Nizamabad District Latest News
-
జాతీయ రహదారులకు మహర్దశ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉత్తర తెలంగాణలో రవాణాకు అత్యంత కీలకమైన 63వ నంబర్ జాతీ య రహదారి ఆర్మూర్–జగిత్యాల–మంచిర్యాల వరకు, 563వ నంబర్ జాతీయ రహదారి జగిత్యా ల–కరీంనగర్ రోడ్లకు మహర్దశ పట్టనుంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 190.76 కిలోమీటర్ల మేర ఈ రోడ్ల ను విస్తరించేందుకు గాను రూ.7,597.16 కోట్ల ని ధులు కేటాయించేందుకు నిర్ణయించారు. ఈ రో డ్లను నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఉత్తర తెలంగాణలోనే అత్యధిక జనసాంద్రత ఉన్న రోడ్డు కావడంతో పలుచోట్ల బైపాస్లను నిర్మించనున్నారు. అంక్సాపూర్, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, లక్సెట్టిపేట, మంచిర్యాల, పోతారం, గంగాధర ప్రాంతాల్లో ఈ బైపాస్లు నిర్మాణం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో రద్దీ నివారించడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు అధిగమించనున్నారు. వీటి నిర్మాణంతో ఆర్మూర్ నుంచి మంచిర్యాలకు గంటన్నర ప్రయాణ సమయం, జగిత్యాల నుంచి కరీంనగర్కు 54 నిముషాల ప్రయాణ స మయం ఆదా కానుంది. ఈ రోడ్డు నిర్మాణంలో భా గంగా టోల్ గేట్ల ఏర్పాటు లేకుండా, ఎక్కడా ఆగకుండా 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా డిజైన్ చేశా రు. ఆధునిక ఎలక్ట్రానిక్ వ్యవస్థ ద్వారా టోల్ చార్జి నేరుగా తీసుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ రోడ్డు కోసం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ గతంలో పలుసార్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి విన్నవించారు. ఈ క్రమంలో తాజాగా ఈ రోడ్లను మంజూరు చేయడంపై అర్వింద్ ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి, కేంద్ర కేబినెట్కు ధన్యవాదాలు తెలిపారు. ప్రమాదాల బెడద తప్పనుంది పెర్కిట్ నుంచి జగిత్యాల, కరీంనగర్ జిల్లాలకు వెళ్లే మార్గాన్ని నాలుగు లేన్లు గా విస్తరిచండం హర్షించదగ్గ విషయం. రహదారి విస్తరణతో రోడ్డు ప్రమాదాల బెడద తప్పనుంది. ఇక నుంచి ఆయా జిల్లాలకు వెళ్లే వారు నిబ్బరంగా ప్రయాణించవచ్చు. – జక్కుల మోహన్, ఆరోగ్య కార్యకర్త, పెర్కిట్ప్రయాణం సాఫీగా.. ముఖ్యంగా జగిత్యాల, కరీంనగర్ జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రాల దర్శానికి వెళ్లే ఇతర జిల్లాల వా రికి రహదారి విస్తరణతో ఉపశమనం లభించనుంది. ప్రస్తుతం ఉన్న ఇరుకై న మార్గం వెంట అ నేక భారీ వాహనాలు ప్రయాణిస్తుండడంతో రోడ్డు ప్ర మాదాలు జరిగేవి. రహదారి విస్తరణతో ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. – వి లక్ష్మీనారాయణ, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, పెర్కిట్ 63, 563 నంబర్ల జాతీయ రహదారులను నాలుగు లేన్లుగా మార్చేందుకు కేంద్రం పచ్చజెండా 190.76 కిలోమీటర్లకు రూ.7,597.16 కోట్లు కేటాయింపు ఆర్మూర్ నుంచి మంచిర్యాలకు తగ్గనున్న గంటన్నర ప్రయాణ సమయం కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ అర్వింద్ ధన్యవాదాలు -
నిజామాబాద్
శ్రీరాం సాగర్లోబహిరంగ చర్చకు సిద్ధం అవినీతిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాజీ ఎమ్మెల్యే బిగాలకు సవాల్ విసిరారు.శుక్రవారం శ్రీ 5 శ్రీ జూన్ శ్రీ 2026– 8లో uసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: 18 లక్షల ఎకరాల ఆయకట్టు కలిగిన ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ జలాశయంలో నీటి నిల్వ ప్రస్తుతం కేవలం 16.26 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇందులో డెడ్ స్టోరేజీ 5 టీఎంసీలు, 5 టీఎంసీలు తాగునీటి అవసరాలు పోను మిగిలేది 6.26 టీఎంసీలు మాత్రమే కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం (1,091అడుగులు) 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16.26 టీఎంసీలకు పడిపోయింది. గత సీజన్లో జలాశయంలోకి ఎగువ నుంచి భారీగా వరద వచ్చినప్పటికీ పూడిక కారణంగా నీటి నిల్వ చేయలేక దిగువకు వదిలారు. నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడంతో కొంత మాత్రమే నీరు ఉంది. దీంతో మెండోరా, బాల్కొండ, ముప్కాల్ మండలాల్లో బోర్లు ఎండిపోవడం, భూగర్భ జలాలు పడిపోతున్నట్లు రైతులు చెబుతున్నారు. పూడికను తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని కోరుతున్నారు. లేనిపక్షంలో భవిష్యత్తులో తాగు, సాగునీటి సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఎగువన ఉన్న మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురిసి వరద వస్తేనే జలాశయంలోకి నీరు వస్తుంది. లేకుంటే గడ్డు పరిస్థితే. ఈసారి ఎల్నినో ప్రభావం ఉంటుందంటున్న హెచ్చరికల నేపథ్యంలో ఆయకట్టు రైతులతో పాటు సాధారణ ప్రజల్లోనూ ఆందోళన నెలకొంది. ధర్పల్లి మండలంలో 1 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం కలిగిన రామడుగు జలాశయంలో ఇప్పటికే 0.3 టీఎంసీల పూడిక చేరినట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రస్తుతం జలాశయంలో 185 మిలియన్ క్యూసెక్కుల (మిలియన్ క్యూబిక్ ఫీట్లు) నీరు మాత్రమే ఉంది. ఇది డెడ్ స్టోరేజీ అని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద ధర్పల్లి, డిచ్పల్లి, జక్రాన్పల్లి, భీమ్గల్, వేల్పూర్ మండలాల్లోని సాగుభూములకు కుడి, ఎడమ కాలువల ద్వారా 6,100 ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీన్ని 1964లో నిర్మించారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడంతో కుడి, ఎడమ కాలువలో ముళ్ల పొదలు పెరిగి చివరి ఆయకట్టుకు నీరు అందే పరిస్థితి లేకుండా పోయింది. పలుచోట్ల కాలువలకు సీసీ లైన్లు దెబ్బతినడంతో నీటిని వదిలినప్పుడు లీకేజీ అవుతున్నాయి. ఎడపల్లి మండలంలోని అలీసాగర్ జలాశ యంలో మాత్రం నీటి నిల్వ సామర్థ్యం 1299.6 అ డుగులు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 1295.6 అడు గుల మేర ఉంది. అలీసాగర్ నుంచి ప్రతిరోజూ ని జామాబాద్ నగర ప్రజలకు తాగునీటి కోసం ఫిల్టర్ బెడ్ ద్వారా 30 క్యూసెక్కులు సరఫరా జరుగుతోంది. జలాశయంలోని నీరు మరో 28 రోజుల వరకు నిజామాబాద్ నగరానికి తాగునీటి సరఫరాకు సరిపోతాయి. దీని కింద ఎడపల్లి మండలంలో 18వేల ఎకరాలకు సాగునీరు సరఫరా అవుతుంది. ఎస్సారెస్పీలో తగ్గుతున్న నీటి నిల్వలుడెడ్ స్టోరేజీకి 5 టీఎంసీలు.. తాగునీటికి 5 టీఎంసీలు.. ఇక మిగిలింది 6.36 టీఎంసీలే ఎగువ మహారాష్ట్రలో వర్షాలు కురిసి వరద వస్తేనే ఈసారి ఊరట రామడుగు జలాశయంలోనూ డెడ్ స్టోరేజీకి పడిపోయిన నీటి నిల్వ -
ఢిల్లీ సదస్సులో ‘ఇందూరు పసుపు’
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఢిల్లీలోని కాన్స్టిట్యూ షన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో గురువారం జరిగిన జాతీయ స్థాయి రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఫె డరేషన్ సదస్సులో జిల్లాకు చెందిన ఎఫ్పీవోల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సులో ఏపీకి చెందిన ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాస్రెడ్డిని కలిసిన జిల్లా ప్రతినిధులు జిల్లాలో ని జేఎంకేపీఎం పసుపు రైతు ఉత్పత్తిదారుల సంఘం నుంచి తీసుకెళ్లిన ఆర్గానిక్ పసుపు పొడిని ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట మాట్లాడుతూ తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా పసుపునకు మంచి ప్రసిద్ధి చెందిందన్నారు. గ్రామీణ రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు సహకరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా నుంచి ఎఫ్పీవో అధ్యక్షుడు పాట్కూరి తిరుపతిరెడ్డి. మోర్తాడ్ నుంచి కస్పా లక్ష్మీనరసయ్య, మనోహరాబాద్ మైలారం రాజారెడ్డి, జగిత్యాల జిల్లా నుంచి ఇటికాల ఎఫ్పీవో అధ్యక్షుడు గడ్డం రాజేందర్రెడ్డి పాల్గొన్నారు. -
భూసేకరణే ప్రధాన సమస్య..
మోర్తాడ్(బాల్కొండ): ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు 63వ నంబర్ జాతీయ రహదారి విస్తరణకు భూ సేకరణనే ప్రధాన సమస్యగా నిలిచింది. వ్యవసాయ భూములకు తీవ్ర ముప్పు వాటిల్లనుండటంతో కొందరు రైతులు కోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు స్టే విధించింది. ఇప్పుడు రెండు లేన్ల రోడ్డుగా ఉన్న జాతీయ రహదారిని నాలుగు లేన్ల రోడ్డుగా విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి విస్తరణకు అవసరమైన భూ సేకరణను త్వరిత గతిన చేపట్టడానికి ఎన్హెచ్ఏఐ రెవెన్యూ శాఖకు ఆదేశాలను జారీ చేసింది. మొదట్లో ఉన్న జాతీయ రహదారిని విస్తరించాలని నిర్ణయించగా కొన్ని గ్రామాల్లో ఇండ్లు, భవనాలకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని భావించారు. దీంతో ఇండ్లు, భవనాలకు నష్టం వాటిల్లకుండా ఉండటానికి బైపాస్ రోడ్లను నిర్మించాలని కొత్తగా ప్రతిపాదించారు. గతంలో జాతీయ రహదారి విస్తరించాలని నిర్ణయించిన సమయంలో జిల్లాలో 26 కిలోమీటర్ల రోడ్డుకు 72.2671 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుందని గుర్తించారు. ఇప్పుడు చేసిన కొత్త ప్రతిపాదనలతో బైపాస్ రోడ్లను నిర్మించాలని నిర్ణయించగా 83.895 హెక్టార్ల భూమిని సేకరించాల్సిన అవసరం ఏర్పడింది. -
వర్షం.. హర్షం
జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం చిరుజల్లులు కురిశాయి. ఇన్నాళ్లూ ఎండవేడిమి, ఉక్కపోత, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి అయిన జనం.. వర్షం కురవడంతో ఉపశమనం పొందారు. ఇందల్వాయి మండల వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో పొలం మడుల్లో వర్షపునీరు నిలిచింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్న రైతుల్లో చిరుజల్లులు సంతోషాన్నిచ్చాయి. దీంతో వరి నారు పోసుకునేందుకు సిద్ధమవుతున్నారు. – ఇందల్వాయిఇందల్వాయి మండల శివారులో పొలాల్లోకి చేరిన వర్షపు నీరు -
వలలు తొలగించిన అటవీ అధికారులు
డొంకేశ్వర్(ఆర్మూర్) : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు గురువారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. నీరు తగ్గిన ప్రాంతాల్లో మత్స్యకారులు వదిలి వెళ్లిన పాత వేట వలలను ఆర్మూర్ ఎఫ్డీవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో డిప్యూటీ ఎఫ్ఆర్వో సుధాకర్, బీట్ ఆఫీసర్ లింబాద్రిలు గుర్తించి వాటిని తొలగించారు. వన్యప్రాణులు, జింకలు, పక్షులు ఈ వలలలో చిక్కుకుని ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని, అందుకే తొలగింపు చర్యలు చేపట్టినట్లు వారు తెలిపారు. మత్స్యకారులు పాత వలలను వదిలి వెళ్లకూడని అధికారులు వారికి సూచించారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం సుభాష్నగర్ : నగరంలోని 33/11కేవీ వినాయక్నగర్ 11 కేవీ ఫీడర్–1 ఏబీ స్విచ్ఛుల మరమ్మతుల కారణంగా శుక్రవారం ఉద యం 9 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని టౌన్–3 ఏడీఈ వినోద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వినాయక్నగర్లోని నసీ మ్కాలనీ, తెలంగాణ తల్లి ఏరియా, యాద గిరి బాగ్, మహాన్, అమృతగంగా అపార్ట్మెంట్లు, గాయత్రినగర్ రోడ్–1, మార్కండేయ ఆలయం, షాదుల్లా దర్గా, దోబీగల్లి, నకాష్ గల్లి, ఆర్యసమాజ్ ఏరియా, బాలికల హైస్కూల్, సిర్నాపల్లి గడి తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొ న్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. బడిబాట షార్ట్ ఫిలిం విడుదల ఖలీల్వాడి: జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ నేతృత్వంలో, సమగ్ర శిక్షా సౌజన్యంతో రూపొందించిన ‘బడిబాట’ షార్ట్ ఫిల్మ్ను జిల్లా అదనపు కలె క్టర్ (స్థానిక సంస్థలు) భుజంగరావు విడుదల చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. నాణ్యమైన విద్య ప్రభుత్వ బడిలో నే అందుతున్నదనీ, తల్లిదండ్రులు తమ పి ల్లలను చేర్పించాలని పిలుపునిచ్చారు. డీఈవో అశోక్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులని చైతన్యవంతుల్ని చేస్తూ, పిల్లలందరినీ ప్రభు త్వ బడిలో చేర్పించేలా ప్రోత్సహించడానికి ఈ షార్ట్ ఫిల్మ్ను రూపొందించినట్లు తెలిపారు. అనంతరం షార్ట్ ఫిల్మ్ రచన, దర్శకత్వం వహించిన డా.కోకిల నాగరాజు, నటించిన డాక్టర్ కాసర్ల నరేశ్ రావు, చింతల శ్రీనివాస్ గుప్తా, రాజశేఖర్ను అభినందించారు. డీసీఈబీ సెక్రెటరీ సీతయ్య, విద్యా శాఖ సెక్టోరియల్ అధికారులు శ్రీధర్రెడ్డి, శ్రీనివాసరావు, బాలకృష్ణారావు, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
బాధ్యతగా వ్యవహరించాలి
మోపాల్(నిజామాబాద్రూరల్) : భావితరాలకు నష్టం వాటిల్లకుండా ప్రతిఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి హితవు పలికారు. సమాజం కోసం మనం ఏం చేస్తున్నామన్నది గుర్తెరిగి బాధ్యతతో మెలగాలని సూచించారు. ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలో గురువారం గ్రామ, వా ర్డుసభలకు శ్రీకారం చుట్టారు. మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ చంద్రకళ గంగాప్రసాద్ అధ్యక్షతన జరిగిన గ్రామసభకు కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య ము ఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ ఎల్నినో ప్రభావంతో ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచనలు చేసిందని, తదనుగుణంగా అనుకూలమైన పంటలు ఎంచుకోవాలని హితవు పలికారు. పంట మార్పిడి విధానాలు అవలంబించాలని, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను పాటిస్తూ నాణ్యమైన ఎరువులు, విత్తనాలను వినియోగించాలని సూచించారు. నాసిరకం, నకిలీ ఎరువులు, విత్తనాలను విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని, అలాంటి డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. తనిఖీల కోసం పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేశామని అన్నారు. పర్యావరణానికి హాని చేకూర్చేలా వరి కొయ్యలకు నిప్పు పెట్టవద్దని సూచించారు. ఇలా చేయడం చట్టరీత్యా నేరమని, బాధ్యులకు రూ.5 వేలు నుంచి రూ.25వేల వరకు జరిమానా విధించే అవకాశాలు ఉంటాయని తెలిపారు. పర్యావరణ సమతుల్యత, పచ్చదనాన్ని పెంపొందించేందుకు విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సహకరిస్తూ ఇంటికి వచ్చే బీఎల్వోలకు తగిన వివరాలు అందించాలని కలెక్టర్ సూచించారు. చెరువుల, శిఖం భూములు కబ్జాలకు పాల్పడే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పొలీస్ కమిషనర్ సాయి చైతన్య గుర్తుచేశారు. నేరాల నియంత్రణకు ఉపకరించే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మత్తు పదార్థాలు, దురలవాట్లకు యువత దూరంగా ఉండాలని హితవు పలికారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. సమావేశంలో డీపీవో శ్రీనివాస్రావు, మండల ప్రత్యేకాధికారి తిరుమల ప్రసాద్, నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్, డీఎల్పీవో శ్రీనివాస్, ఎంపీడీవో రాములు నాయక్, తహసీల్దార్ రేఖ, ఉపసర్పంచ్ సతీశ్ రావు, ఎంఈవో అమ్దాపూర్ సాయిలు, ఏవో జాదవ్ హీరా, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వరి కొయ్యలకు నిప్పు పెడితే రూ.25 వేల వరకు జరిమానా పంట మార్పిడి విధానాలు అవలంబించాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ల్లో భాగంగా గ్రామసభలు ప్రారంభం -
ఐదేళ్లలోపు పిల్లల మరణాలు తగ్గించాలి
● డీఎంహెచ్వో రాజశ్రీసుభాష్నగర్ : గర్భిణులు, చిన్న పిల్లల్లో ప్రమాదక ర లక్షణాలను ముందే గుర్తించి మరణాలను తగ్గించాలని డీఎంహెచ్వో రాజశ్రీ సూచించారు. నగరంలోని కలెక్టరేట్లోగల డీఎంహెచ్వో కార్యాలయంలో ఐదేళ్లలోపు పిల్లల మరణాలపై ఆమె గురువా రం సమీక్షించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ వైద్యాధికారులు, వైద్య సిబ్బంది మె డికల్ నాలెడ్జ్ను పెంచుకుంటూ వైద్యసేవలను అందించాలన్నారు. సీపీఆర్ పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలని, ప్రతి గర్భిణి, బాలింతను ఫాలో అప్ విజిట్స్లో తల్లిపాల ప్రాముఖ్యతపై వివరించాలని తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్ వోలు రవీందర్, సమత, పిల్లల వైద్య నిపుణులు, సీ్త్ర వైద్య నిపుణులు శ్రీకాంత్, నవీన్, ఉమా, వనిత, డీఐవో అశోక్, 12 పీహెచ్సీల వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు. -
సీఎంపై అసత్య ఆరోపణలు చేస్తే సహించం
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్రెడ్డి హెచ్చరించారు. మండలంలోని ముల్లంగి(ఐ)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. రైతు డిస్కం వల్ల రైతులకు ఉచిత కరెంట్ తొలగించే కుట్ర చేస్తున్నారని, దీనివెనక వేల కోట్ల స్కాం ఉందని ప్రశాంత్రెడ్డి ఆరోపించడం సిగ్గు చేటన్నారు. పదేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కాలం వెళ్లదీసిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారన్నారు. తమ ఉనికి కాపాడుకోవడానికి బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అసత్య ఆరోపణలకు పాల్పడుతున్నారని, కుంభకోణాలు చేసిన ఘనత వారికే దక్కుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ ధరలు, ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ చిన్నోల్ల నర్సయ్య, సొసైటీ చైర్మన్ గ్యానాజి గంగారెడ్డి, నాయకులు అశోక్, మదుసూదన్, నితిన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
తాటి చెట్లు దగ్ధం
ధర్పల్లి: మండలంలోని ద మ్మన్నపేట్ గ్రామ శివారులో గల చెరువు కట్టపై ఇరువైపులా ఏర్పాటుచేసిన తాటి వ నంలో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో 200 తాటి చెట్లు దగ్ధమయ్యాయి. జీవనోపాధి చూపించే చెట్లు దగ్ధమవడంతో గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభు త్వం తమను ఆదుకోవాలని కోరారు. కామారెడ్డి అర్బన్: తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడిగా నల్లవెల్లి కరుణాక ర్ రెడ్డి నియమితులయ్యారు. వ్యవస్థాపక అధ్యక్షు డు ఏనుగు సంతోష్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకోగా కామారెడ్డి జిల్లా కు చెందిన కరుణకర్రెడ్డి మూడోసారి ఎన్నికయ్యా రు. రాష్ట్ర అధ్యక్షుడు నాగర్తి చంద్రారెడ్డి గురువారం నియామక పత్రం అందజేశారు. ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, ప్రతినిధులు గోపాల్రెడ్డి, రాజ్కుమా ర్రెడ్డి, సుమన్రెడ్డి, లింగారెడ్డి పాల్గొన్నారు. -
హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
● డిచ్పల్లి శివారులో కారును వెనుకనుంచి ఢీకొన్న బైక్ ● ఇద్దరు యువకులు కిందపడగా, లారీ వెళ్లడంతో మృతి భిక్కనూరు: మండలంలోని జంగంపల్లి శివారులోని హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు భిక్క నూరు ఎస్సై అంజనేయులు తెలిపారు. వివరాలు ఇలా.. దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన కొమ్ము మహేష్ (30) బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళశాలలో అటెండర్గా పనిచేస్తున్నాడు. గురువారం అతడు సొంత ప నుల నిమిత్తం సంగమేశ్వర్ నుంచి కామారెడ్డికి బైక్ పై బయలుదేరాడు. జంగంపల్లి గ్రామశివారులో గు ర్తు తెలియని వాహనం ఢీకొని అతడి పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భా ర్య అనురాధ ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై అంజనేయులు వివరించారు. జంగంపల్లి గ్రామశివారులో గురువా రం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో హైవే పక్కన ఉన్న ఓ చెట్టు రోడ్డుపై పడింది. ఆ సమయంలోనే మహేష్ చెట్టును తప్పించి, నెమ్మదిగా వెళ్లడంతోనే గుర్తుతెలియని వాహనం ఢీకొన్నట్లు స్థానికులు భావిస్తున్నారు. డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): మండల కేంద్రం శివారు నాగ్పూర్ గేట్ సమీపంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. డిచ్పల్లి సీఐ వినోద్, ఎస్సై ఎండీ ఆరీఫ్ తెలిపిన వివరాలు ఇలా.. జక్రాన్పల్లి మండలం వైఎస్సార్ కాలనీకి చెందిన చిన్న స్వామి అలియాస్ నవీన్ (20) డిగ్రీ చదువుతుండగా, బలరాం అలియాస్ నాని (24) స్టోన్ కట్టర్గా పనిచేస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం ఇద్దరూ కలిసి బైక్పై ధర్పల్లి నుంచి జక్రాన్పల్లికి బయలుదేరారు. డిచ్పల్లి నాగ్పూర్ గేట్ సమీపంలో హైవేపై మూలమలుపు వద్ద వారి ముందువెళ్తున్న కారును తప్పించబోయి, కారు వెనక భాగాన్ని ఢీకొన్నారు. దీంతో ఇద్దరు బైక్తోపాటు కిందపడిపోయారు. అదే సమయంలో వీరి వెనకే వస్తున్న లారీ వీరిద్దరిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న సీఐ వినోద్, ఎస్సై ఎండీ ఆరిఫ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న సీపీ సాయిచైతన్య సైతం సాయంత్రం ఘటనా స్థలాన్ని సందర్శించారు. అనంతరం జాతీయ రహదారి అధికారులు, రవాణా శాఖ, పోలీసు అధికారులతో మాట్లాడారు. భవిష్యత్లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏసీపీ ప్రకాష్, డిచ్పల్లి సీఐ వినోద్, ఎస్సై ఆరిఫ్, అధికారులు ఉన్నారు. బలరాం (ఫైల్) చిన్న స్వామి (ఫైల్) -
తాళం వేసిన మూడిళ్లల్లో చోరీ
● 4 తులాల బంగారం, రూ.55 వేలు ఎత్తుకెళ్లిన దుండగులు డిచ్పల్లి: మండలంలోని సుద్దపల్లి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి తాళం వేసిన మూడిళ్లల్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. సుద్దపల్లి గ్రామానికి చెందిన మలావత్ నరేష్ ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలిసి వేరే ఊరికి వెళ్లాడు. అలాగే గ్రామానికి చెందిన చింతం రాజశేఖర్, సుమన్ (అన్నదమ్ములు) తమ ఇళ్లకు తాళాలు వేసి డాబాలపై నిద్రించారు. బుధవారం అర్ధరాత్రి ఇద్దరు దుండగులు చేతిలో రాడ్లు పట్టుకుని వచ్చి మొదట నరేష్ ఇంటి వద్ద ఉన్న సీసీ టీవీ ధ్వంసం చేసి, తాళం పగులగొట్టి ఇంట్లో దాచుకున్న రూ.3తులాల బంగారం, రూ.45వేలు ఎత్తుకెళ్లారు. అనంతరం రాజశేఖర్, సుమన్ ఇళ్లలోని తులం బంగారం, రూ.10వేలు ఎత్తుకెళ్లారు. రాజశేఖర్ భార్య ఫోన్ను దొంగిలించారు. ఓ దుండగుడు తన కత్తిని అక్కడే మర్చిపోయాడు. వారి అలజడికి నిద్రలేచి కిందకు వచ్చిన బాధితులు చోరీ జరిగిన విషయాన్ని గమనించి గురువారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ వినోద్, ఎస్సై ఆరిఫ్ ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. -
క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం విజయానికి మూలం
ఖలీల్వాడి: క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం వి జయానికి మూలమని మాజీ ఐపీఎస్ అధికారి, జే డీ లక్ష్మీనారాయణ తెలిపారు. దేశంలో జరిగే ఐఐటీ–జేఈఈ, నీట్ శిక్షణలో ఇస్తున్న రెసోనెన్స్ వి ద్యాసంస్థ సెంటర్ను నిజామాబాద్లోని ఓ ఇంట ర్నేషనల్ హోటల్ వేదికగా గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే బలమైన విద్యా పునాదిని నిర్మించుకోవాల్సిన అవస రం ఎంతైనా ఉందన్నారు. నిజామాబాద్లో ఫౌండేషన్ కోచింగ్ను అందుబాటులోకి తీసుకువస్తు న్న రెసోనెన్స్ విద్యాసంస్థలను అభినందించారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రెసోనెన్స్ ఎండీ పూర్ణచంద్రరావు నర్రా మాట్లాడుతూ అనుభవజ్ఞులైన అ ధ్యాపకులు, క్రమబద్ధమైన బోధనా, నిరంతర వి ద్యా పర్యవేక్షణతో ఫలితాల ఆధారిత విద్యను అందించడానికి కట్టుబడి ఉందన్నారు. ఈ సెంటర్ విద్యార్థులకు ప్రాథమికాంశాలను బలోపేతం చేసుకోవడానికి, ఐఐటీ–జేఈఈ, నీట్, ఒలింపియాడ్స్ వంటి పోటీ పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమవడానికి సహాయపడుతుందని తెలిపారు. -
అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధం
● మాజీ ఎమ్మెల్యే బిగాలకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సవాల్ సుభాష్నగర్: తాను ఒక్కరూపాయైన అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే బహిరంగ చర్చకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాకు నిజామాబా ద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ స వాల్ విసిరారు. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలోగల గణపతి ఆలయానికి తాను వస్తానని బిగాల వస్తా రా? అని ప్రశ్నించారు. నగరంలోని బీజేపీ కార్యాల యంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ధన్పాల్ మాట్లాడారు. అవినీతి, అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్ములేక బిగాల తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. తా ను ఎమ్మెల్యే బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక్క గుంట భూమి కూడా కొనుగోలు చేయలేదని, బిగా ల మాత్రం నగరంలో ఒక్క గుంట కూడా విడిచిపెట్టలేదని విమర్శించారు. రూ.4 కోట్ల మినీ ట్యాంక్బండ్ కాంట్రాక్ట్ అంచనా వ్యయాన్ని అమాంతంగా రూ.40 కోట్లకు పెంచి అవినీతికి బిగాల పాల్పడ్డా డని ఆరోపించారు. కార్పొరేషన్లో 330 మంది పని చేయకున్నా.. చేసినట్లుగా రికార్డుల్లో చూయించి నెలకు రూ.50లక్షల వరకు దోచుకున్నాడని విమర్శించారు. స్రవంతిరెడ్డి, ప్రమోద్, జ్యోతి, రాజు, కి షన్, ప్రభాకర్, గిరిబాబు, విజయ్ పాల్గొన్నారు. -
నేను గీసిన చిత్రం
హన్విక యూకేజీ హైదరాబాద్ ఏ దీక్షిత 2వ తరగతి జీవదాన్ హైస్కూల్ లింగంపేట జిల్లా : కామారెడ్డి టి హయగ్రీవ్ 3వ తరగతి నిర్మల్ అతిషయ 7వ తరగతి నిర్మల్ బి రిష్వంత్ 6వ తరగతి మంజీర హై స్కూల్ రామాయంపేట జిల్లా: మెదక్ -
నదిలో పడి పశువుల కాపరి మృతి
నవీపేట: మండలంలోని యంచ గోదావరి నదిలో పడి ప్రమాదవశాత్తు పశువుల కాపరి మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ గురువారం తెలిపారు. వివరాలు ఇలా.. నిర్మల్ జిల్లా బాసరకు చెందిన మ్యాతరి నారాయణ(44)కు వివాహం కాలేదు. ఈనెల 2న ఎప్పటిలాగే పశువులను మేపుతూ గోదావరి నదిలో నీటిని తాగించేందుకు తీసుకువెళ్లాడు. నదిలోకి దిగిన నారాయణ ప్రమాదవశాత్తు అందులో పడి ఊపిరాడక మృతి చెందాడు. సాయంత్రం ఎప్పటిలాగే పశువులు ఇంటికి వెళ్లగా, నారాయణ ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం నదిలో ఆయన మృతదేహం లభ్యం కావడంతో మృతుడి సోదరి పోశవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మోపాల్: మండలంలోని న్యాల్కల్ చెరువులో పడి ఓ వృద్ధుడు మృతిచెందినట్లు ఎస్సై జాడె సుస్మిత తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన కర్రెళ్ల చిన్న శంకర్ (60)కు గత కొంతకాలంగా మానసిక పరిస్థితి సరిగా లేదు. ఈనెల 3న తన గొర్రెలను చూసి వస్తానని ఇంటి నుంచి వెళ్లి, మళ్లీ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. గురువారం మధ్యాహ్నం చెరువు కట్టపై అతడి దుస్తువులు, చెప్పులు కనిపించడంతో చెరువులో గాలించగా మృతదేహం లభ్యమైంది. సమచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లాకేంద్రాస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. కామారెడ్డి క్రైం: చేపలు పట్టడానికి వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన కామారెడ్డి పెద్ద చెరువులో గురువారం వెలుగుచూసింది. వివరాలు ఇలా.. మున్సిపల్ పరిధిలోని సరంపల్లి గ్రామానికి చెందిన బొడ్డారి స్వామి (25) అనే యువకుడు బుధవారం చేపలు పట్టడానికి కామారెడ్డి పెద్ద చెరువుకు వెళ్లాడు. మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో గురువారం ఉదయం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చెరువు వద్దకు వెళ్లి చూడగా నీటిలో అతడి మృతదేహం కనిపించింది. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. చేపల కోసం నీటిలోకి దిగగా, ఫిట్స్ రావడంతో నీటమునిగి మృతిచెందినట్లు లుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అర్హులకే సంక్షేమ ఫలాలు
బోధన్: కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తుందని ప్రభు త్వ సలహదారు, ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం లబ్ధిదారులకు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నుడా చైర్మన్ కేశవేణు, తహసీల్దార్ దత్తాద్రి, ఎంపీడీవో శంకర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్ల రాంమోహన్, ఏంఎసీ డైరెక్టర్ బొబ్బిలి శ్రీనివాస్, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి
● డీఎంహెచ్వో రాజశ్రీ పెర్కిట్(ఆర్మూర్): రానున్న వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి రాజశ్రీ వైద్య సిబ్బందికి సూచించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో నిర్వహిస్తున్న టీకాల కా ర్యక్రమాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు అయ్యేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ నెల 28న చేపట్టనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి ఐదేళ్ల లోపు పిల్లల జాబితాను తయారు చేసి పెట్టుకోవాలని సూచించారు. అనంతరం మందుల నిల్వల రిజిస్టరు, ఓపీ రి జిస్టరు, వ్యాధి నిరోధక టీకాల అర్హుల జాబితాను పరిశీలించారు. ఆర్మూర్ మండలం చేపూర్ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని జిల్లా ఇమ్యునైజేషన్ అ ధికారి అశోక్ పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రీతి పావని, ఆరోగ్య కార్యకర్తలు జక్కుల మోహన్, సువర్ణ, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
నిజాంషుగర్స్ కార్మికులను ఆదుకోవాలి
బోధన్: మూతపడిన ఎన్డీఎస్ఎల్ ( నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్) కార్మికుల బకాయి వేతనాలు చె ల్లించి ఆదుకోవాలని కార్మిక సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఫ్యాక్టరీ ప్రధాన గేటు ఎదుట బుధవారం కార్మిక సంఘాల ఆధ్వ ర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉపేందర్, రవిశంకర్ గౌడ్ మాట్లాడుతూ లేఆఫ్ ప్రకటించి ఇప్పటి వరకు 11 ఏళ్లు పూర్తి కావొస్తున్నా కార్మికుల బకాయి వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మానవతాదృక్పథంతో కార్మికులను ఆదుకోవాలని కోరారు. కార్మిక నాయకులు బాలకృష్ణ, రాజారాం, దేవదాసు, బాలచందర్, భాస్కర్, భిక్షపతి, భూమయ్య, శ్రీధర్ పాల్గొన్నారు. ఎస్ఐఆర్పై సదస్సు ఆర్మూర్టౌన్: పట్టణంలోని రైతువేదిక భవనంలో వివిధ పార్టీ నాయకులు, రెవెన్యూ అధికారులకు బుధవారం ఎస్ఐఆర్పై శిక్షణ సదస్సు నిర్వహించా రు. ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్ స్పెక్టర్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ ప్రతీ ఓటర్ మ్యాపింగ్ చేయించుకోవాలని, 2002 ఓటర్ లిస్టులోని ప్రస్తుత ఓటరు వారసులతోపాటు తల్లిదండ్రుల వివరాలు నమోదు చేయించుకోవాలని సూచించారు. రెవె న్యూ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
వాగ్ధానాలను అమలు చేయాలి
కమ్మర్పల్లి/ బోధన్/ ఆర్మూర్ : ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన వాగ్ధానలను అమలు చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. కమ్మర్పల్లి, బోధన్, ఆలూర్ ఆర్డీవో, తహసీల్ కార్యాలయాల ఎదుట బుధవారం అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు రాతపూర్వకంగా ఇచ్చిన స్వామినాథన్ కమిషన్ సి ఫారసులను అమలు చేయడంతోపాటు పంటలకు మద్దతు ధరల చట్టం బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ పై సరఫరా చేయాలన్నారు. పంట రుణాలను మా ఫీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం మేరకు మూతపడిన నిజాంషుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని పేర్కొన్నారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. కమ్మర్పల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సారా సురేశ్, నాయకులు బాలయ్య, కిషన్, లింబ నాయక్, లింబన్న, రమేశ్, మలావత్ లింబన్న, స్వప్న, శిరీష, నర్సు, లక్ష్మి, గౌరీ తదితరులు పాల్గొన్నారు. బోధన్లో రాష్ట్ర కమిటీ సభ్యుడు గుమ్ముల గంగాధర్, డివిజన్ ప్రతినిధులు పుట్టనడ్పి నాగన్న, పార్వతి రాజేశ్వర్, కాశ రవి, శ్రీపతి మల్లేశ్, సిద్ధ పోశెట్టి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఆలూర్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దేవరాం, జిల్లా ఉపాధ్యక్షుడు యూ.రాజన్న, ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు జే.శేఖర్, జిల్లా కార్యదర్శి కిషన్, నాయకులు పస్క నాగేశ్వర్, ఉంగరాల జగదీశ్వర్, ఉంగరాల రాములు, గంగారం తదితరులు పాల్గొన్నారు. -
పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నాం
● ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి ● నియోజకవర్గంలో విస్తృత పర్యటన ● ఇందిరమ్మ గృహ ప్రవేశాలురెంజల్/ నవీపేట / బోధన్ టౌన్ : ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను తీరుస్తుందని ప్రభుత్వ ప్రధాన సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. బోధన్ నియోజకవర్గంలోని రెంజల్, నవీపేట, బోధన్ పట్టణాల్లో బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. ఇందిరమ్మ గృహ ప్రవేశాలను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం బోధన్ నియోజకవర్గానికి ఒక్క ఇళ్లు నిర్మించి ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులను గుర్తించి ఒక్క రెంజల్ మండలానికి వెయ్యి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. విడతల వారీగా అవసరమైన అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. చివరి బిల్లు మంజూరులో కొంత జాప్యం జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అధికారులతో చర్చించి సకాలంలో అందించే ఏర్పాటు చేస్తానన్నారు. రెంజల్లో రైతులు, వ్యవసాయ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వానాకాలంలో సీజన్కు సంబంధించి రైతులకు ఇబ్బందులు రానీయకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సాగు నీరు, ఎరువులు, విత్తనాలు అందించేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. రెంజల్లో నిర్వహించిన కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మొబిన్ఖాన్, సర్పంచ్లు ధనుంజయ్, ఎత్తరి మాధవి, లచ్చవార్ సుహసిని, తిరుపతి లలిత, మాధవ్, నాయకులు సాయిబాబాగౌడ్, రాములు, ఆసాని అనిల్ తదితరులు పాల్గొన్నారు. నవీపేటలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, సర్పంచ్ కేఎల్వీ రేఖ, ఉప సర్పంచ్ నవీన్రాజ్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్గౌడ్, రాజేంద్రకుమార్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలోని ఆచన్పల్లి, అనీసానగర్, రాకాసీపేట్లో ఇందిరమ్మ గృహ ప్రవేశాలను సుదర్శన్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మాశరత్ రెడ్డి, కౌన్సిలర్ లక్ష్మి రామ్మూర్తి, పట్టణ అధ్యక్షుడు దాము, మున్సిపల్ ఫ్లోనర్ లీడర్ శరత్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. -
జింకలు విలవిల
గోదారి తీరాన గాయపడిన జింకకు సపర్యలు చేస్తున్న రైతు డొంకేశ్వర్(ఆర్మూర్): ఒకప్పుడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో జింకలు గుంపులు గుంపులుగా తిరిగేవి. కుక్కల దాడి కారణంగా ఇప్పుడు పట్టుమని పది జింకలు కూడా కనిపించడం లేదు. ఇవి కూడా కనుమరుగైతే అప్పుడు ఏకో టూరిజం ఏర్పాటు చేసినా ఎలాంటి అర్థం ఉండదు. వచ్చిన పర్యాటకులు జింకలకు బదులు కుక్కలను చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే కుక్కల సంఖ్య పెరగడంతో అవి తమపై ఎక్కడ దాడి చేస్తాయోనని పర్యాటకులు భయపడుతున్నారు. వాటిని ఇక్కడి నుంచి తరలించాలని పర్యాటకులు, స్థానిక రైతులు అధికారులను కోరుతున్నారు. అయితే, బ్యాక్ వాటర్కు వేలాది ఎకరాల విస్తీర్ణం ఉండడం, అది ఇరిగేషన్ ల్యాండ్ కావడంతో అటవీ అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టలేకపోతున్నారు. హద్దులు ఏర్పాటు చేసే పరిస్థితి కూడా లేకపోవడంతో ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. రక్షణ చర్యలకు ఏ మార్గం లేదా? డొంకేశ్వర్ మండలం చిన్నయానం, గంగాసముందర్, జీజీ నడ్కుడ, గాదేపల్లి వంటి గ్రామాల శివార్లలో జింకలు ఎక్కువగా ఉండేవి. ప్రతి ఏడాది వేసవిలో బ్యాక్వాటర్ తగ్గి పచ్చిక బయటళ్లు ఏర్పడడంతో ఆ పచ్చికను మేసేందుకు వస్తున్న జింకలను వీధి కుక్కలు వేటాడుతున్నాయి. జింకల మాంసానికి రుచి మరిగిన కుక్కలు నలుదిక్కులా మాటు వేసి వెంబడిస్తున్నాయి. దీంతో జింకలు భయంతో వేరేచోటికి కూడా వెళ్లిపోతున్నాయి. కుక్కల దాడిలో గాయపడిన జింకలను శివారు గ్రామాల ప్రజలు, మత్స్యకారులు కాపాడి అటవీ అధికారుల పర్యవేక్షణలో పశువైద్య అధికారులతో చికిత్స చేయిస్తున్నారు. చనిపోయిన వాటికి అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. తాజాగా గతనెల 6న ఒక జింక పిల్లను కుక్కల బారి నుంచి కాపాడి అటవీ అధికారులకు అప్పగించారు. అదే నెల 28న కుక్కల దాడిలో గాయపడిన చుక్కల జింక నడ్కుడ గ్రామంలోకి వచ్చింది. స్థానికులు దానిని పట్టుకొని వైద్యం అందించారు. అయితే, జింకల రక్షణకు అధికారులకు ఏ మార్గం కనిపించడం లేదు. వేలాది ఎకరాలున్న బ్యాక్ వాటర్లో ట్రెంచ్ ఏర్పాటు చేయడం అతి కష్టం. సుప్రిం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు కుక్కలకు కారుణ్య మరణం కల్పించాలనే డిమాండ్ తెరపైకి వస్తోంది. నిరంతరం పర్యవేక్షిస్తున్నారు..వేలాది ఎకరాల్లో బ్యాక్ వాటర్ ఏరి యా విస్తరించి ఉంది. దీంతో కుక్కల సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి వీలు లేకుండా ఉంది. ఇరిగేషన్ ల్యాండ్ కావడంతో అటవీ శాఖ అజమాయిషీ చేయలేకపోతోంది. జింకలు, వన్యప్రాణుల రక్షణకు బ్యాక్ వాటర్లో ఒక డీఆర్వోతో పాటు బీట్ ఆఫీసర్ ఉన్నారు. వారు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. గ్రామస్తుల సహకారంతో జింకలను ఎప్పటికప్పుడు రక్షిస్తున్నారు. – సిద్ధార్థ్ విక్రమ్సింగ్, జిల్లా అటవీ అధికారిఎకో టూరిజం మాటేమో గానీ.. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో జింకలకు మనుగడ లేకుండా పోతోంది. స్వేచ్ఛగా విహరించే ఈ వన్యప్రాణులను ఊర కుక్కలు వేటాడి పీక్కుతింటున్నాయి. ప్రతిఏటా ఎన్నో జింకలు కుక్కల నోట చిక్కి ప్రాణాలు విడుస్తున్నాయి. ఫలితంగా బ్యాక్ వాటర్లో జింకల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో వన్యప్రాణులకు రక్షణ కరువు పచ్చిక బయళ్లలో మాటు వేసి వేటాడుతున్న ఊర కుక్కలు దాదాపుగా కనుమరుగవుతున్న జింకల సంఖ్య వేల ఎకరాల విస్తీర్ణం ఉండడంతో రక్షణ చర్యలు చేపట్టలేని పరిస్థితి -
జెండాను అవమానపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలి
రుద్రూర్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలో జాతీయ పతాకం రూపంలో కేక్ తయారు చేయించి కట్ చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు బుధవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు బోజగొండ అనిల్, మండల నాయకులు వడ్ల సాయినాథ్, రేపల్లి సాయిప్రసాద్, కుమ్మరి గణేశ్, తీగుళ్ల రాజా వరప్రసాద్, బైండ్ల బాలరాజ్, ధర్మరం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ : మండలంలోని హుస్సేన్నగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కేసిరెడ్డి శ్రీనివాస్రెడ్డి మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో వైఫల్యం చెందడం, ప్రజా వ్యతిరేక పాలన నచ్చక బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. పార్టీలో చేరిన శ్రీనివాస్రెడ్డిని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వీసీ గౌడ్,పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బాజిరెడ్డి జగన్ అభినందించారు. -
ఢిల్లీ సదస్సుకు ఎఫ్పీవోల చైర్మన్లు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఈ నెల 4న జరుగనున్న రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఫెడరేషన్ సదస్సుకు ఎఫ్పీవోల చైర్మన్లు బుధవారం బయల్దేరి వెళ్లారు. జిల్లా లోని జక్రాన్పల్లి మండలం మనోహరాబాద్ గ్రామానికి చెందిన జేఎంకేపీఎం చైర్మన్ పాట్కూరి తిరుపతిరెడ్డి, డైరెక్టర్ ఎం.రాజు, మోర్తాడ్ మండలం నుంచి ఎఫ్పీవో డైరెక్టర్ లక్ష్మీనర్సయ్య, జగిత్యాల జిల్లా ఇటిక్యాల ఎ ల్జీఎంఆర్ రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు గడ్డం రాజేందర్రెడ్డి హాజరు కా నున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ని ర్మాణం, బలోపేతం, ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తదితర అంశాలే సమావేశం ముఖ్య ఉద్దేశమని ఎఫ్పీవోల ప్రతినిధులు తెలిపారు.నిజామాబాద్ను ‘స్మార్ట్ సిటీ’గా ప్రకటించాలి ● అఖిల భారత మేయర్ కౌన్సిల్లో మేయర్ ఉమారాణి సుభాష్నగర్: ఉత్తరఖండ్ రాష్ట్రంలోని రు షికేశ్లో బుధవారం నిర్వహించిన అఖిల భారత మేయర్స్ కౌ న్సిల్ 117వ కార్యవర్గ సమావేశానికి నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి హాజరయ్యారు. దే శవ్యాప్తంగా నగరాల అభివృద్ధి, పట్టణ పా లనలో నూతన విధానాలు, స్వచ్ఛత, మౌలి క వసతుల విస్తరణ, సుస్థిర పట్టణాభివృద్ధి అంశాలపై జరిగిన సమావేశంలో మేయర్ నిజా మాబాద్ నగర అభివృద్ధికి సంబంధించిన ప లు కీలక అంశాలను ప్రస్తావించారు. కౌన్సి ల్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా ప్ర కటించాలని విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ సిటీ హో దా లభిస్తే నగరంలో మరిన్ని ఆధునిక మౌలి క వసతులు, సాంకేతిక సేవలు, సమగ్ర పట్టణాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. మూడురోజులు విద్యుత్ సరఫరాలో అంతరాయం సుభాష్నగర్ : నగరంలోని 33/11 కేవీ ఆర్యగనర్ సబ్స్టేషన్ పరిధిలో ఉన్న టాటా మో టార్స్ షోరూం వెనకభాగంలో కొన్ని ఏరియాల్లో ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఉద యం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వి ద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడు తుందని టౌన్–3 ఏడీఈ వినోద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ ఏరియాలోని 132 కేవీ టవర్లపై లైన్ మార్చే ప్రక్రియ చేపడుతున్నందున విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నామని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు. 7న మున్నూరు కాపు విద్యార్థులకు పురస్కారాలు సుభాష్నగర్ : తెలంగాణ మున్నూరుకాపు ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం (ఇందూరు) ఆధ్వర్యంలో ఈ నెల 7న నగరంలోని ప్రగతినగర్ ము న్నూరుకాపు కల్యాణ మండపంలో పదోతరగతి, ఇంటర్, ఈపీసెట్, జేఈఈ అడ్వాన్స్ లో ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రతిభా పుర స్కారాలు అందజేస్తున్నట్లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తోట రాజశేఖర్ పటేల్, అబ్బాపూర్ రవీందర్ పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే పలువురు విద్యా ర్థులు తమ పేర్లు నమోదు చేసుకున్నా రని పేర్కొన్నారు. ఈ ఏడాది క్రీడల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన వారికి కూడా పుర స్కారాలు ఇవ్వాలని నిర్ణయించామని, వారు కూడా జిల్లా కమిటీకి పేర్లు అందజేయాలని కోరారు. -
ఎల్నినో ముప్పుంది..
