాబాద్ అర్బన్: ఉపకార వేతనాల కోసం అర్హులైన విద్యార్థులు అందరూ సకాలంలో ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేలా కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. నగరంలోని కలెక్టరేట్లో శుక్రవారం ఆయన సంక్షేమ శాఖల జిల్లా అధికారులతో కలిసి అన్ని మండలాల ఎంఈవోలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రయివేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులతో స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేయించి, అవి ఆమోదం పొందేలా చూడాలన్నారు. ఈ నెలాఖరు చివరి గడువు కాగా, ఆ లోపే అర్హత కలిగిన ప్రతి విద్యార్థి దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందేలా చొరవ చూపాలన్నారు. వారం అనంతరం తాను మళ్లీ సమీక్ష నిర్వహిస్తానని, స్పష్టమైన ప్రగతి కనిపించాలన్నారు. అదనపు కలెక్టర్ అంకిత్, సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు..
● ఇప్పిస్తామంటూ ఓటర్లకు ఎర ● మద్యం, విందులతో ప్రలోభపెడుతున్న వైనం ● ఓట్ల కోసం పాట్లు పడుతున్న అభ్యర్థులుఆర్మూర్: జిల్లాలో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను ఆకర్శించడానికి వారి అవసరాలను ఎరగా వేస్తున్నారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామంటూ హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకాలం తమ అవసరాల కోసం అధికారులు, నాయకుల చుట్టు కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోని వారు ఇప్పుడు ఓట్ల కోసం నోటికి వచ్చిన హామీలు ఇస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. రిజర్వేషన్లు కలిసి వచ్చి రెండో పర్యాయం నామినేషన్లు వేసిన అభ్యర్థులు గ్రామంలో తమ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనే ప్రధానంగా ప్రస్తావిస్తూ ఓటర్లకు గాలెం వేస్తున్నారు. కొత్తగా బరిలో నిలిచిన అభ్యర్థులు గ్రామాల్లో పరిష్కారానికి నోచుకోని ప్రధాన సమస్యలను ఎత్తిచూపుతున్నారు. తనను సర్పంచ్గా గెలిపిస్తే ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామంటు ఓట్లు అడుగుతున్నారు. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు వార్డులలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు. మహిళ అభ్యర్థులు సైతం తామేమీ తక్కువ కాదన్నట్లు సమస్యల పరిష్కారం తమతోనే సాధ్యమంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో సైతం డబ్బు, మద్యం ప్రధాన అంశాలు కానున్నాయి. పోటీలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లకు మద్యం తాగిపిస్తూ పార్టీలు ఇవ్వడం గ్రామాల్లోని గల్లీల్లో నిత్యం కనిపిస్తూనే ఉంది. ప్రచారం చివరి రోజులలో డబ్బులు, మద్యం బాటిళ్లు వెదజల్లి ఓట్లు దండుకోవచ్చని అభ్యర్థులు అందుకు అనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. తమకు అనుకూలంగా ప్రచారం నిర్వహించే యువకులకు నిత్యం విందులు ఏర్పాటు చేస్తున్నారు. -
పెన్సిల్ ఆర్ట్తో జీవనోపాధి
పెన్సిల్తో చిత్రాలు గీస్తున్న ఈ కళాకారుడి పేరు పోచయ్య. జగిత్యాల జిల్లాకు చెందిన ఇతడు తన కళా నైపుణ్యం(పెన్సిల్ ఆర్ట్)తో పేపర్పై పెన్సిల్, స్కెచ్లతో చిత్రాలు గీస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. కొన్ని నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రధాన వీధుల్లో స్టాండ్, లైట్లు ఏర్పాటు చేసుకొని, సెల్ఫోన్లో ఫొటోను చూస్తూ పేపర్పై ఆ చిత్రాన్ని గీస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రధాన కాలనీలో రోడ్డు పక్కన చిత్రాలు గీస్తూండగా ‘సాక్షి’ క్లిక్మనిపించింది. పోచయ్య రోడ్డు పక్కన కింద కూర్చొని, లైట్ల వెలుతురులో ఫోన్లో ఫొటోను చూస్తూ పేపర్పై గీస్తుండగా అటుగా వెళ్లే ప్రజలు సైతం ఆసక్తిగా తిలకించారు. అతడిని సంప్రదించి తమ చిత్రాలను కూడా గీయించుకుంటున్నారు. ‘సాక్షి’ అతడిని పలుకరించగా నిత్యం సుమారు 10 బొమ్మలను గీస్తూ ఉపాధి పొందుతున్నట్లు తెలిపాడు. చిత్రాన్ని బట్టి 15 నుంచి 20 నిమిషాల్లో పెన్సిల్తో చిత్రాన్ని గీస్తానని పేర్కొన్నారు. తనకు వచ్చిన ఈ విద్యతో అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ జీవనోపాధిని పొందుతున్నానని తెలిపారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
ఆలూర్లో ఒకరి దారుణ హత్య
ఆర్మూర్టౌన్: ఆలూర్ మండల కేంద్రంలో ఒకరిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణ హత్య చేసినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. వివరాలు ఇలా.. ఆలూర్కు చెందిన గొల్ల పెద్ద గంగాధర్(46) గురువారం అర్ధరాత్రి ఇంటి ఆరుబయట నిద్రించాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బలమైన ఆయుధాలతో అతడిని కొట్టి చంపారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడి చెల్లి అంజలి తన చిన్న అన్నపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్వో పేర్కొన్నారు. అన్ని కోణాల్లో విచారణ చేపడుతామని ఎస్హెచ్వో తెలిపారు. -
గత ఎన్నికల్లో ప్రత్యర్థులు.. నేడు మిత్రులు..
మోర్తాడ్: రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది మరోసారి నిజమైంది. గత పంచాయతీ ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులను బరిలోకి దింపి ప్రత్యర్థులుగా మారిన ఇద్దరు బీఆర్ఎస్ నాయకులు ఈ ఎన్నికల్లో మిత్రులుగా కలిసిపోయి ఒకరి విజయం కోసం మరొకరు ప్రచారం చేస్తుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పాపాయి పవన్ తల్లి నర్సుపై, భోగ ఆనంద్ భార్య ధరణి మోర్తాడ్ సర్పంచ్గా విజయం సాధించింది. ఇద్దరు నాయకులు ఒకే పార్టీలో కొనసాగినా ప్రత్యర్థులుగానే ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీసీ జనరల్కు కేటాయించడంతో పోటీకి ఆనంద్తో పాటు పవన్ కూడా సిద్ధమయ్యారు. కానీ బీఆర్ఎస్ మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆనంద్ పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఒకే పార్టీ నుంచి ఇద్దరు బరిలోకి దిగితే పార్టీకి మంచిది కాదని ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి సూచించి, ఇద్దరి మధ్య రాజీ కుదిర్చినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో పవన్ బరిలో నుంచి తప్పుకున్నారు. అలాగు ఆనంద్ విజయం కోసం పవన్ ప్రచారం చేయాలని పార్టీ ముఖ్యనేతలు వెల్లడించారు. ఈ కారణంగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేయడం, జనాన్ని సమీకరించడానికి ఆనంద్, పవన్లు కలిసి తిరగడం మోర్తాడ్లో రాజకీయాలలో చర్చకు తావిచ్చింది. ప్రత్యర్థులుగా ఉన్న ఇద్దరు నాయకులు కలిసి పోవడంతో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సి ఉంది. -
అవినీతిని అరికట్టడానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలి
నిజామాబాద్అర్బన్: సమాజంలో అవినీతిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీ సాయిచైతన్య అన్నారు. నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో శుక్రవారం అవినీతి నిరోధకశాఖ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. సీపీ జెండా ఊపీ ర్యాలీని ప్రారంభించి, మాట్లాడారు. అవినీతి వల్ల వచ్చే నష్టాలు, ఇబ్బందులను ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇలాంటి ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అవినీతి నిరోధక శాఖ ద్వారా క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారని, ఈ క్యూఆర్ కోడ్ ద్వారా అవినీతిపై ఫిర్యాదులు, సమాచారం అందించవచ్చన్నారు. అదనపు డీసీపీ బస్వ రెడ్డి, అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ శేఖర్ గౌడ్, ఏసీబీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
బోల్తాపడిన కారు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని బంజర వద్ద శుక్రవారం ఓ కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. వివరాలు ఇలా.. బోధన్కు చెందిన సుబ్బారావు, సుజాత అనే వృద్ధదంపతులు శుక్రవారం వారి బ్రీజా కారులో బోధన్ నుంచి హైదరాబాద్కు బయల్దేరారు. కారు బంజర సమీపంలోకి చేరుకోగానే అదుపుతప్పి రోడ్డుకిందకు దూసుకుపోయి బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వృద్ధ పతులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డుకిందకు దూసుకుపోయి బోల్తాపడడం వల్ల కారు అద్దాలు పగిలిపోవడంతోపాటు పలు చోట్ల ధ్వంసమయింది. బాల్కొండ: మండలంలోని ఇత్వార్పేట్గ్రామంలో తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరిగింది. బాల్కొండ ఎస్సై శైలెంధర్ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన బొండ లక్ష్మీ గురువారం ఇంటికి తాళం వేసి తల్లిగారి ఇంటికి వవెళ్లిందిె. గుర్తు తెలియని దుండగులు గురువారం అర్ధరాత్రి వచ్చి ఇంటి తాళం పగుల గొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో ఉన్న 5 గ్రాముల బంగారు కమ్మలు, రూ. 3వేల నగదు ఎత్తుకెళ్లారు. మరుసటి రోజు ఉదయం బాధితురాలు చోరీని గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామశివారులో శుక్రవారం ఆవు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో మృతిచెందింది. గ్రామంలోని శశాంక్రెడ్డికి చెందిన ఆవుల మంద రోజూలాగే శుక్రవారం మేత కోసం గ్రామశివారుకు వెళ్లింది. మందలోని ఓ ఆవు గ్రామశివారులోని ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురై, అక్కడిక్కడే మృత్యువాతచెందింది. ప్రమాదంలో మృతిచెందిన ఆవు విలువ సుమారు రూ.70వేల వరకు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. బాధితుడికి ట్రాన్స్కో తరపున తగిన నష్టపరిహారం చెల్లించాలని వారు కొరుతున్నారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రానికి చెందిన మాజీ సీఐ సారా సత్యనారాయణ గౌడ్ (72) గురువారం రాత్రి అనారోగ్యంతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. సత్యనారాయణగౌడ్ 7వ బెటాలియన్లో ఎస్సై, సీఐగా పనిచేశారు. అలాగే గౌడసంఘం అభివృద్ధికి కూడా ఎంతో కృషి చేశారని గ్రామస్తులు పేర్కొన్నారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు. శుక్రవారం ఆయన అంత్యక్రియలు తాడ్వాయిలో జరిగాయి. ఆయనకు భార్య దేవేంద్ర, కుమారుడు మరళీమోహన్గౌడ్ ఉన్నారు. -
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించొద్దు
బోధన్: పంచాయతి ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలను పాటించాలని, ఎవరైన ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. ఎవరైనా గందరగోళం సృష్టించడం, బెదిరింపులకు పాల్పడటం వంటివి చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. బోధన్ రెవెన్యూడివిజన్లో ఈ నెల 11న పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం సాలూరలో పోలీస్ శాఖ అధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈసందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. శాంతిభద్రల రక్షణ, ఎన్నికల ప్రక్రియలో అవాంఛనీయ ఘటనలు నిరోధించడమే లక్ష్యంగా ముందస్తుగా ప్రజలను అవగాహన కల్పించడానికి ప్లాగ్ మార్చ్ నిర్వహించామన్నారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా తాము కృషి చేస్తున్నామన్నారు. రూరల్ సీఐ విజయ్బాబు, టౌన్ ఎస్హెచ్వో వెంకటనారాయణ, బోధన్ రూరల్, ఎడపల్లి, రెంజల్, ఎస్సైలు మచ్చేందర్రెడ్డి, ముత్యాల రమ, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ఏకగ్రీవం పంచాయతీల్లో విచారణ
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ఏకగ్రీవ పంచాయతీల్లో శుక్రవారం ఎంపీడీవో నరేశ్ విచారణ చేశారు. మండలంలోని 11 గ్రామ పంచాయతీల్లో ఒక్కొక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవమయ్యాయి. బాణాపూర్, బాణాపూర్తండా, మెంగారంతో పాటు పలు గ్రామా ల్లో విచారణ చేసినట్లు తెలిపారు. సర్పంచులు, వార్డు సభ్యులు ఏకగ్రీవం కావడానికి ఏమైనా ప్రలోభాలకు గురిచేసినా, వేలం పాటలు చేసినా, చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. తహసీల్దార్ సురేష్, తదితరులు పాల్గొన్నారు. ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని జీజీ కళాశాలలో డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షల్లో ఐదుగురు విద్యార్థులు డిబార్ అయినట్లు ఇన్చార్జి ప్రిన్సిపాల్ నాగరత్నం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షల్లో 1,470 మంది విద్యార్థులకు 74 మంది గైర్హాజరయ్యారు. 1,396 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, ఐదుగురు విద్యార్థులు డిబార్ అయ్యారని చెప్పారు. ఇందులో పరీక్షల నియంత్రణ అధికారి భరత్ రాజ్, అకాడమిక్ కోఆర్డినేటర్ నహీద బేగం ఉన్నారు. -
జీపీ ఎన్నికల్లో ఆర్వోలదే కీలక పాత్ర
● పోలింగ్, కౌంటింగ్ సజావుగా నిర్వహించాలి ● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బోధన్: గ్రామ పంచాయతీ ఎన్నికల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, అన్నివిధాలా సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. తొలి విడత బోధన్ డివిజన్లో ఈ నెల 11న పోలింగ్, కౌంటింగ్, ఫలితాల వెల్లడి జరుగనున్న నేపథ్యంలో శుక్రవారం బోధన్ పట్టణంలోని లయన్స్ కంటి ఆస్పత్రి ఆడిటోరియం హాల్లో నిర్వహించిన ఆర్వో, ఏఆర్వోల శిక్షణా తరగతులకు కలెక్టర్ హాజరై దిశానిర్దేశం చేశారు. జీపీ ఎన్నికల్లో కీలక పాత్ర వహించే ఆర్వో, ఏఆర్వోలు పోలింగ్ నిర్వహణకు ముందస్తుగానే ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. వివాదాలు, తప్పిదాలకు చోటు ఇవ్వకుండా నిబంధనల మేరకు విధులు నిర్వర్తించాలన్నారు. సమయ పాలన కచ్చితంగా పాటించి అప్రమత్తతతో ఎన్నికలు నిర్వహిస్తే ఇబ్బందులకు ఆస్కారం ఉండదన్నారు. ఎన్నికల సామగ్రి సరి చూసుకోవాలని, బ్యాలెట్ పేపర్ల విషయంలో ప్రత్యేక జాగరూకతతో వ్యవహరించాలన్నారు. ఉపసర్పంచ్ ఎన్నిక సందర్భంగా తగిన వార్డు సభ్యుల కోరం ఉందా లేదా అని పరిశీలించాలన్నారు. ఎన్నికల విధుల నిర్వహణలో ఎలాంటి సందేహాలున్నా అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. బ్యాలెట్ పత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని, పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తులతోపాటు నోటా గుర్తును తప్పనిసరిగా సరి చూసుకోవాలన్నారు. అడిషనల్ కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ వికాస్ మహతో, డీఈవో అశోక్, డివిజన్, మండలాల అధికారులు పాల్గొన్నారు. -
బుజ్జగింపుల పర్వం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా కాంగ్రెస్, న గర కాంగ్రెస్ పీఠాల కోసం రేసులో చివరి వరకు కొనసాగి భంగపడిన నాయకులను బుజ్జగించే పర్వం నడుస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ నేరుగా రంగంలోకి దిగారు. సదరు నాయకులను హైదరాబాద్కు పిలిపించుకుని ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడే ప్రక్రియను ప్రారంభించారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సదరు నా యకులను అత్యవసరంగా పిలిపించుకుని వన్ టు వన్ మాట్లాడుతుండడం పట్ల ప్రాధాన్యం సంతరించుకుంది. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠం కోసం చివరి వరకు పోటీపడిన బాడ్సి శేఖర్గౌడ్, మార చంద్రమోహన్రెడ్డిలను శుక్రవారం హైదరాబాద్ పిలిపించుకుని ఒక్కొక్కరితో ప్రత్యేకంగా మాట్లాడారు. మీనాక్షితో పా టు జిల్లా వ్యవహారాలు చూస్తున్న ఏఐసీసీ ఇన్చార్జి సచిన్ సావంత్ సైతం ఉన్నారు. పార్టీలో సుమారు 40 ఏళ్లుగా పని చేస్తూ వివిధ పదవు లు, పార్టీ పదవులు నిర్వహించిన వీరిద్దరి విష యమై తగినవిధంగా ప్రాధాన్యత ఇస్తామని మీ నాక్షి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవుల రేసులో ఉన్న వీరిద్దరూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్కు సైతం అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శేఖర్గౌడ్, చంద్రమోహన్రెడ్డికి ఏ పదవులు కేటాయిస్తారోననే చర్చ మొదలైంది. ‘నామినేటెడ్ ఆశలు నెరవేరేదెన్నడో..’ అనే శీర్షికతో గురువారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. గత జూన్ నెలలోనే మీనాక్షి నగరాజన్ పార్టీ కోసం కష్టపడిన సీనియర్ నాయకులు, కార్యకర్తల గురించి ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై వివరాలు సేకరించారు. ఈ అంశాలను ప్రస్తావిస్తూ తాజాగా ‘సాక్షి’ కథనంలో విశదీకరించడంతో ఈ కదలిక మొదలైందని, ఇందులో భాగంగానే ఈ ప్రక్రియ ప్రారంభించినట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరిగింది. సీసీసీ రేసులో ఉన్నవారిని సైతం.. నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్ష పీఠం కోసం తుదివరకు రేసులో కొనసాగిన నాయకులను సైతం మీనాక్షి పిలిపించుకుని మాట్లాడారు. ఒక్కొక్కరితో ప్రత్యేకంగా మాట్లాడి జిల్లా పార్టీ ఇన్చార్జి సచిన్ సావంత్ ద్వారా వివరాలు నోట్ చేయించుకున్నారు. మీనాక్షి పిలిపించి మాట్లాడిన వారిలో పార్టీ నగర పీఠం ఆశించిన నరాల రత్నాకర్, జావెద్ అక్రం, రామర్తి గోపి, గన్రాజ్, కౌడపు శరత్ ఉన్నారు. పార్టీ కోసం పాటుపడిన వీరికి తగిన న్యాయం చేస్తానని మీనాక్షి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. భవిష్యత్తు విషయమై ఆందోళన చెందవద్దని తాను చూసుకుంటానని ఆమె చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా ఆదివారం మరికొందరిని పిలిపించుకుని విడివిడిగా మాట్లాడేందుకు మీనాక్షి నుంచి జిల్లాకు చెందిన బాస వేణుగోపాల్ యాదవ్ తదితరులకు ఫోన్లు వచ్చాయి. ఈ బుజ్జగింపుల పర్వం మరో రెండురోజుల పాటు ఉండనున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా నుంచి పలువురు నాయకులను విడతలవారీగా పిలిపించుకుని బుజ్జగింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఉమ్మడి జిల్లా తరువాత వరుసగా అన్ని జిల్లాల నుంచి ముఖ్య నాయకులను పిలిపించుకుని ఒక్కొక్కరితో విడిగా మాట్లాడే ప్రక్రియ ఉంటుందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. డీసీసీ, సీసీసీ పీఠాలు ఆశించినవారితో మీనాక్షి నటరాజన్ సమావేశం ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి భవిష్యత్తులో తగిన అవకాశాలు కల్పిస్తామని హామీ -
ఆటలాడించే వారేరి..?
● కాలేజీల్లో పీడీలు, స్కూళ్లలో పీఈటీలు కరువు ● ఫైనాన్స్శాఖ వద్ద జిల్లాలో 107 పీఈటీ పోస్టుల భర్తీ ప్రతిపాదనలు ఖలీల్వాడి: ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో ఆటలాడించే పీఈటీ, పీడీలు కరువయ్యారు. జిల్లా వ్యా ప్తంగా ఆటలకు సంబంధించిన పరికరాలు నిరుపయోగంగా మారాయి. జిల్లాలోని 16 ప్రభుత్వ కాలేజీల్లో ఒక్క ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) కూడా లేడు. జిల్లాలో 132 ప్రాథమికోన్నత, 255 జెడ్పీ పాఠశాలల్లో 143 మంది పీఈటీలు పనిచేస్తున్నారు. డీఎస్సీలో 2001లో 92, 2009లో 100 పీఈటీ పోస్టులను భర్తీ చేయగా, తర్వాత వచ్చిన డీఎస్సీలో రెండు నుంచి ఐదు పోస్టుల వరకు మాత్రమే భర్తీ చేశారు. ప్రస్తుతం జిల్లాలో 107 పోస్టుల కోసం విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది. అయితే, ఆ ఫైల్ ఇప్పుడు రాష్ట్ర ఫైనాన్స్ శాఖ వద్ద పెండింగ్లో ఉంది. ఆర్థిక శాఖ అనుమతి ఇస్తే పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది. క్రీడా కోటాకు దూరం కాలేజీ విద్యార్థులకు విద్యాశాఖ ప్రత్యేకంగా అండర్–19 క్రీడా పోటీలను నిర్వహిస్తుంది. పోటీల్లో ప్రతిభ చూపే క్రీడాకారులకు ధ్రువపత్రాలు అందజేస్తారు. అయితే మైదానాలు, పీడీలు, లేక ఆటలు ఆడలేక క్రీడాకారులు రిజర్వేషన్లకు దూరమవుతున్నారు. ఖేలో ఇండియాకు శ్రీకారం... క్రీడాకారులను తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ఖేలో ఇండియాకు శ్రీకారం చుట్టింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఇందులో శిక్షణ ఇస్తారు. కాగా, ఆటలో రాణించాలంటే పీఈటీలు, పీడీలు తప్పనిసరి. ప్రాథమికోన్నత స్థాయి నుంచి క్రీడలపై అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో క్రీడాకారులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం హైస్కూల్ స్థాయి నుంచి కాకుండా ప్రాథమికోన్నత పాఠశాలకు పీఈటీలు నియమిస్తే ఖేలో ఇండియాకు ప్రతిభ గల క్రీడాకారులు లభిస్తారు. నిధులు వృథా.. ప్రభుత్వ కాలేజీల్లో సుమారు 10 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. వి ద్యా సంవత్సరం ప్రారంభంలో కళాశాలలకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.1.60 లక్షలు క్రీడల కోసం మంజూరయ్యాయి. వా టితో పరికరాలను కొనుగోలు చేశారు. అయి తే, పీడీలు లేకపోవడంతో ఆటలకు దూరమవుతున్నారు. అలాగే ప్రాఽథమికోన్నత పాఠశాలలకు రూ.10 వేలు, హైస్కూళ్లకు రూ.25 వేలు, పీఎంశ్రీ కింద ఎంపికై న 40 పాఠశాలలకు రూ.50 వేలు కేటాయించింది. కాగా, పీఈటీలు లేనిచోట టీచర్లే ఆటలు ఆడిస్తూ టోర్నీలకు తీసుకెళ్తుండటం గమనార్హం. జిల్లాలో పీడీలు లేరు జిల్లాలో పీడీలు లేరు. దీంతో విద్యార్థులు ఆటలకు దూరంగా ఉన్నారు. పీడీలు లేకపోవడంతోనే అండర్–19 నిర్వహించలేక పోయాం. క్రీడల నిర్వహణకు రాష్ట్ర ఎస్జీఎఫ్కు లేఖ రాశాం. అనుమతి రాగానే అండర్–19ను ఎస్జీఎఫ్ సహకారంతో నిర్వహిస్తాం. – రవికుమార్, డీఈఐవో, నిజామాబాద్ప్రాథమిక స్థాయి నుంచి క్రీడలు నేర్పాలి క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఖేలో ఇండి యా తీసుకువస్తుంది. క్రీడాకారులు రాణించాలంటే ప్రా థమిక స్థాయి నుంచి వివిధ క్రీడలపై తర్ఫీదునివ్వాలి. అందుకు అనుగుణంగా పీఈటీ పోస్టులను ప్రాథమిక స్థాయిలో కూడా నియమించాలి. – విద్యాసాగర్రెడ్డి, పెటా, జిల్లా అధ్యక్షులు, నిజామాబాద్ -
‘స్వచ్ఛ ఏవం హరిత’కు 8 పాఠశాలలు
హెడ్మాస్టర్లకు ప్రశంసా పత్రాలు ఇస్తున్న కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డిఖలీల్వాడి: స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన పాఠశాలలను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అభినందించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను శుక్రవారం అందజేశారు. పథకంలో పొందుపరిచిన 16 అంశాలలో ఉన్నత ప్రమాణాలు పాటించి, పాఠశాలలో ఆహ్లాదకర పరిసరాలు, శుభ్రత, మౌలిక వసతులను కల్పించిన ఎనిమిది మంది హెడ్మాస్టర్లను సన్మానించారు. ఈ పాఠశాలలు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు డీఈవో అశోక్ తెలిపారు. కార్యక్రమంలో సీఎంవో శ్రీనివాస్రావు, ప్లానింగ్ కోఆర్డినేటర్ శ్రీధర్రెడ్డి, ఏఎంవో బాలకృష్ణరావు, జిల్లా సైన్స్ అధికారి గంగాకిషన్, ఏఎస్వో జీవన్ పాల్గొన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న పాఠశాలల వివరాలు -
ముగిసిన నామినేషన్లు
సుభాష్నగర్: గ్రామ పంచాయతీ ఎన్నికల తుది విడత నామినేషన్ల స్వీకరణ పర్వం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. చివరిరోజు సర్పంచ్, వార్డు స్థానాల కోసం అభ్యర్థులు తరలిరావడంతో రాత్రి వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. సాయంత్రం 5 గంటల్లోపు కేంద్రంలోకి వచ్చిన వారికి టోకెన్లు అందించి దరఖాస్తులు స్వీకరించారు. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్లోని 165 జీపీలు, 1,620 వార్డుస్థానాలకు నామినేషన్లు స్వీకరించారు. మొత్తం 3,26,029 మంది ఓటర్లు ఉండగా, అందులో 1,50,120 పురుషులు, 1,75,903 మహిళలు, ఆరుగురు ఇతర ఓటర్లు ఉన్నారు. తరలివచ్చిన అభ్యర్థులు.. చివరి రోజు నామపత్రాల దాఖలుకు అభ్యర్థులు తరలివచ్చారు. ప్రధానంగా సర్పంచ్, వార్డుసభ్యుల స్థానాల ఏకగ్రీవాల కోసం గ్రామాభివృద్ధి కమిటీలు, ఆయా పార్టీల నాయకులు చర్చ లు జరిపినా సఫలీకృతం కాకపోవడంతో నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు పోటాపోటీగా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. గురువారం వరకు సర్పంచ్ స్థానాలకు 469 నామినేషన్లు, వార్డుస్థానాలకు 1,655 నామినేషన్లు దాఖలయ్యాయి. 57 కేంద్రాల ద్వారా నామినేషన్లు స్వీకరించారు. చివరి రోజు సర్పంచ్ స్థానానికి 606, వార్డులకు 2,367 నామినేషన్లు వచ్చాయి. మొత్తం సర్పంచ్ స్థానాలకు 1077, వార్డుస్థానాలకు 4,021 నామపత్రాలు దాఖలయ్యాయి. నేడు నామినేషన్ల పరిశీలన..మండలాలవారీగా దాఖలైన నామినేషన్లు..గ్రామపంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్లు శుక్రవారంతో ముగియగా, శనివారం నామపత్రాల స్క్రూటినీ ఉంటుంది. డిసెంబర్ 9న మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదేరోజు బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా, గుర్తులను కేటాయిస్తారు. డిసెంబర్ 17న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారు. రాత్రి వరకు కొనసాగిన మూడో విడత నామపత్రాల స్వీకరణ సాయంత్రం 5 గంటల తర్వాత గేట్లు మూసివేత అభ్యర్థులకు టోకెన్లు ఇచ్చి దరఖాస్తులు తీసుకున్న అధికారులు సర్పంచ్ స్థానాలకు 1077, వార్డు స్థానాలకు 4,021 నామినేషన్లు -
టీబీ ముక్త్ భారత్కు పాటుపడాలి
నిజామాబాద్ నాగారం: ఉద్యోగులు అంకిత భావంతో పని చేసి టీబీ ముక్త్ భారత్ కోసం పాటుపడాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజశ్రీ పేర్కొన్నారు. డీఎంహెచ్వో కార్యాలయంలో శుక్రవారం క్షయ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ ఉద్యోగులందరూ సమయపాలన పాటిస్తూ, టీబీ రోగులందరికీ ఉచిత మందులు, నాణ్యమైన సేవలు అందించాలన్నారు. అనుమానితుల నుంచి తెమడ సేకరించి పరీక్ష కేంద్రానికి పంపాలని సూచించారు. గ్రామస్థాయిలో శిబిరాలను ఏర్పాటు చేసుకొని మొబైల్ ఎక్సరే ద్వారా వ్యాధికి గురైన వారిని గుర్తించి చికిత్స అందించాలన్నారు. సమావేశంలో డీటీడీవో దేవీనాగేశ్వరి, డాక్టర్ అవంతి, లక్ష్మణ్, నరేశ్, రవిగౌడ్, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి విలువిద్య పోటీలకు ఎంపిక నిజామాబాద్ నాగారం: రాష్ట్రస్థాయి సీనియర్ గర్ల్స్ విలువిద్య పోటీలకు ఉమ్మడి జిల్లాల క్రీడాకారులు ఎంపికై నట్లు జిల్లా విలువిద్య కార్యదర్శి గంగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. నాగారంలోని రాజారం స్టేడియంలో ఖేలో ఇండియా ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్, నిజామాబాద్ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఎంపిక పోటీల్లో పలువురు క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారు ఈనెల 7న జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు. కోచ్లు మద్దుల మురళి, నెనావత్ రవీందర్, ప్రతాప్, దాసులు పాల్గొన్నారు. సాయుధ దళాలకు మద్దతివ్వాలి ● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● సాయుధ దళాల పతాక దినోత్సవ ర్యాలీ ప్రారంభంనిజామాబాద్ అర్బన్: సైనికుల త్యాగాలను ప్రతి పౌరుడు గుర్తిస్తూ, వారి సేవల పట్ల గౌరవభావంతో మెలగాలని, సాయుధ దళా లకు మద్దతుగా నిలవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సాయుధ దళాల పతాక దినోత్సవం పురస్కరించుకొని ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని శుక్రవారం కలెక్టరేట్ వద్ద కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. మాజీ సైనికులు, సైనికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం ఉద్దేశించిన సహాయనిధికి విరాళం అందజేశారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్తోపాటు కలెక్టరేట్లోని వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు సైని క సంక్షేమ నిధికి తమవంతుగా విరాళాలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ దేశ రక్షణ కోసం సాయుధ దళాలకు చెందిన సైనికులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా కుటుంబసభ్యులకు దూ రంగా ఉంటూ, రేయింబవళ్లు శ్రమిస్తున్నా రని అన్నారు. కార్యక్రమంలో ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ అధికారి రవీందర్, మా జీ సైనికుల సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
భారీ ట్రక్కుపై అతిపెద్ద శివలింగం
● తమిళనాడు నుంచి బిహార్కు తరలింపు ● నిత్యం 80 కి.మీ ప్రయాణం డిచ్పల్లి: డిచ్పల్లి పరిధిలోని 44 నంబర్ జాతీ య రహదారిపైన గురువారం భారీ ట్రక్కు (106 టైర్లు)పై అతిపెద్ద శివలింగం తరలిస్తుండగా పలువురు దర్శించుకొని, పూజలు చేశారు. సదరు శివలింగంను బీహార్ రాష్ట్రం ఉత్తర చంపారన్ జిల్లాలో మహవీర్ మందిర్ ట్రస్ట్ (పాట్నా) ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న విరాట్ రామాయణ్ మందిర్లో ప్రతిష్ఠించేందుకు తమిళనాడు నుంచి తరలిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రం మహాబలిపురం సమీపంలోని వట్టినాడు గ్రామ పరిధిలో ఈ శివలింగంను తయారు చేసినట్లు ట్రస్టు ప్రతినిధులు తెలిపారు. ఈ శివలింగం ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం అని తెలిపారు. 2015లో ఆర్డర్ ఇవ్వగా 2022 వరకు ఏకశిలగా ఉన్న కొండరాయిని తవ్వి బయటకు తీసినట్లు తెలిపారు. 2022 నుంచి 2025 నవంబర్ 19 వరకు శివలింగాన్ని తయారు చేశారని తెలిపారు. ఈ భారీ శివలింగంపై చుట్టూ 1008 లింగాలు చెక్కబడి ఉన్నాయి. రోజుకు సుమారు 80 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నట్లు ట్రస్టు ప్రతినిధులు తెలిపారు. డిచ్పల్లి సమీపంలో ట్రక్కు ఆగడంతో ఈ శివలింగంను దర్శించుకున్న స్థానికులు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. -
వేలానికి ముకుతాడు
మోర్తాడ్: పంచాయతీ పదవుల వేలం వెర్రికి అధికార యంత్రాంగం ముకుతాడు వేస్తోంది. మూడో విడత ఎన్నికల్లో భాగంగా బాల్కొండ నియోజకవర్గంలోని పలు పంచాయతీల పరిధిలో వేలం పాట ద్వారా సర్పంచ్, వార్డు సభ్యులను ఎంపిక చేసినట్లు గుర్తించిన అధికారులు ఆయా గ్రామాల ప్రజలతో సమావేశమయ్యారు. తాజాగా భీమ్గల్ మండలంలోని సుదర్శన్ తండా, సంతోష్నగర్ తండాలలో వేలం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు సమాచారం అందుకున్న ఎంపీడీవో సంతోష్కుమార్, ఎ స్సై సందీప్ గ్రామస్తులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్లోనూ ఏకగ్రీవంగా ఎంపిక చేయడానికి రహస్యంగా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆ సమావేశాన్ని అర్ధంతరంగా నిలిపివేశారు. సర్పంచ్ పదవికి తాము సూచించిన వ్యక్తి మాత్రమే నామినేషన్ వేయాలని సర్వసమాజ్ కమిటీ ప్రతినిధులు హుకుం జారీ చేసినట్లు తెలుసుకున్న పోలీసులు ఇది సరైన విధానం కాదని సూచించారు. చివరికి ఎవరైనా పోటీ చేయవచ్చని కమిటీ ప్రకటించడంతో ఏకగ్రీవానికి తెరపడింది. వేల్పూర్ మండలంలోని ఒక గ్రామంలో మాత్రం గురువారం సర్పంచ్ పదవికి వేలం నిర్వహించగా రూ.24 లక్షలకు ఒక అభ్యర్థి పదవిని దక్కించుకున్నాడు. ఏర్గట్ల మండలంలోని రెండు గ్రామాలలో ఇదే విధంగా వేలం నిర్వహించి సర్పంచ్ అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ గ్రామాలలో వేలం ద్వారా రూ.20 లక్షలకు మించి ఆదాయం వీడీసీలకు లభించనుంది. అధికారులకు ఇంకా సమాచారం అందకపోవడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. కాగా, వేలం పాటల విషయం బహిరంగం అయిన చోటే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు కావడంతో వేలం పాటల అంశంపై అధికారులు ఎలా స్పందిస్తారోననే చర్చ జరుగుతోంది. సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవం చేసే గ్రామాల్లో కౌన్సెలింగ్ వేలం నిర్వహించకుండా అధికారుల పకడ్బందీ చర్యలు నామినేషన్లు అంగీకరించబోమని స్పష్టీకరణ -
నేలల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
● పంటల సాగులో నేల పాత్ర కీలకం ● నేడు ప్రపంచ మృత్తిక దినోత్సవం రుద్రూర్: నేలల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పంటల సాగులో నేల పాత్ర కీలకమని రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం అధిపతి డా.కె. పవన్ చంద్రరెడ్డి అన్నారు. నేడు (డిసెంబర్ 5) ప్రపంచ మృత్తిక దినోత్సవం సందర్భంగా నేల ప్రాముఖ్యత, సంరక్షరణ గూర్చి ఒక ప్రకటనలో ఆయన వివరించారు. మనుషులకు, పశుపక్ష్యాదుల జీవనానికి అవ సరమైన ఆహారాన్ని నేల అందిస్తుంది. వివిధ కారణాల వల్ల నేలలు నిస్సారమవుతున్నాయి. నేలల ను సంరక్షించాల్సిన ఆవశ్యకతను గుర్తించి ప్రతి ఏ డాది డిసెంబర్ 5న ప్రపంచ మృత్తిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈసారి ఎఫ్ఏవో ఆరోగ్యకరమైన ‘నేలలు–ఆరోగ్యకరమైన నగరాలు’ అనే అంశాన్ని ప్రకటించిందని ఆయన తెలిపారు. ఈ అంశం ద్వారా పట్టణాల్లో జరిగే నగరీకరణ, భవనాల నిర్మాణం, రోడ్లు వల్ల నేల గట్టిపడటం, నేల రంధ్రాలు మూసుకుపోవడం వంటి సమస్యలతో నేల ఆరోగ్యం ఎంత ముఖ్యమో తెలియజేస్తుందన్నారు. వ్యవసాయంలో.. నేల పైర్ల ఎదుగుదలకి అవసరమైన నీరు, గాలి, పో షకాలను, అందజేస్తుంది. నేలలో ఉండే సూక్ష్మజీవులు పంటలకు అవసరమైన పోషకాలను విడుద ల చేస్తాయి. వర్షపు నీటిని నిల్వచేసి పంటలకు అందిస్తుంది.నేలలో జీవపదార్థం ఎక్కువగా ఉంటే కా ర్బన్ నిల్వఅవుతుంది. పైర్లపై ఆశించే చీడపీడలను తెగుళ్లను తగ్గిస్తుంది. ఆరోగ్యమైన నేల వల్ల పైర్ల దిగుబడి, నాణ్యత పెరుగుతుంది. వర్షపు నీటిని శోషించి భూగర్భ జలాలను పెంపొందిస్తాయి. నేల క్షీణతకు ప్రధాన కారణాలు: నేల క్షయం (నీరు, గాలితో మట్టి తొలగిపోవడం), అడవుల నరికివేత, ఎక్కువగా పశువుల మేపడం. సేంద్రియ ఎరువుల వాడకం తగ్గడం. రసాయనాలను అధికంగా వినియోగించడం. యంత్రాల వల్ల నేల గట్టిపడటం, లవణీకరణ (ఉప్పు పెరగడం), నీటిముంపు. జీవవైవిధ్యం తగ్గడం. వివిధ రకాల సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులను విరివిగా వాడాలి. పంట అవశేషాలను కాల్చకుండా నేలలో కలియదున్నాలి. వైవిధ్యమైన పంటల సాగు, పంట మార్పిడి చేయాలి. నేలను కప్పివుంచే పంటలు వేయడం, సమర్థవంతమైన, సమతుల్య (భూసార పరీక్షా ఫలితాల ఆధారిత)ఎరువుల వినియోగం అవసరం. డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ నీటి పొదుపు పద్ధతులు అవలంబించడం వల్ల నేల ఆరోగాన్ని మెరుగు పర్చవచ్చు. -
పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్
నిజామాబాద్ అర్బన్: గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, జనరల్ అబ్జర్వర్ శ్యాంప్రసాద్లాల్ సమక్షంలో గురువారం నిర్వహించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ జరిపించారు. ఈ ప్రక్రియను కలెక్టర్, అబ్జర్వర్ నిశితంగా పరిశీలించారు. ఒక్కో మండలం వారీగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీవోలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ర్యాండమైజేషన్ ద్వారా స్థానికేతర సిబ్బందిని పోలింగ్ విధుల కోసం ఎంపిక చేశారు. డీపీవో శ్రీనివాస్ రావు, జెడ్పీ డిప్యూటీ సీఈవో సాయన్న, నోడల్ అధికారి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోవడం అంటే..
