breaking news
Peddapalli District News
-
పోలీస్ తనిఖీలు ప్రారంభం
● అక్రమ నగదు రవాణాకు అడ్డుకట్ట ● రూ.50వేలకు పైగా తరలిస్తే సీజ్ ● పలు ప్రాంతాల్లో తనిఖీలు విస్తృతం గోదావరిఖని: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళవారం రాత్రి జిల్లాలోని పలు కూడళ్లలో పోలీసులు మోహరించి వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. బస్సులు, ఆటోలు, కార్లు, ద్విచక్రవాహనాలను ఆపి సోదాలు చేశారు. ప్రధానంగా నగదు రవాణాపై ప్రత్యేక దృష్టి సారించారు. పోలీస్స్టేషన్ సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల సరిహద్దు ప్రాంతమైన గోదావరి వంతెనపై ప్రత్యేక చెక్పోస్టు ఏర్పాటు చేశారు. దీంతోపాటు వాహనాలు ఎక్కువగా తిరిగే ప్రాంతాలపై నిఘా పెట్టారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్ నేతృత్వంలో గోదావరిఖని వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు రమేశ్ తదితరులు తనిఖీల్లో పాల్గొంటున్నారు. అనుమతి లేకుండా రూ.50వేల కన్నా ఎక్కువ నగదు తీసుకెళ్తే సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల నిబంధనల మేరకు కఠినంగా వ్యవహరించనున్నట్లు వారు వివరించారు. మంథనిలో వాహనాల తనిఖీ.. మంథని: స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ ఖరారు కావడంతో మంథనిలోని అధికార యంత్రాంగం అవసరమైన చర్యల్లో నిమగ్నమైంది. మంగళవారం రాత్రి మంథనిలో వాహనాల తనిఖీ ము మ్మరం చేసింది. స్థానిక పాతపెట్రోల్ బంక్ చౌరస్తాతోపాటు పలు ప్రధాన రహదారుల వెంట పోలీసు లు సోదాలు చేశారు. డబ్బు, మద్యంతోపాటు ఇతరత్రా విలువైన వస్తువులు తరలిపోకుండా పోలీసు లు ముందస్తుగానే చర్యలకు ఉపక్రమించారు. కన్నాల టోల్ప్లాజా వద్ద.. పాలకుర్తి(రామగుండం): బసంత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని కన్నాల టోల్ప్లాజా వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో బసంత్నగర్ ఎస్సై స్వామితోపాటు పోలీస్సిబ్బంది వాహనాలు తనిఖీ చేశారు. సరైన ధ్రువీకరణపత్రాలు లేకుండా రూ.50వేల కన్నా అధిక మొత్తంలో నగదు తరలించొద్దని ఎస్సై సూచించారు. ధ్రువీకరణపత్రాలు లేని వాహనదారులకు జరిమానా విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేశారు. -
దావత్ షురూ!
‘తమ్మీ.. మన కులపెద్ద మనుషులతో మాట్లాడు.. దసరాకు యాటను కొనిస్త.. మీ కులసంఘంలోని ప్రతీఇంటికి పోగు చేరేలా నువ్వే చూసుకో.. ముఖ్యమైనోళ్లు ఉంటే చెప్పు.. వారికి క్వార్టర్ మందు కూడా ఇద్దాం.. ఎన్నికలప్పుడు ఓటుకు పైసలు గూడా ఇచ్చుడే.. కానీ గంపగుత్తగా ఓట్లు నాకే పడాలే.. మల్లా ఎవరికీ మాటివ్వకు’ – ఓ గ్రామానికి చెందిన సర్పంచ్ స్థానం ఆశావహుడి ఆఫర్ ‘అన్నా.. పార్టీలో కొన్నేళ్లుగా కష్టపడి పనిచేస్తున్న.. అధికారంలో ఉన్నా, లేకున్నా పార్టీతోనే ఉన్న.. ఇప్పుడు రిజర్వేషన్ కలిసొచ్చింది.. ఎమ్మెల్యే కూడా నాకు టికెట్ కన్ఫర్మ్ చేసిండు.. ఎంతఖర్చయినా పర్లేదు పెడత.. నాకు ఫుల్సపోర్ట్ జేస్తే.. జెడ్పీటీసీగా గెలుస్త’ – ముఖ్య నేతలతో దావత్ ఇస్తూ ఓ జెడ్పీటీసీ ఆశావహుడి వేడుకోలుసాక్షి పెద్దపల్లి: ఎన్నికలు అంటే సుక్క.. దసరా అంటే ముక్క.. ఇప్పుడు ఈ రెండు పెద్దపండుగలు కలిసే వచ్చా యి. పైగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. పండుగ సందర్భంగా ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఆశావహులు ప్రలో భాలకు తెరతీస్తున్నారు. గ్రామాల్లో కులపెద్దలు, నలుగురిని ప్రభావితం చేసే కార్యకర్తలను మద్యంతో దావత్లు షురూ చేశారు. దసరా సందర్భంగా ఓటర్లకు మటన్పోగులు పంచిపెడుతూ ఖుషీ చేసేందుకు గ్రౌండ్వర్క్ చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా స్థానిక ఎన్నికలు జరిగే పల్లెల్లో ఎన్నికల వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మరికొందరు దసరా పండుగ రోజు రావణవధ కార్యక్రమాన్ని తమ సొంత డబ్బుతో భారీఎత్తున నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారు. మామూళ్లతో ముచ్చెముటలు తెలంగాణలో అతి పెద్దపండుగ దసరాకు నేతలు, ఊరులో పలుకుబడి కలిగినవారు తమ అనుచరులకు, తమ వద్ద పని చేసుకునేవారికి పండుగ సందర్భంగా ఎంతోకొంత దావత్ చేసుకునేందుకు డబ్బు లు ఇస్తుంటారు. కొన్నేళ్లుగా ఇది ఆనవాయితీగా వస్తోంది. పండుగ సమయంలోనే ఎన్నికలు రావడడంతో అడిగిన ప్రతీఒక్కరికి ఎంతోకొంత ముట్టజెప్పాల్సిన పరిస్థితి నెలకొందని ఆశావహులు తలలు పట్టుకుంటున్నారు. ఊళ్లకు లిక్కర్.. యథేచ్ఛగా బెల్ట్షాప్ల రన్ దసరా పండుగ రోజు వైన్స్షాప్లు మూసిఉంటాయి. ఆరోజు మహాత్మా గాంధీ జయంతి కావడంతో మాంసం, మద్యం విక్రయాలు ఉండవు. దీంతో తొలుత లిక్కర్ను పల్లెల్లోని బెల్ట్షాపులకు తరలిస్తుండగా, మరికొందరు నేతలు వైన్స్ షాప్లకు అడ్వాన్స్ చెల్లించి క్వార్టర్స్ను తమకు నమ్మకస్తుడైన లీడర్లకు చెందిన నివాసాలు, వ్యవసాయ పొలాల్లోకి డంప్ చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతోనే కోడ్ అమల్లోకి వచ్చినా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పల్లెల్లో బెల్ట్షాపులు 24గంటలపాటు తెరిచే ఉంటున్నాయి. ఎన్నికల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతాయనే ఆశతో బెల్ట్షాపు వ్యాపారులు భారీగా మద్యం డంప్ చేసుకుంటున్నారు. అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.ఆశావహులు తమ గెలుపు కోసం ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఆయా రాజకీయ పార్టీల్లోని ఆశావహులు.. కులసంఘాల ఆధారంగా మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కులంలో ఉన్నఓట్ల ఆధారంగా యాటలను కోయించి, ఇంటింటికీ మటన్ పోగులు పంపించేలా ప్లాన్ చేస్తున్నారు. పండుగపూట మచ్చిక చేసుకోకపోతే ఎన్నికల్లో ఫలితం బెడిసి కొడుతుందని.. ఒకరినిచూసి మరొకరు మద్యం, మాసం పంచేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికలు జరుగుతాయో, వాయిదా పడుతాయో అనే సందిగ్ధంలో ఉన్నా.. అశావహులు ఖర్చుకు భయపడకుండా వర్గాల వారీగా ఓటర్లను ఆకట్టుకునేందుకు వెనకాడడంలేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 60 జెడ్పీటీసీ, 646 ఎంపీటీసీలు, 1,226 పంచాయతీల్లో ఐదు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. -
పురాణ నిధి యాప్ ఆవిష్కరణ
కరీంనగర్ కల్చరల్: దేవతా స్త్రోత్రాలతోపాటు పురాణ గాథలన్నీ సామాన్యులకు సైతం అర్థమయ్యేలా రూపొందించిన ‘పురాణ నిధి’ యాప్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పండితులు మంగళంపల్లి వేణుగోపాలశర్మ, పురాణం మహేశ్వరశర్మతో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. దేవతలు, హిందూ శాస్త్రాలకు సంబంధించి సామాన్యుల్లో నెలకొన్న అనేక సందేహాలను ఈ యాప్ ద్వారా నివృత్తి చేస్తుండటం సంతోషించదగ్గ పరిణామమన్నారు. బాధ్యతలు స్వీకరణ పెద్దపల్లిరూరల్: జిల్లా ఉపాధికల్పనాధికారిగా నియమితులైన రాజశేఖర్ మంగళవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం శిరసానగండ్ల గ్రామానికి చెందిన రాజశేఖర్.. గ్రూప్ – 1 పరీక్షల్లో 683వ ర్యాంక్ సాధించారు. కాగా, ఇన్చార్జి అధికారి తిరుపతిరావు నుంచి బాధ్యతలు స్వీకరించిన రాజశేఖర్.. కలెక్టర్ శ్రీహర్షను మర్యాదపూర్వకంగా కలిశారు. రిటైర్డ్ పోలీసులకు సన్మానం గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉద్యోగ విరమణ పొందిన అధికారులను మంగళవారం ఘనంగా సన్మానించారు. రిటైర్ అయిన ఆర్ఎస్ఐ శ్రీహరి, ఏఎస్ఐ బి.భాస్కర్, ఏఆర్ ఎస్ఐ కె.రమేశ్, హెడ్కానిస్టేబుల్ సీహెచ్ లక్ష్మయ్యను శాలువా లతో సన్మానించి జ్ఞాపికలు అందించారు. అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, ఏవో శ్రీనివాస్, ఐటీ కోర్ సీఐ చంద్రశేఖర్గౌడ్, రిజర్వ్ సీఐలు దామోదర్, శ్రీనివాస్, వామనమూర్తి, మల్లేశం, సూపరింటెండెంట్లు ఇంద్రసేనారెడ్డి, సందీప్, సీసీ హరీశ్ తదితరులు పాల్గొన్నారు. పూలవ్యర్థాలతో ‘కంపోస్ట్’ కోల్సిటీ/ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): స్వచ్ఛ తా హీ సేవాలో భాగంగా మంగళవారం పూలవ్యర్థాలను గోదావరిఖని గౌతమినగర్లోని కంపోస్ట్ యార్డ్కు తరలించారు. కంపోస్ట్ యార్డ్లో వీటిని సేంద్రియ ఎరువుగా మార్చనున్నట్లు రామగుండం నగర పాలక అధికారులు తెలిపారు. శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ మధుకర్ పర్యవేక్షించారు. పాండవుల గుట్టపై అధికారులు కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పీఎం కుసుం పథకంలో భాగంగా స్థానిక పాండవుల గుట్ట వద్ద నిర్మించే సోలార్ ప్లాంట్ స్థలాన్ని డీసీవో శ్రీమా ల, కరీంనగర్ కేడీసీసీబీ ప్రతినిధి సత్యనారాయణరావు మంగళవారం పరిశీలించారు. వా రివెంట సింగిల్విండో చైర్మన్ చదువు రాంచంద్రారెడ్డి, సీఈవో కోలేటి శ్రీనివాస్, బ్రాంచ్ మే నేజర్ కరుణశ్రీ, ఫీల్డ్ఆఫీసర్ ఉన్నారు. బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు పెద్దపల్లిరూరల్: రామగిరి మండలం సెంటినరీకాలనీకి చెందిన మౌంటేనర్ గిన్నిస్ వరల్డ్ రికా ర్డర్ మాస్టర్ వివేకానందరెడ్డి, మహిపాల్రెడ్డికి ఇండియా బుక్ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది. వారిని కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు. యూరప్ ఖండంలోనే ఎత్తయిన మౌంట్ ఎ ల్బ్రోస్ పర్వతాన్ని ఆగస్టు 3న అధిరోహించి ‘సే టు నో డ్రగ్స్’ బ్యానర్ ప్రదర్శించిన విషయం విదితమే. ఈ పర్వతాన్ని అధిరోహించిన తొలితండ్రీ కొడుకులుగా ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్లో వారు చోటు సాధించారు. -
ఆర్జీ–1ఏరియాలో 110శాతం ఉత్పత్తి
గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం రీజియన్లో సెప్టెంబర్లో 110శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఆర్జీ–1 జీఎం లలిత్కుమార్ వెల్లడించారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్లో 2.85లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 3.13 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించామన్నారు. జీడీకే–5 ఓసీపీ భారీగా బొగ్గు ఉత్పత్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 1.82లక్షల టన్నులకు 2.48లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. నిర్దేశిత లక్ష్యానికి మించి 136శాతం ఉత్పత్తి సాధించినట్లు ఆయన వివరించారు. రక్షణతో కూడిన ఉత్పత్తి లక్ష్య సాధనకు ప్రతీఒక్కరు కృషి చేయాలని ఆయన కోరారు. సమావేశంలో ఎస్వోటూ జీఎం ఎల్.రమేశ్, ఏరియా ఇంజినీర్ రాంమోహన్రావు, పర్సనల్ మేనేజర్ రవీందర్రెడ్డి, ఎస్ఈ రాజన్న, సీనియర్ పీవో హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల నియమావళిపై అవగాహన అవసరం
● సమన్వయంతో విధులు నిర్వర్తించాలి ● పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ సూచన రామగిరి(మంథని): ఎన్నికల నియమావళిపై పోలీస్ అధికారులు, సిబ్బందికి అవగాహన అవసరమని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ అన్నారు. సెంటినరీకాలనీ సీఎన్సీవోఏ క్లబ్లో మంగళవారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై గోదావరిఖని సబ్ డివిజన్లోని పోలీస్ అధికారులు, సిబ్బందికి డసీపీ కరుణాకర్ అవగాహన కల్పించారు. డీసీపీ మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా పోలీసులు అందరూ ఎన్నికల కమిషన్ నియంత్రణ, పర్యవేక్షణలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై అవగాహన ఉండాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ పరికరాలు తీసుకెళ్లే రూట్ చెక్ చేసుకోవాలని, లిక్కర్, గుడుంబా, గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. ఆబ్కారీశాఖ అధికారులతో సమన్వయంచేసుకుంటూ పనిచేసి, సంయుక్తంగా దాడులు చేయాలని సూచించారు. శాంతిభద్రత పరిరక్షణ లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు. ప్రజలు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకునేందుకు భరోసా కల్పించాలన్నారు. రౌడీషీటర్లు, పాతనేరస్తులను బైండోవర్ చేయాలని పేర్కొన్నారు. తనిఖీ ల సమయంలో వీడియో చిత్రీకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ రమేశ్, మంథని, గోదావరిఖని టూటౌన్ సీఐలు రాజు, ప్రసాద్రావు, రామగిరి, కమాన్పూర్, మంథని, ముత్తారం ఎస్సైలు శ్రీనివాస్, ప్రసాద్, రమేశ్, రవి కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
స్థానిక పోరుకు సర్వం సిద్ధం
● రెండు విడతల్లో ప్రాదేశిక ఎన్నికలు ● పంచాయతీలకు మూడ దశలు ● ఏర్పాట్లలో అధికారుల నిమగ్నం ● పల్లెల్లో ఎన్నికల సందడిపెద్దపల్లిరూరల్: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. ఎప్పుడెప్పుడా అనే ఉత్కంఠకు తెరదించుతూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేయడంతో అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు ఏడాదిన్నరగా ప్రత్యేకాధికారులతోనే పల్లెపాలన సాగుతోంది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వడం.. అధికారులు లాటరీ పద్ధతిన రిజర్వేషన్లు తేల్చడంతో గ్రామాల్లో సందడి మొదలైంది. పోలింగ్బూత్లు.. అధికారుల నియామకం జిల్లాలో 13 జెడ్పీటీసీ, 137 ఎంపీటీసీ స్థానాలున్నాయి. 741 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. 3,989 బ్యాలెట్ బాక్స్లు సిద్ధం చేశారు. 13 మంది రిటర్నింగ్ అధికారులు(జెడ్పీటీసీలకు), 46మంది రిటర్నింగ్ అధికారులు (ఎంపీటీసీ)లకు, 744మంది ప్రిసైడింగ్, 744 అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లను నియమించి శిక్షణ కూడా ఇప్పించారు. రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు.. జిల్లాలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు రెండువిడతలుగా పోలింగ్ నిర్వహిస్తారు. తొలివిడతలో అంతర్గాం, ధర్మారం, కమాన్పూర్, మంథని, ము త్తారం, పాలకుర్తి, రామగిరి జెడ్పీటీసీ స్థానాలు, 68 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. అలాగే మలివిడతలో పెద్దపల్లి, ఎలిగేడు, జూలపల్లి, ఓదెల, కాల్వశ్రీరాంపూర్, సుల్తానాబాద్ జెడ్పీ టీసీ స్థానాలతోపాటు 69 ఎంపీటీసీ స్థానాలకు ఎ న్నికలు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. రెండో, మూడో విడతలో పంచాయతీలకు.. జిల్లాలోని 13 మండలాల్లో గల 263 సర్పంచులు, 2,432 వార్డు సభ్యుల స్థానాలకు రెండు, మూడో విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవబంర్ 4వ తేదీన అంతర్గాం, ధర్మారం, కమాన్పూర్, మంథని, ముత్తారం, పాలకుర్తి, రామగిరి మండలాల్లోని 135 సర్పంచ్, 1,224 వార్డుస్థానాలకు రెండోవిడతలో ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 8న మూడోవిడతలో పెద్దపల్లి, ఎలిగేడు, జూలపల్లి, ఓదెల, కాల్వశ్రీరాంపూర్, సుల్తానాబాద్ మండలాల్లో 128 సర్పంచ్, 1,208 వార్డుస్థానాలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. 4,04,209 మంది ఓటర్లు జిల్లాలోని 13 మండలాల్లో గల 263 పంచాయతీల్లో 4,04,209 మంది ఓటర్లున్నారు. ఇందులో మహిళలు 2,05,451 మంది ఉండగా పురుషులు 1,98,744 మంది ఉన్నారు. మరో 14మంది ఇతరులు ఉన్నారు. మండలాల వారీగా ఓటర్లు -
బతుకమ్మ చెంత..
