సాక్షి, మహబూబాబాద్ జిల్లా: డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్కు తృటిలో ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారులో పవర్ బ్యాంక్ ఒక్కసారిగా పేలడంతో కారు క్యాబిన్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా చింతపల్లి గ్రామ పరిసరాల్లో చోటుచేసుకుంది.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రజాపాలన ఉత్సవాల్లో పాల్గొని జెండా ఆవిష్కరించేందుకు మహబూబాబాద్ కలెక్టరేట్కు ఎమ్మెల్యే రాంచంద్ర నాయక్ బయలుదేరారు. అయితే, చింతపల్లి వద్దకు రాగానే ఆయన ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న పవర్ బ్యాంక్ పేలడంతో ఒక్కసారిగా కేబిన్లో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన ఎమ్మెల్యే, సిబ్బంది వెంటనే వాహనం నుంచి బయటకు దిగడంతో ప్రమాదం తప్పింది. అయితే, డ్రైవర్కు మాత్రం స్వల్ప గాయాలు అయ్యాయి.
భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం పెద్దదిగా మారలేదు. అనంతరం ఎమ్మెల్యే మరో వాహనంలో మహబూబాబాద్కు బయలుదేరి వెళ్లారు. ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారని తెలిసి అధికారులు, స్థానికులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, పవర్ బ్యాంక్ పేలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్కి తప్పిన ప్రమాదం
ఎమ్మెల్యే వాహనంలో పవర్ బ్యాంక్ పేలి కారులో చెలరేగిన మంటలు
డ్రైవర్కి స్వల్ప గాయాలు.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది
మహబూబాబాద్లో జరిగే విమోచన దినోత్సవ జెండా కార్యక్రమానికి వెళ్తుండగా చింతపల్లి గ్రామ పరిసరాల్లో… pic.twitter.com/dR5qFiKciq— Telugu Scribe (@TeluguScribe) September 17, 2026
Video Credit: Telugu Scribe
ఇదీ చదవండి: మా ఆస్తులపై అసెంబ్లీలో చర్చకు సిద్దం: కేటీఆర్