ఎల్లారెడ్డి: ఎన్నికలలో పలువురు అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారన్న వార్తలు మనం చూస్తుంటాం. అసలు డిపాజిట్ దక్కడం అంటే.. ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థి నామినేషన్ వేసేటప్పుడు కొంత డబ్బును డిపాజిట్గా జమచేస్తారు. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థికి ఎన్నికలలో పోలైన ఓట్లలో 16 శాతం లేదా అంతకు మించి ఓట్లు సాధించాలి. దీన్నే అభ్యర్థికి డిపాజిట్ దక్కడం అంటాం. ఒకవేళ అంతకన్నా తక్కువ ఓట్లు సాధిస్తే సదరు అభ్యర్థి డిపాజిట్ కోల్పోయినట్లు పేర్కొంటారు. డిపాజిట్ దక్కిన అభ్యర్థికి వారు నామినేషన్ సమయంలో జమచేసిన డిపాజిట్ డబ్బులను తిరిగి ఇస్తారు. డిపాజిట్ కోల్పోయిన అభ్యర్థుల డబ్బులు ఎన్నికల కమిషన్ ఖాతాల్లోకి వెళతాయి. -
పంచాయతీ ఎన్నికల్లో నిశబ్ద ప్రచారం
రెంజల్(బోధన్)/మాక్లూర్: పంచాయతీ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు తిరగకుండా, మైక్లతో హోరెత్తించకుండా నిశబ్ధంగా ప్రచారం చేస్తున్నారు. అదెలా అంటే.. ప్రస్తుతం ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్లు ఉండటంతో ఆ ఫోన్లకే సోషల్ మీడియా ద్వారా అభ్యర్థులు నేరుగా తమను గెలిపించాలంటూ ప్రచారం చేసే చిత్రాలు, వీడియోలు పంపిస్తూ రూపాయి ఖర్చు లేకుండా నిశబ్దంగా ప్రచారం చేస్తున్నారు. గతంలో గోడలపై రాతలు, వాల్ పోస్టర్లులు, కరపత్రాలు ముద్రించి ఇంటింటికీ తిరుగుతు అందించే వారు. ఎన్నికల నిబంధనలతో నయా ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల ద్వార ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మద్దతుదారులు, కుటుంబీకులతో కలిసి చురుగ్గా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతీ ఒక్కరి వాట్సాప్ స్టేటస్లో అభ్యర్థుల ప్రచారాలే సాక్షాత్కరిస్తున్నాయి. సోషల్ మీడియా వారియర్స్ను ఏర్పాటు చేసుకుని తంతును సాగిస్తున్నారు. తమను గెలిపిస్తే నాయకుడిగా కాదని..సేవకునిగా పని చేస్తామని నమ్మిస్తున్నారు. గ్రామాల్లోని సమస్యలను ఎత్తి చూపుతూ వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని ప్రచారం చేస్తున్నారు. మరికొందరూ ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి తమ సొంత మేనిఫెస్టోలను రుద్దుతున్నారు. సోషల్ మీడియాలో పెద్దగా ఖర్చు లేకపోవడంతో ప్రధాన ప్రచారాస్త్రాలుగా వినియోగించుకుంటున్నారు. వాట్సాప్లో గ్రూపులు.. కొందరు యువకులు వాట్సాప్లో గ్రామానికి వర్తించే పేర్లను క్రియోట్ చేసుకొని ఆదర్శగ్రామం, ఆదర్శ రైతు, ఐకాన్, లేజెండ్ వంటి గ్రూపులను ఏర్పాటు చేసుకొని తెల్లవారిందే తడువుగా పోస్టులు పెట్టి ప్రచారం చేసుకుంటున్నారు. కొందరు మహిళ సర్పంచ్ అభ్యర్థులు రాణి రుద్రమదేవి, ఇందిరమ్మ, అరుందతి, మంగమ్మ, సరస్వతి వంటి పేర్లతో కొత్తగా వాట్సప్ గ్రూపులను క్రియోట్ చేసుకుని ప్రచారానికి దిగారు. ఇంకొందరు నేరుగా యూట్యూబ్ చానళ్లను పెట్టుకుని గంట గంటకు తన గురించి గొప్పగా చెప్పుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఇంత మంది లైక్లు కొట్టారు. ఇంత మంది చూశారు అంటూ లోలోపల మురిసిపోతున్నారు. పల్లెల్లో తిరగకుండా, మైక్లతో హోరెత్తించకుండా.. సోషల్ మీడియాను నమ్ముకున్న పలువురు అభ్యర్థులు తమను గెలిపించాలంటూ పోస్టులు, వీడియోలు, వాట్సాప్లో స్టేటస్లు పెడుతున్న వైనం -
బలవంతపు ఏకగ్రీవాలు రద్దవుతాయి : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి
ఎన్నికల నిబంధనలు కాదని బలవంతంగా ఏకగ్రీవాలు చేస్తే సహించేది లేదు. ఇలాంటి ఎన్నికలను గుర్తిస్తాం. ఈవిధంగా చేసిన ఎన్నికలను ఈసీ రద్దు చేస్తుంది. కఠిన చర్యలు తీసుకుంటాం. ఎన్నిక ‘ఏకగ్రీవం’ అని నిర్ధారణ చేయడానికి ముందు ‘తప్పనిసరి ఽధ్రువీకరణ’ విధానాన్ని ఈసీ అమలులోకి తెచ్చింది. ఏకగ్రీవాల వెనుక ఎలాంటి అంశాలు దాగి ఉన్నాయనే విషయాన్ని పరిశీలించేందుకు మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశాం. పోటీలో మిగిలిన ఏకై క అభ్యర్థితోపాటు పోటీ నుంచి తప్పుకున్న అభ్యర్థుల నుంచి లిఖితపూర్వక డిక్లరేషన్ తీసుకుంటాం. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి, సమష్టి నిర్ణయంతో ఏకగ్రీవం అయ్యిందని నిర్ధారణ చేసుకుని నో అబ్జెక్షన్ లెటర్ ఇస్తాం. ఆ తరువాతే ఏకగ్రీవ ఎన్నిక ఫలితాన్ని ప్రకటిస్తాం. ఈ నేపథ్యంలో ఎక్కడైనా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఏకగ్రీవం చేసినట్లౖతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. సదరు అడ్డదారి, బలవంతపు ఎన్నికను రాష్ట్ర ఎన్నికల సంఘం రద్దు చేస్తుంది. ప్రతి ఎన్నిక, ప్రతి గెలుపు ప్రజల అభిప్రాయాన్ని నిజాయితీగా ప్రతిబింబించేలా ఉండాలి. ప్రజాస్వామ్య పటిష్టతకు ప్రతి ఒక్కరూ నిర్భయంగా కృషి చేయాలి. -
కోడ్ పక్కాగా అమలు చేయాలి
నిజామాబాద్ అర్బన్ : గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు జరిగేలా పర్యవేక్షణ చేయాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కోడ్ అమలులో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, పోలీస్ అధికారులతో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్న్స్ ద్వారా సమీక్షించారు. నిజామాబాద్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య, జనరల్ అబ్జర్వర్ శ్యాంప్రసాద్ లాల్ ఇతర అధికారులు వీసీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన స్టేజ్–2 జోనల్ ఆఫీసర్ల శిక్షణ తరగతులు, సర్వీస్ ఓటర్లు, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లు, వెబ్ కాస్టింగ్, ఓటర్ స్లిప్పుల పంపిణీ షెడ్యూల్ తదితర అంశాలపై కమిషనర్ సమీక్షించారు. ఫలితాల ప్రకటన నియమాలు, ఏకగ్రీవ స్థానాలలో ఉపసర్పంచ్ ఎన్నిక, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు, నామినేషన్లపై వచ్చే ఫిర్యాదులు, తదితర అంశాలపై ఎన్నికల అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఉప సర్పంచ్ నియామకం నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలని సూచించారు. ఏకగ్రీవంగా ఎంపికై న సర్పంచ్ పోస్టులకు ఫారం10 ప్రకారం ఫలితాలు ప్రకటించాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ అంకిత్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్ రావు, నోడల్ అధికారులు పాల్గొన్నారు. -
శబరిమలకు ప్రత్యేక రైళ్లు
సుభాష్నగర్: కేరళ రాష్ట్రంలోని శబరిమలకు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు నిజామాబాద్ స్టేషన్ మేనేజర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం చర్లపల్లి నుంచి కోల్లం (రైలు నెంబర్ 07135) రైల్వేస్టేషన్కు, నాందేడ్ నుంచి కొల్లం (07133) వరకు రెండు ప్రత్యేక రైళ్లు నడుస్తాయన్నారు. జనవరి 7న ఉదయం 4.25 గంటలకు నాందేడ్ నుంచి బయల్దేరి మరుసటి రోజు రాత్రి 10గంటలకు చేరుకుంటుందని పేర్కొన్నారు. జనవరి 14, 21 తేదీల్లో ఉదయం 11.20 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరే ప్రత్యేక రైలు మరుసటి రోజు రాత్రి 10 గంటలకు కోల్లం చేరుతుందని తెలిపారు. తిరిగి కొల్లం (రైలు నెంబర్ 07134) నుంచి 9న ఉదయం 2.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 5.30 గంటలకు నాందేడ్కు చేరుకుంటుందన్నారు. ఈ నెల 16, 23న కొల్లం (రైలు నెంబర్ 07136) నుంచి ఉదయం 2.30 గంటలకు బయల్దేరే రైలు మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంటలకు చర్లపల్లికి చేరుకుంటుందని తెలిపారు. అయ్యప్ప భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నాందేడ్ నుంచి బయల్దేరే ప్రత్యేక రైలు ముథ్కేడ్, ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్ మీదుగా వెళ్తుందని తెలిపారు. 14 నుంచి దూరవిద్య పీజీ తరగతులు ప్రారంభం ఖలీల్వాడి : జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కాలేజీలోని డా.బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ మొదటి సంవత్సరం విద్యార్థులకు సెమిస్టర్–1 తరగతులు ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభమవుతాయ ని ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, కో ఆర్డినేటర్ డాక్టర్ కె. రజిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు తప్పకుండా తరగతులకు హాజరు కావాలని పేర్కొన్నారు. వివరాలకు 73829 29612 నంబర్ లేదా www. braouonline.in వెబ్సైట్ను సంప్రదించా లని తెలిపారు. యువకులను స్వదేశానికి రప్పించాలి ● పార్లమెంట్లో ఎంపీ అర్వింద్ ధర్మపురి సుభాష్నగర్: యువతను నకిలీ ఉద్యోగాల పేరుతో విదేశాలకు తరలించి, సైబర్ నేర గ్యాంగ్లకు బందీలుగా మార్చుతున్నారని నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత అర్వింద్ ధర్మపురి పేర్కొన్నారు. అత్యంత తీవ్రమైన సమస్యను లోక్సభలో నిబంధన 377 కింద గురువారం ఆయన లేవనెత్తారు. యువతను థాయ్లాండ్లో ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మించి ఏజెంట్లు రూ.లక్షలు వసూలు చేస్తున్నారని ఎంపీ ప్రస్తావించారు. అక్కడికి చేరిన వెంటనే పాస్పోర్ట్లను స్వా ధీనం చేసుకుని, మయన్మార్లోని మయావడ్డి ప్రాంతాల్లోని సైబర్ నేర శిబిరాలకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. నిజామాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు యువకులు కూడా ఈ ముఠాకు బలై ప్రస్తుతం అక్కడే చిక్కుకుపోయారని పేర్కొన్నారు. వారిని రక్షించి, తిరిగి స్వదేశానికి రప్పించే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. విదేశీ ఉద్యోగాల పేరిట నేరాలకు సహకరిస్తున్న ఏజెంట్లు, రిక్రూటర్లపై కఠినచర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. బిందెలు పంపిణీ చేసిన సర్పంచ్ అభ్యర్థిపై కేసు తాడ్వాయి (ఎ ల్లారెడ్డి) : కా మారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని కన్కల్ గ్రామంలో గురువారం సర్పంచ్ అభ్యర్థి ఓటర్లకు బిందెలను పంపిణీ చేయడంతో ఎన్నికల ప్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. సర్పంచ్ అభ్యర్థి మైలారం రవీందర్రెడ్డి గ్రామంలోని కమ్యూనిటీహాల్లో ఓటర్లకు బిందెలను పంపిణీ చేస్తుండగా అక్కడికి వెళ్లి 41 బిందెలను స్వాఽధీనం చేసుకున్నారు. రవీందర్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. -
పోలింగ్ను నిశితంగా పరిశీలించాలి
● మైక్రో అబ్జర్వర్ల శిక్షణ తరగతుల్లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● కీలక సూచనలు చేసిన జనరల్ అబ్జర్వర్ శ్యాంప్రసాద్నిజామాబాద్ అర్బన్ : ఎన్నికలలో కీలకమైన ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలు తు.చ తప్పకుండా అమలయ్యేలా, ప్రశాంత వాతావరణంలో సజావు గా ఎన్నికల ప్రక్రియ జరిగేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్కు నియామకమైన మైక్రో అబ్జర్వర్లకు గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు జీవీ శ్యాంప్రసాద్ లాల్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మైక్రో అబ్జర్వర్లకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మైక్రో అబ్జర్వర్లు పోలింగ్కు సంబంధించిన ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన ఏర్పర్చుకోవాలని, అప్పుడే పోలింగ్ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించగల్గుతారని అన్నారు. పోలింగ్కు ముందు రోజు ఉదయం 7 గంటల సమయానికే డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు చేరుకొని సిబ్బందికి అందించే సామగ్రిని పరిశీలించాలని సూచించారు. అనంతరం సిబ్బందితో కలిసి పోలింగ్ స్టేషన్లకు చేరుకోవాలని పేర్కొన్నారు. పోలింగ్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతోందా లేదా అన్నది నిశిత పరిశీలన చేసి, గమనించిన అంశాలను జనరల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియ తీరుతెన్నులను పరిశీలించడం వరకే మైక్రో అబ్జర్వర్ల బాధ్యత అని, ఎక్కడ కూడా పోలింగ్ విధుల్లో జోక్యం చేసుకోకూడదని కలెక్టర్ హితవు పలికారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు ప్రభావితం చేయకుండా నిఘా ఉంచాలని, ఎన్నికల సంఘం గుర్తింపు కార్డులు కలిగిన వారు, ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న వారు మినహా, ఇతరులెవరికి పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. శిక్షణ తరగతుల్లో అదనపు కలెక్టర్ అంకిత్, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ సునీల్, మాస్టర్ ట్రైనర్లు, మైక్రో అబ్జర్వర్లు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.బోధన్ : తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు సంసిద్ధం కావాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 11న బోధన్ డివిజన్లో సర్పంచ్, వార్డు సభ్యుల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో గురువారం ఎడపల్లి ఎంపీడీవో కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఎన్నికల ప్రక్రియ అమలు తీరు, పోలింగ్ నిర్వహణ ఏర్పాట్లపై ఎంపీడీవో శంకర్, తహసీల్దార్ దత్తాద్రిలతో సమావేశమై సమీక్షించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలపై పూర్తి అవగాహన కలిగి ఉండి, విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కొనసాగుతున్న నామపత్రాల స్వీకరణ
సుభాష్నగర్ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం కొనసాగింది. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్లోని 165 జీపీలు, 1,620 వార్డుస్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. రెండోరోజు సర్పంచ్ స్థానాలకు 294 నామినేషన్లు, వార్డుస్థానాలకు 1,249 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల స్వీకరణ కోసం 57 కేంద్రాలను ఏర్పాటుచేశారు. నేటితో నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ముగియనుంది. మొదటిరోజు సర్పంచి స్థానాలకు 174 నామినేషన్లు, వార్డుస్థానాలకు 405 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండ్రోజులకు కలిపి మొత్తం సర్పంచ్ స్థానాలకు 469, వార్డుస్థానాలకు 1,655 నామినేషన్లు స్వీకరించారు. నామి నేషన్ స్వీకరణ కేంద్రాల వద్ద పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందితో హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేశారు. పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.మండలం జీపీ నామినేషన్లు వార్డులు నామినేషన్లు ఆలూరు 11 22 114 113 ఆర్మూర్ 14 51 142 146 బాల్కొండ 10 29 100 108 భీంగల్ 27 67 244 224 డొంకేశ్వర్ 13 36 118 98 కమ్మర్పల్లి 13 35 138 104 మెండోరా 11 34 110 130 మోర్తాడ్ 10 23 110 117 ముప్కాల్ 07 32 74 97 నందిపేట్ 22 65 208 276 వేల్పూర్ 18 53 180 179 ఏర్గట్ల 08 22 82 63 మొత్తం 165 469 1620 1655మండలాలవారీగా దాఖలైన నామినేషన్లు.. నేటితో ముగియనున్న మూడో విడత నామినేషన్లు.. సర్పంచ్ స్థానాలకు 469, వార్డు స్థానాలకు 1655 -
దొడ్డు వడ్లకు తిప్పలు
● క్వింటాలుకు ఐదు కిలోల వరకు కడ్తా ● రైతులను నిలువు దోపిడీ చేస్తున్న మిల్లర్లుసిరికొండ : దొడ్డు వడ్లు పండించిన అన్నదాతలను రైస్మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇష్టారీతిన కడ్తా తీస్తూ యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే దొడ్డు రకం వడ్లు తీసుకోబోమని చెబుతూ సతాయిస్తున్నారు. ఒక్కో క్వింటాలుకు ఐదు కిలోల వరకు కడ్తా తీస్తుస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిరికొండ మండలంలోని తాటిపల్లి, చీమన్పల్లి, పందిమడుగు గ్రామాల్లో దొడ్డు రకం వడ్లను ఎక్కువగా సాగు చేశారు. అయితే, దొడ్డు రకం వడ్లకు మిల్లర్లు తమకు నచ్చిన విధంగా కోత విధిస్తున్నారు. 40 కిలోల సంచికి చెత్త పేరిట కిలో చొప్పున క్వింటాలుకు రెండున్నర నుంచి మూడు కిలోల వరకు ఎక్కువ తూకం వేస్తున్నారు. ఇదే కాకుండా దొడ్డు రకం వడ్లకు అదనంగా క్వింటాలుకు ఐదు కిలోల వరకు కడ్తా తీస్తున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల దోపిడీని అరికట్టాలని రైతులు కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం
● నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు ● డీజీపీ శివధర్రెడ్డి కామారెడ్డి క్రైం : ప్రజల భద్రత, రక్షణ పోలీసుల ప్ర ధాన లక్ష్యమని డీజీపీ శివధర్రెడ్డి పేర్కొన్నారు. ఓ టర్లు ప్రలోభాలకు గురికాకుండా, స్వేచ్ఛగా తమ ఓ టు హక్కును వినియోగించుకునే వాతావరణాన్ని క ల్పించాలని అధికారులకు సూచించారు. గురువా రం కామారెడ్డికి వచ్చిన ఆయనకు జిల్లా పోలీసు కా ర్యాలయం వద్ద ఎస్పీ రాజేశ్ చంద్ర, నిజామాబాద్ సీపీ సాయి చైతన్య పుష్పగుచ్ఛం అందించి స్వాగ తం పలికారు. పోలీసులనుంచి గౌరవ వందనం స్వీ కరించిన అనంతరం ఉమ్మడి జిల్లా అధికారులతో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మా ట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత కీలకమని, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలను అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారని పేర్కొన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించడం పోలీసుశాఖ బాధ్యత అన్నారు. సున్నితమైన పోలింగ్ కేంద్రాల వివరాలను అడిగి తెలుసుకుని అక్కడ తీసుకోవా ల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు ఇచ్చారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, ద్వేషపూరిత, ఎ న్నికలను ప్రభావితం చేసే పోస్టులు పెడితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 30 యాక్టు అమలులో ఉంది కాబట్టి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఎలాంటి అ నుమతులు లేకుండా విజయోత్సవ ర్యాలీలు చేపట్టరాదన్నారు. ఆదేశాలు ఉల్లంఘించే వారిపై కఠిన చ ర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, నిజామాబాద్ అదనపు కమిషనర్ బస్వారెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
బేఖాతరే..!
ఈసీ అన్నాసాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలోని పలు చోట్ల గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ)లు ఎన్నికల కమిషన్ (ఈసీ)ను లెక్కపెట్టకుండా గ్రామాల్లో సొంత రాజ్యాంగం నడిపిస్తున్నాయి. వీడీసీ సభ్యులు సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులకు తమకు నచ్చిన విధంగా వేలం పాటలు నిర్వహిస్తున్నారు. వేలం పాటలకు విరుద్ధంగా ఎవరైనా గ్రామస్తులు నామినేషన్లు వేసేందుకు వస్తే బెదిరింపులకు దిగుతున్నారు. వీడీసీని కాదని నామినేషన్ వేయడానికి వీలు లేదంటూ హుకుం జారీ చేస్తున్నారు. దీంతో వివిధ గ్రామాలకు చెందినవారు జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్కు ఫిర్యాదులు చేస్తున్నారు. తమ దృష్టికి వచ్చిన ఇలాంటి వ్యవహారాలను కలెక్టర్, పోలీసు కమిషనర్ సీరియస్గా తీసుకుంటున్నారు. ఫిర్యాదులను ప్రత్యేకంగా పరిగణించి ఆశావహులు స్వేచ్ఛగా నామినేషన్లు వేసేందుకు కృషి చేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని వీడీసీలు తమదైన శైలిలో గ్రామస్తులను బెదిరించేందుకు ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామానికి చెందిన పలువురు గురువారం జిల్లా కలెక్టర్, సీపీకి ఫిర్యాదు చేశారు. తమ గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులకు వేలంపాట వేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సర్పంచ్ పదవిని రూ.32,80,000 లకు వేలం వేసినట్లు పేర్కొన్నారు. ఇందులో ఇప్పటికే రూ.5 లక్షలు వీడీసీకి ముట్టినట్లు తెలిపారు. ఇక ఉప సర్పంచ్ పదవిని రూ.7 లక్షలకు వేలం వేసినట్లు ఫిర్యాదులో తెలిపారు. తమను నామినేషన్లు వేయనీయకుండా, ఓటు హక్కు వినియోగించుకోనీయకుండా చేస్తున్నారని పలువురు ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు వెల్లడించారు. వీడీసీని కాదని నామినేషన్లు వేస్తే ప్రతీకారంతో ప్రాణహాని చేసేందుకు సైతం ప్రయత్నాలు చేసే అవకాశముందని, తమకు రక్షణ కల్పిస్తే నామినేషన్లు వేస్తామని ఫిర్యాదులో కోరారు. వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్లో సర్పంచ్ పదవికి వీడీసీ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. రూ.26,40,000 లకు వేలం వేసినట్లు తెలిసింది. అధికారులకు ఎలాంటి అనుమానం రాకుండా ఇద్దరు లేదా ముగ్గురితో నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. ఉపసంహరణ సమయంలో కేవలం వేలంలో సర్పంచ్ పదవిని దక్కించుకున్న వ్యక్తి నామినేషన్ మాత్రమే ఉండేలా చూస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన వ్యక్తుల నామినేషన్లను ఉపసంహరించుకునేలా ఒప్పందం చేసుకున్నట్లు పలువురు తెలిపారు. తద్వారా వేలం పాడిన వ్యక్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా పావులు కదిపినట్లు తెలుస్తోంది. మాక్లూర్ మండలం మాదాపూర్ గ్రామంలో ఎన్నికలకు సంబంధించి మరో ప్రత్యేక ఘటన వెలుగు చూసింది. మొరం, ఇసుక దందాలో ఆరితేరిన ఓ మాజీ సర్పంచ్, అతని కుమారులు అరాచకం చేస్తున్నట్లు పలువురు తెలిపారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగాన్ని మేనేజ్ చేసుకుంటూ సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసిన ముగ్గురు ఎస్సీ కమ్యూనిటీ వ్యక్తులను కిడ్నాప్ చేసి మాయమాటలు చెప్పి ఎన్నికలు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అక్రమార్కులు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులను భయపెట్టి, ఇద్దరితో నామినేషన్లు ఉపసంహరణ చేయించి ఒకరిని మాత్రమే బరిలో ఉంచి ఏకగ్రీవం చేయించేందుకు ప్లాన్ చేసినట్లు తెలిసింది. తద్వారా ఇసుక, మొరం దందాకు ఎదురు లేకుండా చేసుకునేందుకు కుయుక్తితో పథక రచన చేసినట్లు సమాచారం. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని లెక్కచేయని పలు వీడీసీలు సర్పంచ్, ఉపసర్పంచ్ పదవులకు వేలం పాటలు కొన్నిచోట్ల వేలంపాడిన వ్యక్తి కోసం డమ్మీ నామినేషన్లు కలెక్టర్, సీపీలకు ఫిర్యాదు చేస్తున్న ఆయా గ్రామాల ప్రజలు -
బరిలో..
466● అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ● రెండో విడత నామినేషన్ల పరిశీలన పూర్తితొలి విడత155పూర్తయిన నామినేషన్ల ఉపసంహరణ బోధన్ : తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగా బరిలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలింది. ఎన్నికల అధికారులు అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. 29 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా, 155 స్థానాలకు 466 మంది(నవీపేట మండలం మినహా) బరిలో నిలిచారు. ఈనెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది. పోస్టల్బ్యాలెట్ కోసం ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గురువారం నుంచి అభ్యర్థులు ప్రచార పర్వం ప్రారంభకానుంది. రెండో విడత నామినేషన్ల పరిశీలన బుధవారం పూర్తయ్యింది. సర్పంచ్ స్థానాలుఅభ్యర్థులు -
నామినేటెడ్ ఆశలు నెరవేరేదెన్నడో..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపో గా, నామినేటెడ్, పార్టీ పదవుల కోసం సీనియర్ నా యకులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నా రు. మరోవైపు తమకంటే జూనియర్లకు కీలక పదవు లు దక్కడంపై గుర్రుగా ఉన్నారు. మూడు, నాలుగు దశాబ్దాలుగా పార్టీకి సేవలందిస్తున్నప్పటికీ అధినాయక త్వం గుర్తించకపోవడం పట్ల నిరాశ చెందుతున్నా రు. బాల్కొండ నియోజకవర్గం నుంచి ఏకంగా ముగ్గురికి రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ల పద వులు కేటాయించారు. వారికంటే సీనియర్లైన తమకు పదవులు ఇవ్వకుండా నానబెడుతున్నారని ఆగ్రహంగా ఉన్నారు. ● 1988 నుంచి పార్టీకి సేవలందిస్తున్న మార చంద్రమోహన్రెడ్డి తాజాగా డీసీసీ పీఠం ఆశించి విఫలమయ్యారు. చంద్రమోహన్రెడ్డి యూత్ కాంగ్రెస్ ఆర్మూర్ మండల అధ్యక్షుడిగా మొదలయ్యారు. అంకాపూర్ సొసైటీ చైర్మన్గా, అంకాపూర్ సర్పంచ్గా, ఉమ్మడి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, వైఎస్ఆర్ హయాంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్గా, టీపీసీసీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. ఈయన నామినేటెడ్ రేసులోనూ ఉన్నారు. ● నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి టిక్కెట్టు సాధన, ఆయన గెలుపునకు తీవ్రంగా కృషి చేసిన బాడ్సి శేఖర్గౌడ్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి రేసులో ఉన్నారు. 1983 నుంచి శేఖర్గౌడ్ కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్నారు. విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్కు పని చేస్తున్నారు. బాడ్సి సర్పంచ్గా పదేళ్లపాటు వ్యవహరించారు. ఉమ్మడి నిజామాబాద్ సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా, సర్పంచ్ల సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా, అసోసియేట్ ప్రెసిడెంట్గా కొనసాగారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడిగా ఉన్నారు. తరువాత నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడిగా సేవలందించారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్గౌడ్కు అత్యంత సన్నిహితుడు. పార్టీ మారకుండా నాలుగు దశాబ్దాల పాటు సేవలందించిన శేఖర్గౌడ్కు రాష్ట్ర కార్పొరేషన్ పదవి కేటాయించాల ని అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. డీసీసీ పీఠం కోసం గట్టి ప్రయత్నాలు చేసిన బాస వేణుగోపాల్ యాదవ్ సైతం కీలకమైన పదవిని ఆశిస్తున్నారు. ● జుక్కల్ ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించి భంగపడిన గడుగు గంగాధర్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి ఆశించగా, తనకు అంతగా ఆసక్తి లేని వ్యవసాయ కమిషన్ సభ్యుడిగా పదవి ఇవ్వడంపై సంతృప్తిగా లేరు. 1983 నుంచి పార్టీకి సేవలందిస్తున్న గడుగు గంగాధర్ ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, మున్సిపల్ కౌన్సిలర్గా, ఫ్లోర్ లీడర్గా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు. గతంలో దివంగత వైఎస్ఆర్ అనుచరుడిగా ఉన్న గడుగు ప్రస్తుతం మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్రెడ్డి అనుచరుడిగా ఉన్నారు. ఇటీవల నగేశ్రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో గడుగు చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. పార్టీ లో సీనియర్ కార్యకర్తలను విస్మరిస్తున్నారని, నుడా లో ఏడాదికాలంగా డైరెక్టర్లను నియామకం చేయ కుండా తాత్సారం చేస్తూ కార్యకర్తలకు అన్యాయం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఈ విషయమై దృష్టి పెట్టాలని కోరారు.మీనాక్షి నటరాజన్ వివరాలు సేకరించినా.. గత జూన్లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పదవులు దక్కని సీనియర్ల వివరాలు సేకరించారు. పార్టీ కోసం కష్టపడినవారికి ఎక్కువ అవకాశాలు కల్పించేందుకు గాను కసరత్తు చేశారు. ప్రతి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేతో, ఎమ్మెల్యేలు లేని చోట కీలక నాయకులతో విడివిడిగా మీనాక్షి సమావేశమయ్యారు. రాష్ట్ర స్థాయి పదవులకు, నామినేటెడ్ పదవులకు ఎవరు అర్హులు, జిల్లా స్థాయిలో ఎవరిని ఏఏ పదవులకు ఎంపిక చేయాలనే అంశాలపై చర్చించారు. అయినప్పటికీ తమకు నామినేటెడ్ పదవులు కేటాయించడంలో ఆలస్యం చేయడంపై సీనియర్లు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైనా.. పదవులు దక్కకపోవడంతో పార్టీ సీనియర్లలో నైరాశ్యం తమను విస్మరించి జూనియర్లకు పదవులు ఇవ్వడంపై మనస్తాపం కీలక పదవుల కోసం రేసులో శేఖర్గౌడ్, మార చంద్రమోహన్రెడ్డి, వేణుగోపాల్ యాదవ్ -
సర్పంచ్గా పోటీ చేయనివ్వడం లేదు..