పంచభక్ష పరమాన్నం అవసరం లేదు.. పండుగపూట కడుపు కాస్త నిండి తే చాలనుకుంటున్నారు ఈ వృద్ధులు.. రోజంతా యాచిస్తేకానీ బతుకు బండి సాగదంటున్నారు.. రోజులు, నెలలు, సంవత్సరాలు.. ఇలా కాలం గడిచినా తమ బతుకులు ఎప్పుడు మారేదని ప్రశ్నిస్తున్నారు. ఆధునిక సమాజం సైబర్వేగంతో స్మార్ట్గా దూసుకెళ్తుంటే.. ఆకలితో అలమటిస్తు న్న అభాగ్యులు ఇలాంటివారెందరో.. జిల్లా కేంద్రంలోని అయ్యప్పగుడి చౌరస్తాలో మంగళవారం రాత్రి బతుకమ్మ బొమ్మ వద్ద భోజనం చేస్తూ ‘సాక్షి’ కెమెరాకు ఇలా కనిపించారీ వృద్ధ దంపతులు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
సరస్వతీదేవిగా అమ్మవారు
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని శ్రీలక్ష్మీగణ పతి ఆలయంలో దుర్గామాత సోమవారం మ హాసరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పెన్నులతో అమ్మవారిని అలంకరించి పుస్తకాలపూజ చేశారు. వైభవంగా శోభాయాత్ర మంథని: మంత్రపురిలో చేపట్టిన దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా మహాలక్ష్మీ అమ్మవారి శోభాయా త్ర పట్టణంలో వైభవంగా సాగింది. ప్రధాన కూడళ్లలో ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఉత్సహంగా నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. దారిపొడవునా మహిళల కోలాటాలు, భజనలు ఆకట్టుకున్నాయి. కలెక్టర్ను కలిసిన డిప్యూటీ కలెక్టర్పెద్దపల్లిరూరల్: గ్రూప్ –1 పరీక్ష ఫలితాల్లో ఉ త్తీర్ణత సాధించి జిల్లాకు వచ్చిన ట్రెయినీ డిప్యూ టీ కలెక్టర్ వనజ సోమవారం కలెక్టర్ కోయ శ్రీ హర్షను మర్యాద పూర్వకంగా కలిశారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన వనజ.. 38వ ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యారు. ఈనెల 27న సీఎం రేవంత్రెడ్డి నుంచి నియామక పత్రం అందుకున్నారు. శిక్షణ కోసం జిల్లాకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ‘భూ భారతి’తోనే పరిష్కారం పెద్దపల్లిరూరల్: భూభారతి ప్రకారం భూ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. రెవెన్యూ సదస్సులు, ప్రజావాణి ద్వారా అందిన భూ సంబంధిత అర్జీలు, మీసేవ దరఖాస్తుల పరిష్కారం సోమవారం తన కా ర్యాలయంలో సమీక్షించారు. పెద్దపల్లి, మంథని ఆర్డీవోలు గంగయ్య, సురేశ్ ఉన్నారు. ఆర్బీఎస్కే పనితీరు మెరుగుపడాలి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆరోగ్యపరీక్షలు క్రమం తప్పకుండా చేయాలని కలెక్టర్ శ్రీ హర్ష ఆదేశించారు. ఆర్బీఎస్కే బృందాల పనితీరుపై పర్యవేక్షించాలని, పీహెచ్సీల్లో ఎన్సీడీ స్క్రీనింగ్ పక్కాగా నిర్వహించాలని, టీబీ అనుమానితులను గుర్తించి నిర్ధారణ పరీక్షలు చేయా లని సూచించారు. డీఎంహెచ్వో వాణిశ్రీ, సూపరింటెండెంట్ శ్రీధర్ తదితరులు ఉన్నారు. 2న దసరా సెలవు గోదావరిఖని: సింగరేణి సంస్థలో అక్టోబరు 2వ తేదీన దసరా సెలవుగా యాజమాన్యం ప్రకటించింది. ఈమేరకు సీఆర్పీ/పీఈఆర్/ఐఆర్/హెచ్/240/1213 పేరిట సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గాంధీజయంతి, విజయదశమి సందర్భంగా అన్నిగనులు, విభాగాలు ఆరోజు పనిచేయవని వెల్లడించింది. ఆరోజు పీహెచ్డీ గా నిర్ధారించి అత్యవసర విభాగం కార్మికులకే అర్హత ప్రకారం సాధారణ వేతనంతో మూడురె ట్లు అధిక వేతనం చెల్లిస్తామని వివరించింది. నైట్షెల్టర్ ప్రాంతలో పారిశుధ్య పనులు కోల్సిటీ(రామగుండం): స్వచ్ఛతా హీ సేవలో భాగంగా సోమవారం గోదావరిఖని బస్టాండ్ సమీపంలోని నైట్ షెల్టర్ ఎదుట శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పిచ్చిమొక్కలు తొలగించి శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్, ఎకో వారియర్స్ ప్రతినిధి కరుణాకర్, మెప్మా సీవో ప్రియదర్శిని, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆశలు ఆవిరి
పెద్దపల్లిరూరల్: స్థానిక సం‘గ్రామం’ మొదలైంది. పల్లె పాలనలో పాలుపంచుకునేందుకు ఎదురుచూసిన వారి ఆశలను రిజర్వేషన్లు ఆవిరి చేశాయి. పోరులో సత్తా చాటాలని ఉవ్విళూరిన ప్రజాప్రతినిధుల ముఖ్య అనుచరగణానికి రిజర్వేషన్లు షాక్ ఇచ్చాయి. రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో పోటీ చేయలేని పరిస్థితులకు కారణమేంటోనని విశ్లేషించుకుంటున్న నేతలు.. నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధుల వద్దకు పరుగులు తీస్తున్నారు. తామేమి చేసేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. రిజర్వేషన్ల ప్రక్రియలో తమ జోక్యమేమీ లేదని, అధికారులు నిబంధనల మేరకే వ్యవహరించారని అనుచరగణాన్ని బుజ్జగించినట్లు తెలిసింది. జాతకాలు తారుమారు పల్లెపోరకు సై అంటూ కలలు గన్న నేతలకు రిజర్వేషన్లు కలిసి రాకపోగా.. మరికొందరికి.. ముఖ్యంగా యువనేతలకు అనూహ్యంగా రిజర్వేషన్లు కలిసివచ్చాయి. సర్పంచ్, వార్డు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు కలిసివచ్చిన కొందరు పోటీకి సై అంటున్నారు. లాటరీ పద్ధతిన అధికారులు రిజర్వేషన్లు ప్రకటించగా.. ముఖ్య నేతలను నిరాశలోకి నెట్టేశాయి. బీసీలకు ప్రాధాన్యం స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ప్రభుత్వం గెజిట్ కూడా జారీచేసింది. పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్థానం జనరల్ మహిళ కు దక్కనుంది. రాష్ట్రప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు పర్చాలనే ఆలోచనతో బీసీలకు ప్రాధాన్యం పెరిగింది. అందులో 50శాతం మహిళలకు కేటాయించడంతో జిల్లాలోని 13 జెడ్పీటీసీ స్థానాల్లో ఆరు మహిళలకే దక్కాయి. బీసీలకు 06, జనరల్కు 04, ఎస్సీలకు 03 స్థానాలు కేటాయించారు. ఎంపీపీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు ఇవే.. మండలం జెడ్పీటీసీ ఎంపీపీ పెద్దపల్లి బీసీ(మహిళ) జనరల్ అంతర్గాం బీసీ మహిళ బీసీ జనరల్ శ్రీరాంపూర్ బీసీ మహిళ జనరల్ మహిళ మంథని బీసీ జనరల్ బీసీ మహిళ రామగిరి బీసీ జనరల్ బీసీ జనరల్ సుల్తానాబాద్ బీసి జనరల్ బీసీ మహిళ జూలపల్లి ఎస్సీ మహిళ ఎస్సీ మహిళ ధర్మారం ఎస్సీ జనరల్ బీసీ జనరల్ పాలకుర్తి ఎస్సీ జనరల్ ఎస్సీ జనరల్ కమాన్పూర్ జనరల్ మహిళ జనరల్ ఓదెల జనరల్ మహిళ జనరల్ ఎలిగేడు జనరల్ ఎస్సీ జనరల్ ముత్తారం జనరల్ జనరల్ మహిళ -
ఇక సంగ్రామమే..
జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మొత్తం జెడ్పీ చైర్మన్ కరీంనగర్ 03 00 06 06 15 బీసీ(జనరల్) సిరిసిల్ల 03 01 05 03 12 ఎస్సీ(జనరల్) జగిత్యాల 04 01 09 06 20 మహిళ(జనరల్) పెద్దపల్లి 06 03 00 04 13 మహిళ(జనరల్)సాక్షిప్రతినిధి, కరీంనగర్: సా్థనిక ఎన్నికలకు నగారా మోగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీతోపాటు గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. తొలుత రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ.. తదుపరి మూడు దశల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. వచ్చే నెల 9నుంచి నవంబర్ 11వరకు ఎన్నికల పక్రియ కొనసాగనుంది. 33 రోజుల పాటు కోడ్ అమల్లో ఉండనుంది. పల్లెల్లో రాజకీయ సందడి జోరందుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ గెలుపే లక్ష్యంగా గ్రామాల వారీగా బలమైన అభ్యర్థుల కోసం వెతుకులాట ప్రారంభించగా, ఆశావహులు ఒక్కచాన్స్ ఇవ్వండంటూ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గతంకు భిన్నంగా... ఎప్పుడైనా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చే శాక, పంచాయతీ ఎన్నికలు నిర్వహించేవారు. ఈసారి రెండు ఎన్నికలను కలిపి నిర్వహిస్తుండటంతో పోటీ చేసి ఓడిపోతే ఇంట్లోనే కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆశావహులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 646 ఎంపీటీసీ, 60 ఎంపీపీ, 60 జెడ్పీటీసీలకు, 1,226 సర్పంచ్ స్థానాలకు, 5,968 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం సీట్ల ల్లో 50శాతం తగ్గకుండా మహిళలకు కేటాయించారు. ముగ్గురు పిల్లలుంటే అనర్హులే.. కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించేందుకు 1994లో పంచాయతీరాజ్ చట్టంలో ఈ నిబంధన తీసుకొచ్చారు. దీని ప్రకారం ముగ్గురు పిల్ల లుంటే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. తాజాగా ప్రభుత్వం ఈ నిబంధన ఎత్తివేయాలని ఆలోచించినా పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 21(3)ని సవరించలేదు. దీంతో ముగ్గురు పిల్లలు నిబంధన యథాతథంగా ఉండనుంది. కోర్టులో ఉండడంతో.. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రామచంద్రపల్లి, కుర్మపల్లి గ్రామాల విషయం కోర్టు పరిధిలో ఉండగా రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టలేదు. మరోవైపు జిల్లా రిజర్వేషన్ల ప్రక్రియ వివరాలు వెల్లడించేందుకు జిల్లా పంచాయతీ అధికారి, డీపీఆర్వో సుముఖత చూపలేదు.జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మొత్తం కరీంనగర్ 39 00 73 58 170 సిరిసిల్ల 25 07 56 35 123 జగిత్యాల 26 07 52 41 126 పెద్దపల్లి 25 03 59 50 137జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మొత్తం కరీంనగర్ 03 00 06 06 15 సిరిసిల్ల 03 01 05 03 12 జగిత్యాల 04 01 08 07 20 పెద్దపల్లి 05 03 00 05 13జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మొత్తం సిరిసిల్ల 53 30 101 76 260 జగిత్యాల 68 31 153 133 385 పెద్దపల్లి 54 06 110 93 263 కరీంనగర్ – – – – – -
మురిసిన బతుకమ్మ
ఈనెల 21వ తేదీన ఎంగిలిపూలతో ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు.. తొమ్మిదిరోజులపాటు అత్యంత వైభవంగా జరిగాయి.. తీరొక్కపూలతో పేర్చిన బతుకమ్మలతో రోజుకోరీతిన తెలంగాణ ఆడబిడ్డలు ఆటాపాటలతో సంబురాలు చేసుకున్నారు. మహిళలు, యువతులు, విద్యార్థినుల చప్పట్లతో ప్రారంభమైన వేడుకలు.. ఈసారి కూడా డీజే సౌండ్స్, కోలాటాలు, జానపదాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో కొత్తరూపు సంతరించుకున్నాయి. చివరిరోజు సోమవారం సాయంత్రం జిల్లావ్యాప్తంగా ప్రారంభమైన వేడుకలు.. అర్ధరాత్రివరకూ అంగరంగ వైభవంగా జరిగాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రం, పారిశ్రామిక ప్రాంతమైన గోదావరిఖనితోపాటు పల్లెలకు ఊపిరిలాంటి మంథని, సుల్తానాబాద్, రామగుండం తదితర ప్రాంతాల్లోని జలవనరుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా వివిధ రకాల సత్తుపిండితోపాటు పసుపు, కుంకుమలను వాయినాలుగా ఇచ్చుకున్నారు. పోయిరా బతుకమ్మ.. మళ్లీ రావమ్మా? అంటూ సాగనంపారు. పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. అధికార యంత్రాంగం అన్నిఏర్పాట్లు చేసింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్ -
సోమవారం శ్రీ 29 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
సద్దుల బతుకమ్మకు ఏర్పాట్లు పెద్దపల్లిరూరల్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సద్దుల బతుకమ్మ వేడుకలకు జిల్లా ముస్తాబైంది. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన, అత్తవారిళ్లకు వెళ్లిన ఆడబిడ్డలు సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు. సోమవారం సద్దుల బతుకమ్మ ఆడుకునేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం కూడా ఆయా ప్రాంతాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది.ముస్తాబైన పెద్దపల్లిలోని మినీ ట్యాంక్బండ్ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే విజయరమణారావుసుల్తానాబాద్ : రద్దీగా మారిన మార్కెట్ ఏరియాపరిహారం పంచాయితీ -
పండుగకు పస్తులేనా?