● వర్షాభావ పరిస్థితులపై రైతులు అప్రమత్తంగా ఉండాలి ● పంటల ఎంపిక, సాగు పద్ధతులపై వ్యవసాయ శాఖ సూచనడొంకేశ్వర్(ఆర్మూర్): వాతావరణ శాఖ అంచనా ప్రకారం జిల్లాపై ఎన్నినో ప్రభావం ఉందని, సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశమున్నట్లు వ్యవసాయ శాఖ రైతులను అప్రమత్తం చేసింది. వర్షాలు ఆలస్యమైనా ఆందోళన చెందకుండా పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని, సాగు పద్ధతులను మార్చుకోవాలని సూచించింది. తద్వారా పంట నష్టాలను తగ్గించుకోవచ్చని జిల్లా వ్యవసాయాధికారి వీరాస్వామి ఒక ప్రకటన విడుదల చేశారు. ● జూన్లో సాధారణ వర్షపాతం నమోదై తర్వాత వర్షాలు నిలిచిపోయే అవకాశం ఉన్నందున పంటల ప్రణాళిక ముందే రూపొందించుకోవాలి. పొలాల్లో సేద్యపు కుంటలు ఏర్పాటు చేసుకోవాలి. ● ముఖ్యంగా వరి సాగుకు బదులు నీటి ఎద్దటిని తట్టుకునే కంది, కొర్రలు, సజ్జలు లాంటి దిగుబడినిచ్చే పంటలను సాగు చేయాలి. ● జూలై 15 వరకు వర్షాలు లేకపోతే పొడి నెలల్లో తొందరపడి విత్తనాలు వేయొద్దు. తేలిక నేలల్లో 50–60 మి.మీ అలాగే బరువు నేలల్లో 60–70 మి.మీ వర్షపాతం నమోదైన తర్వాత ఏడు రోజుల్లోపే విత్తనాలు విత్తనాలి. ● పత్తి, మొక్కజొన్న, కంది పంటల్లో సాధారణ సాగు కొనసాగించొచ్చు. మొక్కల సంఖ్య తగ్గకుండా ఉండేందుకు 10 శాతం ఎక్కువ విత్తనాలు వేయాలి. మొలకలు రాని చోట వెంటనే తిరిగి విత్తాలి. ● నేలలో తేమ వచ్చే వరకు ఎరువుల వాడకం వాయిదా వేయాలి. అంతరకృషి ద్వారా నేల తేమను కాపాడుకోవాలి. 2 శాతం యూరియా, 1శాతం పొటాషియం నైట్రెడ్ ద్రవాన్ని 15 రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు పిచికారీ చేయాలి. ● జూలై 30 వరకు అలాగే ఆగస్టు 15 వరకు వర్షాలు కురవకపోతే అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించడానికి ఒక సాలు వదిలి ఒక సాలుకు తడులు ఇవ్వాలి. వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు బదులు కంది, సజ్జ, మొదలగు పంటలు వేసుకోవాలి. -
జీజీహెచ్లో ప్లాస్టిక్ సర్జరీలు విజయవంతం
సుభాష్నగర్: నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో జరిగిన తొలి, క్లిష్ట ప్లాస్టిక్ సర్జరీలు రెండు విజయవంతమయ్యాయని సూపరింటెండెంట్ డాక్టర్ బీవీ నాగమోహన్ తెలిపారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందిన లచ్చవ్వ ముఖంపై ఎడ మ కన్ను కింద భాగంలో బాసల్ సెల్ కార్కినోమ వ్యాధితో బాధపడుతోంది. వ్యాధి నిర్ధారణ కావడంతో శస్త్రచికిత్స విభాగాధిపతి డాక్టర్ విజయ్కుమార్ పర్యవేక్షణలో ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శివానీ ఆధ్వర్యంలో రొటేషన్ ఫ్లాప్ రీకన్స్ట్రక్షన్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అదేవిధంగా నగరానికి చెందిన మమత కాలిభాగంలో దీర్ఘకాలంగా మానని గాయం కారణంగా తీవ్రంగా బాధపడుతోంది. ఆమెకు ఫ్లాప్ కవర్, స్ల్పిట్ థిక్నెస్ స్కిన్ గ్రాఫ్టింగ్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తిచేశారు. చికిత్స ద్వారా రోగులు సాధారణ జీవన విధానానికి తిరిగి చేరుకునే అవకాశం కలిగిందని సూపరింటెండెంట్ నాగమోహన్ తెలిపారు. ఆధునిక ప్లాస్టిక్ సర్జరీ సేవల ద్వారా ప్రజలకు నాణ్యమై న వైద్యం జీజీహెచ్లో అందుతుందని పేర్కొన్నా రు. ప్రజలకు అత్యాధునిక సేవలు అందించేందుకు ఆస్పత్రి వైద్యబృందం కట్టుబడి ఉందన్నారు. వైద్యుల బృందాన్ని అభినందించారు. -
ఎరువులను సకాలంలో అందజేయాలి
● జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ రావురుద్రూర్ : సహకార సంఘ పరిధిలోని రైతులకు అ వసరమగు ఎరువులను సకాలంలో అందజేయాల ని జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ రావు సూచించారు. మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యా లయాన్ని బుధవారం సాయంత్రం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రుణమా ఫీ ఖాతాలు, ఎరువుల నిల్వలు, యూరియా విక్రయాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించా రు. అనంతరం పాలకవర్గ సభ్యులతో మాట్లాడా రు. ఇప్పటి వరకు సంఘ పరిపాలన బాధ్యతలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. బాధ్యతలు వద్దంటే లిఖిత పూర్వకంగా తెలియజేయాలని సూ చించారు. డైరెక్టర్లు మాట్లాడుతూ గతంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో విండో కార్యదర్శిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో షోకాజ్ నోటీసు జారీ చేయకపోవడంపై డీసీవో అసంతృప్తి వ్యక్తం చేశారు. అవకతవకలు నిర్ధారణ అయితే కార్యదర్శిని సస్పెండ్ చేసే అధికారం పాలకవర్గానికి ఉంటుందని పేర్కొంటూ, ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. -
మంజీర నదిలో ఉద్రిక్తత
బోధన్: మంజీర నదిలోని మన భూభాగంలో మ హారాష్ట్ర కాంట్రాక్టర్ల ఇసుక తవ్వకాలను రెవెన్యూ, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. బుధవారం సాలూర మండల తహసీల్దార్ అజ్మీత్ నవాజ్, రెవెన్యూ సిబ్బంది, బోధన్ ఏసీపీ శ్రీనివాస్ నేత్రుత్వంలో డివిజన్ పరిధిలోని బోధన్ రూరల్, ఎడపల్లి, రెంజల్, రుద్రూర్ మండలాల సీఐలు, ఎ స్సైలు, సిబ్బంది కలిసి సాలూర మండలం హు న్సా, మందర్నా గ్రామ శివారులోని మంజీర నదిలోకి వెళ్లారు. అక్కడ మన భూభాగంలో ఇసుక త వ్వకాలు జరుపుతున్న మహారాష్ట్రలోని బిలోలి తాలూకా బోలేగాం ఇసుక క్వారీ జేసీబీలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో బోలేగాం క్వారీ నిర్వాహకుల అనుచరులు, ఆ గ్రామస్తులు పదుల సంఖ్యలో వచ్చి మన పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. మా ప్రాంతంలోనే ఇసుక తవ్వకాలు సాగు తున్నాయని వాదించారు. వాగ్వివాదాల అనంతరం మంజీర నదిలో సరిహద్దులను గుర్తించేందుకు జాయింట్ సర్వే నిర్వహించాలని ఇరు రాష్ట్రా ల రెవెన్యూ, పోలీసు అధికారులు ఒక అంగీకారానికి వచ్చారు. అప్పటి వరకు ఇసుక తవ్వకాలు, రవాణను నిలిపి వేయాలని మన అధికారుల సూచనను మహారాష్ట్ర అధికారులు ఒప్పుకున్నారు. ఈ నెల 5న బోలేగాం క్వారీ వద్ద రెండు రాష్ట్రాల రెవె న్యూ, ల్యాండ్ సర్వే శాఖల అధికారులతో జాయింట్ సర్వే చేపట్టనున్నామని తహసీల్దార్ అజ్మీత్ న వాజ్ తెలిపారు. మంజీరలోని మన హద్దుల్లోకి వచ్చి మహారాష్ట్ర ఇసుక కాంట్రాక్టర్లు తవ్వకాలు చేపట్టారని సమాచారం మేరకు మంగళవారం సాలూర మండల రెవెన్యూ, ల్యాండ్సర్వే, మైనింగ్ అధికారులు సర్వే నిర్వహించి నిర్ధారించారు. మన భూభాగంలో ‘మహా’ ఇసుక తవ్వకాలు అడ్డుకున్న సాలూర రెవెన్యూ సిబ్బంది, బోధన్ డివిజన్ పోలీసులు వాగ్వాదాల అనంతరం సరిహద్దుల జాయింట్ సర్వేకు అంగీకారం ఈనెల 5న సర్వే నిర్వహించనున్న ఇరురాష్ట్రాల అధికారులు -
విద్యుత్ డిస్కమ్ల విభజన వెనుక రూ. వేల కోట్ల స్కామ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నరేంద్రమోదీ, చంద్రబాబునాయుడులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏజెంట్గా పనిచేస్తున్నరని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ మీద అవగాహనపై విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ డిస్కమ్లను మూడు ముక్కలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తున్న కొత్త విధానం వెనుక వేలకోట్ల స్కామ్ దాగిఉందన్నారు. ఫ్యాక్టరీలు, కమర్షియల్, గృహ అవసరాలకు సంబంధించి ఆదాయం వచ్చే డిస్కమ్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి రూ.వేల కోట్లు దండుకునేందుకు పథకం వేశారన్నారు. ఆదాయం లేని, బిల్లులు రాని రైతు వ్యవసాయ, మిషన్ భగీరథ, లిఫ్ట్ ఇరిగేషన్ కనెక్షన్లను కలిపి ’రైతు డిస్కమ్’గా మారుస్తున్నారన్నారు. గతంలో ఏటా రూ.10 వేల కోట్లు ఉచిత వ్యవసాయ విద్యుత్ కోసం వాడేవాళ్లమన్నారు. ఇప్పుడు రూ.35 వేల కోట్ల బాకీని రైతు డిస్కమ్లపై నెడుతున్నారని ఆరోపించారు. రైతులకు ఉచిత విద్యుత్ అందకుండా కుట్ర చేస్తున్నారన్నారు. నగరంలోని రైల్వేస్టేషన్ సమీపంలో బస్స్టేషన్ కోసం కేటాయించిన స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ కోసం దండుకున్నారన్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ గడ్డపైకొచ్చి పునర్నిర్మాణం గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి వార్డు లో విజయవంతం చేయాలని ప్రశాంత్ రెడ్డి కోరా రు. ‘సర్’ కింద అర్హులైన వారి ఓట్లు తొలగిపోకుండా బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నా రు. మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్లు మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదును బాధ్యతగా తీసుకోవాలన్నారు. మాజీ ఎమ్మె ల్సీ వీజీ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు హనుమంత్ సింధే, జాజాల సురేందర్, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్సింగ్, నీతు కిరణ్, నుడా మాజీ చైర్మన్ ప్ర భాకర్ రెడ్డి, సిర్పరాజు, సత్య ప్రకాష్ పాల్గొన్నారు. మోదీ, చంద్రబాబులకు ఏజెంట్గా సీఎం రేవంత్రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ తొలగించేందుకు కుట్ర బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు సభలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి -
గ్రామ, వార్డు సభల నిర్వహణపై దిశానిర్దేశం
నిజామాబాద్ అర్బన్: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 4, 6, 8, 10వ తేదీలలో పంచాయతీల్లో గ్రామ సభలు, మున్సిపాలిటీల్లో వార్డు సభల నిర్వహణకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీవోలు, వి విధ శాఖల అధికారులకు జిల్లా ఉన్నతాధికారులు గ్రామ, వార్డు సభల నిర్వహణ, విధి, విధానాలపై అవగాహన కల్పించడం గురించి అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు దిశానిర్దేశం చేశారు. గ్రామ, వార్డు సభల నిర్వహణకు ఒకరోజు ముందే టాంటాం ద్వారా, ఇతర ప్రచార మాధ్యమాల ద్వా రా ప్రజలకు ముందస్తుగానే సమాచారం అందించాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై సభలలో అవగాహన కల్పించాలన్నారు. ఖరీఫ్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎరువులు, విత్తనాలు అందించేందుకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో రైతులకు పంటల మార్పిడి, వర్షపు నీటి నిలువ, ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకంపై అవగాహన కల్పించాలన్నారు. ప్లాస్టిక్ వినియోగం నియంత్రణ, వాల్టా, వన్యప్రాణి సంరక్షణ చట్టాల గురించి తెలియజేయాలన్నారు. రక్షిత మంచినీటి సరఫరా, వీధి దీపాలు, సానిటేషన్ నిర్వహణపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించాలన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ శుభం నగ్రాలే, డీఆర్వో గీత, డీఎఫ్వో సిద్దార్థ్ విక్రమ్ సింగ్, డీఆర్డీవో సాయన్న, జె డ్పీ సీఈవో సాయగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్, బోధన్ ఆర్డీవోలు రాజేంద్రకుమార్, విజయలక్ష్మి పాల్గొన్నారు. ఎస్ఐఆర్పై అవగాహన కల్పించాలి ఖరీఫ్లో రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి అధికారులకు అదనపు కలెక్టర్ల సూచనలు -
జిల్లాలో ఎస్సైల బదిలీలు
పేరు ప్రస్తుత స్థానం బదిలీ అయిన స్థానం సందీప్ ఇందల్వాయి ధర్పల్లి సామ శ్రీనివాస్ ధర్పల్లి వీఆర్ సుమలత వీఆర్ ఇందల్వాయి(ఎస్హెచ్వో) అనిల్రెడ్డి కమ్మర్పల్లి మాక్లూర్ రాజశేఖర్ మాక్లూర్ బోధన్ రూరల్ మచ్చేందర్ బోధన్ రూరల్ సీఎస్బీ శ్రీనివాస్ వెయింటింగ్ కోటగిరి సునీల్ కోటగిరి 5వ టౌన్ వినయ్ వీఆర్ నందిపేట(ఎస్హెచ్వో) శ్యామ్రాజ్ నందిపేట వీఆర్ సతీశ్ జగిత్యాల ఎస్బీ కమ్మర్పల్లి(ఎస్హెచ్వో) మనోజ్కుమార్ వీఆర్ రుద్రూర్ సాయన్న రుద్రూర్ వీఆర్ గంగాధర్ 5వ టౌన్ రెంజల్ యాదగిరి వీఆర్ 6వ టౌన్ వెంకట్రావు 6వ టౌన్ సీటీసీ సందీప్ వీఆర్ 2వ టౌన్ సయ్యద్ముజాయిద్ 2వ టౌన్ ఎస్బీ చంద్రమోహన్ సీసీఎస్ సీసీఆర్బీ గోవింద్ వీఆర్ సీఎస్బీనిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలువురు ఎస్సైలు బదిలీ అయ్యారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. -
పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీ
కమ్మర్పల్లి : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కా ర్యక్రమంలో భాగంగా కమ్మర్పల్లిలో బుధవారం అటవీ శాఖ ఆధ్వర్యంలో హరిత తెలంగాణ, స్వచ్ఛమైన పర్యావరణం, ఆరోగ్యకరమై న భవిష్యత్ అనే నినాదంతో బైక్ ర్యాలీ చేప ట్టారు. అటవీ శాఖ కార్యాలయం నుంచి జాతీ య రహదారి మీదుగా పోలీస్స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో డీఆర్వోలు శ్రీనివాస్, సిద్ధార్థ, ఎఫ్ఎస్వోలు బాపూరావు, రాజేందర్, బేస్ క్యాంప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంరెంజల్(బోధన్): రెంజల్లోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం బైపీసీలో 40 సీట్లు ఖాళీగా ఉన్నా యని ప్రిన్సిపల్ శ్యామల తెలిపారు. అర్హులైన బాలికలు ఈ నెల 12వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎస్సెస్సీ ఫలితాల జాబితా, ఆధార్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతోపాటు రెండు పాస్పోర్టు ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. బైపీసీ ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వ కళాశాలలోనే నాణ్యమైన విద్య ఆర్మూర్టౌన్ : ప్రభుత్వ కళాశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని కళాశాల ప్రిన్సిపల్ సుభాష్ అన్నారు. ఆర్మూర్, పెర్కిట్, మామిడిపల్లిలో ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల అధ్యాపకులు పదో తరగతి పాసైన విద్యార్థుల ఇంటింటికి తిరిగి ప్రభుత్వ కళాశాలలో చేరాలని ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యాపకులు చంద్రశేఖర్, నరే శ్, లక్ష్మణ్, శ్రీనివాస్, రామకృష్ణ, కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు. బరువు కొలిచే పరికరం వితరణ కమ్మర్పల్లి : కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్పల్లి ఆధ్వర్యంలో బుధవారం బరువు కొలిచే పరికరాన్ని(వెయింగ్ మిషన్)ను వితరణ చేశారు. సర్పంచ్ మెహబూబ్, ఉప సర్పంచ్ సట్ట విశాల్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లుక్క గంగాధర్, సభ్యులు తెడ్డు రమేశ్, నోముల నరేందర్ రెడ్డి, బద్రి, గుండోజీ రవీందర్, చిలివేరి పవన్కుమార్, సురంగి చంద్రశేఖర్, హెచ్ఈవో సత్యనారాయణ, ఫార్మసిస్ట్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. ఎంఈవోకు సన్మానం రుద్రూర్: మండల విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన రామ్సింగ్ను బుధవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. విద్యారంగ అభివృద్ధికి కృషి చేసి మండలంలో పాఠశాలల పురోగతికి తోడ్పడాలని ఆకాంక్షించారు. క్లబ్ అధ్యక్షుడు కేవీ మోహన్, సభ్యులు శ్యామ్ సుందర్ పహాడే, పత్తి రాము, గుండూరి ప్రశాంత్ గౌడ్, పుట్టి సాగర్, గెంటిల గంగాధర్, గాండ్ల మధు, అడ్ప సుమన్ తదితరులు పాల్గొన్నారు. విద్యా శిరోమణికి దరఖాస్తుల ఆహ్వానం నిజామాబాద్ రూరల్ : విద్యా శిరోమణి అవార్డ్స్–2026కు జిల్లాలోని కుమ్మర శాలివాహన కులానికి చెందిన ప్రతిభావంతులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు శాలివాహన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్(సేవా) జిల్లా అధ్యక్షుడు మర్రిపల్లి భూపతి బుధవారం తెలిపారు. పదో తరగతిలో 500కు పైగా, ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 900కుపైగా మార్కులు సాధించినవారు తమ వివరాలను ఈనెల 4 వరకు 99123 37702 ఫోన్కు వాట్సాప్ చేయాలని సూచించారు. పురస్కారాలు, ప్రశంసపత్రాలు అందిస్తామని తెలిపారు. -
నిధులు మంజూరు చేయించాలి
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయించాలని సర్పంచ్ అంక్సాపూర్ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పాలకవర్గసభ్యులు ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అంకాపూర్లోని ఎమ్మెల్యే నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామాభివృద్ధిపై ఎమ్మెల్యేతో చర్చించారు. రూ.200 కోట్లతో చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ను మంజూరు చేయించిన ఎమ్మెల్యేను ఈ సందర్భంగా పాలకవర్గసభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ తుకారాం, వార్డు సభ్యులు పాల్గొన్నారు. నేటి నుంచి వార్డు సభలు ఆర్మూర్టౌన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 36 వార్డులలో గురువారం నుంచి వార్డు సభలను నిర్వహిస్తున్నట్లు కమిషనర్ శ్రీహరి రాజు తెలిపారు. 1, 2, 3, 14, 15, 16, 17, 18, 29, 35, 36 వార్డులకు సంబంధించి పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో ఉదయం 9 గంటల నుంచి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 6వ తేదీన 8, 9, 10, 24, 25, 26, 27, 28 వార్డుల సభను సైదాబాద్లోని షాదీ ఖానలో, ఈ నెల 8వ తేదీన 11, 12, 13, 30, 31, 32, 33, 34 వార్డుల సభను జెండాగల్లీలోని వేంకటేశ్వర కల్యాణ మండపంలో, 4, 5, 6, 7, 19, 20, 21, 22, 23 వార్డు సభను పెర్కిట్లోని ఎమ్మార్ గార్డెన్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభలకు మున్సిపల్, వ్యవసాయ, విపత్తు నిర్వహణ, పో లీస్, ఎకై ్సజ్, నీటి పారుదల శాఖల అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. బోధన్లో 4 రోజులపాటు.. బోధన్టౌన్(బోధన్): బోధన్ పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో నాలు గు రోజులపాటు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించునున్నట్లు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ తెలిపారు. 4న బల్దియా పరిధిలోని 1 నుంచి 10 వారికి, 6న 11 నుంచి 20వ వార్డు వరకు, 8న 21 నుంచి 29వ వార్డు వరకు, 10న 30 నుంచి 38వ వార్డు ప్రజలు సభలలో పాల్గొనాలని కోరారు. ప్రభుత్వ బడిలోనే పిల్లలను చేర్పించాలి బోధన్: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఎడపల్లి సర్పంచ్ కందగట్ల రాంచందర్, జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం వేములపల్లి రవికుమార్ తెలిపారు. బడిబాటలో భాగంగా బుధవారం ఎడపల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ పని ప్రదేశానికి వెళ్లి కూలీలతో మాట్లాడారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించారని హెచ్ఎం తెలిపారు. ఉపసర్పంచ్ గంగాధర్, ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, సంజీవ్కుమార్, ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఉద్యమంలో ఉత్సాహంగా డాక్టర్ సాబ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సకల జనులు చేసిన ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్న డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రూరల్ మండలంలోని జలాల్పూర్కు చెందిన భూపతిరెడ్డి ఆర్థోపెడిక్ సర్జన్గా మంచి పేరు తెచ్చుకున్నారు. భూపతిరెడ్డి వైద్య వృత్తిని కొనసాగిస్తూనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉమ్మడి జిల్లాలో కీలకంగా పనిచేశారు. ప్రజా దవాఖానా పేరిట 20 ఏళ్లు ప్రాక్టీస్ చేసిన భూపతిరెడ్డి చాలామందికి ఉచితంగా వైద్యసేవలు అందించి ప్రజలు అభిమానం సంపాదించారు. ఈ క్రమంలో తన ఆస్పత్రి తరఫున పలు పోలియో క్యాంపులు నిర్వహించారు. మరోవైపు 2004 నుంచి 2009 వరకు ‘క్లియర్ సొసైటీ’ (చైల్డ్ లేబర్ ఎలిమినేషన్ అండ్ రీహాబిటేషన్) అనే సంస్థను ఉమ్మడి జిల్లాలో నిర్వహించి దీని ద్వారా 1,500 మందికి పైగా చిన్నారులను పని మాన్పించి బడికి పంపేలా చేశారు. ఈ క్లియర్ సొసైటీలో పలువురు విద్యావంతులను భాగస్వాములను చేశారు. 1988లో గాంధీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 1993లో ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంఎస్(ఆర్థో) పూర్తి చేశారు. తరువాత సంవత్సరం పాటు కోయంబత్తూర్ మెడికల్ కళాశాలలో శిక్షణ తీసుకున్నారు. నిజామాబాద్లో ప్రాక్టీసులో భాగంగా పలువురికి ఉచిత సేవలు అందించారు. 2001లో బీఆర్ఎస్ పార్టీలో వ్యవస్థాపక సభ్యుడిగా చేరి ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2009 నుంచి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరించారు. విద్యావంతులు, న్యాయవాదులు, డాక్టర్లు, మేధావులతో కలిసి జేఏసీలో అత్యంత క్రియాశీలకంగా పనిచేశారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత 2016లో బీఆర్ఎస్ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయ్యారు. తరువాత క్రమంలో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్లో చేరి 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటంలో కీలకంగా వ్యవహరించిన భూపతిరెడ్డి ప్రజా దవాఖానా పేరిట ఉచిత సేవలు మొదట ఎమ్మెల్సీగా.. ప్రస్తుతం ఎమ్మెల్యేగా చట్ట సభల్లోకి.. -
ప్రజాపాలనలో ప్రగతి పయనం
నిజామాబాద్ప్రయివేటుకు దీటుగా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2026నృత్య ప్రదర్శనను తిలకిస్తున్న ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్రెడ్డి ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, రాకేశ్రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య – 8లో uప్రతిపాదనలను సమర్పించాలి నిజామాబాద్ అర్బన్ : గోదావరి పుష్కరాలను పురస్కరించుకొ ని చేపట్టాల్సిన పనులకు ప్రతిపాదనలను వెంటనే సమర్పించా లని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గోదావరి పుష్కరాలు–2027 ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ మంగళవారం సమీక్షించారు. దేవాదాయ, నీటి పారుదల శాఖల ఆధ్వర్యంలో సవరించిన ప్రతిపాదనలను బుధవారంలోగా పంపించాలని, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ తదితర శాఖల ద్వారా కూడా రెండు రోజుల్లో సమగ్ర ప్రతిపాదన లు సమర్పించాలని అధికారులకు సూచించారు. ప్రధానంగా త్రివేణి సంగమ ప్రాంతమైన కందకుర్తి ప్రాంతానికి పుణ్యస్నానాలు ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశాలు ఉన్నందున అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కందకుర్తి పుష్కర ఘాట్ను క్షేత్రస్థాయిలో సందర్శించాలని బోధన్ ఆర్డీవో విజయలక్ష్మిని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, డీఆర్వో గీత, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయరామారావు తదితరులు పాల్గొన్నారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం సుభాష్నగర్: నగరంలోని 11కేవీ పులాంగ్ ఫీడర్ లైన్ ఏబీ స్విచ్ మరమ్మతుల కారణంగా బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని టౌన్–3 ఏడీఈ వినోద్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యాస స్కూల్, రానా టవర్, ఆకాష్ అపార్ట్మెంట్స్, శివాలయం, రైతుబజార్, ఫాతిమా మ జీద్, మదీనా మజీద్, వేణు మాల్, వంశీ హోటల్, హైదరాబాద్ రోడ్, కాకతీయ స్కూ ల్, తదితర ప్రాంతాల్లో నేడు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నామన్నారు. సుభాష్నగర్: నగరంలోని 33/11 కేవీ సబ్స్టేషన్ దుబ్బలో 11కేవీ గిరిరాజ్ కళాశాల ఫీడర్లో పనుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని టౌన్–2 ఏడీఈ ప్రసాద్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గౌతంనగర్, దుబ్బ, రాజీవ్నగర్, గిరిరాజ్ కళాశాల ఏరియా, బైపాస్ రోడ్డులో నేడు ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామన్నారు. వడదెబ్బతో మహిళ మృతి సదాశివనగర్(ఎల్లారెడ్డి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డిలో ఓ మహిళ వడదెబ్బతో మృతి చెందింది. గ్రామానికి చెందిన ఆకుల లక్ష్మి (56) రోజు మాదిరి గా మంగళవారం కూలీ పనికి వెళ్లింది. పని చేసేచోట వడదెబ్బ తగలడంతో స్పృహ కోల్పోయింది. కుటుంబీకులు కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే లక్ష్మి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.వినాయక్నగర్లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య ప్రసంగిస్తున్న ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డిసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించే లక్ష్యంతో రేవంత్రెడ్డి ప్రభుత్వం ముందుకెళుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్రెడ్డి అన్నారు. 13వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం సుదర్శన్రెడ్డి నిజామాబాద్ పరేడ్ మైదానంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ .. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యమిస్తూ సమగ్రాభివృద్ధితో ముందుకు సాగుతున్నామన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం చేపట్టిందన్నారు. సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాల అమలులో నిజామాబాద్ జిల్లా ముందంజలో నిలుస్తోందన్నారు. 2026 వానాకాలం సీజన్కు 5.58 లక్షల ఎకరాల్లో సాగుకు ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ విత్తనాలు 6,610 క్వింటాళ్లు, జనుము 126 క్వింటాళ్లు 50 శాతం రాయితీపై సొసైటీల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచమన్నారు. యూరియా 80,857 మెట్రిక్ టన్నులు, డీఏపీ 14,591, పొటాష్ 13,201, కాంప్లెక్స్ 45,122 మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేశామన్నారు. రైతులకు కొరత లేకుండా సరఫరా చేసేందుకు పూర్తి ఏర్పాట్లు చేశామన్నారు. మరణించిన 487 మంది రైతుల కుటుంబాలకు రైతు బీమా నామిని బ్యాంకు ఖాతాల్లో రూ. 24.35 కోట్లు నేరుగా జమ చేశామన్నారు. రైతు భరోసా కింద యాసంగి సీజనుకు గాను జిల్లాలో 2 లక్షల 76 వేల మంది రైతులకు ఇప్పటి వరకు రూ.219.16 కోట్లు జమ చేశామన్నారు. జిల్లాలో మొదటి విడతలో 16,843 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, ఇందులో 8,590 పురోగతిలో, మరో 8,253 ఇళ్లు నిర్మాణం పూర్తి అయ్యాయన్నారు. ఇందుకు రూ.372.14 కోట్లు ఖర్చు చేశామన్నారు. తాజాగా 2,764 ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు చేశామన్నారు. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో 9.15 కోట్ల మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. గృహ జ్యోతి పథకం కింద జిల్లాలో 2,97,635 కుటుంబాలకు ప్రతి నెలజీరో బిల్లులు జారీ చేసి రూ.260 కోట్లు సబ్సిడీ అందిస్తున్నామన్నారు. నాయీబ్రాహ్మణ, రజక వృత్తుల లోని 3,023 మంది లబ్ధిదారులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా జిల్లాలోని 28 మండల సమాఖ్యలకు రాష్ట్ర ప్రభుత్వం 28 బస్సులు మంజూరు చేసిందన్నారు. ఒక్కో బ స్సుకు రూ.36 లక్షల చొప్పున మొత్తం రూ.10.8 కోట్లు తెలంగాణ ఆర్టీసీకి బదిలీ చేసిందన్నారు. ఇందులో 18 బస్సులను ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ప్రారంభించామన్నారు. సీ్త్రనిధి పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 761 సంఘాలకు రూ.16.75 కోట్లు బ్యాంకు రుణాలు మంజూరు చేశామన్నారు. రూ.3.56 లక్షల విలువైన 6 ఎలక్ట్రిక్ ఆటోలను మహిళా సంఘాలకు ఇచ్చామన్నారు. ఏప్రిల్ 2024 నుంచి జనవరి 2025 వరకు 20,109 సంఘాలకు రూ.44.95 కోట్ల వడ్డీ రాయితీ విడుదల చేశామన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం బ్యాంక్ లింకేజి ద్వారా 96 స్వయం సహాయక సంఘాలకు రూ.11.8 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం ద్వారా అదనపు గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాల కోసం జిల్లాకు రూ.42.24 కోట్లు మంజూరు చేశామన్నారు. యంగ్ ఇండియా ఇంట్రిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పథకంలో భాగంగా ఈ సంవత్సరం జిల్లాలో నాలుగు చోట్ల (మల్కాపూర్, పొతంగల్, బెల్లాల్, అంకాపూర్) నిర్మాణ పనులను రూ.800 కోట్లతో ప్రారంభించామన్నారు. భూ భారతి ద్వారా జిల్లాలో 70,790 దరఖాస్తులు రాగా, వీటిలో 69,212 పరిష్కరించామన్నారు. మిగిలిన 1,578 దరఖాస్తులు విచారణ దశలో ఉన్నాయన్నారు.సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో జిల్లా ముందంజలో నిలుస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ ద్వారా చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలను ఆయన వివరించారు. జిల్లాలో 4,01,959 పాత ఆహార భద్రత కార్డులు ఉండగా, ఈ ప్రభుత్వంలో కొత్తగా 71,370 కార్డులు మంజూరు చేశామన్నారు. మహా లక్ష్మి పథకం ద్వారా రూ.500లకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను ఇస్తున్నాం. జిల్లాలో 2,47,603 మంది లబ్ధిదారులకు, 14,87,826 సిలిండర్లకు సబ్సిడీ విడుదల చేసి రూ.46.86 కోట్లు చెల్లించామన్నారు. యాసంగిలో 7,03,550 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 98,157 మంది రైతుల నుంచి కొనుగోలు చేశామన్నారు. రూ.1,605 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. ధాన్యం సేకరణలో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. అన్నివర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యత మరింత సమగ్రాభివృద్ధి కోసం ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ ద్వారా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్రెడ్డి -
మంజీర నదిలో ‘మహా’ కాంట్రాక్టర్ల ఇసుక దోపిడీ
● సర్వే నిర్వహించిన రెవెన్యూ, మైనింగ్, ల్యాండ్ సర్వే అధికారులుబోధన్: మన సరిహద్దుల్లోని మంజీర నదిలోకి చొ చ్చుకొచ్చి మహారాష్ట్ర కాంట్రార్లు ఇసుక తవ్వకాలు జరపడంతో అధికారులు తాజాగా సర్వే నిర్వహించారు. సాలూర మండల తహసీల్దార్ అజ్మీత్ నవా జ్, ల్యాండ్ సర్వే శాఖ డివిజన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ దత్తాత్రిలతో పాటు రెవెన్యూ, మైనింగ్, ల్యాండ్ సర్వే శాఖల అఽధికారులు సర్వేలో పాల్గొ న్నారు. మ హారాష్ట్రలోని గంజ్గాం, బోలేగాం గ్రామాల శివారు లో ఆ ప్రాంత ఇసుక కాంట్రాక్టర్లు మంజీర నదిలో రెండు నెలలుగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఈ రెండు ఇసుక క్వారీలు సాలూర మండలంలోని హున్సా– మందర్నా, తగ్గేల్లి గ్రామాల అవతలి వైపు ఉన్నాయి. రెండు చోట్ల మహారాష్ట్ర కాంట్రాక్టర్లు మన హద్దుల్లోని మంజీర నదిలోకి చొచ్చుకు వచ్చి భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టి తరలిస్తున్నారని ఆ గ్రామాల ప్రజలు అధికారులకు సమా చారం అందించారు. మే మొదటి వారంలో తగ్గేల్లి శివారులో మన అధికారులు హద్దులు గుర్తించి ఎర్ర జెండాలు పాతి వచ్చారు. తాజాగా హున్సా– మందర్నా శివారులో ఇసుక తవ్వకాలు చేపట్టడంతో అధికారులు మంగళవారం సర్వే నిర్వహించారు. హద్దులు దాటి తవ్వకాలు చేసినట్లు గుర్తించారు. పటిష్ట చర్యలు తీసుకుంటాం.. సాలూర మండలంలోని హున్సా– మందర్నా గ్రామ శివారులోని మంజీర నదిలో సర్వే నిర్వహించాం. మన హద్దుల్లోకి వచ్చి మహారాష్ట్ర కాంట్రాక్టర్లు ఇసుక తవ్వకాలు చేపట్టినట్టు సర్వేలో ప్రాథమికంగా అంచనా వేశాం. జాయింట్ సర్వేకు మహారాష్ట్ర అధికారులకు పలుమార్లు విన్నవించినా సహకరిండంలేదు. ల్యాండ్ సర్వేయర్ల రిపోర్టు వచ్చిన తర్వా త మన హద్దులో ఇసుక తవ్వకాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటాం. – అజ్మీత్ నవాజ్, తహసీల్దార్, సాలూర మండలం -
తెలంగాణ అస్తిత్వంపై మూకుమ్మడి కుట్రలు
● ఎదుర్కొనేందుకు మరో ఉద్యమం తప్పదు ● మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ అస్తిత్వా న్ని, ఉనికిని కనుమరుగు చేసేందుకు కొన్ని శక్తులు ఐక్యంగా కుట్రలు పన్నుతున్నాయని, వీటిని ఎదు ర్కొనేందుకు మరోసారి పోరాటానికి సన్నద్ధం కా వాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాల్కొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన జెండా ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బక్కని నరసింహులు ఆంధ్రాకు వెళ్లి మహానాడు సభలో ‘డిక్షనరీలోనే తెలంగాణ అనే పదమే లేదు‘ అని మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులైన బీజేపీ నాయకులు కిషన్రెడ్డి, బండి సంజయ్లు కూడా ఎందుకు నిలదీయడంలేదన్నారు. ఏపీ ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ ‘మా కోనసీమలో కొబ్బరికాయలు ఎండిపోతుంటే తెలంగాణోళ్ల దిష్టి తగిలింది‘ అని వెటకారం చేయడమేమిటన్నారు. కేసీఆర్ అధికారంలో లేకపోవడంతో వీళ్లందరూ మొరుగుతున్నారన్నారు. కేసీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి ఎ లాంటి హింస కు తావులేకుండా ప్రజాస్వామ్య ప్ర క్రియ ద్వారానే తెలంగాణను సాధించిపెట్టారన్నా రు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు సోనియాగాంధీని ‘వేయి మంది బిడ్డలను బలిగొన్న బలిదేవత’ అన్న ఇదే రేవంత్ రెడ్డి, ఇవాళ సోనియా గాంధీ తెలంగా ణ ఇచ్చిందని మాయమాటలు చె బుతున్నార న్నారు. ఇందులో ఏది నిజమో రేవంత్ రెడ్డి స మా ధానం చెప్పాలన్నారు.నరేంద్ర మోదీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఒక్కటై తెలంగాణ ఉనికే లేకుండా చేయాలని చూస్తున్నారన్నారు. తెలంగాణ ఉనికి ప్రశ్నార్థకమవుతున్న వేళ మరో ఉద్యమానికి సిద్ధం కావాలన్నారు. -
గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయండి
● అధికారులతో కలెక్టర్ ఇలా త్రిపాఠి ● జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిజామాబాద్అర్బన్: ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 4, 6, 8, 10 తేదీలలో జిల్లా వ్యా ప్తంగా నిర్వహించే గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకష్ణారావు గ్రామ, వార్డు సభల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. పోలీ స్ కమిషనర్ సాయి చైతన్య తో కలిసి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి కలెక్టర్ ఇలా త్రిపాఠి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు వీసీలో పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియకు సహకరించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రస్తుతం నిర్వహిస్తున్న పర్యావరణ వారోత్సవాలను షెడ్యూల్ ప్రకారం విజయవంతం చేయాలన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై కీలక సూచనలు చేశారు. గ్రామ, వార్డు సభలలో ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా కృషి చేయాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఎంఏవోలను నోడల్ అధికారులుగా నియమించి గ్రామ సభలను నిర్వహించాలన్నారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపల్ పట్టణాలలో వార్డుల వారీగా సభలను ఏర్పా టు చేసి ప్రభుత్వం నిర్దేశించిన అంశాలపై చర్చించాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు. -
అట్టహాసంగా అవతరణ వేడుకలు
నిజామాబాద్ అర్బన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు మంగళవారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని పోలీస్ పరేడ్గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. గృహ నిర్మాణం, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, పౌర సరఫరాలు, వైద్యారోగ్య శాఖల శకటాలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. వ్యవసాయ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు. సిద్ధార్థ కళాక్షేత్రం, బాల భవన్ చిన్నారులు బతుకమ్మ గేయం, పచ్చదనం ప్రాముఖ్యతపై నృత్యప్రదర్శన ఇచ్చారు. అంతకుముందు వినాయకనగర్లోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్ తదితరులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వేడుకల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, డీఎఫ్వో సిద్ధార్థ్, అదనపు డీసీపీ శుభం నగ్రాలే, డీఆర్వో గీత తదితరులు పాల్గొన్నారు. -
సైక్లింగ్తో గ్రీన్ ఫ్యూచర్..