ఆర్మూర్: నందిపేట మండలం వెల్మల్ గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేయకుండా తనను గ్రామాభివృద్ధి కమిటీ అడ్డుకుంటోందని ఆరోపిస్తూ బోగ రాములు అనే వ్యక్తి ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్నాన్ మాల్వియాకు బుధవారం ఫిర్యాదు చేశారు. తమ గ్రామ సర్పంచ్ పదవి ఓపెన్ కేటగిరీ జనరల్ వచ్చిందన్నారు. వీడీసీతో పాటు ఇతర కుల సంఘాల వారు సర్పంచ్ పదవికి ఒక్కరు మాత్రమే నామినేషన్ వేయాలంటూ తీర్మానం చేశారన్నారు. తాను పోటీలో నిలబడితే తనను బలపర్చిన గ్రామస్తులకు భారీగా జరిమానా విధిస్తామంటున్నారని, డబ్బులు ముట్టజెప్పితే అవకాశం కల్పిస్తామని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ తనను భయాందోళనలకు గురి చేస్తున్నారని, విచారణ చేపట్టి తనకు న్యాయం చేయాలని రాములు కోరాడు. -
మండలాల వారీగా బరిలో నిలిచిన సర్పంచ్ అభ్యర్థులు
మండలం జీపీలు అభ్యర్థులు బోధన్ 22 67 సాలూర 09 28 ఎడపల్లి 16 58 రెంజల్ 16 54 చందూర్ 03 56 మోస్రా 05 19 నవీపేట 30 –– 155 466 రుద్రూర్ 11 39 కోటగిరి 11 46 పోతంగల్ 19 60 వర్ని 13 39 బోధన్: జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్న 184 గ్రామ పంచాయతీలకు గాను 29 గ్రామ సర్పంచ్లు ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈనెల 11వ తేదీన బోధన్ రెవెన్యూ డివిజన్లోని బోధన్ రూరల్, చందూర్, కోటగిరి, మోస్రా, పొతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూర, వర్ని, ఎడపల్లి మండలాల్లోని గ్రామాలతోపాటు నిజామాబాద్ రెవె న్యూ డివిజన్లోని నవీపేట మండలంలోని గ్రామాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. గత నెల 29న నామినేషన్ల దాఖలు ప్రక్రియ, బుధవా రం విత్డ్రా గడువు ముగిసింది. 155 సర్పంచ్ స్థానాలకు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల పేర్లు ఫైనల్ అయ్యాయి. హెచ్చరికలు అక్కడికే పరిమితమా.. వర్ని: బలవంతపు ఏకగ్రీవాలపై చర్యలు తప్ప వని అధికారులు హెచ్చరికలు జారీ చేసినా అవి అక్కడికే పరిమితమయ్యాయని పలువురు పేర్కొంటున్నారు. చాలా గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాలను వేలం వేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి వర్ని మండలంలో రూ.4 లక్షల నుంచి రూ.41 లక్షల వరకు వేలం సాగినట్లు తెలుస్తోంది. గ్రామాల అభివృద్ధి, అవసరమైన నిధుల కోసమంటూ ఎన్నికలకు వెళ్లకుండా పదవులను కట్టబెట్టారనే విమర్శలున్నాయి. -
బీజేపీ ఓట్ చోరీ చేస్తోంది
● ఎన్నికల కమిషన్, కేంద్రం కలిసి నాటకమాడుతున్నాయి ● ఓట్ చోరీకి నిరసనగా సంతకాల సేకరణ ● మీడియాతో డీసీసీ అధ్యక్షుడు నగేశ్ రెడ్డిడిచ్పల్లి: బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వెళ్తూ ఓట్ చోరీ చేస్తూ పలు రాష్ట్రాల్లో అధికారంలో వచ్చిందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్రెడ్డి ఆరోపించారు. డిచ్పల్లిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల బీహార్లో జరిగిన ఎన్నికల్లో కూడా ఓట్లు చోరీ చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. బ్రెజిల్ దేశానికి చెందిన ఒక నటికి వివిధ ప్రాంతాల్లో దాదాపు 22 ఓట్లు ఉన్నాయని, ఆమె ఈదేశ పౌరురాలు కానప్పటికీ నకిలీ ఓట్లు సృష్టించి బీజేపీ ఓట్ చోరీకి పాల్పడుతోందని విమర్శించారు. హర్యానాలో దాదాపు 25లక్షల ఓట్లలో సుమారు 12.5శాతం నకిలీ ఓట్లు పోలవడంతోనే బీజేపీ గెలిచిందన్నారు. ఇదంతా ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వం కలిసి ఆడుతున్న నాటకమని మండిపడ్డారు. అలాగే త్వరలో ఎన్నికలు జరిగే తమిళనాడు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా గెలవాలని చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధిష్టానం, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఈవీఎంల ద్వారా ఎన్నికల విధానం రద్దు చేయాలని, ఓట్ చోరీకి నిరసనగా సంతకాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల్లో అన్ని మండలాల్లో పార్టీ అధ్యక్షులు సంతకాలు సేకరించి అధిష్టానానికి పంపిస్తారని నగేశ్రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్కు అండగా ప్రజలు.. ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్కు ప్రభుత్వానికి అండగా ఉన్నారన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను ఏకగ్రీవం చేయాలని కోరారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్గౌడ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి విక్కీ యాదవ్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు విపుల్గౌడ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, డిచ్పల్లి మాజీ ఎంపీపీలు కంచెట్టి గంగాధర్, చిన్నోల నర్సయ్య, రూరల్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లయ్య, శ్రీనివాస్గౌడ్, గురడి నర్సారెడ్డి, ఇబ్రహీం, మహేందర్ , డాక్టర్ షాదుల్లా తదితరులు పాల్గొన్నారు. -
బోధన్లో ‘అమృత్’ సర్వే ప్రారంభం
బోధన్: అమృత్ 2.0 పథకం కింద బోధన్ మున్సిపాలిటీ పరిధిలో మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ సర్వే బుధవారం ప్రారంభమైంది. డీటీసీపీ ఆదేశాల మేరకు పట్టణంలోని 38వ వార్డులో సర్వే సంస్థల ప్రతినిధులు సర్వే నిర్వహించారు. రోడ్లు, తాగు నీటి సరఫరా, డ్రెయినే జీ వ్యవస్థ , ఇంటి నంబర్లు, యజమాని వివరాలు, భవన విస్తీరణం, ఇతర మౌలిక సదుపాయాల డేటాను సేకరిస్తున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. పట్టణ అభివృద్ధికి కీలకమైన సర్వేకు పట్టణ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. డిచ్పల్లి(జక్రాన్పల్లి): హైదరాబాద్ కన్న య్య శాంతివనంలో బుధవారం జరిగిన మ హా కిసాన్ మేళా (అంతర్జాతీయ రైతు సదస్సు)లో జక్రాన్పల్లి మండలం మనోహరాబాద్కు చెందిన రైతు పాట్కూరి తిరుపతిరెడ్డికి ‘రైతు రత్న’ అవార్డు ప్రదానం చేశారు. జిల్లాలో రైతు ఉత్పదారుల సంఘం బలోపేతం కోసం నెలకొల్పిన జేఎంకేపీఎం ఎఫ్పీవో టర్మరిక్ క్లస్టర్ను గుర్తించి అవార్డును అందించినట్లు తిరుపతిరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ (ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సులు) రీవాల్యుయేషన్కు ఈ నెల 8 వరకు దరఖాస్తు చేసుకోవాలని కంట్రోలర్ ప్రొఫెసర్ సంపత్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. నవంబర్–2025 లో జరిగిన పీజీ ఏపీఈ, పీసీహెచ్, ఐఎంబీ ఏ 1, 3వ, ఎల్ఎల్బీ 1, 2, 3, 4వ సెమిస్టర్ రెగ్యులర్, థియరీ పరీక్షలకు హాజరైన వారు మాత్రమే రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. ఒక్కో పేపర్కు రూ.500, దరఖాస్తు ఫారానికి రూ.25 చెల్లించాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు తెయూ వెబ్సైట్ను సందర్శించాలని కంట్రోలర్ సూచించారు. నిజామాబాద్నాగారం: రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ సెపక్తక్రా పోటీలకు ఉమ్మడి జిల్లా బృందం ఖరారైనట్లు సెక్రెటరీ నాగమణి బుధవారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రెసిడెన్సి హైస్కూల్లో బుధవారం ఎంపికలు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి అండర్–17 బాలికల సెపక్తక్రా పోటీలకు కోచ్గా మోపాల్ జడ్పీహెచ్ఎస్ పీడీ, బాలురకు నాగరాజు, నరేశ్ కోచ్, మేనేజర్లుగా వ్యవహరించనున్నారు. ఖలీల్వాడి: కులాస్పూర్ విద్యార్థులు రాసిన స్నేహ చంద్రికలు కథా సంపుటిని జిల్లా వి ద్యాధికారి అశోక్ బుధవారం ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవయిత్రి, ఉపాధ్యాయురాలు స్వర్ణ సమత సంపాదకత్వం, ఇందూరు జిల్లా బాల సాహి త్య వేదిక ఆధ్వర్యంలో స్నేహ చంద్రికలు కథా సంపుటి విద్యార్థులు రచించడం సంతోషించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో ఇందూరు బాల సాహిత్య వేదిక అధ్యక్షుడు డాక్టర్ కాసర్ల నరేశ్ రావు , కోశాధికారి చింతల శ్రీనివాస్, ఎంఈవో సాయిరెడ్డి , జిల్లా సైన్స్ అధికారి గంగాకిషన్, కాంతారావు, ఉమారాణి, స్వర్ణ సమత పాల్గొన్నారు. -
కొడుకు కల నెరవేర్చిన గ్రామస్తులు
● సర్పంచ్గా ఏకగ్రీవమైన తల్లి ● అంతకు ముందే ఆస్పత్రిలో కోమాలో కొడుకునవీపేట : తల్లిని సర్పంచ్ చేయాలని కలలు గన్న కొడుకు నామినేషన్కు ముందే బ్రెయిన్ స్ట్రోక్తో ఆస్పత్రి పాలై కోమాలోకి వెళ్లాడు. స్పందించిన గ్రామస్తులు మానవతా దృక్పథంలో పోటీదారులను విత్డ్రా చేయించి ఆ తల్లిని సర్పంచ్గా ఏకగ్రీవం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మొద టి విడత ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని నారాయణ్పూర్ సర్పంచ్ స్థానం జనరల్కు కేటాయించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు దారుడు యెండల నవీన్ తన తల్లి యెండల లక్ష్మి అలియాస్ సరోజనమ్మను బరిలో నిలిపేందుకు ఏర్పాట్లు చేశాడు. గతంలో రెండు పర్యాయాలు యెండల లక్ష్మి సర్పంచ్ స్థానానికి నామినేషన్లు వేయగా, మొదటి సారి ఉపసంహరించుకున్నారు. రెండో సారి స్వల్ప తేడాతో ఓడిపోయారు. మూడోసారి పోటీలో నిలబెట్టి తల్లిని ఎలాగైన సర్పంచ్ చేయా లని భావించిన నవీన్ అందుకు తగిన ప్రణాళిక రూపొందించుకుని ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే ఆ టెన్షన్లో నామినేషన్కు ఒక రోజు ముందు బ్రెయిన్స్ట్రోక్కు గురైకోమాలోకి వెళ్లాడు. నవీన్ను హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించారు. కొడుకు ఆశయాన్ని నెరవేర్చాలని కొందరు గ్రామస్తులు తల్లితో నామినేషన్ వేయించారు. తరువాత ఇద్దరు బీఆర్ఎస్ మద్దతుదారులు, మరొకరు ఇండిపెండ్గా నామినేషన్లు వేశారు. నామినేషన్లు ముగిశాక నవీన్ ఆరాటం..దైన్యస్థితిని గమనించిన గ్రామస్తులు ఒక్కటిగా కదిలి ఏకగ్రీవం వైపు మళ్లారు. పోటీలో ఉన్న ముగ్గురి నామినేషన్లను విత్ డ్రా చే యించారు. సర్పంచ్గా యెండల లక్ష్మి ఎన్నిక ఏకగ్రీవం ఖరారైంది. తల్లిని సర్పంచ్గా చూడా లని కలలు గన్న కొడుకు మాత్రం ఆస్పత్రిలో కోమాలో ఉన్నారు. -
ఏర్పాట్లలో లోపాలు ఉండొద్దు
మాక్లూర్/పెర్కిట్/డొంకేశ్వర్/నందిపేట్/డిచ్పల్లి: నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ బూత్ల వద్ద లోపాలు ఉండకుండా ఏర్పాట్లు చేయాలని, ఎలక్షన్ కమిషన్ నిబంధనలను పాటించాలని జిల్లా ఎ న్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యామ్ ప్రసాద్లాల్ అధికారులకు సూచించారు. మూడో విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన ఆలూ ర్, ఆర్మూర్, డొంకేశ్వర్, నందిపేట్ తదితర మండలాల్లో బుధవారం వారు పర్యటించి నామినేషన్ స్వీకరణ కేంద్రాలను తనిఖీ చేశారు. ఎన్నికల అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆలూర్ మండలం గుత్పలో కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి, నందిపేట మండలం వన్నెల్(కే), డొంకేశ్వర్ మండల కేంద్రంలో ఎన్నికల పరిశీలకుడు శ్యామ్ప్రసాద్లాల్ నామినేషన్ కేంద్రాలను సందర్శించారు. నామినేషన్లు వేసే వారికి ఏవైనా సందేహాలు ఉంటే హెల్ప్ డెస్క్ల ద్వారా నివృత్తి చేయాలని సూచించారు. ఆర్మూర్ మండలం గోవింద్పేట్ నామినేషన్ కేంద్రాన్ని సీపీ సాయిచైతన్య పరిశీలించారు. జక్రాన్పల్లి మండలం అర్గుల్ క్లస్టర్ కేంద్రంలో నామినేషన్ల స్క్రూటినీని శ్యామ్ప్రసాద్లాల్ పరిశీలించారు. -
మూడో విడత తొలిరోజు 579
సుభాష్నగర్ : మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్న సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. తొలిరోజు మొత్తం 579 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్లోని 165 జీపీలు, 1,620 వార్డుస్థానాలకు 57 కేంద్రాలను ఏర్పాటు చేసి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందితో హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేయగా, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. తొలిరోజు సర్పంచ్ స్థానాలకు174, వార్డుస్థానాలకు 405 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల 5వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ● ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ● సర్పంచ్ స్థానాలకు 174.. వార్డు స్థానాలకు 405 -
హత్య కేసులో నిందితుడి అరెస్టు
మాక్లూర్: భోజన సమయంలో హమాలీల మధ్య చెలరేగిన ఘర్షణతో ఒకరి మృతికి కారణమైన గుడ్డు కుమార్ను మాక్లూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నార్త్ జోన్ సీఐ శ్రీనివాస్, ఎస్సై రాజశేఖర్ బుధవారం మాక్లూర్ పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. ఆలూర్ మండలం గుత్ప గ్రామంలో పనులు చేస్తున్న బిహార్ హమాలీల మధ్య ఈ నెల 1వ తేదీ రాత్రి ఘర్షణ జరిగింది. గుడ్డు కుమార్ అనే హమాలీ తోటి హమాలి సంతోష్ తలను పట్టుకొని సిమెంట్ బేస్మెంట్కు బలంగా కొట్టాడు. తలకు బలమైన గాయం కావడంతో తోటి హమాలీలు సంతోష్ను చికిత్స నిమిత్తం అంబులెన్స్లో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సంతోష్ బుధవారం మృతి చెందినట్టు సీఐ శ్రీనివాస్ తెలిపారు. మృతికి కారణమైన గుడ్డు కుమార్పై హత్య కేసు నమోదు చేశామన్నారు. భిక్కనూరు: డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఇద్దరికి ఒక్క రోజు జైలుశిక్షతోపాటు రూ.1000 చొప్పున జరిమానా న్యాయమూర్తి విధించినట్లు భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు బుధవారం తెలిపారు. మండల కేంద్రంలో మంగళవారం వాహనాలను తనిఖీ చేస్తుండగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన బండారి తిరుమలయ్య, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని చీమన్పల్లి చెందిన మాలోతు అఖిల్ పట్టుబడ్డారన్నారు. ఇద్దరిని కామారెడ్డి ద్వితీయశ్రేణి న్యాయమూర్తి చంద్రశేఖర్ ఎదుట హాజరుపరచగా ఒక్కరోజు జైలుశిక్షతోపాటు జరిమానా విధించారు. -
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి
● ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి ● సీపీ సాయిచైతన్య డిచ్పల్లి(జక్రాన్పల్లి): పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని, పా త నేరస్తులను గుర్తించి బైండోవర్ చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య సూచించారు. జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్ను ఆయన బుధవారం తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ రికార్డులు, బ్యారక్లు, అండర్ ఇన్వేస్టిగేషన్ కేసుల రికార్డులు తనిఖీలు చేసి, ప్రతి కేసుకి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏర్పాటు చేసి నాణ్యమైన దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రతి పోలింగ్ స్టేషన్ను సిబ్బంది స్వయంగా పరిశీలించి కనీస వసతులు కల్పించేలా చూడాలన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, ప్రతి దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేసి ఫిర్యాదుదారునికి ఒక కాపీ ఇచ్చి సంతకం తీసుకోవాలని,రిజిస్టర్లో కూడా నమోదు చేయాల ని రిసెప్షనిస్టుకు సూచించారు. పాఠశాలలు, కళాశాలలతోపాటు సోషల్ మీడియా ద్వారా సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల ని ఆదేశించారు. సిబ్బంది హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండాలని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ చేసుకోవాలని సూచించారు. సీపీ వెంట జక్రాన్పల్లి ఎస్సై మహేశ్, సిబ్బంది ఉన్నారు. -
తొలి విడతలో 29 పంచాయతీలు ఏకగ్రీవం
● ప్రకటించిన అధికారులు ● ఎన్నికై న అభ్యర్థులకు ధ్రువీకరణపత్రాలు అందజేసిన ఆర్వోలు బోధన్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత బోధన్ డివిజన్ పరిధిలోని 184 గ్రామాల సర్పంచ్లు, 1642 వార్డు సభ్యులకు ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ బుధవారం పూర్తయ్యింది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను అధికారులు ప్రకటించారు. అయితే, పలుచోట్ల సర్పంచ్ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో డివిజన్లో 29 పంచాయతీల సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సాలూర మండలంలో సాలంపాడ్ సర్పంచ్గా శీలం నర్మదా సంతోష్ రెడ్డి, సాలూర క్యాంప్ సర్పంచ్గా దొండేటి విజయబాస్కర్ రెడ్డి, ఫత్తేపూర్ సర్పంచ్ షేక్ నూర హైమద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎడపల్లి మండలంలోని బాపునగర్లో సర్పంచ్గా నగునూరి అనురాధ, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఠాణాకలాన్ గ్రామంలోని నామినేషన్ స్వీకరణ కేంద్రంలో వీరందరికీ ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు ఆర్వోలు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. బోధన్లో నలుగురు ఏకగ్రీవం.. బోధన్రూరల్ : మండలంలోని మావందికాలన్ సర్పంచ్గా ఏనాకుంచే శకుంతల, పెంటాకుర్దు సర్పంచ్గా వేములపల్లి రాధిక, భూలక్ష్మీ క్యాంప్ సర్పంచ్గా కామిరెడ్డి బల్రెడ్డి, పెంటాకాలన్ సర్పంచ్గా కర్లం కళావతిి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ నాలుగు జీపీల్లో వార్డు మెంబర్లు సైతం ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు పేర్కొన్నారు. వర్నిలో 10 జీపీలు.. వర్ని: మండలంలో 23 గ్రామపంచాయతీలకు 10 జీపీలో ఒకే ఒక్క నామినేషన్ రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎంపీడీవో వెంకటేశ్వర్ బుధవారం వెల్లడించారు. సైదిపూర్ సర్పంచ్గా బానోత్ శ్రీరామ్, చేలక తండా సర్పంచ్గా శ్రీనివాస్, మల్లారం సర్పంచ్గా లక్ష్మణ్, సిద్దాపూర్ సర్పంచ్గా బాల్సింగ్, చింతలపేట్ సర్పంచ్గా గంగారాం, శంకోరా సర్పంచ్గా హరిసింగ్, రాజీపేట్ సర్పంచ్గా కవిత, రూప్ల నాయక్ తండా సర్పంచ్గా రీనా బలరాం, అఫంది ఫారం సర్పంచ్గా వినోద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చందూరు మండలంలో లక్ష్మాపూర్ సర్పంచ్గా చింతం ఉమా సంజీవ్, కారేగం సర్పంచ్గా లాల్ సింగ్ ఏకగ్రీవమైనట్లు ఎంపీడీవో లీలావతి తెలిపారు. మోస్ర మండలంలో ఐదు జీపీలకు 19 మంది పోటీలో ఉన్నట్లు ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. దండిగుట్ట సర్పంచ్గా ధనుంజయ్.. రెంజల్(బోధన్): మండలంలోని దండిగుట్ట సర్పంచ్గా బూరుగుపల్లి ధనుంజయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనపై పోటీ చేసిన అభ్యర్థి రవి బుధవారం నామినేషన్ ఉపసంహరించుకున్నారు. గ్రామంలో 8 వార్డులు ఉండగా 6 వార్డులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వ సలహాదారు సొంతూరులో.. నవీపేట: మండలంలోని నారాయణ్పూర్తోపాటు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి సొంతూరు సిరన్పల్లిలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. నారాయణ్పూర్ సర్పంచ్గా యెండల లక్ష్మి అలియాస్ సరోజనమ్మ, సిరన్పల్లి సర్పంచ్గా తొగరి సౌమ్య ఎన్నికయ్యారు. కోటగిరిలో ఐదు.. పోతంగల్లో ఒకటి.. రుద్రూర్: కోటగిరి మండలంలోని రాంపూర్ సర్పంచ్గా శాంకి బాయి, అడ్కాస్పల్లి సర్పంచ్గా రెడ్డి రామకృష్ణ, దేవునిగుట్ట సర్పంచ్గా కొర్ర రవి నాయక్, సుద్దులం తండా సర్పంచ్గా మూడ్ మౌనిక , వల్లాభపూర్ సర్పంచ్గా పుష్పబాయి, పోతంగల్ మండలం పీఎస్ఆర్ నగర్ సర్పంచ్గా రమాబాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
175 మొబైల్ ఫోన్లు అందజేత
నిజామాబాద్అర్బన్: నిజామాబాద్ డివిజన్ పరిధిలో చోరీకి గురైన 170 ఫోన్లను ఏసీపీ రాజా వెంకటరెడ్డి బుధవారం బాధితులకు అందజేశారు. ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించారు. 170 ఫోన్ల విలువ రూ.17 లక్షల వరకు ఉంటుందని ఏసీపీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఎవరైనా మొబైల్ పోగొట్టుకున్నా, అపహరణకు గురైనా సీఐఆర్లో బ్లాక్ చేసి సంబంధిత పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. ఫోన్ కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఒకటవ టౌన్ ఎస్హెచ్వో రఘపతి, నిజామాబాద్ డివిజన్ పోలీసులు పాల్గొన్నారు. -
రోటరీ క్లబ్కు ఏటా రూ.2 లక్షలు
● ‘ధన్పాల్’ ట్రస్ట్ నుంచి ఆర్థికసాయం ప్రకటించిన అర్బన్ ఎమ్మెల్యే ● దివ్యాంగులకు ఉచిత కృత్రిమ కాలు పంపిణీ సుభాష్నగర్: దివ్యాంగ జీవితాల్లో వెలుగులు తీసుకొస్తున్న రోటరీ క్లబ్కు ప్రతియేటా రూ.2లక్షలు ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్త ట్రస్ట్ నుంచి అందిస్తానని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రకటించారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, జగిత్యాల్ సెంట్రల్ సంయుక్త ఆధ్వర్యంలో రోటరీ సర్వీసెస్ ట్రస్ట్ సహకారంతో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో దివ్యాంగులకు ఉచిత కృత్రిమ కాలు (జైపూర్ ఫుట్) పంపిణీ శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ధన్పాల్ సూర్యనారాయణ దివ్యాంగులకు కృత్రిమ కాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగులకు కృత్రిమ కాలు అమర్చి వారికి నూతన ఉత్తేజాన్ని కల్పిస్తున్న రోటరీ సేవలను ఆయన కొనియాడారు. కార్యక్రమంలో ఎన్ఆర్సీటీ చైర్మన్ ఆకుల అశోక్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు శ్యామ్ అగర్వాల్, కార్యదర్శి గోవింద్ జవహర్, కోశాధికారి జుగల్ రాజు, కమల్ కిశోర్ ఇనాని, ధర్మపురి సురేందర్, బీజేపీ నాయకులు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. -
ఈవీఎం గోడౌన్ పరిశీలన
నిజామాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ ఉన్న ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కు మార్ బుధవారం పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా ఈవీఎం గోడౌన్ సీల్ను తెరిపించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన గదుల ను క్షుణ్ణంగా పరిశీలించారు. గోడౌన్ వద్ద భద్ర తా ఏర్పాట్లను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన కలెక్టర్, అవి నిరంతరం పనిచేసేలా చూడాలన్నారు. కలెక్టర్ వెంట అగ్నిమాపక శాఖ అధికారి పరమేశ్వర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ధన్వాల్, సిబ్బంది సాత్విక్, విజేందర్ తదితరులు ఉన్నారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ రెగ్యులర్, బ్యాక్లాగ్ సెమిస్టర్ పరీక్షల్లో బుధవారం మాల్ప్రాక్టీస్కు పాల్పడుతూ ఒక విద్యార్థి డిబార్ అయినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు 2,781 మంది విద్యార్థులకు 2,538 మంది హాజరుకాగా 242 మంది గైరాజరైనట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 6,165 మంది విద్యార్థులకు 5,856 మంది హాజరుకాగా 309 మంది పరీక్ష రాయలేదని తెలిపారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ పరీక్ష కేంద్రంలో ఒక విద్యార్థి డిబార్ అయినట్లు ప్రొఫెసర్ చంద్రశేఖర్ తెలిపారు. ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల్లో ఇద్దరు డిబార్ అయినట్లు ఇంచార్జీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రంగరత్నం బుధవారం తెలిపారు. 1,572 మంది విద్యార్థులకు 1,524 మంది హాజరుకాగా 48 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నరాు. పరీక్షల నియంత్రణ అధికారి భరత్రాజ్, అకడమిక్ కోఆర్డినేటర్ నాహీదా బేగం పర్యవేక్షించారు. స్ట్రాంగ్ రూమ్ పరిశీలన నిజామాబాద్అర్బన్: పంచాయతీ ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) సెల్ను జనరల్ అబ్జర్వర్ శ్యాంప్రసాద్ లాల్ బుధవారం సందర్శించారు. ఎంసీఎంసీ ద్వారా చేపడుతున్న పనుల గురించి అడిగి తెలుసుకుని, రికార్డులను పరిశీలించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే చెల్లింపు వార్తలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్ను సందర్శించి భద్రతా ఏర్పాట్లు, ఎన్నికల సామగ్రిని పరిశీలించారు. ఆయన వెంట డీపీవో శ్రీనివాస్ రావు, డీఆర్డీవో సాయాగౌడ్, ఎంసీఎంసీ కమిటీ మెంబర్, సెక్రెటరీ ఎన్.పద్మశ్రీ, హౌసింగ్ పీడీ పవన్ కుమార్ తదితరులు ఉన్నారు. -
కుటుంబ సభ్యులకు మహిళ అప్పగింత
కామారెడ్డి క్రైం: సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ మహిళ రెండ్రోజుల క్రితం అదృశ్యమవ్వగా ఆమెను కామారెడ్డి రైల్వే పోలీసులు గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. సిరిసిల్ల జిల్లా చంద్రాపేట్ జ్యోతినగర్కు చెందిన రాచ సుగుణ(50) మంగళవారం ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యల్లో భాగంగా చుట్టుపక్కల ఠాణాలకు సమాచారం పంపారు. కామారెడ్డి రైల్వేస్టేషన్లోని ఓ ప్లాట్ఫాంపై సుగుణ ఉండటాన్ని గమనించిన రైల్వే పోలీసులు కుమారుడు శంకర్ను పిలిపించి అప్పగించారు. మహిళ కుటుంబసభ్యులు రైల్వే ఎస్సై లింబాద్రి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. -
విద్యార్థులు ప్రతిభను మెరుగుపర్చుకోవాలి
● వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు తెయూ(డిచ్పల్లి): అధ్యాపకులు, సీనియర్ విద్యార్థుల మార్గనిర్దేశనంలో పీజీ కోర్సుల్లో నూతనంగా ప్రవేశాలు పొందిన విద్యార్థులు తమ ప్రతిభను మరింత మెరుగుపర్చుకోవాలని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు సూచించారు. తెయూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బుధవారం నూతన విద్యార్థులకు ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో వీసీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఫోన్లకు దూరంగా ఉంటూ చదువుపై శ్రద్ధ వహించాలన్నారు. వర్సిటీలో ఉన్న మౌలిక వసతులను ఉపయోగించుకుంటూ చదువులో రాణించాలని సూచించారు. ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరుచుకొని దాన్ని సాధించేందుకు కృషిచేయాలన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్య సాధనలో నిర్లక్ష్యం చూపకుండా ఉన్నత స్థానానికి చేరుకొని వర్సిటీకి పేరు తేవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మణ్ చక్రవర్తి, ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్, కంట్రోలర్ ప్రొఫెసర్ సంపత్ కుమార్, అధ్యాపకులు రవీందర్ రెడ్డి, లావణ్య, నాగరాజు, జమీల్ అహ్మద్, అబ్దుల్ ఖవి, బాలకిషన్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
సీఎం క్షమాపణలు చెప్పాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ సుభాష్నగర్: హిందూ దేవుళ్లను అవమానించేలా సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు హిందువులపై ప్రత్యక్ష దాడి అని, ఆయన వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దినేశ్ పటేల్ కులాచారి మాట్లాడుతూ హిందూ దేవతలపై సీఎం చేసిన వ్యాఖ్యలు క్షమించలేనివన్నారు. గతంలో కేసీఆర్ హిందుగాళ్లు.. బొందుగాళ్లు అంటే పాతాళానికి తొక్కిపడేశారని గుర్తుచేశారు. రేవంత్రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి కూడా అదే దుస్థితి పడుతుందన్నారు. కేవలం ఒకవర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ చేస్తున్న రాజకీయ నాటకమని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, లక్ష్మీనారాయణ, ఆకుల శ్రీనివాస్, బూర్గుల వినోద్, ఇప్పకాయల కిశోర్, మల్లేశ్ గుప్త, గడ్డం రాజు, అంబదాస్ రావు, నారాయణ యాదవ్, గిరిబాబు, ఆమంద్ విజయ్కృష్ణ, ఆనంద్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
బోధన్రూరల్: మండలంలోని పెగడపల్లి గ్రామానికి చెందిన మేరే దేవరాజ్ (27) బైక్పై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు ఎస్సై మచ్చేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం బోధన్ వెళ్లి తిరిగి వస్తుండగా లంగ్డాపూర్ శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో దేవరాజ్ అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య దివ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రానికి సమీపంలోని రామేశ్వర్పల్లి వద్ద ఓ వ్యక్తిపై మరో వ్యక్తి కత్తితో దాడి చేసినట్లు రూరల్ సీఐ రామన్ తెలిపారు. రామేశ్వర్పల్లి వద్దనున్న డబుల్ బెడ్రూం కాలనీలో నివాసం ఉండే సుతారి రాజశేఖర్, గంగని ప్రవీణ్ కలిసి మంగళవారం రాత్రి దాదాపు 11 గంటల ప్రాంతంలో ఇళ్లకు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో మద్యం సేవించారు. అక్కడే వారి మధ్య మాటామాటా పెరిగి కత్తిపోట్ల వరకు వెళ్లింది. ప్రవీణ్ కత్తితో రాజశేఖర్పై దాడి చేసి కడుపులో పొడిచాడు. స్థానికులు గమనించి వెంటనే అతడిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్కు రిఫర్ చేశారు. ప్రస్తుతం రాజశేఖర్ చికిత్స పొందుతున్నాడు. రూరల్ సీఐ రామన్ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ జరిపారు. ఇద్దరి మధ్య పాతకక్షలు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు ప్రవీణ్పై హత్యా యత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. బాల్కొండ: మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద జాతీయ రహదారి 44పై బుధవారం బంగాళదుంపల లోడ్తో వస్తున్న లారీ బోల్తాపడింది. నిర్మల్ నుంచి ఆర్మూర్ వెళ్తున్న లారీ అతివేగంగా రావడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో ఎవరికీ ప్రాణహాని జరగలేదు. డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): జింకను వేటాడిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. బోర్గాం గ్రామానికి చెందిన గంధం విజయ్, దాసరి వెంకటి, నిమ్మల భూమయ్య, అనిల్ వారం రోజుల క్రితం మల్లారం గుట్ట ప్రాంతంలో జింకను వేటాడారు. నలుగురిని బుధవారం ఉదయం పట్టుకొని విచారించగా జింకను వేటాడి చంపినట్లు ఒప్పుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్హెచ్వో తెలిపారు. -
ప్రత్యేక పిల్లలకు భరోసా.. భవిత!
● జిల్లా వ్యాప్తంగా 33 మండలాల్లో కొనసాగుతున్న సేవలు ● సత్ఫలితాలనిస్తున్న విలీన విద్య ● నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంఆర్మూర్: ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు భవిత కేంద్రాలు వారి భవిష్యత్కు భరోసాను ఇస్తున్నాయి. విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా తెలంగాణ సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని గుర్తించిన ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఆయా కేంద్రాల్లో విలీన విద్యను అందిస్తున్నారు. నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా భవిత కేంద్రాలపై ప్రత్యేక కథనం. ఎన్నో సౌకర్యాలు.. జిల్లాల్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సుమారు 4,860 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి 35 మంది రిసోర్స్ పర్సన్లతో పాటు ఇటీవల నియమించబడ్డ 39 మంది స్పెషల్ టీచర్లచే సేవలందిస్తున్నారు. అందులో భాగంగా జిల్లాలోని ప్రతీ మండలంలో ఏర్పాటు చేసిన భవిత కార్యాలయాల్లో ఫిజియోథెరపీ క్యాంపులు, ఎన్ఆర్ఎస్టీసీ నిర్వహణ, స్పీచ్ థెరపీ, ఎర్లీ ఇంట్రవెన్షన్ తదితర సేవలను అందిస్తున్నారు. అలాగే పలు మండలాల్లో కొత్తగా భవిత కేంద్రాల నిర్మాణాలతోపాటు పలు మండలాల్లో మరమ్మతులు చేపడుతున్నారు. టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ (టీఎల్ఎం) కొనుగోలుకు మంజూరు నిధులు సైతం చేసారు. విద్యార్థులకు ఉచితంగా యూనిఫాం, రవాణా భత్యం పుస్తకాలు, మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు. వివిధ వైకల్యాలతో బాధపడుతున్న ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు కాన్పూర్లోని ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (అలిమ్కో) ఆధ్వర్యంలో ట్రై సైకిల్స్, వీల్ చెయిర్స్, చంక కర్రలు, వినికిడి యంత్రాలు, సీపీ వాకర్లు, కృత్రిమ అవయవాలు అందిస్తున్నారు. చిన్నచిన్న వైకల్యాలు కలిగి ఉన్నవారిని గుర్తించి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయిస్తున్నారు. నేడు ప్రత్యేక కార్యకమ్రాలు.. జిల్లాల్లోని భవిత కేంద్రాల్లో బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి జిల్లా స్థాయి అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లోను ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు క్రీడలు, చిత్ర లేఖనం పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. సమగ్ర శిక్ష సహిత విద్యావిభాగం ఆధ్వర్యంలో కొనసాగుతున్న పలు కార్యక్రమాలలో విలీన విద్యకే మొదటి ప్రాధాన్యతనిస్తున్నాం. ప్రతీ విద్యార్థి సాధారణ విద్యార్థుల తో సమానంగా పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకొని స మాజంలో గౌరవంగా నిలబడే విధంగా శిక్షణనిస్తున్నాము. – అశోక్, డీఈవో, సర్వశిక్షా అభియాన్ పీవో, నిజామాబాద్భవిత కేంద్రాల్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లలను తీర్చి దిద్దడానికి ఐఈఆర్పీల సహకారంతో అన్ని రంగాల్లో శిక్షణనిస్తున్నాము. సాధారణ విద్యార్థులతో పాటు సాధారణ తరగతి గదిలో చదువుకొనేలా శిక్షణనిస్తున్నాము. – పడకంటి శ్రీనివాస్రావు, జిల్లా ఇన్చార్జి కోఆర్డినేటర్, సహిత విద్యావిభాగం, సమగ్ర శిక్ష -
ఒకేచోట.. పరిశోధన, విస్తరణ, బోధన
● వ్యవసాయాభివృద్ధిలో ప్రత్యేకతను చాటుతున్న ‘రుద్రూర్’ ● నేడు జాతీయ వ్యవసాయ విద్య దినోత్సవంరుద్రూర్: వ్యవసాయాభివృద్ధిలో రుద్రూర్ ప్రాంతం ప్రత్యేకతను చాటుతోంది. ఈప్రాంతంలో ఏర్పాటు చేసిన చెరుకు, వరి పరిశోధన కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ కళాశాలతో ఒకేచోట వ్యవసాయంలో పరిశోధనలు, కొత్తవంగడాల విస్తరణ, బోధన తరగతులు కొనసాగుతూ వ్యవసాయానికి సాయం చేస్తున్నాయి. నేడు జాతీయ వ్యవసాయ విద్య దినోత్సవం సందర్భంగా రుద్రూర్లోని కేంద్రాలపై ప్రత్యేక కథనం. నిజామాబాద్ జిల్లాలోని రుద్రూరు ప్రాంతంలో వ్యవసాయ అభివృద్ధికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన బోధన, పరిశోధన, విస్తరణ సంస్థలు కొనసాగుతున్నాయి. మండల కేంద్రానికి సమీపంలో 1932లో ప్రాంతీయ చెరకు, వరి పరిశోధనా స్థానం ఏర్పాటు చేశారు. నాటి నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు నిర్వహించి వరి, చెరకులో దిగుబడి పెంచే నూతన వండాలను రూపొందించి రైతులకు పరిచయం చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు నూతనంగా రూపొందించిన వంగడాల గూర్చి విస్తరించడంలో కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన పాత్ర పోషిస్తోంది. దీన్ని 2004లో ఇక్కడనే ఏర్పాటు చేశారు. వ్యవసాయ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జిల్లా రైతాంగానికి అందించడం, క్షేత్ర ప్రదర్శనలు, శిక్షణ కార్యక్రమాలు, వ్యవసాయ విస్తీర్ణ కార్యక్రమాల ద్వారా రైతులను చైతన్య పరుస్తోంది. అలాగే రైతులకు స్వయం ఉపాధి పెంపొందించుకొనే దీర్ఘకాలిక శిక్షణా తరగతులు నిర్వహిస్తుంది. వ్యవసాయ కళాశాలలు.. విత్తన సాంకేతిక పరిజ్ఞాన పాలిటెక్నిక్ కళాశాలను 2005లో స్థాపించబడినప్పటికీ, దీన్ని 2022లో వ్య వసాయ పాలిటెక్నిక్ కళాశాలగా మార్చారు. ఈ క ళాశాలలో విద్యార్థులకు తరగతుల్లో పాఠాలు చెప్పడమే కాకుండా వ్యవసాయ పరిజ్ఞానాన్ని పెంపొందించడం, పంట విత్తుట నుంచి కోత వరకు అనుభ వం వచ్చేలా బోధన చేస్తారు. అలాగే 2015లో ఆహా ర రంగంలో డిమాండ్ ఆధారిత, విలువ ఆధారిత నాణ్యమైన సాంకేతిక విద్యను అందించే లక్ష్యంతో 2015లో ఫుడ్ సైన్స్ టెక్నాలజీ కళాశాలను ఏర్పాటు చేశారు. కళాశాలలో ఆధునిక ప్రయోగశాలలు, మౌ లిక సదుపాయాలు విద్యార్థులకు మంచి సైద్ధాంతి క, ఆచరణాత్మక జ్ఞానాన్ని అందిస్తున్నాయి. ఈ కళాశాల 2021లో న్యూఢిల్లీలోని ఐసీఎఆర్ ద్వారా ’ఎ’ గ్రేడ్ గుర్తింపు పొందింది. రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం పరిశోధన, విస్తరణ, బోధన కార్యకలాపాలలో నిమగ్నమై ఉంది. చెరుకు, వరి వంటి పంటలకు సంబంధించిన కొత్త వంగడాలను అభివృద్ధి చేయడంతోపాటు, క్షేత్రస్థాయిలో రైతులకు పరిచయం చేస్తుంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు పంటలు చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడిని ఇచ్చే రకాలను రూపొందిస్తారు. శాస్త్రవేత్తలు, విస్తరణాధికారులు, రైతులతో సమన్వయం చేసుకుంటూ పని చేస్తుంది. – పవన్ చంద్రారెడ్డి, అధిపతి, వ్యవసాయ పరిశోధన కేంద్రం, ప్రిన్సిపాల్, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల -
ఆలూరులో భారీ చోరీ
● 14 తులాల బంగారం, అర కిలో వెండి, రూ.లక్ష నగదు ఎత్తుకెళ్లిన దుండగులుఆర్మూర్ టౌన్: ఆలూర్ మండల కేంద్రంలోని తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చొరబడి భారీ చోరీకి పాల్పడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఆలూర్లో నివాసం ఉండే కట్టే మిషన్ పుల్లెల రాము తన భార్య, పిల్లలతో కలిసి నవంబర్ 27న వారి మామ దినకర్మ కోసం వేరే ఊరికి వెళ్లారు. డిసెంబర్ 2 మంగళవారం సాయంత్రం వారు తిరిగి ఇంటికి రాగా తలుపులకు వేసిఉన్న తాళాలు పగులగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా, ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి, బీరువా, డ్రెస్సింగ్టేబుల్లో ఉన్న 14 తులాల బంగారం, అరకిలో వెండి, రూ.లక్ష నగదును చోరీ చేశారు. ఈమేరకు బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. -
పల్లె పాలనకు 61 ఏళ్లు
● ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1964లో తొలిసారి పంచాయతీ ఎలక్షన్లు ● మొదట్లో పరోక్ష పద్ధతిలో సర్పంచ్ ఎన్నికడిచ్పల్లి: పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఏర్పడి 61 ఏళ్లు పూర్తవుతోంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీల ఏర్పాటులో కాలానుగుణంగా ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. 1957లో భారత ప్రభుత్వం పంచాయతీ రాజ్ సంస్థల ఏర్పాటు కోసం బల్వంతరాయ్ మెహతా కమిటీని నియమించింది. ఈ కమిటీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం మూడంచెల (గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్) వ్యవస్థలను ఏర్పాటు చేయాలని చేసిన సూచించగా, జాతీయాభివృద్ధి సంస్థ 1958లో ఆమోదించింది. దీంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పంచాయతీ రాజ్ సంస్థల చట్టం ఏర్పాటు చేసింది. దీన్ని మొట్టమొదటగా రాజస్థాన్ రాష్ట్రం అమలు చేయగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1959 అక్టోబర్ 2న అమలు చేసింది. వార్డు సభ్యులే సర్పంచ్ను ఎన్నుకునేలా.. ఆంధ్రప్రదేశ్లో 1964లో సమగ్ర గ్రామ పంచాయతీల చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం 500 పైగా జనాభా ఉన్న గ్రామాలను ఒక పంచాయతీగా ఏర్పాటు చేశారు. జనాభా ఆధారంగా 5 నుంచి 17 మంది వరకు వార్డు సభ్యులుండవచ్చని పేర్కొన్నారు. 1964లో సర్పంచ్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరిగాయి. వార్డు సభ్యులను ఓటర్లు ఎన్నుకుంటే, ఈ వార్డు సభ్యులు సర్పంచ్ను ఎన్నుకునేవారు. ఎన్నికై న సర్పంచ్లు కలిసి సమితి ప్రెసిడెంట్ ను ఎన్నుకునేవారు. సమితి ప్రెసిడెంట్లు జిల్లా పరిషత్ అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని ఎన్నుకునేవారు. 1976 వరకు ఇదే పద్ధతి కొనసాగింది. వీరి ఎన్నికలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఉండేది. 1978 నుంచి ప్రత్యక్ష పద్ధతి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1978లో నరసింహం కమిటీని ఏర్పాటు చేసింది. సర్పంచ్లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని ఈ కమిటీ సూచించింది. దీంతో అప్పటి నుంచి సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ ప్రత్యక్ష పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు. 1992లో అమల్లోకి వచ్చిన 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామ పంచాయతీల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగల వారికి జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు కల్పించాలని, అలాగే 1/3వ వంతు మహిళలకు రిజర్వు చేయాలని సూచించింది. అప్పటి నుంచి గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ లలో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మండల వ్యవస్థతో మార్పులు.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1986 ఫిబ్రవరి 15న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తాలూకాలను రద్దు చేసి మండల వ్యవస్థ ఏర్పాటు చేశారు. మండలాలకు 1987లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. మండల పరిషత్ అధ్యక్షుడిని నేరుగా ఎన్నుకున్నారు. దీనిలో సభ్యులుగా ఆయా మండలాల పరిధిలోని సర్పంచ్లు ఉండే వారు. ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్లను ఎన్నుకునేవారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 ద్వారా అదే సంవత్సరం నుంచి గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ అనే మూడంచెల వ్యవస్థ రూపొందుకుంది. మండల పరిషత్లో సర్పంచ్లను సభ్యులుగా తొలగించి వారి స్థానంలో ఎంపీటీసీలను, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో ఎంపీపీలను సభ్యులుగా తొలగించి జెడ్పీటీసీలను సభ్యులుగా చేర్చారు. మెజార్టీ ఎంపీటీసీలు, ఎంపీపీని, మెజార్టీ జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్లను ఎన్నుకోవడం ప్రారంభమైంది. అప్పటి నుంచి నేటి వరకు అదే ప్రక్రియ కొనసాగుతోంది. -