రామగుండం: ఉపాధిహామీ కూలీలకు వేతనాలు అందడంలేదు. కనీసం దసరా పండుగ వరకైనా వేతనాలు చెల్లించాలని వారు కోరుతున్నారు. జిల్లాలో 2.38 లక్షల మంది కూలీలు.. జిల్లాలో 1.17 లక్షల జాబ్కార్డులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం 2.38 లక్షల మంది కూలీలు నమోదై ఉన్నారు. ఇందులో యాక్టివ్గా ఉ న్న జాబ్కార్డులు 70 వేలు మాత్రమే. ప్రతీరోజు ఉపాధి పనులకు హాజరయ్యేవారు 1.11లక్షల మంది ఉన్నారు. కూలీలకు మే నెల నుంచి, 230 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు జూలై నుంచి, 27 మంది టెక్నికల్ అసిస్టెంట్లకు ఆగస్టు నుంచి, 10 మంది ఏపీవోలకు ఆగస్టు నెల నుంచి వేతనాలు అందడంలేదు. -
నీరు నిలిచి.. దోమలు విజృంభించి
● ఇళ్లముందు.. రోడ్లపై వర్షపునీరు ● రోజుల తరబడి నిల్వలతో ఇబ్బందులు ● అధికారుల తీరుపై స్థానికుల నిరసన కోల్సిటీ(రామగుండం): తరచూ కురుస్తున్న వర్షాలతో రామగుండం నగరంలోని లోతట్టు ప్రాంతా లు జలమయమవుతున్నాయి. రోజుల తరబడి వర దనీటి నిల్వలు అలాగే ఉండిపోవడంతో దోమలు, ఈగలు వృద్ధి చెంది స్థానికులపై దాడి చేస్తున్నాయి. ఫలితంగా నగరవాసులు సీజనల్ వ్యాధులతో ఆస్పత్రుల పాలవుతున్నారు. గోదావరిఖని అడ్డగుంటపల్లి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ సమీపంలోని వివిధ కాలనీలు మరీ అధ్వానంగా తయారయ్యాయి. ఆదివారం కొద్దిగంటలపాటు కురిసిన భారీ వర్షంతో నివాసాల ఎదుటే వరదనీరు నిలిచింది. వర్షం కురిసిన ప్రతీసారి ఇలాగే వరదనీటి సమ స్య తలెత్తుతోందని, సమస్య పరిష్కరించాలని బ ల్దియా అధికారులకు విన్నవించినా స్పందన లేదని స్థానికులు ఆవేదన చెందారు. ఈమేరకు వరద నీటి నిల్వల వద్ద నిరసన తెలిపారు. వర్షాలతో వచ్చే వరదలతో ఇళ్ల ఎదుట వరద నిలిచిపోతోందని, సమీపంలోని ఓపెన్ ప్లాట్లలో నిలిచిన నీటితోనూ దోమలు వృద్ధి చెందుతున్నాయని వారు ఆవేదన చెందారు. ఎమ్మెల్యే రాజ్ఠాకూర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
ప్రయాణం నరకప్రాయం
పెద్దపల్లిరూరల్: కొత్తపల్లి గ్రామంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నిలిచిన వర్షపు నీటితో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పెద్దపల్లి నుంచి ఓదెల, జమ్మికుంట మీదుగా హుజూరాబాద్, వరంగల్ వెళ్లేందుకు ఇది ప్రధాన మార్గం. ఈ మార్గంలోని రైల్వేట్రాక్ వద్ద భూగర్భ వంతె న నిర్మించారు. వర్షాలు కురిసినప్పుడల్లా నీరు పెద్దఎత్తున నిలిచి తరచూ రాకపోకలు స్తంభిస్తున్నాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు నిల్వ కాకుండా రైల్వే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
కమిషనర్ స్పందించాలి
వర్షం వస్తే ఇండ్ల ముందు నీళ్లు నిలిచిపోతున్నయి. మా ఇండ్ల ముందు రోడ్డు వంపు గా ఉంది. నీరు నిలిచి ఇబ్బందులు వస్తున్నయి. రోడ్డు కూడా శిథిలమైంది. దోమలు బాగా వృద్ధి చెందుతున్నాయి. విషజ్వరాలు వస్తున్నయి. ఎమ్మెల్యే, కమిషనర్ స్పందించాలి. – ఎం.తిరుపతి, స్థానికుడు ఇళ్ల ముందే నీళ్లు మురుగుకాలువలోకి సాఫీగా ప్రవహించాల్సిన వరద మా ఇండ్ల ముందు ఆగితే ఎలా? ఒక్కరోజు కాదు.. రెండురోజులు కాదు.. వర్షం వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితి. ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితి ఉంది. పిల్లలకు జ్వరాలు వస్తున్నయి. నీళ్లు నిల్వ కాకుండా చూడాలి. – రాజమణి, స్థానికురాలు ఎవరికి చెప్పినా స్పందన లేదు మా ఇండ్ల ముందే వరదనీళ్లు నిలిచిపోతున్నాయని ఎవలకు చెప్పినా స్పందన లేదు. ఇంత అధ్వానంగా ఉంటుందా? రోడ్లపై నీళ్లు ఆగకుండా చర్యలు తీసుకోవాలి. సమీపంలోని ఓపెన్ ప్లాట్లలోకి వరద చేరుతోంది. దోమలతో భరించలేకున్నం. మా గోస కొంచం పట్టించుకోండి. – ఎర్రగోల్ల రాజయ్య, స్థానికుడు -
పరిహారం తీసుకోలేదు
జాతీయ రహదారిలో మా రెండతస్తుల ఇల్లు, భూమి, షెడ్డు కోల్పోతున్నాం. మేం ఇప్పటివరకు పరిహారం తీసుకోలేదు. మార్కెట్ ప్రకారం రూ.50లక్షల వరకు ధర పలుకుతంది. రూ.9లక్షలు ఇస్తమంటున్నరు. మా గోడును అర్థం చేసుకొని న్యాయం చేయండి. – రీసు వెంకటేశ్, పుట్టపాక, మంథని బోరుకు పైసలు రాలె జాతీయ రహదారి నిర్మాణంలో మాకు చెందిన 33 గుంటలు పోతంది. 23 గుంటలకే పైసలు ఇచ్చిండ్రు. మిగిలిన 10 గంటలకు మా పేరిట పట్టా లేదని పరిహారం ఇయ్యలే. మోకా మీద మేమే ఉన్నం. పత్తిచేన్ల ఉన్న బోరు, తాటి, వేప చెట్లకు డబ్బులియ్యలె. – బిరుదు రమాదేవి, రైతు మిస్సింగ్ స్ట్రక్చర్కు ప్రతిపాదనలు జాతీయ రహదారి నిర్మాణంలో భూములు, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులకు విడతల వారీగా పరిహారం చెల్లించాం. మిస్సింగ్ స్ట్రక్చర్(బోర్లు, పైపులైన్ తదితరాలు) వాటికి కూడా ప్రతిపాదనలు పంపించాం. నిబంధనల మేరకు వచ్చిన అనుమతి మేరకు పరిహారం చెల్లింపులు చేస్తున్నారు. – కె.సురేశ్, ఆర్డీవో, మంథని -
బ్యాక్వాటర్తో నష్టం
మంథనిరూరల్: కాళేశ్వరం ప్రాజె క్టు పరిధిలోని అన్నారం బ్యారేజీ బ్యాక్వాటర్ పంట పొలాలను మళ్లీ ముంచేసింది. ఆరెంద, మ ల్లారం శివారుల్లోని సుమారు 150ఎకరాల్లో పంటలు బ్యాక్వాటర్లో మునిగిపోయాయి. మూడేళ్ల క్రితం వరకు ప్రభుత్వం క్రాప్ హాలీడే ప్రకటించింది. దీంతో రైతులు పంటలు వుయలేదు. అయితే, రెండేళ్లుగా క్రాప్ హాలీ డే ప్రకటించడం లే దు. దీంతో కొందరు రైతులు పంటలు వేశారు. ఈసారి బారీ వర్షాలు, గోదావరినది వరదతో బ్యాక్వాటర్ మళ్లీ పంట పొలాలను ముంచేసింది. రూ.వేలు వె చ్చించి పంటలు వేస్తే బ్యాక్ వాటర్లో మునిగాయని రైతులు ఆవేదన చెందారు. -
పారిశుధ్యం.. అధ్వానం
పెద్దపల్లిరూరల్: పల్లెల్లో పారిశుధ్యం పడకేసింది. సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నా ప్రత్యేకాధికారులు పర్యవేక్షించడంలేదు. ప్రధానంగా అప్పన్నపేట గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. మురుగు నీటి కాలువలు పిచ్చిమొక్కలు, పూడికతో నిండిపోయాయి. బీసీకాలనీలో కాలువల నుంచి తొలగించిన చెత్తాచెదారాన్ని డంప్యార్డుకు తరలించడంలోనూ నిర్లక్ష్యమే కనిపిస్తోంది. ఇప్పటికై నా పంచాయతీ అధికారులు దృష్టిసారించి పల్లెల్లో పారిశుధ్యం మెరుగుకు చర్యలు చేపట్టాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. -
వేతనం రాలె
అంతర్గాం మండలం విసంపేటలో ఉపాధి పని చేస్తున్న. మే నెల నుంచి వేతనం రావడం లేదు. గతంలో ప్రతీనెల కచ్చితంగా బ్యాంకు ఖాతాలో పడేది. ఇప్పుడు ఐదు నెలలైనా రాలే. కనీసం దసరా పండుగ వరకై నా వస్తయో, రావో? – సందవేణి కుమార్, ఉపాధి కూలీ మా పరిధిలో లేదు ఉపాధిహామీ కూలీలు, సిబ్బంది వేతనాల చెల్లింపులు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోనివి. కూలీలు చేసిన పనులు, ఇతర సమాచారాన్ని మేం ప్రతీరోజు ఆన్లైన్లో అప్డేట్ చేస్తున్నాం. దాని ఆధారంగా కేంద్రప్రభుత్వం వేతనాలు చెల్లిస్తుంది. – బైరి వేణుమాధవ్, ఎంపీడీవో, అంతర్గాం -
రేడియేషన్ అంకాలజీలో విప్లవాత్మక మార్పులు
కరీంనగర్టౌన్: ఎంఆర్ లినాక్తో పేషెంట్కు రేడియేషన్ తగ్గించి చికిత్స అందించవచ్చని, మొట్టమొదటి యంత్రం యశోద ఆసుపత్రి హైటెక్సిటీలో ఉందని రేడియేషన్ అంకాలజిస్టు సునీత తెలిపారు. శుక్రవారం యశోద మెడికల్ సెంటర్లో మాట్లాడా రు. దేశంలోనే తొలిసారి ఏర్పాటు చేసిన ఈ ఎంఆర్ లినాక్ ఎంఆర్ఐ స్కానర్తో పేషెంట్కు కచ్చితమైన చోటనే రేడియేషన్ కిరణాలు ప్రసరించి సైడ్ ఎఫెక్ట్లు ఉండవన్నారు. ఇప్పటివరకు సుమారు 300 మందికి ఎంఆర్ లినాక్ చికిత్స అందించామని తెలి పారు. మెదడు, కణితులు, ప్రొస్టేట్ కేన్సర్, తల, మెడ కేన్సర్, సీ్త్రలకు సంబంధించి సర్వైకల్ కేన్సన్, గర్భాశయ కేన్సర్, ఊపిరితిత్తులు, కాలేయం ఇతర కేన్సర్లకు రేడియేషన్ సోకకుండా ఎంఆర్ లినాక్ ద్వారా చికిత్స అందించవచ్చని తెలిపారు. -
నైపుణ్య శిక్షణ.. ఉపాధి కల్పన
రామగుండం: మూసపద్ధతిలో విద్యాబోధనకు స్వస్తి పలుకుతున్నారు.. పరిశ్రమల అవసరాలు తీర్చడం లక్ష్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సొంతం చేసుకుంటున్నారు. ఆ దిశగా విద్యాబోధనలో సమూల మార్పులు చేస్తున్నారు. ఈమేరకు ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్ (ఐటీఐ)లకు అనుబంధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రెయినింగ్ (డీజీటీ) సహకారం తీసుకుంటున్నారు. ఐటీఐల అప్గ్రేడ్.. 2024–25 విద్యా సంవత్సరం నుంచి ఐటీఐలను అప్గ్రేడ్ చేస్తూ వస్తున్న ప్రభుత్వం.. వాటిస్థానంలో ఏటీసీలను స్థాపిస్తూ వస్తోంది. ఇందుకోసం టాటా టెక్నాలజీస్ కంపెనీతో మానవ వనరుల తయారీకి ఒప్పందం కూడా కుదుర్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఐటీఐలను దశలవారీగా ఏటీసీలుగా తీర్చిదిద్దుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 25 ఏటీసీలను శనివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. కోర్సులు.. కాల వ్యవధి.. అడ్వాన్స్డ్ వెల్డింగ్ (6 నెలలు), మెకట్రానిక్స్, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్(ఏడాది), ఏఐ–డ్రివెన్ మా న్యుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ (ఐవోటీ – మూడు నెలలు), సీఎన్సీ ప్రోగ్రా మింగ్ (నాలుగు నెలలు), సైబర్ సెక్యూరిటీ ఫర్ ఇండస్ట్రీ కోర్సులు అందుబాటులోకి తెస్తున్నారు. వీటితోపాటు మరిన్ని ప్రత్యేక ప్రోగ్రామ్స్లు.. క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ ట్రెయినింగ్ స్కీం(సీఐటీఎస్), అడ్వాన్స్డ్ వొకేషనల్ ట్రెయినింగ్ స్కీం(ఏవీటీఎస్) ద్వారా ఇండస్ట్రియల్ వర్కర్లకు ప్రత్యేక తర్ఫీదు ఇస్తారు. విద్యార్థులకు అనేక ప్రయోజనాలు.. విద్యార్థుల్లో స్కిల్స్ ఆధారంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఏటీసీలో శిక్షణ ముగిసిన తర్వాత కోర్సులకు అనుగుణంగా అప్రెంటిషిప్ అవకాశం కల్పిస్తారు. ఈసమయంలో స్టైఫండ్ కూడా చెల్లిస్తారు. నైపుణ్యం గలవారికి నేరుగా ప్లేస్మెంట్ ఇస్తారు. 90శాతం తమ కంపెనీల్లోనే ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. ఎలిజిబిలిటీ.. అడ్మిషన్ ప్రక్రియ.. ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఏటీసీలలో ప్రవేశాలు పొందవచ్చు. అయితే, 18–35 ఏళ్ల మధ్యలో వయసు కలిగినవారు మాత్రమే ఇందుకు అర్హులు. పదో తరగతి/ఐటీఐ ఉత్తీర్ణత, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో పరిజ్ఞానం కలిగి ఉండాలి. సీట్ల సంఖ్యను బట్టి మూడు విడుతల్లో మెరిట్ ప్రాతిపదికన ఏటీసీల్లో సీట్లు కేటాయిస్తారు.ఏటీసీల లక్ష్యం ఇదే.. పరిశ్రమల్లో మానవ వనరుల అవసరాలు తీర్చేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదేసమయంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అకాశాలు కల్పించడం ప్రధాన లక్ష్యమని అంటున్నారు. ఒకవేళ ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే.. స్వయం ఉపాధి పథకంలో భాగంగా కుటీర పరిశ్రమలు స్థాపించుకునే వీలు కల్పిస్తారు. ఐటీఐలో బేసిక్ ట్రెయినింగ్ పూర్తి చేసిన వారికి ఆధునిక స్కిల్స్ (ఏఐ, రోబోటిక్స్, డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్) అందించి ఉద్యోగ, స్వయం ఉపాధి కల్పిస్తారు. -
మణిద్వీప వర్ణణపూజ
మంథని: పట్టణంలోని కన్యకాపరమేశ్వరీ ఆలయంలో శుక్రవారం ఆర్యవైశ్య సంఘం, మహిళా సంఘం ఆధ్వర్యంలో మణిద్వీప వర్ణనపూజ వైభవంగా నిర్వహించారు. మొత్తం 175 మంది మహిళలు 9 రకాల వస్తువులను పూజల కోసం వినియోగించా రు. ఇందులో చిట్టిగారెలు, గవ్వలు, గోముఖ చక్రా లు, ముత్యాలు, పగడాలు, తామరగింజలు, శంఖువులు, గురిజాలు, నల్లపూసలు 33 చొప్పున ఉపయోగించి పూజ చేశారు. ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు నల్మాస్ ప్రభాకర్, పట్టణాధ్యక్షుడు ఎల్లంకి వంశీధర్, మహిళా సంఘం అధ్యక్షురాలు రాచర్ల తిరుమల, ఆలయ కమిటీ అధ్యక్షుడు కొత్త శ్రీనివా స్, ప్రతినిధులు వొల్లాల సత్యనారాయణ, రేపాల ఉమాదేవి, రావికంటి రేణుక, స్వరూప, ఎల్లంకి రాధిక, రావికంటి మనోహర్, వొల్లాల నాగరాజు, రాచర్ల నాగభూషణ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు శిక్షణ జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ జ్యోతిక ఫంక్ష న్ హాల్లో శుక్రవారం ఎన్నికల రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. జెడ్పీ సీ ఈవో నరేందర్ మాట్లాడారు. ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శంగా నిర్వహించేందుకు సహకరించాలన్నారు. రామగుండం, అంతర్గాం, పాలకుర్తి మండల ఎన్నికల సిబ్బంది హాజరయ్యారు. ఎంఈవోలు మల్లేశం, ఏకాంబరం, విమలతోపాటు అంతర్గాం ఎంపీడీవో మదన్మోహన్, మాస్టర్ ట్రైనర్లు అంజన్ కుమార్, జక్కం శ్రీనివాసులు పాల్గొన్నారు. -
వీధి వ్యాపారులకు స్కానర్లు