ప్రతిరోజూ సైక్లింగ్ చేయడంతో ఆరోగ్యానికి మంచి దే కాకుండా పర్యావర ణా నికి మేలు చేసినట్లే. రోజు వారీ పనుల్లో సైకిల్ ను ఉపయోగిస్తే తక్కువ ధర తో రవాణా ఏర్పాటు చేసుకున్నట్లే కాకుండా పర్యావరణానికి హితం చేసినవారమవుతాం. – మంచాల జ్ఞానేందర్, సామాజిక సేవకుడు అన్నిరకాలుగా ఉపయోగకరంసైక్లింగ్ చేయడంతో అన్ని రకాలుగా ఉపయోగం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్యూయల్ వాడ కం తగ్గించినట్లే. శరీరాని కి అవసరమైన చెమట ప డుతుంది. శరీరంలో ని అన్ని రకాల కండరా లు ఉత్తేజితమవుతాయి. – డా.తిరుపతిరావు, ఎండీ, జనరల్ ఫిజీషియన్ -
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
సాక్షి నెట్వర్క్: ఆర్మూర్, బాల్కొండ, బోధన్ నియోజకవర్గాల్లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతర ణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా నియోజకవర్గాల్లోని అన్ని మండలా లు, గ్రామాల్లోని ప్రభుత్వ కార్యలయాల్లో అధికారు లు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవే సి, వందనం చేశారు. అలాగే జాతీయ గేయాలపన నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరు ల త్యాగాలను స్మరించుకున్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జాతీ య జెండాను ఆవిష్కరించారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ గోనె లహరి,, తహసీల్దార్, ఏసీపీ, పోలీస్స్టేషన్, సబ్రిజిస్టర్, ఆర్టీఏ, ఎకై ్సజ్ కార్యాలయల్లో, ఆర్మూర్ కోర్డుతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయల్లో సంబంధింత అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణి చేశారు. బోధన్ కోర్టులో అదనపు జిల్లా న్యాయమూర్తి వరుదిని జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేసి గీతాన్ని ఆలపించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో విజయ కుమారి, బల్దియా కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మాశరత్ రెడ్డి జాతీయ జెండాను ఎగుర వేసి గీతాన్ని ఆలపించారు. జీపీ కార్మికులకు కిట్స్ పంపిణీ తెలంగాణ అవిర్భావ దినోత్సవం వేడుకల సందర్భంగా పలు గ్రామాల్లోని జీపీ కార్మికులకు రక్షణ కిట్లు (గ్లౌస్, హెల్మెట్లు, బూట్లు) అందజేశారు. అలాగే పలు జీపీల్లో కార్మికులను సన్మానించి, వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల జీపీ సిబ్బంది, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలి
పెర్కిట్(ఆర్మూర్)/బోధన్/నవీపేట: విత్తన డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని ఆలూర్ తహసీల్దార్ రమేష్ సూచించారు. ఆలూర్ మండల కేంద్రంలోని విత్తన విక్రయ దుకాణాలను ఆయన ఏవో రాంబాబుతో కలిసి మంగళవారం తనిఖీ చేశారు. తహసీల్దార్ మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలను విక్రయించిన వారిపై క ఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. ఏవో రాంబాబు మాట్లాడుతూ.. రైతులు లైసెన్సు కలిగిన వారి నుంచి మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు. అలాగే రషీదులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. సాలూర మండల కేంద్రంలోని పలు విత్తన విక్రయ కేంద్రాలను తహసీల్దార్ అజ్మీత్ నవాజ్, ఏవో శ్వేత తనిఖీ చేశారు. నవీపేట మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను తహసీల్దార్ వెంకటరమణ, ఏవో నవీన్కుమార్ తనిఖీ చేశారు. నాణ్యమైన కంపెనీల నుంచి కొనుగోలు చేసిన విత్తనాలను రైతులకు విక్రయించాలని ఫర్టిలైజర్ దుకాణాల యజమానులకు సూచించారు. కార్యక్రమంలో ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అటు ఆరోగ్యం.. ఇటు పర్యావరణం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వ్యక్తిగత ఆరోగ్యం.. పర్యావరణ హితం కోసం సైక్లింగ్ చేయాలని ఆరోగ్య నిపుణులు, వైద్యులే కాకుండా ప్రభుత్వాలు సైతం చెబుతున్నాయి. పలు యూరప్ దేశాల్లో సైకిల్పై విధులకు వెళ్లేవారు గణనీయంగా పెరిగారు. హైదరాబాద్లోనూ మాదాపూర్, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో సైకిల్ ట్రాక్ ప్రత్యేకంగా నిర్మించారు. ఈ క్రమంలో నిజామాబాద్లోనూ కొందరు ఆరోగ్యాభిలాషులు ప్రతిరోజూ సైక్లింగ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నగరానికి చెందిన 20 మంది నాలుగు బృందాలుగా ఏర్పడి తమ సైకిళ్లతో ప్రతిరోజూ 30 కిలోమీటర్ల మేర సైక్లింగ్ చేస్తున్నారు. నిజామాబాద్–మంచిప్ప, నిజామాబాద్–మామిడిపల్లి తదితర రూట్లలో ఈ సైక్లింగ్ చేస్తున్నారు. డాక్టర్ వెంకటరమణ, మంచాల జ్ఞానేందర్, డాక్టర్ ప్రతాప్, తిరుమల నాయుడు, వీరేష్, శ్రీహరి, ప్రసాద్, వినోద్, అశోక్, సురేందర్ సైక్లింగ్ బృందం ప్రతిరోజూ మంచిప్ప వరకు వెళ్లడం, రావడం కలిపి 30 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తున్నారు. ఈ బృందం మరో 10 మందితో కలిసి గతంలో సైకిళ్లపై 440 కిలోమీటర్ల దూరంలోని భద్రాచలం వరకు వెళ్లి సీతారాముల దర్శనం చేసుకుని వచ్చారు. ప్రతిరోజూ 30 కిలోమీటర్ల మేర సైక్లింగ్ చేస్తున్న ఇందూరువాసులు గతంలో భద్రాచలం వరకు 440 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేసిన 15 మంది నేడు అంతర్జాతీయ సైక్లింగ్ దినోత్సవం -
ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
● రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు భూమిపూజనిజామాబాద్ రూరల్ : విద్యపై వెచ్చించేది ఖర్చుకాదని, భవిష్యత్తు తరాలకు పెట్టుబడిగా నిజామాబా ద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పేర్కొన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేటుకు దీటుగా ప్రభు త్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. మండలంలోని మల్కాపూర్(ఎ) గ్రామ శివారులో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రె సిడెన్షియల్ స్కూల్కు మంగళవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యాభివృద్ధితో పాటు అన్నివర్గాల అభ్యున్నతికి ప్ర భుత్వం కృషి చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట మీద నిలబడే పార్టీ అని అన్నారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యను అందించే దిశగా ఇంటిగ్రేటె డ్ రెసిడెన్షియల్ పాఠశాలను ప్రతి నియోజకవర్గంలో నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మె ల్యే భూపతి రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ సాయరెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు మునిపల్లి సాయిరెడ్డి, రూరల్ నియోజకవర్గ అధ్యక్షుడు వాసు, స్థానిక సర్పంచ్ నీరజ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
వర్ని: నిరుపేద బడుగు బలహీనవర్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పో చారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండలంలోని మ ల్లారం గ్రామంలో మంగళవారం ఇందిరమ్మ పథకంలో నిర్మించిన ఇంటిని ఎమ్మెల్యే ప్రారంభించా రు. సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందించే వి ధంగా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు చర్య తీసుకోవాలన్నారు. బోధన్ ఆర్డీవో విజయలక్ష్మి, డి ఆర్డిఎ పిడి సాయన్న, వర్ని మార్కెట్ కమిటీ అధ్యక్షులు సురేష్ బాబా, మల్లారం సర్పంచ్ మాడ అంజవ్వ లక్ష్మణ్ పాల్గొన్నారు. -
పేదల సొంతింటి కల సాకారం
నవీపేట: కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. మండలంలోని జన్నేపల్లి, సిరన్పల్లి గ్రామాలలో మంగళవారం సాయంత్రం ఇందిరమ్మ ఇళ్లను ఆయన పరిశీలించారు. నూతన గృహప్రవేశాలు చేసిన దంపతులకు నూతన వస్త్రాలను అందించారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న జన్నేపల్లి, సిరంపల్లి, లింగాపూర్, గాంధీనగర్ గ్రామాల అనుసంధాన రహదారి విస్తరణకు రూ. 15కోట్లు మంజూరు అయ్యాయన్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, జన్నేపల్లి, సిరన్ పల్లి గ్రామాల సర్పంచులు గంగాధర్, తొగరి సౌమ్య, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు -
ఇందూరు స్ఫూర్తి
తెలంగాణ ఉద్యమానికినేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో ఇందూరు జిల్లా ఉద్యమానికి తీసుకొచ్చిన ఊపు చరిత్రను లిఖించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2001 జూన్ 5న వేల్పూర్ మండలంలోని మోతె గ్రామాన్ని సందర్శించి, ఈ గ్రామస్తుల పోరాట స్ఫూర్తి తనకు, బీఆర్ఎస్కు ఎంతో బలాన్ని ఇచ్చిందని ఇక్కడి మట్టిని ముడుపు కట్టి తీసుకెళ్లారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత 2014 మార్చిలో గ్రామానికి వచ్చిన కేసీఆర్ ముడుపు విప్పారు. ● 2016 అక్టోబర్ 9న దసరా రోజున పరిపాలన వికేంద్రీకరణ చేశారు. నిజామాబాద్ నుంచి ప్రత్యేకంగా కామారెడ్డి జిల్లా ఏర్పాటైంది. జిల్లాలో 14 కొత్త మండలాలు ఏర్పాటు కాగా, మొత్తం మండలాల సంఖ్య 33కు చేరుకుంది. తండాలను గ్రామపంచాయతీలుగా చేశారు. జిల్లాలో పంచాయతీల సంఖ్య 545కు చేరుకుంది. అన్ని పంచాయతీల పరిధిలో పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు, క్రీడా ప్రాంగణాలు నిర్మాణమయ్యాయి. వ్యవసాయంలో అగ్రభాగంలో ఉన్న ఇందూరు జిల్లాకు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు మాత్రం ఇప్పటివరకు రాలేదు. లక్కంపల్లిలో ప్రత్యేక ఆర్థిక మండలి ఉన్నప్పటికీ యూనిట్ల స్థాపనలో అడుగులు ముందుకు పడలేదు. వేల్పూర్ క్రాస్రోడ్డు వద్ద స్పైసెస్ పార్క్ కోసం 70 ఎకరాలు భూసేకరణ చేసినప్పటికీ అతీగతీ లేదు. అయితే ధాన్యం సేకరణలో జిల్లా వరుసగా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుస్తూ వస్తోంది. ● జిల్లాలో 2014లో పంటల సాగు విస్తీర్ణం 4,14,197 ఎకరాలు ఉండగా, 2026 నాటికి 5,30,000 ఎకరాలకు చేరింది. వరి గణనీయంగా 2లక్షల ఎకరాల మేర పెరిగింది. మరోవైపు ఒకప్పుడు 50 వేల ఎకరాల్లో సాగయ్యే పసుపు పంట ప్రస్తుత ఏడాదికి 20 వేల ఎకరాలకు తగ్గింది. కేంద్ర ప్రభుత్వం జిల్లాలోనే పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం.. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకానికి అప్పటి సీఎం కేసీఆర్ 2017 ఆగస్టు 10న శంకుస్థాపన చేశారు. రూ.1,069 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభించారు. 2023లో పునరుజ్జీవన పథకాన్ని ప్రారంభించి 2.5 టీఎంసీల నీటిని కాలేశ్వరం నుంచి ఎస్సారెస్పీకి తరలించారు. ఈ పథకంతో ఎస్సారెస్పీకి ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరలేదు. విద్యుత్ బిల్లులు అధికమయ్యాయని విమర్శలు వచ్చాయి. వరద కాలువ ద్వారా నీటి సరఫరా రివర్స్ పంపింగ్తో కాలువకు ఇరువైపులా భూముల్లో భూగర్భ జలాలు మాత్రం పెరిగాయి. ● కాళేశ్వరం 21వ ప్యాకేజీ కింద ఆయకట్టు స్థిరీకరణ కోసం మోపాల్ మండలం మంచిప్ప వద్ద 3.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో జలాశయం నిర్మాణం కోసం పనులు ప్రారంభించారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 1.5 టీఎంసీల సామర్థ్యంతో మాత్రమే జలాశయాన్ని పరిమితం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ పనులు నిలిచిపోయాయి. ● జిల్లాలోని 19 మైనారిటీ గురుకులాలు, 11 ఎస్సీ, 13 బీసీ, 5 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, 175 ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో ఐటీ టవర్ నిర్మాణం పూర్తి చేశారు. ● బోధన్లోని నిజాం షుగ ర్స్ ఫ్యాక్టరీని 2024 సెప్టెంబర్ 17లోగా తెరిపిస్తామని రేవంత్రెడ్డి ప్రకటించినప్పటికీ అది హామీగానే మిగిలిపోయింది. ● తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రారంభమైన నిజామాబాద్ బైపాస్ రోడ్డు నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. నగరంలో సుమారు రూ.వెయ్యి కోట్లతో పనులు చేశారు. రూ.240 కోట్ల విలువైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు 2005 నుంచి నడుస్తూనే ఉన్నాయి. జక్రాన్పల్లి మండలంలో విమానాశ్రయ ఏర్పాటు కలగానే మిగిలిపోయింది. ● ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ వర్సిటీకి ఇంజినీరింగ్ కళాశాల, జిల్లాలో వ్యవసాయ కళాశాల మంజూరు చేసింది. ● 30 ఏళ్ల డిమాండ్ అయిన ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయింది. నందిపేట్ మండలం నుంచి నిర్మల్ జిల్లాను కలుపుతూ పంచగుడి వద్ద గోదావరిపై బ్రిడ్జి నిర్మించారు. ● బోధన్లో అంబేడ్కర్ చౌరస్తా నుంచి మూడు వైపులా ప్రధాన రోడ్డు మార్గంలో సెంట్రల్ లైటింగ్ పూర్తి చేశారు. బోధన్లో 2021లో రూ.2.35 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అధునాతన నూతన భవనం, 2017లో రూ.3కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాల అధునాతన భవనం నిర్మాణం చేశారు. ● ఎడపల్లి మండలం జానకంపేట నుంచి నవీపేట మండలంలోని యంచ వరకు 14.5 కిలోమీటర్ల పొడవున ఉన్న బాసర పుణ్యక్షేత్ర వెళ్లే రోడ్డును రూ.52 కోట్లతో నాలుగు వరుసలుగా విస్తరణ చేశారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ నాన్ కమాండ్ ఏరియా పరిధిలోని మెట్ట భూములకు సాగునీరు అందించేందుకు మోస్రా మండలంలోని చింతకుంట, వర్ని మండలంలోని జాకోరా ఎత్తిపోతల పథకాలు మంజూరు అయ్యాయి. వీటి పనులు పూర్తి కాలేదు. ఇవి పూర్తి అయితే 4,500 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కలుగుతుంది. వర్ని మండలంలో రూ.102 కోట్లతో ప్రారంభమైన సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు బిల్లులు రాకపోవడంతో ముందుకు సాగడం లేదు. ఈ రిజర్వాయర్ పనులు పూర్తయితే 10 వేల ఎకరాలకు సాగు నీటి సౌకర్యం కలుగుతుంది. బోధన్ మండలంలోని బెల్లాల్ శివారులో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణాలు సాగుతున్నాయి. బోధన్ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రి 2018లో జిల్లా ఆస్పత్రిగా అప్గ్రేడ్ అయింది. స్థలం సమస్య వల్ల కొత్త భవన నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన ఇందూరు జిల్లా తనకే ప్రత్యేకమైన పేజీలను లిఖించుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ మోతె గ్రామస్తులు తీర్మానం చేసి ఉద్యమంలో ముందు వరుసలో నిలిచారు. దీంతో ఉద్యమ నేత కేసీఆర్ ఇక్కడి మట్టిని ముడుపు కట్టి తీసుకెళ్లారు. చివరికి ప్రజాపోరాటం ఫలించి 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్టం ఏర్పాటు కాగా మంగళవారం నాటికి పన్నెండేళ్లు పూర్తవుతున్నాయి. ఈ ప్రస్థానంలో జిల్లాలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్తగా కామారెడ్డి జిల్లా ఏర్పాటైంది. 2023లో పునరుజ్జీవన పథకాన్ని ప్రారంభించి 2.5 టీఎంసీల నీటిని కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీకి తరలించారు. జిల్లాలో మండలాల సంఖ్య 33కు, గ్రామ పంచాయతీల సంఖ్య 545కు చేరుకుంది. సీఎం హోదాలో మోతెకు కేసీఆర్కథనం–1 మోతె మట్టితో ముడుపు కట్టిన కేసీఆర్ పన్నెండేళ్ల ప్రస్థానంలో అనేక మార్పులు జిల్లాలో 33కు చేరిన మండలాలు, 545కు చేరిన గ్రామ పంచాయతీలు జిల్లాకు వ్యవసాయ, తెయూకు ఇంజినీరింగ్ కళాశాల మంజూరు జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం సీఎం హామీకే పరిమితమైన నిజాం షుగర్స్ పున:ప్రారంభం కలగానే జక్రాన్పల్లి విమానాశ్రయం మోర్తాడ్(బాల్కొండ): తెలంగాణ ఉద్యమ సమయంలో మోతె మోగించిన దరువు ప్రతి ఊరును కదిలించింది. మోతె బాటలో నడిచిన పల్లెల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోయింది. మోతె చూపిన ఉద్యమ స్ఫూర్తికి ముగ్ధుడైన ఉద్యమ నేత కేసీఆర్ ఇక్కడి మట్టిని మట్టిని ముడుపు కట్టి తీసుకెళ్లి, రాష్ట్ర సాధన అనంతరం ముడుపు విప్పారు. అనంతరం సీఎం హోదాలో మోతెకు వచ్చిన కేసీఆర్ గ్రామానికి కొత్త గ్రామ పంచాయతీ భవనం, నూతన పాఠశాల భవనం, సీసీ రోడ్లు, రైతులకు సిమెంట్ కల్లాలు, వంద శాతం డ్రిప్ ఇరిగేషన్, ఇలా ఎన్నో రకాలైన పథకాలను అందించారు. -
అలుపెరుగని ఉద్యమ దీక్షలు
బోధన్: తెలంగాణ ఉద్యమంలో భాగంగా బోధ న్లో 1,519 రోజుల పాటు రిలే నిరహార దీక్షలు కొనసాగాయి. ఈ ఉద్యమ దీక్షలతో రాష్ట్ర స్థాయి లో బోధన్కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. 2009 డిసెంబర్ 9న అప్పట్లో అధికారంలో ఉన్న యు పీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ప్రకటించి యూటర్న్ తీసుకున్న క్రమంలో ఉద్యమం మరింత వేడెక్కింది. బోధన్ ప్రాంత ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి, మహిళా, కార్మిక , విశ్రాంత ఉద్యోగులు, రాజకీయ పార్టీలు కలిసి తెలంగాణ రాజకీయ జేఏసీని ఏర్పాటు చేశారు. 2009 డిసెంబర్ 28న పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఐదుగురు ఉద్యమ కారులతో రిలే నిరహార దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. 2014 ఫిబ్రవరి 23 వరకు అలుపెరుగకుండా రిలే నిరహార దీక్షలు కొనసాగించారు. ఉద్యమ సారథి కేసీఆర్తో పాటు టీజేఏసీ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ప్రజాగాయకుడు గద్దర్ తదితరులు దీక్షలను సందర్శించారు. బోధన్లోని అంబేడ్కర్ చౌరస్తాలో పట్టణ కుల సంఘాల జేఏసీ అధ్వర్యంలో తెలంగాణ అ మరవీరుల స్తూపం నిర్మించారు. విశ్రాంత ఉపాధ్యాయుడు అక్కపల్లి కొండయ్య కుటుంబీకులు స్తూప నిర్మాణానికి రూ.4 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. 2013 ఏప్రిల్ 29న ప్రజాగాయకుడు గద్దర్ స్తూపాన్ని ఆవిష్కరించారు. -
పశువుల దొంగల ముఠా అరెస్ట్
రుద్రూర్ : కోటగిరి మండల కేంద్రంలో బుధవారం పశువుల దొంగల ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన ట్టు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. నిందితుల నుంచి రెండు బొలెరో వాహనాలు, ఒక బైక్, ఐదు సెల్ఫోన్లు, రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. కోటగిరి పోలీస్స్టేషన్లో సోమవా రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండల కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండ గా ముఠాకు చెందిన ఐదుగురు పట్టుబడ్డారు. నిందితులను మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బిలోలికి చెందిన ఫరీద్ నవాబ్ సాబ్ ఖురేషీ, అస్లాం ఖురేషీ, ఇలియాస్ నవాబ్ ఖురేషీ, ఆర్మూర్కు చెందిన షేక్ రఫీక్, ఇందల్వాయి మండలం తిర్మన్పల్లికి చెందిన మహ్మద్ రెహమత్గా గుర్తించారు. వీరిపై కోటగిరి, వర్ని, బోధన్, నిజామాబాద్ టౌన్ ప్రాంతాలతోపా టు జగిత్యాల జిల్లా వెల్గటూర్ పోలీస్ స్టేషన్ల పరిధి లో మొత్తం 11 కేసులు ఉన్నట్లు విచారణలో తేలింది. దొంగిలించిన గేదెలు, పశువులను బోధన్న్కు చెందిన ఖురేషి అబ్దుల్లాకు విక్రయించినట్లు ఏసీపీ వివరించారు. ప్రధాన నిందితులైన సోహెల్ పటేల్ (నాందేడ్), సయ్యద్ సైఫ్ (బిలోలి), జియా ఖురేషీ (బిలోలి), అబుసద్, అబ్దుల్ అజీజ్ (బోధన్) పరారీలో ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్సై సునీల్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
ఎస్ఆర్ విద్యార్థుల ప్రతిభ
నిజామాబాద్ ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో జాతీయస్థాయి అత్యుత్తమ ర్యాంకులతో విజయభేరి మోగించారు. వై. శ్రీ వర్ధన్ 203, ఎన్.సురేశ్ 1060, డి. శ్రీకాంత్ 3216, జె. యశ్వంత్ 3,424, ఎం. నివాస్ రెడ్డి 5,191, ఎస్. కృపాకర్ 5454, జె.అఖిలేష్ 5617, ఎస్. విశ్వంత్ 5931, ఏ.చరణ్ తేజ 9397 ర్యాంక్ సాధించగా 10 వేల లోపు 9 మంది విద్యార్థులు ర్యాంకు లు సాధించారు. డీజీసీ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, వారాంతపు పరీక్షలు, ప్రత్యేక శ్రద్ధ వహించడంతో అత్యుత్త మ ఫలితాలు సాధించారన్నారని అన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఎస్ఆర్ చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, సీఈవో సురేందర్ రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో నిజామాబాద్ జోనల్ ఇంచార్జి శ్రీకాంత్, అకడమిక్ డీన్ రాంరెడ్డి, ప్రిన్సిపాళ్లు హన్మంత్ రావు, శ్రీధర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, నర్సింహారెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. -
చోరీ కేసులో ముగ్గురి అరెస్టు
నిజామాబాద్ అర్బన్ : ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మినగర్ కాలనీలో మే 24న జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సాయిచైతన్య వివరాలు వెల్లడించారు. మహాలక్ష్మినగర్ కాలనీకి చెందిన శరత్ కుటుంబసభ్యులతో కలిసి వేములవాడకు వెళ్లారు. దుండగులు పథకం ప్రకారం ఇంట్లోకి చొరబడి రూ.19 లక్షల నగదు, 10 గ్రాముల చైన్, వెండిపెట్లు, 580 గ్రాముల బంగారం ముద్దలను అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం బ్రాహ్మణపల్లి రోడ్డు వద్ద ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పట్టుకొని విచారించగా చోరీకి పాల్పడింది తామేనని ఒప్పుకున్నారు. నిందితులు విజయ్ అగర్వాల్, సల్మాన్ఖాన్, మంజల్ సాయికుమార్ను అరెస్టు చేయగా, శ్రీహరి పరారీలో ఉన్నాడు. వారి నుంచి రూ.31 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. కాగా, విజయ్ అగర్వాల్ సొంత బాబాయి ఇంట్లోనే చోరీ చేసేందుకు మరో ముగ్గురితో కలిసి పథకం వేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ● రూ.31 లక్షలు స్వాధీనం ● బాబాయ్ ఇంట్లోనే దొంగతనం చేసిన ఘనుడు -
పర్యావరణ బాధ్యత ప్రజలందరిదీ
● డీఎఫ్వో సిద్ధార్థ్ విక్రమ్సింగ్డొంకేశ్వర్(ఆర్మూర్): పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వ శాఖలదే కాదని, ప్రజలందరిదని జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం సారంగపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్లో స్థానిక యువకులు, ఎన్జీవోలకు, ప్రజలకు అడవుల సంరక్షణపై అవగాహన కల్పించారు. అడవులు, నదులు, వన్యప్రాణులు, చెట్లు కేవలం సహజ వనరులు మాత్రమే కాదని, అవి మన పూర్వీకుల నుంచి వారసత్వంగా పొందిన అమూల్యమైన ఆస్తులని పేర్కొన్నారు. వీటిని మరందరం కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. వాతావరణ మార్పుల తీవ్రతకు చాలా కారాణాలున్నాయని అందులో అడవులు క్షీణించడం, ప్లాస్టిక్ వినియోగం అంశాలు ప్రధానమన్నారు. జిల్లాలో అటవీకరణ, పర్యాటక అభివృద్ధిపై అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలని పిలుపునిచ్చారు. ఎఫ్ఆర్వో సంజయ్గౌడ్, అటవీ సిబ్బంది పాల్గొన్నారు. -
డిప్యుటేషన్ల రద్దు కొందరికే..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా, మండల ప్రజాపరిషత్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తయినప్పటికీ కొన్ని గంటలు కూడా గడవకముందే కొందరు ఉద్యోగులు డిప్యుటేషన్ల కోసం ప్రయత్నాలు చేస్తుండడంతో గత నెల 27న ‘సాక్షి’లో ‘బదిలీల కౌన్సెలింగ్తో మాకేంటి?’ శీర్షికతో కథనం ప్రచురితం అయింది. దీంతో ఉద్యోగుల డిప్యుటేషన్ల ప్రక్రియ కు బ్రేక్ పడింది. ఈ క్రమంలో ఇప్పటికే డిప్యుటేషన్ల మీద ఉన్నవాళ్లు ఆయా స్థానాల్లోనే కొనసాగేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ‘సాక్షి’ కథనం నేపథ్యంలో కొందరు ఉద్యోగుల డిప్యుటేషన్లను రద్దు చేస్తూ జెడ్పీ సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సగం మంది డిప్యుటేషన్లు మాత్రమే రద్దు అయ్యాయని, మిగిలిన సగం మంది డిప్యుటేషన్లు సైతం రద్దు చేయాల్సి ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. ఇంకా రద్దు కాని డిప్యుటేషన్లపై పలువురు ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. బోధన్ నియోజకవర్గంలోని ఒక మండలానికి చెందిన ఉద్యోగి జెడ్పీ లో, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఒక మండలానికి చెందిన ఉద్యోగి బాన్సువాడ నియోజకవర్గంలోని ఒక మండలంలో, బాన్సువాడ నియోజకవర్గంలోని ఒక మండలానికి చెందిన ఉద్యోగి ఆర్మూర్ నియోజకవర్గంలోని ఒక మండలంలో, ఆర్మూర్ నియోజకవర్గంలో ఒక మండల ఉద్యోగి మరో మండలంలో, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఒక మండలం ఉద్యోగి బోధన్ నియోజకవర్గంలోని మరొక మండలంలో, బాన్సువాడ నియోజకవర్గంలోని ఒక మండలానికి చెందిన ఉ ద్యోగి బోధన్ నియోజకవర్గంలోని ఒక మండలంలో ఇంకా డిప్యుటేషన్లపై కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా బదిలీలు అయినప్పటికీ యథాస్థానాల్లో కొనసాగేందుకు గాను కొందరు జిల్లా, మండల ప్రజాపరిషత్ ఉద్యోగులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. జిల్లా ప్రజాపరిషత్లో ఏళ్లతరబడి కొనసాగుతున్న ఒక సెక్షన్ అధికారి ఈ స్థానం నుంచి కదిలేందుకు ఇష్టపడడం లేదని పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. సదరు ఉద్యోగి కనుసన్నుల్లోనే మిగిలిన ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లు నడుస్తున్నాయని, ఆ సెక్షన్ అధికారిని అడగకుండా మిగిలిన సెక్షన్ల ఉద్యోగులు పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. ఆ అధికారి సెలవులో ఉన్న సమయంలో ఎవరైనా ఉద్యోగి పని నిమిత్తం జెడ్పీ కార్యాలయానికి వస్తే తర్వాత రమ్మని చెప్పే పరిస్థితి. ఈ క్రమంలో బదిలీ అయినప్పటికీ సదరు కొందరు అధికారులను మచ్చిక చేసుకుని జిల్లా ప్ర జాపరిషత్ ఎన్నికల పేరిట మళ్లీ యథాస్థానంలోనే డిప్యుటేషన్ మీద కొనసాగేందుకు అధికారి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఉద్యోగ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ సెక్షన్ అధికారి ఆర్మూర్ నియోజకవ ర్గంలోని ఒక మండలానికి బదిలీ కాగా అక్కడ పనిచేస్తున్న ఉద్యోగి జెడ్పీకి బదిలీ అయ్యాడు. ఈ ఇద్ద రూ తిరిగి యథాస్థానాల్లోనే ఉండేలా ప్లాన్లు చేసుకుంటున్నట్లు ఉద్యోగ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరో జూనియర్ అసిస్టెంట్కు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఒక మండలానికి బదిలీ అయింది. ఈ ఉద్యోగి మళ్లీ జెడ్పీలోకి వచ్చేందుకు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడని పలువురు చెబుతున్నారు. ఇక్కడి నుంచి ఫారిన్ విభాగానికి వెళతానని తోటి ఉద్యోగుల ముందు చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే వీళ్లకంటే గత జెడ్పీ ఎన్నికల్లో పనిచేసిన అనుభవం ఉన్న సీనియర్లకు అవకాశం ఇస్తే బాగుంటుందని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. జెడ్పీ ప్రత్యేక అధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమ వ్యవహారాలకు చెక్ పెట్టాలని కోరుతున్నారు. గతంలో ఇచ్చిన డిప్యుటేషన్లను సైతం రద్దు చేసి అందరికీ సమన్యాయం చేయాలని కోరుతున్నారు. మరోవైపు నిజామాబాద్ రూరల్ మండలం డిప్యుటేషన్ కోసం ఇద్దరు ముగ్గురు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బోధన్ నియోజకవర్గంలోని ఒక మండలానికి సూపరింటెండెంట్ లేకపోవడంతో పనిభారం కింది ఉద్యోగులపై పడుతుందని చెబుతున్నారు. జెడ్పీ ఎన్నికల నేపథ్యంలో ఎంపీడీవోకు కిందిస్థాయి సిబ్బంది తక్కువగా ఉంటే పనిభారం పడుతుందని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూనియన్ల పేరిట డిప్యుటేషన్ల కథలు నడిపిస్తుండడం పట్ల ఉద్యోగుల్లో అసహనం వ్యక్తం అవుతోంది. ఈ విషయాలపై జెడ్పీ సీఈవో సాయాగౌడ్ను ‘సాక్షి’ వివరణ కోరగా కొత్తగా ఎవరికీ డిప్యుటేషన్లు ఇచ్చేది లేదని తెలిపారు. సగం మందికి మాత్రమే మినహాయింపు ఇవ్వడంపై జెడ్పీ ఉద్యోగుల్లో చర్చ అందరికీ ఒకే న్యాయం ఉండాలంటున్న ఉద్యోగులు ‘సాక్షి’ కథనంతో జిల్లా ప్రజాపరిషత్లో కదలిక ఎవరికీ డిప్యుటేషన్లు ఇవ్వం : జెడ్పీ సీఈవో సాయాగౌడ్ -
జేఈఈ అడ్వాన్స్డ్లో ర్యాంకుల పంట
● కాకతీయ విద్యార్థుల ప్రభంజనంఖలీల్వాడి: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో నిజామాబాద్ కాకతీయ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని చైర్మన్ విజయలక్ష్మి సోమవారం తెలిపారు. హెచ్. భరత్ 1275, జె. తన్విత 1573, బి. సంధ్య 1627, ఆర్. బన్ని 1834, ఎ. ఆత్రిజీ 2361 ర్యాంకులు సాధించారన్నారు. ఈ సందర్భంగా కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ సీహెచ్. రామోజీరావు మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో ఆలిండియా ర్యాంకులు సాధించి కాకతీయ విద్యార్థులు సత్తా చాటారని అన్నారు. జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను డైరెక్టర్ సీహెచ్. తేజశ్విని అభినందించారు. కార్యక్రమంలో డైరెక్టర్ సీహెచ్ రాజా, ప్రిన్సిపాల్స్ సందీప్ కులకర్ణి, వి. రణధీశ్ శర్మ, అకడమిక్ కో–ఆర్డినేటర్ నాగరాజు, వైస్ ప్రిన్సిపాల్ శ్యాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
చోరీ కేసులో ముగ్గురి అరెస్టు
నిజామాబాద్ అర్బన్ : ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మినగర్ కాలనీలో మే 24న జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సాయిచైతన్య వివరాలు వెల్లడించారు. మహాలక్ష్మినగర్ కాలనీకి చెందిన శరత్ కుటుంబసభ్యులతో కలిసి వేములవాడకు వెళ్లారు. దుండగులు పథకం ప్రకారం ఇంట్లోకి చొరబడి రూ.19 లక్షల నగదు, 10 గ్రాముల చైన్, వెండిపెట్లు, 580 గ్రాముల బంగారం ముద్దలను అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం బ్రాహ్మణపల్లి రోడ్డు వద్ద ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పట్టుకొని విచారించగా చోరీకి పాల్పడింది తామేనని ఒప్పుకున్నారు. నిందితులు విజయ్ అగర్వాల్, సల్మాన్ఖాన్, మంజల్ సాయికుమార్ను అరెస్టు చేయగా, శ్రీహరి పరారీలో ఉన్నాడు. వారి నుంచి రూ.31 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. కాగా, విజయ్ అగర్వాల్ సొంత బాబాయి ఇంట్లోనే చోరీ చేసేందుకు మరో ముగ్గురితో కలిసి పథకం వేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ● రూ.31 లక్షలు స్వాధీనం ● బాబాయ్ ఇంట్లోనే దొంగతనం చేసిన ఘనుడు -
పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం
సాక్షి నెట్వర్క్: పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేసి వారి కళ్లల్లో ప్రజా ప్రభుత్వం ఆనందం నింపిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. రూరల్, అర్బన్ నియోజకవర్గాల్లోని పలు మండలాలు, గ్రామాల్లో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ప్రారంభించారు. నిజామాబాద్ రూరల్ మండలం కులాస్పూర్లో సామూహిక ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించి, నూతన వస్త్రాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఒక్కరోజే వెయ్యి ఇళ్ల గృహప్రవేశం చేయడం ఆనందంగా ఉందన్నారు. నియోజకవర్గంలో 2655 ఇండ్లు మంజూరు కాగా, 98 శాతం గ్రౌండింగ్ పూర్తి చేసుకొని జిల్లాలోనే మొదటి స్థానంలో ఉందని తెలిపారు. రెండో విడతలో అర్హులకు మరిన్ని ఇండ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 3,304 ఇళ్ల గృహ ప్రవేశాలు చేశామని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్ధూ అకాడమీ చైర్మన్ తాహెర్ బీన్ హందాన్, రాష్ట్ర కల్లుగీత కార్మిక సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ బాడ్సి శేఖర్ గౌడ్, నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, సర్పంచ్ గుడి జనార్ధన్రెడ్డి, డీఆర్వో గీత, ఆర్డీవో రాజేంద్రకుమార్, మండల ప్రత్యేకాధికారి తిరుమల ప్రసాద్, తహసీల్దార్ రేఖ, ఎంపీడీవో రాములు నాయక్, హౌజింగ్ అధికారులు రాజ్యలక్ష్మీ, నివర్తి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు జలంధర్రెడ్డి, ఎల్లోల్ల సాయిరెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, ఉమ్మాజి నరేష్, హన్మండ్లు, హమీద్, దిలావర్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పలు గ్రామాల్లో ‘ఇందిరమ్మ’ గృహప్రవేశాలు -
ఆత్మరక్షణ.. కర్రసాము శిక్షణ
బాన్సువాడ : వేసవి సెలవుల్లో సరదాగా గడిపేందుకు పిల్లలు ఆసక్తి చూపుతారు. కానీ, బాన్సువాడకు చెందిన ఈ చిన్నారులు మాత్రం కర్రసాములో మెలకువలు నేర్చుకుంటూ ఔరా అనిపిస్తున్నారు. ఫలితంగా శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, మానసిక ఉల్లాసం, ఆత్మస్థైర్యాన్ని పొందుతున్నారు. పిల్లలు సెలవులను వృథా చేయకుండా ఆత్మరక్షణకు తోడ్పడేలా వేద్ ఆర్యన్ అనే యువకుడు ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఆర్య సమాజ్ ప్రాంగణంలో కరాటే, కర్రసాము, యోగాపై శిక్షణనిస్తున్నారు. తొలుత 12 మంది మాత్రమే రాగా ప్రస్తుతం 40 మంది చిన్నారులు శిక్షణ పొందుతున్నారు. పిల్లల ఆసక్తికి తల్లిదండ్రులు ప్రోత్సాహం తోడయ్యింది. ఆర్యసమాజ్ ప్రాంగణంలో కరాటే మాస్టర్ వేద్ ఆర్యన్ (బ్లాక్ బెల్ట్) ఆధ్వర్యంలో కర్రసాము, కరాటే, యోగాపై ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు శిక్షణనిస్తున్నారు. కరాటే, యోగా శిక్షణతో చిన్నారుల ఉత్సాహం మానసిక ఉత్తేజం, శారీరక దృఢత్వం బాన్సువాడ ఆర్యసమాజ్ ప్రాంగణంలో ఉచిత శిక్షణ -
గంగమ్మ ఒడి నుంచి బయటకు..