రైతుల వెన్ను విరిచేలా విత్తన చట్టం ముసాయిదా
● విత్తన ధరల నిర్ణయం కంపెనీల చేతుల్లో ● రైతు సంక్షేమ కమిషన్ మెంబర్ గడుగు గంగాధర్ డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నూతన విత్తన చట్టం ముసాయిదా రైతుల విత్తన హక్కును కార్పొరేట్ పరం చేయబోందని రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ మెంబర్ గడుగు గంగాధర్ ఒక ప్రకటనలో విమర్శించారు. కేంద్రం విత్తన చట్ట ముసాయిదాను ప్రజల ముందు ఉంచిందని, ఈ నెల 11 వరకు అభిప్రాయాలు చెప్పాలని కోరిందన్నారు. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా కొత్త విత్తన చట్టం తీసుకవస్తున్నామని కేంద్రం ప్రకటించిందని, నిజానికి ఇది రైతుల నడ్డి విరిచి విత్తన కంపెనీలకు మేలు చేసేవిధంగా ఉందన్నారు. నకిలీ విత్తనాలు, నాణ్యత లేని విత్తనాల వలన రైతులకు నష్టం జరిగితే నష్టపరిహారం ఇచ్చే నిబంధనలు ఈ బిల్లులో లేవన్నారు. అత్యవసర పరిస్థితులలో తప్ప విత్తనాల ధరలను నిర్ణయించే అధికారం ప్రభుత్వాలకు లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై చట్టం చేయాలని కమిషన్ సూచిస్తుందన్నారు. విత్తనాలను సాగు చేసే రైతులను ఆదుకోవడానికి ఈ బిల్లులో నిబంధనలు లేవని విమర్శించారు. రాష్ట్రంలో సుమారు ఐదు లక్షల మంది రైతులు విత్తన సాగు చేస్తున్నారని ఇటీవల కాలంలో వీరు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈనేపథ్యంలో ములుగు ప్రాంత గిరిజన రైతులకు రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చొరవతో రూ. నాలుగు కోట్ల నష్ట పరిహారం ఇప్పించామన్నారు. -
పలు గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఒకే నామినేషన్
● పోటీ లేని సుమారు 9 సర్పంచ్ స్థానాలు ● ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించడమే తరువాయిమోపాల్(నిజామాబాద్రూరల్): నిజామాబాద్ రూరల్ మండలంలోని పాల్దా, లింగి తండా, ధర్మారం తండా సర్పంచ్ స్థానాలకు ఒకటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. పాల్దా జనరల్ రిజర్వ్ కావడంతో మున్నూరు ప్రభాకర్, లింగి తండా ఎస్టీకి రిజర్వ్ కావడంతో మాలావత్ రమేష్, ధర్మారం తండా ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడంతో బాదావత్ కల్పన మాత్రమే నామినేషన్ వేశారు. దీంతో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనట్లేనని ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు పేర్కొంటున్నారు. ఇక అధికారికంగా ప్రకటించాల్సి ఉందంటున్నారు. కానీ ఆయా గ్రామాల్లో ఉపసర్పంచ్ స్థానం కోసం వార్డు స్థానాలకు ఒకటికి మించి నామినేషన్లు దాఖలయ్యాయి. డిచ్పల్లి మండలంలో.. డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): మండలంలోని 34 గ్రామ పంచాయతీలకు గానూ నాలుగు గ్రామాల్లో సర్పంచ్, 306 వార్డు స్థానాలకు గానూ 90 స్థానాలకు ఒకటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. నర్సింగ్పూర్ (కొత్తపేట) గ్రామ సర్పంచ్గా ఎంకాయల శోభ, కొరట్పల్లి తండా సర్పంచ్గా బానోత్ సంగీత, నక్కలగుట్ట తండా సర్పంచ్గా లకావత్ దేవీసింగ్, మిట్టపల్లి తండా సర్పంచ్గా బుక్య సెవంత నవుసీరాం ఒక్కరే నామినేషన్ వేశారు. దీంతో ఆ గ్రామాల్లో సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లేనని అధికారులు పేర్కొన్నారు. నామినేషన్ల విత్డ్రా అనంతరం మరో రెండు గ్రామాల్లో సర్పంచ్లు ఏకగ్రీవం అయ్యే అవకాశాలున్నాయి. మోపాల్: మండలంలోని నర్సింగ్పల్లి సర్పంచ్ స్థానానికి ఒక్కరే నామినేషన్ దాఖలుచేశారు. ఎస్సీ (మహిళ)కు రిజర్వ్ కావడంతో గ్రామపెద్దలు కలిసి చారుగొండ లిఖితతో నామినేషన్ దాఖలు చేయించారు. 10 వార్డు స్థానాలకుసైతం ఒక్కటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో గ్రామంలో సర్పంచ్, వార్డుస్థానాలన్నీ ఏకగ్రీవమైనట్లే. కాగా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.మాక్లూర్: మండలంలోని సింగంపల్లి తండా గ్రా మ పాలకవర్గం ఏకగ్రీవమైంది. సర్పంచ్ అభ్యర్థి గా జాదవ్ శాంత, వార్డు సభ్యులకు కూడ ఒక్కోక్కరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. తండాలో నామినేషన్ల పక్రియ ప్రారంభమైనప్ప టి నుండి చివరి రోజైన మంగళవారం వరకు మ రెవరూ నామినేషన్లు వేయలేదు. దీంతో తండా పాలకవర్గం ఏకగ్రీవం లాంఛనమే అయింది. దీంతో తండావాసులు పెద్ద ఎత్తున టపాకాయ లు పేల్చి సంబురాలు జరుపుకున్నారు. ఇక తండా సర్పంచ్గా జాదేవ్ శాంత, ఉప సర్పంచ్గా బానోత్ సంజీవ్, 8 వార్డు సభ్యు లు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించమే మిగిలింది. -
నేటి నుంచి మూడో విడత నామినేషన్లు
● 57 సెంటర్లలో ఏర్పాట్లు పూర్తిసుభాష్నగర్: మూడో విడత జీపీ ఎన్నికల కోసం నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ టి వినయ్ కృష్ణా రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా రు. సర్పంచ్, వార్డు స్థానాలకు బుధవా రం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నా రు. ఇందు కోసం 59 కేంద్రాలను ఏర్పాటుచేశారు. 5వ తేదీన సాయంత్రం 5గంట లకు నామినేషన్ల ప్రక్రియ ముగియ నుండగా, 6న పరిశీలన, 9న ఉపసంహరణకు గడువు ఉంటుంది. 17న పోలింగ్, కౌంటింగ్, ఫలితాల ప్రకటన ఉంటుంది. -
అడవిని వీడిన మావోయిస్టు నేత
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : సీపీఐ మావోయిస్టు పా ర్టీలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సౌత్ బస్తర్ చైతన్య నాట్య మంచ్ (సీఎన్ఎం)లో డివిజన్ కమిటీ సెక్రెటరీగా పనిచేస్తున్న జిల్లాకు చెందిన మా వోయిస్ట్ పార్టీ నేత లోకేటి రమేశ్ అలియాస్ అశోక్ అలియాస్ రాజేశ్వర్ అలియాస్ నరేందర్ జనజీవన స్రవంతిలో కలిశాడు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జనగామ డీసీపీ సమక్షంలో మంగళవారం ఆయన పోలీసులకు లొంగిపోయాడు. కామారెడ్డి మండలం ఇస్రోజీవాడికి చెందిన లోకేటి చందర్ అలియాస్ స్వామి అలియాస్ ప్రభాకర్ మూడున్నర దశాబ్దాల క్రితం అప్పటి పీపుల్స్వార్లో చేరి అంచెలంచెలుగా ఎదిగాడు. జిల్లా కా ర్యదర్శిగా పనిచేసిన స్వామి అలియాస్ చందర్ను పార్టీ దండకారణ్యానికి బదిలీ చేసింది. ఆయన వెళ్లి న కొద్దికాలానికే భార్య సులోచన కూడా అడవిబాట పట్టింది. ఎనిమిదేళ్ల క్రితం సులోచన అనారోగ్యంతో మృతిచెందింది. వారి పిల్లలు లోకేటి రమేశ్, లోకే టి లావణ్యలు బంధువుల ఇంట్లో ఉండి చదువుకున్నా రు. 2005లో రమేశ్, లావణ్యలు కూడా తల్లిదండ్రులు నడిచిన బాటలోనే నడిచా రు. నలుగురు కూడా మావోయిస్టు పార్టీలో పనిచేశారు. కాగా స్వామి కొడుకు రమేశ్ అలియాస్ అశోక్ అలియాస్ రాజేశ్వర్ అలియాస్ నరేందర్ అజ్ఞాతంలోకి వెళ్లిన తరువాత ఏడాది కాలం పాటు సీసీఎం పోతుల కల్పన దగ్గర పనిచేసి చైతన్య నాట్య మంచ్కు బదిలీ అయ్యాడు. 2008లో ఏరియా కమిటీ మెంబర్గా పదోన్నతి పొంది 2011 వరకు చైతన్య నాట్య మంచ్లో పనిచేశాడు. 2012లో ఊసూర్ ఎల్వోఎస్ కమాండర్గా బదిలీ అయ్యాడు. 2013లో డీవీసీఎంగా పదోన్నతి పొంది పామేడ్ ఏరియా కమిటీకి సెక్రె టరీగా వెళ్లాడు. 2019 లో జేగురుగొండ ఎల్వోఎస్ కమాండర్గా పనిచేశాడు. 2021లో చైతన్య నాట్య మంచ్ డీవీసీఎస్ సెక్రెటరీగా పదోన్నతి పొంది మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ పరిధిలో ఇప్పటి దాకా కొనసాగినట్టు పోలీసులు తెలిపారు. 2016లో పామేడ్ ఎల్వోఎస్ కమాండర్ కమలను వివాహం చేసుకో గా ప్రస్తుతం ఆమె జైలులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రమేశ్పై రూ.8 లక్షల రివార్డు ఉంది. జనగామ జిల్లాలో లొంగిపోయిన జిల్లాకు చెందిన లోకేటి రమేశ్ కుటుంబమంతా మావోయిస్టు పార్టీలోనే.. జైలులో భార్య కమల దండకారణ్యంలో వెస్ట్ జోనల్ బ్యూరో సెక్రెటరీగా పనిచేస్తున్న తండ్రి స్వామి -
రెండో విడత నామినేషన్లు 4942
జిల్లాలో ‘పల్లెపోరు’ ఊపందుకుంది. మొదటి విడత, రెండో విడత ఎన్నికలు జరగను న్న జీపీలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. మొదటి విడత నామినేష న్ల ఉపసంహరణకు నేడు మూడు గంటల వరకు అవకాశం ఉంది. మూడో విడతకు సంబంధించి నామి నేషన్ల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది. సుభాష్నగర్: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా రెండో విడత నామినేషన్ల స్వీకరణ మంగళవారం సాయంత్రంతో ముగిసింది. చి వరిరోజు కావడంతో నామపత్రాల స్వీకరణ రాత్రి వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటలలోగా కేంద్రంలోకి వచ్చిన వారికి అధికారులు టోకెన్లు అందించి దరఖాస్తులు స్వీకరించారు. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్తోపాటు ఆర్మూర్ డివిజన్లోని జక్రాన్పల్లి మండలంలోని 196 జీపీలు, 1,760 వా ర్డుస్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.తరలివచ్చిన అభ్యర్థులు నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు కావడం.. బుజ్జగింపుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో నామినేషన్ల దాఖలు కోసం అభ్యర్థులు పోటాపోటీగా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. చివరి రోజు సర్పంచ్ స్థానాలకు 596, వార్డు స్థానాలకు 2,400 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ స్థానాలకు మొత్తం 1,178, వార్డు స్థానాలకు 3,764 మంది నామినేషన్లు వేశారు. పరిశీలన.. బుధవారం నామపత్రాల స్క్రూటినీ ఉంటుంది. 6వ తేదీన మధ్యాహ్నం 3 గంటల్లోగా నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదేరోజు బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా ప్రకటించి గుర్తులను కేటాయిస్తారు. డిసెంబర్ 14న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారు. తొలి విడత ఉపసంహరణ నేడు.. బోధన్: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఇప్పటికే నామినేషన్ల స్క్రూటినీ పూర్తికాగా బుధవారం ఉప సంహరణ ప్రక్రియను చేపట్టనున్నారు. బోధన్ రెవెన్యూ డివిజన్లోని పది మండలాలతోపాటు నిజామాబాద్ డివిజన్ పరిధిలోని నవీపేట మండలంలోని 184 సర్పంచ్ స్థానాలకు 1156 నామినేషన్లు, 1642 వార్డు సభ్య స్థానాలకు 3,526 నామినేషన్లు దాఖలైనట్లు స్క్రూటినీ తరువాత అధికారులు తేల్చారు. బుధవారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 3 గంటలలోగా నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. ఎడపల్లి, బోధన్, వర్ని, కోటగిరి మండలాల్లోని ఏడు గ్రామాల సర్పంచ్ స్థానాలు సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు సర్పంచ్ స్థానాలకు 596.. వార్డు స్థానాలకు 2400 5 గంటల తర్వాత గేట్లు మూసివేత అభ్యర్థులకు టోకెన్లు అందజేసి దరఖాస్తులు తీసుకున్న అధికారులు రాత్రి వరకూ కొనసాగిన నామపత్రాల స్వీకరణ -
90 రోజుల ప్రణాళిక
● ఇంటర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు.. ● పెరిగిన హాజరు శాతం ● 75 శాతానికి పైగా సిలబస్ పూర్తి ఖలీల్వాడి: ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యా ర్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఇంటర్ బోర్డు ప్రత్యేక దృష్టిసారించింది. ప్రతి సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల ఉత్తీర్ణత శాతం అంతగా పెరగటం లేదు. ఈసారి మంచి ఫలితాలు రా బట్టేందుకు 90 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా రోజూ సాయంత్రం గంటపాటు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. విద్యార్థులను చదివించడంతోపాటు సందేహాలను నివృత్తి చేసేందుకు లెక్చరర్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఇప్పటికే సిలబస్ 75 శాతం కంటే ఎక్కువగా పూర్తికాగా, మిగితా సిలబస్ను త్వరగా పూర్తిచేసి విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టేలా చర్యలు చేపట్టారు. ఎఫ్ఆర్ఎస్తో మెరుగైన హాజరు... ఈ ఏడాది నుంచి విద్యార్థులకు ముఖగుర్తింపు విధానం(ఎఫ్ఆర్ఎస్) హాజరు తీసుకుంటున్నారు. 70 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని ఆడ్మిషన్ల సమయంలోనే ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు విద్యార్థులకు స్పష్టంగా తెలియజేశారు. గైర్హాజరైన విద్యార్థుల వివరాలను తల్లిదండ్రులకు లెక్చరర్లు ఎప్పటికప్పుడు సమాచారం అందించారు. దీంతో కాలేజీకి వచ్చే విద్యార్థుల సంఖ్య పెరిగింది. నెలకోసారి తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి విద్యార్థులను చదివించేలా అవగాహన కల్పిస్తున్నారు. దీనికి తోడు ఏకాగ్రత పెరిగేందుకు వారానికి మూడు రోజులపాటు యోగా నేర్పిస్తున్నారు. ప్రణాళిక అమలు చేశాం ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు 90 రోజుల ప్రణాళిక అమలు చేశాం. రోజుకో సబ్జెక్టు చొప్పున మూడు నెలలపాటు అన్ని సబ్జెక్టులను చదివిస్తాం. నవంబర్ నుంచి పకడ్బందీగా అమలుచేయాలని లెక్చరర్లకు ఆదేశాలు ఇచ్చాం. – రవికుమార్, డీఐఈవో, నిజామాబాద్జిల్లాలో ఇంటర్ కాలేజీలు -
నిబంధనలు పాటించాలి
నిజామాబాద్ అర్బన్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల స్క్రూటినీలో నిబంధనలను పాటించా లని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. రూరల్ మండలంలోని ఆకుల కొండూరు గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఆయన మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. నామపత్రాల స్వీకరణ, దాఖలైన నామినేషన్లు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సందేహాలు ఉంటే పై అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని, తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నికల సిబ్బందికి సూచించారు. -
మోసమే అతని వృత్తి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నకిలీ కంపెనీలు సృష్టించి ఉపాధికోసం గల్ఫ్ వెళ్లాలనుకునే వారిని దో చుకుంటున్నాడు కామారెడ్డి జిల్లా ఉత్తునూరుకు చెందిన దొండిగల భూమేశ్. పోలీసు కేసులు నమోదై నా అతడి ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. కామారెడ్డి జిల్లా ఉత్తునూరుకు చెందిన దొండిగల భూమేశ్ కుటుంబం పన్నెండేళ్లుగా నిజామాబాద్లో నివసిస్తుండగా, అతడు ఎనిమిదేళ్లుగా దుబాయిలో ఉంటున్నాడు. 2022 మార్చి నుంచి ఆగస్టు మధ్యలో డొంకేశ్వర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన అర్గుల భోజారాం అనే మధ్యవర్తి ద్వారా గల్ఫ్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని జగిత్యా ల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన 80 మంది వద్ద రూ.5 కోట్లు (ఒక్కొక్కరి నుంచి రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలు) తీసుకున్నాడు. ఇందులో 40 మందిని అసలు తీసుకెళ్లలేదు. మరో 40 మందిని మాత్రం విజిట్ వీసా ద్వారా దుబాయికి తీసుకెళ్లి.. మీరెవరో తెలియదంటూ బుకాయించడంతోపాటు బెదిరింపు ధోరణితో వ్యవహరించా డు. చివరకు ఉద్యోగం ఇచ్చే కంపెనీపై కేసు అ యిందని చెప్పి కొరియర్ ద్వారా 40 మందికి టిక్కెట్లు, పాస్పోర్టులు పంపాడు. 30 మంది పేర్ల తో దుబాయిలో క్రెడిట్ కార్డులు తీసుకుని రూ.6 కో ట్ల రుణాలు తీసుకున్నాడు. డబ్బులు కట్టాలంటూ దుబాయి బ్యాంకుల నుంచి భారత్లో ఉన్న సదరు బాధితులకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. రుణాలు తీసుకున్న కార్మికులు భారత్కు పారిపోయారని చె ప్పి దుబాయిలో సదరు క్రెడిట్ కార్డుల మీద ఇన్సురెన్స్ సైతం క్లెయిమ్ చేశాడు ఈ మహాముదురు. 2014లోనూ వేల్పూర్కు చెందిన 60 మందిని ఇదే తరహాలో భూమేశ్ మోసం చేశాడు. 15 ఏళ్లుగా భూమేశ్ దగా చేస్తూనే ఉన్నాడు. ‘సాక్షి’ కథనాలతో కేసులు భూమేశ్ చేసిన మోసాలపై 2024 జనవరి 24, 25 తేదీల్లో కథనాలు రావడంతో జగిత్యాల జిల్లా మెట్పల్లి, కామారెడ్డి జిల్లా బీర్కూర్, నిజామాబాద్ జిల్లా నందిపేట, నవీపేట, మోర్తాడ్, వేల్పూర్, ఆర్మూర్ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కాగా 2018 నుంచి భూమేశ్ దుబాయిలో ఉంటుండగా, పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా పీడీ యాక్ట్ పెట్టడంతోపాటు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి ఇంటర్పోల్ ద్వారా భూమేశ్ను భారత్కు రప్పించాలని బాధితులు కోరుతున్నారు. మరోవైపు నిజామాబాద్లో ఉంటు న్న భూమేశ్ భార్య స్వప్న మాత్రం తమపైనే అక్రమ కేసులు పెట్టించేందుకు కొందరు రాజకీయ నేప థ్యం ఉన్న వ్యక్తులు, మరో రిటైర్డ్ పోలీసు అధికారి ద్వారా ప్రయత్నాలు చేసిందని బాధితులు చెబుతున్నారు. ఇందల్వాయికి చెందిన రమేశ్ అనే వ్యక్తిని దుబాయిలో భూమేశ్ వేధించడంతో గుండెపోటు తో మృతి చెందినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. పేరు మార్చుకొని.. మోసాల నేపథ్యంలో 2014లో దొండిగల భూమేశ్ పాస్పోర్టును (కామారెడ్డి జిల్లా అడ్రస్తో ఉంది) బీర్కూర్ పోలీసులు సీజ్ చేసి నందిపేట పోలీసు స్టేషన్కు పంపారు. దీంతో 2015లో భార్య స్వప్న తల్లిదండ్రుల ఇంటిపేరును వాడుకుని పబ్బ భూమేశ్రెడ్డి పేరుతో హైదరాబాద్ అడ్రస్తో అక్రమంగా మరో పాస్పోర్టు తీసుకున్నాడు. ప్రస్తుతం అతడి వద్ద ఉన్న పాస్పోర్టు సైతం 2025 నవంబర్ 18వ తేదీకి ఎక్స్పైరీ అయ్యింది. అయినప్పటికీ భూమేశ్ దుబాయిలోనే ఉన్నాడు. బంగారం పేరిట మరో మోసం దుబాయి పర్యటనకు వెళ్లిన ఉత్తర భారతదేశానికి చెందిన కొన్ని కుటుంబాల వారిని రూ.60 వేలకే తులం బంగారం ఇప్పిస్తానని చెప్పి రూ.60 లక్షలు తీసుకొని మోసం చేయగా, బాధితులు దుబాయ్లో కేసు పెట్టారు. భూమేశ్ను అక్కడి పోలీసులు నెల రోజుల క్రితం జైల్లో పెట్టారు. అయితే డబ్బులు ఇచ్చేస్తానని, కేసు విత్డ్రా చేసుకోవాలని నిజామాబాద్లో ఉన్న భూమేశ్ భార్య స్వప్న ఉత్తరాది రాష్ట్రాల వారితో బేరం కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. గల్ఫ్దేశాల్లో ఉద్యోగాల పేరుతో దగా దుబాయిలో తిష్ట వేసి దోచుకుంటున్న ఘనుడు నకిలీ కంపెనీలు సృష్టించి ఆగడాలు పాస్పోర్ట్ సీజ్ చేసినా మరో పాస్పోర్ట్ పొందిన వైనం ఇప్పటికే జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో పబ్బ భూమేశ్పై కేసులు -
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
నిజామాబాద్ అర్బన్: గ్రామ పంచాయతీ ఎన్నికల ను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. ఎన్ని కల నిర్వహణపై మంగళవారం ఆమె హైదరాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మొద టి, రెండో విడత నామినేషన్ల స్వీకరణ, దాఖలైన నామినేషన్ల వివరాలను కమిషనర్ తెలుసుకున్నా రు. రెండో విడత నామినేషన్ల పరిశీలన, మూడో విడతకు సంబంధించిన స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఎన్నికల సిబ్బంది కేటా యింపు, పోస్టల్ బ్యాలెట్, బ్యాలెట్ బాక్సులు, శాంతిభద్రతలు తదితర అంశాలపై సమీక్షించారు. కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులతో కమిటీలు ఏ ర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఎన్నిక ల సాధారణ పరిశీలకుడు జీవీ శ్యాంప్రసాద్ లాల్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికల నిర్వహణ ప్రక్రి య సజావుగా జరుగుతోందన్నారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, నోడల్ అధికారులు, ఎన్నికల పరిశీలకులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
వేలం వేస్తే వేటే..
మోర్తాడ్(బాల్కొండ): గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏకగ్రీవ ఎన్నికలపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించనుంది. గ్రామాల్లో అభివృద్ధి పనులు, నిధుల కోసం ఏకగ్రీవ ఎన్నికల పేరుతో పదవులను వేలం వేసే గ్రామాభివృద్ధి కమిటీలపై చర్యలు తీసుకోవడంతోపాటు ఎంపిక చేసిన ప్రజాప్రతినిధులను కొనసాగించడానికి ఉన్నతాధికారులు ఆమోదం తెలిపే అవకాశం లేదు. పదవుల వేలం ద్వారా ప్రజాప్రతినిధులను ఎంపిక చేస్తే వేటు పడే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో వేలం పాటలను నిర్వహించిన ఉమ్మడి మోర్తాడ్ మండలంలోని పలు గ్రామాభివృద్ధి కమిటీలపై పోలీసు లు క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏకగ్రీవాల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని అధికారులు సూచిస్తున్నారు. గ్రామాల్లో జనాభా ఆధారంగా సర్పంచ్ పదవికి వేలం పాటలో రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వసూలు చేసిన ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. ఉప సర్పంచ్ పదవికి రూ.2 లక్షల వరకు, వార్డు స్థానాలకు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వేలం పాట ద్వారా పదవులు అప్పగించారు. మోర్తాడ్, కమ్మర్పల్లి, ఏర్గట్ల, మెండోరా, ముప్కాల్, బా ల్కొండ, వేల్పూర్, భీమ్గల్, జక్రాన్పల్లి, ఆర్మూర్, నందిపేట్ మండలాల్లో వేలం పాటల ద్వారా పదవులను అంగట్లో సరుకుల్లాగా అమ్ముకున్న ఘటనలు గతంలో అనేకం చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వేలం పాట నిర్వహించే వీడీసీల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు నిఘా సారించారు. ఈసారి ఏకగ్రీవాలకు ప్రోత్సాహకం ప్రకటించకపోయినా రాజకీ య కక్షలను నివారించాలనే ఉద్దేశంతో ఏకగ్రీవాలకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఏకగ్రీవాలు జరిగిన గ్రామాలలో వాస్తవ పరిస్థితులను అధికారులు తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక అందించాల్సి ఉంటుంది. అందరూ సమష్టి నిర్ణయం తీసుకుని ఏకగ్రీవంగా ఎంపిక చేసిన ప్రజాప్రతినిధులను ఎన్నికల సంఘం ఆమోదించే అవకాశం ఉంది. గ్రామంలో అభివృద్ధి పనులు, నిధుల కోసమంటూ సర్పంచ్, వార్డు పదవులను వీడీసీలు బలవంతంగా వేలం వేస్తే వేటు తప్పదని అధికారయంత్రాంగం హెచ్చరిస్తోంది. జిల్లాలోని పలు మండలాల్లో వేలం పాట ద్వారా పదవులను కట్టబెట్టిన ఘటనలు అనేకం ఉన్నాయి. కొన్ని వీడీసీలపై క్రిమినల్ కేసులు సైతం నమోదు కాగా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఏకగ్రీవాలు జరిగిన గ్రామాల్లోని పరిస్థితులను అధికారులు తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తరువాతే ఆమోదం లభిస్తుంది. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటారు సర్పంచ్, వార్డు స్థానాలకు ఎక్కడైనా వేలం పాట నిర్వహిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. వీ డీసీలు వేలం పాటలు నిర్వహించకుండా సహకరించాలి. పదవులకు వేలం వేయడం చట్టాన్ని ఉల్లంఘించినట్లే. అలాంటి విధానం సమంజసం కాదు. – సత్యనారాయణ, సీఐ, భీమ్గల్వేలం పాటలు చట్ట విరుద్ధం వేలం పాటల ద్వారా సర్పంచ్, వార్డు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడం చట్ట విరుద్ధం. సమష్టిగా అందరూ యోగ్యులైన వారిని ఎంపిక చేస్తే ఎ లాంటి ఇబ్బంది లేదు. ఎక్కడైనా వేలం పాట జరి గితే వాటిని గుర్తించి ఎన్నికల సంఘానికి వివరాల ను అందిస్తాం. – తిరుమల, ఎంపీడీవో, మోర్తాడ్ ఏకగ్రీవాల పేరుతో పదవులు కట్టబెడితే ఎన్నిక రద్దు చేసే అవకాశం సమష్టి నిర్ణయమని పరిశీలనలో తేలితేనే అధికారుల ఆమోదం వేలంపాట ఎన్నికలపై గతంలో చట్ట ప్రకారం చర్యలు -
అగ్రిమెంట్ రద్దు చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టండి
సుభాష్నగర్ : నిజామాబాద్ నగరంలోని పలు డివిజన్లలో సీసీ, బీటీ రోడ్ల ప్యాచ్ వర్క్స్, రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంపై కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. సకాలంలో పనులు చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లతో ఒప్పందం ఉన్నప్పటికీ పనులు ఎందుకు ప్రారంభించలేదని నిలదీశారు. పనులు చేపట్టకపోతే అగ్రిమెంట్ రద్దు చేసుకుని సదరు కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో ఇంజినీరింగ్ విభాగం అధికారులతో అభివృద్ధి పనుల ప్రగతిపై కలెక్టర్ సోమవారం సమీక్షించారు. జోన్ల వారీగా మంజూరైన పనుల గురించి ప్రసా విస్తూ.. ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి? ఏ మేరకు నిధులు ఖర్చు చేశారు? ఎక్కడెక్కడ సదుపాయాల పునరుద్ధరణ చేపట్టారు? తదితర వివరాలను ఆరా తీశారు. ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో రాజీ పడొద్దని, కాంట్రాక్టర్లకు వత్తాసు పలికే ధోరణిని అవలంబిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేయా లని సూచించారు. గడువులోగా పనులు పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని అన్నారు. విభాగాలుగా విభజించుకుని ముందుకు వెళ్లాలని అన్నారు. మళ్లీ సమీక్ష జరిపే సమయానికి అన్ని పనులు ప్రారంభమై, స్పష్టమైన పురోగతి కనిపించాలని అన్నారు. అదనపు కలెక్టర్ అంకిత్, నగర పాలక సంస్థ సహాయ కమిషనర్ రవీందర్ సాగర్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో రోడ్ల పనులపై కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అసహనం ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో రాజీపడొద్దని సూచన పనులపై కార్పొరేషన్లో సమీక్ష -
పొరపాట్లకు తావుండొద్దు
మోపాల్(నిజామాబాద్రూరల్): నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. గ్రామ పంచాయతీ రెండోవిడత ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాలతోపాటు జక్రాన్పల్లి మండలంలో నామినేషన్ల స్వీకరణ ప్ర క్రియ కొనసాగుతోంది. ఈనేపథ్యంలో జిల్లా ఎన్ని కల అధికారి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సోమ వారం మోపాల్ మండలం కులాస్పూర్, జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామ పంచాయతీలను ఆకస్మికంగా సందర్శించారు. నామినేషన్ల స్వీకరణ తీరును పరిశీలించి అధికారులకు సూచనలు చేశా రు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని, మొదటి అంకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలని అన్నారు. ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్డె స్క్ ఏర్పాటు చేశామని, అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే హెల్ప్డెస్క్ను సంప్రదించాలని సూచించారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. కలెక్టర్ వెంట ఎంపీడీవోలు, రిటర్నింగ్ అధికారులు ఉన్నారు. -
‘మహా’ సరిహద్దుల్లో గట్టి నిఘా
బోధన్: మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న బోధన్ రెవెన్యూ డివిజన్లో తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సరిహద్దుల్లో ఎన్నికల తనిఖీ బృందాల అధికారులు గట్టి నిఘా సారించారు. నగదు, మద్యం అక్రమ రవాణాకాకుండా తనిఖీ బృందాలు రంగంలోకి దిగాయి. సాలూర మండల కేంద్రం శివారులోని అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద ఎన్నికల ఎస్ఎస్టీ( స్టాటిక్ సర్వైలైన్స్ టీం) అధికారుల బృందం సోమవారం వాహనాలను తనిఖీ చేసింది. మహారాష్ట్ర వైపు నుంచి తెలంగాణ వైపు వచ్చే వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. ఎస్ఎస్టీ అధికారులు రణవీర్, ముఖీం, పోలీసులు రామస్వామి, విఠల్, వీఆర్ఏ కిషన్ తదితరులు ఉన్నారు. కలెక్టర్ను కలిసిన ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి నిజామాబాద్ నాగారం: కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి రవీందర్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రెగ్యులర్ బాధ్యతలు స్వీకరించారు. జడ్జిని కలిసిన బార్ అసోసియేషన్ ప్రతినిధులునిజామాబాద్ లీగల్: పోక్సో కోర్టు ఇన్చార్జి జడ్జిగా నియామకమైన బోధన్ అదనపు జి ల్లా జడ్జి వరూధిని నిజామాబాద్ బార్ అసో సియేషన్ ప్రతినిధులు అభినందించారు. బా ర్ అధ్యక్షుడు మామిళ్లసాయిరెడ్డి ఆధ్వర్యంలో జడ్జిని సోమవారం మర్యాదపూర్వ కంగా కలిశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడు తూ బార్, బెంచ్ సహకారంతో పోక్సో కేసు ల సత్వర పరిష్కారానికి ప్రయత్నిస్తానని అన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి మాణిక్రాజ్, ఉపాధ్యక్షుడు రెంజర్ల సురేశ్, మహిళా ప్రతినిధి ర మాదేవి, కార్యదర్శి ఝాన్సీరాణి, క్రీడల కార్యదర్శి మంజీత్ సింగ్, గ్రంథాలయ కార్యదర్శి శ్రీమన్, ఈసీ సభ్యులు ఆరెట్టి నారాయణ, ఐతె వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. కూరగాయల మార్కెట్ను తరలించాలి కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ పట్టణంలో వ్యాపా ర సంస్థలకు, ట్రాఫిక్కు ఇబ్బందికరంగా మారిన కూరగాయల మార్కెట్ను త రలించాలని వ్యాపారులు, అఖిల పక్షం ఆ ధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న తహసీల్దార్ మహమ్మద్ షబ్బీర్, సీఐ సత్యనారాయణ, ఎస్సైలు కే సందీప్, రాము, అనిల్రెడ్డి, రాజేశ్వర్ బస్టాండ్ వద్దకు చేరుకొని వ్యాపారులు, కూరగాయల విక్రేతలతో మా ట్లాడారు. మార్కెట్లో దుకాణాలు ఏర్పా టు చేసేందుకు వచ్చిన వారిని ఖాళీ స్థలాల కు, చిన్న దుకాణాలు, చిరు వ్యాపారులను తహసీల్ కార్యాలయం ఆవరణలోకి తరలించారు. కొంతమంది వ్యాపారులు తమ దుకాణాలను తరలించేందుకు మొండికేశారు. భీమ్గల్లోనే ఉన్న ట్రెయినీ ఐఏఎస్ కరోలిన్ చింగ్తి మావీ, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డి అక్కడి చేరుకుని మార్కెట్ వ్యాపా రులు, కూరగాయల విక్రయదారులతో చ ర్చించారు. వ్యాపారులు అద్దెకు తీసుకున్న మడిగెల లోపల మాత్రమే కూరగాయలు విక్రయించుకోవాలని సూచించారు. దుకాణాలను ఆనుకొని ఏర్పాటు చేసిన వ్యాపారాలను తొలగించకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
ప్రతి ఒక్కరినీ కలుపుకుని వెళ్లాలి
నిజామాబాద్అర్బన్: ప్రజలు పూర్తిగా కాంగ్రెస్కు మద్దతుగా ఉన్నారని, క్షేత్రస్థాయి నుంచి ప్రతి ఒక్కరినీ కలుపుకుని నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని లక్ష్మీ కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మహేశ్గౌడ్తోపాటు ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ సమక్షంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నగేశ్రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా బొబ్బిలి రామకృష్ణ బాధ్యతలు స్వీకరించా రు. ఈ సందర్భంగా మహేశ్గౌడ్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించాలన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్తోపాటు మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించాలన్నారు. జిల్లాకు పీసీసీ చీఫ్ పదవి మూడోసారి రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. కేసీఆర్ దీక్షను మధ్యలో విరమించారని, ఇప్పుడు దీక్షా దివస్ నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణను సోనియాగాంధీ ఇచ్చారని పేర్కొన్నారు. జిల్లాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృ ష్టి సారించారని, జిల్లా అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. జిల్లాకు ఇప్పటికే ఇంజినీరింగ్, వ్యవసాయ కళాశాలలతోపాటు టెంపుల్ కారిడార్ రోడ్లు తీసుకువచ్చామన్నారు. మరిన్ని నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేపడతామని పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని స్థానిక సమస్యలు ఎన్నికల్లో విజయం సాధించే విధంగా ముందుకు సాగాలన్నారు. పదవులు పొందిన వారు పార్టీకి ఎల్లవేళలా అండగా ఉండాలన్నారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ మాట్లాడుతూ.. ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికే చాలా గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతుదారులే ఏకగ్రీవం అవుతున్నారని పేర్కొన్నారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు నగేశ్రెడ్డి మాట్లాడుతూ.. పార్టీకి రుణపడి ఉంటానని, తనకు పదవీబాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. బాధ్యతలు స్వీకరిస్తున్న డీసీసీ అధ్యక్షుడు నగేశ్రెడ్డి, సీసీసీ అధ్యక్షుడు రామకృష్ణ ప్రజలు కాంగ్రెస్కు అండగా ఉన్నారు జిల్లాపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారు వేగంగా నిజామాబాద్ అభివృద్ధి పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ బాధ్యతలు స్వీకరించిన డీసీసీ, సీసీసీ అధ్యక్షులు నగేశ్రెడ్డి, రామకృష్ణ -
రెండో విడత రెండో రోజు 1661
సుభాష్నగర్: గ్రామపంచాయతీ ఎన్నికల రెండో విడత పోరులో నామినేషన్ల స్వీకరణ గడువు మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. రెండోరోజు సర్పంచ్ పదవులకు 456 మంది, వార్డు స్థానాలకు 1205 మంది నామినేషన్లు దాఖలు చేశారు. రెండు రోజుల్లో 196 సర్పంచ్ స్థానాలకు 578 నామినేషన్లు, 1,760 వార్డు స్థానాలకు 1,353 నామినేషన్లు అందాయి. కేంద్రాల వద్ద పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందితో హెల్ప్డె స్క్లు, పోలీస్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటుచేశారు. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్తోపాటు ఆర్మూర్ డివిజన్లోని జక్రాన్పల్లి మండలంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.మంచి రోజు కావడంతో సోమవారం ఏకాదశి మంచి రోజు కావడంతో భారీ సంఖ్యలో నామినేషన్లు దా ఖలయ్యాయి. చివరి రోజై న మంగళవారం నామపత్రాలు అంతంత మాత్రంగానే వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఆది, సోమవారాల్లో జరిగిన చర్చలు విఫలమైన గ్రామాలకు సంబంధించిన పదవులకు మంగళవారం నామినేషన్లు దాఖలయ్యే అవకాశముందని పలువురు పేర్కొంటున్నారు. ఏకగ్రీవాల కోసం కూడా అధికార పార్టీ నాయకులు చక్రం తిప్పుతున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్శాఖ పకడ్బందీ చర్యలు చేపడుతోంది. రెండో విడత రెండో రోజు మండలాలవారీగా దాఖలైన నామినేషన్లు సర్పంచ్ స్థానాలకు 456, వార్డు స్థానాలకు 1205 నేటితో రెండో విడత నామినేషన్లకు ముగియనున్న గడువు చివరి రోజు అంతంతే వచ్చే అవకాశం! -
ఒలింపిక్స్లో పాల్గొనే స్థాయికి చేరాలి
● కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ● పడకల్ ఉన్నత పాఠశాల తనిఖీ డిచ్పల్లి(జక్రాన్పల్లి): జిల్లా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకే పరిమితం కాకుండా ఒలింపిక్స్లో కూడా పాల్గొనేలా ప్రణాళికాబద్దంగా కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలువురు విద్యార్థులు జాతీయస్థాయి వాలీబాల్ పోటీలలో పాల్గొని ప్రతిభను చాటడం, పూర్వ విద్యార్థులు స్పోర్ట్స్ కోటాలో వివిధ శాఖలలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన విషయాలను తెలుసుకొని వారితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారు సాధించిన పతకాలు, ట్రోఫీలను పరిశీలించి, వారిని అభినందించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. క్రీడల్లో రాణిస్తే విద్య, ఉద్యోగావకాశాల్లో ప్రత్యేక రిజర్వేషన్తోపాటు, ఎంతో పేరు, ప్రఖ్యాతులు వస్తాయన్నారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో రాణిస్తున్న విద్యార్థులను అంతర్జాతీయ స్థాయి క్రీడాపోటీలకు ఎంపిక అయ్యేలా సన్నద్ధం చేసేందుకు సమగ్ర అధ్యయనం చేసి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అంతకుముందు పాఠశాలలో విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనంను, బడి పరిసరాలను తనిఖీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక అధికారులు ఉన్నారు. నిజామాబాద్ అర్బన్: నగరంలోని సుభాష్నగర్లోని ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో మంగళవారం వాహనాల వేలం నిర్వహిస్తున్నట్లు ఎకై ్సజ్శాఖ ఎస్హెచ్వో స్వప్న ఒక ప్రకటనలో తెలిపారు. ఎకై ్సజ్ శాఖ వివిధ కేసులలో స్వాధీనం చేసుకున్న వాహనాలకు నేడు ఉదయం సుభాష్నగర్లోని ఎకై ్సజ్ కార్యాలయంలో బహిరంగంగా వేలం వేస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు ఉదయం 10 గంటలకు హాజరుకావాలని తెలిపారు. -
ఏటీసీ సెంటర్లో భారీ చోరీ
● వేసిన తాళాలు వేసినట్టు ఉన్నా మాయమైన సామగ్రి ● విచారణ చేపట్టిన పోలీసులునిజామాబాద్అర్బన్: నగరంలోని ప్రభుత్వ ఐటీఐ లో ఇటీవల ఏర్పాటు చేసిన ఏటీసీ సెంటర్లో భారీ దొంగతనం జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కళాశాలలోని ఏటీసీ సెంటర్కు వేసిన తాళాలు వేసినట్లే ఉన్నా అందులోని సామగ్రి మా యం కావడంపై పోలీసులు విచారణ చేపట్టారు. వివరాలు ఇలా.. రాష్ట్ర ప్రభుత్వం ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేయగా, జిల్లాకేంద్రంలోని ఐటీఐలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా ఏటీసీని ప్రారంభించారు. అనంతరం ఏటీసీ సెంటర్కు సంబంధించిన వివిధ యంత్రాలు, వస్తువులను టాటా కన్సల్టెన్సీ సంస్థ సరఫరా చేసింది. కొన్నిరోజుల క్రితం సదరు సంస్థ కళాశాలలోని సామగ్రిని పరిశీలించగా చోరీ జరిగినట్లు గుర్తించారు. రెండు డెల్ మానిటర్స్, సీపీయూ, 12 జనరేషన్ యంత్రాలకు సంబంధించిన పలు బ్యాటరీలు, ఈవీ ప్యానెల్, ఆటో ఎమ్మార్వో యంత్రం, హ్యాండ్ టూల్స్, త్రీడి ప్రింటింగ్ సంబంధించి ఈవీ ఆటో పార్కింగ్ స్టాండ్, ఎయిర్ కంప్రెసర్, లేజర్ కటింగ్ మిషన్, రోబోటిక్స్, కాపర్ వైర్, కట్ సెక్షన్ బ్యాటరీస్ అపహరణకు గురైనట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని వారు కళాశాల ప్రిన్సిపాల్కు తెలుపగా, ఆయన పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం రెండోటౌన్ ఎస్సై రామకృష్ణ ఐటీఐని పరిశీలించి, వివరాలు సేకరించారు. ఏటీసీ సెంటర్లకు సంబంధించి ఎక్కడ కూడా తాళాలు పగలగొట్టిన ఆనవాళ్లు లేవు. తాళం వేసిన డోర్లు, కిటికీలను పగలగొట్టిన ఆనవాళ్లు ఎక్కడ లేవు. ఐటీఐలో పనిచేస్తున్న వారే వివిధ వస్తువులను దొంగిలించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. సుమారు రూ.10 లక్షల విలువ చేసే వివిధ యంత్రాలు, మెటీరియల్ చోరీ అయినట్లు ఐటీఐ ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. -
ఇంటి పైనుంచి పడి ఒకరి మృతి
నందిపేట్(ఆర్మూర్): మండలంలోని తల్వేద గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు గోడ పైనుంచి పడి మృతిచెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా.. తల్వేద గ్రామానికి చెందిన ఎర్ణాపల్లి సురేష్గౌడ్ (40) కొన్నేళ్లుగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మెడికల్ దుకాణం నడుపుకుంటూ కుటుంబంతో కలిసి ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అలాగే ప్రయివేట్ బ్యాంకులో వెహికిల్ లోన్లు ఇప్పిస్తుండేవాడు. కాగా నిజామాబాద్లోని వినాయక్నగర్ ప్రాంతంలో ఇటీవల నూతన గృహ నిర్మాణం ప్రారంభించాడు. సోమవారం ఉదయం నిర్మాణంలో ఉన్న ఇంటిపైకి ఎక్కి గోడలకు నీళ్లు పడుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడ్డాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో తల్వేద గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. సాయంత్రం సొంతూరులోనే అంత్యక్రియలు జరిగాయి. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. విద్యుత్ షాక్తో రైతు.. ఇందల్వాయి: మండలంలోని ఎల్లారెడ్డిపల్లె గ్రామంలో విద్యుత్ షాక్తో ఓ రైతు మృతి చెందాడు. ఎస్సై సందీప్ తెలిపిన వివరాలు ఇలా.. ఎల్లారెడ్డిపల్లె గ్రామా నికి చెందిన బాణావత్ పండరి (50) అనే రైతు సోమవారం ఉదయం వారి ఇంటి పక్కనే ఉన్న పొలం వద్ద ఇటీవల కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. దీంతో సోమవారం మిగిలిన ఇనుప చువ్వలను తీసివేస్తున్నాడు. ఈక్రమంలో వాటిని పైకి లేపగా, పైన ఉన్న 11 కెవి విద్యుత్ వైర్లకు తగలడంతో అతడికి షాక్ తగిలింది. వెంటనే కుటుంబసభ్యులు అతడిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
మా బిల్లులు వస్తవో.. రావో!