కోల్సిటీ(రామగుండం): నగరంలోని వీధివ్యాపారులకు డిజిటల్ లావాదేవీల కోసం పోస్టా ఫీస్ జారీచేసిన క్యూఆర్ కోడ్ స్కానర్లను కమిషనర్ అరుణశ్రీ అందజేశారు. శుక్రవారం బల్ది యా కార్యాలయంలో లోక కల్యాణ్ మేళాలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడారు. పథకాల ప్రయోజనాలు పొందడంలో పోస్టాఫీస్ సేవలను ఉపయోగించుకోవాలన్నారు. పోస్టాఫీసు లావాదేవీలతో క్యాష్ బ్యాక్ ప్రయోజనాలను కూడా పొందవచ్చని వెల్లడించారు. పోస్టల్ మేనేజర్ రాజేశ్ మాట్లాడుతూ, పోస్టాఫీస్ ఖాతాతో దేశంలోని ఏ పోస్టాఫీస్కు వెళ్లయినా, వేలి ముద్ర ఆదారంగా డబ్బులు డ్రా చేసుకోవచ్చన్నారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, మెప్మా టౌన్ మిషన్ కో ఆర్డినేటర్ మౌనిక, సీవోలు శ్వేత, ఊర్మిళ, శమంత, ప్రియదర్శిని, పోస్టల్ అధికారి భావన, వీధి వ్యాపారులు పాల్గొన్నారు. చెరువులకు జలకళ సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): కొద్దిరోజులు గా వరుసగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు జలకళ సంతరించుకుంటున్నాయి. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలోని పెద్దచెరువు వర్షపునీటితోపాటు ఎగువ నుంచి వస్తు న్న వరదతో నిండుకుండలా మారింది. వచ్చే యాసంగి పంటలకు అవసరమైన నీటికి ఢోకా లేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏషియన్ ఆర్చరీ టోర్నీకి చికిత ఎలిగేడు(పెద్దపల్లి): బంగ్లాదేశ్ వేదిక గా జరిగే ఏ షియన్ ఆర్చ రీ చాంపియన్షిప్ టోర్నీకి సుల్తానాపూర్ గ్రామానికి చెందిన తానిపర్తి చికిత ఎంపికై ంది. గురువారం సోనీపెట్(హరియాణా) వేదికగా జరిగిన ట్ర యల్స్లో చికిత సత్తా చాటింది. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న చికిత మరో మారు దేశ ఖ్యాతిని ఇనుమాడింపజేసేందుకు పట్టుదలతో ఉందని పలువురు గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. చికితను పలువురు ప్రతినిధులు శుక్రవారం అభినందించారు. ఆర్టీసీ ప్రయాణికులకు నగదు నజరానాగోదావరిఖనిటౌన్: దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రయాణికులకు లక్కీ డ్రా స్కీం ప్రవేశపెట్టినట్లు గోదావరిఖని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. ఈనెల 27 నుంచి అక్టోబ ర్ 6వ తేదీ వరకు సెమీ డీలక్స్, డీలక్స్, మెట్రోడీలక్స్, సూపర్లగ్జరీ, లహరి నాన్ ఏసీ, అన్ని ఏసీ బస్సుల్లో ప్రయాణించిన వారికి ఈ స్కీం వర్తిస్తుందన్నారు. ప్రయాణికులు టికెట్ల వెనకా ల పేరు, చిరునామా, మొబైల్ నంబర్ రాసి బ స్సుల్లో ఏర్పాటు చేసిన బాక్స్ల్లో వేయాలని సూచించారు. అక్టోబర్ 8న సాయంత్రం 4గంటలకు కరీంనగర్లోని ప్రాంతీయ కార్యాలయంలో డ్రా తీస్తామని పేర్కొన్నారు. మొదటి బహుమతి రూ.25 వేలు, రెండోబహుమతి రూ.15వేలు, మూడో బహుమతి రూ.10వేల నగదు అందిస్తామని డీఎం పేర్కొన్నారు. అలాగే ఆర్టీసీ యాత్రాదానం పథకం కోసం దాతలు ముందుకు రావాలని కోరారు. వివరాలకు 73828 47596, 70135 04982 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. సాగు వివరాలు నమోదు చేయాలి పెద్దపల్లిరూరల్: జిల్లాలోని ప్రతీరైతు తన భూమిలో సాగుచేసే పంట వివరాలను వ్యవసాయ విస్తరణాధికారుల వద్ద నమోదు తప్పకుండా చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్ సూచించారు. రైతు తమ క్లస్టర్ పరిధిలోని ఏఈవో వద్ద వానాకాలం సీజన్లో సా గు చేస్తున్న పంట వివరాలను పొరపాటు లేకుండా నమోదు చేసుకోవాలని అన్నారు. దిగుబడులను విక్రయించే సమయంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఈ సమాచారం దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. తొలిరోజు 6 దరఖాస్తులు పెద్దపల్లిరూరల్: జిల్లాలో మద్యం దుకాణాలకు శుక్రవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నా రు. తొలిరోజు 6 దరఖాస్తులు అందాయని ఎక్సై జ్ సీఐ నాగేశ్వర్రావు తెలిపారు. పెద్దపల్లిలో 3, సుల్తానాబాద్, రామగుండం, మంథనిలో ఒక్కో దరఖాస్తు అందినట్లు వివరించారు. -
మొగిలిపేటలో కుల బహిష్కరణ
మల్లాపూర్(కోరుట్ల): కుల సంఘంలో ఓ నలుగురు పెద్దమనుషులు చెప్పిన మాట వినలేదని.. ఓ మహిళా కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి క థనం ప్రకారం.. మొగిలిపేటలో ముదిరాజ్ కులాని కి చెందిన ఓనవేని నర్సయ్య–భూమక్క దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడైన ఓనవేని దశరథం–సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు. దశరథంకు చెందిన ఇంటి అమ్మకానికి సంబంధించి 2018లో అదేకూలానికి చెందిన ఒకరితో గొడవలు జరుగుతున్నాయి. వివాదం పరిష్కరానికి కు ల పెద్దల వద్దకు వెళ్లడంతో సమస్య పరిష్కారం కా కపోవడంతో అదే సంవత్సరం కుల బహిష్కరణ చే శారు. ఇక నుంచి దశరథం కుటుంబాన్ని కులం నుంచి వెలివేస్తున్నామన్నారు. ఎవరైనా వారితో మాట్లాడటం, వారి ఇంటికి వెళ్లడం లాంటివి చేయొద్దని హెచ్చరించారు. స్థానిక పోలీస్స్టేషన్లో దశరథం భార్య సుజాత ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. అప్పటి నుంచి దశరథం కుటుంబం తీవ్ర మనస్థాపానికి గురవుతూ ఇబ్బందులు పడుతున్నా రు. గతేడాది దశరథం ఉపాధి కోసం గల్ఫ్కు వలస వెళ్లగా, కుల బహిష్కరణ కేసుతో ఇబ్బంది పడుతు న్న పెద్దలు అతని భార్య సుజాత కేసును వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రా రంభించారు. కులపెద్దల మాటను ధిక్కరించినందుకు సుజాత కులసభ్యుందరి కాళ్లు మొక్కి క్షమించాలని వేడుకుంటే తిరిగి కులంలోకి చేర్చుకుంటా మని సమాచారం పంపించారు. క్షమాపణ అడగన ని సుజాత చెప్పడంతో 15రోజుల క్రితం కులసంఘంలోని ఓ నలుగురు పెద్దలు ఆ కుటుంబంతో ఎ వరు మాట్లాడినా రూ.50వేల జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. అధికారులు స్పందించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. -
పత్తి రైతుకు మద్దతు ధర
● మార్కెట్కు నాణ్యమైన పత్తినే తేవాలి ● మద్దతు రాకుంటే సీసీఐలో విక్రయించాలి ● జిల్లాలో ఐదు సీసీఐ కేంద్రాల ఏర్పాటు ● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిరూరల్: జిల్లాలో పత్తి సాగుచేసి రైతులకు అక్టోబర్ 15 నుంచి దిగుబడి చేతికి వచ్చే అవకాశం ఉందని, మార్కెట్కు తీసుకొచ్చే నాణ్యమైన పత్తికి ప్రభుత్వ మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని, మార్కెట్లో మద్దతు ధర రాలేదని రైతు భావిస్తే సీసీఐలో విక్రయించుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం అడిషనల్ కలెక్టర్ వేణుతో కలిసి పత్తి కొనుగోళ్లపై అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లాలో 48,215 ఎకరాల్లో పత్తి సాగైందని, 5,78,580 క్వింటాళ్ల దిగుబడి వచ్యేచ అవకాశం ఉందని తెలిపారు. నవంబర్, డిసెంబర్ వరకు పత్తి విక్రయానికి వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం ఐదు సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 8శాతం తేమ ఉంటే కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.8,110 వస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. పెద్దపల్లి మార్కెట్ యార్డుతోపాటు పెద్దపల్లిలో రెండు, సుల్తానాబాద్లో ఒకటి, కమాన్పూర్లో ఒక జిన్నింగు మిల్లులో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పత్తి నాణ్యతలో నిబంధనలపై ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. విక్రయాలకు రైతులు నిరీక్షించకుండా కపాస్ కిసాన్యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్రెడ్డి, డీఏవో శ్రీనివాస్, ఆర్టీవో రంగారావు తదితరులు పాల్గొన్నారు. -
పూలు.. పాటల జాతర
సిరిసిల్ల: ప్రకృతిని పూజించే సంస్కృతి తెలంగాణకే సొంతం. పూలనే దేవతగా కొలిచే భక్తితత్వం ఇక్కడి మట్టి మనుషుల సొంతం. తమ భక్తిని.. ఇష్టాన్ని జానపదాలలో తెలుపుతూ సాగే సాహిత్యం ఇక్కడి జనజీవనాన్ని ప్రతిబింబింపజేస్తుంది. ఈ మట్టిమనుషులు పూజించే బతుకమ్మ సంబరాలు పల్లె, పట్నం అనే తేడా లేకుండా జోరుగా సాగుతున్నాయి. సద్దుల సంబరాలకు సిద్ధమవుతున్నారు. వేములవాడలో ఏడు రోజుల్లో శనివారం చేస్తుండగా, మిగతా ప్రాంతాల్లో తొమ్మిది రోజులు.. మరికొన్ని ఏరియాల్లో దసరా మరుసటి రోజు సద్దులు సంబరాలు చేసేందుకు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ పండగ విశిష్టతలపై ప్రత్యేక కథనం. తీరొక్క పూలజాతర పితృ అమావాస్య నాడు పెద్దలకు బియ్యం ఇచ్చినప్పటి నుంచి రోజుకో పేరుతో.. సద్దితో ఎనిమిది రోజులు బొడ్డెమ్మగా జరుపుకొని తొమ్మిది దినాల నాడు పెద్దబతుకమ్మ, సద్దుల బతుకమ్మగా సాగనంపే పండుగ ఇది. పొద్దంతా పనిచేసి సాయంత్రం ఇంటికొచ్చే ముందు అడవిలోని రకరకాల పూలు తెచ్చి సిబ్బిలో పేర్చి పసుపు ముద్ద, గుమ్మడి పూల గౌరమ్మను చేసి మధ్యలో ఉంచి చుట్టూ తిరిగి చప్పట్లు కొడుతూ ఆడుతూ సంబురంగా జరుపుకుంటారు. ప్రకృతిలో పూసే ప్రతీ పువ్వు బతుకమ్మకు అలంకారమే. చివరి రోజు సద్దుల బతుకమ్మ. ఊరంతా పూల జాతరగా మారుతుంది. తంగేడు, గుమ్మడి ప్రధానం బతుకమ్మకు ప్రతీక తంగేడు, గుమ్మడి పూలు. గుమ్మడిని గౌరమ్మగా నిలిపితే, తంగేడును బతుకమ్మగా పేరుస్తారు. తంగేడు చెట్టు తెలంగాణ పల్లె ప్రజల జీవన విధానాన్ని పోలి ఉంటుంది. నీలు లేని చెలకలో గుట్టల మీద, రాళ్ల నడుమ గాలికి ఎండకు తట్టుకుని నిలిచి తలెత్తుకునే కష్టజీవి తంగేడు చెట్టు. తెంపిన చాలా సేపటి వరకు వాడిపోని దివ్యఔషధం. ఊరి శివారుల్లోని చెలకలు, గుడ్డాలు, అటవీ భూముల్లో తంగేడు, గునుగు, గుమ్మడిపూలు విరివిగా లభిస్తాయి. కమ్మనైన అమ్మపాట బతుకమ్మ సామాజిక చరిత్రను, ఇతిహాసాలను, అన్నచెల్లెళ్ల అనుబంధాన్ని పాటల రూపంలో చెప్తారు. పాటంటే తెలంగాణ ఎత, కథ తలపోత. నవ్వినా.. ఏడ్చినా కన్నీళ్లే వచ్చినట్లు.. కష్టమైనా సుఖమైనా.. పంటపండినా.. బతుకు ఎండినా.. తెలంగాణలో అది పాటే అవుతుంది. పూర్వకాలంలో తెలంగాణలో సీ్త్రలు దొరలు, భూస్వాములు, వత్తేదార్ల కింద అష్టకష్టాలు పడేవారు. వాళ్ల కష్టాలను పాటల రూపంలో చెప్పుకోవడానికి ఈ పండుగ వేదికగా నిలిచింది. ఇది లిఖిత సాహిత్యం కాదు. సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మను సాగనంపేందుకు తీసుకెళ్లే పలహారాలు కాయ, పండ్లు, పిండిధాన్యాలే. ఈ పండుగ కాలం నాటికి పునాసపంటలు.. మక్కలు, జొన్నలు, బబ్బెర్లు, పెసర్లు, పల్లీలు, మినుములు ఇంట్లోకి వస్తాయి. వాటినే నైవేద్యంగా పెట్టి తినడం ఆచారంగా మారింది. గుడి లేని పండుగ ఎన్నో కష్టాలు ఉంటాయని పండుగలోని పాటలు చెబుతాయి. కష్టాలకు, కన్నీళ్లకు వెరవకుండా నిలవాలని తంగేడు చెట్టు చెబుతోంది. మనమంతా ప్రకృతి జీవనంలో ఓ భాగమేనని పండుగ విధానం చెబుతోంది. వెరసి బతుకమ్మ పండుగ బతికి గెలవాలని.. గెలిచి నిలవాలని హితబోధ చేస్తోంది. ఏ పండుగకు ఎలా ఉన్నా ఈ పండక్కి మాత్రం ఆడకూతుళ్ల చూపు తల్లిగారింటి వైపు ఉంటుంది. ఇంత వైభవంగా భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండక్కి ఓ గుడిలేదు.. స్తోత్రంలేదు.. శ్లోకం అంతకంటే లేదు. ప్రజల కష్టాలే పాటలు.. దొరికిన పూలే రూపాలు.. ఇంట్లోని ధాన్యాలే నైవేద్యాలు. ఇంతటి విశిష్టతను కలిగిన బతుకమ్మ పండగా ఇంటింటా సందడిని నింపింది. ఊరుకో తీరుగా.. బతుకమ్మ పండగను ఊరుకో తీరుగా నిర్వహిస్తున్నారు. రాజన్న కొలువైన వేములవాడలో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మను సాగునంపుతారు. రుద్రంగి మండల కేంద్రంలో దసరా పండుగ తరువాత సద్దుల బతుకమ్మను నిర్వహిస్తారు. సిరిసిల్లతోపాటు అన్ని ప్రాంతాల్లోనూ నవరాత్రులతో సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు. ఇలా ఊరుకో తీరుగా.. ప్రాంతానికో విధంగా పూల పండగను నిర్వహిస్తారు. ఎలా నిర్వహించినా.. బతుకమ్మ పేర్చే విధానం.. కొలిచే తీరు ఒక్కటే. అదే ప్రకృతి పూల బతుకమ్మ. -
బతుకమ్మ వేడుకల్లో డీజేలను నిషేధించాలి
● అడిషనల్ డీసీపీకి మహిళల వినతిగోదావరిఖని: బతుకమ్మ ఉత్సవాల్లో డీజే సౌండ్స్ను అరికట్టాలని శ్రీసీతారామ సేవాసమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ కోరారు. శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో డీసీసీ(అడ్మిన్) శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ రమేశ్కు ఫిర్యాదు అందజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల బతుకమ్మ ఆడుతున్న ఇద్దరు మహిళలు, మితిమీరిన డీజే సౌండ్తో గుండెపోటుతో మృతి చెందిన ఘటనను గుర్తుచేశారు. ఇలాంటి సంఘటనలు రామగుండం పోలీస్ కమిషనరేట్లో చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. డీజే సౌండ్స్తో వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులతోపాటు గుండె సమస్యలు ఉన్నవారికి తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తున్నాయని అన్నారు. దీనిపై స్పందించిన పోలీస్ అధికారులు.. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఫిర్యాదు చేసిన వారిలో సమితి సభ్యులు కంది సుజాత, బిల్ల శ్రీదేవి, రమాదేవి, శ్యామల తదితరులు ఉన్నారు. -
దీపావళి బోనస్ ఖరారు
● రూ.లక్షకుపైగా ‘పీఎల్ఆర్’ ● ఈసారి రూ.1.03లక్షల చెల్లింపు ● గతేడాదికన్నా రూ.9,250 పెరుగుదల ● ఒప్పందంపై కార్మిక సంఘాల సంతకం గోదావరిఖని: దేశవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 2.40 లక్షల మంది బొగ్గు గని కార్మికుల పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్(పీఎల్ఆర్– దీపావళి) బోనస్ గురువారం అర్ధరాత్రి ఖరారైంది. జాతీయ కార్మిక సంఘాలు, కోలిండియా యాజమాన్యంతో ఈనెల 25న మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకూ సమావేశమయ్యారు. బొగ్గుగని కార్మికులకు చెల్లించే బోనస్పై ఏఐటీయూసీ, బీఎంఎస్, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఐఎన్టీయూసీ మధ్య చర్చలు సాగించా రు. ఒక్కో కార్మికునికి దీపావళి బోనస్(పీఎల్ఆర్) రూ.1.30లక్షలు చెల్లించాలని జాతీయ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. యాజమాన్యం స్పందిస్తూ.. రూ.98వేలు చెల్లించేందుకు ముందుకు వ చ్చింది. ఇందుకు ససమేమిరా అన్న కార్మిక సంఘా లు.. ఒకానొక దశలో సమావేశం నుంచి లేచి హాల్ బయటకు వచ్చేశాయి. చర్చలు శుక్రవారం నాటికి వాయిదా వేయాలని కార్మిక సంఘాల నాయకులు విన్నవించారు. అయినా, రాత్రి భోజనం చేసిన త ర్వాత కార్మిక సంఘాలు, కోల్ ఇండియా యాజమా న్యం మళ్లీ సమావేశమయ్యారు. అర్ధరాత్రి వరకూ సాగిన చర్చల్లో కార్మిక సంఘాలు రూ.1.05 లక్షలు చెల్లించాలని పట్టుబట్టాయి. కానీ యాజమాన్యం రూ.1.03 లక్షలు చెల్లించేందుకే అంగీకరించింది. దీంతో కార్మిక సంఘాలు, కోలిండియా యాజమా న్యం ఒప్పందంపై సంతకాలు చేసుకున్నాయి. సింగరేణి సంస్థ తరఫున డైరెక్టర్(ఫా) గౌతం పొట్రూ హాజరుకాగా, కార్మిక సంఘాల నాయకులు.. ఐఎన్టీయూసీ నుంచి జనక్ప్రసాద్, హెచ్ఎంఎస్ నుంచి రియాజ్అహ్మద్ చర్చల్లో పాల్గొన్నారు. గతేడాదికన్నా రూ.9,250పెంపు బొగ్గు గని కార్మికులకు గతేడాది రూ.93,750 పీఎల్ఆర్ బోనస్ చెల్లించారు. ఈసారి ఈ బోనస్ రూ.9,250 పెంచి రూ.1.03లక్షలు చెల్లించేందుకు కోలిండియా యాజమాన్యం అంగీకరించింది. గతేడాది రూ.8,750 పెంచగా, ఈసారి మరో రూ.500 ఎక్కువ చేసి రూ.9,250పెంచారు. మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకూ ఉత్కంఠభరితంగా చర్చలు సాగాయి. పెరిగిన దీపావళి బోనస్ సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న సుమారు 41వేల మందికి వర్తించనుంది.ఏడాది పెంపు చెల్లింపు 2020 3,800 68,500 2021 4,000 72,500 2022 4,000 76,500 2023 8,500 85,000 2024 8,750 93,750 2025 9,250 1,03,000 -
మహిళలకు ఐలమ్మ స్ఫూర్తి
పూలమాల వేస్తున్న సీపీ అంబర్ కిశోర్ ఝా నివాళి అర్పిస్తున్న కలెక్టర్ శ్రీహర్ష తదితరులుపెద్దపల్లిరూరల్: వీరవనిత చాకలి ఐలమ్మ పోరాటం మహిళలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం వీరవనిత ఐల మ్మ జయంతి ఘనంగా నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ వేణు హాజరయ్యారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలిగా చాకలి ఐలమ్మ తె లంగాణకు స్ఫూర్తి ఇచ్చారని కలెక్టర్ అన్నారు. బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లో.. గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరేట్ లో సీపీ అంబర్ కిశోర్ ఝా.. ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ప్రతీక అని సీపీ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధపోరా ట యోధురాలు అని కొనియాడారు. ఆనాటి నిరంకుశ రజాకార్లు, దేశ్ముఖ్లకు వ్యతిరేకంగా మొక్క వోని ధైర్యంతో ఐలమ్మ ఎదిరించిన తీరు ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏవో శ్రీనివాస్, సీఐ భీమేశ్, ఆర్ఐలు దామోదర్, శ్రీనివాస్, వామనమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