డొంకేశ్వర్(ఆర్మూర్): శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) బ్యాక్వాటర్ పరిధిలో ఆధ్యాత్మిక అద్భుతం వెలుగుచూసింది. గత కొన్ని రోజులుగా ప్రాజెక్ట్ వెనుక జలాల్లో నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పట్టడంతో డొంకేశ్వర్ పాత గ్రామంతో పాటు ఒక పురాతన శివలింగం, రెండు నందులు బయటపడ్డాయి. గంగమ్మ ఒడిలో జలదీక్ష ముగించుకుని ఆ పరమ శివుడు సాక్షాత్కరించినట్లుగా దర్శనమిస్తున్నాడు. అయితే, జలాల నుంచి బయటపడిన శివలింగానికి గ్రామ ప్రజలు సోమవా రం ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. ప్రస్తుత డొంకేశ్వర్ గ్రామానికి ఐదారు కిలో మీటర్ల దూరంలో ఉంది ఈ శివలింగం. -
అవతరణ వేడుకలకు సిద్ధం
నిజామాబాద్ అర్బన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ను ముస్తాబు చేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, డీఆర్వో గీత ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించి వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉదయం 8 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అంతకుముందు వినాయకనగర్లోని అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించనున్నారు. ఏర్పాట్ల పరిశీలన తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించు కొని పోలీస్ పరేడ్ మైదానం, అమరవీరుల స్థూపం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను సీపీ సాయిచైతన్య సో మవారం పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా చర్య లు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, టౌన్ 4 ఎస్హెచ్వో సతీశ్, నిజామాబాద్ నార్త్ తహసీల్దా ర్ వి.అనిల్ గిరిధర్, సాయిలు ఉన్నారు. -
ఊపిరి పోశారు..
కామారెడ్డి టౌన్ : నెలలు నిండకుండా పుట్టి, శ్వాస ఆడక ప్రాణాపాయ స్థితిలో ఉన్న నవజాత శిశువుకు 108 అంబులెన్స్ సిబ్బంది పునర్జన్మనిచ్చారు. కృత్రిమ శ్వాస అందిస్తూ ఆస్పత్రికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పాల్వంచ మండలం భవానీపేట గ్రామానికి చెందిన మానస అనే గర్భిణికి జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సాధారణ ప్రసవమైంది. అయితే, నెలలు నిండకుండానే మగ శిశు వు జన్మించాడు. పుట్టి న సమయంలో బా బు ఏడవకపోవడం, శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతూ నిర్జీవ స్థితికి చేరుకోవడంతో పిల్లల వైద్యులు బా బును సాధారణ స్థితి కి తెచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించా రు. ఫలితం లేకపోవడంతో, మెరుగైన చికి త్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేశారు. 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే శిశువును నిజామాబాద్ తరలించేందుకు బయలుదేరారు. మార్గమధ్యంలో బాబు పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారడంతో ఈఎంటీ కృష్ణస్వామి సమయస్ఫూర్తితో అంబులెన్స్లోనే నిరంతరాయంగా ఆక్సిజన్తోపాటు అంబుబ్యాగ్ ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తూ, ఐవీ ఫ్ల్యూడ్స్ ఇస్తూ బాబును సురక్షితంగా ఇంక్యుబేటర్లో ఉంచారు. పైలట్ సుదర్శన్ గౌడ్ సమయస్ఫూర్తితో వాహనాన్ని నడిపి సురక్షితంగా నిజామాబాద్ ఆస్పత్రికి చేర్చారు. బాబుకు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. సమయానికి స్పందించి తన కుమారుడి ప్రాణాలు కాపాడిన 108 ఈఎంటీ కృష్ణస్వామి, పైలట్ సుదర్శన్ గౌడ్ను శిశువు తండ్రి సంతోష్ కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పత్రి వైద్యుడు, సిబ్బంది సైతం అభినందించారు. ● 108 సిబ్బంది సమయస్ఫూర్తి.. శిశువుకు పునర్జన్మ ● నెలలు నిండకుండా పుట్టిన బాబు ● కృత్రిమ శ్వాసనందిస్తూ ఆస్పత్రికి తరలింపు -
పట్టాలెక్కని అధ్యయనం
మోర్తాడ్(బాల్కొండ): వలస కార్మికుల సంక్షేమం కోసం ప్రవాసీ విధానాన్ని రూపొందించాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఎన్నారై అడ్వయిజరీ బోర్డు అధ్యయనం పట్టాలెక్కకపోవడంతో వలసదారుల ప్రయోజనాలపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. 2025 ఏప్రిల్ 10వ తేదీన ఎన్నారై అడ్వయిజరీ బోర్డును ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. అధ్యయనం చేసి నివేదికను అందించడానికి రెండేళ్ల కాలపరిమితిని నిర్ణయించింది. ఇప్పటికే 14 నెలల కాలం గడచిపోయినా బోర్డు అధ్యయనం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. సలహా కమిటీ తీరు సరిగా లేకపోవడానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువైందనే ఆరోపణలతో బోర్డు సభ్యత్వానికి గుగ్గిల్ల రవిగౌడ్ శనివారం రాజీనామా చేశారు. సభ్యుని రాజీనామాతో ప్రవాసీ విధానం రూపకల్పన అటకెక్కిందని వలస కార్మికుల్లో చర్చ జరుగుతోంది. ఉద్ధండులతోనే కమిటీ ఏర్పాటు ఎన్నారై అడ్వయిజరీ బోర్డులో గల్ఫ్ అంశాలు, వలస కార్మికుల సమస్యలపై ఎంతో అవగాహన ఉన్నవారే సభ్యులుగా ఉన్నారు. పదవీ విరమణ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి, వివిధ దేశాల్లో రాయబారిగా, మన దేశంలో పాస్పోర్టు అధికారిగా సేవలందించిన డాక్టర్ వినోద్కుమార్ నేతృత్వంలో కమిటీ కొనసాగుతోంది. అంతర్జాతీయ వలసల విశ్లేషకులు మంద భీంరెడ్డి, వలస కార్మిక సంఘాల నాయకులైన స్వదేశ్ పరికిపండ్ల, నంగి దేవేందర్రెడ్డి, సిస్టర్ లిజీ జోసెఫ్, సింగిరెడ్డి నరేశ్రెడ్డి, చెన్నమనేని శ్రీనివాస్రావు, కొట్టాల సత్యం నారాగౌడ్, గుగ్గిల్ల రవిగౌడ్(రాజీనామా చేసిన వ్యక్తి)తో పాటు ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, డాక్టర్ భూపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి(బీఆర్ఎస్లో చేరక ముందు) సభ్యులుగా ఎంపిక చేశారు. ఈ కమిటీ మన రాష్ట్రంలో వలసలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలతోపాటు పొరుగు రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేయాల్సి ఉంది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ప్రభుత్వం ప్రవాసీ విధానాన్ని రూపొందచడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు కమిటీ కేవలం నిర్మల్ జిల్లాతోపాటు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పర్యటించింది. అధ్యయనం కోసం ఎన్నో పర్యటనలు చేయాల్సి ఉన్నా ప్రభుత్వం నుంచి సహకారం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కమిటీ సభ్యులు ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించే స్థితిలో లేకపోవడంతో అధ్యయనం పట్టాలు ఎక్కడం లేదనే వాదన వినిపిస్తోంది. రవిగౌడ్ రాజీనామాతో అధ్యయనం ఎంత వరకు వచ్చిందనే విషయం బహిర్గతమైందని స్పష్టమవుతోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వలస కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని పలువురు సూచిస్తున్నారు. కాగితాలకే పరిమితమైన ఎన్నారై అడ్వయిజరీ బోర్డు ప్రభుత్వ ప్రోత్సాహం లేదని సభ్యుని రాజీనామా వలస కార్మికుల ప్రయోజనాలపై నీలినీడలు -
ప్చ్.. గుర్తింపేది..?
● సతమతమవుతున్న నాయకులు ● ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నామని ఆవేదన సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పార్టీ అభివృద్ధి కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకే నాయకులు, ప్రజాప్రతినిధులుగా అవకాశాలు ఇస్తామని ప్రతి పార్టీ చెబుతున్న క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుత రాజకీయాల్లో తమకు అంతగా ప్రాధాన్యత కాదు కదా, కనీసం గుర్తింపు కూ డా లేకుండా పోతోందని పలువురు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి నాయకులు కుమి లిపోతున్నారు. ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ గుర్తింపు దక్కడంలేదని ఆవేదన చెందుతున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పని చేస్తున్నప్పటికీ చివరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ టిక్కెట్కు కూడా నోచుకోవడం లేదంటున్నారు. ఇక సర్పంచ్లైతే పా ర్టీలు తమను కరివేపాకులా వాడుకుని వదిలేస్తున్నా యని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో జవాబుదారీగా ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారం కోసం తాము కృషి చేస్తుంటే తమకు అందుతున్న సహకారం అంతంతమాత్రమేనని వాపోతున్నారు. కీలక నాయకులు పట్టించుకోకపోవడంతో అధికారులు సైతం తమతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు సర్పంచ్లు ఆవేదన చెందుతున్నారు. పారాచూట్ నాయకులకు పెద్దపీట ఎలాంటి రాజకీయ నేపథ్యం లేనివారికి పారాచూట్ మాదిరిగా రాగానే ఏకంగా ఎమ్మెల్యే టిక్కెట్లు ఇ స్తూ.. ఏళ్లతరబడి పనిచేస్తున్న తమకు కనీసం గుర్తింపు ఇవ్వకపోవడమేమిటని ఆయా పార్టీల్లోని సీనియర్లు గుర్రుగా ఉన్నారు. కేవలం డబ్బులే ప్రామాణికంగా చూసుకున్నప్పటికీ, అప్పటికప్పుడు వచ్చి టిక్కెట్లు తెచ్చుకున్నవాళ్లతో పోలిస్తే, ఏళ్లతరబడి క్షేత్రస్థాయిలో కార్యక్రమాల కోసం తాము ఖర్చు పెట్టడంతోపాటు పార్టీకి, జనానికి అందించిన సేవలు వెలకట్టలేనివని చెబుతున్నారు. ప్రభుత్వ అధికారులుగా రిటైర్ అయినవారికి, వ్యాపారాలు చేసుకుని వచ్చినవారికి అప్పటికప్పుడు టిక్కెట్లు ఇవ్వడమేమిటని పలు పార్టీల సీనియర్ నాయకు లు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా వచ్చినవారిలో జిల్లాలో ఒకరిద్దరు గెలిచినప్పటికీ తరువాత పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో లేకుండాపోతున్నారని అంటున్నారు. పసుపు నేలగా పేరొందిన ఈ ప్రాంతంలో గెలిచిన ఓ ఎమ్మె ల్యే అయితే ఒక జాతీయ పార్టీ నుంచి గెలిచి ఆ పార్టీ కార్యకర్తలను ఏమాత్రం పట్టించుకోకపోగా, మరో జాతీయ పార్టీతో అంటకాగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయమై రెండు జాతీయ పార్టీల కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. సదరు ఎమ్మెల్యే తన సొంత గ్రామంలోనూ సర్పంచ్ను గెలిపించుకోలేక చతికిలపడడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. అధికార పార్టీలో ఉండీ.. ఇక అధికార కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల పరిస్థితి మరోరకంగా ఉంది. అధికారంలో లేని సమయంలో అనేక ఇబ్బందులు పడడంతోపాటు డబ్బులు ఖర్చు పెట్టుకున్నామని, తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం తగిన గుర్తింపు దక్కకపోగా, తమను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. నామిటేటెడ్ పదవుల్లోనూ సీనియర్లమైన తమకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని, మరోవైపు తమ తమ ప్రాంతల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించిన చిన్న చిన్న పనులు సైతం చేయించలేని దుస్థితిలో ఉన్నామని పలువురు సీనియర్ నాయకులు తమ సన్నిహితుల వద్ద కుమిలిపోతున్నారు. మరోవైపు ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చి ఎమ్మెల్యే టిక్కెట్లు తెచ్చుకుని, ఓడిపోవడంతోపాటు తమకు పార్టీ పదవులు కూడా దక్కకుండా చేస్తున్నారని పలువురు కాంగ్రెస్ సీనియర్లు ఆగ్రహంతో ఉన్నారు. -
లారీ, బైక్ ఢీ
● ప్రమాదంలో తండ్రి మృతి, కుమారుడికి తీవ్రగాయాలు పిట్లం(జుక్కల్): మండలంలోని పోతిరెడ్డిపల్లి తండా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందగా కొడుకుకి తీవ్రగాయాలయ్యాయి. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతిరెడ్డిపల్లితండా సమీపంలోని పిట్లం–బాన్సువాడ రహదారిపై ఆదివారం ఎదురెదురుగా వస్తున్న లారీ, బైక్ ఢీకొన్నాయి. ప్రమాదంలో బైక్ నడుపుతున్న దుర్గేశ్కు తీవ్రగాయాలు కాగా, వెనకాల కూర్చున్న తండ్రి దుర్గయ్య(62) అక్కడికక్కడే మృతి చెందాడు. దుర్గేశ్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిజామాబాద్అర్బన్ : ఆస్తి తగాదాల నేపథ్యంలో ఒకరిపై కత్తితో దాడి చేసిన ఘటన నగరంలోని నాల్గో టౌన్ పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్హెచ్వో సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని హస్మీ కాలనీకి చెందిన సోహైల్ ఖాన్కు, అతని బంధువు అయిన జావిద్ఖాన్ మధ్య కొన్నేళ్లుగా ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. బక్రీద్ సందర్భంగా సోహైల్ఖాన్ తన మేనమామ ఇంటికి వెళ్లగా అక్కడికి వచ్చిన జావిద్ కుమారులు ఫర్హాన్, జియాన్, అక్బర్ దాడి చేశారు. సోహైల్ఖాన్ తండ్రి సలీంఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్హెచ్వో పేర్కొన్నారు. -
బాల సాహిత్య నిలయం
నిజామాబాద్ రూరల్ : బాలల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసేది బాల సాహిత్యం. కథలు, కవితలు, గేయాలు రాయిస్తూ సృజనాత్మకతకు అక్షరరూపం కల్పించి సాహితీ లోకానికి పరిచయం చేస్తోంది ఇందూరు బాలసాహిత్య వేదిక. రెండు సంవత్సరాల క్రితం ఉగాది రోజున ప్రారంభమైన ఈ వేదిక జిల్లాలోని అనేకమంది విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ వస్తోంది. కవితారచన, కథారచనలు ఇతర సజనాత్మక ప్రక్రియల్లో విద్యార్థులకు అండగా నిలుస్తున్నది. పాఠశాలల్లో కార్యశాల ఏర్పాటు చేసి కవిత రచన, కథా రచనల్లో మెలకువలను పిల్లలకు నేర్పిస్తున్నది. పుస్తకావిష్కరణలను ప్రోత్సహిస్తున్నది. విద్యార్థులు రాసిన రచనలను వివిధ సాహితీ సంస్థల పోటీలకు పంపించి, బహుమతులు సాధించేలా మార్గదర్శనం చేస్తున్నది. ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు సుమారు 20 పుస్తకాలు విడుదలయ్యాయి. గుండారం, తడపాకల్, ఏర్గట్ల, సిరిపూర్, నీలా, కులాస్పూర్, కాలూర్, బాచనపల్లి, వడ్డేపల్లి మొదలైన పాఠశాల విద్యార్థుల రచనలను ప్రోత్సహించి వారి ద్వారా పుస్తకాలు తీసుకువచ్చేందుకు బాల సాహిత్య వేదిక అండగా నిలుస్తున్నది. ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదికకు అధ్యక్షుడిగా డాక్టర్ కాసర్ల నరేశ్ రావు, ప్రధాన కార్యదర్శిగా డి.ప్రవీణ్ కుమార్ శర్మ, కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ శారద, డాక్టర్ గంట్యాల, చింతల శ్రీనివాస్ గుప్త, శ్రీమన్నారాయణ చారి, స్వర్ణ సమత తదితరులు వ్యవహరిస్తున్నారు. కవితలంటే ఎంతో ఇష్టం.... రెండు సంవత్సరాల నుంచి కవితలు, కథలు రాస్తున్నాను. ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదిక కవితా, కథా కార్యశాలలో పాల్గొన్నాను. ఇప్పటి వరకు 30 కవితలు, 6 కథలు రాశాను. జాతీయ సైన్స్ఫిక్షన్ కథా పోటీలో నేను రాసిన ‘బ్రేవ్ గర్ల్ ‘అనే కథకు బహుమతి లభించింది. నాకు చాలా సంతోషం వేసింది. మా అందరికీ తెలుగు భాషా భిమానాన్ని కలిగించి, ముందుకు తీసుకెళ్తున్న ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదికకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. – కే. కృతిక, 8వ తరగతి, జాతీయస్థాయి సైన్స్ఫిక్షన్ కథా పోటీల విజేత విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీస్తున్న బాలసాహిత్య వేదిక కవితలు, కథలు, గేయాల రచనల్లో రాణిస్తున్న పిల్లలు ఇప్పటి వరకు 20 పుస్తకాల రచన -
అగ్నివీర్కు ఎంపిక
రెంజల్(బోధన్): రెంజల్, కోటగిరి మండలాలకు చెందిన నలుగురు యువకులు అగ్నివీర్కు ఎంపికయ్యారు. రెంజల్ మండలంలోని కళ్యాపూర్ గ్రామానికి చెందిన ఒడ్డెక్క అక్షయ్కుమార్, ఒడ్డెక్క భరత్, రెంజల్కు చెందిన గైని శివానంద్ అగ్నివీర్కు అర్హత సాధించారు. దీంతో ఆయా గ్రామాల సర్పంచులు భానుచందర్, తిరుపతి లలిత, కాంగ్రెస్ నాయకులు యువకులను అభినందించారు. కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన శ్రీహరి అగ్నివీర్కు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (బాలుర) ప్రిన్సిపాల్ డాక్టర్ మహమ్మద్ ముబీన్ శ్రీహరిని అభినందించారు. ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పోలీస్స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సేకరించి ఆదివారం బాధితులకు అందజేసినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. మొత్తం 6 ఫోన్లను బాధితులకు అందజేశామని పేర్కొన్నారు. సిరికొండ: మండలంలోని జినిగ్యాల తండా అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా వంట చెరుకును తరలిస్తున్న ఎడ్లబండిని స్వాధీనం చేసుకున్నట్లు సిరికొండ ఎఫ్ఆర్వో నర్సింగరావు ఆదివారం తెలిపారు. పెట్రోలింగ్లో భాగంగా వంట చెరుకుతో కూడిన ఎడ్ల బండిని గమనించిన స్థానిక బీట్ అధికారి సతీశ్.. ఆ బండి వద్ద ఎవరూ లేకపోవడంతో దాన్ని స్వాధీనం చేసుకొని సిరికొండలోని రేంజ్ కార్యాలయానికి తరలించారు. విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని ఎఫ్ఆర్వో తెలిపారు. -
భూ తగాదాలతోనే రాజిరెడ్డి హత్య
● ఘాతుకానికి పాల్పడిన తండ్రీకొడుకుల రిమాండ్ ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ మధుసూదన్కామారెడ్డి క్రైం : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన బండారి రాజిరెడ్డి హత్య భూ తగాదాల నేపథ్యంలోనే జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.హత్యకు పాల్పడిన అదే గ్రామానికి చెందిన మంచాల ఎల్లయ్య, అతని కొడు కు ప్రణీత్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కామారెడ్డి సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మధుసూదన్ హత్య కేసు వివరాలను వెల్లడించారు. ఎల్లయ్యకు చెందిన 21 గుంటల భూమిని గతంలో రాజిరెడ్డి రూ.1.20 కోట్లకు ఒప్పందం చేసుకొని కొనుగోలు చేశాడు. అందుకు రూ.28 లక్షలు రాజిరెడ్డి చెల్లించాడు. ఆ డబ్బులలో నుంచి రూ.20 లక్షలు అడ్వాన్సుగా ఇచ్చి తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్లోని రాజిరెడ్డి సమీప బంధువులకు చెందిన 2 ఎకరాల భూమిని ఎల్లయ్య రూ.40 లక్షలకు కొనుగోలు చేశాడు. రాజిరెడ్డి మిగితా డబ్బులు ఇవ్వడంలో ఆలస్యం చేయడంతో ఎల్లయ్య కూడా తాను కొనుగోలు చేసిన భూమికి డబ్బులు చెల్లించలేదు. కొనడం, అమ్మడం రెండూ పూర్తిస్థాయిలో జరుగక గొడవలు మొదలయ్యాయి. దీంతో కక్ష పెంచుకున్న ఎల్లయ్య, అతని కుమారుడు ప్రణీత్... రాజిరెడ్డి హత్యకు పథకం వేశారు. ఈ నెల 29న సాయంత్రం రాజిరెడ్డిని మాట్లాడేందుకు రమ్మని తమ ఇంటి వెనుక పశువుల కొట్టం వద్దకు పిలిచారు. రాజిరెడ్డి రాగానే ఎల్లయ్య వెనుక నుంచి మెడపై రాడ్డుతో బలంగా కొట్టాడు. ఇద్దరూ కలిసి కిందపడిన రాజిరెడ్డి గొంతు నులుమి హత్య చేశారు.ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలని భావించి మృతదేహాన్ని గోనె సంచిలో వేసి గ్రామా నికి సమీపంలోని ఓ పాడుబడిన నీళ్లు లేని బావిలోకి తీసుకువెళ్లి గుంత తీసి పాతిపెట్టారు.రాజిరెడ్డి బైక్ను గ్రామానికి దూ రంగా ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో వదిలేశారు. రాజిరెడ్డి కనిపించకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అనుమానం వచ్చిన అతని కుమారుడు రంజిత్ శనివారం దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చే శారు. ఎల్లయ్య, ప్రణీత్పై అనుమానం ఉందని ఫి ర్యాదులో పేర్కొనడంతో పోలీసులు వారిని విచా రించగా నేరం అంగీకరించారని డీఎస్పీ తెలిపారు. శనివారం అర్ధరాత్రి మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీయించి పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియల నిమిత్తం కుటుంబానికి అప్పగించామన్నారు. 24 గంటల్లోనే కేసు ఛేదించిన రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్, దేవునిపల్లి ఎస్సై రంజిత్, సిబ్బందిని అభినందించారు. పట్టణ సీఐ నరహరి, అధికారులు పాల్గొన్నారు. -
నేను గీసిన చిత్రం
సాయిప్రభ, 7వ తరగతి, జెడ్పీహెచ్ఎస్, పిట్లం, కామారెడ్డి ఎన్. సంస్థిత, 4వ తరగతి, రుద్రూర్. సింగారం నిత్యశ్రీ, 7వ తరగతి, తొర్లికొండ, నిజామాబాద్ ప్రవస్తి, 5వ తరగతి, కాకతీయ స్కూల్, నిజామాబాద్ -
మన పసుపే మిన్న..
మోర్తాడ్(బాల్కొండ): పసుపు సాగులో అగ్రగామిగా నిలుస్తున్న మన ప్రాంతానికి సాంగ్లీ మార్కెట్లో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తోంది. అక్కడి మార్కెట్కు మన జిల్లాతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి పసుపు వెళ్తుండగా, మన దగ్గర నుంచి వెళ్లిన కొమ్ములకు అక్కడి వ్యాపారులు ఎక్కువ ధర నిర్ణయించడం విశేషం. మన జిల్లా నుంచి వెళ్లిన పసుపు కొమ్ములకు రూ.15 వేల నుంచి రూ.16 వేల వరకు చెల్లిస్తున్నారు. నాణ్యత ఆధారంగా ధర చెల్లించే సాంగ్లీ వ్యాపారులు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వెళ్లిన పసుపునకు రూ.13 వేలకు మించి ధర చెల్లించడం లేదు. మన జిల్లాలోని అంక్సాపూర్, గుమ్మిర్యాల్, దోంచంద, దొన్కల్, పడగల్, వన్నెల్(బీ), అంకాపూర్ తదితర గ్రామాల నుంచి ఎక్కువగా సాంగ్లీకి పసుపును రైతులు తరలిస్తారు. నిజామాబాద్ మార్కెట్తో పోలిస్తే ఎక్కువ ధర లభించడం, నాణ్యతను బట్టి ధర నిర్ణయిస్తుండడంతో సీజన్లో రోజుకు రెండు, మూడు లారీల పసుపు సాంగ్లీ మార్కెట్కు ఎగుమతి అవుతోంది. మన రైతుల శ్రమకు తగిన ఫలితం కాకపోయినా ఇతర రాష్ట్రాల రైతుల కన్నా ఎక్కువ ప్రాధాన్యం మన వాళ్లకు దక్కడ ప్రత్యేక గుర్తింపుగా చెప్పుకోవచ్చు. సాంగ్లీలో కర్ణాటక, మహారాష్ట్ర కొమ్ములకన్నా ఎక్కువ ధర నాణ్యతకు పెద్దపీట వేస్తున్న అక్కడి వ్యాపారులు ఇతర రాష్ట్రాల పసుపునకు రూ.2 వేలు తక్కువ ధర -
మంజీరలో విషాదం
● నీటమునిగి ఇద్దరు గొర్రెల కాపరుల మృతి ● మృతులు బావ బావమరుదులురుద్రూర్: గొర్రెలను కడిగేందుకు మంజీర నది వద్దకు వెళ్లిన ఇద్దరు నీటమునిగి దుర్మరణం పాలైన ఘటన నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్ర సమీపంలోని మంజీర నదిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పోతంగల్ గ్రామానికి చెందిన కుర్మ గంగొండ (43) తన గొర్రెలను మేపేందుకు కు మారుడు సంతోష్తోపాటు బావ అయిన రెంజల్ మండలం బోర్గాం గ్రామానికి చెందిన చిక్కాల గంగారాం (50)ను వెంటబెట్టుకొని మంజీర నది ప్రాంతానికి వెళ్లాడు. గొర్రెలను కడుగుతున్న సమయంలో చిక్కాల గంగారాం ప్రమాదవశాత్తూ నదిలో ప డిపోయాడు. అతడిని కాపాడేందుకు గంగొండ వెంటనే నీటిలోకి దూకి గల్లంతయ్యాడు. దీనిని గమనించిన సంతోష్ గ్రామస్తులకు సమాచారం అందించాడు. స్థానికులు, ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. గంగొండకు ఇద్దరు కుమారులు, గంగారామ్కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడు గంగొండ భార్య రుక్మిణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై సునీల్ తెలిపారు. బావబామ్మర్దుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గంగొండ మృతదేహంగంగారాం మృతదేహం -
జాతీయ, రాష్ట్ర స్థాయి బహుమతులు అందుకున్నా..
నేను తొమ్మిదో తరగతి నుంచి కవితలు, కథలు రాయడం ప్రారంభించా. ఇప్పటి వరకు దాదాపు 30 కవితలు, 10 కథ లు రాశాను. ఈ మధ్యనే రెండు నాటికలను కూడా రాశా ను. నేను రాసిన కవితలకు, కథలకు జాతీయ, రాష్ట్రస్థాయి బహుమతులు వచ్చాయి. ఇటీవల తెలుగు సాహిత్య అకాడమీ ప్రకటించిన నాటిక రచనల పోటీల్లో నేను రాసిన ‘పల్లెతనం‘ అనే నాటికకు ప్రత్యేక బహుమతి వచ్చింది. రచనలు చేసేందుకు గురువు కాసర్ల, ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదిక ఎంతో తోడ్పాటునందించింది. భవిష్యత్తులో నేను ఇలాగే రచనలు కొనసాగిస్తాను. –ఎం.మాధురి,పదో తరగతి -
గ్యాస్ లీకేజీతో మంటలు
● తల్లి, కుమారుడికి తీవ్రగాయాలు ఆర్మూర్టౌన్: గ్యాస్ లీకేజీతో మంటలు అంటుకొని ఇద్దరికి గాయాలైన ఘటన ఆర్మూర్ పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని కాశీ హనుమాన్ సమీపంలో కొండూర్ రాజేశ్ చికెన్ షాప్తోపాటు కిరాణాషాప్ నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం చికెన్ను స్టౌవ్పై కాల్చుతుండగా సిలిండర్ పైప్ నుంచి గ్యాస్ లీకేజీ అయ్యింది. దీంతో మంటలు చెలరేగి దుకాణం మొత్తం వ్యాపించాయి. కిరాణ దుకాణంలో ఉన్న తల్లి కొండూరు రుకుంబాయికి, రాజేశ్కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆర్మూర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో ఫైరింజన్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. ప్రమాదంలో సుమారు రూ. లక్ష వరకు ఆస్తినష్టం జరిగిందని అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. -
అపూర్వ సమ్మేళనం
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2004–05 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సుదీర్ఘకాలం తర్వాత కలుసుకోవడంతో పరస్పర యోగ క్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. వాణి విద్యాలయంలో.. కామారెడ్డి అర్బన్: కామారెడ్డి వాణి విద్యాలయం ఉన్నత పాఠశాల 2000–01 పదో తరగతి బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఉల్లాసంగా నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థుల సందడి చేశారు. 25 ఏళ్ల నాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
నవీపేట : మండలంలోని నాగేపూర్ గ్రామ శివారులోని బాసర రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. రెంజల్ మండల కేంద్రానికి చెందిన పోసాని(44) నాలుగు నెలలుగా కోస్లీలోని సోదరి జ్యోతి దగ్గర ఉంటుంది. నవీపేటలో పని ఉండడంతో మరిది పోశెట్టితో కలిసి ఆదివారం మధాహ్నం బైక్పై వెళ్తుండగా నాగేపూర్ సమీపంలో అదుపుతప్పిన బైక్ డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో కిందపడిన పోసాని తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోశెట్టికి స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలికి భర్త, పిల్లలు లేరు. తల్లిదండ్రులు చనిపోయారు. సోదరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. గాయపడిన యువకుడు ..రుద్రూర్ : ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై సాయన్న ఆదివారం తెలిపారు. వర్ని మండలం కోటయ్య క్యాంపునకు చెందిన వడ్డేపల్లి భూమేశ్(25) శనివారం సాయంత్రం ట్రాక్టర్లో సిమెంట్ బస్తాలను తీసుకెళ్తుండగా మండల కేంద్రంలోని జవహర్నగర్ కాలనీ సమీపంలో ట్రాక్టర్ టైరు పంక్చర్ కావడంతో వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టింది. ప్రమాదంలో భూమేశ్ తీవ్రంగా గాయపడగా 108 అంబులెన్స్లో నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. అనుమానాస్పదస్థితిలో ఎలక్ట్రీషియన్ ..భిక్కనూరు : మండల కేంద్రంలో ప్రయివేటు ఎలక్ట్రీషియన్ ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు ఆదివారం తెలిపారు. మండల కేంద్రానికి చెందిన బల్యాల సిద్దరాములు (46) ప్రయివేటు ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. నాలుగు రోజుల నుంచి సిద్దరాములు కనిపించడం లేదు. ఆదివారం ఆయన ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా సిద్దరాములు మృతి చెంది ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్ఎస్ ‘రాజకీయం’
● చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం ● రైతులు ఆందోళన చెందవద్దు ● రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి కమ్మర్పల్లి : యాసంగి ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నాయని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. రైతులను తప్పుదోవ పట్టించాలనే దురుద్దేశంతో కల్లాల వద్దకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆదివారం ఆయన కమ్మర్పల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకా రం చేసిన తర్వాత నాలుగు సీజన్లలో రైతులకు ఇబ్బంది లేకుండా చేశాం, ప్రస్తుత ఐదో సీజన్లో కూడా రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంపై పోరాడాల్సిన బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై మాట్లాడుతున్న తీరు వారి అనాలోచిత విధానానికి నిదర్శనమని విమర్శించారు. ధాన్యానికి మద్దతు ధర నిర్ణయించే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు బాధ్యత ఎందుకు తీసుకోదని ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒప్పందం ప్రకారమే కోత అని లేఖల ద్వారా ఉసిగొల్పి రైతుల ఉసురు పోసుకున్నది ఎవరో మాజీ మంత్రి ప్రశాంత్రెడ్డికి తెలియదా అని మోహన్రెడ్డి నిలదీశారు. ప్రస్తుతం 95 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని, ఇవేవీ ఎరగనట్టు చిన్నచిన్న సమస్యలతో మిగిలిన కొనుగోలు కేంద్రానికి వెళ్లి రైతులు ఇబ్బంది పడుతున్నారని అనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బోనగిరి భాస్కర్, నాయకులు సుంకెట రవి, తిప్పిరెడ్డి శ్రీనివాస్, సల్లూరి గణేష్గౌడ్ భూపతిరెడ్డి, రాజు, జనార్ధన్, శ్రీనివాస్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. -
సృజనాత్మకతను వెలికితీయడానికే..
ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదిక ఏర్పడిన నాటి నుంచి జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం, వారిలోని సృజనకళను ప్రోత్సహించడానికి కవితా కార్యశాలలు, కథాకార్యశాలలను నిర్వహించాం. విద్యార్థులు రాసిన రచనలను వివిధ పత్రికలు, పోటీలకు పంపించి వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి బహుమతులు వచ్చేందుకు కృషి చేశాం. తెలంగాణ సారస్వత పరిషత్, తెలంగాణ సాహిత్య అకాడమీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల ద్వారా విద్యార్థులు బహుమతులు పొందారు. – డాక్టర్ కాసర్ల నరేశ్ రావు, ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదిక, అధ్యక్షుడు -
రుజువుందా సర్
నిజామాబాద్ధాన్యం కొనుగోళ్లపై.. ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నాయని టీఎస్సీయూబీ చైర్మన్ మానాల మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2026– 8లో uఎస్ఐఆర్కు యంత్రాంగం సమాయత్తం ఓటరు మ్యాపింగ్లో బీఎల్వోలు బిజీబిజీ జిల్లా వ్యాప్తంగా 84.04 శాతం మ్యాపింగ్ పూర్తి నిబంధనల ప్రకారం డెత్, డూప్లికేట్, షిఫ్టెడ్ ఎంట్రీల తొలగింపు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం జులై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల -
కంటెంట్ డెవలపర్ మన మాస్టారు
● ప్రీ ప్రైమరీ పుస్తకాలు రూపొందించిన టీమ్లో బోయడ నర్సయ్యకు చోటుమోర్తాడ్(బాల్కొండ): ‘విద్యార్థులకు చదువుపై ఆసక్తిని పెంచాలి, వారికి అర్థమయ్యేలా పాఠాలు చెప్పా లి..’ ఎప్పుడూ ఇదే ఆలో చిస్తూ ఆచరణలో పెడుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు బోయడ నర్సయ్య ప్రీ ప్రైమ రీ పిల్లల కోసం పుస్తకాలు రూపొందించే టీములో ఒక మెంబర్ అయ్యారు. బోధనలో ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులను ఎంచుకునే నర్సయ్య బాల్కొండ మండలం బస్సాపూర్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. తమ పాఠశాల విద్యార్థులకే కాదు రాష్ట్రంలోని పూర్వ ప్రాథమిక విద్యార్థులందరికీ చదువు ఆసక్తిని పెంచేలా గేయాలు, కథలను రచించాడు. వాటిని రాష్ట్ర విద్యాశాఖ గుర్తించి ప్రీప్రైమరీ విద్యార్థుల కోసం ప్రచురించిన పాఠ్య పుస్తకంలో చోటు కల్పించింది. 2026 – 27 విద్యా సంత్సరం నుంచి అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ(ఎల్కేజీ, యూకేజీ)ని విద్యాశాఖ అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను విద్యాశాఖ ముద్రించింది. పుస్తక రచన కోసం రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది కంటెంట్ రైటర్లను ఎంపిక చేయగా, జిల్లాకు చెందిన నర్సయ్యకు అవ కాశం లభించింది. ప్రీప్రైమరీ పుస్తకాన్ని ప్రజాపాలన విద్యావారోత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, విద్యాశాఖ ఉన్నతాధికారులు యోగితారాణా, దేవసేన, రమేశ్ ఆవిష్కరించారు. చిన్నారులకు ప్రతి పాఠం అర్థమయ్యేలా ఎన్నో ప్రయోగాలను నిర్వహించిన నర్సయ్యకు రాష్ట్రస్థాయి పుస్తక రచనలో అవకాశం దక్కడం జిల్లాకు లభించిన ప్రత్యేక గుర్తింపు విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
పాత యూనిఫామ్!