మోర్తాడ్(బాల్కొండ): గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలు కావడంతో మాజీ సర్పంచ్లు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్లో ఉండిపోయాయి. దీంతో కొత్త పాలకవర్గం వస్తే తమ బిల్లులను చెల్లించడంతో నిర్లక్ష్యం జరుగుతుందేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు రూ.15కోట్లు జిల్లాలో పునర్విభజనకు ముందు 530 గ్రామ పంచాయతీలు ఉండగా మేజర్ పంచాయతీలలో ఎక్కువ, చిన్న పంచాయతీలలో తక్కువ పనులు సాగాయి. జిల్లా వ్యాప్తంగా మాజీ సర్పంచ్లకు బిల్లుల బకాయిలు దాదాపు రూ.15 కోట్ల వరకూ ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశారు. ఆ బిల్లులను గ్రామ పంచాయతీల ద్వారానే చెల్లిస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. ఇలా పంచాయతీ నిధులతో పాటు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లు బకాయిలు అలాగే ఉండిపోయాయి. బిల్లుల చెల్లింపుల కోసం మాజీ సర్పంచ్లు అనేకమార్లు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. అయినా బిల్లు బకాయిల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వమే ప్రదర్శించిందనే విమర్శలు ఉన్నాయి. తమకు పడనివారు వస్తే.. ఎన్నికలకు ముందుగానే ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో ఎంత మొత్తం బిల్లు బకాయిలు ఉన్నాయో ప్రభుత్వం అధికారుల ద్వారా వివరాలను సేకరించింది. అభివృద్ధి పనులకు సంబంధించి ఎంబీ రికార్డులు చేసి బిల్లులను ట్రెజరీలో సమర్పించారు. కొన్ని పనులకు టోకెన్లు జారీ కాగా మరికొన్ని పనులకు టోకెన్లు ఇవ్వలేదు. ఎలాంటి నిధులు మంజూరైనా పంచాయతీ ఖాతాల్లోకే చేరుతాయి. ఈ నేపథ్యంలో తమకు పడనివారు సర్పంచ్లుగా ఎంపికై తే తమ బిల్లుల సంగతి అంతే అనే అనుమానాలను మాజీ సర్పంచ్లు వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సంఘం నిధులు విడుదలైతే పాత బిల్లులు చెల్లించకుండా కొత్త పనుల కోసం తీర్మాణం చేసే అవకాశం ఉంది. పాత బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా మాజీ సర్పంచ్లకు బిల్లుల చెల్లింపు గుదిబండగా మారిందని చెప్పవచ్చు.గతంలో చేసిన అభివృద్ధి పనులకు చెల్లించాల్సిన బిల్లులకు సంబంధించి ప్రభుత్వానికి నివేదికను అందించాం. పంచాయతీ ఎన్నికల తరువాతనే బిల్లుల చెల్లింపులు జరుగుతాయి. – శ్రీనివాస్రావు, డీపీవో, నిజామాబాద్ జీపీల పెండింగ్ బకాయిలపై మాజీ సర్పంచుల ఆందోళన కొత్త పాలకవర్గం వస్తే తమ బిల్లులు చెల్లించడంలో నిర్లక్ష్యం జరుగుతుందని ఆవేదన -
అట్టహాసంగా డీసీసీ ప్రమాణస్వీకారం
నిజామాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని లక్ష్మీ కల్యాణ మండపంలో సోమవారం డీసీసీ, నగర కాంగ్రెస్ అధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్స వం అట్టహాసంగా కొనసా గింది. సందర్భంగా ప్రత్యేక సమావేశం ని ర్వహించారు. ఈసందర్భంగా డీసీసీ అధ్యక్షుడు నా గేష్రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు రామకృష్ణలను పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. కాంగ్రె స్ నాయకుడు దత్తాద్రి పూలు, పండ్ల గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ప్రభు త్వ సలహాదారు సుదర్శన్రెడ్డి మాట్లాడారు. అంతకుముందు కాంగ్రెస్ శ్రేణులు నగరంలో బైక్ ర్యాలీ చేపట్టారు. వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు మానాల మోహన్రెడ్డి, అన్వేష్రెడ్డి, అరికెల నర్సారెడ్డి, కుంట రమేశ్రెడ్డి, మార్కెల్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారె డ్డి, నాయకులు వినయ్ కుమార్రెడ్డి, సునీల్ కుమార్రెడ్డి, ఆకుల లలిత, మండవ వెంకటేశ్వరరావు, మాజీ మేయర్ సంజయ్, శేఖర్ గౌడ్, విపుల్ గౌడ్, దాసరి నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
అశోక్సాగర్లో ఒకరి ఆత్మహత్య
బోధన్: పట్టణంలోని అనీసా నగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ముత్యాల రమ సోమవారం తెలిపారు. వివరాలు ఇలా.. బోధన్లోని అనీసానగర్ కాలనీకి చెందిన వంట మాస్టర్ మహమ్మద్ యూసుఫ్(59) ఆదివారం నవీపేటలో ఓ శుభకార్యం కోసం వంట చేసేందుకు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పాడు. కానీ కుటుంబసభ్యులు ఈ వయస్సులో పని చేయడం ఎందుకు అంటూ అడ్డుకున్నారు. దీంతో తనను పని చేయనివ్వడం లేదంటూ అతడు జీవితంపై విరక్తి చెందాడు. ఈక్రమంలో ఎడపల్లి మండలం జానకంపేట శివారులోని అశోక్సాగర్లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరుసటి రోజు మృతదేహం బయటకు తేలడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. ● ఇద్దరికి తీవ్ర గాయాలు డిచ్పల్లి(జక్రాన్పల్లి): జక్రాన్పల్లి పరిధిలోని 44వ నెంబరు జాతీయ రహదారిపై ఓ వ్యాన్ను ప్రయివేట్ బస్సు ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఎస్సై మహేష్ తెలిపిన వివరాలు ఇలా.. ఓ ఐచర్ వ్యాన్ ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్ వైపు నుంచి ఆర్మూర్ వైపునకు వెళుతోంది. అదే సమయంలో రాజస్థాన్కు చెందిన ఓ ప్రయివేట్ బస్సు వ్యాన్ వెనుకాల వస్తోంది. జక్రాన్పల్లి తండా శివారులో వ్యాన్ను వెనక నుంచి వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. దీంతో వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. బస్సు ముందు భాగం ధ్వంసమైంది. ఈ ఘటనలో బస్సు క్లీనర్ ఎండీ మస్తాన్, ఐషర్ వ్యాన్ డ్రైవర్ మంగీలాల్కు గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. డిచ్పల్లి: వరి ధాన్యం బస్తాల లోడ్తో రైస్మిల్లుకు వెళుతున్న లారీ డిచ్పల్లి మండలం సాంపల్లి శివారులో బోల్తా పడింది. వివరాలు ఇలా.. రాంపూర్ సొసైటీ పరిధిలోని మిట్టాపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన ధాన్యం బస్తాలను సోమవారం లారీలో లోడ్ చేసి, సాంపల్లి సమీపంలోని రైస్మిల్లుకు తరలించారు. సాంపల్లి శివారులో 44వ నెంబరు జాతీయ రహదారిపై లారీ యూటర్న్ చేస్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న ధాన్యం బస్తాలు కిందపడిపోయాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు మరో లారీ తీసుకువచ్చి ధాన్యం బస్తాలను రైస్మిల్లుకు తరలించారు. లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో సోమవారం పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ ఇద్దరిపై దాడి వేసి, గాయపర్చినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలోని వీధుల్లో కుక్క పరుగెడుతూ కమ్మరి సంగవ్వ, ఆకుల స్వామిని కాటు వేసింది. శనివారం సైతం ఒకరిని పిచ్చికుక్క కాటు వేసినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రస్తుతం బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో కుక్కల బెడద రోజురోజుకు పెరుగుతుండడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు ఇప్పటికై నా స్పందించి కుక్కల బెడదను నిర్మూలించాలని ప్రజలు కోరుతున్నారు. -
డిగ్రీ పరీక్షల్లో కొనసాగుతున్న డిబార్లు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న డిగ్రీ రెగ్యులర్, బ్యాక్లాగ్ ప రీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతూ నిత్యం ఏదో ఒక పరీక్ష కేంద్రంలో విద్యార్థులు డిబార్ అవుతున్నారు. ఆర్మూర్లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ పరీక్ష కేంద్రంలో సోమవారం మాల్ప్రాక్టీస్కు పాల్పడు తూ ఇద్దరు విద్యార్థులు డిబార్ అయినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన మొత్తం 30 పరీక్ష కేంద్రాలలో డిగ్రీ పరీక్షలకు 8,528 మంది అభ్యర్థులకు గాను 8,009 మంది అభ్యర్థులు హాజరు కాగా 517 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. తెయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కే.సంపత్కుమార్ నిజామాబాద్లోని పలు పరీక్ష కేంద్రాలను సందర్శించి తనిఖీలు నిర్వహించారు. -
తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె
కామారెడ్డి క్రైం: మగ సంతానం లేకపోతే ఏంటి నేను లేనా అంటూ ఓ కుమార్తె తన తండ్రికి తలకొరివిపెట్టింది. ఈ ఘటన సోమవారం జిల్లా కేంద్రంలో జరిగింది. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన అలకుంట్ల సుదర్శన్కు భార్య, ముగురు కుమార్తెలు ఉన్నారు. కొద్ది రోజులుగా తన కుటుంబంతో కలిసి జిల్లాకేంద్రంలోని స్నేహపురి కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. స్వగ్రామంలో తనకు ఉన్న ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అనారోగ్య కారణాలతో సుదర్శన్ మృతి చెందగా సోమవారం పట్టణంలో అంత్యక్రియలు నిర్వహించారు. తలకొరివి పెట్టడానికి వారసుడు లేకపోవడంతో పెద్ద కూతురు దేవిజ్ఞ తన తండ్రికి అంత్యక్రియలు చేయడానికి ముందుకు వచ్చింది. కొడుకులు లేక కూతురే అంత్యక్రియలు నిర్వహించడం అక్కడున్న అందర్నీ కంటతడి పెట్టించింది. -
జిల్లాలో క్రీడలకు స్వర్ణయుగం రాబోతోంది
● పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ ● నగరంలో ‘సుబ్బారావు’ అర్బన్ అంతర్ క్రీడాపోటీలు ప్రారంభంనిజామాబాద్ నాగారం: నిజామాబాద్ జిల్లాలో క్రీడలకు స్వర్ణయుగం రాబోతోందని ిపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో సోమవారం దివంగత జాతీయస్థాయి కబడ్డీ క్రీడాకారుడు, వ్యాయామ ఉపాధ్యాయుడు సుబ్బారావు స్మారక నిజామాబాద్ అర్బన్ అంతర్ క్రీడాపోటీలను ప్రారంభించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సుబ్బారావు అంటేనే కబడ్డీ, కబడ్డీ అంటేనే సుబ్బారావు అని అన్నారు. ఆయన కుటుంబానికి ఎల్లాప్పుడు అండగా ఉంటామన్నా రు. జిల్లాలో క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడానికి ప్రతి సంవత్సరం ఒక పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ను నిర్వహించే అవసరం ఉందని, బొమ్మ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున ఆ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లానే స్పోర్ట్స్ హబ్గా మారాలన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. జిల్లాలో ఒక్క కోచ్ లేకుండానే అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు తయారవడం నిజామాబాద్ ప్రతిభకు నిదర్శనం అన్నారు. సుబ్బారావు కుటుంబ సభ్యు లు, జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి పవన్ కు మార్, డీసీసీ ప్రెసిడెంట్ నాగేష్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, మానాల మోహన్ రెడ్డి, జై సింహ గౌడ్, రజనీకాంత్, సంతోష్ కుమార్, గడుగు గంగాధర్, బొబ్బి లి రామకృష్ణ, సాయగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యం
● ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి ● డీఎంహెచ్వో రాజశ్రీనిజామాబాద్ నాగారం: హెచ్ఐవి ఎయిడ్స్పై ప్రజల్లో విస్త్తృతమైన అవగాహన కల్పించి, ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేయాలని డీఎంహెచ్వో రాజశ్రీ అన్నారు. నగరంలోని జిల్లావైద్యశాఖ కార్యాలయంలో సోమవారం ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల పట్ల అపోహలను మూఢనమ్మకాలను తొలగించి వా రిని మానవతా ధృక్పథంతో చూడాలన్నారు. అనంత రం ఎయిడ్స్ నియంత్రణపై సిబ్బందితో ప్రతిజ్ఞ చే యించారు. అలాగే ఎయిడ్స్ నియంత్రణలో విస్తృతంగా కృషి చేస్తున్న వివిధ విభాగాల సిబ్బందిని, స్వ చ్ఛంద సంస్థల ప్రతినిధులను సత్కరించారు. హెచ్ఐవీ బాధితులకు స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా న్యూట్రిషన్ కిట్లను అందజేశారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, అదనపు జిల్లా వైద్యాధికారిని దే వి నాగేశ్వరి, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ తిరుప తిరావు, డీపీఎం సురేందర్రెడ్డి, తదితరులు ఉన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపై వివక్ష చూపరాదు తెయూ(డిచ్పల్లి): హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పై వివక్ష చూపరాదని, వారి పట్ల కరుణ చూపాలని నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల ఫోరెన్సిక్ సైన్స్ అండ్ టాక్సికాలజీ విభాగం హెడ్ ప్రొఫెసర్ బీవీ నాగమోహన్రావు అన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో సోమవారం ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ఎయిడ్స్పై అవగాహన పెంపొందించడం, ఎ యిడ్స్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకోవడం కోసం ప్రతి యేటా డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినం జరుపుకుంటారని తెలిపా రు. అందరికీ సమాన ఆరోగ్య హక్కులు, మానవ గౌ రవం, వివక్ష రహిత సమాజ నిర్మాణానికి కృషి చే యాలని పిలుపునిచ్చారు. తెయూ ఎన్ఎస్ఎస్ యూ నిట్ – 2 ప్రోగ్రాం ఆఫీసర్ అహ్మద్ అబ్దుల్ హలీమ్ఖాన్, ప్రొఫెసర్లు అరుణ, విద్యావర్థిని, కాంట్రాక్టు అధ్యాపకులు శ్రీనివాస్, జలంధర్ పాల్గొన్నారు. -
కుల సంఘాల మద్దతు కోసం..
మోర్తాడ్: సర్పంచ్ ఎన్నిక ల్లో అభ్యర్థుల విజయ అవకాశాలపై కుల సంఘాలు ప్రభావం చూపే అవకాశం ఉండటంతో వివిధ కుల సంఘాల పెద్ద మనుషులతో అభ్యర్థులు చర్చలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మొదటి విడత ఎన్నికల నామినేషన్లు ముగియగా ఈనెల 11న పోలింగ్ జరుగనుంది. అలాగే రెండో విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ మొదలైంది. మూడో విడతలో నిర్వహించే తంతుకు కూడా నాయకులు సీరియస్గానే బరిలోకి దిగుతున్నారు. తాము పోటీ చేసే గ్రామంలో ఏ కుల సంఘం ఓట్లు ఎక్కువగా ఉంటే ఆ కుల సంఘాన్ని ఆకట్టుకునే ప్రయత్నాలను నాయకులు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఎస్సీలు, మున్నూరుకాపులు, పద్మశాలీలు, గౌడ, ముదిరాజ్, గురడి రెడ్డి, వంజరి, కుమ్మరి, విశ్వబ్రాహ్మణులు, యాదవులు, రజకులు, నాయీబ్రాహ్మణ, వడ్డెర, ముస్లిం ఇతర కులాల వారే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. ఇందులో సభ్యులు ఎక్కువగా ఉన్న సంఘాలకు అభ్యర్థులు తాయిలాలను ప్రకటిస్తున్నారు. సంఘాల భవనాలకు మరమ్మతులు, బోర్ వేయించడం, ఆలయాలు ఉంటే వాటికి పలు సౌకర్యాలు కల్పించడం ఇలా ఎన్నో రకాల హామీలను అభ్యర్థులు ఇస్తున్నారు. చాలా గ్రామాల్లో కుల సంఘాల పెత్తనం ఇంకా కొనసాగుతుండటంతో ఆ సంఘాల పెద్ద మనుషులను తమవైపు తిప్పుకుంటే విజయం తమదే అనే ధీమాలో నాయకులు ఉన్నారు. కుల సంఘాలకు గాలం వేసి సునాయసంగా విజయం సాధించవచ్చనే భావనలో ఉన్న నాయకులు కుల సంఘాల మద్దతు కూడగట్టుకునే పనిలో ఉన్నారు. ఏది ఏమైనా కుల సంఘాల ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్రంగా ఉండబోతుందని చెప్పొచ్చు. గ్రామాల్లో మెజార్టీ కులాల పెద్దలతో సర్పంచ్ అభ్యర్థుల చర్చలు కుల సంఘాలు మాట ఇస్తే విజయం సునాయాసం అనే భావన ఏకగ్రీవంగా మద్దతిస్తే నజరానా ప్రకటిస్తున్న నేతలు -
బాన్సువాడ నియోజకవర్గంలో నిజాంసాగర్ ఆయకట్టు వివరాలు..(ఎకరాల్లో)
నిజాంసాగర్ డి–10 కాలువలో పెరిగిన పిచ్చి మొక్కలుమండలం ఆయకట్టు బాన్సువాడ 10,968 బీర్కూర్ 9,431నస్రుల్లాబాద్ 7,748వర్ని 5,064మండలం ఆయకట్టు రుద్రూర్ 3,272మోస్రా 566చందూర్ 2,513కోటగిరి 21,370 -
నకిలీ బంగారంతో మోసం
● ముఠాను పట్టుకున్న పోలీసులు ● వివరాలు వెల్లడించిన నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్రెడ్డిసుభాష్నగర్: నకిలీ బంగారాన్ని విక్రయిస్తూ, మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్రెడ్డి నగరంలోని తన కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు ఆదివారం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు పట్టణం స్వర్ణభారతి కాలనీకి చెందిన తురక శివయ్య, తన్నీరు అంజమ్మ, తన్నీరు అంకమ్మ, తన్నీరు గంగరాజు నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్లోని అద్దెకు దిగారు. తమవద్ద ఉన్న మూడు నకిలీ బంగారు బిస్కెట్లను అమ్మేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో సీతారాంనగర్లోని మోర వనితకు చెందిన పాలదుకాణానికి తరచూ వెళ్తూ ఆమెతో పరిచయం పెంచుకున్నారు. నవంబర్ 29న వారి దగ్గర ఉన్న ఒక బంగారు బిస్కెట్ను ఆమెకు చూపించి, దాదాపు 350 గ్రాములు ఉందని, బయట అమ్మితే రూ.30లక్షల వరకు వస్తుందని, తమకు కేవలం రూ.10లక్షలు ఇచ్చి తీసుకోవాలని అడిగారు. అంత డబ్బు ఇవ్వలేమని, రూ.5లక్షలు ఇస్తామని వనిత చెప్పగా.. అందుకు ఒప్పుకున్నారు. దీంతో వనితకు నకిలీ బిస్కెట్ ఇచ్చి రూ.5లక్షలు తీసుకొని పరారయ్యారు. వనిత సదరు బంగారాన్ని పరీక్షించగా నకిలీగా తేలింది. వెంటనే బాధితురాలు ఐదో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు డిచ్పల్లి రైల్వేస్టేషన్లో ఉన్నారనే పక్కా సమాచారంతో అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.5లక్షల నగదు, 96 గ్రాముల మూడు నకిలీ బంగారు బిస్కెట్లు, ఫోన్, కీ ప్యాడ్ తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రెండు గంటల్లోనే పట్టుకున్న నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఐదో టౌన్ ఎస్ఐ గంగాధర్, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. -
ఆరు నెలల్లో పోలీస్ ప్రజావాణికి 352 ఫిర్యాదులు
సుభాష్నగర్: నగరంలోని జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ సాయి చైతన్య ఆరు నెలలుగా నిర్వహించిన పోలీస్ ప్రజావాణికి 352 ఫిర్యాదులు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి, వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్స్టేషన్ల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని, పరిష్కారానికి సీపీ సూచనలు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని సీపీ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుల్లో ప్రధానంగా కుటుంబ తగదాలు, భూ తగదాలు, భార్యాభర్తల తగాదాలు, వివిధ సమస్యలపై వచ్చాయన్నారు. నిజామాబాద్అర్బన్: నేటి నుంచి జిల్లాలో కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నయి. ఇటీవల జిల్లాలో రెండు సంవత్సరాల కాల పరిమితితో జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారులు గత నెలలో మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించారు. మద్యం దుకాణాలకు 2,786 మంది దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో ఎకై ్సజ్ శాఖకు రూ. 83.58 కోట్ల ఆదాయం లభించింది. అక్టోబర్ 27 తేదీన 102 దుకాణాలకు కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి లాటరీ పద్ధతిన లక్కీడ్రా నిర్వహించారు. కొత్తగా మద్యం దుకాణాలు పొందిన వారిలో 19 మంది మహిళలు కూడా ఉన్నారు. కొందరు పాత వ్యాపారస్తులు మద్యం దుకాణాలు దక్కకపోవడంతో కొత్త వారి నుంచి అధిక డబ్బులు చెల్లించి లైసెన్సులు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కామారెడ్డి అర్బన్: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్(ఎఫ్ఎస్టీ), స్టాటిక్ సర్వైలైన్స్ టీమ్(ఎస్ఎస్టీ)ల పాత్ర అత్యంత కీలకమని ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకుడు సత్యనారాయణ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన జిల్లాలో నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, పోలింగ్ కేంద్రాలను పరిశీలించడానికి వచ్చిన సందర్భంగా కామారెడ్డి ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మాట్లాడారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ, ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలకు అరికట్టడానికి ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీలు తక్షణ చర్యలు చేపట్టాలని, చెక్పోస్టుల వద్ద పటిష్టమైన నిఘా కొనసాగించాలని ఆదేశించినట్లు చెప్పారు. కలెక్టరేట్లోని 21వ నంబర్ గదిలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మానిటరింగ్ సెల్, కంట్రోల్ రూమ్లను సందర్శించినట్టు పేర్కొన్నారు. పెయిడ్ న్యూస్ను గుర్తించడం, ప్రకటనలకు అనుమతులు జారీ చేయడం, సోషల్మీడియాను గమనించడం, ఎన్నికల ప్రవర్తనా నియావళి పర్యవేక్షణ, విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు పారదర్శకంగా జరగాలని ఆదేశించినట్టు చెప్పారు. -
మూడు ట్రాలీ ఆటోలపై కేసు
రెంజల్: బోధన్ నుంచి రెంజల్ మండలం దూపల్లి గ్రామానికి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాలీ ఆటోలను ఆదివారం తెల్లవారుజామున పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకపోవడంతో స్టేషన్కు తరలించినట్లు వివరించారు. వీటిని మైన్స్ అధికారులకు అప్పగిస్తామని ఎస్సై తెలిపారు. ఎవరైనా అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బోధన్టౌన్: బోధన్ పట్టణంలోని రాకాసీపేట్ కాలనీకి చెందిన కోదండం ఎల్లమ్మ(80) అనే వృద్ధురాలు అదృశ్యమైనట్లు పట్టణ సీఐ వెంకటనారాయణ ఆదివారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రాకాసీపేట్ కాలనీకి చెందిన కోదండం ఎల్లమ్మ శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. కుమారుడు పోశెట్టి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పెద్దకొడప్గల్(జుక్కల్): ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఆదివారం మండల కేంద్రం నుంచి పోచారం తండాకు తరలిస్తుండగా మర్గమధ్యలో పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ. 3,100 కలిగిన 5 బీర్ సీసాలు, 12 లిక్కర్ సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నాగిరెడ్డిపేట: మండలంలోని ధర్మారెడ్డి గ్రామానికి చెందిన చౌహాన్ అలియాస్ కమ్మరి లక్ష్మి(26) అనే మహిళ కుటుంబ కలహాలతో శనివారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మి భర్త వినోద్కుమార్ మూడేళ్లక్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వినోద్కుమార్ మృతితో వచ్చిన బీమా డబ్బులతోపాటు ఆస్తి విషయమై లక్ష్మికి అతని భర్త బంధువులతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడి ఇరువురు రాజీపడ్డారు. దీంతో లక్ష్మిని ఆమె తల్లిదండ్రులు ఈ నెల 24న ధర్మారెడ్డిలోని అత్తాగారింట్లో ఉంచారు. కాగా ఆస్తితోపాటు బీమా డబ్బుల విషయమై తన కుమార్తెతో జరిగిన గొడవల కారణంగానే చనిపోయిందని, ఆమె మృతికి అత్త, మామతోపాటు వారి బంధువులు కారణమని మృతురాలి తల్లి శాంతబాయి ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. లక్ష్మి మృతి చెందిన విషయం తెలుసుకొని ఆదివారం గాంధారిలో ఆమె తల్లిగారి బంధువులు రావడంతో మండలంలోని ధర్మారెడ్డిలో కొంతమేర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎల్లారెడ్డి సీఐ రాజిరెడ్డి, నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్గౌడ్ సిబ్బందితో గ్రామానికి చేరుకొని ఇరువర్గాలతో మాట్లాడి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. -
సర్పంచ్ నుంచి మంత్రి వరకూ..
మోర్తాడ్: కమ్మర్పల్లి మండలం చౌట్పల్లికి చెందిన దివంగత ఏలేటి మహిపాల్రెడ్డి తన రాజకీయ జీవితంలో అరుదైన రికార్డులను నమోదు చేసుకున్నారు. సొంత గ్రామంలో సర్పంచ్ పదవికి తనబంధువులే పోటీపడటంతో పొరుగున ఉన్న కోనాపూర్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అలా 1981లో కోనాపూర్ సర్పంచ్గా ఎంపికై న ఆయన భీమ్గల్ పంచాయతీ సమితికి అధ్యక్ష పదవిని సునాయాసంగా దక్కించుకున్నారు. మండల పరిషత్ల ఆవిర్భావానికి ముందు పంచాయతీ సమితి ఉండేది. సమితి పరిధిలోని సర్పంచ్లే తమలో ఒకరిని ఆ సమితికి అధ్యక్షు డిని ఎన్నుకునేవారు. భీమ్గల్ పంచాయతీ సమితి అధ్యక్షుడిగా కొనసాగుతూనే మహిపాల్రెడ్డి 1982లో టీడీపీలో చేరారు. 1983 ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలైన ఆయన 1985లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎంపికై నారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎంపిక కావడంతో పాటు నాటి ముఖ్యమంత్రి దివంగత ఎన్టీరామారావు మంత్రివర్గంలో అటవీ శాఖ మంత్రిగా పదవీని చేపట్టారు. సర్పంచ్తో మొదలైన మహిపాల్ రెడ్డి రాజకీయ జీవితం మంత్రి వరకూ కొనసాగింది. ఏలేటి మహిపాల్రెడ్డి రాజకీయ ప్రస్థానం భీమ్గల్ పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఎన్నిక ఎమ్మెల్యేగా ఎన్నికై న మొదటిసారే మంత్రిగా అవకాశం -
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఫరీదుపేట విద్యార్థులు
మాచారెడ్డి: రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ పోటీలకు పాల్వంచ మండలం ఫరీదుపేట ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఇద్దరు ఎంపికయ్యారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన అండర్–20 బాయ్స్, గర్ల్స్ విభాగాల్లో జిల్లా జట్టులో గొల్ల నవ్య, ప్రణీత్లు ప్రతిభ కనబర్చి రాష్ట్ర జట్టుకు ఎంపికై నట్టు వ్యాయామ ఉపాధ్యాయుడు భాస్కర్రెడ్డి తెలిపారు. బాలికల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఈ నెల 2 నుంచి 4 వరకు నల్గొండ జిల్లా హాలియాలో, బాలుర రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఈ నెల 5 నుంచి 7 వరకు మహబూబ్నగర్లో జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎంలు రామ్మనోహర్రావ్, ఎస్ఎంసీ చైర్మన్ సౌజన్య, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. మద్నూర్(జుక్కల్): మండలంలోని పెద్ద ఎక్లార గేటు వద్ద గల బాలికల సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ జి.స్వప్న ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి కబడ్డీ అండర్–20 విభాగంలో పాఠశాలకు చెందిన బి. సంధ్యారాణి, కె.నిఖిత, ఈ.అంజలి, ఎం.సృజన రాష్ట్ర పోటీలకు ఎంపికై నట్లు ఆమె తెలిపారు. డిసెంబర్ 1 నుంచి 5 వరకు నల్గొండలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో గురుకుల విద్యార్థినులు పాల్గొంటారని తెలియజేశారు. మోపాల్: నిజామాబాద్ సౌత్ రేంజ్ ఎఫ్ఆర్వో రాధిక(డిప్యుటేషన్) వరంగల్ రేంజ్కు బదిలీ అయ్యారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సువర్ణ ఆదేశాల మేరకు బదిలీపై వెళ్లగా, ఆమె స్థానంలో ఇందల్వాయి రేంజ్ అధికారి రవి మోహన్ భట్కు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. రాధిక ఎఫ్ఆర్వోగా సుమారు 20 నెలలు ఇక్కడ సేవలందించారు. -
కొనుగోలు కేంద్రం నుంచి వడ్ల సంచుల చోరీ
తాడ్వాయి: మండలంలోని కృష్ణాజివాడి శివారులో ఉన్న రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగో లు కేంద్రం నుంచి ముగ్గురి రైతులకు చెందిన పది వడ్ల సంచులు చోరీకి గురైనట్లు గ్రామస్తులు ఆదివారం తె లిపారు. కృష్ణాజివాడి గ్రామానికి చెందిన కుమ్మరి భిక్షపతి, జంగం వీరేశం, మామిండ్ల నవీన్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద వడ్లను పోశారు. ఆ వడ్లు మ్యాచర్ రావడంతో సొసైటీ ఆధ్వర్యంలో ఐదు రోజుల క్రితం తూకం వేసి ఆ సంచులను ఒకేదగ్గర ఉంచారు. లారీలు సరిగా రాక పోవడంతో ఇదే అదునుగా చూసుకొని దుండగులు కుమ్మరి భిక్షపతికి చెందిన రెండు సంచులు, జంగం వీరేశానికి చెందిన నాలుగు సంచులు, మామిండ్ల నవీన్కు చెందిన నాలుగు సంచులను దొంగిలించారన్నారు. తూకం వేసిన వెంటనే వడ్లను తరలిస్తే ఇలా జరిగేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందంచి లారీలను రప్పించి ధాన్యం తరలేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఐదు ట్రాన్స్ఫార్మర్ల కాయిల్స్ చోరీ బాల్కొండ: మండలంలోని కిసాన్నగర్ శివారులో నాగుల కుంట చెరువు సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రాల నుంచి శనివారం అర్ధరాత్రి ఐదు ట్రాన్స్ఫార్మర్ల కాయిల్స్ చోరీకి గురయ్యాయి. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. పంట భూముల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల నుంచి కాయిల్స్తో పాటు, ఆయిల్ను ఎత్తుకెళ్లారన్నారు. ట్రాన్స్కో ఏఈ సబావత్ కిషన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శైలేందర్ తెలిపారు. వైన్ షాప్లో చోరీ ఇందల్వాయి: మండలంలోని తిర్మన్పల్లి గ్రామంలో ఉన్న దుర్గా వైన్ షాప్ లో శనివారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డట్లు ఎస్సై సందీప్ తెలిపారు. ఆదివారం ఉదయం దుకాణం తెరిచేందుకు యజమా ని ప్రభాకర్ రాగా తాళం పగులగొట్టి ఉన్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. చోరీలో రూ. ఒకటిన్నర లక్షలు చోరీకి గురైనట్లు తెలిపారు. దుకాణ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
సస్యరక్షణే.. నారుకు రక్షణ
ధర్పల్లి: వరి కోతలు పూర్తి కావడంతో యాసంగి సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో సాగునీటి వనరులు కళకళలాడుతున్నాయి. భూగర్భ జలాలు వృద్ధి చెందడంతో బోరు బావులు, కాలువలు, చెరువుల కింద యాసంగిలో మళ్లీ వరి సాగుకే అన్నదాతలు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం పలు గ్రామాల్లో దుక్కులు దున్ని వరి నారును పెంచుతున్నారు. చాలా చోట్ల వరి నారు పెరిగే దశలో ఉంది. ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో దాని ప్రభావం నారుపై పడే అవకాశం ఉంది. దీనివల్ల వరి నారు ఎదగక పోవడం, ఆకులు పసుపు, ఎరుపు రంగులోకి మారి కర్రలు చనిపోవడం జరుగుతాయి. ఇలాంటి పరిస్థితిలో నారు సంరక్షణ చర్యలు ఎలా చేపట్టాలో ధర్పల్లి మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్ వివరించారు. నాటేందుకు నాలుగు నుంచి ఆరు ఆకులున్న నారును ఉపయోగించాలి. నారు కొనలను తుంచి నాటుకుంటే కాండం తొలుచు పురుగుల గుడ్లను నిరోధించి, పురుగులు వ్యాప్తి చెందకుండా అడ్డుకోవచ్చు. పొలంలో పశువుల ఎరువును లేదా కోళ్ల ఎరువును వేసి, దుక్కి చేయవచ్చు. ఎకరాకు 24 కిలోల భాస్వరం, 48 కిలోల నత్రజని, 16 కిలోల పొటాష్ వేయాలి. చివరి దుక్కిలో 20 కిలోల జింక్ సల్ఫేట్ను చల్లాలి. దీన్ని మిగతా ఎరువులతో కలపకుండా నేరుగా వేయాలి. వరి నారుకు సోకుతున్న తెగుళ్లు అధిక చలి తీవ్రతతో నారుపై తీవ్ర ప్రభావం సస్యరక్షణ చర్యలపై వ్యవసాయ అధికారుల సూచనలు -
రెండో విడత తొలిరోజు 270
● ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ● సర్పంచ్ స్థానాలకు 122.. వార్డుస్థానాలకు 148సుభాష్నగర్: గ్రామపంచాయతీ ఎన్నికల్లోభాగంగా రెండో విడత ఎన్నికల నిర్వహణ కోసం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. తొలిరోజు 270 నామినేషన్లు దాఖలయ్యాయి. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్తోపాటు ఆర్మూర్ డివిజన్లోని జక్రాన్పల్లి మండలం పరిధిలోని 196 జీపీలు, 1,760 వార్డుస్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 122 నామినేషన్లు, వార్డుస్థానాలకు 148 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల స్వీకరణ కోసం 59 కేంద్రాలను ఏర్పాటు చేశారు. క్లస్టర్ గ్రామంగా గుర్తించి నాలుగు నుంచి ఐదు గ్రామాలకు సంబంధించిన సర్పంచ్, వార్డుస్థానాల అభ్యర్థుల నామినేషన్లను ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించారు. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. కేంద్రాల వద్ద పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందితో హెల్ప్డెస్క్లు, పోలీస్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటుచేశారు. మండలాలవారీగా దాఖలైన నామినేషన్లు -
ఉప సర్పంచ్
సర్పంచ్ కాకపోతే ● ప్లాన్ ‘బీ’పై అభ్యర్థుల ఫోకస్ ● అనుకూలమైన వార్డు కోసం వెతుకులాట ● ఆరో తరగతి సాంఘికశాస్త్రంలో.. ● రిజర్వేషన్ల కారణంగా సర్పంచ్గా పోటీ చేసే అవకాశం కోల్పోయిన చోట ఉప సర్పంచ్ పదవినైనా కై వసం చేసుకోవాలనే యోచనలో కొందరు నాయకులు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లు ఉన్న గ్రామాల్లో ఉప సర్పంచ్గా ఎన్నికై తే ఆ పంచాయతీల్లో ఎంతోకొంత పెత్తనం కొనసాగుతుందనే ఆలోచనతో వార్డు సభ్యుల మద్దతును కూడగట్టుకుంటున్నారు. డిచ్పల్లి/మోర్తాడ్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉప సర్పంచ్ పదవికి డిమాండ్ పెరిగింది. సర్పంచ్ రిజర్వేషన్ తమకు అనుకూలంగా రాని గ్రామాల్లో చక్రం తిప్పే నాయకులంతా ఇప్పుడు ఉప సర్పంచ్ పదవిపై దృష్టి సారించారు. రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోవడంతోపాటు మహిళలకు 50శాతం సర్పంచ్ స్థానాలు రిజర్వ్ కావడంతో చాలా మంది కీలకనాయకులకు పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో వారంతా ఉప సర్పంచ్ పదవి కోసం రంగంలోకి దిగుతున్నారు. సర్పంచ్ స్థానం మహిళలకు రిజర్వు అయిన చోట్ల తమ భార్యలను బరిలోకి దింపి తాము వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రిజర్వేషన్లు ఇలా.. జిల్లాలో 545 సర్పంచ్ స్థానాలు ఉండగా.. 129 – అన్రిజర్వ్డ్ (జనరల్), 113 – అన్ రిజర్వ్డ్ (మహిళ), 70 – బీసీ (జనరల్), 55– బీసీ (మహిళ), 47 – ఎస్సీ (జనరల్), 35 – ఎస్సీ (మహిళ), 55 – ఎస్టీ (జనరల్) (వందశాతం ఎస్టీ జనాభా క లుపుకుని), 41 – ఎస్టీ (మహిళ) (వందశాతం ఎస్టీ జనాభా కలుపుకుని) రిజర్వ్ అయ్యాయి. ఎస్సీ, ఎస్టీ స్థానాలతోపాటు మహిళలకు రిజర్వ్ అయిన స్థానాల్లో ఉప సర్పంచ్ పదవులకు డిమాండ్ పెరిగింది. చోటామోటా నేతలంతా ఉప సర్పంచ్ పదవి కోసం రంగంలోకి దిగుతున్నారు. బీసీలకు 125 స్థానాలుండగా వాటిలో 55 మహిళలకు కేటా యించారు. ఇన్నాళ్లు ఆశలు పెంచుకున్న బీసీ జనరల్ అభ్యర్థులకు పోటీ చేసే అవకాశం లేకుండా పో యింది. దీంతో ఉప సర్పంచ్ పదవిపై కన్నేసిన నాయకులు గెలుపు కోసం బరిలోకి దిగుతున్నారు. అలాగే జిల్లాలో 113 స్థానాలు మహిళ (అన్ రిజ ర్వుడ్)కు కేటాయించడంతో ఆయా స్థానాల్లో సైతం ఉప సర్పంచ్ పదవులకు డిమాండ్ పెరిగింది. చెక్పవర్ ఉంటే పెత్తనం చెలాయించవచ్చనే..! ఉప సర్పంచ్లకు సైతం చెక్ పవర్ ఉండడంతో ఈ పదవికి డిమాండ్ పెరిగింది. మహిళలు సర్పంచ్లుగా ఉన్నచోట్ల పెత్తనం చలాయించడానికి ఉప సర్పంచ్ పదవి ఎంతో అనుకూలమనే భావనలో కొందరు నాయకులు ఉన్నారు. దీంతో సర్పంచ్ పదవికి పోటీ చేసే అవకాశం దక్కని వారు ఉప సర్పంచ్ పదవిపై కన్నేసి పావులు కదుపుతున్నారు.విద్యార్థులకు ‘పంచాయతీ’ పాఠం ఖలీల్వాడి: గ్రామ పంచాయతీ వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఆరో తరగతి సాంఘిక శాస్త్రంలో 13వ అధ్యాయంగా ‘గ్రామ పంచాయతీలు’ పాఠం ఉంది. ఏడు పేజీల్లో ఉన్న ఈ పాఠంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక, రిజర్వేషన్లు, గ్రామాల్లో చేపట్టే పనులు – వివరాలు, సమావేశాలు, తీర్మానాలకు సంబంధించిన అంశాలను పొందుపర్చారు. ప్రస్తుతం గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రభుత్వం మూడు విడతల్లో నిర్వహిస్తుండగా ఈ పాఠ్యాంశం తెరపైకి వచ్చింది. విద్యార్థులు ఈ పాఠాన్ని చదివితే ఎన్నికలపై అవగహన పెరుగుతుంది. -
‘మీ–సేవ’ జిల్లా అధ్యక్షుడిగా రాజు
సుభాష్నగర్: నగరంలోని న్యూ అంబేడ్కర్ భవన్లో ఆదివారం మీ–సేవ ఆపరేటర్స్ అ సోసియేషన్ జిల్లా అధ్యక్షుడి ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా అసో సియేషన్ ఎన్నికలు నిర్వహించినట్లు ఎన్నిక ల అధికారులు శ్యామ్కుమార్, రిటైర్డ్ ప్రభు త్వ ప్రిన్సిపాల్ కాలేవార్ రవి తెలిపారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా సితారి క్షవీణ్ (రాజు) విజయం సాధించినట్లు ఎన్నికల కమిటీ నిర్వాహకులు గూడూరి శేఖర్, మహమ్మద్ అస్లాం, మహమ్మద్ షాహిద్, కుందెన్ ప్రభుదాస్, శివప్రసాద్ తెలిపారు. అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. జాతీయ ఏకీకరణ శిబిరంలో తెయూ విద్యార్థి తెయూ(డిచ్పల్లి): గుజరాత్లోని సర్దార్ వ ల్లభాయ్ పటేల్ విశ్వవిద్యాలయంలో జరిగిన జాతీయస్థాయి ఏకీకరణ సదస్సుకు తె లంగాణతోపాటుగా దేశ నలుమూలల నుంచి 10 రాష్ట్రాల ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పా ల్గొనగా, తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి అశోక్ పాల్గొన్నారు. ఈనెల 22 నుంచి వారం రోజులపాటు నిర్వహించిన సదస్సు ఇటీవల విజయవంతంగా ముగిసింది. రాష్ట్ర ఎన్ఎస్ఎస్ వలంటీర్లు ప్రదర్శించిన సాంప్రదాయ డప్పుదరువు, బతుకమ్మ, బోనా లు, మరీ ప్రత్యేకంగా పోతరాజు విన్యాసాలు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు, వలంటీర్ల ప్రశంసలు అందుకున్నాయి. తెలంగాణ రీజినల్ డైరెక్టర్ రామకృష్ణ వలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు. ఎన్ఐసీ కోఆర్డినేటర్ జాగృతి సురేరా, సర్దార్ వల్లాభాయ్ పటేల్ యూనివర్సిటీ వీసీ నిరంజన్ పటేల్ చేతుల మీదుగా ధ్రువపత్రాలను అందుకున్నారు. ● ఎనిమిది తులాల బంగారం, 80 తులాల వెండి అపహరణ నిజామాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని నాందేవ్వాడలో భారీ చోరీ జరిగింది. మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నాందేవ్వాడ ప్రాంతంలో నివాసం ఉంటున్న కృష్ణవేణి అనే మహిళ ఈ నెల 28న ఇంటికి తాళం వేసి వేరే గ్రామానికి వెళ్లారు. దుండగులు రాత్రి ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఆదివారం ఉదయం ఇంటికి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ చోరీలో బీరువాలో ఉన్న ఎనిమిది తులాల బంగారం, ఎనభై తులాల వెండి, ల్యాప్ టాప్ చోరీకి గురైనట్లు బాధితురాలు పేర్కొ న్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఒక మడి.. 30 రకాల నారు
మాక్లూర్ మండలం మాదాపూర్ శివారులో రోడ్డు పక్కన విత్తనోత్పత్తి కోసం ఎస్ఆర్ఐ పద్ధతిలో అంకుర సీడ్స్ కంపెనీ వారు 30 రకాల వంగడాల నారుమళ్లను బాక్సులుగా ఏర్పాటు చేశారు. మడి చుట్టు చీరలతో కంచె ఏర్పాటు చేశారు. మాములుగా నారుమడి ఒకే దగ్గర ఉంటుంది. ఇలా బాక్సులుగా నారును ఏర్పాటు చేసి ఒకే మడిలో 30 రకాల వంగడాలను ఉత్పత్తి చేస్తామని సీడ్స్ కంపెనీ యజమానులు తెలిపారు. ఈ పద్ధతిని రోడ్డుపై వెళ్లేవారు ఆసక్తిగా తిలకిస్తున్నారు. –సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
హైకోర్టు జడ్జికి ఘన స్వాగతం
సుభాష్నగర్: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మాధవిదేవి శనివారం నిజామాబాద్కు విచ్చేసిన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. నగరంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్ వద్ద వారికి జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య, ఆయా శాఖల జిల్లా అధికారులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా జడ్జి, కలెక్టర్, పోలీస్ కమిషనర్లతో హైకోర్టు న్యాయమూర్తి కొద్దిసేపు భేటీ అయ్యారు. ఆర్మూర్ కోర్టు సమస్యలను పరిష్కరించాలి ఆర్మూర్టౌన్: ఆర్మూర్ కోర్టులో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆర్మూర్ బార్ అసోసియేషన్ స భ్యులు హైకోర్టు జడ్జి మాధవిదేవిని కోరారు. జిల్లాకేంద్రానికి శనివారం వారు విచ్చేయగా ఆర్మూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి, సత్కారించారు. అనంతరం ఆర్మూర్ అధ్యక్షుడు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్ సమస్యలను హైకోర్టు జడ్జికి విన్న వించారు. బార్ ప్రతినిధులు ఆనంద్, గంగారాం, శ్రావణ్, శంకర్, కొండి పవన్, గణేష్ పాల్గొన్నారు. -
ఒక్కో పార్టీ.. ఒక్కో తీరు..