సద్దుల బతుకమ్మకు పకడ్బందీ ఏర్పాట్లు
● అధికారులతో ఎమ్మెల్యే విజయరమణారావు సమీక్ష పెద్దపల్లిరూరల్: నియోజకవర్గంలో సద్దుల బతుక మ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే విజయరమణారావు సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎంపీడీవో, ఎంపీవోలతో ఆ యన సమావేశమయ్యారు. బతుకమ్మ ఆడే, నిమజ్జ న ప్రాంతాల్లో స్థలాలు చదును చేయాలన్నారు. వి ద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. దసరా ఉ త్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నా రు. పట్టణ సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అన్నారు. జిల్లా కోర్టు నుంచి కలెక్టరేట్ వ రకు రూ.కోటి 80లక్షల వ్యయంతో చేపట్టిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను ఆయన ప్రారంభించారు. పట్టణ శివారు చందపల్లిలో అమృత్ పథకం ద్వారా రూ.కోటి 3లక్షల వ్యయంతో చేపట్టిన వాటర్ట్యాంక్ పనులకు శంకుస్థాపన చేశారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, ఏఈ సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఓసీపీ–2ను ముంచెత్తిన వరద
రామగిరి(మంథని): రెండురోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో ఓసీపీ–2లోకి వరదనీరు వచ్చి చేరింది. శుక్రవారం వేకువజామున కార్మికులు విధుల్లోకి వచ్చేసరికి ప్రాజెక్ట్ వరద ముంపునకు గురైంది. వ రద ధాటికితోడు సమీపంలోని కాలువకట్ట తెగి ప్రా జెక్ట్ను ముంచెత్తింది. ప్రధాన కార్యాలయాలు, ఎస్ఎన్డీ సెక్షన్, విలువైన యంత్రపరికరాలు గల స్టోర్ గోదాంలు, డంపర్లు, వర్క్షాప్, మ్యాన్వే, క్యాంటీన్, కార్మికుల రెస్ట్ షెల్టర్లు వరదలో మునిగిపోయా యి. బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగింది. ఓసీపీ–2 బ్యాక్ వాటర్, వరదను కందకాల ద్వారా వేరేప్రాంతానికి తరలించేవారు, కొద్దినెలలుగా కా లువకు అడ్డుకట్ట వేసి మోటార్ల ద్వారా రివర్స్ పంపింగ్ చేస్తూ వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. భారీవర్షాలకు ప్రవాహం పెరిగి గనిలోకి వచ్చిచేరింది. సర్పెస్లో ఉద్యోగులు, కార్మికులు మోకాళ్లలోతు నీ టిలోనే విధులు నిర్వహిస్తూ ఇబ్బందులు పడ్డారు. యుద్ధప్రాతిపదికన నీటి తొలగింపు.. రెస్క్యూ టీం గని వద్దకు చేరుకుంది. వరదకు అడ్డుకట్ట వేసి కార్యాలయ్యాల్లోని నీటిని బయటకు తరలిస్తోంది. సింగరేణి ఆర్జీ–3 జీఎం సుధాకర్రావు పనులు పర్యవేక్షిస్తున్నారు. అయితే, ప్రాజెక్ట్ చుట్టూ చేరిన నీటిని ఇంకా తొలగించలేదని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భారీవర్షంతో కార్మికుల ప్రాణాలకు ప్రమాదం పొంచిఉందని, డ్రైనేజీ మెరుగుపరచాలని హెచ్చరించాయి. -
నిర్లక్ష్యమే కారణం
సింగరేణి అ ధికారుల ని ర్లక్ష్యంతోనే ఓసీపీ–2లోకి వరద వచ్చిచేరింది. కార్మికుల సంక్షేమం కన్నా బొగ్గు ఉత్పత్తిపైనే దృష్టి సారించడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. బాధ్యులపై చర్య తీసుకోవాలి. – ఎం.శ్రీనివాస్, బీజేపీ నేత చర్యలు చేపట్టాలి వర్షంతో కా ర్యాలయాలు నీట మునిగి కార్మికులు ఆందోళనకు గురయ్యారు. వర్షాలు కురిసిన ప్రతీసారి కార్యాలయాలు వరదలో మునుగుతున్నయి. శాశ్వత చర్యలు తీసుకోవాలి. – కోట రవీందర్రెడ్డి, ఐఎన్టీయూసీ నేత అధికారులే బాధ్యులు ముందు చూపులేక, ప్రణాళిక కొ రవడి సైట్ ఆఫీస్, కా ర్యాలయాలు వరదలో మునిగాయి. విలువైన వస్తువులు, సమాచారం, ఫైళ్లు నీటిలో గల్లంతయ్యాయి. ఇందుకు పూర్తిబాధ్యత అధికారులదే. – డి.కొమురయ్య, సీఐటీయూ -
బోనాలపల్లెకు ప్రత్యేక బృందం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఎలగందులను ఆనుకుని ఉన్న బోనాలపల్లైపెకి పోలీసు తూటాలు దూసుకుపోయిన ఘటనపై రాష్ట్ర పోలీసు యంత్రాంగం అ ప్రమత్తమైంది. హైదరాబాద్ నుంచి స్పెషల్ టీం గు రు, శుక్రవారాల్లో గ్రామంలో పర్యటించింది. అనూహ్యంగా తమపై దూసుకొస్తున్న తూటాలతో ప్రాణ హాని పొంచి ఉందని గ్రామస్తులు కొన్ని రోజులుగా ఆందోళన చెందుతున్న విషయం తెలిసిదే. కరీంనగర్ సీపీ ఇచ్చిన సమాచారంతో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు డీజీపీ కార్యాలయం ప్రత్యేక బృందాన్ని పంపింది. ఇందులో గ్రేహౌండ్స్, ఐఎస్డ బ్ల్యూ, ఇతర సాంకేతిక నిపుణులు ఉన్నారు. వీరు స్థానిక పోలీసులతో కలిసి తొలుత ఎలగందుల ఫై రింగ్ రేంజ్, అనంతరం బోనాలపల్లెను సందర్శించి పలు విషయాలను సమగ్రంగా పరిశీలించారు. బో నాలపల్లెలో అమృతమ్మ అనే 80 ఏళ్లుపైబడిన వృద్ధురాలి తుంటికి తూటా గాయం అయిన విషయాన్ని ‘సాక్షి’ ఈనెల 22న ‘బోనాలపల్లెకు తూటా గా యం’ శీర్షికన ప్రచురించిన విషయం తెలిసిందే. రిటెయినింగ్ వాల్ నిర్మించాలట ఎలగందుల ఫైరింగ్ రేంజ్లో ఫైరింగ్ జరుగుతున్న తీరు, టార్గెట్ను తాకిన తర్వాత బుల్లెట్లు దిశ మా ర్చుకున్న తీరును ప్రత్యేక బృందం పరిశీలించింది. అనంతరం అక్కడ నుంచి పొరుగునే ఉన్న బోనాలపల్లె గ్రామానికి వెళ్లారు. అక్కడి భౌగోళిక పరిస్థితులు, బుల్లెట్లు దూసుకువచ్చిన తీరును అంచనా వే శారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఇకపై బుల్లెట్లు గ్రామంవైపునకు దూసుకు రాకుండా ఉండాలంటే.. ఫైరింగ్ రేంజ్ వెనకాల భారీ రీటెయినింగ్ వాల్ నిర్మించాలని అధికారులకు సూచించారు. దాంతో టార్గెట్ను తాకిన తర్వాత వెనక ఉన్న రాళ్ల ను తాకి దిశ మార్చుకున్నా.. బులెట్లు బోనాలపల్లె వైపునకు దూసుకురాకుండా ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని సీపీకి, డీజీపీకి సమర్పించబోయే నివేదికలో పొందుపరచనున్నారు. 9 ఎంఎం బుల్లెట్ కిలోమీటరు ప్రయాణం హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందానికి ఒక విషయం ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. ఫైరింగ్ రేంజ్ నుంచి దాదాపు కిలోమీటరు దూరంలో ఉన్న అమృతమ్మకు బుల్లెట్ తాకడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. అమతమ్మను తాకింది ఎస్ఎల్ఆర్ నుంచి వెలువడిన తూటా అనుకున్నారు. కానీ అది 9ఎంఎం బుల్లెట్ అని హైదరాబాద్ నుంచి వచ్చిన సాంకేతిక బృందం ధ్రువీకరించింది. సాధారణంగా 9ఎంఎం బుల్లెట్ పిస్టల్ లేదా కార్బన్ నుంచి వచ్చి ఉంటుందని అంచనాకు వచ్చారు. సాధారణంగా పి స్టల్ నుంచి వెలువడిన 9ఎంఎం బుల్లెట్ ప్రయాణించే దూరం కిలోమీటరు లోపే. కానీ, బహిరంగ ప్రదేశాల్లో ఇది సాధ్యం కాదు. గాలి వీచే దిశ, ఇతర ఆ టంకాలు అనేక మార్గమధ్యలో తూటా వేగాన్ని ప్ర భావితం చేస్తాయి. ఇక్కడ టార్గెట్ను తాకిన త ర్వాత కూడా కిలోమీటరు ప్రయాణం చేయడం పో లీసు అధి కారులను విస్మయానికి గురిచేస్తోంది. ఈ విషయాన్ని మరింత లోతుగా అధ్యయనం చేశాక పూర్తిస్థా యి నివేదికలో పొందుపరచనున్నారు. రిటెయినింగ్ వాల్ నిర్మిస్తాం పోలీసులు ఫైరింగ్ చేసిన బుల్లెట్లు ఇకపై గ్రామంవైపు రాకుండా చర్యలు చేపడతాం. ఇందుకోసం ఫైరింగ్ రేంజ్ సరిహద్దులో రిటెయినింగ్ వాల్ నిర్మిస్తాం. బుల్లెట్లు బోనాలపల్లెను తాకడానికి పక్కనే ఉన్న గుట్ట ఎత్తు తగ్గడం కారణం కాదు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం సూచనల ప్రకారం రక్షణ ఏర్పాట్లు చేపడతాం. – గౌస్ఆలం, సీపీ, కరీంనగర్ -
క్రమశిక్షణ.. లక్ష్య సాధన
గోదావరిఖనిటౌన్: క్రమశిక్షణ పెంపొందించడం, భవిష్యత్ లక్ష్య సాధనకు ప్రో త్సహించడం ద్వారా విద్యార్థుల భవిష్య త్ బంగారుమయమవుతుందని జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి కల్పన అన్నారు. గోదావరిఖని శార దానగర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శుక్రవారం పేరెంట్స్, లెక్చరర్స్ మీటింగ్ నిర్వహించారు. ప్రిన్సిపాల్ కల్పన, ఉమ్మడి జిల్లా పరిశీలకుడు రమణతో కలిసి నోడల్ అధికారి కల్పన మాట్లాడారు. వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఇంటివద్దే పిల్లలకు తర్ఫీదు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపల్ రాజేందర్, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. క్రమశిక్షణ పెంపొందించాలి పెద్దపల్లిరూరల్: పదో తరగతి ఉత్తీర్ణ సాధించి.. ఇంటర్మీడియెట్ విద్య కోసం ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరే విద్యార్థులు క్రమశిక్షణతో మెలగేలా చూడడంలో తల్లిదండ్రులు తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ప్రిన్సిపాల్ రవీందర్రెడ్డి కోరారు. స్థానిక ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కాలేజీల్లో పేరెంట్, లెక్చరర్ల సమావేశం నిర్వహించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, విద్యార్థుల ప్రవర్తనను ఇంటి వద్దనే కాకుండా బయట తిరిగే సమయాల్లోనూ గమనిస్తూ ఉండాలన్నారు. సమావేశంలో ఎన్ఎస్ఎస్ పీవోలు నరహరి, సదయ్యతోపాటు అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ముఖాముఖీకి హాజరైన మంత్రి అడ్లూరి, విప్ శ్రీనివాస్కు చెరుకు గడ అందిస్తున్న కాంగ్రెస్ నేతలు ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీలో నిర్వహించిన ముఖాముఖీకి హాజరైన రైతులుముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీలో యంత్రాల స్థితిగతులపై ఆరా తీస్తున్న సంజయ్కుమార్మల్లాపూర్(కోరుట్ల): రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మల్లాపూర్ మండలం ముత్యంపేటలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునర్ ప్రారంభించేందుకు గల ఏర్పాట్లు, రైతులతో శుక్రవారం నిర్వహించిన ముఖాముఖీలో పరిశ్రమల ముఖ్య కార్యదర్శి సంజయ్కుమార్, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రఘునందన్రావు, షుగర్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ నర్సిరెడ్డిలతో కలిసి హాజరయ్యారు. ముందుగా షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించారు. అనంతరం ఓ పంక్షన్హాల్లో నిర్వహించిన రైతులతో ముఖాముఖీలో మంత్రి మాట్లాడారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు రూ.172 కోట్ల బకాయిలు చెల్లించినట్లు తెలిపారు. ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించడానికి అవసరమైన సాంకేతికత, స్థానిక సమస్యలపై రైతుల అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వాని నివేదించనున్నట్లు పేర్కొన్నారు. ఫ్యాక్టరీ ప్రారంభమైతే జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల రైతులకు మేలు కలుగుతుందన్నారు. ఫ్యాక్టరీని ప్రారంభించాలంటే రైతులు కనీసం 10 వేల ఎకరాల్లో చెరుకు పంటను సాగు చేయాలని కోరారు. మాజీ మంత్రి, పునరుద్ధరణ కమిటీ సభ్యుడు జీవన్రెడ్డి మాట్లాడుతు ముత్యంపేటలో 1981లో ఫ్యాక్టరీ ఏర్పాటైందని, 2002లో అప్పటి ప్రభుత్వం 51 శాతాన్ని ప్రవేటీకరణ చేసిందని, 2015లో నష్టాలు, చెరుకు పంట లేదని మూసివేశారన్నారు. ఈ ప్రాంత రైతులకు లాభసాటిగా ఉండేలా ప్రభుత్వం రాయితీలు అందించి ప్రోత్సహిస్తే ఫ్యాక్టరీకి అవసరమైన చెరుకు పంటను పండిస్తారన్నారు. వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రఘునందన్రావు మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయశాఖకు సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించి విత్తన సబ్సిడీలు అందిస్తుందని తెలిపారు. చెరుకు పంటను డ్రిప్ ద్వారా పండిస్తే నీటి వినియోగం తగ్గి నీటి వనరులను కాపాడినట్లేనన్నారు. పరిశ్రమల ముఖ్య కార్యదర్శి సంజయ్కుమార్ మాట్లాడుతూ నిజాం షుగర్ ఫ్యాక్టరీ సందర్శన, రైతుల ముఖాముఖీలో చర్చించిన అంశాలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ముత్యంపేట ఫ్యాక్టరీలో పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ మాట్లాడుతూ నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడే సమయానికి నష్టాలతోపాటు క్రషింగ్కు అవసరమైన చెరుకు సాగు కావడం లేదన్నారు. రైతులు సహకార సంఘంగా ఏర్పడితే ఫ్యాక్టరీని బాగు చేయించి అప్పగించేందుకు సిద్ధమని అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించేందుకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్కుమార్, అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీవో శ్రీనివాస్, డీఎస్పీ రాములు, కాంగ్రెస్ ఇన్చార్జి జువ్వాడి నర్సింగారావు, రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు, కొమిరెడ్డి విజయ్ ఆజాద్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర జాయింట్ కో–ఆర్డినేటర్ వాకిటి సత్యంరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎలాల జలపతిరెడ్డి, చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతుల అభిప్రాయాలు ఇవీ.. -
లిక్కర్.. టెండర్
