సుభాష్నగర్: బాలికలకు హెచ్పీవీ(హ్యూమన్ పాపిల్లోమా వైరస్) టీకా ఇప్పించాలని డీఎంహెచ్వో రాజశ్రీ అన్నారు. జిల్లా కేంద్రంలోని త న కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేక రుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ నెల 8న నిర్వహించను న్న హెచ్పీవీ టీ కార్యక్రమాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభిస్తారని అన్నారు. 14 ఏళ్ల లోపు బాలికలంద రికి ఈ హెచ్పీవీ టీకాను అందించనున్నట్లు ఆమె పే ర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధి కారి డాక్టర్ అశోక్, పాలన అధికారి సుమంత్ కుమార్, డీహెచ్ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