మోర్తాడ్: బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేయడానికి మూడు ప్రధాన పార్టీలు ఒక్కో మార్గంను ఎంచుకున్నాయి. బాల్కొండ నియోజకవర్గంలో పట్టు నిలుపుకున్న బీఆర్ఎస్ పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకోసం సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మూడో విడతలోనే ఎన్నికలు కొనసాగనున్నాయి. నామినేషన్లకు ఇంకా సమయం ఉన్నా అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆచితూచి అడుగు వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో మెజార్టీ గ్రామాలలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు కాకుండా కాంగ్రెస్, బీజేపీ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందారు. అప్పటి తప్పిదాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండటానికి అభ్యర్థుల ఎంపికను సీరియస్గా తీసుకున్నారు. ఎనిమిది మండలాల్లో పార్టీ మండల అధ్యక్షులు, ఇతర నాయకులు కలిసి అన్ని గ్రామాలలో తిరిగి ఆశావహుల పేర్లను నమోదు చేసుకున్నారు. ఒక్కో గ్రామంలో ఇద్దరు కంటే ఎక్కువ మంది బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేయాలని ఆసక్తి ఉంటే వారి పేర్లు ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డికి చేరవేశారు. గతంలో పోటీ చేసి ఓటమిపాలైవారు, ఇప్పుడు గెలిచే అవకాశం ఉందా లేదా అనే కోణంలో పరిశీలన చేస్తున్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి సూచించిన వారే ఆయా గ్రామాలలో బీఆర్ఎస్ మద్దతుతో బరిలో నిలిచే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్రెడ్డి, ఇతర నేతలు కలిసి ప్రతి మండలానికి ఐదుగురు సభ్యుల బృందాన్ని నియమించారు. ఈ కమిటీ ఆశావహుల పేర్లను నమోదు చేసుకుని వారి బలాబలాలు ఎలా ఉన్నాయో ఒక నివేదికను తయారు చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కాంగ్రెస్ మద్దతుదారులే ఎక్కువ గ్రామాలలో సర్పంచ్లుగా గెలుపొందారు. స్థానిక సంస్థల్లో పార్టీకి ఉన్న బలాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి కూడా తమ బలం నిలుపుకోవాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. అందుకే సర్పంచ్ పదవులను గెలుపొందాలంటే బలమైన నాయకులను ఎంపిక చేయడానికి కసరత్తు చేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గంలో బీజేపీ బలం పెరగడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ఆ పార్టీ నేత డాక్టర్ మల్లికార్జున్రెడ్డి భావిస్తున్నారు. 2019 పంచాయాతీ ఎన్నికల్లో వేల్పూర్, గుమ్మిర్యాల్తో పాటు మరికొన్ని పంచాయతీలకు ఆయన మద్దతుదారులు ఎంపికై బీజేపీకి కూడా స్థానిక సంస్థల్లో చోటు ఉందని అందరూ గ్రహించేలా చేశారు. ఈసారి ఇంకా స్థానాలను పెంచుకోవాలని అభ్యర్థుల ఎంపికను మల్లికార్జున్రెడ్డి స్వయంగా పరిశీలిస్తుండటం విశేషం. మూడు ప్రధాన పార్టీల నేతలు అభ్యర్థుల ఎంపికకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఫలితాలు ఎలా ఉండబోతాయో వేచి చూడాలి. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం వినూత్న పద్ధతులు మండలానికో కమిటీ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఆశావహుల పేర్లు నమోదు చేసుకుంటున్న బీజేపీ గ్రామాల సందర్శన చేస్తున్న బీఆర్ఎస్ నేతలు -
అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం
సిరికొండ: మండలంలోని చిన్నవాల్గోట్ గ్రా మంలో బడాల గంగా మోహన్, గణేష్లకు చెందిన ఇంట్లో శనివా రం అగ్ని ప్రమాదం జ రిగినట్లు తహసీల్దార్ ర వీందర్రావు తెలిపారు. వారు ఇంట్లో లేని సమయంలో దీపంతో మంటలు వ్యాపించి ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ఏడు తులాల వరకు బంగారు ఆభరణాలు, మూడు ల క్షల వరకు నగదు, సామగ్రి దగ్ధమైనట్లు తెలిపారు. పంచనామా నిర్వహించినట్లు తహసీల్దార్ తెలిపారు. మోతెలో గుడిసె.. లింగంపేట(ఎల్లారెడ్డి):మండలంలోని మోతె గ్రామానికి చెందిన కుమ్మరి కిష్టయ్య పొలంలోని గు డిసే శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు దగ్ధమైనట్లు గ్రామస్తులు తెలిపారు. గుడిసెలోని వ్యవసాయ పనిముట్లు, సామగ్రి, పత్తి కాలిపోయినట్లు బాధితుడు పేర్కొన్నాడు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 60వేలు ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలిపారు. కామారెడ్డి క్రైమ్: నకిలీ నోట్ల ముద్రణ, సరఫరా కేసులో ఇటీవల కామారెడ్డి పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. ఈ ముఠాలో ప్రధాన నిందితుడైన కరెన్సీ కాట్నే అలియాస్ లఖన్ కుమార్ దుబేపై ఇటీవల కామారెడ్డి పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. పలు రాష్ట్రాల్లో ఇదివరకే కేసులు నమోదై ఉండడంతో మరో ఇద్దరు నిందితులైన సత్యదేవ్ యాదవ్, సౌరవ్డేలపై కూడా పీడీ యాక్టు నమోదు చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర శనివారం తెలిపారు. సదరు నిందితులు ప్రస్తుతం నిజామాబాద్ జైలులో ఉండగా పీడీ యాక్ట్ ఉత్తర్వులను పట్టణ ఎస్హెచ్వో నరహరి అందజేశారు. -
తెలంగాణను తీర్చిదిద్దిన శిల్పి కేసీఆర్
బాన్సువాడ : తెలంగాణ ఖ్యాతిని తీర్చిదిద్దిన శిల్పి మాజీ సీఎం కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అభివర్ణించాడు. శనివారం బాన్సువాడలో దీక్ష దివాస్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ముందుగా సోమేశ్వర్ నుంచి బాన్సువాడ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కొయ్యగుట్ట వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. పట్టణంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నినాదాలు చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేశారు. ఈ సందర్భంగా దీక్ష దివాస్లో ప్రసంగించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 1969 నుంచి ఉద్యమం చేస్తే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 100 యువకులను బలితీసుకున్నారని అన్నారు. 2001లో టీఆర్ఎస్ అవిర్బవించినప్పటి నుంచి కేసీఆర్ తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికై న సిద్ధమయ్యాయరన్నారు. 11 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తే కేసీఆర్ శక్తి చూసి ప్రతిపక్షాల మద్దతుతో తెలంగాణ సాధించుకున్నామన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతు బంధు, రైతు బీమా తదితర సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ బాన్సువాడకు అధిక నిధులు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పోచారం పార్టీ మారరని విమర్శించారు. ప్రస్తుతం వ్యవసాయ సలహాదారులుగా ఉన్న పోచారం సీఎం రేవంత్రెడ్డికి వ్యవసాయంపై ఏం సలహాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. అనంతరం మలిదశ ఉద్యమకారులను ఆయన సన్మానించారు. ● కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పోచారం పార్టీ మారారు ● దీక్ష దివాస్లో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ -
ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
పెర్కిట్(ఆర్మూర్): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలని అడిషనల్ కలెక్టర్లు అంకిత్, కిరణ్ సూచించారు. ఆర్మూర్లోని రైతు వేదిక భవనంలో శనివారం గ్రామ పంచాయతీ స్టేజ్–1, స్టేజ్ రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల సమయంలో చేపట్టాల్సిన విషయాలపై మాస్టర్ ట్రైనర్ల ద్వారా శిక్షణనిచ్చారు. శిక్షణ తరగతులకు అడిషనల్ కలెక్టర్లు హాజరై మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన నూతన నిబంధనలు, నియమావళి ప్రకారం ఎన్నికల నిర్వహణ చేపట్టాలన్నారు. అనంతరం డీఎల్పీవో శివకృష్ణ ఎన్నికల సిబ్బందికి శిక్షణనిచ్చారు. సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియ, ఎంపీడీవో శివాజి, ఎంపీవో శ్రీనివాస్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ రెగ్యుల ర్, బ్యాక్లాగ్ పరీక్షల్లో శనివారం మాల్ప్రాక్టీ స్కు పాల్పడుతూ ఇద్దరు విద్యార్థులు డిబార్ అయినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 30 పరీక్ష కేంద్రాల్లో డిగ్రీ పరీక్షలు కొనసాగుతున్నాయన్నారు. శనివారం ఉదయం జరిగిన పరీక్షలకు 5,317 మంది వి ద్యార్థులకు గానూ 5,068 మంది విద్యార్థులు హాజరు కాగా 249 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. అలాగే మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 5,799 మంది విద్యార్థులకు గానూ 5,314 మంది విద్యార్థులు హాజరు కాగా 483 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ఆర్మూర్లోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పరీక్ష కేంద్రంలో మాల్ప్రాక్టీస్కు పాల్పడుతూ ఇద్దరు విద్యార్థులు డిబార్కు గురైనట్లు తెలిపారు. ఘంటా చంద్రశేఖర్తోపాటు ఆడిట్ సెల్ జాయింట్ డైరెక్టర్ అతిక్ సుల్తాన్ ఘోరీ ప్రత్యేక బృందా లతో కలిసి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల లోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. నిజామాబాద్ నాగారం:కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తీసుకొచ్చిన ఐహెచ్ఐపీ పోర్టల్లో రో గుల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయా లని ప్రయివేట్ ఆస్పత్రుల సిబ్బందికి డీఎంహెచ్వె రాజశ్రీ సూచించారు. నగరంలోని గంగస్థాన్ ఫేజ్–2లోగల ఐఎంఏ హాలులో శనివా రం నిజామాబాద్ డివిజన్లోని ప్రయివేటు ఆ స్పత్రుల సిబ్బందికి జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో ఐహెచ్ఐపీ పోర్టల్పై శిక్షణ కార్యక్రమం ని ర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ..జిల్లాలోని ప్రతి ప్రయివేటు ఆ స్పత్రిలో ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్ ద్వా రా సేవలు పొందే రోగుల వివరాలు ఆన్లైన్ లో ఐహెచ్ఐపీ పోర్టల్లో ఏవిధంగా నమోదు చేయాలో తెలిపారు.శిక్షణ పొందిన వారు తప్ప నిసరిగా పోర్టల్లో వివరాలు నమోదు చేయాలన్నారు. డీఎస్వో నాగరాజు, డిప్యూటీ డీఎంహెచ్వో అశ్విని, శ్రావ్య, శిఖర, నారాయణ, పోశెట్టి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. -
విహార యాత్రలో విషాదం
సదాశివనగర్(ఎల్లారెడ్డి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దామోదర్రెడ్డి విహారయాత్రలో ఉండగా శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. ఈనెల 27న విద్యార్థులతో కలిసి ఆయన విహారయాత్రకు బయలుదేరారు. యాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి భద్రాచలం చేరుకున్నారు. అందరూ భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. ప్రధానోపాధ్యాయుడు రాత్రి 11 గంటల వరకు తమతో ముచ్చటించినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. తెల్లవారుజామున నిద్ర నుంచి సార్ లేవడం లేదని తోటి ఉపాధ్యాయులు దగ్గరికి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నట్లు పేర్కొన్నారు. వారు వెంటనే కుటుంబీకులకు సమాచారం అందించారు. దామోదర్ రెడ్డి రెండున్నర ఏళ్ల క్రితం బదిలీపై సదాశివనగర్ ఉన్నత పాఠశాలకు వచ్చాడు. అందరితో కలుపుగోలుగా ఉండే ప్రధానోపాధ్యాయుడు అకస్మాత్తుగా గుండెపోటుకు గురికావడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. నేడు (నవంబర్ 30) పదవీవిరమణ పొందనున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం అందరి మనస్సులను కలచివేసింది. విద్యార్థులు దు:ఖసాగరంలో మునిగారు. మృతుని భార్య కూడా ఇటీవల ప్రధానోపాధ్యాయురాలుగా బాధ్యతలు చేపట్టి పదవీవిరమణ పొందినట్లు పేర్కొన్నారు. మృతునికి కూతురు,కుమారుడు ఉన్నారు. మృతుని స్వగ్రామం బస్వాపూర్, కానీ ప్రస్తుతం కామారెడ్డిలో నివాసం ఉంటున్నారు. ● నిద్రలోనే గుండెపోటుకు గురై ప్రధానోపాధ్యాయుడు మృతి ● గుండెలు బాదుకున్న విద్యార్థులు ● నేటితో ముగియనున్న సర్వీస్ -
కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తా
నిజామాబాద్అర్బన్: జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తానని డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాగేష్రెడ్డి మాట్లాడారు. అందరి ఆశీస్సులతోనే జిల్లా అధ్యక్ష పార్టీ బాధ్యతలు దక్కాయన్నారు. జిల్లాలోని క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు. డిసెంబర్ 1న నగరంలోని లక్ష్మీ కల్యాణ మండపంలో ప్రమాణ స్వీకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమానికి ఏఐసీసీ, పీసీసీ నేతలు, జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కార్యకర్తలు వస్తున్నారన్నారు. జిల్లా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, శేఖర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో జీపీ కార్మికుడు మృతి డిచ్పల్లి: మండలంలోని ధర్మారం(బి)లో గ్రామ పంచాయతీ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు డిచ్పల్లి ఎస్సై ఎండీ ఆరిఫ్ తెలిపారు. ధర్మారం(బి) గ్రామానికి చెందిన మొగుళ్ల కుంటయ్య (69) గ్రామ పంచాయతీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈక్రమంలో శనివారం ఉదయం వీధి లైట్లు ఆఫ్ చేయడానికి కుంటయ్య తన సైకిల్పై బయలుదేరాడు. బస్టాండ్ సమీపంలోని మెంట్రాజ్పల్లి రోడ్డు వద్దకు రాగానే అతడిని నిజామాబాద్ వైపు నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డీసీఎం డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రాజంపేట మండలంలో.. రాజంపేట: మండలంలోని శివాయిపల్లి గ్రామంలో ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. శివాయిపల్లి గ్రామానికి చెందిన గజ్జెల నరేష్ (28) శుక్రవారం సాయంత్రం కామారెడ్డికి బైక్పై బయలుదేరాడు.రాజంపేట సమీపంలో అతడిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడిక్క డే మృతిచెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 22.5 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండల కేంద్రానికి చెందిన యాదాగౌడ్ వద్ద నుంచి శనివారం 22.5 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు బాన్సువాడ ఎకై ్సజ్ సీఐ దిలీప్ తెలిపారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం నిల్వలు,విక్రయాలు చే పట్టడంతో యాదాగౌడ్పై కేసు నమోదు చేశామన్నారు. బాన్సువాడ ఎకై ్స జ్ ఎస్సై శ్రావణి, సిబ్బంది శరీఫ్, శ్రీకాంత్, రూపేష్, ప్రేమలత తదితరులు ఉన్నారు. -
దీక్షాదివస్ టెంట్ కూల్చివేత
● కార్యక్రమ నిర్వహణకు అనుమతి నిరాకరణ ● వర్సిటీ పరిపాలనా భవనం వద్ద బీఆర్ఎస్ నేతల బైఠాయింపు తెయూ(డిచ్పల్లి) : తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ గేటు బయట దీక్షా దివస్ కోసం వేసిన టెంట్ కూల్చివేసి, మైక్ తీసివేయడమే కాకుండా ఫ్లెక్సీ చించివేత వెనుక కాంగ్రెస్ పెద్దల హస్తం ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజారాం యాదవ్ ఆరోపించారు. కేసీఆర్ దీక్షా దివస్ కార్యక్రమం కోసం శనివారం ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్ నాయకులు తెయూ మెయిన్ గేట్ బయట టెంట్ వేశారు. ఉదయం 10 గంటలకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో రాజారాం యాదవ్ వర్సిటీ వద్దకు చేరుకునేసరికి టెంట్ కూల్చివేసి, మైక్ తొలగించి కనిపించింది. ఈ విషయమై వర్సిటీ సెక్యూరిటీ సిబ్బందిని అడుగగా వర్సిటీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టెంట్ను తామే తొలగించినట్లు తెలిపారు. ఈ విషయమై వర్సిటీ రిజిస్ట్రార్ను ఫోన్లో సంప్రదించగా దీక్షా దివస్కు వీసీ అనుమతి తీసుకోవాలని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. వీసీని ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులతో కలిసి రాజారాం యాదవ్ వర్సిటీ పరిపాలనా భవనం వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా రాజారాం యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ దీక్షా దివస్కు మొదట అనుమతి ఇచ్చి, తర్వాత నిరాకరించడం వెనుక కాంగ్రెస్ పెద్దల హస్తం ఉందని ఆ రోపించారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఫలి తమే తెలంగాణ ఏర్పాటని పేర్కొన్నారు. సమైక్య పాలకులు కూడా ఇలా వ్యవహరించలేదని, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఒత్తిడితోనే దీక్షా దివస్కు వర్సిటీ అధికారులు అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు సంతోష్, నాగేంద్ర, నిరంజన్, బీఆర్ఎస్ నాయకులు పాశం కుమార్, యూసుఫ్, లింగం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లి ఎస్సై ఎండీ ఆరీఫ్ బందోబస్తు నిర్వహించారు. -
మహిళలే కింగ్ మేకర్లు..
మోర్తాడ్(బాల్కొండ): జిల్లాలోని గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాలలో పోటీ చేసే అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించడంలో ఎవరు కీలకం.. అంటే వచ్చే సమాధానం ఒక్కటే మహిళా ఓటర్లు. అన్ని స్థానాల్లో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో గెలుపు గుర్రాలను నిర్ణయించడంలో మహిళా ఓటర్ల పాత్ర కీలకంగా మారింది. జిల్లాలోని 545 గ్రామ పంచాయతీలలో ఓటర్ల సంఖ్య 8,51,417గా నమోదైంది. ఇందులో పురుషులు 3,96,778 మంది, మహిళా ఓటర్లు 4,54,621 మంది ఉన్నారు. ఇతర ఓటర్లు 18 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య 57,843 ఎక్కువగా ఉండటంతో సర్పంచ్, వార్డు అభ్యర్థుల భవితవ్యం మహిళల చేతుల్లోనే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహిళలు ఎటు మొగ్గు చూపితే వారే గెలిచే పరిస్థితి కనిపిస్తుండటంతో పోటీకి ఆసక్తి చూపుతున్న అభ్యర్థులు వారిని ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు, బ్యాంకు లింకేజీ రుణాలకు సంబంధించి వడ్డీ వాపస్ రావడంతో అధికార పార్టీ అభ్యర్థులకు కలిసివచ్చే అవకాశమని కాంగ్రెస్ నా యకులు భావిస్తున్నారు. కా గా, పింఛన్ల మొత్తాన్ని పెంచకపోవడాన్ని అ స్త్రంగా చేసుకోవాలని ప్రతిప క్ష పార్టీల అ భ్యర్థు లు ఆలో చన చేస్తున్నారు. అభ్యర్థుల గెలుపును నిర్ణయించేది అతివలే.. పంచాయతీ ఓటర్లలో పురుషుల కంటే మహిళల ఓట్లు ఎక్కువ మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థుల ప్రయత్నాలు -
రెండో విడతకు రెడీ..
● నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ● 59 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి ● 2,64,178 మంది ఓటర్లుసుభాష్నగర్: గ్రామపంచాయతీ ఎన్నికల రెండో విడత నోటిఫికేషన్ ఆదివారం వెలువడనుండగా, ఉ దయం 10.30 గంటల నుంచి నా మినేషన్ల స్వీకరణ ప్రారంభం కా నుంది. నిజామాబాద్ డివిజన్ (ఆ ర్మూర్ డివిజన్లో ఒక మండలం) లో రెండో విడత పంచాయతీ ఎ న్నికలు జరగనున్నాయి. 196 జీపీలు, 1,760 వార్డు స్థానాలు, 1,760 పోలింగ్ కేంద్రాలు ఉ న్నాయి. మొత్తం 2,64,178 మంది ఓటర్లు ఉండగా, 1,22,868 మంది పురుషులు, 1,41,305 మంది మహిళలు, 5 ఇతరులు ఉన్నారు. డిసెంబర్ 2 వరకు.. రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు కొనసాగనున్నది. డిసెంబర్ 3న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, 6వ తేదీన మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అదేరోజు మూడు గంటల తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా, గుర్తులను కేటాయిస్తారు. 14న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారు. క్లస్టర్ గ్రామంలో నామినేషన్ల స్వీకరణ.. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా రెండోవిడత నామినేషన్ల స్వీకరణ కోసం 59 కేంద్రాలను ఏర్పాటు చేశారు. క్లస్టర్ గ్రామంగా గుర్తించి నాలుగు నుంచి ఐదు గ్రామాలకు సంబంధించిన సర్పంచి, వార్డుస్థానాల అభ్యర్థుల నామినేషన్లను అక్కడే స్వీకరించనున్నారు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు నామినేషన్ సామగ్రితో కేంద్రాలకు చేరుకున్నారు. గ్రామ పంచాయతీ రెండోవిడత నామినేషన్ల స్వీకరణ కోసం అన్ని ఏ ర్పాట్లు పూర్తిచేశామని కలెక్టర్ వినయ్ కృష్ణారె డ్డి శనివారం తెలిపారు. మొదటి విడతలో భాగంగా బోధన్, నిజామాబాద్ డివిజన్లలోని 11 మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శనివారం సజావుగా పూర్తి చే శామని పేర్కొన్నారు. రెండో విడతకు ఆదివా రం నుంచి డిసెంబర్ 2 వరకు నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్లలోని పలు మండలాలకు నా మినేషన్లు స్వీకరిస్తామన్నారు. హెల్ప్డెస్క్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. నిజామాబాద్ డివిజన్లో రెండోవిడత.. -
స్థానిక ఎన్నికల్లో విజయం మాదే..
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి ● ఘనంగా దీక్షా దివస్నిజామాబాద్అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని, ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం దీక్షా దివస్ నిర్వహించారు. అనంతరం జీవన్రెడ్డి మాట్లాడుతూ నాటి దీక్షా దివస్ తెలంగాణ సాధించిన దివ్యాస్త్రమని గుర్తు చేశారు. తెలంగాణ అనే చెట్టు తల్లికి కేసీఆర్ వేరు లాంటి వ్యక్తి అని, ఆయన పేరు చెరిపివేయడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు చిత్తుగా ఓడిపోతాయని, బీఆర్ఎస్కు ప్రజలు పట్టం కట్టబోతున్నారని పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యాన్ని అంతం చేస్తామని, రేవంత్ సర్కారు మోసాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందన్నారు. బీఆర్ఎస్కు తొలి ప్రజాప్రతినిధిని అందించిన జిల్లా ప్రజలు మళ్లీ కేసీఆర్కు అండగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు వినాయక్నగర్లోని అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బీఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహంతోపాటు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అంబేద్కర్, గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు, ఆయేషా ఫాతిమా, మాజీ మేయర్ నీతు కిరణ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
డిజిటలైజేషన్తో సత్ఫలితాలు
● హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తంగిరాల మాధవీదేవి సుభాష్నగర్: కాగితాల నుంచి కంప్యూటర్ల వైపు ప్రపంచం పరుగులు పెడుతోందని, డిజిటలైజేషన్ మంచి ఫలితాలు ఇస్తోందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తంగిరాల మాధవీదేవి పేర్కొన్నారు. నగరంలోని జిల్లా కోర్టులో డాక్యుమెంట్ స్కానింగ్ సెంటర్ (రికార్డుల డిజిటలైజేషన్ ప్రాజెక్ట్)ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతలక్ష్మి, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, అదనపు జిల్లా జడ్జిలు హరీష, శ్రీనివాస్లతో కలిసి హైకోర్టు న్యాయయూర్తి ప్రారంభించారు. అనంతరం బార్ అసోసియేషన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు. కోర్టులలో న్యాయ వివాదాల దావాలు, క్రిమినల్ కేసుల కాగితాల కట్టల మూటలను కనబడని రీతిలో కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తామని తెలిపారు. యువ న్యాయవాదులు నిరంతరం అభ్యసించాలని, ఉద్యోగ నియామకాలు వచ్చినప్పుడు వాటిని ఒడిసి పట్టుకోవాలని ఆమె ఉద్భోదించారు. భీమ్గల్ మున్సిఫ్ కోర్టు ఏర్పాటుకు ఆర్థిక అనుమతులు వచ్చాయని, త్వరలోనే కోర్టు ఏర్పాటు అవుతుందని ఆమె వివరించారు. ఓల్డ్ విద్యాశాఖ ఖాళీ స్థలాన్ని జిల్లాకోర్టు అవసరాలకు అనుగుణంగా కేటాయించేందుకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో సంప్రదించినట్లు ఆమె వెల్లడించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భారతలక్ష్మి మాట్లాడుతూ బార్ అండ్ బెంచ్లో న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య సమన్వయం ఉందని ఆమె అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు మంథని రాజేందర్ రెడ్డి, బార్ అధ్యక్షుడు సాయరెడ్డి, సీనియర్ సివిల్ జడ్జి సాయిసుధ, జూనియర్ సివిల్ జడ్జిలు కుష్బూ ఉపాధ్యాయ, గోపీకృష్ణ, హరి కుమార్, చైతన్య, శ్రీనివాస్ రావు, ప్రభుత్వ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. -
తొలి అంకం ముగిసింది..
నిజామాబాద్ఒక్కో పార్టీ.. ఒక్కో తీరు.. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ప్రధాన పార్టీలు ఒక్కో మార్గాన్ని ఎంచుకున్నాయి. ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్ శ్రీ 2025– 8లో uసుభాష్నగర్/బోధన్ : గ్రామపంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల పర్వం శనివారం సాయంత్రంతో ముగిసింది. చివరి రోజు సర్పంచ్, వార్డు స్థానాల కోసం అభ్యర్థులు భారీగా తరలిరావడంతో రాత్రి వరకు స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. సా యంత్రం 5 గంటల్లోపు కేంద్రంలోకి వచ్చిన వారికి క్యూలైన్ టోకెన్లు అందించి దరఖాస్తులు స్వీకరించా రు. జిల్లాలో మొదటి విడతలో బోధన్ డివిజన్లోని 184 జీపీలు, 1,642 వార్డుస్థానాలకు పోటీ జరగనుంది. మొత్తం 2,61,210 మంది ఓటర్లు ఉండగా, 1,23,790 పురుషులు, 1,37,413 మహిళలు, 7 ఇతరులు తమ ఓట్లను వినియోగించుకోనున్నారు. నామినేషన్ల పర్వం చివరి రోజు కావడం.. అప్పటికే బుజ్జగింపుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రెండు రోజులకు సర్పంచ్ స్థానాలకు 304 మంది నామపత్రాలు అందజేయగా, వార్డు స్థానాలకు 382 మాత్రమే దాఖలు చేశారు. చివరి రోజు ఊహించిన దానికంటే ఎక్కువ మంది అభ్యర్థులు కేంద్రాలకు తరలివచ్చారు. అధికారులు సైతం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకున్నా.. తలకు మించిన భారమైంది. రాత్రి 1గంట వరకు అందిన సమాచారం ప్రకారం నవీపేట్ మినహా బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రుద్రూర్, వర్ని, ఎడపల్లి, సాలూర, రెంజల్ మండలాల్లో సర్పంచ్ స్థానాలకు 980 నామినేషన్లు దాఖల య్యాయి. వార్డు స్థానాలకు 2,889 నామినేషన్లు దాఖలయ్యాయి. గ్రామపంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల ప్ర క్రియ శనివారంతో ముగి యగా, ఆదివారం స్క్రూటినీ ఉంటుంది. డిసెంబర్ 3న మధ్యాహ్నం 3 గంటల్లోపు నా మినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదేరోజు అభ్యర్థుల జాబితా, గుర్తులను కేటాయిస్తారు. డిసెంబర్ 11న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్, తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు. అర్ధరాత్రి వరకూ కొనసాగిన నామినేషన్ల స్వీకరణ సాయంత్రం 5 గంటల తర్వాత గేట్లు మూసివేత టోకెన్లు ఇచ్చి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకున్న అధికారులు నవీపేట మినహా 10 మండలాల్లో సర్పంచ్ స్థానాలకు 980 నామినేషన్లు -
ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
● కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాలి ● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● ఆర్వో, ఏఆర్వోలకు శిక్షణసుభాష్నగర్ : గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ నియమ, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో ఆర్వోలు, ఏఆర్వోలకు పంచాయతీ ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులపై శనివారం పునఃశ్చరణ శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చట్టబద్ధతతో కూడిన ఎన్నికల విధులను ఎంతో జాగరూకతతో నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. నియమ, నిబంధనలపై స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే పొరపాట్లకు ఆస్కారం లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించవచ్చన్నారు. ఎన్నికల సంఘం అందించిన హ్యాండ్బుక్ను చదువుకొని ఈసీ మార్గదర్శకాల మేరకు సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో నిర్వహించాలని సూచించారు. సమయ పాలనను పక్కాగా పాటించాలన్నారు. నామినేషన్ల ఉపసంహరణ కోసం అభ్యర్థులు కాకుండా, వారి తరఫున ప్రతిపాదకులు వచ్చిన సమయంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఉపసంహరణకు అనుమతించాలని కలెక్టర్ సూచించారు. బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్లను అక్షర క్రమం ఆధారంగా వరుసగా ముద్రించాల్సి ఉంటుందని, ఓటరు జాబితాలోని అభ్యర్థి పేరును అక్షర క్రమం కోసం పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అభ్యర్థులు ఎన్ని సెట్ల నామినేషన్లు సమర్పిస్తే, అన్ని నామపత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని, వాటిలో ఎన్ని ఆమోదించబడ్డాయి, ఎన్ని తిరస్కరణకు గురయ్యాయి, అందుకు గల కారణాలను వెల్లడించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థుల నామినేషన్ పత్రాలను స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత బ్యాలెట్ పత్రాన్ని జాగ్రత్తగా రూపొందించాలని, పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తులతో పాటు ‘నోటా‘ సింబల్ను కూడా తప్పనిసరిగా చేర్చాలన్నారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించాలని, జిల్లాకు మంచి పేరు తేవాలని హితవు పలికారు. శిక్షణ తరగతుల్లో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, డీఎల్పీవో శ్రీనివాస్, ఆర్వోలు, సహాయ ఆర్వోలు పాల్గొన్నారు. -
ఎన్నికలపై వీడీసీ పెత్తనం!