సాక్షి పెద్దపల్లి/కరీంనగర్క్రైం: మద్యం దుకాణాల టెండర్లకు ప్రభుత్వం గురువారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయా జిల్లాల కలెక్టర్లు లక్కీ డ్రా ద్వారా సామాజికవర్గాల వారీగా రిజర్వేషన్లకు అనుగుణంగా దుకాణాలు కేటాయించారు. శుక్రవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రస్తుతం నడుస్తున్న వైన్స్ కాలపరిమితి నవంబర్ 30తో ముగియనుండగా రెండు నెలల ముందుగానే ప్రభుత్వం టెండర్లకు ఆహ్వానించింది. దీంతో ప్రస్తుతం మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులతో పాటు గతంలో లక్కీడ్రాలో అదృష్టం వరించని వారు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమతున్నారు. లైసెన్స్ కాలం 01.12.2025 నుంచి 30.11.2027 వరకు నిర్ణయించారు. ఈ ఏడాది స్థానిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మద్యం విక్రయాలు భారీస్థాయిలో ఉండే అవకాశముంది. దీంతో గతం కన్నా పెద్దసంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎకై ్సజ్శాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 287 మద్యం దుకాణాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 287 మద్యం దుకాణాలు ఉన్నాయి. మద్యంషాపుల్లో రిజర్వేషన్ ప్రకారం.. గౌడ కులస్తులకు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం దుకాణాలను కేటాయించనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎస్టీ జనాభా తక్కువగా ఉండటంతో షాపులు కేటాయించలేదు. దీంతో 53 షాపులను గౌడ్స్, 31 దుకాణాలు ఎస్సీలకు కేటాయించారు. మిగిలిన అన్ని షాపులను ఆన్రిజర్వ్ కేటగిరీలో చేర్చారు. దీంతో ఈ దుకాణాలకు ఏ సామాజికవర్గం వారైనా టెండర్ దాఖలు చేయవచ్చును. ఒక్కో దుకాణానికి రూ.3 లక్షల ఫీజు ఉమ్మడి జిల్లాలోని ఒక్కో వ్యక్తి ఒక్కో దుకాణానికి ఎన్ని దరఖాస్తులనైనా సమర్పించవచ్చు. ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలో ఏ మద్యం దుకాణానికై నా టెండర్ వేయవచ్చు. ఒక్కో దరఖాస్తుకు గతంలో రూ.2లక్షలు (నాన్ రిఫండెబుల్) ఉండగా, ఈసారి ఆ ఫీజును రూ.3లక్షలకు పెంచారు. గతేడాది ఉమ్మడి జిల్లాలో 10,734 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి టెండర్ల ద్వారా రూ.214.68 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి ఫీజు పెరగటంతో ఆదాయం మరింత పెరగనుంది. దరఖాస్తు ఫీజును డీడీగా, చలాన్ రూపంలోగాని చెల్లించవచ్చు. దరఖాస్తులను ఆయా జిల్లా ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. ఆరు శ్లాబుల్లో లైసెన్స్ల జారీ.. మొత్తం ఆరు శ్లాబుల్లో ఎకై ్సజ్శాఖ లైసెన్స్లు జారీ చేయనుంది. 2011 జనాభా లెక్క ప్రకారం 5వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో సంవత్సరానికి ఎక్సైజ్ ట్యాక్స్ రూ.50 లక్షలు, 5వేల నుంచి 50 వేలు జనాభా ఉన్న పాంతాల్లో రూ.55 లక్షలు, 50 వేల నుంచి 1 లక్ష జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.60 లక్షలు, లక్ష నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.85 లక్షలు, ఇక 20 లక్షలపైన జనాభా ఉన్న ప్రాంతాల్లో సంవత్సరానికి ఎకై ్సజ్ ఫీజు రూ.కోటి పది లక్షలుగా నిర్ణయించారు. అయితే, లాటరీ ద్వారా లిక్కర్ షాపులను పొందిన వారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన వార్షిక ఫీజును ప్రతి ఏటా ఆరు స మాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. 25 నెలల లైసెన్స్ కాలానికి గాను 1/4వ వంతు అంటే 25 శాతం సమానమైన బ్యాంక్ గ్యారంటీ ప్రభుత్వానికి సమర్పించాలి.జిల్లా మొత్తం గౌడ్స్కు ఎస్సీలకు గతంలో వచ్చిన వచ్చిన ఆదాయం కరీంనగర్ 94 17 9 4,040 80.80 జగిత్యాల 71 14 8 2,636 52.72 పెద్దపల్లి 74 13 8 2,022 40.44 సిరిసిల్ల 48 09 6 2,036 40.72 మొత్తం 287 53 31 10,734 214.68 -
ఎమ్మెల్యే చొరవ.. 50 వేలమెట్రిక్ టన్నులు కేటాయింపు
సుల్తానాబాద్(పెద్దపల్లి): గోదాముల్లో స్టాకు ఉందనే సాకుతో అధికారులు రైస్మిల్లులకు బాయిల్డ్ బియ్యం కేటాయించలేదు. అధికారుల చుట్టూ యాజమాన్యం తిరిగినా ఫలితం లేకపోవడంతో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావును ఆశ్రయించారు. రెండు సంఘాలుగా ఉన్న రైస్మిల్ అసోసియేషన్ ప్రతినిధులను కలుపుకొని ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు నరేందర్రెడ్డి, సివిల్ సపప్లయి కమిషనర్ చౌహన్తో బుధవారం చర్చలు జరిపారు. జిల్లాకు 50 వేల మెట్రిక్ టన్నులు.. 2024–25 రబీ సీజన్కు జిల్లావ్యాప్తంగా ఉన్న రైస్మిల్లులకు 4.64 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించారు. వాటి ద్వారా ఇప్పటికే యాజమాన్యాలు 55శాతం బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించారు. మరిన్ని ధాన్యం నిల్వలు ఉండి కేటాయించకపోవడంతో యాజమాన్యాలు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. చర్యలతో జిల్లావ్యాప్తంగా ఉన్న 148 రైస్మిల్లులకు 50 వేల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ బియ్యాన్ని కేటాయించినట్లు సివిల్ సప్లై డీఎం శ్రీకాంత్రెడ్డి తెలిపారు. కాగా బాయిల్డ్ బియ్యానికి ఇచ్చిన విధంగా అనే రా బియ్యానికి కూడా అనుమతులు ఇవ్వాలని ఎఫ్సీఐ అధికారులను మిల్లర్లు కోరుతున్నారు. కాగా రైస్మిల్ అసోసియేషన్ 2 గ్రూపులుగా విడిపోయింది. ఎమ్మెల్యే చొరవతో రెండు గ్రూపులు కలిసి సమస్య పరిష్కారానికి గురువారం హైదరాబాద్ వెళ్లాయి. రెండు సంఘాల జిల్లా అధ్యక్షులు నగునూరి అశోక్కుమార్, మోరపల్లి తిరుపతిరెడ్డి, ముస్త్యాల రాజన్న, జయపాల్రెడ్డి చీటీ కేశవరావు, మాడూరి ప్రసాద్, పల్లా వాసు, సముద్రాల ధర్మేందర్ తదితరులు ఉన్నారు. బాయిల్డ్ బియ్యం కేటాయించేలా చొరవ తీసుకున్న మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే విజయరమణారావుకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఏటీసీ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
రామగుండం/కోల్సిటీ: నగరంలోని అడ్వాన్స్ ట్రెనింగ్ సెంటర్ (ఏటీసీ)ను గురువారం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ఠాకూర్ సందర్శించారు. శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏటీసీలను వర్చువల్ విధానంలో ప్రారంభించను న్న నేపథ్యంలో ముందస్తుగా స్థానిక ఏటీసీని సందర్శించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యా విధానంలో మూస పద్ధతికి స్వస్థి పలికి చదివే చదువు ఉపాధికి అనుగుణంగా ఉండేలా వివిధ కంపెనీలు త మకు అవసరమైన మానవ వనరులను తయారు చే సుకునేందుకు ఏటీసీ కేంద్రాలను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఇందులో వివిధ రంగాలపై యు వత కు శిక్షణ కల్పించి నైపుణ్యం ఆధారంగా ఉపాధి క ల్పించేందుకు ఇప్పటికే పలు కంపెనీలతో ఒప్పందం చేసుకుందన్నారు. అలాగే గోదావరిఖని ప్రభు త్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)ని ఎమ్మెల్యే సందర్శించారు. గ్రౌండ్ ఫ్లోర్ అధ్వానంగా ఉందని, ఆధునీకరణకు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సూపరింటెండెంట్ అర్చన, ఆర్ఎంవో రాజును ఆదేశించా రు. ఆస్పత్రిలో పారిశుధ్యం మెరుగుపర్చాలన్నారు. -
● ఎన్నికల్లో విజయం సాధించిన కార్మిక సంఘ్
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ రామగుండం ఉద్యోగ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎన్టీపీసీ కార్మిక సంఘ్ (బీఎంఎస్ అనుబంధం) విజయం సాధించింది. గురువారం ప్రాజెక్టు పరిపాలన భవనంలో ఎన్నికలు నిర్వహించారు. ప్రాజెక్టులో 212 మంది ఉద్యోగులు ఓటర్లుగా ఉన్నారు. ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ (ఐఎన్టీయూసీ), ఎన్టీపీసీ కార్మిక సంఘ్ (బీఎంఎస్), ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) బరిలో నిలిచాయి. 212 మందికి గాను 208 ఓట్లు (98 శాతం పోలింగ్) నమోదయ్యాయి. బీఎంఎస్కు 102, ఐఎన్టీయూసీ 94, సీఐటీయూకి 12 ఓట్లు రాగా, బీఎంఎస్ అనుబంధ కార్మిక సంఘ్ 102 ఓట్లతో ప్రాతినిధ్య సంఘంగా అర్హత పొందడంతో పాటు ఒక ఎన్బీసీ స్థానాన్ని కై వసం చేసుకుంది. ఐఎన్టీయూసీ 94 ఓట్లతో రెండో ఎన్బీసీ స్థానానికి పరిమితమైంది. రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి కందుల సంధ్యారాణి విజయోత్సవ ర్యాలీలో పాల్గొని ఉద్యోగులను అభినందించారు. కార్మిక సంఘ్ అధ్యక్షుడు భాస్కర్రెడ్డి, ప్రధానకార్యదర్శి సాగర్రాజు, చల్లా సత్యనారాయణరెడ్డి, పోగుల స్వామి తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ధర్మారం(ధర్మపురి): గ్రామాల అభివృద్ధే ధ్యేయమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. గురువారం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. బుచ్చయ్యపల్లిలో రూ.20 లక్షలతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవనం, ఖిలావనపర్తి శ్రీలక్ష్మీనర్సింహస్వామి కళ్యాణ మండపం వద్ద రూ.15 లక్షలతో నిర్మించే వంటశాలకు భూమిపూజ చేశారు. రామయ్యపల్లిలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తామని మంత్రి పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ పోల్దాసరి సంతోష్, పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, యువజనకాంగ్రెస్ అధ్యక్షుడు సోగాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
లారీల వరుస.. బస్టాండ్ బురద
శుక్రవారం శ్రీ 26 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025డీడీలు చెల్లించి ఇసుక లోడ్కోసం వచ్చిన లారీలన్నీ వర్షాలతో కిలోమీటర్ల మేర బారులుతీరాయి. రోజుల తరబడి డ్రైవర్లు, క్లీనర్లు లారీల వద్దే ఉండి తిప్పలు పడుతున్నారు. గురువారం అడవిసోమన్పల్లి శివారులోని క్వారీ వద్ద ఇసుకలోడింగ్ లేక రహదారిపై ఇలా పెద్ద ఎత్తున లారీలో నిలిచిపోయాయి. అలాగే చిన్నపాటి వర్షాలకే మంథని బస్టాండ్ చెరువును తలపిస్తోంది. వరద నీరు నిలవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి ఎన్టీపీసీలో బీఎంఎస్కు ‘గుర్తింపు’ -
ఘొల్లుమన్న గోపాల్రావుపల్లె
సిరిసిల్ల/తంగళ్లపల్లి(సిరిసిల్ల): పోరుబాట పట్టిన ఊరిబిడ్డ అమరుడయ్యాడని గోపాల్రావుపల్లె ఘొల్లుమంది. నవయవ్వనంలో అడవిబాట పట్టిన యువకుడు 70 ఏళ్ల వయసులో నమ్మినబాటలోనే ప్రాణాలు విడిచాడని ఊరు, వాడ కన్నీటిపర్యంతమైంది. ఇన్నాళ్లు ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా తమ ఊరి పిలగాడు ఉన్నాడేమోనని ఆతృతగా వార్తలు విన్న ఆ గ్రామస్తులు నేడు విగతజీవిగా చూసి గుండెలవిసేలా రోదించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కొస అలియాస్ సాధు అంత్యక్రియలు స్వగ్రామం తంగళ్లపల్లి మండలం గోపాల్రావుపల్లెలో గురువారం కుటుంబ సభ్యులు, పౌరహక్కుల నేతలు, బంధువులు, స్నేహితుల అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. – వివరాలు 10లో.. -
‘ఎల్లంపల్లి’కి భారీ ఇన్ఫ్లో
రామగుండం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ ఇన్ఫ్లో వస్తోంది. ఎల్లంపల్లి నీటిమట్టం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 15.9 టీఎంసీలు ఉన్నాయి. ఎస్సారెస్పీ నుంచి 3.41 లక్షలు, కడెం నుంచి 4,144, వరద నీరు 2.58 లక్షల క్యూసెక్కులు మొత్తం 6.03 లక్షల క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తి 6.38 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.కాత్యాయినీగా అమ్మవారుపెద్దపల్లిరూరల్: పెద్దపల్లిలోని శ్రీలక్ష్మీ గణపతి సంతోషిమాత ఆలయంలో గురువారం కాత్యాయినీ రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఆలయ భూదాత గంప శ్రీరామలు, ప్రభాదేవి దంపతులు ఆలయ నిర్వహణకు ప్రతినెలా రూ.5వేలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు.పార్వతీ బ్యారేజ్కు వరద తాకడిమంథనిరూరల్: ఎగువన ఎల్లంపల్లి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో మంథని మండలం సిరిపురం సమీపంలోని పార్వతీ బ్యారేజ్కు పెద్ద ఎత్తున వరద చేరుతోంది. బ్యారేజ్ 74గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. గురువారం సాయంత్రం వరకు పార్వతీ బ్యారేజ్కు 6.98లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు.నేడు పేరెంట్, లెక్చరర్ల సమావేశంపెద్దపల్లిరూరల్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో శుక్రవారం పేరెంట్, లెక్చరర్ల సమావేశం నిర్వహించనున్నట్టు ఇంటర్ నోడల్ అధికారి కల్పన తెలిపారు. జిల్లాలోని 14 కాలేజీల్లో (ఎక్కడి కాలేజీ పేరెంట్స్, లెక్చరర్స్ అక్కడే) ప్రిన్సిపాల్, అధ్యాపకుల ఆధ్వర్యంలో సమావేశం ఉంటుందన్నారు. ఈ మేరకు సమావేశానికి రావాలంటూ తల్లిదండ్రులకు ఆహ్వానపత్రికలను అందించినట్టు పేర్కొన్నారు. విద్యార్థుల విద్యాప్రగతి, క్రమశిక్షణ త దితర విషయాలపై తల్లిదండ్రుల నుంచి తెలుసుకునేందుకు వీలుంటుందన్నారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలిమంథనిరూరల్: జిల్లాను క్షయరహితంగా తీర్చిదిద్దుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డీఎంహెచ్వో డాక్టర్ వాణిశ్రీ అన్నారు. గురువారం మంథని మండలం గద్దలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇంపాక్ట్ ఇండియా ప్రాజెక్టు డిస్ట్రిక్ట్ లీడ్ దేవోజు శ్రీనివాస్ పీహెచ్సీ పరిధిలో టీబీ నుంచి కోలుకున్న 30మందికి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వ్యాధి లక్షణా లు కన్పిపిస్తే వెంటనే పరీక్షలు నిర్వహించి నిర్ధారించి మందులు అందజేయాలన్నారు. డెప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ రవి, డాక్టర్ సృజన్, సిబ్బంది పాల్గొన్నారు.అవార్డు అందుకున్న జగదీశ్వర్జ్యోతినగర్(రామగుండం): జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును గడ్డం జగదీశ్వర్ అందుకున్నా రు. గురువారం శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ, హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియం భాస్కర నిలయంలో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. ఎన్టీపీసీ రామగుండం అన్నపూర్ణకాలనీలోని దుర్గయ్యపల్లె ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్గా విధులు నిర్వహిస్తున్న జగదీశ్వర్ అవార్డు అందుకోవడంపై పలువురు అభినందించారు. -
కార్మికుల విజయం
ఎన్టీపీసీ రామగుండం ఉద్యోగ గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మిక సంఘ్ విజయం కార్మికుల విజయం. 35 ఏళ్ల తర్వాత బీఎంఎస్ను గెలిపించడం ఆనందంగా ఉంది. ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు రాజకీయాలకతీతంగా అంకితభావంతో పని చేస్తాం. – భాస్కర్రెడ్డి, ఎన్టీపీసీ కార్మిక సంఘ్ అధ్యక్షుడు ఎన్నికలు ప్రశాంతం ఎన్టీపీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ముగిసింది. ఎన్టీపీసీ రామగుండం అధికారులు, ఎస్సై ఉదయ్కిరణ్ పర్యవేక్షణలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. – బిజయ్కుమార్ సిగ్దర్, ఎన్టీపీసీ ఏజీఎం -
అన్నపూర్ణదేవిగా అమ్మవారు
