మున్నూరు కాపులు ఐక్యంగా ఉండాలి
● అభివృద్ధి కోసం పాటుపడాలి
● మాజీ మేయర్ ధర్మపురి సంజయ్
నిజామాబాద్ రూరల్: మున్నూరు కాపు కులస్తులంతా ఐక్యంగా ఉండి అభివృద్ధి కోసం పాటుపడాలని మాజీ మేయర్, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘంలో జిల్లా మున్నూరు కాపు, కార్పొరేటర్లను, కౌన్సిలర్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులస్తులందరూ ఒక తాటిపైకి వచ్చి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడమే ఈకార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. డీఎస్ అడుగుజాడల్లో అందరిని కలుపుకుపోతామన్నారు. కొందరి నాయకుల స్వార్థ రాజకీయాలకు అమాయకులు బలవుతున్నారన్నారు.