నిజామాబాద్అర్బన్ : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో వేడి రాజుకుంది. నామినేషన్ల స్వీకరణ మొదలవ్వడంతో ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే, పంచాయతీ ఎన్నికలపై గ్రామాభివృద్ధి కమిటీలు కొన్ని పెత్తనం చెలాయిస్తున్నట్లు తెలిసింది. తాము నిర్ణయించిన వారే నామినేషన్ దాఖలు చేయాలని తీర్మానిస్తున్నట్లు సమాచారం. పలుచోట్ల పోటీకి ముందుకొస్తున్న వారికి వీడీసీలు కళ్లెం వేస్తున్నాయి. వీడీసీలను ప్రసన్నం చేసుకుంటేనే.. సర్పంచ్, వార్డు మెంబర్గా పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు మొదట గ్రామాభివృద్ధి కమిటీలను మచ్చిక చేసుకుంటున్నారు. వారు చెప్పిందే వినడం, వారు అడిగింది ఇవ్వడం, వ్యక్తిగతంగా వీడీసీ సభ్యులను కలవడం జరుగుతోంది. వివిధ రాజకీయ పార్టీ నాయకులు సైతం వీడీసీలను సంప్రదించి తమకు సంబంధించిన అభ్యర్థులను గెలిపించాలని పేర్కొనడం గమనార్హం. కలెక్టర్ ప్రకటించాల్సిందే.. ఎన్నికల సంఘం ఈ సారి పంచాయతీ ఎన్నికలకు కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. సర్పంచ్, వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికై తే దానిని ప్రకటించే బాధ్యత కలెక్టర్కే అప్పగించింది. ఏకగ్రీవమైన సర్పంచ్ను కలెక్టర్ పూర్తిస్థాయిలో పరిశీలించి నియమ నిబంధనల ప్రకారం ఉంటేనే ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించాల్సి వస్తుంది.వేలంతో ఏకగ్రీవం.. జిల్లాలోని 545 గ్రామ పంచాయతీలు, 5,025 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికల ప్రక్రియ మొదలైంది. మొదటి విడత బోధన్ డివిజన్, రెండో విడత నిజామాబాద్, మూడో విడత ఆర్మూర్ డివిజన్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఆర్మూర్, నిజామాబాద్ డివిజన్లో ప్రధానంగా సర్పంచ్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి గ్రామాభివృద్ధి కమిటీలు పెత్తనం కొనసాగిస్తున్నాయి. బోధన్ డివిజన్లోని వర్ని మండలంలో నామినేషన్ల స్వీకరణ తొలి రోజే రెండు సర్పంచ్ పదవులకు వీడీసీలు తీర్మానాలు చేసినట్లు సమాచారం. సంబంధిత గ్రామాల్లో వారు నిర్ణయించిన వారే సర్పంచ్గా పోటీ చేయాలని, మరెవరూ నామినేషన్లు దాఖలు చేయకూడదని తేల్చి చెప్పారు. దీంతో వీడీసీ నిర్ణయించిన వారే నామినేషన్లు వేశారు. ఆర్మూర్ డివిజన్లో ప్రస్తుతం గ్రామాభివృద్ధి కమిటీలతో ఆశావహుల చర్చలు కొనసాగుతున్నాయి. అంతేకాక గ్రామాభివృద్ధి కమిటీకి నిర్ణయించిన డబ్బులు చెల్లించిన వారే పోటీ చేయాలని కొన్ని గ్రామాలలో నిర్ణయించినట్లు తెలిసింది. ఆర్మూర్ మండలంలోని ఓ గ్రామంలో గురువారం రాత్రి గ్రామాభివృద్ధి కమిటీ నలుగురు సర్పంచ్ పోటీదారులతో చర్చించి తాము చెప్పినంత డబ్బులు చెల్లించిన వారే పోటీ చేయాలని తేల్చి చెప్పారు. జక్రాన్పల్లి మండలంలోని ఓ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ సర్పంచ్ అభ్యర్థిని నిర్ణయించింది. సర్పంచ్, వార్డు మెంబర్ల పదవులకు వేలం ఏకగ్రీవానికి ప్రయత్నాలు తాము నిర్ణయించే వారే నామినేషన్లు దాఖలు చేయాలని హుకుం -
సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరించాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డినిజామాబాద్అర్బన్: భూభారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలు, సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సబ్ కలెక్టర్లు, ఆర్డీవో, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో మండలాల వారీగా సాధించిన ప్రగతిని పరిశీలించారు. సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీలను తిరస్కరిస్తే కారణాలను స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. అర్హులైన వారికి యాజమాన్య హక్కులు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా పని చేయాలని హితవు పలికారు. వీసీలో అదనపు కలెక్టర్ కిరణ్కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిజ్ఞాన్ మాల్వియా, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్
నిజామాబాద్అర్బన్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి సమక్షంలో శుక్రవారం నిర్వహించారు. కలెక్టరేట్లోని వీసీ హాల్లో ఎన్నికల సంఘం ని బంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ చేపట్టారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ రెవె న్యూ డివిజన్లలోని మండలాల వారీగా ఆయా గ్రామ పంచాయతీల ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీవోలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. 545 గ్రామ పంచాయతీల సర్పంచ్, 5022 వార్డు స్థానాల ఎన్నికల నిర్వహణకు 20 శాతం రిజర్వ్ స్టాఫ్ను కలుపుకొని ప్రిసైడింగ్ అధికారులతోపాటు, ఓపీవోల ర్యాండమైజేషన్ నిర్వహించా రు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీ పీవో శ్రీనివాస్ రావు, నోడల్ అధికారి పవన్ కు మార్ తదితరులు పాల్గొన్నారు. -
ఉంగరం, కత్తెర, బ్యాట్, ఫుట్బాల్
● సర్పంచ్ అభ్యర్థుల గుర్తులుసుభాష్నగర్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గుర్తులను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సర్పంచ్ అభ్యర్థులకు పేరు ఆధారంగా క్రమసంఖ్యలో వచ్చే గుర్తును అధికారులు కేటాయించనున్నారు. సర్పంచ్ అభ్యర్థులకు ఉంగరం, కత్తెర, బ్యాచ్, ఫుట్బాల్, లేడీ పర్సు, టీవీ రిమోట్, టూత్పేస్ట్, స్పానర్, చెత్త డబ్బా, నల్లబోర్డు, బెండకాయ, కొబ్బరితోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్ సహా టేబుల్, బ్యాటరీ లైట్, బ్రెష్, చెప్పులు తదితర గుర్తులు ఉన్నాయి. అలాగే వార్డు స్థానాలకు పోటీచేసే అభ్యర్థులకు వేరే గుర్తులు కేటాయిస్తారు. గౌను, గ్యాస్పొయ్యి, స్టూల్, గ్యాస్ సిలిండర్, బీరువా, ఈల, కుండ, డిష్ యాంటీన, గరాటా, మూకుడు, ఐస్క్రీమ్, గాజు గ్లాసు, పోస్టు డబ్బా, కవరు, హాకీ బంతి, నెక్ టై, కటింగ్ ప్లేయర్, పెట్టే, విద్యుత్స్తంభం, కెటిల్ తదితర గుర్తులు ఉన్నాయి. వార్డుస్థానాల అభ్యర్థుల గుర్తులు -
పొరపాట్లకు తావివ్వొద్దు..
బోధన్రూరల్: తప్పిదాలు, పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. బోధన్ మండలం అమ్దాపూర్ జీపీలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నిక కోసం జారీ చేసిన నోటిఫికేషన్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్డెస్క్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని, అవసరమైన వారికి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని, సొంత నిర్ణయాలను అమలు చేయకూడదన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిమితిని పక్కాగా లెక్కించేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కొత్త బ్యాంకు అకౌంట్ తెరిచి, ఆ అకౌంట్ ద్వారానే ఎన్నికల లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కొత్త బ్యాంకు అకౌంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఆయా బ్యాంకులు వెంటనే అకౌంట్ ఓపెన్ చేసేలా చూడాలన్నారు.● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● నామినేషన్ల స్వీకరణ కేంద్రం తనిఖీ -
అభివృద్ధి చూసి ఓర్వలేకే ప్రశాంత్ రెడ్డి విమర్శలు
● రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి కమ్మర్పల్లి: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకే బా ల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి విమర్శలు చేస్తున్నా రని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం భీమ్గల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే ప్రజ ల మద్దతు ఉంటుందని, తమ పార్టీకి ప్రజల్లో వస్తు న్న ఆదరణ చూసి ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నాడని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో మహిళలకు ఇచ్చిన రుణాలకు వడ్డీ మాఫీ చేయలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తుంటే కేవలం ఎన్నికల కోసమే ఇస్తున్నారని ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారంలో లేక పోవడంతో హైదరాబాద్లో కేటీఆర్, బాల్కొండలో ప్రశాంత్రెడ్డి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. భీమ్గల్ పట్టణ అధ్యక్షుడు జే నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేశ్, నాయకులు గోపాల్ నాయక్, అన్వేష్, మహేశ్, రాజేశ్, నాగభూషణం, శ్యామ్రాజ్, నవీన్, అశోక్ పాల్గొన్నారు. -
అభ్యర్థులకు ‘బ్యాంక్ ఖాతా’ కష్టాలు
● కొత్త అకౌంట్ ఉండాల్సిందేనని నిబంధన ● బ్యాంక్ల వైపు అభ్యర్థుల పరుగులు బోధన్ : పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల స్వీకరణ రెండోరోజు శుక్రవారం కొనసాగింది. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీచేసే వారు నామినేషన్ పత్రాలతోపాటు కొత్త బ్యాంక్ అకౌంట్ (జీరో బ్యా లెన్స్) కచ్చితంగా జతచేయాలని అధికారులు ని బంధనలు జారీ చేశారు. నామినేషన్లు వేసేందుకు వెళ్లిన వారికి ఆర్వోలు కొత్త నిబంధనలు తెలపడంతో అభ్యర్థులు అవాక్కయ్యారు. ఇప్పటికిప్పుడే కొత్త బ్యాంక్ అకౌంట్లు ఎలా సాధ్యమవుతాయని పలువురు ఆర్వోలతో వాదనకు దిగారు. చివరికి చేసేదేమి లేక బ్యాంక్ల వైపు పరుగులు పెట్టారు. సాలూర మండలం కుమ్మన్పల్లి గ్రామానికి చెందిన అడ్డకట్ల గంగాధర్ సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలుకు సాలంపాడ్ క్యాంప్ నామినేషన్ కేంద్రానికి వెళ్లగా కొత్త బ్యాంక్ అకౌంట్ జత చేయాలని ఆర్వోలు సూచించారు. ఆర్వోలతో కొద్దిసేపు వాదించి చివరకు సాలంపాడ్ క్యాంప్ ఎన్డీసీసీబీ జీరో బ్యాలెన్స్ కొత్త అకౌంట్ తీసుకొని నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా అధికార యంత్రాంగం స్పందించి పాత నిబంధనల మేరకు బ్యాంకు ఖాతా తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు. -
వరద బాధితులను ఆదుకోవడంలో విఫలం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : వరద బాధితులను ఆ దుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా గురు, శుక్రవారాల్లో కామారెడ్డి జిల్లాలో ఆ మె పర్యటించారు. శుక్రవారం కామారెడ్డిలో జ్యోతీబాపూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కవిత పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆగస్టు చివ రి వారంలో కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో 94 వే ల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, రోడ్లు కొట్టుకుపోయాయని, పలువురు ప్రాణాలు కోల్పోయా రని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి జిల్లాలో పర్యటించినా రైతులకు నయాపైసా పరిహారం ఇవ్వలేదన్నారు. కామారెడ్డిలో గత ఎన్నికల్లో ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టి జెయింట్ కిల్లర్ అనిపించుకున్న బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రభుత్వంపై పోరాడి నిధులు తీసుకురావడంలో విఫల మయ్యారని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కనీసం తమ పార్టీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గానికై నా నిధులు ఇవ్వకుండా అన్యాయం చేసిందన్నారు. కామారెడ్డికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్అలీ సీఎంపై ఒత్తిడి తీసుకువచ్చి నిధులు తేవాలని డిమాండ్ చేశారు. ఒక్క బీసీకై నా టికెట్టిచ్చారా? కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించిందని, కానీ అదే ఎన్నికల్లో జిల్లాలో ఒక్క బీసీకి కూడా టికెట్టు ఇవ్వలేదని కవిత విమర్శించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్పై జాగృతి రాష్ట్రవ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడంతో ప్రభుత్వం రెండు బిల్లులు తీసుకువచ్చిందని, అయితే దాన్ని ఆమోదింపజేయడంలో విఫలమయ్యిందని దుయ్యబట్టారు. రిజర్వేషన్ల విషయంలో బీజేపీ మొదటి ద్రోహి అయితే కాంగ్రెస్ రెండో ద్రోహి అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 21, 22 ప్యాకేజీలకు ఇచ్చిన నిధులు కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్లాయే తప్ప పొలాలకు చుక్కనీరు పారలేదన్నారు. తనను కుటుంబం నుంచి దూరం చేసి కొందరు శునకానందం పొందుతున్నారన్నారు. లక్షలా ది మంది ప్రజలే కుటుంబంగా వారికి తనకు చేతనయిన సాయం చేస్తూ ముందుకు వెళుతున్నానని తెలిపారు. సమావేశంలో జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీనాచారి, జిల్లా అధ్యక్షుడు సంపత్గౌడ్, ప్రతినిధులు వసంత, లత తదితరులు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయంగా వ్యవహరిస్తున్నాయి సీఎం వచ్చి వెళ్లినా నయాపైసా ఇవ్వలేదు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత -
నిజామాబాద్
శనివారం శ్రీ 29 శ్రీ నవంబర్ శ్రీ 2025ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ పోటీ చేసి ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యే హక్కు ఉంది. కానీ, ఆ హక్కును కాలరాసే ప్రయత్నాలు చేస్తున్నాయి కొన్ని గ్రామాభివృద్ధి కమిటీలు. పంచాయతీ ఎన్నికలను శాసిస్తున్నాయి. సర్పంచ్, వార్డు మెంబర్ల పదవులకు వేలం నిర్వహిస్తూ ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలోనే బోధన్ డివిజన్ వర్ని మండలంలోని రెండు గ్రామాల్లో నామినేషన్ల తొలిరోజు వీడీసీలు తీర్మానించిన వారే సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు చేశారు.ఈ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. -
ఏకగ్రీవాలకు నజరానా లేనట్టేనా?
● గతంలో సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎంపిక చేస్తే జీపీలకు ప్రోత్సాహకాలు ప్రకటించిన ప్రభుత్వం ● ఈసారి ఎన్నికలపై స్పందించని వైనంమోర్తాడ్(బాల్కొండ): గ్రామ పంచాయతీల్లో పోలింగ్ తంతు లేకుండా ఏకగ్రీవంగా సర్పంచ్, వార్డు సభ్యులను ఎంపిక చేస్తే నజరానా అందించడానికి ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ వెలువడినప్పటికి ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలు ప్రకటించకపోవడంపై ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 2019లో రూ.15లక్షలు ప్రకటించినా.. గ్రామాలలో రాజకీయ కక్షలు పెరగకుండా ఉండాలంటే గ్రామస్తులు అంతా కూర్చుని ఏకగ్రీవ పద్ధతిలో సర్పంచ్, వార్డు సభ్యులు, అందులోనే ఉపసర్పంచ్ను ఎన్నుకునే ఆనవాయితీని ఉమ్మడి రాష్ట్రంలో విస్తృతం చేశారు. ఏకగ్రీవంగా ప్రజాప్రతినిధుల ను ఎంపిక చేసిన పంచాయతీలకు ప్రత్యేక నిధులు ఇవ్వడం వల్ల అభివృద్ధి జోరుగా సాగుతుందనే ఉద్దేశ్యంతో అనేక చోట్ల ఏకగ్రీవాలు జరిగాయి. గతంలో ఏకగ్రీవ పంచాయతీలకు రూ.1లక్ష నుంచి రూ. 5లక్షల వరకూ ప్రోత్సాహకాలను అందించారు. 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ ప్రోత్సాహకాన్ని రూ.15 లక్షలకు పెంచింది. దీంతో అప్ప ట్లో జిల్లాలో 130 గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవంగానే ప్రజాప్రతినిధుల ఎంపిక జరిగింది. కానీ నిధుల కొరతతో ఏ ఒక్క పంచాయతీకి ఏకగ్రీవ నజరానాను అప్పట్లో ప్రభుత్వం అందించలేదు. ఈసారి మూడు విడతల్లో ఎన్నికలను జరుప నుండగా తొలివిడత సంగ్రామం మొదలైనా ప్రభుత్వం నుంచి ఏకగ్రీవ పంచాయతీలకు ప్రో త్సాహం విషయంపై స్పష్టత రాలేదు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎంపిక జరిగే పంచాయతీలకు నజరానా అందడం అనుమానమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలను అందించే విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేస్తే ఈ అంశాన్ని అన్ని గ్రామాల ప్రజలకు తెలియచేస్తాం. – శివకృష్ణ, డీఎల్పీవో, ఆర్మూర్ -
చెట్టును ఢీకొన్న ట్రాక్టర్
బాల్కొండ:మెండోరా మండలం సావెల్ గ్రా మంలో శుక్రవారం ఇసుక ట్రాక్టర్ అతివేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటరలో ఎ వరికీ గాయాలు కాలేవు. మండలంలోని వె ల్కటూర్ పెద్ద వాగు నుంచి ఇసుకను శుక్రవారం అనుమతితో తరలిస్తున్నారు. కానీ ట్రాక్టర్ను డ్రైవర్లు వేగంగా నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. గత నా లుగు రోజుల క్రితం ఇదే గ్రామంలో ఇసుక ట్రాక్టర్ అతి వేగంగా వచ్చి బోల్తా పడింది. బోల్తాపడిన కారు వేల్పూర్: మండలకేంద్రంలోని రహదారిపై ఓ కారు ప్రమాదవశాత్తు బోల్తాపడగా, ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని అమీనాపూర్ గ్రామానికి చెందిన లోలం శ్రీనివాస్ శుక్రవారం తన కారులో ఆర్మూర్ నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. వేల్పూర్ ఆర్అండ్బీ ప్రధాన రోడ్డుపై కారు అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న శ్రీనివాస్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అతడు ఇంతకుమందు కూడా రెండుసార్లు ఇదే రకమైన ప్రమాదాలతో బయటపడినట్లు గ్రామస్తులు తెలిపారు. -
రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీ విజేత నిజామాబాద్
ధర్మారం(ధర్మపురి)/నిజామాబాద్నాగారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం తెలంగాణ బాలుర గురుకుల విద్యాలయంలో నిర్వహించిన అండర్–14 వాలీబాల్ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు శుక్రవారం రాత్రి ముగిశాయి. పోటీలకు 10 ఉమ్మడి జిల్లాల నుంచి 244 మంది బాలబాలకులు తరలివచ్చారు. మూడురోజుల పాటు జరిగిన పోటీల్లో ఫైనల్కు (బాలికల విభాగం) మహబూబ్నగర్, నిజామాబాద్ జట్లు చేరాయి. నిజామాబాద్ జట్టు మహబూబ్నగర్పై విజయం సాధించి, విజేతగా నిలిచింది. బాలుర విభాగంలో ఫైనల్స్లో ఖమ్మం జట్టు వరంగల్ జట్టుపై విజయం సాధించింది. లయన్స్క్లబ్ సౌజన్యంతో విజేతలకు ట్రోఫీలు ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా విద్యాధికారి శారద హాజరయ్యారు. అకడమీక్ అధికారి పీఎం షేక్, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి సురేశ్, మండల విద్యాధికారి ప్రభాకర్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజ్కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా జట్టుకు పీడీలు మధు, నరేంధర్, కోచ్, మేనేజర్లుగా వ్యవహారించారు. నిజామాబాద్ జిల్లా జట్టును ఎస్జీఎఫ్ కార్యదర్శి నాగమణి ప్రత్యేకంగా అభినందించారు. -
పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు
నిజామాబాద్అర్బన్: జిల్లాలో డిసెంబర్ 1 నుంచి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగనుండగా, పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు సీపీ సాయిచైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పరీక్షల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నామన్నారు. డిసెంబర్ 6 వరకు పరీక్ష కేంద్రాల వద్ద నిబంధనలు కొనసాగుతాయన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష కేంద్రాల వద్ద సబ్ డివిజన్లలో ఈ నిబంధనలు అమలు చేస్తామన్నారు. పదీక్ష కేంద్రాల వద్ద ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉండకూడదన్నారు. నిషేధిత వస్తువులతో పరీక్ష కేంద్రాల వద్ద తిరగవద్దన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లోని అన్ని జిరాక్స్ సెంటర్లను మూసిఉంచాలన్నారు. నిజామాబాద్అర్బన్: జిల్లాలోని ఏఆర్, సివిల్ పోలీస్ సిబ్బందికి శుక్రవారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తన కార్యాలయంలో ఉలెన్, బ్లాంకెట్స్ పంపిణీ చేశారు. చలికాలంలో విధుల నిర్వహణ కష్టమవుతున్న తరుణంలో ముందు జాగ్రత్తల్లో భాగంగా సిబ్బందికి బ్లాంకెట్స్ పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సిబ్బంది ఉలెన్ దుస్తులు ధరించాలన్నారు. విధి నిర్వహణలో కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. అదనపు డీసీపీ రాంచదర్రావు, రిజర్వు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, తిరుపతి పాల్గొన్నారు. -
జంగంపల్లిలో ఒకరి ఆత్మహత్య
భిక్కనూరు: మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఒకరు ఆత్మహత్యకు పాల్పడినట్లు భిక్కనూరు ఎస్సై అంజనేయులు తెలిపారు. వివరాలు ఇలా.. జంగంపల్లి గ్రామానికి చెందిన చిట్టబోయిన అంజయ్య(42) గురువారం తన భార్యను వైద్యం కోసం కామారెడ్డిలోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులకు చూపించిన అనంతరం ఆమెను బస్సు ఎక్కించి ఇంటికి పంపాడు. కానీ అతడు ఇంటికి వెళ్లలేదు. శుక్రవారం ఉదయం జంగంపల్లి గ్రామ శివారులోని ఒక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. అంజయ్యకు అప్పులు ఎక్కువ అవడంతో ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. రుద్రూర్: పోతంగల్ మండలం హంగర్గ గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు కోటగిరి ఎస్సై సునీల్ తెలిపారు. వివరాలు ఇలా.. బిచ్కుంద మండలం చిన్నదడ్గి గ్రామానికి చెందిన మణిగిరి లక్ష్మి (38)కి పోతంగల్ మండలం మల్లికార్జున్తో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. భర్త మద్యానికి బానిస కావడం, లక్ష్మి అనారోగ్యంతో బాధపడటంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో లక్ష్మి జీవితంపై విరక్తి చెంది గురువారం రాత్రి ఇంట్లోని ఫ్యాన్కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఖేలో ఇండియా పోటీల్లో ప్రతిభ
నవీపేట: మండలంలోని బినోలకు చెందిన స్విమ్మింగ్ క్రీడాకారిణి మిట్టపల్లి రిత్విక ఖేలో ఇండియా యూనివర్సిటీ స్విమ్మింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చింది. ఈనెల 25 నుంచి 28 వరకు రాజస్థాన్ రాజధాని జైపూర్లోని సవాయి యూనివర్సిటీ స్టేడియంలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ఒక బంగారు పతకంతోపాటు రెండు కాంస్య పతకాలను సాధించింది. కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ టెక్నాలజీ యూనివర్సిటీ(భువనేశ్వర్) తరపున రిత్విక పాల్గొంది. ఈసందర్భంగా రిత్వికకు పీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, స్విమ్మింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్రెడ్డి, ఉమేష్, ఉపాధ్యక్షులు మహిపాల్రెడ్డి, జిల్లా ప్రతినిధులు అభినందనలు తెలిపినట్లు శుక్రవారం రిత్విక తండ్రి విలేకరులకు తెలిపారు. తెయూ(డిచ్ పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల్లో శుక్రవారం మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతూ ఇద్దరు విద్యార్థులు డిబార్ అయినట్లు ఆడిట్సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటుచేసిన 30 పరీక్ష కేంద్రాలలో మొత్తం 6,974 మంది అభ్యర్థులకు గాను 6,581 మంది విద్యార్థులు హాజరు కాగా 391 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు డిబార్ అయినట్లు తెలిపారు. ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని జీజీ కళాశాలలో శుక్రవారం అకడమిక్ ఆడిట్ విజయవంతంగా పూర్తయినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.రామ్మోహన్ రెడ్డి తెలిపారు. అకాడమిక్ అడ్వైజర్స్ బోధన్ ప్రిన్సిపాల్ సురేష్, వరప్రసాద్ కళాశాలలోని అన్ని శాఖలను, అనుబంధ విభాగాలను 2022–23, 2023–24 సంవత్సరాలకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రంగరత్నం, కో–ఆర్డినేటర్లు నహీద బేగం, వినయ్ కుమార్, రాజేష్ పాల్గొన్నారు. నిజామాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేడు దీక్షా దివస్ కార్యక్రమం చేపట్టనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా అన్నదాన, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆస్పత్రిలో పాలు, పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అలాగే వేలాది మందితో దీక్షా దివస్ను నిర్వహిస్తున్నామన్నారు. -
కమ్మేసిన పొగమంచు
మానిక్బండార్లో సూర్యోదయం వేళ కమ్ముకున్న పొగమంచు నిజామాబాద్అర్బన్/వేల్పూర్: జిల్లాలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉదయం 8 గంటల వరకు పొగ మంచు తీవ్రంగా ఉండటంతో రహదారులపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. సూర్యోదయం అవుతుండడంతో పొగమంచు తొలగిపోతూ వచ్చింది. జిల్లాలోని సుమారు అన్ని ప్రాంతాలలో దట్టమైన పొగమంచు ఏర్పడింది. జిల్లా కేంద్రంతో పాటు మాక్లూర్, నందిపేట్ నవీపేట్, ఆర్మూర్ ప్రాంతాల్లో ఈ తీవ్రత ఎక్కువగా ఉంది. -
వాహనాల తనిఖీ
సిరికొండ: మండలకేంద్రం సమీపంలో శుక్రవారం స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం వాహనాలను తనిఖీ చేశారు. వాహనాల్లో యాభై వేల కంటే ఎక్కువ డబ్బులు, మద్యం తరలిస్తున్నారా అని తనిఖీ చేశారు. ఉప తహసీల్దార్ గంగాధర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ● ఆధారాలు చూసి వాపస్ ఇచ్చిన అధికారులు మాచారెడ్డి: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని ఘన్పూర్ (ఎం) స్టేజి వద్ద చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన కూడెల్లి అశోక్ శుక్రవారం డీసీఎం వాహనంలో రూ.10 లక్షలతో హైదరాబాద్ వెళ్తున్నాడు. ఘనపూర్ స్టేజీ వద్ద తనిఖీ అధికారులు వాహనాన్ని ఆపి, చెకింగ్ చేయగా, రూ.10లక్షలు బయటపడ్డాయి. దీంతో వాహన యజమాని అల్లం లక్ష్మణ్ ఆధారాలు చూపించడంతో అధికారులు స్వాధీనం చేసుకున్న డబ్బును తిరిగి అతడికి ఇచ్చేశారు. కామారెడ్డి అర్బన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో శనివారం దోమకొండలోని ఆనంద్భవన్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అండర్–14 బాలుర క్రికెట్ జట్టును ఎంపిక చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఎంపిక పోటీలు ఉంటాయని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి హీరాలాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగలవారు తమ ఒరిజినల్ బోనఫైడ్ సర్టిఫికెట్తో రావాలని సూచించారు. ఎంపికై న జట్టు భద్రాద్రి కొత్తగూడెంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందని పేర్కొన్నారు. -
భర్త దాడిలో భార్య మృతి
బోధన్: భర్త క్షణికావేశంలో భార్యపై దాడిచేయగా మృతిచెందిన ఘటన ఎడపల్లి మండలంలోని ఎమ్మెస్సీ ఫారం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. ఎమ్మెస్సీ ఫారం గ్రామంలో మహ్మద్ హుస్సేన్ అతడి భార్య సుల్తానా బేగం(50) నివాసం ఉంటున్నారు. దంపతులకు మద్యం తాగే అలవాటు ఉంది. ఈక్రమంలో సుల్తానాబేగం గురువారం సాయంత్రం పక్కింట్లోకి వెళ్లి, మద్యం తాగుతోంది. ఈ సమయంలో భర్త హుస్సేన్ అక్కడికి వచ్చి ఆవేశంతో సుల్తానాను మెడపట్టి గోడకేసి కొట్టాడు. దీంతో ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లగా, ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టాడు. అప్పటికే ఆమె మృతిచెందడంతో మృతురాలి కొడుకు ఖాదర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మద్యం మత్తులో కిందపడిన వ్యక్తి.. బోధన్: మద్యం మత్తులో ఓ వ్యక్తి రోడ్డు పక్కన పడిపోయి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా..బోధన్ పట్టణం పాన్గల్లికి చెందిన బొద్దుల నరేందర్(46)కు 20 ఏళ్లక్రితమే వివాహం జరిగింది. పిల్లలు కలగకపోవడంతో మూడేళ్ల క్రితం అతడిని భార్య విడిచిపెట్టి వెళ్లిపోయింది. అప్పటి నుంచి నరేందర్ మద్యానికి బానిసై సంచరిస్తూ, కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో గురువారం రాత్రి అతడు మద్యం తాగి వెళుతుండగా జానకంపేట రైల్వే గేట్ వద్ద రోడ్డు కింద పడిపోయి మృతి చెందాడు. శుక్రవారం ఉదయం స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమచారం అందించారు. ఘటన స్థలానికి వారు చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడిని నరేందర్గా గుర్తించి, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ వృద్ధుడి .. మోపాల్: అగ్నిప్రమాదంలో గాయపడిన ఓ వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై సుస్మిత తెలిపిన వివరాలు ఇలా.. మండలకేంద్రానికి చెందిన జక్కు దేవయ్య (74) ఈనెల 17న తన పొలంలో కోసిన గడ్డికి నిప్పు పెట్టాడు. మంటలు వ్యాపించి దేవయ్యకు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మృతుడి కొడుకు సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
రోడ్ల మరమ్మతులు త్వరగా పూర్తిచేయాలి
● నాణ్యతతో చేపట్టేలా పర్యవేక్షించాలి ● ఆర్అండ్బీ అధికారులకు కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ఆదేశం సుభాష్నగర్:ప్రజలకు రవాణా సదుపాయం మెరుగుపర్చేందుకు వీలుగా చేపడుతున్న రోడ్డు మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రధాన రహదారులు దెబ్బతినగా అధికారులు మరమ్మతులు చేపడుతున్నారు. మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద, బైపాస్ రోడ్డు, డిచ్పల్లి రైల్వేస్టేషన్ ఎదురుగా ప్రధాన రహదారిపై కొనసాగుతున్న రోడ్ల మరమ్మతులను శుక్రవారం క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. త్వరితగతిన పనులను పూర్తి చేయించాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. పనులు నాణ్యతతో చేపట్టేలా పకడ్బందీగా పర్యవేక్షించాలన్నారు. కాగా నగరంలో గోల్ హనుమాన్ నుంచి పూసలగల్లికి వెళ్ళే మార్గంలో మరమ్మతులు చేపట్టాల్సి ఉన్న ప్రాంతాలను సైతం కలెక్టర్ పరిశీలించారు. తక్షణమే పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, మరోమారు క్షేత్రస్థాయి పరిశీలన చేయడంతోపాటు పనుల ప్రగతిని సమీక్షిస్తానని అన్నారు. ఆర్అండ్బీ అధికారులు ప్రవీణ్, నగర పాలక సంస్థ సహాయ కమిషనర్ రవీంద్రసాగర్, ఇనాయత్ తదితరులు ఉన్నారు. -
జీవితంపై విరక్తితో యువతి ఆత్మహత్య
బాల్కొండ: యువతి ఉరేసుకొ ని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెండోరా మండలం వెల్కటూర్లో చోటు చేసుకుంది. ఎస్సై సుహాసిని తెలిపిన వివరాల ప్రకారం.. వెల్కటూర్కు చెందిన రెడ్డి అనూష(25) కొంతకాలంగా తలనొప్పి, చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతోంది. ఈ క్రమంలో జీవితంపై విరక్తితో బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దులానికి చున్నీతో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు తో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిజామాబాద్ అర్బన్: జిల్లాలోని మద్యం సేవించి వాహనాలు నడిపిన 34 మందికి రూ.3 లక్షల 35 వేలు జరిమానా విధించినట్లు పోలీస్ కమిషనర్ సాయిచైతన్య తెలిపారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో తనిఖీలు నిర్వహించగా 34 మంది మద్యం తాగి వాహనాలు నడిపినట్లు గుర్తించామన్నారు. గురువారం కోర్టులో హాజరుపర్చగా జడ్జి జరిమానా విధించినట్లు తెలిపారు. బాల్కొండ: మెండోరా మండలం వెల్కటూర్ శివారులో పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను ఎస్సై సుహాసిని గురువారం సీజ్ చేశారు. పెద్దవాగు నుంచి అనుమతులు, వే బిల్లులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేశామన్నారు. ఆర్మూర్టౌన్: పట్టణంలోని మామిడిపల్లి శివారులో పేకాట స్థావరంపై దాడి చేసి పేకాడుతున్న నలుగురిని పట్టుకున్నామని ఎస్హెచ్వో సత్యనారాయణ తెలిపారు. వారి నుంచి రూ. 11,500 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
● ప్రారంభమైన తొలివిడత నామినేషన్ల ప్రక్రియ
● సర్పంచ్ స్థానాలకు 144.. వార్డు స్థానాలకు 96 మంది నామినేషన్లుబోధన్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్కు గురువారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. బోధన్ రెవెన్యూ డివిజన్లోని పది మండలాలు, నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని నవీపేట మండలంలోని 184 సర్పంచ్, 1642 వార్డు స్థానాలకు నామినేషన్లను స్వీకరించారు. తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 144, వార్డు స్థానాలకు 96 మంది నామినేషన్లు దాఖలు చేశారు. తొలి విడత ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 57 కేంద్రాలను ఏర్పాటుచేసిన అధికారులు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నామినేషన్లను స్వీకరించారు. కేంద్రాల వద్ద పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందితో హెల్ప్డెస్క్లు, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
చట్టబద్ధ దత్తత శ్రేయస్కరం
● జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బీ నిజామాబాద్ నాగారం: చట్టబద్ధంగా దత్తత తీసుకోవడం శ్రేయస్కరమని జిల్లా సంక్షేమ అధికారి రసూల్బీ పేర్కొన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో స్థానిక వంశీ ఇంటర్నేషనల్ హోటల్లో పిల్లల దత్తతపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగ పిల్లలను దత్తత తీసుకోవడానికి తల్లిదండ్రులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జనరల్ పిల్లలతోపాటు స్పెషల్ నీడ్ పిల్లలకు కూడా అమ్మానాన్నల ఆవశ్యకత ఉంటుందని, ప్రేమ ఆప్యాయత అవసరమని, వారిని వైకల్యం పేరుతో దూరం పెట్టకూడదని, దత్తత తీసుకొని వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి చైతన్యకుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో దత్తత ప్రక్రియపై అవగాహన కల్పిస్తామని, ఈ ఏడాది స్పెషల్ నీడ్ చిల్డ్రన్ అడాప్షన్ అంశాన్ని ఎంచుకున్నామన్నారు. కార్యక్రమంలో సీడీపీవోలు సౌందర్య, జ్యోతి, శిశు గృహ మేనేజర్ అనిత, అనిల్, డీసీపీయూ సిబ్బంది, దత్తత కోరుకునే తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో ఒకరి మృతి
● ఆలస్యంగా వెలుగులోకి.. నందిపేట్ (ఆర్మూర్): విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిచెందిన ఘటన నందిపేట మండలం కౌల్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ నెల 22న చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. వెల్మల్ గ్రామానికి చెందిన ఇస్సపల్లి గంగాధర్కు గ్రామశివారు, రైతుఫారం గ్రామ సమీపంలో పొలం ఉంది. ఆ పొలంగట్లపై ఉన్న టేకు చెట్ల కొమ్మలు తొలగించేందుకు కౌల్పూర్ గ్రామానికి చెందిన ఉమ్మెడ సాయిలు, గోపు సాయిలు (40) కలిసి శనివారం ఉదయం వెళ్లారు. ఆ చెట్ల మీదుగా ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్ గమనించకుండా కొమ్మలు తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో గోపు సాయిలుకు విద్యుత్ షాక్ తగలడంతో చెట్టుపై నుంచి పడి అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. మృతుడు సాయిలుకు భార్య శ్రావణి, కూతురు అక్షిత, కుమారుడు ప్రణయ్ ఉన్నారు. కూలి పనులు చేసుకుంటూ తమను పోషించే కుటుంబపెద్ద చనిపోవడంతో భార్య శ్రావ ణి కన్నీళ్ల పర్యంతమైంది. విద్యుత్ శాఖ అధికారులు తమను ఆదు కోవాలని వేడుకుంటోంది. చికిత్స పొందుతూ ఒకరు..రాజంపేట: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన రాజంపేట మండలం గుడితండాలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గుడితండా గ్రామానికి చెందిన మెగావత్ సామ్య, ఫన్నీ దంపతులు బుధవారం బైక్పై ఎల్లారెడ్డిపల్లి నుండి గుడితండాకు వెళ్తున్న క్రమంలో ఎదురుగా బానోత్ అనే వ్యక్తి పల్సర్ బైకుపై వచ్చి ఢీకొట్టాడు. దీంతో సామ్యకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పతిక్రి తరలించారు. గురువారం చికిత్స పొందుతూ సామ్య మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. భార్య ఫన్నీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎన్ రాజు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు..మోర్తాడ్: మండలంలోని గాండ్లపేట శివారు పెద్దవాగుపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించారు. జగిత్యాల్ జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్కు చెందిన పేర్ల కృష్ణ(44) తన స్నేహితుడు కోట సమ్మయ్యతో కలిసి ఆర్మూర్కు వెళుతుండగా వంతెనపై ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన కృష్ణను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాము తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బాఽధిత కుటుంబసభ్యులకు అప్పగించినట్లు వివరించారు. -
సర్పంచ్ కాలేకపోయినా.. ఎమ్మెల్యే, మంత్రిగా..