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని శ్రీలక్ష్మీగణపతి సంతోషిమాత ఆలయంలో దుర్గామాత బుధవారం అన్నపూర్ణదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో చండీయాగం నిర్వహించారు.పెద్దచెరువుకు పర్యాటక శోభసుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): గర్రెపల్లి పెద్దచెరువుకు పర్యాక శోభ తెచ్చేందుకు నిర్వాహకు లు నిర్ణయించారు. ఇందులో భాగంగా అధ్యా త్మికత పంచేలా భారీఎత్తున శివుని విగ్రహం నిర్మిస్తున్నారు. విగ్రహ నిర్మాణం చివరిదశలో ఉంది. ఈనెల 29న ఎమ్మెల్యే విజయరమణారావు.. విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని నిర్వాహకులు కన్నం రమేశ్, ఆసరి రాజయ్య, ఎడ్ల రవి, పడాల శ్రీను, పడాల రంగస్వామి తెలిపారు.పెరటికోళ్ల పెంపకంపై గ్రామస్తులకు అవగాహనముత్తారం(మంథని): రామగిరి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం అడవిశ్రీరాంపూర్ గ్రామంలో పెరటికోళ్ల పెంపకంపై అవగాహన కల్పించారు. డీఆర్డీవో కాళిందిని మాట్లా డుతూ, పోషకాహార భద్రత, మహిళల్లో స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించేలా పెరటికోళ్ల పెంపకం చేపట్టాలన్నారు. గ్రామాన్ని దత్తత తీసుకున్న కృషి విజ్ఞాన కేంద్రం.. సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు భాస్కరరావు, వినోద్కుమార్, పంచాయతీ కార్యదర్శి మల్లేశ్వరి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల రాజయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ పాల్గొన్నారు.1,258 మంది కార్మికులకు జనరల్ అసిస్టెంట్ హోదాగోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల్లోని 1,258 మంది బదిలీ వర్కర్లను పర్మినెంట్ చేస్తూ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు సంస్థ సీఎండీ బలరాం బుధవారం ఉత్తర్వులిచ్చారు. బదిలీ వర్కర్లుగా చేరి ఏడా దిలో భూగర్భగనిలో 190, ఓసీపీలో 240 మస్టర్లు పూర్తిచేసిన కార్మికులను జనరల్ అసి స్టెంట్ కేటగిరీ–1గా క్రమబద్ధీకరించనున్నారు.రైల్వే ఉద్యోగులకు బోనస్రామగుండం: కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు బుధవారం దసరా బోనస్ ప్రకటించింది. 78 రోజుల ఉత్పత్తి ఆధారంగా బోనస్ చె ల్లించనున్నట్లు వెల్లడించింది. ఫలితంగా కొన్ని క్యాటగిరీ ఉద్యోగుల్లో ఒకొక్కక్కరికి రూ.17,951 చొప్పున బోనస్ అందనుంది. దీనిపై ఉద్యోగుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.గుంజపడుగులో మరోసారి సీబీఐ విచారణమంథనిరూరల్: గుంజపడుగు గ్రామంలో సీబీఐ రెండోసారి బుధవారం విచారణ చేపట్టింది. గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయ వాది గట్టు వామన్రావు – నాగమణి దంపతుల హత్య విషయంలో సీబీఐ అధికారులు సుమారు ఆరు గంటల పాటు విచారణ జరిపినట్లు తెలిసింది. రెండురోజుల క్రితం వామన్రావు తల్లిదండ్రులు, సోదరుడిని విచారించిన అధికారులు.. కల్వచర్లలోని ఘటనా స్థలాన్ని పరిశీలించిన విషయం తెలిసిందే. -
తండాల అభివృద్ధికి నిధులు
● ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ● మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ధర్మారం(ధర్మపురి): వెనుకబడిన గిరిజన తండాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.740 కోట్లు కేటాయించిందని సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్కుమార్ తెలిపారు. ధర్మపురి మండలం మల్లాపూర్ – పెగడపల్లి మండలం కీచులాటపల్లి మధ్య చేపట్టిన బైపాస్ రోడ్డు పనులను బుధవారం ఆయన నాయకులతో కలిసి పరిశీలించారు. రోడ్డు వెడల్పు 14 అడుగులు ఉంటే భవిష్యత్లో ఇబ్బందులు ఉంటాయని, వేడ ల్పు ఇంకా పెంచాలని, ఇందుకు అవసరమైన అంచనాలు తయారు చేస్తే వెంటనే నిధులు విడుదల చేయిస్తానని మంత్రి అన్నారు. ధర్మపురి నియోజవర్గంలోనూ వివిధ అభివృద్ధి పనులకు అంచనాలు రూపొందిస్తే నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ధర్మారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, పత్తిపాక సింగిల్విండో చైర్మన్ నోముల వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొత్త నర్సింహులు, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సోగాల తిరుపతి, మాజీ అధ్యక్షుడు గందం మహిపాల్, నాయకులు చింతల ప్రదీప్రెడ్డి, అసోద అజయ్, రామడుగు గంగారెడ్డి, పాలమాకుల రాజు, నిబ్బినాయక్ మహేందర్యాదవ్, పోలవేని స్వామి తదితరులు పాల్గొన్నారు. -
పరిహారం చెల్లించాకే పనులు
మంథనిరూరల్: తమకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాకే గ్రీన్ఫీల్డ్ హైవే పనులు చేయాలని చల్లపల్లి గ్రామ రైతులు డిమాండ్ చేశారు. ఈమేరకు చల్లపల్లిలో చేపట్టిన హైవే పనులను బుధవారం వారు అడ్డుకున్నారు. గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంలో భూము లు కోల్పోయిన పలువురు అన్నదాతలకు ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. పుట్టపాక ప్ర ధాన రహదారి పక్కన ఎకరం రూ.కోటి ధర పలు కుతోందని, ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో సరిపెట్టుకుంటామని ముందుకు వచ్చినా చాలామందికి పరిహారం ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ప్రతీ నిర్వాసితుడికి పూర్తిస్థాయి పరిహారం అందించాకే గ్రీన్ఫీల్డ్ పనులు చేసుకోవాలని రైతులు స్పష్టం చేశారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్ వారితో మా ట్లా డి ఆందోళన విరమింపజేశారు. అనంతరం రైతులు ఆర్డీవోను కలువగా త్వరలో పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో అన్నదాతలు శాంతించి ఇంటిదారి పట్టారు. -
కార్మికుల శ్రమ దోచుకుంటున్న కాంగ్రెస్
గోదావరిఖని: రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి కలిసి కార్మికుల శ్రమ దోచుకుంటున్నాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. స్థానిక ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రూ.2,200 కోట్ల లాభాలు వస్తే అందులోంచి రూ.710కోట్ల లాభాలను కార్మికులను పంపిణీ చే శామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.4 వేల కోట్ల లాభాలు వస్తే అందులో కేవలం రూ. 798కోట్లు మాత్రమే కార్మికులకు పంచారన్నారు. 2023–24లో పక్కన పెట్టిన సుమారు రూ.2వేల కోట్లు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. గతేడాది రూ.6వేల కోట్లకుపైగా లాభం వస్తే రూ.802కోట్లు మాత్రమే కార్మికులకు పంచారని మండిపడ్డారు. డీఎంఎఫ్టీ, రాజీవ్ అభయ హస్తం పేరిట సింగరే ణి సొమ్మును ఇతర పథకాలకు మళ్లిస్తున్న యాజమాన్యం.. కార్మికులు సాధించిన లాభాల్లో పూర్తిస్థా యి వాటా ఇస్తే తప్పేమిటని ఆయన నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యే జీడీకే–5 ఓసీపీ మూసివేయాలని ప్రచారం చేశారని, అధికారంలోకి వచ్చాక ఏం చేస్తున్నారని చందర్ ప్రశ్నించారు. నాయకులు నడిపెల్లి మురళీధర్రావు, గోపు ఆయిలయ్యయాదవ్, ముద్ద సాని సంధ్యారెడ్డి, బాలరాజు, కుమార్నాయక్, ముక్కెర మొగిలి తదితరులు పాల్గొన్నారు. -
జ్వరాలపై నిర్లక్ష్యం వద్దు
● కలెక్టర్ కోయ శ్రీహర్ష మంథని/రామగిరి: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే జ్వరపీడితులను నిర్లక్ష్యం చేయకుండా, వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంథని, రామగిరి మండలాల్లో బుధవారం ఆయన పర్యటించారు. మంథని ప్రభుత్వ ఆస్పత్రి, జేబీఎస్, జెడ్పీ బాలికల హైస్కూల్, గురుకుల పాఠశాల, రామగిరి మండలం రత్నాపూర్ ఎంపీపీఎస్, బేగంపేట జెడ్పీహెచ్ ఎస్ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ, సీజనల్ వ్యాధిగస్తులకు నిర్ధారణ పరీక్షలు చేసి వైద్యసేవలు అందించాలన్నారు. ఓపీ సమయంలో వైద్యులు పూర్తిసమయం కేటాయించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభి వృద్ధి పనులను వెంటనే ప్రారంభి పూర్తి చేయాలని ఆదేశించారు. మంథని ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజశేఖర్, మంథని, రామగిరి పీఆర్ ఏఈలు అనుదీప్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ పెద్దపల్లిరూరల్: జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నియమించిన ప్రిసైడింగ్ అధికారులకు ఈనెల 26, 27వ తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. 26న ఉదయం 10 గంటలకు ధర్మారం వ్యవసాయ మార్కెట్యార్డులో ఎలిగేడు, జూలపల్లి, ధర్మారం మండలాల అధికారులకు, కలెక్టరేట్లో పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్ మండలాలకు చెందిన అధికారులకు శిక్షణ ఉంటుందన్నారు. 27న సుల్తానాబాద్లోని యశోద నరహరి ఫంక్షన్ హాల్లో ఓదెల, సుల్తానాబాద్ మండలాలు, మంథని జేఎన్టీయూలో కమాన్పూర్, రామగిరి, ముత్తారం, మంథని మండలాల ఎన్నికల అధికారులకు శిక్షణ ఇస్తారని కలెక్టర్ వివరించారు. -
ఏమిటీ భవిష్యనిధి?
గోదావరిఖని: ఏమిటీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్.. ఎందుకోసం ప్రొవిజన్ కేటాయింపు? ఈనిధులను ఏం చేస్తారు? లాభాల వాటా ప్రకటనతోపాటు ప్రొవిజన్ పేరిట భారీ కేటాయింపులు ఎందుకు? అనే అంశాలు సింగరేణి బొగు గనుల్లో లోతైన చర్చకు దారితీశాయి. అంతేకాదు.. రెండేళ్లలో భారీమొత్తంలో కేటాయించడం ఎందుకనే ప్రశ్నకు ఊతమిచ్చినట్లయ్యింది. పదేళ్లుగా ఏటా లాభాల వాటా ప్రకటిస్తున్న సింగరేణి.. ఇదే సమయంలో అందులోంచి బ్యాక్ఫిల్లింగ్, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పేరిట నిధు లు కేటాయిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. భారీ కేటాయింపులపై చర్చ.. గతంలో బ్యాక్ఫిల్లింగ్, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్, ఇన్కంట్యాక్స్ తదితర ఖర్చులు పోను లాభాల ప్రకట న చేసేవారు. ఇప్పుడు మొత్తం లాభాలు ప్రకటించి ప్రొవిజన్ పేరిట అందులోంచి అధిక మొత్తంలో ని ధులు పక్కన పెడుతున్నారు. లాభాల్లో 34 శాతం కార్మికులకు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే రూ.6,394 కోట్లపై 34 శాతం వాటా కేటాయించాలనేది కార్మిక సంఘాలు, కార్మికుల డి మాండ్గా ఉంది. లాభాల్లో భారీగా కోత విధించి తక్కువ వాటా ఇచ్చారనే వాదన వస్తోంది. ఈక్రమంలో కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు తీవ్రతరం చేశాయి. అయితే, బొగ్గు గనుల సంస్థ భవిష్యత్ ముఖ్యమని, లాభాల వాటా హక్కు కాదని, ప్రభుత్వం ప్రకటించే నజరానా అని సింగరేణి యాజమాన్యం చెబుతోంది. దీనిపై డిమాండ్ చేయడం ఏమిటని యాజమాన్యం ప్రశ్నిస్తోంది. లాభాల వాటా ప్రస్థానం ఇలా.. సింగరేణి సాధించిన లాభాల్లో కార్మికులకు వాటా చెల్లించడం పాతికేళ్ల క్రితమే ప్రారంభమైంది. అ ప్పటి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) అధ్యక్షుడు కేఎల్ మహేంద్ర, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో హైదరాబాద్లో జరిగిన చర్చల్లో లా భాల వాటా ప్రస్తావన తెరపైకి తీసుకు వచ్చారు. ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు ఓపెన్కాస్ట్ ప్రాజెక్టు (ఓసీపీ)లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 13రోజుల పాటు సమ్మె చేయడంతో అప్పటి సీఎం.. హైదరాబాద్ పిలిపించి గుర్తింపు యూనియన్ ఏఐటీయూసీతో చర్చించారు. ‘మీ తీరువల్లే సింగరేణి బొగ్గు గనుల సంస్థ నష్టాల పాలవుతోందని ముఖ్యమంత్రి నేతలపై మండిపడ్డారు. దీంతో ‘సింగరేణికి లాభాలు వస్తే మాకేమిట’ని యూనియన్ నేతలు వెంటనే సీఎంను ప్రశ్నించారు. స్పందించిన ప్రభుత్వం.. సింగరేణి లాభాలు సాధిస్తే లాభాల్లో 10 శాతం వాటా ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో 2000 సంవత్సరం నుంచి సింగరేణి సాధించే లా భాల్లో వాటా కార్మికులకు చెల్లించడం ప్రారంభమైంది. ప్రస్తుతం ఆ వాటా 34 శాతానికి చేరుకుంది. కొత్తగనుల కోసమే.. 2023–24లో ప్రొవిజన్ నిధులు రూ.2,289కోట్లు యాజమాన్యం పక్కన పెట్టింది. వీటిలో రూ.1,250 కోట్లతో 250 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంగల సో లార్ ప్లాంట్ ఏర్పాటుకు వెచ్చించింది. మరో రూ. 300కోట్లు వెచ్చించి 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ స్థాపిస్తారు. భూసేకరణ ఇతర పనుల కోసం రూ. 900కోట్లు పెట్టుబడి పెట్టినట్లుగా యాజమాన్యం చెబుతోంది. ఈసారి రూ.4,034కోట్లు కూడా భవిష్యత్ అవసరాల కోసం వినియోగిస్తామంటోంది.భవిష్యత్ భద్రతకే.. ప్రొవిజన్ పేరిట కేటాయించిన నిధులను కొత్త ప్రాజెక్టుల కోసం వినియోగిస్తాం. ఈపక్రియ ఏటా కొనసాగుతుంది. గతేడాది కేటాయించిన నిధులతో 250 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్, థర్మల్ విద్యుత్ కేంద్రం స్థాపన, భూసేకరణ, సీహెచ్పీల నిర్మాణం కోసం వెచ్చించాం. సింగరేణి ప్రగతి, భవిష్యత్ భద్రతకే లాభాల్లోంచి ఇలా నిధులు ప్రత్యేకంగా కేటాయిస్తున్నాం. సోలార్ పవర్ ప్లాంట్ పనులు పూర్తయితే సింగరేణికి ఏటా రూ.200 కోట్లు మిగులుతాయి. – ఎన్.బలరాం, సీఎండీ, సింగరేణి రెండేళ్లలో కేటాయింపులుఏడాది లాభాలు ప్రొవిజన్ (రూ.కోట్లలో) (రూ.కోట్లలో) 2023–24 4,701.30 2,289.00 2024–25 6,394.00 4,034.00 -
పల్లెప్రగతి వైపు అడుగులు
మంథనిరూరల్: ప్రతీ పల్లెను ప్రగతిబాటలో నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. గ్రామీణులకు అందుబాటులో ఉన్న మౌలిక వసతులపై కచ్చితమైన సమాచార సేకరణలో నిమగ్నమైంది. ఈ క్రమంలో ప్రతీగ్రామంలో పంచాయతీ కార్యదర్శులు మౌలిక వసతులపై సర్వే ప్రక్రియ ఇటీవల ప్రారంభించారు. ఇలా సేకరించిన మౌలిక వసతుల సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఇందుకోసం 21 అంశాలతో కూడిన ప్రత్యేక యాప్ను రూపొందించగా.. ప్రతీ అంశాన్ని అందులో నమోదు చేస్తున్నారు. మొదలైన సర్వే ప్రక్రియ.. జిల్లాలోని 14 మండలాల్లో 266 గ్రామపంచాయతీలు ఉండగా.. ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో సర్వే ప్రక్రియ మొదలైంది. పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రంథాలయాలు, పశువైద్య ఉపకేంద్రాలు, పాఠశాల భవనాలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, నర్సరీలు, క్రీడా ప్రాంగణాలు, కుళాయిలు, బోర్లు, అంతర్గత రహదారులు, డ్రైనేజీల.. ఇలా ప్రగతికి అవసరమైన అన్ని వసతులపైనా సర్వే కొనసాగుతోంది. ప్రత్యేక యాప్లో నమోదు.. గ్రామాల్లో మౌలిక వసతుల గురించి సమాచారం తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్ రూ పొందించింది. గ్రామపంచాయతీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పేరిట రూపొందించిన ఈ యాప్లోనే పంచాయతీ కార్యదర్శులు.. తాము సేకరించిన వివరాలు నమోదు చేస్తున్నారు. డెయిలీ శానిటేషన్ రిపోర్ట్తోపాటు 21 అంశాల్లో మౌలిక వసతుల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. వసతుల లెక్క పక్కాగా.. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులపై పక్కాగా లెక్క ఉండేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఎలాంటి సమస్యలు ఉన్నాయి. ప్రజావసరాలు తీర్చేలా ఎటువంటి వసతులు కల్పించాలనే అంశాలు తెలిసేలా చర్యలు చేపట్టింది. దీంతో రాబోయే రోజుల్లో గ్రామాల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనతో ప్రగతి బాటలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.త్వరలో పూర్తిచేస్తాం గ్రామాల్లో వసతులు, అమలవుతున్న ప్రణాళికలపై పంచాయతీ కార్యదర్శులు సర్వే ప్రారంభించారు. మరో రెండు, మూడురోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. రాష్ట్ర పంచాయతీ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక యాప్లో గ్రామ ప్రగతికి అవసరమైన వసతులను నమోదు చేస్తున్నారు. – అనిల్రెడ్డి, ఎంపీవో, మంథని -