కొత్త విద్యా సంవత్సరంలోడిచ్పల్లి(నిజామాబాద్రూరల్): నూతన విద్యా సంవత్సరం మరోర 14 రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే పాఠశాలల పునఃప్రారంభం రోజున విద్యార్థులు ఉంటే పాత యూనిఫామ్ లేదంటే సివిల్ డ్రెస్ వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. పాఠశాలల పునఃప్రారంభం రోజునే యూనిఫామ్స్ అందిస్తామ ని విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటివరకు యూనిఫామ్స్ తయారీకి అవసరమైన బట్ట (క్లాథ్)ను ప్రభుత్వం సరఫరా చేయలేదు. ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. జిల్లావ్యాప్తంగా 1,191 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. 1,06,783 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. స్కూళ్ల ప్రారంభం రోజునే విద్యార్థులకు యూనిఫామ్స్ (రెండు జతలు), బ్లాక్ షూ, సాక్స్, బెల్ట్ అందించాలని ఈ నెల 27న అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది మాదిరిగానే మహిళా సంఘాలతో విద్యార్థుల యూనిఫాం కుట్టిస్తామంటూ మార్చి– ఏప్రిల్ నెలల్లోనే విద్యార్థుల కొలతలు సైతం తీసుకున్నారు. మొత్తం 1,06,783 మంది విద్యార్థుల్లో బాలికలు 57,323 మంది, బాలురు 49,460 మంది ఉన్నారు. స్వశక్తి మహిళలకు అవకాశంగత మూడేళ్లుగా స్వశక్తి సంఘాల మహిళలకు యూనిఫామ్స్ తయారీ చేసే బాధ్యతను అ ప్ప గించారు. ఏటా ప్రభుత్వం క్లాథ్ కొనుగోలు చేసి జిల్లా కేంద్రం నుంచి మండల వనరుల కేంద్రాలకు అందించగా, అక్కడి నుంచి స్వశక్తి సంఘాల మహిళలు తీసుకెళ్లి యూనిఫామ్స్ త యారీ చేసేవాళ్లు. గతేడాది సకాలంలో బట్ట సరఫరా చేయడంతో మహిళలు యూనిఫామ్స్ తయారీ చేసి అందించారు. యూనిఫామ్స్ కొల తల్లో వ్యత్యాసం లేకుండా ఉండేందుకు స్వశక్తి మహిళలు వేసవి సెలవులకు ముందే పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల కొలతలు సేకరించారు. అ యితే ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం బట్టను సరఫరా చేయలేదు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి క్లాథ్ను త్వర గా తెప్పించాల్సిన అవసరం ఉందని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. క్లాథ్ రాగానే కుట్టిస్తాం విద్యార్థుల యూనిఫామ్స్కు సంబంధించి క్లాథ్ ఇంకా జిల్లాకు రాలేదు. రాగానే మహిళా సంఘాల సభ్యులకు యూనిఫామ్స్ తయారీ బాధ్యతలు అప్పగిస్తాం. ఇప్పటికే అన్ని పాఠశాలల్లో విద్యార్థుల డ్రెస్ కొలతలు తీసుకున్నాం. – శ్రీనివాస్రావు, సెక్టోరియల్ ఆఫీసర్, నిజామాబాద్ విద్యార్థుల డ్రెస్ల తయారీ కోసం జిల్లాకు చేరని క్లాథ్ పాఠశాలల పునఃప్రారంభం రోజున పంపిణీ కష్టమే ఉంటే పాత యూనిఫామ్.. లేదంటే సివిల్ డ్రెస్ వేసుకోవాల్సిందే -
వ్యక్తులు, పార్టీ కన్నా దేశం ముఖ్యం
● రాష్ట్రంలో కాషాయజెండా ఎగురవేయడమే బీజేపీ లక్ష్యం ● పార్టీ రాష్ట్ర ఇన్చార్జి అభయ్పాటిల్సుభాష్నగర్: వ్యక్తుల కన్నా పార్టీ ముఖ్యమని, పార్టీ కన్నా దేశం ముఖ్యమనే సిద్ధాంతాన్ని కార్యకర్తలు గుర్తుంచుకోవాలని, దేశసేవలో ముందు ఉండాలని బీజేపీ తెలంగాణ ఇన్చార్జి అభయ్ పాటిల్ సూచించారు. నగర శివారులోని బోర్గాం(పి) పద్మావతి గార్డెన్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్ అధ్యక్షతన రెండు రోజులపాటు నిర్వహించిన ముఖ్య కార్యకర్తల ప్రశిక్షణ తరగతులు శుక్రవారం ముగిశాయి. కార్యక్రమానికి అభయపాటిల్ ముఖ్యఅతిథిగా హాజరై భవిష్యత్ కార్యాచరణపై పలు కీలక సూచనలు చేశారు. ఎన్నికల్లో గెలవాలంటే పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయడమే ఏకై క మార్గమని స్పష్టం చేశారు. శిక్షణ తరగతులు కేవలం పార్టీని బలోపేతం చేయడానికి మాత్రమే పరిమితం కాదని, కార్యకర్తలలో క్రమశిక్షణను, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడానికి ఉద్ధేశించినవని పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యమని, ఆ దిశగా క్షేత్రస్థాయి నుంచి ప్రతి కార్యకర్త అలుపెరగకుండా శ్రమించాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం రాష్ట్ర ఇన్చార్జీని ధన్పాల్ ఘనంగా సన్మానించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. బీజేపీ భావజాలాన్ని, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ప్రపంచంలో భారత్ గౌరవం పెరిగిందని, మోదీ నేతృత్వంలో అనేక పథకాలు గ్రామస్థాయి వరకు చేరుతున్నాయన్నారు. పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, స్రవంతిరెడ్డి, మేడపాటి ప్రకాశ్రెడ్డి, మోహన్రెడ్డి, మల్లికార్జున్రెడ్డి, భరత్రెడ్డి, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఐఆర్ను పారదర్శకంగా నిర్వహించాలి
● బీఎల్వోలు ఇంటింటిని సందర్శించి సమగ్ర పరిశీలన జరపాలి ● రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిజామాబాద్అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్రెడ్డి సూచించారు. ఎస్ఐఆర్ అమలు తీరు పై శిక్షణ, ఓటరు మ్యాపింగ్ పురోగతిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఈవో శుక్రవారం తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1950 నుంచి ఇప్పటి వరకు దాదాపు పదిసార్లు ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఎస్ఐఆర్ ద్వారా శాశ్వతంగా వలస వెళ్లిన, మరణించిన, డబుల్/డూప్లికేట్ ఎంట్రీల తొలగింపు జరుగుతుందని వివరించారు. ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీనాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించనున్నట్లు తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవల్ అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను పూర్తిస్థాయిలో ధ్రువీకరించాలని ఆదేశించారు. భారత పౌరసత్వ నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని, 1 జులై 1987కు ముందు జన్మించిన వారు తమ స్వీయగుర్తింపు లేదా జనన ఆధార పత్రాలు సమర్పిస్తే సరిపోతుందని, తల్లిదండ్రుల పత్రాలు అవసరం లేదన్నారు. 1 జులై 1987 నుంచి 2 డిసెంబర్ 2004 మధ్య జన్మించిన వారు తమ పత్రాలతోపాటు తల్లి లేదా తండ్రికి సంబంధించి ధ్రువపత్రం సమర్పించాలని, అలాగే 2 డిసెంబర్ 2004 తర్వాత జన్మించిన వారు తల్లిదండ్రులిద్దరి ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్కుమార్, నిజామాబాద్, బాన్సువాడ, బోధన్ ఆర్డీవోలు రాజేంద్రకుమార్, రవీందర్రెడ్డి, విజయ, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, ఏఈఆర్వోలు పాల్గొన్నారు. ఏజెంట్ల నియామకంలో జాప్యం వద్దు బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకాన్ని రాజకీ య పార్టీలు జాప్యం చేయొద్దని, జాబితాను నిర్ణీత ఫార్మాట్లో వెంటనే అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ అమలులో బీఎల్ఏల పాత్ర కీలకమని, కేవలం ఒక పార్టీ మాత్రమే రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన బీఎల్ఏల వివరాలు సమర్పించిందని తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అమలు ప్రక్రియపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కోసం ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా ఎస్ఐఆర్ ను అమలు చేస్తోందని, ఈ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి చేసేలా పర్యవేక్షణ జరపాలని అన్నారు. -
నిజామాబాద్
శనివారం శ్రీ 30 శ్రీ మే శ్రీ 2026పసుపు.. అనగానే దేశ వ్యాప్తంగా గుర్తొచ్చేది నిజామాబాద్ జిల్లా. ఇక్కడి పసుపునకు ఉన్న డిమాండ్ను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జిల్లాలోనే జాతీయ పసుపు బోర్డును సైతం ఏర్పాటు చేసింది. ఇప్పుడు పసుపు ఉత్పత్తుల ఎగుమతుల కేంద్రంగా జిల్లాకు ప్రత్యేక గుర్తింపునిచ్చింది. ఇందులో భాగంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధ్యక్షతన కలెక్టరేట్లో ప్రోత్సాహక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా స్థాయిలో ఎగుమతులను గణనీయంగా పెంచడమే లక్ష్యంగా సదస్సు కొనసాగింది. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
డొంకేశ్వర్(ఆర్మూర్): లాభాపేక్షతో రైతుల కు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విత్తన వ్యాపారులను టా స్క్ఫోర్స్ అధికారులు హెచ్చరించారు. ప్ర భుత్వ ఆదేశా మేరకు జిల్లా కేంద్రంలోని ప లు విత్తన దుకాణాలను అధికారుల బృందం శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేసింది. స్టాక్ రిజిస్టర్లు, బిల్బుక్కులు, విత్తన ప్యాకెట్ల లా ట్ నంబర్లు, సర్టిఫికేషన్, గడువు తేదీల ను పరిశీలించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే దుకాణ లైసెన్స్ రద్దు చేయడంతోపాటు వ్యాపారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఏడీఏ ప్రవీణ్కుమార్, ఎంఏవో మహేందర్రెడ్డి, సీడ్ మేనేజర్ వినయ్, ఏఎస్సై గంగారాం, ఏఈవో చక్రపాణి ఉన్నారు. నిజాంషుగర్స్ ఉద్యమకారులపై కేసు కొట్టివేత బోధన్: నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని, ప్రైవేట్ యాజమాన్యం నుంచి స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడపాలని డిమాండ్తో 2018లో ఉద్యమం చేపట్టిన సమయంలో నాయకులపై పోలీసులు నమో దు చేసిన కేసును విచారణ అనంతరం శుక్రవారం స్థానిక కోర్టు కొట్టివేసింది. బీర్కూర్ బుజ్జి, బీ మల్లేశ్, పుట్ట వరదయ్య, వి రాఘవులు, గుమ్ముల గంగాధర్, జంబిశెట్టి శంకర్గౌడ్, యేశాల గంగాధర్, సుల్తాన్ సాయి లు, సింగం రాములుయాదవ్, గోపి, షేక్బా బు,షేక్ ఫారూఖ్పై పోలీసులు కేసు నమో దు చేసింది. కేసు కోర్టులో ఉన్న కాలంలో వివిధ కారణాలతో రాఘవులు, షేక్బాబు, షేక్ఫారూఖ్ మృతి చెందారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కేసు కొట్టివేత కార్మికులు, రైతులు, బోధన్ ప్రాంత ప్రజల విజయమని పేర్కొన్నారు. నానో యూరియా అంటగడుతున్నారు బోధన్: యూరియా బస్తాలతోపాటు నానో యూరియా, సాగరిక (గుళికలు) తప్పనిసరి గా తీసుకోవాలని సొసైటీ అధికారులు ని బంధన పెడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాలూరలోని సహకార సొసై టీ గోదాము వద్ద శుక్రవారం సాలూర క్యాంప్, సాలూర గ్రామ రైతులు నిరసన తెలిపా రు. అవసరం లేని మందులు అంటగడుతుండడంతో తమపై ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా యాప్ బుకింగ్ ప్రకియపై సరైన అవగాహన లేని సన్న, చిన్నకారు రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇతర గ్రామాల రైతులు బుక్ చేసుకుంటుండడంతో స్థానిక రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. ఇదిలా ఉండగా, నానో యూరియా ఇవ్వాలని అధికారుల నుంచి మార్గదర్శకాలు ఉన్నాయని సొసైటీ నిర్వాహకులు అంటున్నారు. -
డీమ్డ్ ఫారెస్ట్ భూముల గుర్తింపుపై సమీక్ష
డొంకేశ్వర్(ఆర్మూర్): సుప్రీం కోర్టు ఆదేశాల మేర కు జిల్లాలో డీమ్డ్ ఫారెస్ట్, రెవెన్యూ అటవీ భూము లను గుర్తించడానికి కసరత్తు చేసున్నట్లు డీఎఫ్వో సిద్ధార్థ్ విక్రమ్సింగ్, అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో రెవెన్యూ, అటవీ శాఖల ఉద్యోగులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామాలు, సర్వే నంబర్ల వారీగా ఉన్న వివరాలను జియో స్పేషియల్ డేటాతో పోల్చి చూశా రు. యాజమాన్యంతో సంబంధం లేకుండా అటవీ లక్షణాలున్న ప్రతి ల్యాండ్ స్కేప్ను పారదర్శకంగా గుర్తించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అటవీ భూముల ఆక్రమణలు జరగకుండా సరిహద్దులు, నోటిఫికేషన్లను త్వరితగతిన క్రోడికరించాలన్నారు. అటవీ, రెవెన్యూ, సర్వే ల్యాండ్ శాఖలు కలిసి సమన్వయంగా దీనిని పూర్తి చేయాలన్నారు. డీఆర్వో గీత, ఆర్డీవోలు, ఎఫ్డీవోలు, ఎఫ్ఆర్వోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
వడదెబ్బతో వృద్ధుడు మృతి
బోధన్టౌన్(బోధన్): నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బ్రహ్మణ గల్లీకి చెందిన జంగం నాగ్నాథ్ అప్పా (58) వడబెబ్బతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. నాగ్నాథ్ అప్పా దొరికిన పని చేసుకుంటూ ఉండేవాడు. ఉదయం పని నిమిత్తం బయటకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి స్పృహతప్పి పడిపోవడంతో కుబుంబ సభ్యులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి ఒక కూతురు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలి నిజామాబాద్ అర్బన్: ప్రజల ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని డీజీపీ సివీ ఆనంద్ పిలుపునిచారు. శనివారం అన్ని జిల్లాల ఎస్పీ, సీపీలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. సివీ ఆనంద్ మాట్లాడుతూ పెండింగ్ కేసులను వేగవంతంగా దర్యాప్తు చేయాలన్నారు. మహిళాలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు, అక్రమ కార్యకలాపాలను అరికట్టడంలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీడియో కాన్పరెన్స్లో సీపీ సాయిచైతన్య, అదనపు డీసీపీ శుభం ప్రకాశ్, ఏసీపీలు తదితరులున్నారు. మీనాక్షి నటరాజన్ను కలిసిన చంద్రశేఖర్ గౌడ్ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర కల్లు గీత కార్మిక సహకార, ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్ శనివారం హైదరాబాద్లోని కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో రాష్ట్ర కల్లు గీత కార్మిక సహకార, ఆర్థిక కార్పొరేషన్ చైర్మనన్గా అవకాశం కల్పించినందుకు ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతోపాటు రాష్ట్రంలోని కల్లు గీత కార్మికుల ఆర్థిక అభివృద్ధికి పాటుపడాలని ఆమె సూచించినట్లు చంద్రశేఖర్గౌడ్ తెలిపారు. నిజామాబాద్ డీడీవోపీ బదిలీ నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అధికారి (డీడీవోపీ) లక్ష్మినర్సయ్య, హైదరాబాద్ సైబర్ క్రైం బ్యూ రోకు బదిలీ అయ్యారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రంగంపేట్కు చెందిన లక్ష్మీనర్సయ్య 2008లో ఏపీపీగా ఎంపికయ్యారు. సెప్టెంబర్, 2022 నుంచి నిజామాబాద్ సీనియర్ ఏపీపీగా, డీడీవోపీగా విధులు నిర్వహించారు. ఆయన బదిలీ కావడంతో ఇన్చార్జి కోర్టు పీపీగా ఆర్ఎస్ఎల్ గౌడ్ బాధ్యతలను స్వీకరించనున్నారు. త్వరలో డీడీవోపీ పోస్టుకు నూతన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రానున్నట్లు సమాచారం. -
20 స్కూళ్లలో పనులు పూర్తి ..
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో గత ప్రభుత్వ హ యాంలో మన ఊరు – మన బడి, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో మేజర్, మైనర్ మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టారు. ముఖ్యంగా మరుగుదొడ్లు, తాగు నీటి సౌకర్యం, మూత్రశాలల నిర్మాణం, పాఠశాలల కు రంగులు వేయడం, విద్యుత్ సౌకర్యం కల్పించడం, అదనపు తరగతి గదులు నిర్మాణ పనులు చేపట్టారు. సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో కొన్ని పాఠశాలల్లో నిర్మా ణ పనులు సగంలోనే నిలిచిపోయాయి. నియోజకవర్గంలో 78 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 22 ప్రాథమికోన్నత పాఠశాలలు, 248 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఐదు తెలంగాణ మోడల్ స్కూల్స్, మూడు సాంఘిక సంక్షేమ బాలికల గురుకులాలు ఉన్నాయి.ఖలీల్వాడి: నిజామాబాద్ అర్బన్లో నార్త్, సౌత్ మండలాలు ఉన్నాయి. నార్త్ మండలంలో 33 ప్రాథమిక, ప్రాథమికోన్నత, హైస్కూళ్లు ఉన్నాయి. ప్రభుత్వం స్కూళ్ల అభివృద్ధికి నిధులు కేటాయించింది. ఇందులో 20 వరకు స్కూళ్లలో పనులు పూర్తయ్యాయి. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. ఎన్ఆర్ఈజీఎస్ కింద వాష్రూమ్స్ నిర్మించారు. సౌత్ పరిధిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, హైస్కూళ్లు 40 ఉన్నాయి. ఖిల్లాలోని హైస్కూలు, కోటగల్లీలోని బాలికల హైస్కూల్ శిథిలావస్థలో ఉండటంతో పైకప్పు రేకులతో నిర్మించారు. పులాంగ్ స్కూల్లో 200 మంది విద్యార్థులు ఉండగా ఇందులో రెండే బ్రాత్రూమ్లు ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కసాబ్గల్లీలో ఎమ్మెల్సీ నిధులతో రెండు తరగతి గదులకు పనులు కొనసాగుతున్నాయి. విభాగం మొత్తం అద్దె బీసీ 33 12 సాంఘిక 32 0 ఎస్టీ 10 2 మైనారిటీ 01 0 కేజీబీవీలు 27 2 ప్రాథమిక ప్రాథమికోన్నత జడ్పీ, మండల పరిషత్ 769 132 255సంక్షేమ హాస్టళ్లుజిల్లాలోని గురుకుల పాఠశాలలుప్రభుత్వ స్కూళ్ల సమాచారం -
సుంకెట్ ఉన్నత పాఠశాలలో..
● డైనింగ్ హాళ్ల పనులు పెండింగ్ ● మధ్యాహ్న భోజనానికి ఇబ్బందులు పడుతున్న విద్యార్థులుమోర్తాడ్(బాల్కొండ): బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ పాఠశాలల్లో డైనింగ్ హాల్ల నిర్మాణాలు అసంపూర్తిగానే ఉన్నాయి. మన ఊరు మన బడి కార్యక్రమం కింద డైనింగ్ హాల్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టారు. ఇప్పటికీ పనులు పూర్తి కాకపోవడంతో విద్యార్థులు మధ్యాహ్న భోజనం చెట్ల కింద, వరండాలలోనే చేస్తున్నారు. డైనింగ్ హాల్లు అందుబాటులోకి వస్తే స్కూళ్ల పరిసరాలు దెబ్బతినకుండా ఉంటాయి. మోర్తాడ్, సుంకెట్తో పాటు నియోజకవర్గంలోని వివిధ పాఠశాలల్లో డైనింగ్ హాళ్ల అసంపూర్తిగానే ఉన్నాయి. ధర్మోరాలో అదనపు గదుల నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో దాత సహకారంతో పనులు పూర్తి చేశారు. వసతి గృహాలకు సంబంధించి కొన్ని చోట్లనే సౌకర్యాలను మెరుగుపరిచారు. -
నిజామాబాద్
ఆదివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2026చదువు నేర్చుకునే చోటే పిల్లలకు ప్రమాదకర పరిస్థితులు.. పైకప్పు ఎప్పుడు కూలుతుందో తెలియని శిథిల భవనాల్లో ప్రభుత్వ పాఠశాలలు.. నిధులు లేక నిలిచిపోయిన అసంపూర్తి పనులు పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. పాఠశాలల భవనాల నిర్మాణాలు అర్ధంతరంగా నిలిచాయి. తరగతి గదుల కొరత, మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని పాఠశాలలకు ఉపాధి హామీ పథకం కింద మరుగుదొడ్లు మంజూరైనా నిర్మాణాలు చేపట్టడం లేదు. అరకొర వసతుల మధ్య అద్దె భవనాల్లో సంక్షేమ హాస్టళ్లు కొనసాగుతున్నాయి. మరో రెండు వారాల్లోపు నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, వసతిగృహాల స్థితిగతులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు.నిధులు విడుదల కాక.. -
సమస్యల వలయంలో పాఠశాలలు
ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గంలోని పలు ప్రభు త్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సమస్యలు లేకుండా ఉండగా, మరికొన్ని పాఠశాలలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆ ర్మూర్ పట్టణం రామ్నగర్లోని బీసీ బాలికల వసతి గృహం భవనం శిథిలావస్థలో ఉంది. భవనం పైకప్పులు పెచ్చులు ఊడుతూ ప్రమాదకరంగా మారా యి. దీంతో భవనం ఒకవైపు మాత్రమే వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం హాస్టల్లో 50 మంది విద్యార్థులే ఉన్నారు. హాస్టల్ భవనం బాగుంటే మరో 50 మంది వరకు విద్యార్థులు వసతి గృహానికి వచ్చే అవకాశం ఉంది. జిరాయత్ నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గత ప్రభుత్వం భవన నిర్మాణం కోసం నిధులు వెచ్చించినప్పటికీ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఈ పాఠశాలలో విద్యార్థులకు మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్ రామ్ మందిర్ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మరుగు దొడ్లు లేకపోవడంతో రెంటి కోసం ఇంటికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఆర్మూరు, ఆలూరు మండలాల్లోని తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య కొనసాగుతున్నాయి. డొంకేశ్వర్ మండలం తొండకూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు–మన బడి పనులు మూడేళ్లుగా నిలిచిపోవడంతో డైనింగ్ హాల్, టాయిలెట్ల నిర్మాణం పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఆర్మూర్లో అద్దె భవనంలో కొనసాగుతున్న మైనారిటీ గురుకులం తొండాకూర్ జెడ్పీ హైస్కూల్లో మూడేళ్లుగా పూర్తి కాని డైనింగ్ హాల్ నిర్మాణం -
హిందీ సాహిత్యంలో దిట్ట
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇందూరు జిల్లాకు చెందిన శ్రీమన్నారాయణచారి హిందీ పండిత్గా పనిచేస్తూనే హిందీ సాహిత్యంపై మక్కువతో ఎంపిక చేసుకున్న వివిధ అంశాలపై నిరంతరం అనేక పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో వేలాది రచనలు, పాటలు రాస్తూ వస్తున్నారు. జాతీయ స్థాయి లో హిందీ సాహిత్యంపై గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో నిర్వహించిన పోటీల్లో పలుసార్లు ప్రథమ స్థానాలను గెలుచుకుని గౌరవ సత్కారాలు అందుకున్నారు. మరోవైపు జాతీయ స్థాయి హిందీ సాహిత్య మాస పత్రికల ముఖచిత్రాలుగా శ్రీమన్నారాయణచారి ఫొటోలను ముద్రించడం ఆయనకే కాకుండా జిల్లాకు సైతం గర్వకారణంగా నిలిచింది. జాతీయ స్థాయిలో హిందీ కవిగా, రచయితగా ఇందూరు జిల్లా ఖ్యాతి నిలబెట్టడంతో పాటు తెలుగులోనూ పాటలు రాస్తుండడం గమనార్హం. కాగా ‘విరాట్’ అనే కలం పేరుతో శ్రీమన్నారాయణ రచనలు చేస్తున్నారు. రెంజల్ మండలంలోని నీల గ్రామానికి చెందిన శ్రీమన్నారాయణ రాసిన పాటలు లోతైన భావం, అర్థంతో కూడుకుని ఉంటాయని సాహిత్య అభిమానులు చెబుతున్నారు. ప్రజలను ఆలోచింపజేసే విధంగా పాటలు, రచనలు చేస్తున్నారని పలువురు ప్రశంసిస్తున్నారు. జాతీయ స్థాయి వేదికలపై హిందీ ఉపన్యాసాలు, కవితలతో తనదైన ముద్ర వేసుకుంటున్నారు శ్రీమన్నారాయణ. జాతీయ స్థాయిలోనూ ఈయన కవితలకు మంచి జనాదరణ లభిస్తుండడం విశేషం. తెలుగులోనూ ఇటీవల ఆయన రాసిన ‘శతవసంత పతమునందు ప్రవహించే గంగ ఇది’ పాట తెలుగు రాష్ట్రాల్లో ప్రశంసలు అందుకుంది. పలు సినిమాలకు సైతం శ్రీమన్నారాయణ బాణీలను అందించారు. ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర పై విశేష పరిశోధన చేస్తూ శివాజీ జీవితానికి సంబంధించి అనేక స్ఫూర్తిదాయకమైన కవితలను, పాటలను రచించారు. ప్రస్తుతం ఛత్రపతి శివాజీ జీవితం మొత్తాన్ని అధ్యయనం చేసి ఒక పుస్తక రూపంలో తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా మహాదేవుడి భక్తి పాటలు, శ్రీరాముడి అయోధ్య భూమి చరిత్ర పాటలు, జనాలను ఆలోచింపజేసే స్ఫూర్తిదాయకమైన పాటలు, తన్మయత్వంలోకి తీసుకెళ్లే భక్తి పాటలు రాస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. హిందీ, తెలుగు భాషల్లో అనర్గళంగా ఉపన్యాసం ఇవ్వగలిగే శ్రీమన్నారాయణ అనేక కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగానూ వ్యవహరించారు. మాజీ గవర్నర్లు జిష్ణుదేవ్ వర్మ, బండారు దత్తాత్రేయ, వివిధ హిందీ రాష్ట్రాలకు చెందిన మంత్రులు శ్రీమన్నారాయణ రచనలను చదివి ప్రశంసలు అందించారు. తన ప్రతిభతో అనేక సత్కారాలు, బిరుదులు సాధించిన శ్రీమన్నారాయణ దేశభక్తుల జీవిత చరిత్రలు, సమకాలీన అంశాలను క్రోడీకరిస్తూ అనేక స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలను దేశవ్యాప్తంగా ఇస్తుండడం అభినందనీయం. ఆయన ఇందూరు ఆణిముత్యం అవార్డును పొందారు. జాతీయ స్థాయిలో రాణిస్తున్న శ్రీమన్నారాయణ మాసపత్రికలపై ఆయన ముఖచిత్రాలు కలం పేరు ‘విరాట్’.. వేలాది రచనలు, పాటలు కవి సమ్మేళనాల్లో పలుమార్లు ప్రథమ బహుమతులు -
ఇరుకు గదుల్లో..
బోధన్: బోధన్ రెవెన్యూ డివిజన్ లోని సర్కారు బడుల్లో చాలా చోట్ల భవనాలు శిథిలావస్థకు చేరాయి. సాలూర మండలంలోని హు న్సా మండల పరిషత్ ఉన్నత పాఠ శాల పాత భవనంలో నాలుగు గదులు శిథిలావస్థకు చేరగా, ఇందులో రెండు గదుల ను కూల్చివేశారు. రేకుల షెడ్డులో తరగతి గదులు నిర్వహిస్తున్నారు. ఐదేళ్ల క్రితం రూ. కోటితో చేపట్టి న నూతన భవనం అర్ధంతరంగా నిలిచిపోయింది. నిధులు మంజూరు కాక పనులు ముందుకు సాగడం లేదు. సాలూర పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్లో తరగతి గదుల కొరత ఉంది. నాలుగు గదులు శిథిలావస్థకు చేరాయి. 10 తరగతులకుగాను ఐదు గదులే ఉన్నాయి. వరండాలు, చెట్ల కింద చదువులు కొనసాగిస్తున్నారు. బోధన్ పట్టణంలోని శక్కర్నగర్ మధుమలాంఛ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏడు గదులు రేకుల షెడ్డులో తరగతులు నిర్వహిస్తున్నారు. కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, సైన్స్ల్యాబ్లు లేవు. పెంటాకుర్ధు క్యాంప్ జడ్పీహెచ్ఎస్లో తరగతి గదుల కొరత వల్ల విద్య బోధనకు ఇబ్బందికరంగా మారింది. ఐదు గదులు శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా ఉన్నాయి. రుద్రూర్ మండల కేంద్రంలోని హరిజనవాడ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకుచేరి కూలిపోయే దశలో ఉంది. పక్కనే ఉన్న సంస్కార్ సంస్థ కు సంబంధించిన భవనంలో పాఠశాలను నడుపుతున్నారు. రోడ్డు వెడల్పు పనుల్లో మరుగుదొడ్లను కూల్చివేయగా అసౌకర్యంగా మారింది. జవహార్నగర్ పాథమిక పాఠశాలలో మరుగుదొడ్లు అసలే లేవు. పోతంగల్ మండలంలోని కొల్లూరు గ్రామ పంచాయతీ భవనంలో ప్రాథమిక పాఠశాలను చేసి నడుపుతున్నారు. కొత్త భవన నిర్మాణం పనులు రెండేళ్లుగా నిలిచిపోయాయి.లింగాపూర్ ప్రాథమిక పాఠశాలను జీపీ భవనంలో నిర్వహిస్తున్నారు. కోటగిరి మండల కేంద్రంలో మైనారిటీ గురుకులను షాదీఖానాలో కొనసాగిస్తున్నారు. రెంజల్ మండలం సాటాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల భవనంలో ఏడు గదులుండగా, ఇందులో నాలుగు గదులు శిథిలావస్థలో ఉన్నాయి. బోధన్ పట్టణంలోని రాకాసీపేటలో ఎస్సీ బాలుర హాస్టల్ శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనంలో కొనసాగుతోంది. నాలుగు ఇరుకు గదుల్లో విద్యార్థులకు వసతి కల్పిస్తున్నారు. పట్టణంలోని బీసీబాలుర, ఎస్టీ బాలుర హాస్టల్స్ అద్దె భవనాల్లో విద్యార్థుల పాఠశాలలకు కొంత దూరంలో ఉండటం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. పోతంగల్ మండలం కొల్లూరు జీపీ భవనంలో నిర్వహిస్తున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఐదేళ్లుగా పిల్లర్ల స్థాయి దాటని హున్సా మండల పరిషత్ ఉన్నత పాఠశాల భవన నిర్మాణం పేరు ఒక చోట.. గురుకులాలు మరో చోట సాలూర బీసీ బాలికల గురుకుల పాఠశాల, ఎడపల్లి బీసీ బాలుర గురుకుల పాఠశాలలను బోధన్ పట్టణ కేంద్రంలోని ఆచన్పల్లి, గంజ్ ప్రాంతంలోని అద్దె భవనాల్లో కొన్నేళ్ల నుంచి కొనసాగుతున్నాయి. నవీపేట బీసీ బాలికల గురుకుల పాఠశాలను నిజామాబాద్ నగర కేంద్రంలో నడుపుతున్నారు. ఈ గురుకులాలకు సొంత భవనాలు లేవు. -
ట్రాక్టర్ బోల్తా: డ్రైవర్కు గాయాలు
రుద్రూర్: మండల కేంద్రంలో ని జవహర్నగర్ కాలనీ సమీపంలో ప్రమాదవశాత్తు ట్రాక్ట ర్ బోల్తా పడగా,డ్రైవర్ తీ వ్రంగా గాయపడ్డాడు.స్థానికు లు తెలిపిన వివరాలు ఇ లా.. కోటగిరి మండలం ఎత్తొండ నుంచి సిమెంట్ బస్తాలను ట్రాక్టర్లో లోడ్ చేసుకొని డ్రైవర్ భూమేష్ శనివారం సాయంత్రం వర్ని మండలం కోట య్య క్యాంపునకు బయలుదేరాడు.జవహర్నగర్ కాలనీ వద్ద ప్రధాన ర హదారిపై ట్రాక్టర్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ భూమేష్ ట్రాలీ కింద ఇరుక్కుపోయాడు. వెంటనే స్థా నికు లు స్పందించి ట్రాలీ కింద నుంచి డ్రైవర్ను బయటకు తీసి, పోలీసులకు సమాచారం అందించారు.వారు ఘటన స్థలానికి చేరుకొని,వివరాలు సేక రించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం బోధన్ ఆస్పత్రికి తరలించారు. వడ్ల లారీ బోల్తా లింగంపేట(ఎల్లారెడ్డి): నల్లమడుగు పెద్ద తండా శివారులో శనివారం వడ్ల లారీ బోల్తా పడినట్లు తండావాసులు తెలిపారు. నల్లమడుగు– గాంధారి రోడ్డులో లారీ అదుపు తప్పి పడిపోవడంతో అందులో ఉన్న డ్రైవర్, క్లీనర్లకు స్వల్ప గాయాలయ్యాయి. లారీ బోల్తా పడిన సమయంలో వాహనాలు, జన సంచారం లేకపోవడంతో ప్రమాదం తప్పిందని తండావాసులు తెలిపారు. ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మండలం మంథని గ్రామంలో శనివారం పేకాట స్థావరంపై చీతా ఫోర్స్ దాడి నిర్వహించి పేకాడుతున్న 9మందిని అరెస్టు చేశారు. అలాగే వారి వద్ద నుంచి 10 ఫోన్లు, 3 కార్లు, ఒక ద్విచక్ర వాహనం, రూ. 4,880 నగదును స్వాధీనం చేసుకున్నారు. వాటిని స్థానిక పోలీస్స్టేషన్కు తరలించారు. తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. -
ప్రభుత్వ తీరుపై నారాజ్
● ఎన్నారై అడ్వయిజరీ బోర్డు సభ్యత్వానికి రవిగౌడ్ రాజీనామా మోర్తాడ్(బాల్కొండ): గల్ఫ్ వలస కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కార్యాచరణ రూపొందించడానికి ఏర్పాటు చేసిన ఎన్నారై అడ్వయిజరీ బోర్డు సభ్యుడైన గుగ్గిల్ల రవిగౌడ్ రాజీనామా చేయడం కలకలం సృష్టించింది. గల్ఫ్ జేఏసీ చైర్మన్గా వలస కార్మికుల పక్షాన ఉద్యమాలను కొనసాగించిన రవిగౌడ్ను గత ఏడాది ఏప్రిల్లో ఏర్పాటు చేసిన ఎన్నారై అడ్వయిజరీ బోర్డులో సభ్యునిగా ఎంపిక చేశారు. కమిటీ ఏర్పాటు చేసి 14 నెలలు దాటినా ఎలాంటి కార్యాచరణ ముందుకు సాగక పోవడంతో ప్రభుత్వ తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ శనివారం సలహా కమిటీ చైర్మన్ డాక్టర్ వినోద్కుమార్కు తన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖ రాశారు. రవిగౌడ్ తీసుకున్న నిర్ణయం గల్ఫ్ వలస కార్మికుల సంఘాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. జగిత్యాల్ జిల్లా మేడిపల్లి మండలానికి చెందిన రవిగౌడ్ గల్ఫ్కు వలస వెళ్లి అక్కడ మన కార్మికుల పక్షాన ఎన్నో పోరాటాలను చేశారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న వలస కార్మికులకు రవిగౌడ్ అండగా ఉండటంతో ఆయనను జేఏసీ చైర్మన్గా ఎంపిక చేశారు. అడ్వయిజరీ బోర్డు నామమాత్రంగానే ఉందనే అభిప్రాయం కొన్ని నెలల నుంచి వలస కార్మికుల సంఘాల్లో చక్కర్లు కొడుతోంది. రెండేళ్ల కాలపరిమితిలో ప్రవాసీ విధానం రూపకల్పన కోసం అడ్వయిజరీ బోర్డు నివేదిక అందించాల్సి ఉంది. ఇప్పటి వరకూ సరైన కార్యాచరణ లేకపోవడంతో ప్రవాసీ విధానంపై నీలినీడలు కమ్ముకున్నాయి. -
యాడున్నడో.. ఎట్లున్నడో?