● ముచ్కూర్ వాసి శనిగరం సంతోష్రెడ్డి ప్రస్థానం మోర్తాడ్(బాల్కొండ): సొంత గ్రామానికి సర్పంచ్గా ఎంపిక కాలేకపోయినా ఆర్మూర్ నియోజకవర్గానికి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, వివిధ శాఖలకు మంత్రిగా, ఒకసారి జడ్పీ చైర్మన్గా ఎంపికై న శనిగరం సంతోష్రెడ్డి విశేషమైన గుర్తింపును తెచ్చుకున్నారు. భీమ్గల్ మండలం ముచ్కూర్కు చెందిన సంతోష్రెడ్డి 1971లో సర్పంచ్గా ఎంపిక కావాలనే ఉద్దేశ్యంతో వార్డు స్థానానికి పోటీ చేశారు. అప్పట్లో వార్డు సభ్యునిగా ఎంపికై న వారే మెజార్టీ సభ్యుల మద్దతుతో సర్పంచ్ పదవిని పొందేవారు. అలా వార్డు సభ్యునిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. గ్రామ రాజకీయాలు కలిసి రాకపోవడంతో ఇంది రా కాంగ్రెస్ పార్టీ లో క్రియాశీలక నేతగా గుర్తింపు పొంది 1978లో తొలిసారి ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1983, 1989లో మరోసారి ఎమ్మెల్యేగా ఎంపికై ఆర్థిక శాఖ, రోడ్లు భవనాలు, భారీ పరిశ్రమల శాఖలకు మంత్రిగా పనిచేశారు. 2002లో భీమ్గల్ జడ్పీటీసీగా గెలిచి బీఆర్ఎస్ తరఫున జిల్లా పరిషత్ చైర్మన్గా ఎంపికయ్యారు. 2004లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా కొన్ని నెలలపాటు పనిచేశారు. -
శిశు మరణాల రేటు తగ్గించాలి
డీఎంహెచ్వో రాజశ్రీ నిజామాబాద్నాగారం: పుట్టిన శిశువుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, శిశు మరణాల రేటు జీరో శాతానికి తీసుకువచ్చేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి రాజశ్రీ సంబంధిత అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో గురువారం వివిధ విభాగాలు, మెడికల్ ఎడ్యుకేషన్, వైద్య విధాన పరిషత్తో సంకల్ప సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో శిశువు పుట్టిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రం, జిల్లా ఆస్పత్రి, ఎస్ఎన్సీయూ లాంటి కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. పీడియాట్రిక్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ చిన్నపిల్లల్లో శ్వాస కోశ వ్యాధులను ముందుగా గుర్తించి చికిత్స అందించాలన్నారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసినప్పుడే సంకల్పం నెరవేరుతుందన్నారు. సమావేశంలో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్, నోడల్ ఆఫీసర్ డాక్టర్ రాజశేఖర్,న వైద్యులు శివ శంకర్, నిరూపరెడ్డి, శ్వేత, కావ్య, సామ్రాట్, శిఖర, వెంకటేశ్, పిల్లల వైద్య నిపుణులు, పీహెచ్సీల వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రచార వ్యయం పరిమితం
● జనాభా సంఖ్య ఆధారంగా ఖర్చుపై పరిమితులు ● 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం వ్యయ పరిమితులుమోర్తాడ్(బాల్కొండ): సర్పంచ్, వార్డు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం కోసం పరిమితంగానే ఖర్చు చేయాల్సి ఉంది. 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నిర్ణయించిన మొత్తాన్నే ఎన్నికల సంఘానికి అభ్యర్థులు లెక్కలు చూపాల్సి ఉంది. మూడు విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డుస్థానాలకు పోటీ చేసే వారు ఎన్నికల సంఘం నిర్దేశించినదానికన్నా ఎక్కువ ఖర్చు చేస్తే వేటు వేసే అవకాశం ఉంది. 5 వేలకు మించి జనా భా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.2.50లక్షల వరకు, వార్డు అభ్యర్థులు రూ.50వేల వరకు ఖర్చు చేయొచ్చు. అలాగే 5వేల కన్నా తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అ భ్యర్థులు రూ.1.50లక్షలు, వార్డు స్థానాలకు పోటీ చేసేవారు రూ.30వేల వరకు మాత్రమే ఖర్చు చే యాలి. అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమ ర్పించే ముందే కొత్తగా బ్యాంకు ఖాతా తెరిచి ఆ ఖా తా ద్వారానే చెల్లింపులు చేసేలా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థులకు పాత బ్యాంకు ఖాతాలు ఉన్నా వాటిని పక్కన పెట్టి కొత్తగా ఎన్నికల్లో పోటీ చేయడానికే ఖాతాలను తెరవాల్సి ఉంది. ప్రతి ఖర్చుకు బ్యాంకు ఖాతా ద్వారానే చెల్లింపులు చేయాలనే నిబంధన ఉండటంతో అభ్యర్థులు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచే పనిలో నిమగ్నమయ్యారు. -
డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులు డిబార్
తెయూ (డిచ్పల్లి): తెయూ పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షల్లో గురువారం ఇద్దరు విద్యార్థులు డిబార్కు గురైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 30 పరీక్ష కేంద్రాల్లో ఉదయం జరిగిన పరీక్షలకు 5,974 మంది విద్యార్థులకు 5,674 మంది హాజరుకాగా 299 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 5,589 మంది విద్యార్థులకు 5,117 మంది హాజరుకాగా 471 మంది పరీక్ష రాయలేదని తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీరా డిగ్రీ కాలేజీ పరీక్ష కేంద్రంలో ఒకరు, బోధన్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ పరీక్ష కేంద్రంలో ఒకరు మాల్ప్రాక్టీస్కు పాల్పడుతూ డిబార్ అయ్యారని పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్: భగవద్గీత సకల సమస్యలకు పరిష్కారం చూపే సమాహారమని వక్తలు పేర్కొన్నారు. గీతా జయంతిని పురస్కరించుకొని అఖిల భారతీయ భగవద్గీత కేంద్ర ప్రచార మండలి ఆధ్వర్యంలో గురువారం పాఠశాల స్థాయి విద్యార్థులకు భగవద్గీత కంఠస్థ పఠన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గీతా భవనం ఉపాధ్యక్షుడు యొగ రామచంద్రం మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు, దేశభక్తి, దైవభక్తిని పెంచడానికి జిల్లా స్థాయి భగవద్గీత పోటీలు నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ గీత శ్లోకాలు కంఠస్థం చేయాలని కోరారు. కార్యక్రమంలో బొడ్డు దయానంద్, చంద్రశేఖర శర్మ, పలు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ● డీఆర్డీవో సాయాగౌడ్ డిచ్పల్లి: బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని డీఆర్డీవో సాయాగౌడ్ సూచించారు. గురువారం నిర్వహించిన డిచ్పల్లి మహిళా మండల సమాఖ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బ్యాంకు లింకేజీ రుణాలను వందశాతం రికవరీ చేయాలన్నారు. పాడి కొనుగోలు సెంటర్ల ద్వారా గ్రామ సంఘాల ఆదాయం పెంపొందించుకోవాలని సూచించారు. సమావేశంలో డీపీఎం సంధ్యారాణి, ఏబీఎన్ రవీందర్, సీసీలు, మండల సమాఖ్య అధ్యక్షురాలు స్వప్న, గ్రామ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. -
మానవ మేధకు ఏఐ పరికరం మాత్రమే
తెయూ వీసీ టీ యాదగిరి రావు నిజామాబాద్నాగారం:మానవ మేధకు ఏఐ సహా యం చేసే పరికరం మాత్రమేనని, విచక్షణతో వాడు కోవాలని తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ యాదగిరి రావు తెలిపారు. నగరంలోని గిరిరాజ్ ప్ర భుత్వ కళాశాలలో గురువారం భౌతిక శాస్త్ర విభా గం ఆధ్వర్యంలో ‘కృత్రిమ మేధ యుగంలో విజ్ఞా న శాస్త్రాలకు ఉన్న అవకాశాలు–అవరోధాలు‘ అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరైన తెయూ వీసీ యాదగి రి రావు, కేయూ మాజీ వీసీ ఆర్.సాయన్న సావనీర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్కువ శ్రమతో ఎక్కువ సమాచారాన్ని వే గంగా,తక్కువ సమయంలో ఏఐ విశ్లేషిస్తుందన్నా రు. ప్రస్తుతం ఈ సేవలు ఖరీదైనవి, కానీ సమీప భ విష్యత్తులో తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులోకి వస్తాయని అన్నారు. అనంతరం ఉస్మాని యా యూనివర్సిటీ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ ఫెసర్ కరుణాసాగర్ సదస్సుపై కీలక ఉపన్యాసం చేశారు. ముఖ్యవక్తలుగా ఐఐటీ హైదరాబాద్ సూ ర్యనారాయణ,ఎన్ఐటీ వరంగల్ ప్రొఫెసర్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. సదస్సులో పాల్గొన్న ఆ చార్యులు, పరిశోధకులు,విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, ప రిశోధక విద్యార్థులు పత్ర సమర్పణలు చేశారు. కార్యక్రమంలో సదస్సు సమన్వయకర్తలు డాక్టర్ రామకష్ణ, భరత్ రాజ్, వైస్ ప్రిన్సిపాల్ డా.రంగరత్నం, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ రాజేశ్, అకడమిక్ కోఆర్డినేటర్ నాహీద బేగం, పీఆర్వో దండుస్వామి, ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ ఎం రామస్వా మి, ఏవో రామ్ కిషన్, సూపరింటెండెంట్ ఉదయభాస్కర్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్య ప్రాధాన్యతను చాటిచెప్పాలి
నిజామాబాద్ అర్బన్: ప్రతి ఓటరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య ప్రాధాన్యతను చాటిచెప్పాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు. జిల్లాలోని 31 మండలాల పరిధిలో ఉన్న 545 గ్రామ పంచాయతీలు, 5022 వార్డు స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పోలింగ్ శాతాన్ని పెంపొందించేందుకు ఇప్పటికే అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ప్రచార, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఓటరు సమాచార స్లిప్పులను బీఎల్వోల నేతత్వంలో సిబ్బంది ఇంటింటికీ తిరిగి పోలింగ్కు ముందు పంపిణీ చేస్తారని చెప్పారు. సమస్యా త్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రత, ఇతర ఏర్పాట్లు చేస్తున్నామని, వెబ్ క్యాస్టింగ్కు అవకాశం లేని పోలింగ్ సెంటర్లలో మైక్రో అబ్జర్వర్లను నియమిస్తామని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఏదైనా సమాచారం తెలుసుకునేందుకు, ఫిర్యాదు చేసేందుకు వీలుగా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల సాధారణ, వ్యయ పరిశీలకులు జిల్లాకు చేరుకున్నారని, వారు ఎన్నికల ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తారని పేర్కొన్నారు. మొదటి విడతలో బోధన్ డివిజన్లోని బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూర, వర్ని, ఎడపల్లి, నిజామాబాద్ రెవెన్యూ డివిజన్లోని నవీపేట మండలం పరిధిలోని 184 సర్పంచ్, 1642 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయని, గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఏకగ్రీవ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉందని, ఏకగ్రీవాల కోసం బలవంతపు విధానాలను అవలంబించొద్దని కలెక్టర్ సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని వర్గాల వారు జిల్లా యంత్రాంగానికి సహకారించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీపీవో శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు. మండలాల వారీగా దాఖలైన నామినేషన్లు ప్రతి ఓటరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి పోలింగ్ శాతం పెంచేందుకు విస్తృతంగా ప్రచార, అవగాహన కార్యక్రమాలు మీడియాతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి -
పోలీసులమంటూ బెదిరింపులు
● ముగ్గురిపై కేసు నమోదు, ఇద్దరి అరెస్ట్ కామారెడ్డి క్రైం: పోలీసుల పేరుతో బెదిరింపులు, వసూళ్లకు పాల్పడుతున్న ఓ ముఠాను దేవునిపల్లి పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి సమీపంలోని ఎల్లమ్మ ఆలయం వద్ద రెండ్రోజుల క్రితం ఓ వ్యక్తి నిల్చొని ఉండగా కారులో ముగ్గురు వ్యక్తులు వచ్చి పోలీసులమంటూ బెదిరించారు. అతని వద్దనున్న రూ.1,800 నగదు, సెల్ఫోన్ లాక్కొని వెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దేవునిపల్లి పీఎస్లో కేసు నమోదైంది. గురువారం సరంపల్లి వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి ఓ కారులో వచ్చిన వారు పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకొని విచారించారు. చిన్నమల్లారెడ్డి గ్రామం వద్ద చేసిన దారి దోపిడీ నేరాన్ని అంగీకరించారు. నిందితులను రాజంపేటకు చెందిన జింక భాస్కర్, గుర్రాల లక్ష్మణ్గా గుర్తించారు. మరో నిందితుడు రంగ నవీన్ గౌడ్ పరారీలో ఉన్నాడు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఎస్సై రంజిత్ తెలిపారు. -
జిల్లా ఎన్నికల అధికారితో ఎలక్షన్ అబ్జర్వర్ భేటీ
నిజామాబాద్ అర్బన్: గ్రామ పంచాయతీ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ జీవీవి శ్యాంప్రసాద్ లాల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డితో గురువారం కలెక్టరేట్లో భేటీ అయ్యారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లను కలెక్టర్ వివరించారు. ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు, సూచనలు చేయాలనుకునే వారు 63095 05554 నంబర్కు ఫోన్ చేయొచ్చని లేదా observergpe lec.nzb @gmail. com మెయిల్ చేయొ చ్చని అబ్జర్వర్ సూచించారు. అందుబాటులోకి టీ పోల్ మొబైల్ యాప్ నిజామాబాద్ అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజలు టీ–పోల్ మొబైల్ యాప్ను వినియోగించుకోవాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి గురువారం ఒక ప్రకటనలో సూచించారు. పోలింగ్స్టేషన్, ఓటర్ స్లిప్ డౌన్లోడ్, ఫిర్యాదులకు సంబంధించిన వివరాలను పరిశీలించేందుకు యాప్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆకస్మిక తనిఖీలను విస్తృతం చేయాలి నిజామాబాద్ అర్బన్: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆకస్మిక తనిఖీలను వి స్తృతం చేయాలని, సోషల్ మీడియాపై ప్ర త్యేక నిఘా ఉంచాలని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య పోలీసు అధికారులకు సూచించారు. జీపీ ఎన్నికల నేపథ్యంలో గురువారం ఆయన సెట్కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు అక్రమంగా డబ్బులు, మద్యం రాకుండా అడ్డుకోవా లని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్మార్చ్ను నిర్వహించాలని, లాడ్జీలు, గెస్ట్హౌస్లు, కమ్యూనిటీ హళ్లను నిరంత రం తనిఖీ చేయాలని ఆదేశించారు. రాజకీయ కార్యకలాపాల్లో పోలీసు సిబ్బంది ప్రమేయం ఉండొద్దని, రౌడీషీటర్లను బైండోవర్ చేయాలని అన్నారు. అదనపు డీసీపీ బస్వారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. పురుషుల భాగస్వామ్యంతోనే కుటుంబ నియంత్రణ నిజామాబాద్నాగారం: ఆరోగ్యకరమైన, సంతోషకరమైన కుటుంబం పురుషులతోనే సాధ్యమని, అలాగే కుటుంబ నియంత్రణ సైతం వారి భాగస్వామ్యంతోనే కుటుంబ నియంత్రణ సాధ్యమని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి రాజశ్రీ అన్నారు. వ్యాసెక్ట మి అవగాహన, శస్త్రచికిత్సల పక్షోత్సవాల సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ.. వ్యాసెక్టమి అవగాహన, శస్త్రచికిత్సల పక్షోత్సవాలను విజయవంతం చేయాలని, పీహెచ్సీల స్థాయిలో నిర్వహించే అవగాహన సదస్సుల్లో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు అవగాహన కల్పించాలన్నారు. వైద్యాధికారులు, వైద్యులు పాల్గొన్నారు. -
అష్టమి హడావుడి..
వర్ని: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బరిలో నిలుస్తున్న వారు మంచి ముహూర్తాలు చూసుకుంటున్నారు. గురువారం నామినేషన్ల ప్రక్రియ ప్రా రంభం కాగా తొలిరోజే నామినేషన్లు దాఖలు చేసేందుకు చాలా ముందుకు వచ్చారు. దీనికి కారణంగా శుక్రవారం అష్టమి కావడమే. అష్టమి రోజున నామినేషన్ వేయొద్దనే సెంటిమెంట్తో మండలంలోని జాకోర, శ్రీనగర్ నామినేషన్ స్వీకరణ కేంద్రాలకు గురువారమే చాలా మంది వచ్చారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు సాయంత్రం 5గంటల వరకే నామినేషన్లు స్వీ కరించాల్సి ఉండగా, ఆ సమయానికి ముందే కేంద్రానికి వచ్చిన వారి నుంచి అధికారులు సాయంత్రం 6.30గంటల వరకు నామినేషన్లు తీసుకున్నారు. నిర్ణీత సమయానికి ముందే వచ్చిన వారి నుంచి నామినేషన్లు స్వీకరించామని వర్ని ఎంపీడీవో వెంకటేశ్వర్ తెలిపారు. -
నిధుల కోసమే పంచాయతీ ఎన్నికలు
● ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనోళ్లు.. బీసీలకు పదవులు ఇస్తారా? ● మీడియాతో చిట్చాట్లో ఎంపీ అర్వింద్ ధర్మపురి సుభాష్నగర్: కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే సీఎం రేవంత్రెడ్డి మొదట గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నా రు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో గురువా రం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. గత పదేళ్లుగా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి జరుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వాలు నయా పైసా కేటాయించడం లేదన్నారు. అందుకే కాంగ్రెస్ గుర్తులు లేని ఎన్నికలకు వెళ్తోందని పేర్కొన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఎందుకు నిర్వహించడంలేదని ప్రశ్నించారు. మహిళలకు వడ్డీ మాఫీ, డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ, ఇందిరమ్మ చీరలు తదితర స్కీములు కేవలం ఎన్నికల కోసమేనని, ప్రజలు ఎక్కడ తిరస్కరిస్తారోనని హడావుడి చేశారని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలు చదువుకుంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వని వారు.. ఆ వర్గాలకు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కావడానికి 42శాతం రిజర్వేషన్లు ఇస్తారా అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు జిల్లాలో ఆర్వోబీ పనులకు సంబంధించి పెండింగ్ బకాయిలు రూ.13.50 కోట్లకుపైగా నిధులు కోరిన వెంటనే విడుదల చేసినందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అ ర్వింద్ అన్నారు. పది రోజుల్లో అడవి మామిడిపల్లి పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించానని, మాధవనగర్ ఆర్వోబీ పనులు వేగవంతమయ్యాయన్నారు. అర్సపల్లి ఆర్వోబీ పనుల కో సం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ త్వరగా చేపట్టా ల ని సూచించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచా రి, జగిత్యాల్ జిల్లా అధ్యక్షుడు గిరిబాబు, నాయకు లు నాగోళ్ల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, ప్రమోద్కుమార్, మాస్టర్ శంకర్, ప్రదీప్రెడ్డి పాల్గొన్నారు. పదవి వచ్చినా పట్టించుకోరా ? మంత్రి పదవి రాక సుదర్శన్రెడ్డి అలిగారని, పదవి వచ్చిన తర్వాత కూడా అభివృద్ధిని పట్టించుకోకపోతే ఎలా అని అర్వింద్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న బోధన్ నియోజకవర్గంలోని ఆర్వోబీ, ఆర్యూబీ ప నులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. సుదర్శన్రెడ్డికి సాధ్యం కాని గ్యారెంటీల అమలు సలహాదారు పదవి ఇచ్చారని ఎద్దేవా చేశారు. -
పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు
● ఎస్ఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షురాలు శిల్పనిజామాబాద్నాగారం: బీజేపీ పాలనలో పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఎస్ఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షురాలు శిల్ప అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర గర్ల్స్ స్థాయి అమ్మాయిల బహిరంగ సభ గురువారం నిర్వహించారు. అంతకుముందు నగరంలోని ప్రెస్క్లబ్ గ్రౌండ్ నుంచి బస్టాండ్ మీదుగా న్యూ అంబేడ్కర్ భవన్కు వరకు ర్యాలీ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన శిల్ప మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా విద్యారంగానికి నిధులు తగ్గించటంతో పేద విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుకు యత్నిస్తున్న నూతన జాతీయ విద్యా విధానంతో ఒరిగేది లేదని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ పూజా, రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు, రాష్ట్ర గర్ల్స్ కో కన్వీనర్లు మమత, దీపిక, రమ్య, కావ్య, సుమ, రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్, జిల్లా కార్యదర్శి విగ్నేశ్ పాల్గొన్నారు. -
నోట్లు గుమ్మరిస్తేనే సర్పంచ్!
ఏందిరాబై మీ ఊరి సర్పంచ్ పదవికి పోటీ బాగా ఉందంట గదా... అవు మల్లా ఏమనుకుంటున్నావు... పోటీలో ఎందరు ఉన్నా ఇద్దరి మధ్యనే ప్రధాన పోటీ, ఒక్కో అభ్యర్థి రూ.కోటి వరకూ ఖర్చు పెడతా అంటున్నాడు... అగో గిదేంది మరి అంత ఖర్చా... అవురా మరి సర్పంచ్ సీటు అంటే అంత క్రేజీ ఉంది. ఎవరైనా పోటీలో దిగాలంటే కనీసం రూ. కోటి జమ ఉంచుకోవాల్సిందే.. ఇది మేజర్ పంచాయతీలలో జరుగుతున్న చర్చ. – మోర్తాడ్(బాల్కొండ) పంచాయతీ ఎన్నికలు ప్రారంభం కావడంతో గ్రామాల్లో ఎలక్షన్స్ హీట్ పెరిగింది. మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవికి పోటీ చేసేవారు రూ. కోటి ఖర్చుకు కూడా వెనుకాడటం లేదు. గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం వెలువరించడంతో ఎక్కడ చూసినా ఖర్చుపైనే చర్చ సాగుతుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘానికి నామమాత్రం లెక్క చూపుతున్నా, క్షేత్ర స్థాయిలో మాత్రం భారీగా సొమ్ము కుమ్మరించాల్సి వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మండల కేంద్రాలు, జాతీయ రహదారిని ఆనుకొన్ని ఉన్న గ్రామాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతుండటంతో అక్కడ సర్పంచ్ పదవిని పొందడానికి అభ్యర్థులు రూ. కోటి వరకూ సిద్ధం చేసుకుంటున్నారు. సర్పంచ్ స్థానం ఏ సామాజిక వర్గానికి రిజర్వు చేసినా ఖర్చు విషయంలో మాత్రం అభ్యర్థులు వెనుకంజ వేయకపోవడం చూస్తుంటే పదవిపై ఉన్న వ్యామోహం అంతా ఇంతా కాదని స్పష్టమవుతుంది. మోర్తాడ్, ముప్కాల్లలో సర్పంచ్కు పోటీ చేసే అభ్యర్థులు రూ. కోటి వరకూ ఖర్చు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కమ్మర్పల్లి, మెండోరా, బాల్కొండ, వేల్పూర్, అంక్సాపూర్, లక్కోరా తదితర గ్రామాలలో పోటీ చేసే ఆశావాహులు రూ.25లక్షల నుంచి రూ.50లక్షల వరకూ ఖర్చు చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. చిన్నచితకా పంచాయతీల్లో ఆదాయం మాట ఎలా ఉన్నా పదవి పొందాలనే ఉద్దేశ్యంతో రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకూ ఖర్చు చేయాలనే భావనలో అభ్యర్థులు ఉన్నారు. ఎన్నికల సంఘానికి అభ్యర్థులు చూపే ఖర్చు క్రమ పద్ధతిలోనే ఉంటుంది. క్షేత్ర స్థాయిలో మాత్రం అభ్యర్థుల ఖర్చు అంచనాలను మించిపోతుంది. సర్పంచ్ పదవికి ఫుల్ డిమాండ్ ఉండటం, ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ ప్రభావం పెరిగిపోవడంతో పదవి కోసం అభ్యర్థులు అంచనాలను మించి ఖర్చు చేయాలని భావిస్తున్నారు. ఏదేమైనా సర్పంచ్ పదవిపై మోజుతో జేబులు ఖాళీ చేసుకోవడానికి ఎంతో మంది అభ్యర్థులు ముందుకు వస్తున్నారని చెప్పవచ్చు. మీడియా సెంటర్ ప్రారంభం నిజామాబాద్ అర్బన్: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్లోని రూమ్ నెం.30లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (ఎంసీఎంసీ)ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గురువారం ప్రారంభించారు. మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలు, ఎంసీఎంసీ విధుల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలె క్టర్ మాట్లాడుతూ... గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు. ఎంసీఎంసీ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, సకాలంలో ప్రచార ప్రకటనలకు సంబంధించిన అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు మీడియా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీపీవో శ్రీనివాస్ రావు, ఏఓ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. రెండుచోట్ల ఏకగ్రీవ తీర్మానం వర్ని: మండలంలోని రెండు గ్రామ పంచాయతీలో ఒకే వ్యక్తి నామినేషన్ వేయాలని గ్రామస్తులు గురువారం తీర్మానం చేశారు. సిద్దాపూర్ సర్పంచ్గా బాల్ సింగ్, చేలక తండా సర్పంచ్గా గంగారాం మాత్రమే నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించారు. తీర్మానానికి విరుద్ధంగా గ్రామస్తులెవరూ వ్యవహరించొద్దని పేర్కొన్నారు. నిబంధనలు కచ్చితంగా పాటించాలి ● అదనపు కలెక్టర్ అంకిత్ వర్ని: పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లలో నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. వర్ని మండలం సత్యనారాయణపురంలో నామినేషన్ల స్వీకరణను ఆయన గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. నామినేషన్లు సమర్పించే వారికి నిబంధనలు తెలియజేసి స్వీకరించాలన్నారు. రిజర్వు చేయబడిన స్థానాల్లో కుల ధ్రువీకరణ పత్రం, నో డ్యూ సర్టిఫికెట్లు నామినేషన్తోపాటు తీసుకోవాలని సూచించారు. అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాతనే నామినేషన్లు స్వీకరించాలని, ఎలాంటి తప్పులు, వివాదాలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారి రత్నాకర్కు సూచించారు. నవీపేట: మండలంలోని బినోలా గ్రామంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. నామినేషన్ కేంద్రంలోని ఏర్పాట్లను ఎన్నికల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నామినేషన్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు కొనసాగుతాయన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలని కోరారు. ఆయన వెంట ఎస్సైలు తిరుపతి, యాదగిరి గౌడ్, ప్రిసైడింగ్ ఆఫీసర్ అనిత తదితరులు ఉన్నారు. గంగారాం బాల్సింగ్ పెద్ద గ్రామ పంచాయతీల్లో రూ. కోటి దాటనున్న ఖర్చు చిన్న గ్రామాల్లో రూ.20 లక్షల వరకూ ఖర్చు అయ్యే అవకాశం ఏ గ్రామంలోనైనా ఎన్నికల ఖర్చుపైనే చర్చ -
ఆయిల్ పామా.. ఆలోచిద్దాం!
డొంకేశ్వర్(ఆర్మూర్): ఆయిల్ పామ్ సాగు చేసేందుకు కొత్త రైతులు ముందుకు రావడం లేదు. అధికారులు అవగాహన కల్పిస్తున్నా.. చూద్దాం.. ఆలోచిద్దామనే సమాధానాలు రైతుల నుంచి వస్తున్నాయి. వరి వంటి పంటలకు మద్దతు ధరతోపాటు బోనస్ కూడా ఇవ్వడంతో వాటినే సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో నాలుగేళ్లకు చేతికొచ్చే ఆయిల్ పామ్ పంటను వద్దనే భావన రైతుల్లో వ్యక్తమవుతోంది. తద్వారా జిల్లాలో గత మూడేళ్లలో సాగు చేసిన ఆయిల్ పామ్ పంట తప్పితే ఈ ఏడాది కొత్తగా ముందుకొచ్చి సాగు చేసిన పరిస్థితులు పెద్దగా కనిపించడం లేదు. జిల్లాలో ఈ సంవత్సరం 3వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ను రైతులతో సాగు చేయించాలని లక్ష్యంగా ఉంది. 2026 మార్చి ముగిసే నాటికి లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు 450 ఎకరాల్లో మాత్రమే సాగు చేయించారు. అది కూడా అతి కష్టం మీద. ఇంకా 2550 ఎకరాలు వచ్చే నాలుగు నెలల్లో పూర్తి చేయడం కష్టమనే చెప్పొచ్చు. ప్రతి ఏడాది లక్ష్యాన్ని చేరుకోకపోవడంతో మిగిలిన లక్ష్యాన్ని ఉద్యాన శాఖ అధికారులు మరో ఏడాదికి జోడిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో కొన్ని చోట్ల పంట కోతలు రావడంతో అధికారులు దానిపైనే దృష్టి పెట్టారు. కొత్త రైతులను గుర్తించి వారితో సాగు చేయించడానికి పెద్దగా శ్రద్ధ చూపడం లేదని విమర్శలున్నాయి. అందుకే ఈ ఏడాది లక్ష్యంలో 30 శాతం కూడా చేరుకోలేకపోయారు. నాలుగేళ్లలో 6,500 ఎకరాలు సాగు నాలుగేళ్ల కాలంలో ఆయిల్ పామ్ను జిల్లాలో 6,500 ఎకరాల్లో సాగు చేశారు. ఇందులో 450 ఎకరాలు ఈ ఏడాదికి సంబంధించినవే. మూడేళ్ల క్రితం సాగైన ఆయిల్ పామ్ పంట జిల్లాలో ఆర్మూర్, బోధన్ డివిజన్లో కోతకు వచ్చింది. పలువురు రైతులు 500 మెట్రిక్ టన్నుల పంటను విక్రయించి టన్నుకు రూ.21వేల వరకు లాభాలు సైతం పొందారు. ప్రస్తుతం టన్నుకు రూ.19వేలు వస్తోంది. ప్రభుత్వం ఆయిల్ పామ్ను సాగు చేస్తే మొక్కలు సబ్కిడీపై ఇస్తుండగా మెయింటనెన్స్ నిధులు కూడా ఇస్తోంది. అలాగే డ్రిప్ సిస్టం పెట్టుకున్న ఎస్సీ, ఎస్టీ రైతులకు నూరుశాతం సబ్సిడీ ఇస్తోంది. జీఎస్టీ మాత్రమే భరించాల్సి ఉంటుంది. అలాగే బీసీ, సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం పెద్ద రైతులకు 80 శాతం సబ్పిడీ అందజేస్తోంది. రైతులు ముందుకు రావాలి ఆయిల్ పామ్ పంట చేతికి వచ్చేందుకు ఆలస్యమైనా అధిక లాభాలు వస్తాయి. ప్రభుత్వం మూడు రకాలుగా సబ్సిడీ అందజేస్తోంది. కొత్త రైతులు ఆలోచించి సాగుకు ముందుకు రావాలి. ఈ ఏడాది లక్ష్యాన్ని చేరుకునేందుకు వ్యవసాయాధికారుల సహకారాన్ని తీసుకుంటాం. – శ్రీనివాస్రావు, జిల్లా ఉద్యానశాఖ అధికారి సాగు చేసేందుకు ముందుకురాని కొత్త రైతులు ఈ ఏడాది సాగు లక్ష్యం 3వేల ఎకరాలు ఇప్పటి వరకు సాగైంది 450 ఎకరాల్లో మాత్రమే.. బోనస్, మద్దతు ధర ఇస్తున్న పంటలపైనే ఆసక్తి -
ఇంటి నంబర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి..
ఆర్మూర్: మున్సిపల్ కమిషనర్గా అతిమల రాజు 2024 ఫిబ్రవరి 14వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మున్సిపల్ పాలకవర్గం లేకపోవడంతో అన్నీతానై వ్యవహారాలను చక్కబెడుతూ వచ్చారు. ఆయనకన్నా ముందు పని చేసిన కమిషనర్ కేటాయించిన 140 ఇళ్ల నంబర్లను అక్రమంటూ రాజు రద్దు చే శా రు. ఇక్కడి నుంచే రాజు అన అక్రమవసూళ్లకు దా రులు వేసుకున్నారు. నిజాయితీగా ఉద్యోగం చేస్తు న్నానని చెప్పుకొనే ఆయన తన కారుకు నెంబర్ ప్లేట్ లేకుండా నడిపారు. ఇక ప్రభుత్వం కేటాయించిన సెల్ఫోన్ను ఏ రోజూ లిఫ్ట్ చేసి ప్రజల సమస్య లను తెలుసుకోలేదు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో రాజును రెడ్హ్యాండెడ్గా పట్టుకునేందుకు మూ డు నెలలుగా నిఘా సారించినట్లు ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్గౌడ్ పేర్కొన్నారు. ఏడు నెలల్లో ఐదుగురు.. ఆర్మూర్ పట్టణంలో కేవలం ఏడు నెలల కాలంలోనే ముగ్గురు అధికారులు, ఇద్దరు ప్రైవేటు డ్రైవర్లు ఏసీబీకి చిక్కడం అధికారుల అవినీతి తీరుకు అద్దం పడుతోంది. ఏప్రిల్లో పంచాయతీరాజ్ సీనియర్ అసిస్టెంట్, ఆగస్టులో ఎంవీఐ ఏసీబీకి చిక్కారు. తాజాగా కమిషనర్తోపాటు ఆయన ప్రైవేట్ డ్రైవర్ ఏసీబీకి పట్టుబడ్డారు. -
ఏసీబీ వలలో ఆర్మూర్ బల్దియా కమిషనర్
ఆర్మూర్ : ఇంటికి నంబర్ను అలాట్ చేసేందుకు డబ్బులు డిమాండ్ చేసిన ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ అతిమల రాజు.. తన ప్రైవేట్ డ్రైవర్ ద్వారా రూ.20వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డా రు. మున్సిపల్ కమిషనర్ పట్టణంలోని యోగేశ్వర కాలనీలో ఒక్కడే అద్దె గదిలో ఉంటున్నారు. కమిషనర్ అద్దెకు ఉంటున్న ఇంటికి కొద్ది దూరంలో అదే కాలనీకి చెందిన గంగ రాజుల నర్సయ్య కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. ఇంటి నంబర్ కేటాయించడానికి కమిషనర్ రూ.50 వేలు డిమాండ్ చేయడంతో బాధితుడు నర్సయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు రూ.20 వేలు లంచం ఇవ్వడానికి కమిషనర్ను బాధితుడు బతి మిలాడుకున్నాడు. గురువారం రూ.20 వేలను కమిషనర్ ఇంటికి వెళ్లి ఇవ్వగా, తన ప్రైవేట్ డ్రైవర్కు ఇవ్వాల్సిందిగా కమిషనర్ సూచించారు. బాధితుడి నుంచి డ్రైవర్ భూమేశ్వర్ లంచం డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. కమిషనర్తోపాటు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ వద్ద ఉన్న బ్యాగ్లో నుంచి ఎలాంటి లెక్కలు లేని రూ.4 లక్షల 30 వేలు స్వాధీనం చేసుకున్నారు. కొంత మంది ఏసీబీ అధికారులు కమిషన్ ఇంటిని సోదా చేయగా, మరికొంత మంది మున్సిపల్ కార్యాలయంలో సోదాలు నిర్వ హించి పలు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చనున్నట్లు నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్గౌడ్ తెలిపారు. తన ప్రైవేట్ డ్రైవర్ ద్వారా రూ.20 వేలు తీసుకుంటూ.. ఆధారాలు చూపని మరో రూ.4.30లక్షలు స్వాధీనం మున్సిపల్ కార్యాలయంలో సోదాలు -
పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్ అర్బన్: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని సూచించారు. పంచాయతీ ఎన్నికలపై బుధవారం కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, అదనపు డీసీపీ బస్వారెడ్డి వీసీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు మూడు విడతలలో ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసినట్లు గుర్తుచేశారు. డిసెంబర్ 11న మొదటి విడత, 14న రెండో విడత, 17న మూడో విడత పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. గ్రామాల వారీగా అప్డేట్ చేసిన రిజర్వేషన్లు, ఏ విడతలో పోలింగ్ ఉంటుంది, పోలింగ్ కేంద్రాల జియో లొకేషన్ తదితర వివరాలను వెంటనే టీపోల్ వెబ్సైట్, యాప్లో నమోదు చేయాలని సూచించారు. టీపోల్ వెబ్సైట్, యాప్లో వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం నోడల్ అధికారిని నియమించాలని, ఫిర్యాదులను మూడు రోజులలో పరిష్కరించాలన్నారు. ఈ నెల 23న ఖరారు చేసిన తుది ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాను అనుసరిస్తూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలలో వెలుతురు, ఫర్నిచర్, విద్యుత్ సరఫరా, తాగునీరు, టాయిలెట్స్ వంటి కనీస వసతులు ఉండేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. వెబ్ కాస్టింగ్ జరిగే పోలింగ్ కేంద్రాల వివరాలు పంపాలన్నారు. మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ గురువారం ఉదయం 10.30 గంటల వరకు విడుదల చేయాలని సూచించారు. 27 నుంచి 29 వరకు ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించాలన్నారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అభ్యంతరాల పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా జిల్లా ఎన్నికల అధికారులు పర్యవేక్షణ చేస్తూ, అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలన్నారు. అనుమతి లేకుండా ఎన్నికల ప్రచార కరపత్రాల ముద్రణ చేయకూడదంటూ ప్రింటర్లకు ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. ప్రతి మండలానికి ఒక ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం, ఒక ఏఈవో (సహాయ వ్యయ వివరాల నమోదు అధికారి), జిల్లాకు ఒక స్టాటిక్ సర్వేలైన్స్ బృందం ఏర్పాటు చేసి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తప్పనిసరిగా జరిగేలా పర్యవేక్షించాలని అన్నారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి అభ్యర్థుల వ్యయ వివరాలను నమోదు చేసేందుకు ధరలను ఖరారు చేయాలని తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంసీఎంసీ కమిటీ, మీడియా సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల ప్రచార సమయంలో వినియోగించే ఎలక్ట్రానిక్ వీడియోలకు ముందుగా ఎంసీఎంసీ అనుమతి ఉండాలన్నారు. ఎన్నికల దృష్ట్యా తనిఖీలు నిర్వహించే నేపథ్యంలో రైతులు పంట డబ్బులు తీసుకుని వెళ్లే సమయంలో తప్పనిసరిగా రశీదు పెట్టుకునేలా అవగాహన కల్పించాలన్నారు. తనిఖీలలో నగదు, బంగారం, ఇతర పరికరాలు సీజ్ చేసే సమయంలో తప్పనిసరిగా రశీదు అందించాలన్నారు. సీజ్ చేసిన పరికరాలకు సంబంధించిన ఆధారాలు సమర్పించేందుకు ఏ అధికారి ఎదుట హాజరుకావాలనే వివరాలు రశీదులో తెలపాలన్నారు. వీసీలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, నోడల్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల ప్రవర్తనా నియమావళి కట్టుదిట్టంగా అమలు మొదటి విడత నోటిఫికేషన్ సజావుగా జారీ చేయాలి వీసీలో అధికారులను ఆదేశించిన కమిషనర్ -
తొలివిడత సంగ్రామం
నిజామాబాద్నేటి నుంచి నామపత్రాల స్వీకరణ ● 57 నామినేషన్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి ● 2,61,210 మంది ఓటర్లు రాజ్యాంగ విలువలను.. భారత రాజ్యాంగ విలువలను కాపాడటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు.గురువారం శ్రీ 27 శ్రీ నవంబర్ శ్రీ 2025– 8లో u గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా తొలి విడత నామినేషన్ల స్వీకరణ కోసం 57 కేంద్రాలను ఏర్పాటు చేశారు. క్లస్టర్ గ్రామంగా గుర్తించి నాలుగు నుంచి ఐదు గ్రామాలకు సంబంధించిన సర్పంచి, వార్డుస్థానాల అ భ్యర్థుల నామినేషన్లను అక్కడే స్వీకరించనున్నారు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పోలింగ్ సామగ్రితో ఏర్పాట్లు పూర్తిచేసుకున్నా రు. నామినేషన్ల స్వీకరణ నుంచి కౌంటింగ్ పూర్త య్యే వరకు రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షిస్తారు. సుభాష్నగర్: గ్రామపంచా యతీ ఎన్నికల తొలి విడ త నోటిఫికేషన్ గురువారం వెలువడనుంది. 27న ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కా నుంది. జిల్లాలో బోధ న్ డివిజన్లో మొదటి విడతలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 184 జీపీలు, 1,642 వార్డు స్థానాలు, 1,653 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 2,61,210 మంది ఓటర్లు ఉండగా, 1,23,790 పురుషులు, 1,37,413 మహిళలు, 7 ఇతర ఓటర్లు ఉన్నా రు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్లో భాగంగా మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తొలి విడత నోటిఫికేషన్లో భాగంగా గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలు కానుంది. 27 నుంచి 29వ తేదీ వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న నామపత్రాల పరిశీలన, స్క్రూటినీ ఉంటుంది. డిసెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అదేరోజు మూడు గంటల తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా, గుర్తులను కేటాయిస్తారు. డిసెంబర్ 11న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారు. 57 నామినేషన్ కేంద్రాలు..నోటిఫికేషన్ షెడ్యూల్..గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు మొదలైంది. తొలి విడత నోటిఫికేషన్ నేడు వెలువడనున్నది. గురువారం నుంచి 29వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. డిసెంబర్ 3న బరిలో నిలిచే వారి జాబితా ప్రకటించి, 11న పోలింగ్, ఫలితాలు వెల్లడిస్తారు. -
రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలి
● దేశ చరిత్రను తిరగరాసే కుట్ర జరుగుతోంది ● పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నిజామాబాద్ రూరల్: ప్రతి పౌరుడు రాజ్యాంగ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. రాజ్యాంగ వజ్రోత్సవాల్లో భాగంగా నగరంలోని ఫులాంగ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా గొప్ప రాజ్యాంగమని కొనియాడారు. దేశంలో కొన్ని అరాచక శక్తులు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాయని, గాంధీ, నెహ్రూను మరిపించి దేశ చరిత్రను తిరగరాసే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. అరాచక శక్తుల కుట్రలను విద్యావంతులు, మేధావులు తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ రాంగోపాల్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ రాజేంద్రప్రసాద్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బంటు బలరాం, మాజీ కార్పొరేటర్ నరేందర్ గౌడ్, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, మైనారిటీ జిల్లా ఉపాధ్యక్షుడు అజీమ్ తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగ విలువలను కాపాడాలి
● కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ● కలెక్టరేట్లో అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ ● ఘనంగా రాజ్యాంగ దినోత్సవం నిజామాబాద్ అర్బన్: భారత రాజ్యాంగ విలువల ను కాపాడటానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అన్నారు. నగరంలోని కలెక్టరేట్లో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. జాతి ఐక్యతను, అఖండతను కాపాడేందుకు అంకిత భావంతో కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో.. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అదనపు డీసీపీ బస్వారె డ్డి, రామచంద్రరావు భారత రాజ్యాంగ ప్రవేశిక కా ర్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మా ట్లాడుతూ.. రాజ్యాంగ ప్రవేశిక గురించి క్షుణ్ణంగా వివరించి పోలీసు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించా రు. రిజర్వు ఇన్స్పెక్టర్ తిరుపతి, సతీష్ ఉన్నారు. ఏడో పోలీస్ బెటాలియన్లో.. డిచ్పల్లి: డిచ్పల్లిలోని రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా అడిషనల్ కమాండెంట్ సీహెచ్ సాంబశివరావు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం దేశానికి మార్గదర్శకత్వం వహించే ప్రామాణిక పత్రం అన్నారు. ప్రతి పోలీసు ప్రజల హక్కులను గౌరవిస్తూ రాజ్యంగ విలువలను కాపాడాలని పేర్కొన్నారు. అసిస్టెంట్ కమాండెంట్ కేపీ సత్యనారాయణ, రిజర్వు ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, మారుతి, త్రిముఖ్, నవనీత్, నారాయణ, చంద్రశేఖర్, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. తెయూలో.. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయం లా కళాశాలలో బుధవారం ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త అపర్ణ మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రాధాన్యతను, విలువలను విస్తృతంగా ఎన్ఎస్ఎస్ వలంటీర్లు ప్రచారం చేయాలన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్లు స్రవంతి, ఎండీ హలీంఖాన్, జెట్లింగ్ ఎల్లోసా పాల్గొన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ బాలికల కళాశాలలో.. నిజామాబాద్ నాగారం: నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి తిరుమలపుడి రవికుమార్ పాల్గొని, మాట్లాడారు. ప్రజల అభ్యున్నతి, ప్రజాస్వామ్య పాలనతోనే సాధ్యమని, భారత రాజ్యాంగమే దీనికి మూలమని అన్నారు. అంతకుముందు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అలంకరణ చేసిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రిన్సిపాల్ బుద్దిరాజ్, కళాశాల అ ధ్యా ప కులు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.