● దుబాయ్లో దొరకని దత్తాపూర్ వాసి ఆచూకీ ● పది రోజుల క్రితమే గల్ఫ్కి వెళ్లిన జంగం రాజన్న ● ఆందోళనలో కుటుంబ సభ్యులు డొంకేశ్వర్(ఆర్మూర్): ఉపాధి కోసం ఇటీవల గల్ఫ్కు వెళ్లిన డొంకేశ్వర్ మండలం దత్తాపూర్ వాసి జంగం రాజన్న ఆచూకీ దొరకడం లేదు. పది రోజులుగా ఇంటికి ఫోన్ చేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వివరాలు ఇలా.. దత్తాపూర్కు చెందిన జంగం రాజన్నది (48) పేద కుటుంబం. ఊరిలోనే డప్పు కొడుతూ ఉన్న కొద్ది భూమిలో వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెద్ద కొడుకు రమేశ్ను ఇటీవల దుబాయ్కి పంపించాడు. తను కూడా ఈ నెల 22న దత్తాపూర్ ఏజెంట్ ద్వారా ఓ కంపెనీలో పని చేయడానికి దుబాయ్కు వెళ్లాడు. ఫ్లైట్ దిగిన వెంటనే తాను క్షేమంగా చేరుకున్నట్లు ఇంటికి ఫోన్ చేశాడు. కంపెనీ రూం నుంచి బయటికి వెళ్లిన రాజన్న మళ్లీ తిరిగి రూమ్కు రాలేదు. రాజన్న తప్పిపోయి, తిరుగుతున్నాడని నిర్మల్కు చెందిన ఓ వ్యక్తి ద్వారా నాలుగు రోజుల క్రితం కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చింది. రాజన్నను భద్రంగా కంపెనీ రూము వద్దకు తీసుకెళ్లినట్లుగా చెబుతున్నప్పటికీ ఆయన ఆచూకీపై ఇప్పటివరకు స్పష్టత రావడం లేదు. అక్కడున్న పని చేస్తున్న వ్యక్తులు కూడా సరైన సమాచారం ఇవ్వడం లేదని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. దుబాయ్లో ఉన్న కొడుకు రమేష్ సైతం తండ్రి కోసం వెతుకుతున్నాడు. ఇటు ఇంటి వద్ద ఉన్న భార్య అనిత, చిన్న కొడుకు రిషి రాజన్న జాడ తెలియక యాడున్నడో... ఎట్లున్నడో అని నిత్యం ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి రాజన్న జాడను తెలుసుకొచి ఇంటికి రప్పించాలని వేడుకుంటున్నారు. -
నేను గీసిన చిత్రం
బి. మేదశ్రీ 9వ తరగతి, జెడ్పీహెచ్ఎస్, పిట్లం, కామారెడ్డి ఏ. గ్రీష్మంత్ చంద్ర, 10వ తరగతి, జెడ్పీహెచ్ఎస్, ఐలాపూర్, మం: నందిపేట్, జిల్లా : నిజామాబాద్ యశస్వి మహదేవ్ 9వ తరగతి, వాసవి స్పేస్ స్కూల్, మహాలక్ష్మినగర్, నిజామాబాద్ జ్ఞానదీప్, 10వ తరగతి, ఎస్.ఆర్ ప్రైమ్ స్కూల్, నిజామాబాద్ తిరునగరి అక్షిత స్వప్నిల్, నిజామాబాద్ -
నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి
● కలెక్టర్ ఇలా త్రిపాఠి ● కలెక్టరేట్లో మాక్ పార్లమెంట్ నిర్వహణ నిజామాబాద్ అర్బన్: విద్యార్థి దశ నుంచే బాలికలు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ‘ప్రజా పాలన– ప్రగ తి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టరేట్లో కిశోర బాలికలతో మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు చెందిన బాలికలు స్పీకర్, డిప్యూటి స్పీకర్, ముఖ్యమంత్రి, మంత్రులు, శాసన సభ్యులు, ప్రతిపక్ష సభ్యుల పాత్రలను పోషిస్తూ సభా కార్యక్రమాలను నిర్వహించారు. మహిళా సాధికారత, బాలికల విద్య, ఆ రోగ్యం, భద్రత, ఉపాధి అవకాశాలు, సమాజ అభివృద్ధి తదితర అంశాలపై ఎమ్మెల్యేలుగా వ్యవహరించిన వారు ప్రశ్నలను లేవనెత్తగా, మంత్రుల పాత్ర ను పోషించిన బాలికలు సమాధానాలు తెలుపుతూ మహిళలు, బాలికల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. బాలికలు అన్ని రంగాల్లో రాణిస్తూ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. అదనపు డీసీపీ శుభం నగ్రా లే, డీఆర్డీవో సాయన్న, డీఈవో అశో క్, డీఎంహెచ్వో రాజశ్రీ, జిలా సంక్షేమ అధికారిణి పద్మ, విద్యార్థినులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నీటిగుంతలో మునిగి యువకుడి మృతి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): కృష్ణాజీవాడి గ్రామానికి చెందిన సర్జన ప్రవీణ్(23) అనే యువకు డు నీటిగుంతలో ఈత కు దిగి మునిగి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. ప్రవీణ్ మరికొంతమంది స్నేహితులతో కలిసి శనివారం మండలంలోని అబ్దుల్లా నగర్ శివారులో గల కంకర మిషన్ క్వారీ నీటిగుంతలో స్నానం చేయడానికి వెళ్లారు. స్నేహితులు గుంతలో దిగి ఈత కొడుతుండగా ప్రవీణ్ కూడా స్నానం చేయడానికి నీటి గుంతలో దిగాడు. ప్రవీణ్కు ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. ఇది గమనించిన స్నేహితులు గుంతలో నుంచి ప్రవీణ్ను బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రవీణ్ను చికిత్స నిమిత్తం గ్రామంలో ఉన్న ఓ ఆర్ఎంపీ దగ్గరకు తీసుకెళ్లారు. ప్రవీణ్ను చూసిన ఆర్ఎంపీ అప్పటికే మృతిచెందాడని ని ర్ధారించారు. మృతుడి తండ్రి భిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభు త్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. నవీపేట:మండలంలోని బినో లకు చెందిన మేకల సాయిలు (60) అనే అదృశ్యమైనట్లు ఎస్సై శ్రీకాంత్ శనివారం తెలిపారు.ఈనెల 28న ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన సాయి లు తిరిగి రాలేదన్నారు. భా ర్య, కుమారుడితో ఇటీవల స్వల్ప వాగ్వాదం జరగడంతో మనస్తాపం చెంది, ఇంట్లో నుంచి వెళ్లాడని తెలిపారు.కుటుంబ సభ్యులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో సాయిలు భార్య మేకల లింగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో జిల్లావాసులు
నిజామాబాద్ అర్బన్/ జక్రాన్పల్లి: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో జిల్లావాసులు చోటు సాధించారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలోగల విక్టరీ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన గిన్నిస్ అచీవర్స్ మీట్ కార్యక్రమంలో నిజామాబాద్కు చెందిన ఉందింటి విపుల్ ఉమీత్ రాజ్, జక్రాన్పల్లి మండలం కేశ్పల్లి గ్రామానికి చెందిన కొట్టం రాజశేఖర్ గిన్నిక్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సర్టిఫికేట్, పతకాన్ని అందుకున్నారు. ఇటీవల గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి పర్యవేక్షణలో భారీస్థాయి ఎలక్ట్రానిక్ కీబోర్డ్ సంగీత వాయిద్య పోటీలు ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లావాసులు ప్రతిభ చాటి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో సాధించారు. రామారెడ్డి: మండలంలో ఇందిరమ్మ ఇళ్లు, సొంత నిర్మించుకునే వారికి ఇసుక, మొరం తరలింపునకు అనుమతి లేక ఇండ్ల నిర్మాణం మధ్యలోనే ఆగిపోతున్నాయని శనివారం తహసీల్దార్ ఉమాలత, ఎస్సై రాజశేఖర్కు బీజేపీ నేతలు విన్నవించారు. ఈ మేరకు వారు వినతి పత్రాలు ఇచ్చారు. ఎమ్మెల్యే స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు నోముల సందీప్, బీజేపీ మాజీ మండల అధ్యక్షులు గడ్డం ప్రసాద్, యువ మోర్చా జిల్లా కార్యదర్శి ఇసాయిపేట నరేష్ పాల్గొన్నారు.గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్లు అందుకుంటున్న ఉమీత్రాజ్, రాజశేఖర్ -
సాహిత్య బడి.. కొత్త ఒరవడి
● వాట్సాప్ వేదికగా కవితాకార్యశాల ● నవతరం కవులకు మార్గదర్శకం ● కవితారచనపై అవగాహన ● నేడు కవి సమ్మేళనం నిజామాబాద్ రూరల్ : కవిత్వం ఒక సృజనాత్మక, విలక్షణ పక్రియ. ప్రతి సాహిత్య పక్రియ ప్రత్యేకమైనదే.అలాంటి కవిత్వంపై ఈతరం కవులకు మార్గదర్శనం చేస్తోందీ‘సాహిత్య బడి’సమూహం. సాంకేతికతను అందిపుచ్చుకొని వాట్సాప్ వే దికగా నిత్యం కవితా కార్యశాలను నిర్వహిస్తోంది. రోజుకో అంశంపై.. ఇందూరు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు మద్ద కూరి సాయిబాబు, నిర్వాహకులు కాసర్ల నరేశ్రావు ప్రారంభించిన ఈ వాట్సాప్ సమూహంలో జిల్లాకు చెందిన 100 మంది కవులు ఉన్నారు. ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు సమూహసభ్యులకు, ఆ రోజు రాయాల్సిన కవితా అంశాన్ని, ప్రక్రియను సూచిస్తారు. సాయంత్రం 6 గంటలలోపు అందరూ రాయాలి. అలా రాసిన కవితలను రాత్రి 8 నుంచి 9 గంటల వరకు పెద్దలు సమీక్ష చేస్తారు. ఇలా ప్రతిరోజు కొత్త అంశంపై విభిన్న ప్రక్రియలతో ఈ కవితా కార్యశాల కొనసాగుతోంది. సోమవారం పద కవిత, మంగళవారం వర్ణీయ కవిత, బుధవారం వచన కవిత, గురువారం గేయ కవిత, శుక్రవారం చిత్ర కవిత, శనివారం మినీ కవిత, ఆదివారం స్వేచ్ఛా కవితపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతినెల చివరి ఆదివారంలో సభ్యులంతా కలిసి సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. కార్యక్రమానికి ప్రముఖ కవులను అతిథులుగా ఆహ్వానించి వారితో కవితారచనలో మెళకువలను వివరిస్తున్నారు. ఉత్తమ కవితలు రాసిన వారిని సన్మానిస్తున్నారు. ఈ నెల 31న సాహిత్య బడి ఇందూరు జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించనున్న కవి సమ్మేళనం కార్యక్రమానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత రమేశ్ కార్తిక్ నాయక్ అతిథిగా రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. యువ కవుల రచనలను ప్రోత్సహించడం, మెళకువలను నేర్పించడం కోసమే సాహిత్య బడిని ఏర్పాటు చేసుకున్నాం. మద్దుకూరి సాయిబాబు ఆలోచన నుంచి ఆవిర్భవించిన సమూహమిది. రెండు నెలలుగా నిరాటంకంగా కొనసాగుతోంది. ఇందులో విద్యార్థులు, యువకులు, వర్తమాన కవులు చాలామంది ఉన్నారు. – డాక్టర్ కాసర్ల నరేశ్ రావు, కార్యశాల నిర్వాహకులు మంచి వేదిక.. ఈ తరంలో కవితలు రాస్తున్నవారికి, కవితారచన నేర్చుకోవడానికి మంచి వేదికగా సాహిత్య బడిని ప్రారంభించుకున్నాం. చాలామంది కవులు ఈ వేదిక ద్వారా రోజు కవిత్వం రాస్తున్నారు. వివిధ పత్రికల్లో ఈ సమూహంలోని సభ్యుల కవితలు వస్తున్నాయి. కవితలపై తర్ఫీదునిస్తూ రోజురోజుకూ యువ కవులు రాటుదేలేలా, సాహిత్య బడి పెద్దల పర్యవేక్షణలో నడుస్తున్నది. – డా.మద్దుకూరి సాయిబాబు, నిర్వహణ కమిటీ సభ్యులు -
మాజీమంత్రి సంతోష్రెడ్డికి పరామర్శ
మోపాల్: మాజీ మంత్రి, సీనియర్ నాయకులు శనిగరం సంతోష్రెడ్డి, ఆయన కుమారుడు శ్రీనివాస్రెడ్డి (వాసుబాబు)ని శనివారం హైదరాబాద్లోని వారి నివాసంలో రాష్ట్ర కల్లుగీత కార్మిక సహకార, ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ బాడ్సి చంద్రశేఖర్ గౌడ్, డీసీసీ ప్రధానకార్యదర్శి గడ్కోల్ భాస్కర్రెడ్డి పరామర్శించారు. సంతోష్రెడ్డి సతీమణి విజయారెడ్డి ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో వారి కుటుంబీకులను ఇరువురు ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా సంతోష్రెడ్డి ఆరోగ్యం, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. భిక్కనూరు: తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్లో పీజీ సెంటర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ పూ ర్వ విద్యార్థులు (1999–2001) సిల్వర్ జూబ్లీ సమ్మేళనం శనివారం నిర్వహించుకున్నారు. పీజీ సెంటర్లో ఆర్గానిక్ కెమిస్ట్రీని అభ్యసించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 22 మంది విద్యార్థులు ఈ సిల్వర్ జూబ్లీ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆనాటి బ్యాచ్ విద్యార్థులు అందరూ ఉన్నత స్థానాల్లో ఉండటం హర్షణీయమని ప్రిన్సిపాల్ సుధాకర్గౌడ్, బాలుర హాస్టల్ వార్డెన్ యాలాద్రి అన్నారు. వీరందరూ ఫార్మ, ఇతర వ్యాపార రంగాలలో దేశ విదేశాల్లో స్థిరపడటం ఎంతో గర్వకారణమన్నారు. పూర్వ విద్యార్థుల కమిటీ సభ్యులు ఎంబీ.లక్ష్మణ్, పి.రాజు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్: అన్నదాతలు ఆర్గానిక్ పంటల సాగుపై ఆసక్తి చూపాలని రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ అన్నారు. హైదరాబాద్లో శనివారం ఏర్పాటు చేసిన ఆర్గానిక్ మేళాలో గంగాధర్ పాల్గొని, మాట్లాడారు. సేంద్రియ పద్ధతి ద్వారా పండించిన పంటలతో ప్రజలకు ఆరోగ్యంతోపాటు అనేక పోషక విలువలతో కూడిన నాణ్యమైన ఆహారం లభిస్తుందన్నారు. రైతులు సేంద్రియ వ్యవసాయానికి ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. రసాయన ఎరువులు, మందులు పిచికారీ చేయకుండా ఉండాలన్నారు. అంతకుముందు మేళాలో ఏర్పాటు చేసిన పలు ఆర్గానిక్ ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఇతర సభ్యులు పాల్గొన్నారు. -
జీవాలను నీడ పట్టున ఉంచాలి
జిల్లా పశుసంవర్ధక శాఖ సూచనలు డొంకేశ్వర్ (ఆర్మూర్) : తీవ్రమైన ఎండలతోపాటు వడగాలుల ప్రభావంతో మనకే కాదు మూగజీవాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనుషులకు ఎండదెబ్బ తగులుతోంది. అలాంటిది బయట మేతకోసం సంచరించే పశువులు, గొర్రెలు, మేకలతోపాటు పక్షులు ఎంత అల్లాడుతున్నాయో చెప్పనక్కర్లేదు. మండుతున్న ఎండల బారి నుంచి మూగజీవాలను ఏ విధంగా కాపాడుకోవాలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు ‘సాక్షి’కి వివరించారు. ● గొర్రెలు, మేకలు, గేదెలు, ఆవులను ఎక్కువగా తిప్పకూడదు. వీలైనంత వరకు చల్లని ప్రాంతాల్లో, నీడపట్టున ఉంచాలి. ఇంటి వద్ద రేకుల షెడ్డు ఉన్న వారు పైన వరిగడ్డి ఉంచితే వేడి ప్రభావం తగ్గుతుంది. వీలైతే ఫ్యాన్లు కూడా పెట్టాలి. ● మేతను ఎక్కువగా ఇంటి వద్దే అందించేలా ఏర్పాట్లు చేసుకోవాలి. బయటకు తీసుకెళ్లడం తప్పనిసరైతే, ఉదయం 6 నుంచి 10 గంటల్లోపు తీసుకెళ్లాలి. మళ్లీ సాయంత్రం 5 దాటిన తర్వాత మరోసారి మేతకు తీసుకెళ్లాలి. ● వేసవిలో పశువులు ఎక్కువ మోతాదులో నీటిని తాగుతాయి. వాటికి సరిపడా చల్లని, శుభ్రమైన నీటిని అందించాలి. ఒక్కో గేదె 50 లీటర్ల నీళ్లు తాగేలా చూడాలి. మేత, దానా పచ్చి రూపంలో అందిస్తే బాగుంటుంది. ● ఇళ్లలో పెంచుకునే కుక్కలు, పిల్లుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఎల్లప్పుడూ నీడ పట్టున ఉంచి క్రమం తప్పకుండా ఆహారం, నీటిని అందించాలి. పక్షుల కోసం ఇంటి బయట గిన్నెలు, పాత్రల్లో నీటిని పోసి ఉంచాలి. ● పశువులు, గొర్రెలు, మేకలు, పెంపుడు కుక్కలు ఎండ ప్రభావానికి, ఎండదెబ్బకు గురైతే వాటి శరీరం వేడిగా, పొడిబారి ఉంటుంది. వెంటనే తడిబట్టతో తుడవాలి, లేదా కప్పి ఉంచాలి. ఆరోగ్యం క్షీణిస్తే వెంటనే స్థానిక పశువైద్య అధికారులకు సమాచారం అందించాలి. -
వీధి కుక్క దాడిలో బాలుడికి గాయాలు
డిచ్పల్లి (నిజామాబాద్రూరల్): మండలంలోని మెంట్రాజ్పల్లి గ్రామంలో వీధి కుక్క దాడిలో ఓ బాలుడికి గాయాలయ్యాయి. శుక్రవారం ఉదయం వీధిలో ఆడుకుంటున్న మగ్గిడి సాయి హర్షిత్ అనే నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి చేసి గాయపరిచింది. బాలుడి అరుపులు విన్న తల్లిదండ్రులు మగిడి పద్మ, మగ్గిడి వినోద్ వెంటనే బయటకు పరిగెత్తుకొని వచ్చి కుక్కను తరిమేయడంతో పెద్ద ప్రమా దం తప్పింది. గాయపడిన బాలుడిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అధికారులు స్పందించి కుక్కలు, కోతుల బెదడను అరికట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మోర్తాడ్: ఏర్గట్ల మండలం బట్టాపూర్ నుంచి వెల్కటూర్కు మొరం తరలిస్తున్న ట్రాక్టర్ శుక్రవారం పెద్దవాగు వంతెనపై నుంచి వాగులో పడిపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి. వెల్కటూర్కు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ పెద్దవాగు వంతెనపైకి చేరుకోగానే అదుపు తప్పి ఇంజిన్ వాగులో పడింది. గమనించిన డ్రైవర్ పల్లెపు శేఖర్కు కిందికి దూకడంతో అతని చేయి విరిగింది. ట్రాక్టర్పై ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులు చెబుతున్నారు. నిజామాబాద్ అర్బన్ : నగరంలోని మిర్చి కంపౌండ్లో గురువారం రాత్రి భార్యపై భర్త కత్తితో దాడి చేశాడు. ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం... మిర్చి కంపౌండ్లో రాధ అనే మహిళ కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటూ నివసిస్తోంది. శుక్రవారం తన భర్త బాబు ఇంటికి వచ్చాడు. అదే సమయంలో రాధ బయటకు వెళ్తానని చెప్పడంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో బాబు కత్తితో రాధపై దాడి చేయడంతో గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకొని బాబును రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. నిజామాబాద్ అర్బన్ : నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా సమీపంలోని హనుమాన్ ఆలయంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. ఆలయంలోకి చొరబడిన దొంగలు హుండీని పగులగొట్టి రూ.20 వేల నగదును ఎత్తుకెళ్లారు. రెండో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పంచాయతీ ఆపరేటర్లకు వేతన వెతలు
● మూడునాలుగు నెలలకోసారి విడుదల ● ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆపరేటర్లు ● ప్రతి నెలా చెల్లించాలని వినతిమోర్తాడ్(బాల్కొండ): గ్రామ పంచాయతీల పరిధి లో చేపట్టే ఎన్నో రకాల పనులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసే కంప్యూటర్ ఆపరేటర్లకు సరిగా వేతనాలు అందడం లేదు. మండలానికి ఇద్దరు, ముగ్గురు చొప్పు న కంప్యూటర్ ఆపరేటర్లను కాంట్రాక్ట్ ప్రాతిపదికన గత ప్రభుత్వం నియమించింది. జిల్లాలో ఉన్న 545 గ్రామ పంచాయతీలకు 84 మంది కంప్యూటర్ ఆపరేటర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ప్రభు త్వం టీఎస్బీపాస్ ద్వారా ప్రతి నెలా వేతనాలను జమ చేయాల్సి ఉంది. అయితే మూడు, నాలుగు నె లలకోసారి వేతనాలు చెల్లిస్తుండటంతో ఆపరేటర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు నాలుగు నెలల వేతనం జమ కావాల్సి ఉండగా ప్రభుత్వం వారం రోజుల కింద మూడు నెలల వేతనాలను నిధులు విడుదల చేసింది. ప్రభుత్వం స్పందించి ఉద్యోగులకు ప్రతి నెలా వేతనాలు చెల్లిస్తున్నట్లుగానే తమకుసైతం ప్రతి నెలా వేతనాలు చెల్లించాలని కంప్యూటర్ ఆపరేటర్లు కోరుతున్నారు. -
ఆట.. ప్రతిభచాటేలా!
● రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల కోసం సన్నద్ధం ● వేసవి సెలవులను బాల్ బ్యాడ్మింటన్ కోసం కేటాయిస్తున్న విద్యార్థులు ● రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో శిక్షణ మోర్తాడ్(బాల్కొండ): విద్యార్థులకు ఆటలు ఆడాలని, అందులో ప్రతిభ చాటాలని ఉంటుంది. పా ఠశాలలు నడుస్తున్నప్పుడు పుస్తకాలతో కుస్తీ ప ట్టేందుకే సమయం సరిపోదు. అలాంటి విద్యార్థు లు వేసవి సెలవులను చక్కగా వినియోగించుకుంటున్నారు. మోర్తాడ్, తిమ్మాపూర్ ఉన్నత పాఠశాలల విద్యార్థులు బాల్ బ్యాడ్మింటన్లో శిక్షణ పొందుతున్నారు. నిత్యం ప్రాక్టీస్ చేస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీల్లో ప్రతిభను కనబరుస్తామనే ఆ త్మ విశ్వాసంతో ఉన్నారు. బాల్ బాడ్మింటన్కు ఆ దరణ కరువైతున్న రోజులలో జిల్లా బాల్ బ్యా డ్మింటన్ అసోసియేషన్ ఇచ్చిన ప్రోత్సాహంతో శిక్షణ పొందుతూ జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలలో తమ ప్రతిభ కనబరిచారు. మరికొందరు విద్యార్థులు జాతీయ స్థాయిలోనూ రాణిస్తున్నారు. మోర్తాడ్లో బాల్ బ్యాడ్మింటన్ ఆడుతున్న విద్యార్థులు జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో మొదటిస్థానంలో నిలువడం కోసం నిత్యం సాధన చేస్తున్నాం. ఇప్పటికే మేము జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాం. జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలవాలనే ఆకాంక్షతో ప్రాక్టీస్ కొనసాగిస్తున్నాం. – గగులోత్ స్వప్న, మోర్తాడ్ నేను జాతీయ స్థాయిలో బా ల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొన్నాను. మా గురువు ఇచ్చిన శిక్షణతో ప్రతిభ కనబరిచాం. మా జట్టు జాతీ య స్థాయిలో నెగ్గుకరావడంతోపాటు ఈ ప్రాంత విద్యార్థులు సైతం మాలాగే ప్రతిభ చూపాలని రోజూ మెలకువలు నేర్చుకుంటున్నాం. – సాయినాథ్, తిమ్మాపూర్ రోజూ సాధన చేయడంతో ఎంతో ఉత్సాహంగా ఉంది. మా గురువు ఇచ్చిన శిక్షణ, ఆయన నేర్పిన నైపుణ్యాలతో సాధన చేస్తున్నాం. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి ఈ ప్రాంత కీర్తిని ఇనుమడింప చేస్తాం. సెలవుల ను వృథా చేయకుండా రోజూ ప్రాక్టీస్ చేస్తున్నాం. – భూక్య గంగోత్రి, మోర్తాడ్ మా గురువు శ్యామ్ ఇచ్చిన శిక్షణతో దక్షిణ భారత స్థాయిలో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నాను. బాల్ బ్యాడ్మింటన్లో ప్రతిభ కనబరిచామని ఎంతో మంది మెచ్చుకున్నారు. స్పోర్ట్స్ కోటాలో పోలీసు ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతో ప్రాక్టీస్ చేస్తూ జాతీయస్థాయి పోటీలకు సన్నద్ధం అవుతున్నా. – భూక్యా నవీన, మోర్తాడ్ వేసవి శిబిరం లేకున్నా సొంతంగానే మా టీం ప్రాక్టిస్ చేస్తున్నాం. బాల్ బ్యాడ్మింటనన్లో జాతీయ స్థాయి గుర్తింపు పొందాలనే సంకల్పంతో సాధన చేస్తున్నాం. మా గురువు ఇచ్చిన శిక్షణను వేసవి సెలవుల్లో ప్రాక్టీస్ చేస్తున్నాం. – జి రితిక, మోర్తాడ్ -
ఈత సరదా..
నేను గీసిన చిత్రంపిల్లలు మీరూ పంపండి..83328 87332ఎస్.డీ. నిదాన్, 3వ తరగతి, నిజామాబాద్. టి. అమ్ములు, 9వ తరగతి, జెడ్పీహెచ్ఎస్ పిట్లం, కామారెడ్డి. ఆర్. నవతేజ్, 3వ తరగతి, ఏర్గట్ల, నిజామాబాద్. కోటగిరి ఆర్యన్ శ్రీరామ్, 5వ తరగతి, నిజామాబాద్ శ్రీ హిమతేజ, 6వ తరగతి, హనుమాన్ టేకిడి, బోధన్, నిజామాబాద్ కోటిగిరి శ్రీవల్లి 2వ తరగతి, వినాయక్నగర్,నిజామాబాద్. బాన్సువాడ రూరల్ : వేసవి తాపం పెరగడంతో ఉపశమనం కోసం యువకులు, చిన్నారులు ఈతపై ఆసక్తి చూపుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చిన్నా, పెద్దా తేడాలేకుండా కుటుంబసభ్యులతో కలిసి ఈత కొడుతూ సేదతీరుతున్నారు. వేసవిసెలవుల్లో అమ్మమ్మ, తాతల ఇళ్లకు వచ్చిన వారంతా స్విమ్మింగ్పూల్లో ఈత నేర్చుకుంటున్నారు. వేసవి సెలవుల్లో మీ కలానికి పదునుపెట్టి బొమ్మలు గీస్తున్నారా? చిట్టి కథలు రాస్తున్నారా? ఏదైనా పర్యాటక ప్రదేశం సందర్శించా రా? ఆటపాటల్లో విజయం సాధించి పతకాలు అందుకున్నారా? ఈ విషయాలను మీ స్నేహితులు, పాఠకులతో పంచుకోవాలనుకుంటే వాట్సాప్ నంబర్ ద్వారా మాకు పంపండి. మేము ప్రచురిస్తాం. మీ ఫొటో కూడా జతచేయండి. ఊరు.. పేరు.. జిల్లా రాయడం మరువొద్దు సుమా.. -
క్రైం కార్నర్
కొబ్బరి చెట్టు పైనుంచి పడి ఒకరి మృతి మాక్లూర్ : కొబ్బరి బొండాలు తెంపుతుండగా ప్రమాదవశాత్తు చెట్టుపై నుండి జారిపడి ఒకరు మృతి చెందిన ఘటన మాక్లూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో శుక్ర వారం చోటు చేసుకుంది. ఎస్సై రాజశేఖర్ కథనం ప్రకా రం.. నవీపేట మండలం జన్నేపల్లికి చెందిన జంపయ్య(52)ను జన్నేపల్లి క్రాసింగ్లో కొబ్బరి బొండాల వ్యాపారం చేసే అబ్బూరి చిరంజీవి బొండాలు కొయ్యడానికి కూలీ ప్రాతిపదికన కొత్తపల్లి తీసుకెళ్లాడు. అక్కడ కొబ్బరి చెట్టు ఎక్కి బొండాలు కోస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డ జంపయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ జంపయ్య మృతి చెందినట్టు తెలిపారు. మృతుడి భార్య పెంటమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు. కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్ పరిధిలో ఉన్న లక్ష్మమ్మ గుడి వద్ద ఓ గుర్తుతెలియని వృద్ధురాలు (68) మృతి చెందింది. శుక్రవారం రాత్రి గుడి వద్ద వృద్ధురాలు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన స్థానిక కౌన్సిలర్ గంట మధు వెంటనే పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. మృతి చెందింది ఎవరనేది తెలియకపోవడంతో, కౌన్సిలర్ మధు దగ్గరుండి అంబులెన్స్ను పిలిపించారు. పోలీసుల సూచనల మేరకు మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు ఎవరైనా ఉంటే జిల్లా ఆస్పత్రి అధికారులు, పట్టణ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు కోరారు. నిజామాబాద్ అర్బన్ : నగరంలోని సాయినగర్–2 కాలనీలో ఆర్థిక ఇబ్బందులతో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. పుట్ట రాజశేఖర్(46) ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక శుక్రవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు 4వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిజామాబాద్ అర్బన్ : వినాయక్నగర్లోని కల్లుబట్టిలో ఇటీవల జరిగిన ఓ ఘర్షణలో వ్యక్తిని హత్యచేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం వీరిని రిమాండ్ చేయనున్నట్లు సమాచారం. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సమాచారం. -
వడదెబ్బతో గొర్రెల కాపరి మృతి
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని శెట్పల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి కందూరి సాయన్న(65) శుక్రవా రం వడదెబ్బతో మృతి చెందినట్లు సర్పంచ్ అట్టెం శ్రీనివాస్యాదవ్ తెలిపారు. మృతుడు మూడు రోజులుగా గొర్రెలను మేపడానికి అటవీ ప్రాంతానికి వెళ్లాడు. శుక్రవారం గొర్రెలను మేపుకొని ఇంటికి వచ్చిన అనంతరం ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. విషయం తెలుసుకున్న సర్పంచ్ శ్రీనివాస్, ఏఎన్ఎం రా ధిక,ఆశావర్కర్ మంజుల,జీపీవో ఆశమ్ అలీ, సా యన్న మృతదేహాన్ని పరిశీలించారు. మృతునికి భార్య ఎల్లవ్వ, కూతుళ్లు ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ : నగరంలోని చంద్రానగర్లో శుక్రవారం వడదెబ్బతో ఓ కూలీ మృతి చెందాడు. 48 సంవత్సరాల వ్యక్తి కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఇటీవల వరుసగా కూలీ పనులకు వెళ్తున్నాడు. చంద్రానగర్లోని ఇంటి వద్ద మృతి చెందాడు. -
హాలిడే ట్రిప్
హలో ఫ్రెండ్స్... నా పేరు సాత్విక్. నేను నిజామాబాద్లోని విశ్వోదయ హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. వేసవి సెలవుల్లో అమ్మమ్మ కృపారాణి, అన్నయ్యలు వోమన్త్, మిట్టు, అక్కయ్యలు సౌమ్య, సంగీత, పెద్దమ్మ ఉజ్వల, పెద్దనాన్న ప్రేమ్సాగర్తో కలిసి టూర్కు వెళ్లాం. బాపట్ల బీచ్లో ఈత కొట్టాము. ఇసుకతో ఆటలు ఆడాం. సముద్రపు ఒడ్డున వాలీబాల్ గేమ్ ఆడటం ఎంతో ఆనందంగా అనిపించింది. అలియర్ రిజర్వ్ ఫారెస్టులో ఏనుగులు, జింకల గుంపులను చూశాం. ఊటీలో టీ తోటలు, చాక్లెట్ ఫ్యాక్టరీలను చూశాం. -
పిల్లలు మీరూ పంపండి..
నేను గీసిన చిత్రం83328 87332దావత్ లక్షిత రోటరీ నగర్, నిజామాబాద్. కె. భవేష్, 10వ తరగతి, కమ్మర్పల్లి, నిజామాబాద్. వేదశ్రీ, 2వ తరగతి, నారాయణ హైస్కూల్, ఆర్మూర్ వేసవి సెలవుల్లో మీ కలానికి పదునుపెట్టి బొమ్మలు గీస్తున్నారా? చిట్టి కథలు రాస్తున్నారా? ఏదైనా పర్యాటక ప్రదేశం సందర్శించా రా? ఆటపాటల్లో విజయం సాధించి పతకాలు అందుకున్నారా? ఈ విషయాలను మీ స్నేహితులు, పాఠకులతో పంచుకోవాలనుకుంటే వాట్సాప్ నంబర్ ద్వారా మాకు పంపండి. మేము ప్రచురిస్తాం. మీ ఫొటో కూడా జతచేయండి. ఊరు.. పేరు.. జిల్లా రాయడం మరువొద్దు సుమా.. -
క్రైం కార్నర్
కెనాల్లో పడి ఒకరి మృతి నిజామాబాద్ అర్బన్:నాగారం ప్రాంతంలోని నిజాంసాగర్ కెనాల్లో పడి ఒక రు మృతి చెందారు. సాయినగర్కాలనీ–2కు చెందిన జితేందర్(48) గత రెండు రోజుల కిందట అదృశ్యమయ్యాడు. గురువారం నిజాంసాగర్ కెనాల్లో ఓ వ్యక్తి మృతదేహం ఉందని స్థానికులు సమాచారం అందించగా పోలీసులు ఘ టనాస్థలానికి చేరుకుని బయటికి తీయించారు. మృతుడిని జితేందర్గా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగాధర్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి ప్రాంతంలో రైలు పట్టాలపై గుర్తు వ్యక్తి మృతదేహం లభించిందని రైల్వే హెడ్కానిస్టేబుల్ హన్మాండ్లు గురువారం తెలిపారు. బుధవారం రాత్రి కరీంనగర్ నుంచి వస్తున్న రైలు కింద పడి సదరు వ్యక్తి ఆత్మహత్యకు చేసుకుని ఉంటాడన్నారు. మృతుడి వయస్సు సుమారు 35 ఏళ్లు ఉంటుందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు రైల్వే ఎస్సై (87126 58591)కి సమాచారం అందించాలని కోరారు. డొంకేశ్వర్(ఆర్మూర్): ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలో జింకలపై కుక్కల దాడులు కొనసాగుతున్నా యి. ఇటీవల ఓ జింక పిల్లను రైతులు కాపాడడగా, తాజాగా గురువారం చుక్కల జింకను కుక్కలు వెంబడించగా అది తప్పించుకొని జీజీ నడ్కుడ గ్రామంలోకి వచ్చింది. గాయాలపాలైన జింకను స్థానికులు గ్రామ పంచాయతీ కార్యాలయానికి తీసుకొచ్చారు. సర్పంచ్ బట్టు సంజీవ్రాజ్ వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. డిప్యూటీ ఎఫ్ఆర్వో సుధాకర్, పశువైద్యాధికారి ధర్మాజీ గ్రామ పంచాయతీకి చేరుకుని జింకకు వైద్యం అందించి ఆర్మూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్లో వదిలిపెట్టారు. ఆర్మూర్టౌన్: ఆలూర్ మండల కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి అంబేద్కర్ విగ్రహాన్ని లారీ ఢీకొట్టిన ఘటన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఆర్మూర్ నుంచి నందిపేట్ వైపు మట్టి కోసం వెళ్తున్న లారీ ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని బలంగా ఢీకొట్డడంతో గద్దె పూర్తిగా దెబ్బతినగా, విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప గ్రిల్స్ పడిపోయాయి. అంబేడ్కర్ యువజన సంఘం సభ్యులు, గ్రామస్తులు అక్కడికి చేరుకుని ధర్నాకు దిగారు. ఎస్సై రజినీకాంత్ గ్రామానికి చేరుకుని వారితో మాట్లాడారు. అంబేడ్కర్ విగ్రహాన్ని మళ్లీ నిర్మింపజేస్తామని లారీ యజమాని ఒప్పుకోవడంతో వివాదం సద్దుమణిగింది. -
డేంజర్ వెల్స్
సిరికొండ : సిరికొండ మండలంలోని వివిధ మార్గాల్లో వ్యవసాయ బావులు ప్రమాదకరంగా ఉన్నాయి. రోడ్డుకు సమీపంలోనే బావులు ఉండటంతో ప్రయాణికులు, వాహనదారులు బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నారు. మూలమలుపుల వద్దనే వ్యవసాయ బావులు ఉండటంతో ప్రయాణం మరింత ఇబ్బందికరంగా మారింది. మండల కేంద్రం నుంచి చిన్నవాల్గోట్ వెళ్లే మార్గంలో రెండు చోట్ల రోడ్డు పక్కనే వ్యవసాయ బావులు ఉన్నాయి. ఈ మార్గంలోనే ప్రభుత్వ ఆదర్శ పాఠశాల, వ్యవసాయ గోదాములు ఉన్నాయి. విద్యార్థుల కోసం పాఠశాల వరకు ఆర్టీసీ బస్సు నడుస్తుంది. బస్సు సౌకర్యం లేని గ్రామాలకు చెందిన విద్యార్థులు ఆటోలు, సైకిళ్లపై పాఠశాలకు వస్తుంటారు. సింగిల్ రోడ్డు కావడంతో వ్యవసాయ బావుల వద్ద ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోయి బావులను కప్పేశాయి. మండల కేంద్రం నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన లొంక ఆలయానికి వెళ్లే మార్గంలో మహిపాల్ తండా సమీపంలో ఒక చోట వ్యవసాయ బావి ప్రమాదకరంగా ఉంది. ఇది కూడా మూలమలుపు వద్దనే ఉంది. ఆలయానికి ప్రతిరోజు ఈ మార్గంలో భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ బావి వద్ద ఎలాంటి హెచ్చరికలను ఏర్పాటు చేయలేదు. జిల్లాలో గతంలో రోడ్ల వెంబడి గల వ్యవసాయ బావుల్లో ఆటోలు, ట్రాక్టర్లు పడిపోయి ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. మండలంలో ఎలాంటి ప్రమాదాలు జరగకముందే రోడ్ల వెంబడి ఉన్న వ్యవసాయ బావులను పూడ్చివేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. మూలమలుపుల వద్దే వ్యవసాయ బావులు ప్రయాణికులకు పొంచి ఉన్న ప్రమాదం బావులను పూడ్చివేయాలని విన్నపం -
ఆధ్యాత్మిక వికాసం
జీవితానికి చదువు ఎంత ముఖ్యమో జీవించడానికి సంస్కారం అంతే ముఖ్యం అంటారు పెద్దలు. క్రమశిక్షణతో కూడిన జీవితం ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఆధ్యాత్మిక మార్గం సంస్కారంతోపాటు క్రమశిక్షణ నేర్పుతుందని అంటున్నారు లింగేశ్వరగుట్ట ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహరాజ్. ఇందుకోసం తమ ఆశ్రమంలో సంస్కృతి బోధన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నిజామాబాద్ రూరల్ : విద్యార్థులకు క్రమశిక్షణను అలవర్చడంతోపాటు ఆధ్యాత్మిక చింతన , భగవద్గీత, మహాభారతం , భాగవతం శ్లోకాలను నేర్పేందుకు లింగేశ్వరగుట్ట ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణమహ రాజ్ వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. మండలంలోని మల్లారం శివారులో ఉన్న ఆశ్రమంలో ఈనెల 26 నుంచి ప్రారంభమైన శిబిరంలో జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు పాల్గొంటున్నారు. శుక్రవారం నాటితో శిబిరం ముగియనుంది. లింగేశ్వర గుట్టపై కొలువుదీరిన శివుని సన్నిధిలో కృష్ణమహరాజ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆధ్యాత్మిక గ్రంథాల్లోని శ్లోకాలను కంఠస్థం చేస్తున్నారు. తల్లిదండ్రుల ను, గురువులను, పెద్దలను గౌరవించడం, దురలవాట్లకు దూ రంగా ఉండడం, సనాత న ధర్మంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులకు నిత్యాన్నదానం ఈనెల 26న ప్రారంభమైన సంస్కృతి బోధన శిబిరం (వేసవి శిక్షణ) శుక్రవారం ముగియనుంది. సుమారు వంద మంది విద్యార్థులకు లింగేశ్వరగుట్ట ఆశ్రమంలోనే వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సంస్కృతి బోధన శిబిరానికి పంపించగా, ఆధ్యాత్మిక మార్గం ద్వారా పిల్లలు తమ భవిష్యత్ను ఉన్నతంగా తీర్చుదిద్దుకుంటున్నారు. లింగేశ్వరగుట్ట ఆశ్రమంలో సంస్కృతి బోధన శిబిరం సెలవుల్లో ఆధ్యాత్మికతకు, సంస్కారానికి పెద్దపీట 100 మంది విద్యార్థులకు ఆశ్రమంలో బోధనలు -
చేతినిండా పని.. కడుపునిండా ఉపాధి!
డొంకేశ్వర్(ఆర్మూర్) : గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిహామీ పథకం (వీబీజీరామ్జీ) పేద కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తోంది. ప్రస్తుత వేసవి కాలంలో కూలీలకు చేతినిండా పని, కడుపునిండా ఉపాధిని అందిస్తోంది. ప్రభుత్వం రోజువారీ కూలి రూ.300లకు పెంచడంతో జిల్లాలో ఉపాధి హాజరు గణనీయంగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కూలీలు ఉత్సాహంగా పనులకు తరలివస్తున్నారు. వారానికి రూ.2 వేల వరకు వేతనం నేరుగా చేతికి అందుతుండడంతో పేద కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో 545 గ్రామ పంచాయతీల పరిధిలో ఉపాధి పనులు చెరువుల వద్ద జరుగుతున్నాయి. గుంతలు తవ్వించడం వలన చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, భూగర్భ జలాలు కూడా వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అయితే, 45 రోజుల క్రితం 30 వేల మంది కూడా రాని కూలీలు ఇప్పుడు 75 వేల నుంచి 76 వేల వరకు వస్తున్నారు. ఎండలు ముదురుతున్నప్పటికీ ఇంత పెద్ద ఎత్తున కూలీలు పనులకు రావడం గమనార్హం. సకాలంలో కూలి డబ్బులు వస్తుండడంతో కూలీల కుటుంబాల్లో ఆర్థిక భరోసా నెలకొంది. కూలీలకు పని కల్పించడంతో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే ఐదో స్థానంలో ఉందని, హాజరును మరింత పెంచి పనిదినాల లక్ష్యాన్ని పూర్తి చేస్తామని డీఆర్డీవో సాయన్న వెల్లడించారు. పెరిగిన రూ.300 వేతనంతో జిల్లాలో ఉపాధి జాతర నిత్యం 75 వేలు దాటుతున్న కూలీల హాజరు చెరువుల్లో ముమ్మరంగా పూడికతీత పనులు -
సర్కారు బడిలో ప్రీప్రైమరీ
● జిల్లాలో 112 పాఠశాలలు ఎంపిక ● పీఎంశ్రీ కింద ఇప్పటికే ఐదు బడుల్లో అమలు ● ప్రభుత్వ బడుల బలోపేతానికి ఊతం ఖలీల్వాడి : ప్రభుత్వ బడులను బలోపేతం చేయ డానికి చర్యలు ప్రారంభమయ్యాయి. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను 2026–27 విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించడానికి పాఠశాల శాఖ సి ద్ధం అయింది. తల్లిదండ్రులు తమ పిల్లలను నాలుగేళ్లు పడకముందే ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ స్కూళ్ల లో చేరుస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ చదివిన పిల్లలు అక్కడే పైతరగతులు కూ డా చదవడంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ఈ క్రమంలో సర్కారు స్కూళ్లను బ లోపేతం చేయడానికి ప్రీప్రైమరీ ఏర్పాటు చేయాల ని ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రు లు విద్యాశాఖ అధికారులకు విన్నవించారు. ఇప్పటికే జిల్లాలోని 40 పీఎంశ్రీ స్కూళ్లలోని ఐ దింటిలో ప్రైమరీ స్కూళ్లు, 68 పాఠశాలల్లో ప్రీప్రై మరీ నిర్వహించగా, తాజాగా బుధవారం జిల్లాకు మరో 112 ప్రీప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేస్తూ పా ఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతుండగా, నిరుద్యోగులకు సైతం ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఆటపాటలతో కూడిన చదువు.. జిల్లాలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభమవుతు న్న స్కూళ్లలో ప్రత్యేక తరగతి గదులు ఏర్పాటు చే స్తారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆటపాటలతో కూడిన చదువు, స్లీపింగ్ అవ ర్, మధ్యాహ్న భోజనం అమలు చేస్తారు. వీరికి వి ద్యాబోదన చేసేందుకు ఆయా గ్రామాల్లోనే ఉన్నత చదువు చదివిన వారిని ఎంపిక చేశారు. ఇన్స్ట్రక్టర్లు, ఆయాలను ఎంపిక చేసి వారికి జీతభత్యాలు చెల్లి స్తారు. మూడేళ్లు పైబడిన పిల్లలను ఎల్కేజీ, నాలుగేళ్లు పైబడిన వారిని యూకేజీలో చేర్చుకుంటారు. వీటి నిర్వహణ నిమిత్తం గ్రీన్బోర్డులు. ఫ్యాన్లు, ఫ ర్నిచర్ కొనుగోలు, ఇండోర్, ఆవుట్ డోర్ గేమ్స్, ఇతర వాటి కోసం రూ. లక్ష లోపు నిధులు సమకూర్చుతారు. ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూళ్లలో ఎల్కేజీ, యూకేజీ చదివిన పిల్లలకు వచ్చే విద్యా సంవత్స రంలో 1వ తరగతిలో చేరేందుకు అర్హత ఉంటుంది. తద్వారా ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పె రిగే అవకాశం ఉంది. మరోవైపు తల్లిదండ్రులకు ఆ ర్థిక భారం తగ్గుతుంది. పిల్లలకు సర్కారు బడుల్లో నే నాణ్యమైన విద్య అందుతుంది. ప్రభుత్వం ప్రీ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే విద్యా సంవత్సరం వరకు జిల్లాలోని అన్ని పాఠశాల్లో ప్రీపైమరీ స్కూళ్లను ఏర్పాటు చేయడానికి సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. (వచ్చే విద్యాసంవత్సరం అన్ని పాఠశాలల్లో ప్రీప్రైమరీ ఏర్పాటుకు అవకాశం)జిల్లాలో 112 స్కూళ్లు ప్రీపైమరీకి ఎంపికయ్యాయి. ఆటపాటల ద్వారా బోధన అందుతుంది. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు క ల్పిస్తాం. అవసరమైన ఫర్నిచర్, ఆట వస్తువులు, బోధన సామగ్రి, భద్రత ప్రమాణాలు, విద్యార్థుల ను ఆకర్షించేలా గోడలపై రంగు రంగుల బొమ్మలు, పిల్లలు నిద్రపోయే గదిని ఏర్పాటు చేస్తాం. దీనికి కావాల్సిన సిబ్బందిని నియామిస్తాం. – బాలకృష్ణ, సెక్టోరియల్ ఆఫీసర్, నిజామాబాద్ -
సంపదపై కన్నేసి.. కిడ్నాప్నకు స్కెచ్చేసి..
● ఈజీ మనీ కోసం అడ్డదారి.. ● నేర కుట్రను భగ్నం చేసిన పోలీసులు ● అక్రమ తుపాకీ, రబ్బర్ బుల్లెట్లు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్ చంద్ర కామారెడ్డి క్రైం : ఆ వ్యాపారి వద్ద అప్పులు తీసుకు న్నారు. వాటిని తీర్చలేక అతడి సంపదపైనే కన్నేశా రు. ఈజీగా డబ్బులు సంపాదించడం కోసం కిడ్నాప్నకు స్కెచ్చేశారు. ఈ కుట్రను పోలీసులు ఛేదించడంతో కథ సుఖాంతమైంది. గురువారం జిల్లా పో లీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రానికి చెందిన బూస శ్రీనివాస్ అనే వ్యాపారవేత్తకు చిట్యాలకు చెందిన నిట్టు నర్సింగరావు, సంతాయిపేట్కు చెందిన సూర స్వామి అలియాస్ ఒడ్డె స్వామి, పులి ప్రశాంత్ గౌడ్, చిట్యాలకు చెందిన సూరం స్వామితో చాలాకాలంగా పరిచయం ఉంది. వీరి మధ్య గతంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయి. బూస శ్రీనివాస్ వద్ద భారీ మొత్తంలో అప్పులు తీసుకున్నట్లు తెలుస్తోంది. సదరు వ్యాపారి వద్ద పెద్ద మొత్తంలో సంపద ఉన్నట్లు భావించి ఈజీ మనీ కోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నారు. వ్యాపారి బూస శ్రీనివాస్ను కిడ్నాప్ చేసి భారీగా డబ్బులు వసూలు చేయడానికి ప్లాన్ వేశారు. తుపాకీ కొనుగోలు చేయడానికి మహారాష్ట్రలోని నాయేగావ్కు చెందిన అజయ్ హన్మంతరావు గోంగపాలే, వైభవ్ ప్రకాష్ బరాడేవార్లను సంప్రదించారు. ఈనెల 12న నర్సింగరావు, ఒడ్డె స్వామి మహారాష్ట్రకు వెళ్లి అజయ్, వైభవ్ల ద్వారా నాయేగావ్కు చెందిన మారుతి గోకేను కలిశారు. రూ. 30 వేలకు తుపాకీ కొనుగోలుకు ఒప్పందం చేసుకుని రూ. 27 వేలు చెల్లించారు. ఈనెల 27 న మారుతి గోకే తుపాకీని వైభవ్ ప్రకాశ్ బరాడేవార్, అజయ్ హన్మంతరావ్ గోంగపాలేలకు అందించాడు. వారు దానిని తీసుకుని కృష్ణాజీవాడీ గ్రామ సమీపానికి వచ్చారు. కృష్ణాజీవాడి శివాలయం సమీపంలో కొంత మంది అనుమానితులు ఏదో నేరం చేయడానికి కుట్ర పన్నుతున్నారనే సమాచారం రావడంతో తాడ్వాయి ఎస్సై నరేశ్, సిబ్బంది బుధవారం తనిఖీలు చేపట్టారు. పోలీసుల రాకను గమనించి అక్కడ నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా వెంబడించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నిట్టు నర్సింగరావు, ఒడ్డె స్వామి, పులి ప్రశాంత్ గౌడ్, సూ రం స్వామి, అ జయ్ హన్మంతరావు గోంగపాలే, వైభవ్ ప్రకాష్ బరాడేవార్లను విచారించగా కిడ్నాప్ ప్లాన్ బయటపడింది. వారి వద్ద నుంచి ఒక నల్ల రంగు తుపాకీ, ఆరు రబ్బరు బుల్లెట్లు, 2 ఎయిర్ రైఫిల్ పెల్లెట్ బాక్సులు, 5 సెల్ఫోన్లు స్వాధీ నం చేసుకున్నారు. ధనికుడైన బూస శ్రీనివాస్ ను కిడ్నాప్ చేసి అతడి కుటుంబ సభ్యుల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేయాలని కుట్ర పన్నినట్లు విచారణలో తేలిందని ఎస్పీ తె లిపారు. కుట్రకు సంబంధించిన పూర్తి సమాచారం, ప్రమేయం ఉన్న వ్యక్తులు అందరినీ గుర్తించడానికి ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్రావు పర్యవేక్షణలో సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, తాడ్వాయి, సదాశివనగర్ ఎస్సైలు, ఐటీ కోర్ సిబ్బంది శ్రీనివాస్, యాదగిరి, సీసీఎస్ పీసీలు మైసయ్య, కిషన్ తదితరులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించామ న్నారు. ఈ కేసులో మరో నిందితుడైన మారుతి గోకే పరారీలో ఉన్నాడన్నారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాల ద్వారా గాలిస్తున్నామని ఎస్పీ తెలిపారు. -
మొదలైన ఏరువాక..
యంత్ర సాయంతో పసుపు విత్తనం వేస్తున్న రైతులు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో బుధవారం రాత్రి వర్షం పడింది. దీంతో రైతులు వానకాలం పంటల సాగుకు సమాయత్తం అవుతున్నారు. సేంద్రియ ఎరువులు చల్లడం, పసుపు సాగు, వరి నారుమడులను సిద్ధం చేస్తున్నారు. భూమి పూర్తి స్థాయిలో తడిసిన తర్వాతే పంటలు సాగు చేయాలని వ్యవసాయ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. – ఇందల్వాయి(నిజామాబాద్ రూరల్) బుధవారం రాత్రి కురిసిన వర్షం వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు -
బాలికలు బలవుతున్నారు!
నిజామాబాద్డేంజర్ వెల్స్ సిరికొండ మండలంలోని వివిధ మార్గాల్లో వ్యవసాయ బావులు ప్రమాదకరంగా ఉన్నాయి. శుక్రవారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2026– 8లో uనిజామాబాద్అర్బన్ : జిల్లాలో బాలికలపై లైంగిక దాడులు, మైనర్ల వివాహాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రతి యేటా పోక్సో కేసులు పెరుగుతున్నాయి. చట్టం అందుబాటులో ఉన్నా, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఆగడాలు మాత్రం ఆగడం లేదు. బాలికలపై లైంగిక వేధింపుల కారణంగా విద్యాసంస్థల్లో పోక్సో కేసులు నమోదవుతున్నాయి. విద్యాబోధన చేసే గురువులే కొన్ని చోట్ల ఈ ఘాతుకాలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. వసతి గృహాలలో సైతం బాలికలకు లైంగిక వేధింపులు తప్పడం లేదు. తరచూ ఈ కేంద్రాలలో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలో ఇటీవల పలు కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియా ప్రభావం స్మార్ట్ఫోన్, సోషల్ మీడియా ప్రభావంతో కొందరు లైంగిక దాడులకు పాల్పడుతున్నట్లు మానసిక వైద్యులు చెబుతున్నారు. వీరి పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్నారు. సోషల్ మీడియాలో లైంగిక వేధింపులు, అశ్లీల చిత్రాలు, గంజాయి సీన్లూ చూస్తూ ప్రభావితమై యువత మత్తు పదార్థాలకు అలవాటుపడుతున్నారని, ఈ క్రమంలో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు నమోదవుతున్న కేసుల ద్వారా తెలుస్తోంది.మైనర్లపై లైంగిక దాడుల నివారణకు పోలీసు శాఖ అనే క కార్యక్రమాలతో అవగహన కల్పిస్తోంది. షీటిమ్లు ప్రతి విద్యా సంస్థల్లో అవగ హన కల్పిస్తు న్నాయి. ముఖ్యంగా సాంకేతిక విధానంలో కూడ ప్రచారం చేస్తున్నాం. ఇ లాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – పి సాయి చైతన్య, పోలీసు కమిషనర్, నిజామాబాద్బాలికలపై లైంగిక వేధింపులకు అనేక కారణాలు ఉన్నాయి. మైనర్ పై అత్యాచారాలకు ఆశ్లీలత పెరిగి పోవడం కూడా కారణం. మైనర్లకు తినుబండారాల ఆశ చూపి లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. అవగాహన కూడ లేక పోవడం ఓ కారణం. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. –డాక్టర్ విశాల్, మానసిక వైద్య నిపుణులుకొన్ని ఘటనలు.. గతేడాది నగరంలోని పెయింటర్స్ కాలనీలో ఓ దివ్యాంగుడు ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గతంలో నందిపేట మండలంలోని ఓ గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిపై స్థానికులు దాడి చేయగా మరణించాడు. బోధన్లో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఉపాధ్యాయుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. ఆరో పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు రోజుల క్రితం ఓ బాలిక తన ఇంటికి వెళ్తుండగా ఓ వ్యక్తి చాక్లెట్ కొనిస్తానని ఆశ చూపి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి లైంగికంగా ఇబ్బందులకు గురిచేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు ఇటీవల నగరంలోని ఆరోటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికకు ఆధార్ కార్డులో వయస్సును ఎక్కువగా నమోదు చేయించి ఓ ఖాజీకి పెళ్లి చేశారు. స్థానికుల ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆధార్ కార్డులో వయస్సు మార్పిడి చేసిన సెంటర్ యజమాని, బాలిక తల్లిదండ్రులు, మరికొందరిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు రోజుల క్రితం మాలపల్లికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల దుబాయ్ నుంచి ఇంటికి వచ్చాడు. తన భార్యకు విడాకులు ఇచ్చి తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని పెళ్లి చేసుకున్నాడు, స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఆందోళన కలిగిస్తున్న మైనర్లపై లైంగిక దాడులు ప్రతి ఎటా పోక్సో కేసుల పెరుగుదల కేసుల నివారణకు అవగాహన కల్పిస్తున్న పోలీసు శాఖ పాఠశాలల్లో షీ టీమ్ల ఏర్పాటు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి : మానసిక వైద్యుల సూచనలు -
క్యూ కట్టాల్సిన పని లేదిక..
డొంకేశ్వర్(ఆర్మూర్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా అందించే పింఛన్ డబ్బుల కోసం పోస్టాఫీసులు, గ్రామ పంచాయతీల వద్ద గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడే అవస్థలకు త్వరలోనే తెరపడనుంది. గ్రామీణప్రాంత లబ్ధిదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం పింఛన్ డబ్బులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని నిర్ణయించింది. జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ, ఒంటరి మహిళా, బీడీ కార్మికులు, చేనేత, కల్లుగీత కార్మికులు కలిపి మొత్తం 2.61లక్షల మంది పింఛన్లు పొందేవారున్నారు. ప్రతినెలా జిల్లాలో రూ.56.35 కోట్ల నిధులు పంపిణీ చేస్తున్నారు. అయితే, పట్టణ ప్రాంతాలకు చెందిన 58,639మంది లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో రూ.12.80 కోట్ల వరకు జమ చేస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. మిగిలిన 2,02,889 మంది గ్రామీణ ప్రాంతాల లబ్ధిదారులకు పోస్టాఫీసులు, జీపీ కార్యాలయల వద్ద నగదును పంపిణీ చేస్తున్నారు. పోస్టాఫీసు సిబ్బంది వచ్చి డబ్బులు పంచే క్రమంలో లబ్ధిదారులు క్యూ కట్టడం, నెట్వర్క్ సమస్యలతో ఆలస్యం అవుతోంది. వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి పోవడంతో గ్రామీణ లబ్ధిదారులకు సైతం బ్యాంకు ఖాతాలోనే డబ్బులు వేయాలని నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అధికారులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల నంబర్లను సేకరించి ఆన్లైన్ చేయనున్నారు. దీనికి సంబంధించి ఆదేశాలు రానున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పేర్కొటున్నారు. ఇక నుంచి గ్రామీణ లబ్ధిదారుల ఖాతాల్లో పింఛన్ డబ్బులు జమ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం పోస్టాఫీసుల ద్వారా పంపిణీలో జాప్యమే కారణం -
ద్విచక్ర వాహనాల చోరీ కేసుల్లో ఒకరి అరెస్ట్
నిజామాబాద్ అర్బన్: ద్విచక్ర వాహనాల చోరీ కి పాల్పడుతున్న ఒకరిని అరెస్ట్ చే సినట్లు ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో రఘుపతి గురువారం తెలిపారు. నగరంలోని కవిత కాంప్లెక్స్ ఎదుట పార్క్ చేసి ఉన్న బైక్ ఇటీవల చోరీకి గురైంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గురువారం వాహనాల ను తనిఖీ చేస్తుండగా నామ్దేవ్వాడకు చెందిన నవీ న్ అనే వ్యక్తి అనుమానాస్పదస్థితిలో పట్టుబడ్డాడు. అతడిని విచారించగా, ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు బైక్లు, ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి, బాన్సువాడ, పిట్లంలో ఒక్కో బైక్ను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. చోరీ చేసిన బైక్లను కామారెడ్డి జిల్లా సోమేశ్వరం గ్రామానికి చెందిన మోహిద్, మోహన్ అనే ఇద్దరు వ్యక్తులకు విక్రయించినట్లు తెలిపాడు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్వో తెలిపారు. నిజామాబాద్ రూరల్: రైస్మిల్లులో చోరీకి యత్నించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో శ్రీనివాస్ గురువారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఖానాపూర్ చెందిన పసుపుల మహిపాల్ ఈనెల 27వ తేదీన విఠల్గౌడ్కు చెందిన పాత రైస్మిల్లో నుంచి 10హెచ్పీ మోటార్ను ఎత్తుకెళ్లేందుకు యత్నించాడు. స్థానికులు గమనించి విఠల్గౌడ్కు సమాచారం అందించగా అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. రాత్రి 10గంటల సమయంలో మద్యం మత్తులో రోడ్డు పక్కన పడుకుని ఉన్న మహిపాల్ను అదుపులోకి తీసుకుని విచారించగా, చోరీకి యత్నించానని ఒప్పుకున్నాడు. -
రాజకీయ కక్ష సాధింపు ధోరణిని వీడాలి
● ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈడీ దాడులు ● సీపీఎం నాయకుల ఆరోపణనిజామాబాద్ అర్బన్ : కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరై విజయన్పై కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు ధోరణి వీడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్బాబు అన్నారు. విజయన్ ఇంట్లో ఈడీ దాడులను నిరసిస్తూ గురువారం ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. అనంతరం రమేశ్ బాబు మాట్లాడుతూ దేశంలో సీపీఎం పార్టీ నాయకులు అత్యంత నీతి ని జాయితీతో ప్రజలకు జవాబుదారీగా ఉంటూ పని చేస్తున్నారని, పదేళ్లపాటు కేరళ రాష్ట్ర సీఎంగా పనిచేసిన పినరై విజయన్కు సొంత ఇల్లు కూడా లేదని గుర్తుచేశారు. పెట్రోల్, డీజిల్ ధ రల పెంపుతో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టి మరల్చడానికి సీపీఎం నాయకుల పై ఈడీ దాడులు చేశారని ఆరోపించారు. ిసీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, కమిటీ సభ్యులు సుజాత, నగర నాయకులు నల్వాల నరసయ్య, అనసూయమ్మ, అనిత ,అంజయ్య, ఈవీఎల్ నారాయణ, అబ్దుల్, రాము, ఇమామ్, రాజు, సతీశ్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● కార్యకర్తలే బీజేపీకి ప్రధాన బలం ● ఎంపీ అర్వింద్ ధర్మపురి ● పండిత్ దీన్దయాళ్ ప్రశిక్షణ శిబిరం ప్రారంభం సుభాష్నగర్: కార్యకర్తలే బీజేపీకి ప్రధాన బలమని, రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేయాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. నూతన పదాధికారుల నైపుణ్యాలు మెరుగుపర్చడం, పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత నిర్మాణం, కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలపై సమగ్ర అవగాహనే లక్ష్యంగా నగరంలోని బోర్గాం(పి)లో రెండు రోజులపాటు కొనసాగనున్న జిల్లాస్థాయి పండిత్ దీన్దయాళ్ ప్రశిక్షణ శిబిరాన్ని అర్వింద్ గురువారం ప్రారంభించారు. అంతకుముందు పార్టీ జెండాను ఎగురవేశారు. 1984 నుంచి జిల్లాలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలతో కూడిన ఫొటో ప్రదర్శనను ప్రారంభించి తిలకించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేసి, ప్రజల్లో పార్టీపై మరింత విశ్వాసం పెంపొందించాలని కార్యకర్తలకు సూచించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికి రాజ్యాంగ ఫలాలు అంది అభివృద్ధి చెందాలన్నదే పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ లక్ష్యమని, ఆ దిశగా బీజేపీ పని చేస్తుందని అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, సీనియర్ నాయకులు లోక భూపతిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, నాయకులు మేడపాటి ప్రకాశ్రెడ్డి, ఏలేటి మల్లికార్జున్రెడ్డి, వడ్డి మోహన్రెడ్డి, భరత్రెడ్డి, నర్సింహారెడ్డి, కంచెట్టి గంగాధర్, నాగోళ్ల లక్ష్మీనారాయణ, వివిధ మండలాల అధ్యక్షులు, మోర్చాల నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. -
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం
● రైతులు ఆందోళనకు గురి కావద్దు ● జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్ అర్బన్: అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యానికి మద్దతు ధర చెల్లిస్తూ ప్రభుత్వం పరంగా కొనుగోలు చేస్తామని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రా ల ద్వారా రైతుల నుంచి సేకరిస్తున్న తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించే ప్రక్రి యను వేగవంతం చేయాలని అధికారుల ను ఆదేశించామన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి బుధవారం రాత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాల నేపథ్యంలో ఆ యా జిల్లాల్లో ధాన్యం సేకరణను వేగవంతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ త్రిపాఠి జిల్లా అధికారులతో సమావేశమై కీలక సూచనలు చేశారు. జిల్లాలో ఇప్పటికే ధాన్యం సేకరణ ప్రక్రియ ముగింపు దశకు చేరిందన్నారు. అయితే దిగుబడులు ఆలస్యంగా వచ్చిన చోట ధాన్యం సేకరణ కోసం సు మారు 120 వరకు కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. అకాల వ ర్షం కురిసిన కారణంగా జిల్లాలో బషీరాబాద్, ఉప్లూర్ తదితర ప్రాంతాల్లో సుమారు 40 మెట్రి క్ టన్నుల వరకు ధాన్యం బస్తాలు తడిసినట్లు త మ దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అధికారులను క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం పంపించామని, తడిసిన ధాన్యాన్ని వేగవంతంగా బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. తాను కూడా స్వయంగా మిల్లులను సందర్శించి, ధాన్యం తరలింపు, అన్ లోడింగ్ ప్రక్రియలను పరిశీలించానని కలెక్టర్ వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు డీసీపీ శుభం నగ్రాలే, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మరింత భారం
వ్యవసాయం డీజిల్ ధరల పెంపుతో పెరిగిన పెట్టుబడి ఖర్చులు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: చమురు ధరలు విడతలవారీగా పెరుగుతుండడంతో రైతన్నపై సాగు పెట్టుబడి భారం మరింతగా పడనుంది. రైతులు ఆందోళనతో ఇప్పటికే లెక్కలు వేసుకుంటున్నారు. భారీగా ఖర్చులు పెరుగుతాయని, ఈ మేరకు మద్దతు ధరలు పెరిగితేనే గిట్టుబాటు అవుతుందంటున్నారు. ట్రాక్టర్లతో చేసే దుక్కులు, దమ్ముల పనులకు ధరలు పెంచినట్లు రైతులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా బోరుబావులకు డ్రిల్లింగ్ చేసే రిగ్గుల యజమానులు సైతం ధరలు పెంచారు. సాధారణంగా రైతులకు, గృహ అవసరాలకు బోర్వెల్ తవ్వకం 400 అడుగుల వరకు లోతు ఉంటుంది. ఇప్పుడు అడుగుకు రూ.15 నుంచి రూ.25 వరకు ధర పెంచారు. వ్యవసాయ బోర్లతో పాటు ఇళ్లల్లో వేసుకునే బోర్లకూ ఈ ధరలు అమలు చేస్తున్నారు. దీంతో భారం పెరిగిందని రైతులు, గ్రామీణులు చెబుతున్నారు. డీజిల్ ధరలు పెరగకముందు బోర్వెల్ డ్రిల్లింగ్ లోతు, పరిమాణం మేరకు అడుగుల చొప్పున డ్రిల్లింగ్ చార్జీలు తీసుకునేవారు. ధరలు పెరగడంతో రానున్న సీజన్కు సంబంధించి దుక్కులు, దమ్ములు, వరికోత యంత్రాలకు చెల్లింపులు భారీగా పెరుగుతాయని రైతులు అంటున్నారు. డీజిల్ ధరల పెంపుతో పెరిగిన పెట్టుబడి ఖర్చులు ట్రాక్టర్లకు చెల్లింపులు, బోర్లు వేసే రిగ్గులకు ధరల పెంపు షురూ ఇప్పటికే లెక్కలు వేసుకుంటున్న రైతన్నలు -
విధులు బహిష్కరించిన వీవోఏలు
డొంకేశ్వర్(ఆర్మూర్)/మోర్తాడ్(బాల్కొండ)/బోధన్రూరల్ : ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్ర భుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఐకేపీ వీవోఏలు మూడు రోజులుగా సమ్మెకు దిగారు. బుధవారం నుంచి విధులు బహిష్కరించా రు. జిల్లాలోని అన్ని మండల సమాఖ్య ఆఫీసుల ముందు నిరాహార దీక్షలు ప్రారంభించారు. దీంతో బ్యాంకు లింకేజీ, సీ్త్ర నిధి రుణాల పంపిణీ నిలిచిపోవడం, స్నేహ సంఘాలకు అవగాహన శిబిరాల నిర్వహణ రద్దు అయ్యింది. వృద్ధులైన మహిళలను గుర్తించి వారితో సంఘాలను ఏర్పాటు చేసే ప్రక్రియకు బ్రేక్ పడింది. రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లాలో 806 మంది వీవోఏలు సమ్మెలో పాల్గొంటున్నారు. నిత్యం గ్రామాలు, పట్టణాల్లో మహిళ సంఘాలకు అందుబాటులో ఉంటూ ఐకేపీ, బ్యాంకు రుణాలు అందించడం, పొదుపుపై, ప్రభుత్వ పథకాలపై అవగహన కల్పించడం వంటి పనుల కోసం శ్రమిస్తున్నా ప్రభుత్వం తమను గుర్తించం లేదన్నారు. వీవోఏలకు సెర్ప్ నుంచి రూ.5 వేల వేతనం రాగా, రూ.3 వేలు గ్రామ సంఘం ఇస్తోంది. ఈ వే తనం చాలడం లేదని వీవోఏలు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. అయితే వీవోఏలు విధులకు దూరంగా ఉండడంతో బ్యాంకు లింకేజీలు, ఇతర కార్యక్రమా లపై ప్రభావం పడకుండా ఐకేపీ అధికారులు ప్ర త్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. ఇబ్బందులు రాకుండా చూడాలని సీసీలకు ఆదేశాలిచ్చారు. డిమాండ్లు ఇవే.. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి అర్హులైన వీవోఏలకు సీసీలుగా పదోన్నతి కల్పించాలి సాధారణ బీమా, ఆరోగ్య బీమా రూ.20 లక్షలు ఇవ్వాలి ట్యాబ్, నెట్ సౌకర్యం కల్పించాలి జీవో 58ని సవరణ చేసి జాబ్ చాట్ ఇవ్వాలి ఉద్యోగ భద్రత, కనీస వేతనం కోసం మూడు రోజులుగా సమ్మెబాట శ్రమకు తగిన గుర్తింపు లేదని ఉద్యోగుల ఆవేదన బ్యాంకు లింకేజీ రుణాలు, ఇతర పనులపై ప్రభావం -
బీజేపీ, కాంగ్రెస్ మిలాఖత్ !
ఆర్మూర్ : బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి పె ట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించా రు. రేవంత్రెడ్డిని ఫెయిల్యూర్ సీఎంగా రాష్ట్రంలోని చదువురాని ప్రజలు కూడా అంటున్నారని అన్నా రు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కల్యాణ మండపంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్పై అవగాహన సదస్సును బుధవారం నిర్వహించారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇన్చార్జి వీజీ గౌడ్ ఆధ్వర్యంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రమశిక్షణ గల కార్యకర్తలు ఉండటం బీఆర్ఎస్ అదృష్టమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ పోకడలను ఎదుర్కొని నిలిచిన కార్యకర్తలను చూస్తుంటే రాబోయే ప్రభుత్వం మనదే అనే నమ్మకం కలుగుతోందన్నారు. ప్రజలు కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ప్ర భుత్వం ఆరు గ్యారెంటీలు, 420 హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యిందన్నారు. యుద్ధాన్ని అడ్డం పెట్టుకొని మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతోందన్నారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో పెట్రోల్, డీజీల్పై వ్యాట్ను ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. ఎస్ఐఆర్లో పార్టీ ఓటర్లను తొలగించకుండా అడ్డుకోవాలని బూత్ ఇన్చార్జిలకు సూచించారు. డిజిటల్ పద్ధతిలో సభ్యత్వ నమోదుపై కార్యక ర్తలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత బూత్ ఇ న్చార్జిలపై ఉంటుందని వీజీ గౌడ్ అన్నారు. జిల్లా లో 3,130 మంది బూత్ కమిటీ సభ్యులు బా ధ్య తలు నిర్వహించాలన్నారు. 60 లక్షల సభ్యత్వా లు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్పై జి ల్లా కేంద్రంలో త్వరలో అవగాహన సదస్సులు ని ర్వహిస్తామన్నారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్గుప్తా, హ న్మంత్ సింధే, జెడ్పీ మాజీ చైర్మన్ విఠల్రావు, నా యకులు రాజారాం యాదవ్, ఆలూర్ విజయ భా రతిరెడ్డి మాట్లాడారు. ఆనంద్రెడ్డి, పోల సుధాకర్, పూజ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. యుద్ధం సాకు చూపి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు రేవంత్రెడ్డి ఫెయిల్యూర్ సీఎం మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆర్మూర్లో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం -
సామెతలు
నేను గీసిన చిత్రంపిల్లలు మీరూ పంపండి..83328 87332వి. శ్రీనిధి, 6వ తరగతి, నారాయణ హైస్కూల్, ఆర్మూర్ వడ్ల స్నేహ, 10వ తరగతి, జెడ్పీహెచ్ఎస్, పిట్లం జిల్లా: కామారెడ్డి విశ్వవేద్ 3 వ తరగతి గ్రామం: గూపన్పల్లి జిల్లా : నిజామాబాద్ చాతెల్లి శ్రేష్ఠ సంహిత 5వ తరగతి ఆర్మూర్ జిల్లా: నిజామాబాద్ జి. హిమాన్షు 5వ తరగతి గ్రామం: పెంటకలాన్ మం:బోధన్ జిల్లా: నిజామాబాద్ వేసవి సెలవుల్లో మీ కలానికి పదునుపెట్టి బొమ్మలు గీస్తున్నారా? చిట్టి కథలు రాస్తున్నారా? ఏదైనా పర్యాటక ప్రదేశం సందర్శించా రా? ఆటపాటల్లో విజయం సాధించి పతకాలు అందుకున్నారా? ఈ విషయాలను మీ స్నేహితులు, పాఠకులతో పంచుకోవాలనుకుంటే వాట్సాప్ నంబర్ ద్వారా మాకు పంపండి. మేము ప్రచురిస్తాం. మీ ఫొటో కూడా జతచేయండి. ఊరు.. పేరు.. జిల్లా రాయడం మరువొద్దు సుమా.. -
పెట్రోలింగ్ను మరింత బలోపేతం చేయాలి
ఆర్మూర్: పోలీస్ స్టేషన్ల పరిధిలో నైట్ పెట్రోలింగ్ను మరింత బలోపేతం చేయాలని, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడంతోపాటు వాహనాల తనిఖీలను పకడ్బందీగా చేపట్టాలని సీపీ సాయిచైతన్య సిబ్బందిని ఆదేశించారు. డివిజన్ పరిధిలో కేసులు, నేరాల నియంత్రణపై పట్టణంలోని ఆర్మూర్ రూరల్ పోలీస్ స్టేషన్లో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బక్రీద్ నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు. పాత నేరస్తులపై నిఘా సారించాలని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నారు. పోలీస్ స్టేషన్లలో స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని, మహిళలకు రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. షీ టీమ్స్, ఈగల్ టీమ్స్ , చీతా ఫోర్స్ వంటి ప్రత్యేక బృందాలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని అన్నారు. విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పర్యవేక్షణ పెంచాలని, సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం, రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డి, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ అంజయ్య, ఆర్మూర్, భీమ్గల్ ఎస్హెచ్వోలు సత్యనారాయణ, పొన్నం సత్యనారాయణ, ఆర్మూర్ రూరల్ సీఐ జాన్రెడ్డి, భీమ్గల్, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల, బాల్కొండ, కమ్మర్పల్లి, మోర్తాడ్, వేల్పూర్, నందిపేట్, ఆర్మూర్ ఏస్సైలు తిరుపతి, కిరణ్పాల్, సుహాసిని, రాజేశ్వర్, శైలేందర్, అనిల్రెడ్డి, రాము, సంజీవ్, శ్యామ్ రాజ్, రజనీకాంత్ , వినయ్కుమార్, ఐటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా సారించండి.. అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలి పోలీస్ స్టేషన్లలో స్నేహపూర్వక వాతావరణం ఉండాలి సమీక్షా సమావేశంలో సీపీ సాయిచైతన్య -
విజయరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న పీసీసీ చీఫ్
ఆర్మూర్: మాజీ మంత్రి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే శనిగరం సంతోష్రెడ్డి సతీమణి అంత్యక్రియలు హైదరాబాద్లోని కొండాపూర్లో బుధవారం నిర్వహించగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ హాజరయ్యారు. విజయరెడ్డి పార్థివ దేహానికి ఆయన నివాళులు అర్పించారు. అనంతరం సంతోష్రెడ్డితో పాటు ఆయన తనయుడు శనిగరం శ్రీనివాస్రెడ్డిని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంత్యక్రియల్లో మంత్రి శ్రీధర్బాబు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, రూరల్ ఎమ్యెల్యే భూపతిరెడ్డి, రాష్ట్ర సహకార సంఘాల సంస్థ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, జెడ్పీ మాజీ చైర్మన్ గంట సదానందం, కొంగి సదాశివ్, మార గంగారెడ్డి, మార చంద్రమోహన్, ఇస్సాపల్లి జీవన్, వెంకటగిరి తదితరులు పాల్గొన్నారు. -
అడుగుకు రూ.110 చెల్లించాను
ఈ నెల 19న బోర్వెల్ డ్రిల్లింగ్ చేయించాను. 270 అడుగులకు నీళ్లు తగిలాయి. భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకుని 400 అడుగుల వరకు డ్రి ల్లింగ్ చేయించాను. మా ఏరి యా డిమాండ్ను బట్టి అడుగుకు రూ.110 చొ ప్పున చెల్లించాను. 39 అడుగుల వరకు కేసింగ్ పైపు లు వేశారు. ఇందుకోసం అడుగుకు రూ.350 చొప్పున చెల్లించాను. డ్రిల్లింగ్, కేసింగ్ పైపులకు కలిపి రూ.1లక్ష 5వేలకు పైగా ఖర్చు అయ్యింది. బోర్వెల్ డ్రిల్లింగ్ చార్జీలు అడుగుకు రూ.10 నుంచి రూ.25 వరకు పెంచినట్లు స్పష్టం అవుతోంది. – సుధాకర్, రైతు, కుమ్మన్పల్లి, సాలూర మండలం చిన్న, సన్నకారులకు భారమే డీజిల్ ధరలు పెరగడంతో ట్రాక్టర్ యజమానులు వ్యవసాయ పనులకు ఒక్కో గంటకు రూ.200 చొప్పున అద్దె పెంచారు. దీంతో చిన్న, సన్నకారు రైతులకు భారం పెరిగింది. ఇప్పటికే పంటల సాగు పెట్టుబడి పెరిగి ఆదాయం తగ్గిపోయింది. ట్రాక్టర్ అద్దె ధరలు పెరగడంతో ఇంకా భారం అవుతుంది. : కె చిన్నరాజేశ్వర్, రైతు, మోర్తాడ్ -
వరకట్నం వేధింపుల కేసులో ముగ్గురి రిమాండ్
ధర్పల్లి: మండలంలోని గోవింద్పల్లి గ్రామానికి చెందిన లక్షిత ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసిన పోలీసులు వరకట్నం వేధింపులకు పాల్పడిన భర్త కర్రోళ్ల నెహ్రూతోపాటు అత్త సత్తెమ్మ, మామ రాజును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఏసీపీ ప్రకాశ్ ఆదేశాల మేరకు బుధవారం నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సై వినయ్ తెలిపారు. వారి వద్ద నుంచి సెల్ ఫోన్ కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతరం కోర్టులో హాజరు పర్చగా , న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారన్నారు. ● నగదు, బంగారం, బైక్ను ఎత్తుకెళ్లిన దుండగుడు నిజామాబాద్ అర్బన్: నగరంలోని పద్మనగర్లో మంగళవారం అర్ధరాత్రి ఓ దుండగుడు నాలుగు ఇళ్లలో చోరీకి పాల్పడ్డాడు. రాజయ్య అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడిన దుండగుడు బీరువా పగులగొట్టి రూ.5 వేలతోపాటు ఇంట్లోని మహిళను కత్తితో బెదిరించి బంగారాన్ని దోచుకెళ్లాడు. అలాగే సునీత ఇంట్లోకి చొరబడి బీరువా పగులగొట్టి బంగారం, వెండితోపాటు రూ.5 లక్షల 30వేలు ఎత్తుకెళ్లాడు. పక్కనే ఉన్న విజయ అనే మహిళ ఇంట్లోకి చొరబడిన దుండగుడు రూ.9 వేల నగదు అపహరించాడు. కోటగల్లిలోని ఓ ఇంటి ముందు నుంచి మనోజ్ అనే వ్యక్తికి చెందిన బైక్ను ఎత్తుకెళ్లాడు. వరుస దొంగతనాలకు పాల్పడింది ఒక్కడేనని సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిర్ధారించారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు. మద్నూర్(జుక్కల్): మండలంలోని రుసేగావ్ గేట్ వద్ద 161వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున మామిడి పండ్ల లారీ బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి రాజస్థాన్కు మామిడి పండ్ల లోడ్తో వెళ్తున్న లారీ మండలంలోని రుసేగావ్ గేట్ సమీపంలో డివైడర్ను ఢీకొట్టి అదుపుతప్పి రోడ్డు మధ్యలో బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. మామిడిపండ్లు రోడ్డుపై చెల్లాచెదురయ్యాయి. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. రెండుగంటలపాటు శ్రమించి క్రేన్ సహాయంతో లారీని పక్కకు జరిపారు. రెండు గంటలపాటు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. -
ధాన్యం అన్ లోడింగ్ వేగవంతం చేయాలి
● కలెక్టర్ ఇలా త్రిపాఠి ● రైస్మిల్లు ఆకస్మిక తనిఖీసుభాష్నగర్: రైస్మిల్లుల్లో ఎక్కువ సంఖ్యలో హమాలీలను సమకూర్చుకుని అన్లోడింగ్ను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం నగర శివారులోని సాయి రాజ్యలక్ష్మీ ఆగ్రో ఇండస్ట్రీస్ బాయిల్డ్ రైస్మిల్లును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి ఎన్ని లారీల లోడ్ల ధాన్యం వచ్చింది.. వాటి ని దిగుమతి చేసుకున్నారా.. ఎంత పరిమాణంలో మిల్లింగ్ జరిపారు.. మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎ లా భద్రపరుస్తున్నారు.. తదితర అంశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మిల్లు ఆవరణలో ధాన్యం లోడ్లతో కూడిన లారీలు నిలిచి ఉండడాన్ని గమనించిన కలెక్టర్ అన్లోడింగ్ వేగవంతం చేసేలా చూడాలన్నారు. అకాల వర్షాలు కురిసే అవకాశమున్నందు న ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని మి ల్లు నిర్వాహకులకు సూచించారు. లేనిపక్షంలో ఆరు బయట, కొనుగోలు కేంద్రాల వద్ద అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. సామర్థ్యం మేరకు పూర్తిస్థాయిలో మిల్లింగ్ చేయాలన్నారు. ధాన్యం నిల్వలు, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని జాగ్రత్తగా భద్రపర్చాలన్నారు. అన్ లోడింగ్లో జాప్యానికి తావులేకుండా పర్యవేక్షించాలని, రోజువారీగా తనకు నివేదికలు సమర్పించాలని అధికారులతో పేర్కొన్నారు. కలెక్టర్ వెంట డీఎస్వో శ్రీ కాంత్ రెడ్డి, సివిల్ సప్లయ్ డీఎం ప్రవీణ్, ఏఎస్వో అరవింద్ రెడ్డి, రైస్ మిల్లుల నిర్వాహకులు ఉన్నారు. -
క్రైం కార్నర్
మద్నూర్(జుక్కల్): మండలంలోని మేనూర్ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం హైవే అథారిటీకి చెందిన వాహనాన్ని వెనుక నుంచి బైక్ ఢీకొట్టిన ఘటనలో మహారాష్ట్ర ఆర్టీసీ బస్ కండక్టర్ అబ్దుల్ నజీర్(42) మృతి చెందాడని ఎస్సై మోహన్రెడ్డి తెలిపారు. మహారాష్ట్రలోని దెగ్లూర్ ఆర్టీసీలో కండక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న అబ్దుల్ నజీర్ బుధవారం సాయంత్రం డ్యూటీ ముగించుకొని మద్నూర్ మీదుగా మేనూర్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. మహారాష్ట్రలోని భోకర్కు చెందిన అబ్దుల్ నజీర్కు మండలంలోని మేనూర్కు చెందిన అమ్మాయితో వివాహం కాగా, మేనూర్లోని ఉంటున్నారన్నారు. మృతుడికి భార్య, కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. భిక్కనూరు: పిడుగుపాటు కారణంగా పాడి గేదె మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బొండ్ల శివయ్య అనే రైతు తన వ్యవసాయ బావి వద్ద ఉన్న పశువుల కొట్టంలో గేదెను కట్టేశాడు. అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. పాడి గేదైపె పిడుగుపడడంతో మృతి చెందింది. బాధిత రైతు పశువైద్యాధికారులకు సమాచారం అందించాడు. తనకు నష్టపరిహారం అందించాలని అధికారులను కోరాడు. కరెంట్ షాక్తో..నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్నగర్ మండల కేంద్రానికి చెందిన పాటిమీది మల్లేశ్ అనే వ్యక్తికి చెందిన గేదె బుధవారం విద్యుత్ షాక్తో మృతి చెందింది. బూర్గుల్ గ్రామ శివారులో మేతకు వెళ్లిన గేదె బాన్సువాడ– ఎల్లారెడ్డి రహదారి పక్కన ఉన్న పంటపొలం వద్ద ట్రాన్స్ఫార్మర్కు తగిలి అక్కడిక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. పాడి గేదె మృతితో రైతుకు రూ.60 వేల వరకు నష్టం వాటిల్లింది. రుద్రూర్: పొతంగల్ మండలం హంగర్గా గ్రామ శివారులోని మంజీర నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు కోటగిరి ఎస్సై సునీల్ తెలిపారు. బుధవారం ఉదయం ఎలాంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్లో ఇసుకను లోడ్ చేసుకుని తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. డ్రైవర్ రాజుతోపాటు ట్రాక్టర్ యజమాని రాజేశ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఉత్సాహం
ఉల్లాసం.. మల్లారం పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరం ● యోగాసాధనలో పోటీ పడుతున్న చిన్నారులు ● చెస్, క్యారం, పెయింటింగ్ అంశాల్లో తర్ఫీదు ● శిబిరంలోనే విద్యార్థులకు మధ్యాహ్న భోజనంవిద్యార్థులకు శిక్షణ ఇస్తున్న ఉపాధ్యాయులు నిజామాబాద్ రూరల్: ‘వేసవి సెలవులు ఎంజాయ్ చేయడానికి కాదు.. వ్యక్తిత్వ వికాసానికి, మనలోని నైపుణ్యానికి పదును పెట్టేందుకు ఉపయోగపడే విలువైన కాలం’ అని అంటున్నారు మల్లారంలోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు. పాఠశాలకు సెలవులు ప్రకటించగానే అమ్మమ్మ ఇంటికి, బంధువుల ఇళ్లకు, టూర్లకు వెళ్లిపోకుండా స్థానికంగా తమ పాఠశాలలో ఏ ర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని క్రమశిక్షణతో సద్వినియోగం చేసుకుంటున్నారు. హెచ్ఎం రామ్మోహన్, ఉపాధ్యాయుడు భూమాగౌడ్ పర్యవేక్షణలో పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరం కొనసాగుతోంది. 78 మంది విద్యార్థులు వివిధ అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించారు. ఈ నెల 13న ప్రారంభమైన వేసవిశిక్షణ తరగతులు 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇండోర్ గేమ్స్కు ప్రాధాన్యం వేసవి శిక్షణ శిబిరంలో ఇండోర్ గేమ్స్కు ప్రాధాన్యత ఇస్తున్నారు. చిత్రలేఖనం, క్యారం, చెస్, పెయింటింగ్, యోగా సాధన చేయడంతోపాటు శ్లోకాలు కంఠస్థం చేస్తున్నారు. విద్యార్థులకు ఆటలతోపాటు మానసిక ఉల్లాసమూ కలుగుతోంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ప్రభుత్వ పాఠశాలలో వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న హెచ్ఎం రామ్మోహన్ను ఎంఈవో ప్రత్యేకంగా అభినందించారు. శిక్షణ శిబిరం.. బడిబాట ఓ వైపు వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు.. మరో వైపు ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గ్రామంలో ‘బడిబాట’ కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీ పాలక మండలి సహకారంతో ఇంటింటికీ వెళ్తున్న ఉపాధ్యాయులు.. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరుతున్నారు. యోగా సాధన చేస్తున్న చిన్నారులువేసవి శిక్షణలో అనేక అంశాలపై ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నారు. ఇక్కడ పొందుతున్న శిక్షణ భవిష్యత్లో ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి రోజూ తరగతులకు హాజరవుతున్నా. – రమ్య, 8వ తరగతి గ్రామ పంచాయతీ సహకారంతో మా టీచర్లు ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం.నేర్చుకోవాలనే తపన ఉండాలి. ఈ శిబిరం ఎంతో ఉపయోగపడుతుంది. – కోమలి, 9వ తరగతి చదువుతోపాటు విద్యార్థులకు ఆటపాటలు ఎంతో ముఖ్యం. మా పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందాన్నిస్తోంది. శ్లోకాలు నేర్చుకుంటున్నా. – అనుదీపిక, 7వ తరగతి వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళ్లేదాన్ని. స్కూల్ లో వేసవి శిక్షణ శిబిరం ఏ ర్పాటు చేయడంతో ఊరికి వెళ్లలేదు. యోగా, డ్రాయింగ్, పెయింటింగ్, సాధాన చే స్తూ.. ఇండోర్ గేమ్స్ ఆడుతూ ఉత్సాహంగా గడుపుతున్నా. – స్రవంతి, 9వ తరగతి విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే వేసవి శిక్ష ణ తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యాశాఖాధికారు లు పూర్తి సహాయసహకారా లు అందిస్తున్నారు. విద్యార్థులు వేసవి శిక్షణకు ఉత్సాహంగా హాజరవుతుండడం ఆనందాన్నిస్తోంది. – రామ్మోహన్, హెచ్ఎం -
బ్యాడ్మింటన్లో ప్రణవ్సింహ ప్రతిభ
మోపాల్: జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ అండర్– 11, 13 బాలుర విభాగాల పోటీల్లో నగరానికి చెందిన ఆరె ప్రణవ్ సింహ ఉత్తమ ప్రతిభ చూపినట్లు అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కర్నాటి వాసు, వి కిరణ్కుమార్ తెలిపారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 26, 27 తేదీల్లో జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ పోటీలను మోపాల్ మండల కేంద్రంలోని ఫిట్నెస్ క్లబ్లో నిర్వహించారు. ఈసందర్భంగా ప్రణవ్ను అభినందించి రెండు జ్ఞాపికలను బహూకరించారు. ప్రణవ్ సింహ తల్లిదండ్రులు ఆరె లక్షణ ప్రవీణ్కుమార్ (మెదక్ అదనపు డీఆర్డీవో) మాట్లాడుతూ తన కుమారుడు జిల్లాస్థాయి పోటీల్లో రాణించడం ఆనందంగా ఉందని, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కూడా రాణించే విధంగా సంపూర్ణ సహకారం అందించి మరింత ప్రోత్సాహిస్తామన్నారు. ప్రణవ్ సింహను అభినందించిన వారిలో ఆరె శ్రీధర్ (దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో), ఆరె మోహన్, రేగుల్ల దేవీప్రసాద్, తీగల రఘు, క్రీడాకారులు, బంధుమిత్రులు ఉన్నారు. -
నేటి నుంచి పాలిటెక్నిక్ స్లాట్ బుకింగ్
● జిల్లాలో ఐదు కళాశాలలు ● అందుబాటులోకి కొత్త కోర్సులు ఖలీల్వాడి: విద్యార్థుల భవిష్యత్కు ఎంతో ఉపయోగపడే పాలిటెక్నిక్ స్లాట్ బుకింగ్ నేటి(బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. పాలిసెట్ ఫలితాలు విడుదల కావడంతో పాలిటెక్నిక్ ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేసిన నేపథ్యంలో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు నిజామాబాద్ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ భారతి తెలిపారు. ఈ విద్యాసంవత్సరం నుంచి పాలిటెక్నిక్లో పలు కొత్త కోర్సులు వచ్చాయి. ఆటోమిషన్ ఇన్ రోబోటిక్, బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ చదివే అవకాశం ఏర్పడింది. పాలిసెట్ ర్యాంక్ కార్డ్, పాలిసెట్ హాల్ టికెట్, పదో తరగతి మార్కుల మెమో, బదిలీ సర్టిఫికెట్ (టీసీ), స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఇన్కమ్), కుల ధ్రువీకరణ పత్రం(అవసరమైతే), ఈడబ్ల్యూ విద్యార్థులకు సంబంధించిన కుల ధ్రువీకరణ పత్రం, పీహెచ్, ఎన్సీసీ, క్యాప్, క్రీడా సర్టిఫికెట్లు (అర్హత ఉన్నవారికి), పాస్పోర్టు సైజ్ ఫొటోలు, 2026 సంవత్సరానికి సంబంధించిన ఆదాయ ధ్రువపత్రం సమర్పించిన విద్యార్థులకు కళాశాల ఫీజు రూ.1880 మాత్రమే ఉంటుంది. స్లాట్ బుకింగ్ 27 నుంచి 31 ధ్రువపత్రాల పరిశీలన 29 నుంచి జూన్ 1 ఆప్షన్ల ఎంపిక 29 నుంచి జూన్ 3 సీట్ల కేటాయింపు జూన్ 6 రిపోర్టు గడువు జూన్ 7 నుంచి 8 -
మనస్తాపంతో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
నవీపేట : మండలంలోని ఫకీరాబాద్ గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి జాదవ్ కృష్ణ(37) ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్రీకాంత్ మంగళవారం తెలిపారు. బాసర – నవీపేట రైల్వే ట్రాక్ మెయింటైనర్గా విధులు నిర్వర్తిస్తున్న జాదవ్ కృష్ణ ఇంటి నిర్మాణం కోసం రూ.8 లక్షల లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మంజూరు ప్రక్రియ ఆలస్యమవుతుండడంతో తనకు లోన్ వస్తుందో రాదోనని ఒత్తిడికి గురై మంగళవారం తెల్లవారుజామున ఇంట్లోని ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య సవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని చీనూర్, వాడి గ్రామ శివార్లలో అక్రమంగా నిలువ ఉంచిన ఇ సుక డంప్లను అధికారులు మంగళవారం సీజ్ చేశారు. నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్గౌడ్తో కలిసి స్థానిక రెవెన్యూ అధికారులు ఇసుక డంప్లను పరి శీలించారు. చీనూర్లో రెండు, వాడిలో ఒక ఇసుక డంప్ను సీజ్ చేసినట్లు వారు తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
ధర్పల్లి: మండలంలోని గోవింద్పల్లి గ్రామానికి చెందిన లక్షిత (22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఎస్సై వినయ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గోవింద్పల్లికి చెందిన నెహ్రూతో మోస్రా గ్రామానికి చెందిన లక్షితకు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. పైళ్లెన రెండు నెలల నుంచే భర్త నెహ్రూతోపాటు అత్తామామలు అదనంగా రూ.2 లక్షల వరకట్నం తీసుకురావాలని లక్షితను వేధించినట్లు ఆమె తండ్రి పిట్ల మోహన్ ఫిర్యాదు లో పేర్కొన్నాడు. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగిందని, సోమవారం సాయంత్రం సైతం తమ కూతురిని అత్తింటి వారు వేధించారని ఫిర్యాదు చేశాడు. లక్షిత చని పోయిందని తమకు సమా చారం ఇచ్చారని, ఆమె మరణంపై తమకు అనుమానం ఉందని పేర్కొన్నాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. తహసీల్దార్ శాంత సమక్షంలో శవ పంచనామా పూర్తి చేశామని, ఏసీపీ ప్రకాశ్యాదవ్ మృతదేహాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారని ఎస్సై తెలిపారు. -
సీడ్ కార్పొరేషన్ ఆర్ఎం బదిలీ
డొంకేశ్వర్(ఆర్మూర్): ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విత్తన కార్పొరేషన్ రీజినల్ మేనేజర్ (ఆర్ఎం) రఘు ఖమ్మం జిల్లాకు బదిలీ అయ్యారు. మంగళవారం బదిలీ ఉత్తర్వులు వెలువడగా, జిల్లాకు వినయ్ ఆర్ఎంగా రానున్నారు. ఆయన హైదరాబాద్ రాష్ట్ర శాఖ నుంచి బదిలీపై ఇక్కడికి వస్తున్నారు. డాక్టర్ జీవీ రావుకు శుభాకాంక్షలు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : పద్మశ్రీ అవార్డు గ్రహీత, డాక్టర్ జీవీ రావును మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు. వైద్య రంగంలో డాక్టర్ జీవీ రావు అందిస్తున్న విశిష్ట సేవలను ప్రశాంత్ రెడ్డి ప్రశంసించారు. బోధన్: ఎడపల్లిలో ని రైతువేదిక భవ నం వద్ద వీధి కుక్క లు గుంపులుగా సంచరిస్తూ మంగళవా రం ఉదయం లక్ష్మి అనే మహిళపై దాడి చేశాయి. భయంతో లక్ష్మి కేకలు వేయడంతో స్థానికులు వెంటనే అప్రమత్తమై కుక్కలను తరిమివేసి ఆమెను కాపాడారు. తీవ్రగాయాలపాలైన లక్ష్మిని చికి త్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో కుక్కల బెడదను నివారించాలని స్థానిక నాయకుడు న్యావనది శ్రీకాంత్ పంచాయతీ కార్యదర్శి నాగరాజుగౌడ్కు విన్నవించారు. బాన్సువాడ : ఇద్దరు చిన్నారులు ఆస్పత్రి ప్రాంగణంలో దిక్కుతోచని స్థితిలో అటూఇటూ తిరుగుతుండడంతో ఆస్పత్రి సిబ్బంది చూసి లోపలికి తీసుకెళ్లి ఓ గదిలో సంరక్షణ కల్పించారు. చిన్నారులు అధికారులకు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం చిన్న ఎక్లార గ్రామానికి చెందిన లక్ష్మి తన ఇద్దరు కూతుర్లు గంగోత్రి (10వ తరగతి), హాసిని (2వ తరగతి) లను తీసుకుని శనివారం బాన్సువాడ ఆస్పత్రికి వచ్చింది. ఆస్పత్రి ప్రాంగణంలో ఇద్దరు చిన్నారులను కూర్చొబెట్టి ఇప్పుడు వస్తానని చెప్పి వెళ్లిపోయింది. రాత్రయినా లక్ష్మి రాకపోవడంతో చిన్నారులిద్దరు ఆస్పత్రిలో తిరుగుతుండడంతో సిబ్బంది సుపరింటెండెంట్ విజయభాస్కర్కు సమాచారం ఇచ్చారు. చిన్నారులకు గదిలో వసతి కల్పించి భోజనం పెట్టండి అని చెప్పడంతో సిబ్బంది చిన్నారులకు భోజనం తెప్పించి తినిపించారు. మూడు రోజులైన చిన్నారుల తల్లి రాకపోవడంతో మంగళవారం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల సమక్షంలో ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. తన తండ్రి చనిపోయాడని చిన్నారులు అధికారులకు వివరించారు. -
నేను గీసిన చిత్రం
కే విఘ్నేశ్ 7వ తరగతి సెయింట్ ఆన్స్ స్కూల్, ఆర్మూర్ ఎస్ దీక్షిత్ 7వ తరగతి కామారెడ్డి కే వియాన్ష్ 6వ తరగతి మోడల్ స్కూల్, ఆర్మూర్మామిడి నివేద్ 3వ తరగతి నిజామాబాద్ ఎస్.శ్రీహిమతేజ 6వ తరగతి హనుమాన్ టేక్డి, బోధన్ శాన్విత, 5వ తరగతి మండల పరిషత్ స్కూల్, నిజామాబాద్ డి శ్రీమాన్ శ్రీచైతన్య స్కూల్ నిజామాబాద్ సుదీక్ష మాచారెడ్డి, కామారెడ్డి -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మాక్లూర్: టాటా ఏస్, బైక్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని దుర్గానగర్ మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆలూర్ మండలం రామస్వామి క్యాంప్నకు చెందిన కామర్తి రమేశ్(45) పని నిమిత్తం తన బైక్పై నిజామాబాద్కు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా మాక్లూర్ నుంచి దాస్నగర్ వైపు వెళ్తున్న టాటా ఏస్ దుర్గానగర్ బస్టాండ్ సమీంలో బైక్ను ఢీకొట్టింది. తలకు బలమైన గాయాలుకావడంతో రమేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
రైతులు అంతర్జాతీయ ఎగుమతులు చేయాలి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వ్యవసాయరంగంలో ముందంజలో ఉన్న జిల్లా రైతులు అంత ర్జాతీయ ఎగుమతుల దిశగా ముందుకెళ్లాలని, విదేశీ వాణిజ్యంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవా రం కలెక్టర్ అధ్యక్షతన సమీకృత భవనంలో వా ణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డీజీఎఫ్టీ (డైరక్టర్ జనరల్ ఫారిన్ ట్రేడ్), ఏపీఈడీఏ, జాతీయ పసుపు బోర్డు, నాబార్డు, ఇండియా పోస్ట్ల ఆధ్వర్యంలో మెగా ఎగుమతుల ప్రోత్సాహక కార్యక్రమం నిర్వహించారు. నూతన ఎగుమతిదారులను ప్రోత్సహించడం, ఎంఎస్ఎంఈల భాగస్వామ్యాన్ని బలోపే తం చేయడం, జిల్లాల స్థాయిలో ఎగుమతుల ను గణనీయంగా పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఈ–కామ ర్స్ ఎగుమతుల ప్రదర్శన, ట్రేడ్ కనెక్ట్ పోర్టల్, పసుపు, వరి, సోయాబీన్, మొక్కజొన్న, పత్తి త దితర పంటల మార్కెట్ వైవిధ్యీకరణ అంశా లపై డీజీఎఫ్టీ అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ అధ్యాపకులు, శాస్త్రవేత్తలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. నాణ్యమైన దిగుబడులను అందించే పంట ల సాగు, పంట ఉత్పత్తుల మార్కెటింగ్, విదేశాలకు ఎగుమతులు, ఎరువులు, క్రిమిసంహా రక మందుల వాడకంపై రైతుల సందేహాలను ని వృత్తి చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా రైతాంగం సే ద్యపు రంగంలో ఆధునిక విధానాలు, శాసీ్త్రయ పద్ధతులతో ఆదర్శ రైతులుగా పేరు పొందారన్నారు. ఆర్మూర్ ప్రాంత రైతులు అత్యధిక విస్తీర్ణంలో పసుపు సాగు చేస్తారని, వ్యవసాయ ఉత్పత్తులు, నూతన వంగడాల విషయంలో అంకాపూర్ ప్రాంత రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. కాగా విదేశీ వాణిజ్యంతో అనుసంధానం చేస్తే జిల్లా రైతులకు మరింత మేలు కలుగుతుందన్నారు. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లాను పసుపు, వరి ఉత్పత్తుల ఎగుమతి కేంద్రంగా కేంద్రప్రభుత్వం ప్రకటించడంతో రైతు లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. డీజీఎఫ్టీ ప్రాంతీయ సంచాలకులు ఎస్ఏ చవాన్ మాట్లాడుతూ రైతులు తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలన్నారు. దీంతో గణనీయమైన లాభాలతో పా టు విదేశీ మారకద్రవ్యం పెరిగి రూపాయి మారకం బలపడుతుందన్నారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి ఔషధాలు, ఇంజినీరింగ్ విడిభాగాలు ఎక్కువగా విదేశాలకు ఎగుమతి అవుతున్నాయన్నారు. ఇదేవిధంగా పసుపు, వరి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులనూ భారీగా ఎగు మతి చేయొచ్చన్నారు. ఫారిన్ ట్రేడ్ పాలసీ మేరకు విదేశీ ఎగుమతులకు ప్రభుత్వం తగిన రాయితీలు ఇస్తూ ప్రోత్సహిస్తోందన్నారు. ఈ– కామర్స్ ప్రాధాన్యతపై అవగాహన పెంచుకుంటే రైతులు ఉంటున్న ప్రాంతం నుంచే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ ఉత్పత్తుల ఎగుమతులు చేస్తూ వ్యాపార లావాదేవీలు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు అధికారులు కేవీఎస్ శైలజ, ప్రత్యూష్, వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు విద్య, కే జనార్దన్రెడ్డి, ఏపీఈడీఏ అధికారి నాయుడు, నాబార్డు డీజీఎం ఎస్ ప్రవీణ్ కుమార్, జిల్లా పరిశ్రమల కేంద్రం మేనే జర్ సురేష్కుమార్, జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, రైతులు, ట్రేడర్లు పాల్గొన్నారు. విదేశీ వాణిజ్యంలో జిల్లా నుంచి భాగస్వాములు కావాలి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులు ప్రోత్సాహం ఇవ్వాలి మెగా ఎగుమతుల ప్రోత్సాహక కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ఒక్కో గ్రామంలో ఒక్కో రకమైన ధర
మోర్తాడ్(బాల్కొండ): పంట ఒక్కటే కాని ధర మాత్రం వేరు వేరుగా నిర్ణయించారు. సజ్జ పంట సాగు చేసిన రైతులకు మార్కెట్లో భిన్నమైన రేట్లు లభిస్తున్నాయి. ఈ పంట సాగు చేసిన మోర్తాడ్తో పాటు కొన్ని గ్రామాల రైతులకు క్వింటాలుకు రూ.4,200 ధర లభిస్తే, తిమ్మాపూర్, శెట్పల్లి, ఏర్గట్ల, బాల్కొండ, వేల్పూర్, మెండోరా, ముప్కాల్ మండలాల్లోని కొన్ని గ్రామాల రైతులకు రూ.4,500 ధర దక్కుతోంది. సజ్జల కొనుగోలు విషయంలో సీడ్ వ్యాపారుల మాటనే నెగ్గుతుండటంతో రైతులు ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు. యాసంగి సీజను కు సాగు చేసిన సజ్జలకు ధర లేకుండా పోయింది. బైబ్యాక్ ఒప్పంద సమయంలోనే విత్తన వ్యాపారులు తక్కువ ధరకే రైతులతో అంగీకారం కుదుర్చుకున్నారు. ఫలితంగా మార్కెట్లో ఈ పంటకు డిమాండ్ ఉన్నా వ్యాపారులు చెప్పిన ధరకే పంటను విక్రయించి లాభాలను పొందలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఒక ఎకరానికి 8 క్వింటాళ్ల నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి లభిస్తుంది. సజ్జలకు గతంలో రూ.6,500 ధర ఉండగా ఇప్పుడు రూ.4,500లకు కుదించారు. దిగుబడి పెరగకపోవడం, ధర తగ్గిపోవడంతో తమ శ్రమ వృథా అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నే ళ్ల క్రితం బాల్కొండ, ఆర్మూర్, నియోజకవర్గాలతో పాటు రూరల్ నియోజకవర్గంలోని ఒకటి రెండు మండలాల్లోనే సజ్జను సాగు చేసేవారు. పసుపు తవ్వకాలు పూర్తి కాగానే సజ్జల సాగును ఆరంభించేవారు. దాదాపు 25వేల ఎకరాల్లో సాగు చేసిన సజ్జ పంటను రైతులు తగ్గించారు. ధర లేకపోవడం, ది గుబడిలో వృద్ధి కనిపించకపోవడంతో ఇప్పుడు 10 వేల ఎకరాలకే పంట పరిమితమైంది. పంట సాగు విస్తీర్ణం తగ్గినా ధర పె రగకపోవడంపై రైతులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. విత్తన వ్యాపారులు సిండికేట్గా మారి ధర లేకుండా చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. కొందరు రైతులు సజ్జకు ప్రత్యామ్నాయంగా నువ్వుల పంటను సాగు చేశారు. బస్తాలలో నింపిన సజ్జలు సజ్జ పంటకు భిన్నమైన రేట్లు బైబ్యాక్ ఒప్పందంలోనే రైతులకు ధర తగ్గించిన వ్యాపారులు మార్కెట్లో డిమాండ్ ఉన్నా విత్తన వ్యాపారులు చెప్పిన ధరకే విక్రయిస్తున్నామని రైతుల వేదన గతంలో క్వింటాలుకు రూ.6,500 ఉండగా.. ఇప్పుడు రూ.4,500లకు మించని ధర -
బదిలీల కౌన్సెలింగ్తో మాకేంటి?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా ప్రజాపరిషత్లో బదిలీల ప్రక్రియను అపహాస్యం చేసేలా కొందరు ఉద్యోగులు పావులు కదుపుతున్నారు. బదిలీ అయి న చోటినుంచి మళ్లీ తమకు నచ్చిన, తమ వ్యవ హారాలు చక్కబెట్టుకునే పోస్టుల్లో కొనసాగేందుకు డిప్యుటేషన్ల మంత్రాన్ని ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆయా ఉద్యోగులు తమ సౌలభ్యం కోసం మరికొందరు ఉద్యోగులను డిప్యుటేషన్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఒత్తిడి చేస్తుండడం గమనార్హం. ఈ క్రమంలో ఒత్తిడికి గురవుతున్న ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఉన్నతాధికారుల మంచితనాన్ని ఆసరాగా తీసుకుని, వారిని తప్పుదోవ పట్టిస్తూ అక్రమార్కులు కథ నడిపిస్తున్నారు. ఈ వ్యవహారంలో జెడ్పీలో ఏళ్లతరబడి తిష్ట వేసిన ఓ సెక్షన్ అధికారి కీరోల్ పోషిస్తుండడంపై ఉ ద్యోగుల్లో చర్చ జరుగుతోంది. ఎనిమిదేళ్లుగా డిప్యు టేషన్ మీద ఉన్న ఈ సెక్షన్ అధికారి తనకు బదిలీ అయినప్పటికీ మళ్లీ ఇక్కడే డిప్యుటేషన్ మీద ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. సీనియర్ అసిస్టెంట్ హోదాలోని ఈ సెక్ష న్ అధికారి ఇతర ఉద్యోగులు, ఎంపీడీవోలతో సైతం గుర్రుగా మాట్లాడతాడని పలువురు చెబుతున్నారు. జిల్లా ప్రజాపరిషత్ పాలకవర్గం కాలపరిమితి పూర్తి అయ్యాక గత రెండేళ్ల కాలంలో సుమారు 12 మంది ఉద్యోగులు ఇష్టారీతిన డిప్యుటేషన్లు చేయించుకుని కొనసాగుతున్నారు. మళ్లీ తాజా బదిలీల కౌన్సెలింగ్ తరువాత డిప్యుటేషన్లు కొనసాగించుకునేందుకు లెక్కలు వేసుకుని కథ నడిపిస్తుండడం గ మనార్హం. ఎవరిని ఎటు పంపాలి, ఎవరిని ఎక్కడ సర్దుబాటు చేయాలనే విషయమై ఈ కొందరు ఉద్యోగులే నిర్ణయిస్తుండడం విశేషం. ఇందులో భా గంగా ఉద్యోగోన్నతిపై ఇతర జిల్లాకు బదిలీపై వెళ్లిన వ్యక్తిని సైతం ఫారిన్ సర్వీసు కింద మళ్లీ ఈ జిల్లాకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవహారాల నేపథ్యంలో సిన్సియర్గా నిబద్ధతతో పనిచేసే ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఓ మండలం నుంచి మరో మండలానికి బదిలీ అయిన సూపరింటెండెంట్ ఒకరిని మళ్లీ జెడ్పీకి డిప్యుటేషన్పై తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. జెడ్పీ నుంచి ఫారిన్ సర్వీసులో భాగంగా మైనారిటీ వెల్ఫేర్లో ఐదేళ్లు పనిచేసిన ఒక ఉద్యోగిపై పలు అవకతవకల ఆరోపణలు ఉన్నాయి. ఇతనికి నిజామాబాద్ రూరల్ నియోజకవరంగలోని ఓ మండలానికి బదిలీ అయింది. ఇతను మళ్లీ ఫారిన్ సర్వీసుకు వెళతానని తోటి ఉద్యోగుల వద్ద చాలెంజ్ చేస్తుండడం గమనార్హం. మొదటగా జెడ్పీకి వెళ్లి తరువాత మరోసారి ఫారిన్ సర్వీసులో భాగంగా మైనారిటీ వెల్ఫేర్కు వెళతానని చెబుతున్నాడు. ఇతను పదేళ్ల పాటు ఫారిన్ సర్వీసులో ఉండడంపై ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. సుదీర్ఘకాలం తిష్ట వేసి, మళ్లీ కొనసాగేందుకు గాను డిప్యుటేషన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న ఈ ఉద్యోగులు వికలాంగ ఉద్యోగులను సైతం తమ ప్రయోజనాల కోసం ఇబ్బందులకు గురి చేస్తున్న ట్లు సదరు ఉద్యోగులు వాపోతున్నారు. కలెక్టర్ దృష్టి సారించి పనితీరును బట్టి సిన్సియర్గా పనిచేసే ఉద్యోగులకు అన్యాయం జరుగకుండా చూడాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు.బోధన్ నియోజకవర్గంలో ఒక మండలంలో ఇప్పటివరకు సూపరింటెండెంట్గా పనిచేసిన ఒకరు అదే నియోజకవర్గంలోని మరో మండలానికి ఇన్చార్జి ఎంపీడీవో అదనపు బాధ్యతలు నిర్వహించాడు. ప్రస్తుతం ఈ ఉద్యోగికి ఆర్మూర్ ని యోజకవర్గంలోని ఒక మండలానికి బదిలీ అ యింది. ఆర్మూర్ నియోజకవర్గంలో సదరు మండలంలో పనిచేసే సూపరింటెండెంట్కు బోధన్ నియోజకవర్గంలోని సదరు మండలానికి బదిలీ అయింది. అయితే ఇన్చార్జి ఎంపీడీవోగా పనిచేసిన సదరు సూపరింటెండెంట్ ఇప్పటివరకు పనిచేసిన మండలంలోనే సూపరింటెండెంట్గా, పక్క మండలంలో మరోసారి ఎంపీడీవోగా కొనసాగేందుకు డిప్యుటేషన్ ప్రయత్నాలు చేస్తున్నా డు. ఇందులో భాగంగా బదిలీపై వస్తున్న సదరు ఉద్యోగిని బోధన్ నియోజకవర్గంలోని మరో మండలం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఒత్తిడి చేస్తుండడం గమనార్హం. మా డిప్యుటేషన్ల లెక్కలు మాకున్నాయ్! బదిలీ అయినా మళ్లీ నచ్చిన పోస్టుల్లోకే వెళ్లేందుకు కొందరి మంత్రాంగం జిల్లా ప్రజాపరిషత్లో కీ రోల్ పోషిస్తున్న ఓ సెక్షన్ అధికారి నిబద్ధతతో పనిచేసే ఉద్యోగులకు మానసిక వేదన కలెక్టర్ దృష్టి సారించాలంటూ పలువురి వేడుకోలు -
ప్రజావాణికి 177 ఫిర్యాదులు
నిజామాబాద్అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 177 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, వి భుజంగరావుతో పాటు ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, డీఆర్వో బి గీత, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్ రావులకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పోలీస్ ప్రజావాణిలో 45.. నిజామాబాద్అర్బన్ : పోలీస్ ప్రజావాణిలో సోమవారం 45 ఫిర్యాదులు వచ్చాయి. సీపీ సాయిచైతన్య ఫిర్యాదులను స్వీకరించారు. తక్షణమే చట్టపరంగా సమస్యలను పరిష్కరించాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రజలు సమస్య పరిష్కారం కోసం నేరుగా పోలీసులను సంప్రదించాలని పేర్కొన్నారు. నేడు స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ తెయూ(డిచ్పల్లి): దోస్త్ కోర్సులలో స్పెషల్ కేటగిరి రెండో విడతలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు (పీహెచ్సీ/ సీఏపీ/ ఎన్సీసీ / స్పోర్ట్స్ /ఎక్స్ట్రా కరికులమ్ ఆక్టివిటీస్) ఈ నెల 26న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ వాసం చంద్రశేఖర్ సోమవా రం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెయూ అకడమిక్ ఆడిట్ సెల్ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు. డ్రంకెన్ డ్రైవ్లో ఇద్దరికి జైలు నిజామాబాద్అర్బన్: డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన ఇద్దరికి జైలు శిక్ష, మరో 30 మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సీఐ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం వాహనాల తనిఖీలు చేపట్టగా 32 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని పేర్కొన్నారు. వారిని సెకండ్క్లాస్ మేజిస్ట్రేట్ హైమ ద్ మొయినుద్దీన్ ఎదుట ప్రవేశపెట్టగా కొయ్యడ శ్రీశైలం, వినోద్ కుమార్లకు వారం రోజులు జైలు శిక్ష విధించారు. -
అడ్మిషన్ ప్లీజ్..
ఆర్మూర్: ప్రైవేట్ పాఠశాలల టీచర్ల బతుకులు దయనీయంగా మారాయి. వేతనం కోసం మండుటెండలో యాజమాన్యాలు నిర్దేశించిన పిల్లల అడ్మిషన్ల కోసం వీధుల బాట పట్టారు. జిల్లాలో మొత్తం 1,426 ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ ఉ న్నాయి. వీటిలో సుమారు 250 వరకు ప్రైవే టు స్కూల్స్ ఉన్నాయి. ఒక్కో స్కూల్లో సగటున 20 నుంచి వంద మంది టీచర్లు విధులు నిర్వహి స్తున్నారు. ఈ లెక్కన జిల్లాలో 10 వేలకు పైగా ప్రైవేట్ టీచర్లు ఉంటారని అంచనా. వీరికి నెల వేతనం రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు ఉన్నాయి. ఈ వేతనం కూడా వేసవి సెలవుల్లో ఇవ్వరు. ఇక్కడే వేతనం కోసం ఎదురు చూసే ప్రైవేటు టీచర్ల నిస్సహాయతను ఆసరా చేసుకు ని ప్రైవేట్ పాఠశాలల యాజమన్యాలు వారికి అడ్మిషన్ల పనులు పురమాయిస్తున్నారు. ప్రతి ప్రైవేట్ టీచర్ రెండు నెలల్లో పది అడ్మిషన్లు తే వాలి. లేకపోతే ఏప్రిల్, మే జీతాలు ఇవ్వం అని తెగేసి చెబుతున్నారు. దీంతో తప్పేది లేక పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లో సైతం ఎండను లెక్క చేయకుండా ప్రైవేట్ టీచర్లు ఉదయం, సాయంత్రం ఇంటింటికీ తిరిగి అడ్మి షన్లు అడుగుతున్నారు. ఇది చాలదు అన్నట్లు పాఠశాల యాజమాన్యాలు ఉపాధ్యాయుల లొకేషన్ను వాట్సప్లో తెప్పించుకొని మానిటరింగ్ చేస్తూ వేధింపులకు సైతం పాల్ప డుతున్నారు. టీచర్ అంటే సమాజంలో గౌరవం. కానీ ఇప్పుడు తల్లిదండ్రుల కాళ్లు పట్టుకుని మా స్కూల్లో చేర్పించండి అని అడగాల్సి వస్తోంది. చాలా అవమానంగా ఉంది అంటూ ప్రైవేట్ టీచర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ల కోసం ఎండలో ఇంటింటికీ తిరుగుతున్న టీచర్లుఉద్యోగం మానేస్తూ.. ప్రైవేటు పాఠశాలలతో పాటు పలు ప్రైవేటు కళాశాలల్లో యాజమాన్యాలు టీచర్స్కు వేతనాలు ఇవ్వని కారణంగా చాలా మంది టీచర్లు ఉద్యోగాలు మానేసి కూలీ పనులకు వెళ్తున్నారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన ఒక ప్రైవేట్ టీచర్ పెర్కిట్లో టిఫిన్ సెంటర్ పెట్టుకొన్నాడు. కోవిడ్ సమయంలో వేతనాలు ఇవ్వని కారణంగా చాలా మంది ప్రైవేట్ టీచర్లు స్వయం ఉపాధి కల్పించుకోవడమో లేక కూలీ పనికి వెల్లడమో చేసారు. ప్రభుత్వమే బడిబాట చేస్తోంది..వేతనాల సాకుతో టీచర్స్తో వెట్టి చాకిరీ చేయిస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలు ప్రభు త్వం కూడా బడి బాట పేరుతో టీచర్లను అడ్మిషన్ల కోసం పంపిస్తోంది. మేము చేయి స్తే తప్పేంటి మాకు వేరే దారి లేదు అంటు న్నారు. టీచర్ ఇంటికి వెళ్లి అడిగితేనే పేరెంట్స్ పిల్లల్ని చేర్పిస్తున్నారు అంటూ తప్పించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రభు త్వ పాఠశాలల ఉపాధ్యాయుల వేతనాలు, పని దినాలు, పని ఒత్తిడిని ప్రైవేట్ టీచర్లతో పోల్చితే ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఎక్కడా పొంతన కుదరదు. పిల్లల తల్లిదండ్రులను వేడుకుంటున్న ప్రైవేట్ టీచర్లు వేతనాల కోసం మండుటెండలో తంటాలు దయనీయంగా మారిన బతుకులు వేతనం కోసం తప్పడం లేదు.. కుటుంబ పోషణ నా భర్త ఒక్కడి వల్లనే కావడం లేదని ఆయనకు చేదోడువాదోడుగా ఉందామని ప్రై వేట్ స్కూల్లో చేరాను. రెండు నెలలు వేతనం రాకపోతే చిట్టిలు, మహిళా సంఘంలో తీసుకున్న రుణాలకు డబ్బులు కట్టడం ఇబ్బందిగా మారుతుంది. తప్పని పరిస్థితుల్లో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులను వేడుకోవాల్సి వస్తోంది. – లలిత, ప్రైవేట్ టీచర్, ఆర్మూర్ చదువుకు తగ్గ గౌరవం లభించడం లేదు.. చదువుకున్నాము కదా ఖాళీగా ఉండటం ఎందుకులే అని ప్రైవేట్ స్కూల్లో చేరితే ఆ చదువుకు తగ్గ గౌరవం లభించడం లేదు. వేసవి సెలవుల్లో వేతనం కోసం అడ్మిషన్ల వేటలో మేము టీచర్లము అనే ఆత్మాభిమానాన్ని సైతం కోల్పోతున్నాము. – రమణ, ప్రైవేట్ టీచర్, ఆర్మూర్ -
మేలు రకం విత్తనాలను వినియోగించాలి
● రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి నిజామాబాద్అర్బన్ : వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనల మేరకు మేలైన పంటలు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సరిపడా ఎరువులు, విత్తనాల పంపిణీపై చర్చించి, అధికారులకు సూచనలు చేశారు. అనంతరం సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈసారి ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ సూచనలు చేసినందున, తక్కువ నీటి వినియోగం అవసరం అయ్యే స్వల్పకాలిక పంటలను సాగు చేయాలని రైతులను కోరారు. వరి పంటకే పరిమితం కాకుండా జొన్న, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు వంటి పంటలను సాగు చేయాలని హితవు పలికారు. యువతకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు యువత విరివిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా జిల్లా కేంద్రంలోని న్యాక్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు. శిక్షణ తరగతుల ఏర్పాట్లపై సోమవారం కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి అధికారులతో చర్చించారు. సాంకేతిక విద్యకు సీఎం రేవంత్ రెడ్డి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని గుర్తు చేశారు. మూడు నెలలపాటు వివిధ అంశాలపై ఇచ్చే శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్ పర్సన్ డాక్టర్ కవితా రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నిందితుల కోసం గాలింపు
నిజామాబాద్అర్బన్: నగరంలోని ఫూలాంగ్ వాగు సమీపంలో ఆదివారం జరిగిన హత్య కేసులో నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు నాలుగో టౌన్ ఎస్హెచ్వో సతీశ్ తెలిపారు. అగర్వాల్ ఐ ఆస్పత్రి వెనకాల ఉన్న కల్లు బట్టిలో రాత్రి నలుగురు మధ్య గొడవ జరిగింది. పాటిగల్లికి చెందిన షాకీర్, శివ కలిసి బట్టీలో కల్లు సేవిస్తున్నారు. అక్కడ మరో ఇద్దరితో వీరికి గొడవ జరిగింది. షాకీర్ను బయటకు తీసుకొచ్చి బండరాయితో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శివ తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలయ్యాడు. ఘటనపై ఎస్హెచ్వో సతీశ్ విచారణ జరిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పేర్కొన్నారు. -
సీఎంని కలిసిన చంద్రశేఖర్ గౌడ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర కల్లు గీత కార్మిక సహకార, ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్ సోమవారం హైదరా బాద్లోని క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంను శాలువాతో సన్మానించారు. తనపై నమ్మకంతో రాష్ట్ర కల్లు గీత కార్మిక సహకార, ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్గా నియమించినందుకు చంద్రశేఖర్ గౌడ్ రేవంత్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతోపాటు రాష్ట్రంలోని కల్లు గీత కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని సీఎం రేవంత్రెడ్డి సూచించినట్లు చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని, మరో పదేళ్లు సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయ మని ఆయన ధీమా వ్యక్తంచేశారు. డిచ్పల్లి: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్ఎస్ఈటీఐ) ఆధ్వర్యంలో జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే ఉచిత శిక్షణ కోర్సులకు గ్రామీణ మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ ఎం.రవికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. టైలరింగ్ (31రోజులు), మగ్గం వర్క్ (31రోజులు), బ్యూటీపార్లర్ (35 రోజులు) కోర్సులలో ఉచిత శిక్షణనిస్తారని తెలిపారు. ఉచిత భోజన సదుపాయం, హాస్టల్ వసతి కల్పిస్తారని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన 19 నుంచి 45 సంవత్సరాల వయసు కలిగి ఉన్న గ్రామీణ ప్రాంత యువతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 08461– 295428 నెంబర్ను సంప్రదించాలని డైరెక్టర్ తెలిపారు. నిజామాబాద్అర్బన్: జిల్లాలో ఐదుగురు కానిస్టేబుళ్లకు హెడ్కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. సీపీ సాయిచైతన్య సోమవారం పదోన్న తి పొందిన హెడ్ కానిస్టేబుళ్లను అభినందించా రు. పదోన్నతి పొందిన వారిలో ఎండీ ఖలీల్ , గౌరీ శంకర్, శివకుమార్, దూప్సింగ్, శ్రీనివాస్ రావు ఉన్నారు. -
రేంజ్ ఆఫీసర్పై చర్యలేవి
సాక్షిప్రతినిధి,నిజామాబాద్: అటవీ శాఖలో నిజామాబాద్ సౌత్ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ (ఎఫ్ఆర్వో) రాధిక డీజిల్ వినియోగంలో అక్రమాలకు పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలు నిజమయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 26న సాక్షిలో ప్రచురించిన ‘అడవిలో డీజిల్ డ్రంకర్స్’ కథనంపై నిజామాబాద్ ఎఫ్డీవో సుధాకర్ స్పందించి విచారణ జరిపారు. అక్రమాలు జరిగినట్లుగా గుర్తించిన ఆయన విచారణ నివేదికను మార్చి 16న అప్పటి జిల్లా అటవీ అధికారి (డీఎఫ్వో) వికాస్మీనాకు పంపించారు. అక్కడి నుంచి రాష్ట్ర అటవీ ఉన్నతాధికారి (పీసీసీఎఫ్)కు వెళ్లిందో లేదో తెలియడం లేదు. అయితే, విచారణలో అవినీతి జరిగిందని నిగ్గు తేల్చినా ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అనుమానం కలుగుతోంది. జిల్లా స్థాయిలోనే ఓ అధికారి ఆమైపె చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నారని, ఫైలును తెరపైకి రాకుండా చూస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం కొత్త డీఎఫ్వో సిద్దార్థ్ విక్రమ్ సింగ్ వచ్చినా కూడా ఈ విషయంలో ఎలాంటి కదలిక లేకపోవడం గమనార్హం. ప్రజలు అటవీ చట్టాలను ఉల్లంఘించిన వెంటనే వారిపై తక్షణ చర్యలు తీసుకునే అటవీ అధికారులే అవినీతికి పాల్పడితే వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. జరిగిన అవినీతి ఇదీ.. నిజామాబాద్ సౌత్ రేంజ్ అధికారిగా రాధిక పని చేసిన కాలంలో ప్రభుత్వం వాహనంలో డీజిల్ పోసినట్లుగా చూపడంతో పాటు దాని మీటర్ రీడింగ్ ట్యాంపరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇన్చార్జ్ ఎఫ్ఆర్వో ఇచ్చిన నివేదిక ఆధారంగా నిజామాబాద్ ఎఫ్డీవో సుధాకర్ డీఎఫ్వోకు నివేదికను పంపాల్సి ఉండగా కొంత జాప్యం జరిగినట్లు తెలిసింది. అధికారిణిపై విచారణ జరుగుతోందని ‘సాక్షి’లో కథనాన్ని ప్రచురించగా విచారణ మరింత లోతుగా జరిగింది. అటవీ శాఖకు చెందిన ప్రభుత్వ జీపు 99,999 కిలో మీటర్లు పూర్తి చేసుకున్న తర్వాత మళ్లీ సున్నా నుంచి మొదలు కావాలి. కానీ, సదరు అధికారిణి 1,11,523 కిలో మీటర్లు తిరిగినట్లు చూపెట్టడంతో ట్యాంపరింగ్ జరిగిందని నివేదికలో పేర్కొన్నారు. తప్పుడు డీజిల్ బిల్లులు సమర్పించినట్లు గుర్తించారు. విచారణలో నిజం నిగ్గు తేలినా కూడా రెండు నెలలుగా ఆమైపె ఎలాంటి చర్యలు కానరాకపోవడం గమనార్హం. ఈ విషయంపై ప్రస్తుతం డీఎఫ్వో సిద్దార్థ్ విక్రమ్సింగ్ను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.మీటర్ రీడింగ్ ట్యాంపర్ చేసిన జీపు ఇదే.. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం వెనకడుగు వేస్తున్న అధికారులు డీజిల్లో అక్రమాలు నిజమేనని ‘సాక్షి’ కథనం ఆధారంగా విచారణ నివేదిక అయినా చర్యలకు తాత్సారం చేస్తున్న అటవీ ఉన్నతాధికారులు ఒత్తిళ్లకు తలొగ్గినట్లుగా అనుమానాలు -
60వ పెళ్లి రోజునే మాజీ మంత్రికి సతీ వియోగం
● అనారోగ్యంతో శనిగరం సంతోష్రెడ్డి సతీమణి మృతి ● హైదరాబాద్కు తరలివెళ్లిన అభిమానులు ● 27న అంత్యక్రియలు ఆర్మూర్/కమ్మర్పల్లి : ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శనిగరం సంతోష్రెడ్డికి సతీ వియోగం కలిగింది. ఆయన సతీమణి శనిగరం విజయరెడ్డి (80) హైదరాబాద్లోని కొండాపూర్లో గల నివాసంలో అనారోగ్యంతో డయాలసిస్ చికిత్స పొందుతున్నారు. కాగా, సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. శనిగరం సంతోష్రెడ్డి, విజయరెడ్డిల 60వ పెళ్లి రోజునే ఆమె మరణించడంతో వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భీమ్గల్ మండలం ముచ్కూర్కు చెందిన సంతోష్రెడ్డికి ఆర్మూర్ మండలం కల్లెడకు చెందిన విజయరెడ్డితో 1966 మే 25వ తేదీన వివాహం జరిగింది. వారికి కూతురు మాధవి రెడ్డి (బోధన్కు చెందిన కెప్టెన్ కరుణాకర్రెడ్డి సతీమణి), కుమారుడు శనిగరం శ్రీనివాస్రెడ్డి(వాసుబాబు) ఉన్నారు. మనవడు ఆర్మమన్ అమెరికా నుంచి రావాల్సి ఉండటంతో ఈ నెల 27న అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ మంత్రికి సతీవియోగం కలగడంతో మంత్రి శ్రీధర్బాబు, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలతోపాటు జిల్లా వ్యాప్తంగా ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, అనుచరులు వెంకట్రామ్రెడ్డి, మారుతిరెడ్డి, వెంకట గిరి హైదరాబాద్కు తరలివెల్లి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు
కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్అర్బన్: ఖరీఫ్ సీజన్ను దృష్టిలో పెట్టుకొని జిల్లాలో నకిలీ విత్తనాలు చెలామణి కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. రైతాంగ ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతోపాటు ఎరువులు విత్తనాల డీలర్లు, రైస్ మిల్లర్లతో కలెక్టర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఖరీఫ్ పంటల సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాల కొరత తలెత్తకుండా రైతులకు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీల ద్వారా మార్కెట్లో చెలామణి అయ్యే అన్ని రకాల విత్తనాలను క్రమబద్ధీకరించాలని ఆదేశించారు. ఏవోలు, ఏఈవోలు నకిలీ విత్తనాల బెడద లేకుండా తనిఖీలు నిర్వహించాలని అన్నారు. నకిలీ, నాసిరకం విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేయటంతోపాటు కేసులు నమోదు చేసి రికవరీ యాక్టు అమలు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, డీఎస్వో శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లయ్ డీఎం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