పదేళ్ల గోసతీర్చిన ప్రజాప్రభుత్వం
● ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లిరూరల్: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ధనార్జనే ధ్యేయంగా ప్రజల ను గోస పెట్టుకున్నదని, కాంగ్రెస్ అధికారంలోకి వ చ్చాక ప్రజా సమస్యలు పరిష్కరించిందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. అందుగులపల్లి, దే వునిపల్లిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కు ముగ్గు పోసి మాట్లాడారు. రేషన్కార్డుల కోసం పేదలు దరఖాస్తు చేసుకుని ఏళ్లుగా నిరీక్షించినా బీఆర్ఎస్ పాలకులు పట్టించుకోలేదని, సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం అర్హులందరి కీ రేషన్కార్డులుజారీ చేస్తోందని తెలిపారు. స్థానిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్కే అండగా నిలవాలని ఆయన కోరారు. నాయకులు బొక్కల సంతోష్, గొడ్డేటి రాజయ్య, గౌస్, సాగర్, లక్ష్మణ్, అశోక్, ఆరె సంతోష్, రాజేందర్, సంపత్ తదితరులు ఉన్నారు. ఆడబిడ్డలకు ప్రభుత్వం అండ సుల్తానాబాద్/జూలపల్లి(పెద్దపల్లి): పేద కుటుంబా ల్లోని ఆడబిడ్డలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. జూలపల్లి ఎంపీడీవో కార్యాలయంలో తహసీల్దారు స్వర్ణతో క లిసి 49 మందికి రూ.49,05,684 విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అ దేవిధంగా సుల్తానాబాద్లో 96 మందికి రూ. 96,11,136 విలువైన చెక్కులు అందజేసి మాట్లాడా రు. అభివృద్ధి ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమ న్నారు. సుల్తానాబాద్, ఇన్చార్జి తహసీల్దార్ రాకేశ్తోపాటు ప్రతినిధులు మినుపాల ప్రకాశ్రావు, గణే శ్, మహేందర్, శ్రీగిరి శ్రీనివాస్, రవీందర్, బిరుదు కృష్ణ, బండారి రమేశ్, రమేశ్గౌడ్, పడాల అజయ్ గౌడ్, అమిరిశెట్టి తిరుపతి, రాజలింగు, గండు సంజీవ్, వేణుగోపాలరావు, శేషయ్యసూరి, దండె వెంకటేశం, నర్సింహయాదవ్, జలపతిరెడ్డి పాల్గొన్నారు. -
టీఎన్జీవోల భూమి ఎక్కడ?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: వారంతా రిటైర్డ్ ఉద్యోగులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం వీరికి ఇంటిస్థలం కేటాయించింది. దాన్ని కబ్జాదారులు మాయం చేయగా.. మూడు దశాబ్దాల పోరాటం తరువాత మరోచోట 20ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించిన అధికారులు.. నేటికీ ప్రొసీడింగ్స్ ఇవ్వడం లేదు. దీంతో ఎనిమిదేళ్లుగా ముదిమి వయసులో ఇంటిస్థలానికి అనుమతులు ఇవ్వాలంటూ కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒకటి, కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు దశాబ్దాలుగా కబ్జాకు గురైన తమ స్థలానికి ప్రత్యామ్నాయం చూపాలంటూ ఈ సీనియర్ సిటీజన్లు చేస్తున్న పోరాటం నేటికీ ఆగడం లేదు. కరీంనగర్ నగర శివారుల్లో టీఎన్జీవోలకు కేటాయించిన స్థలం కబ్జా అయినప్పటికీ.. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో 40ఏళ్లుగా తీరని అన్యాయమే మిగిలిందని ఆవేదన చెందుతున్నారు. తిమ్మాపూర్లో చూసినప్పటికీ బొమ్మకల్లో కబ్జా అయిన 20 ఎకరాల విలువైన స్థ లం గురించి ఇటు టీఎన్జీవో పెద్దలు, అటు కలెక్టర్ కార్యాలయం, రెవెన్యూ ఉన్నతాధికారులు ఎవరూ పట్టించుకోలేదు. ఫలితంగా రూ.కోట్లాది విలువైన స్థలం కబ్జాదారుల వశమైంది. దీంతో అప్పటి నుంచి ప్రయత్నించగా.. ఎట్టకేలకు ప్రత్యామ్నాయ భూ మిని చూపిస్తే కేటాయిస్తామన్నారు. దాదాపు మూ డుదశాబ్దాలపాటు అన్వేషించిన టీఎన్జీవోలు చివరికి 2017లో తిమ్మాపూర్ మండలంలోని యాదవులపల్లి సర్వే 502, 522లలో దాదాపు 21 ఎకరాల ప్రభుత్వ ఖాళీ స్థలం ఉందని గుర్తించి అధికారులకు విన్నవించారు. నివేదికను రెవెన్యూ అధికారులు కలెక్టర్ కార్యాలయానికి పంపినా.. ఇంతవరకూ ఎ లాంటి ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు. ఎనిమిదేళ్లుగా కాళ్లు అరిగేలా తిరుగుతున్నా నేటికీ న్యాయం జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి స్థలాలు రాకుండా మిగిలిన 626 మందిలో దాదాపు 100 మంది మరణించారని, 200 మందికిపైగా అనారో గ్యంతో మంచాన పడ్డారని, దాదాపు 40 ఏళ్లుగా సాగుతున్న పోరాటాన్ని ఇకనైనా గుర్తించి న్యాయం చేయాలని సీఎం, కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తున్నారు. అసలేం జరిగింది? 1980లో ఉమ్మడి జిల్లాలోని 930మంది టీఎన్జీవోలు కలిసి ఇంటి స్థలాల కోసం హౌసింగ్ సొసైటీగా ఏర్పడ్డారు. తమకు ఇంటిస్థలాలు కేటాయించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. స్పందించిన అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ వీరికి మూడు చోట్ల ఇంటి స్థలాలు కేటాయించారు. తొలుత కరీంనగర్ కమాన్రోడ్లోని పాతచెరువు సమీపంలో సర్వే నంబరు 415లో 18 ఎకరాలు, ఎర్రగుంట సమీపంలో సర్వే నంబరు 918లో 14 ఎకరాలు కేటాయించారు. ఈ రెండు స్థలాలను టీఎన్జీవోలకు ప్రభుత్వం స్వాధీనం చేసింది. ఈ స్థలాల్లో 304 మంది టీఎన్జీవోలు ఇండ్లు నిర్మించుకున్నారు. మూడోచోటుగా బొమ్మకల్ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 96లో 20ఎకరాల భూమిని కేటాయించారు. ఈ భూమి తమది అంటూ స్థానిక నేతలు అభ్యంతరం తెలిపారు. ఆ భూమిని కబ్జా చేశారు. దీన్ని స్వాధీనం చేసుకునేందుకు టీఎన్జీవోలు 2017 వరకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. -
ఉరుములు.. మెరుపులు.. భారీవర్షం
● లోతట్టు ప్రాంతాలు జలమయం ● విద్యుత్ సరఫరాకు అంతరాయం పెద్దపల్లిరూరల్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వర్షం దంచికొట్టింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కాసేపు కుండపోతగా పడింది. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ వెనకాల ఇందిరానగర్ రోడ్డుపై వర్షపునీరు ప్రవహించడంతో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యపై మున్సిపల్ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని కాలనీకి చెందిన అల్తాఫ్ పేర్కొన్నారు. ఓదెల(పెద్దపల్లి): కొలనూర్, గోపరపల్లె, ఉప్పరపల్లె, ఓదెల, పొత్కపల్లి, శానగొండ, గుంపుల గ్రామాల్లో ఉరుములు, మెరుపులతతో కూడిన వర్షం కురిసింది. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. వరదతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): వివిధ గ్రామాల్లో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురిసింది. దీంతో రెండు గంటలపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వ్యవసాయదారులు, కూలీలు వర్షంలో తడిసి ముద్దయ్యారు. -
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
● యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ● జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్ జ్యోతినగర్(రామగుండం): సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్ సూచించారు. ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్ కాకతీయ ఆడిటోరియంలో మంగళవారం యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో ఎంటర్ప్రెన్యూర్షిప్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సంద్భంగా ఆయన జ్యోతిప్రజ్వలన చేసి మాట్లాడారు. నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం అందిస్తున్న బ్యాంకు రుణాలతో చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారాలు స్థాపించాలన్నారు. తద్వారా యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయన సూచించారు. చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం జిల్లా పరిశ్రమల శాఖ వద్ద మరింత సమాచారం పొందేందుకు యువత ముందుకు రావాలని ఆయన సూచించారు. సదస్సులో యూనియన్ బ్యాంక్ డీజీఎం అపర్ణరెడ్డి, జిల్లా పరిశ్రమల అధికారి కీర్తికాంత్, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ తాజ్ తదితరులు పాల్గొన్నారు. -
రగులుతున్న రగడ
● సింగరేణి లాభాల వాటాపై వివాదం● నిరసనలకు దిగుతున్న కార్మిక సంఘాలు ● ఆందోళనబాటలో రాజకీయ పార్టీలుగోదావరిఖని: కార్మికుల లాభాల వాటా ప్రకటనపై సింగరేణి బొగ్గు గనుల్లో వివాదం రాజుకుంటోంది. సంస్థ సాధించిన వాస్తవ లాభాలు కాకుండా పెద్దమొత్తంలో పక్కనబెట్టి తక్కువ లాభాల్లోంచే వాటా ప్రకటించారని కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది రూ.2,289కోట్లు భవిష్యత్ అవసరాల కోసం కేటాయిస్తే.. ఈసారి రెట్టింపు పక్కన పెట్టడడంపై కార్మికులు, కార్మిక సంఘా లు, రాజకీయ పార్టీల్లోనూ దుమారం రేగుతోంది. వాస్తవ లాభాలు రూ.6,394కోట్లు.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ లాభాలు రూ.6,394కోట్లు కాగా, భవిష్యత్ అవసరాల కో సం అందులోంచి రూ.4,034కోట్లు కేటాయించారు. మిగిలిన రూ.2,360కోట్లపై 34శాతం కార్మికులకు వాటా ప్రకటించడం వివాదానికి దారితీసింది. గతేడాదితో పోల్చితే రూ.1,692.7కోట్లు లాభాలు అధికంగా వచ్చినా, ఒకశాతం వాటా పెరిగినా కార్మికు లకు కేటాయించింది అదనంగా రూ.6.94కోట్లు మాత్రమే. దీంతో అందరూ పెదవి విరుస్తున్నారు. ఆందోళనలకు దిగుతున్న అన్ని సంఘాలు.. సింగరేణిలోని ఏఐటీయూసీ, టీబీజీకేఎస్, హెచ్ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ తదితర కార్మిక సంఘాలతోపాటు బీఆర్ఎస్, బీజేపీ తదితర రాజకీయ పార్టీలు కూడా లాభాల వాటా ప్రకటన తీరును ఆక్షేపిస్తున్నాయి. ఈక్రమంలో గత గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ మంగళవారం సింగరేణి వ్యాప్తంగా న ల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టింది. ప్రస్తుత గుర్తింపు యూనియన్ ఏఐటీయూసీ కూడా నిరసన వెల్లడించింది. దీనిని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొంది. అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న ఐఎన్టీయూసీ మాత్రం ఇంకా స్పందించడంలేదు. కాంట్రాక్టు కార్మికుల వాటాపైనా అసంతృప్తి.. సింగరేణిలో సుమారు 30వేల మంది కాంట్రాక్టు కార్మికులకు కాంగ్రెస్ పా ర్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.5వేల చొప్పు న లాభాల వాటా ప్రకటించింది. ఈసారి రూ.10 వేలు చెల్లించేలా ప్రకటన చేయాలని ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యాన్ని గుర్తింపు యూనియన్ ఏఐటీయూసీ కోరింది. అయితే గతేడాదికన్నా రూ.500పెంచి రూ.5,500 మాత్రమే చెల్లించను న్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాంట్రాక్టు కార్మికుల ద్వారానే సంస్థకు లాభాలు వస్తున్నాయని పేర్కొంటున్న సంస్థ.. వారికి లాభాలు పెంచడంలో ఎందుకు అంగీకరించడం లేదని గుర్తింపు యూనియన్ఏఐటీయూసీ ప్రశ్నించింది. ఇంత ఆర్భాటం అవసరమా..? సింగరేణి కార్మికులకు ఏటా చెల్లిస్తున్న లాభాల వాటా విషయంలో యాజమాన్యం చేసిన ఆర్భాటాన్ని కార్మికులు, కార్మిక సంఘాలు తప్పుపడుతున్నాయి. యాజమాన్యం, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు, ముఖ్యమంత్రి సమక్షంలో ప్రకటించాల్సిన ఆనవాయితీ గతంలో ఉండేదని పేర్కొంటున్నాయి. లాభాల వాటా విషయంలో హంగు, ఆర్భాటాలు ఇప్పటికై నా మానుకోవాలని కోరుతున్నారు. వాస్తవ లాభాలు(రూ.కోట్లలో) 6,394 భవిష్యత్ అవసరాలకు కేటాయింపు(రూ.కోట్లలో) 4,034 మిగిలిన లాభాలు(రూ.కోట్లలో) 2,360 అందులో కార్మికుల వాటా(శాతం) 34 కార్మికులకు చెల్లించే మొత్తం(రూ.కోట్లలో) 802.40 కాంట్రాక్టు కార్మికులకు చెల్లించేది(రూ.కోట్లలో) 17 -
సజావుగా ధాన్యం కొనుగోళ్లు
పెద్దపల్లిరూరల్: వానాకాలం ధాన్యం కొనుగో ళ్లు సజావుగా సాగేలా కార్యాచరణ సిద్ధం చే యా లని అడిషనల్ కలెక్టర్ వేణు ఆదేశించారు. ధా న్యం కొనుగోళ్లపై కలెక్టరేట్లో జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్, డీఎస్వో శ్రీనాథ్, ఆర్టీవో రంగారావుతో కలిసి మంగళవారం సమీక్షించా రు. సన్నరకం ధాన్యం క్వింటాలుకు ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించిందన్నారు. నాణ్యత ప్రమాణాలపై ఏఈవోలు అవగాహన పెంచుకుని, ఇబ్బందులు పరిష్కరించాలన్నారు. రైతు కు టోకెన్లు ఇచ్చి క్రమపద్ధతిలో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చేలా చూడాలన్నారు. ప్ర భుత్వ, అటవీ భూముల్లో పంటలు పండించే రైతుల నుంచి ఏఈవోలు 50 క్వింటాళ్ల వరకు, అంతకు ఉంటే మండల వ్యవసాయాధికారిణి ధ్రువీకరించాలని ఆయన సూచించారు. యూరియా లారీ అడ్డగింత జూలపల్లి(పెద్దపల్లి): మండల కేంద్రానికి మంగళవారం ఉదయం వచ్చిన యూరియా లారీని కోనరావుపేట గ్రామ రైతులు ఆడ్డుకొన్నారు. ప దిరోజులుగా తమ గ్రామానికి యూరియా పంపించడం లేదని ఆరోపించారు. లారీని తమ ఊరికి తరలించి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు నచ్చజెప్పినా వినలేదు. రంగ ప్రవేశం చేసిన ఏవో ప్రత్యూష.. లారీని కోనరావుపేటకు తీసుకెళ్తుండగా తమకే యూరియా పంపిణీ చేయాలని జూలపల్లికి చెందిన రైతులు అడ్డుకున్నారు. దీంతో రెండు గ్రామాల రైతుల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. చివరకు కోనరావుపేటకు లారీ తరలించి యూరియా పంపిణీ చేశారు. రైతులు కూసుకుంట్ల రవీందర్రెడ్డి, కత్తెర్ల రాయమల్లు, వెంకటరెడ్డి, హన్మంతరెడ్డి, అంజయ్య, హనుమంతు పాల్గొన్నారు. ఆయుర్వేద వైద్యంతో మేలు పెద్దపల్లిరూరల్: దీర్ఘకాలిక వ్యాధులు, కీళ్లనొ ప్పులు, వాతం లాంటి వ్యాధులను ఔషధ గుణాలున్న మొక్కలతో తయారు చేసిన పొడుల (ఆయుర్వేద మాత్రల)తో నయం చేయవచ్చని డీఎంహెచ్వో వాణిశ్రీ అన్నారు. ఉచిత మెగాఆ యుర్వేద వైద్యశిబిరాన్ని జిల్లా కేంద్రంలో మంగళవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఆ యుర్వేద వైద్యంతో దుష్ఫలితాలు ఉండవన్నా రు. కీళ్ల నొప్పులు, వాతం, కిడ్నిలో రాళ్లు, అర్ష మొలలు, బీపీ, ఎసిడిటి, మలబద్ధకం తదితర వ్యాధులకు ఇది బాగా పనిచేస్తుందని ఆయుష్ జిల్లా ఇన్చార్జి అరుణ తెలిపారు. వైద్యులు మ హేశ్, అమర్నాథ్, ప్రభాకర్, దివ్య, నిహారిక, శిరీష, మారుతి పరీక్షలు చేసి మందులు అందజేశారు. ఆయుష్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ విద్యాసాగర్, కావేటి రాజగోపాల్ ఉన్నారు. -
విద్యార్థులు క్రీడలపై దృష్టి సారించాలి
రామగిరి(మంథని): విద్యార్థులు క్రీడలపై దృష్టి సా రిస్తే సెల్ఫోన్ అడిక్షన్కు దూరమవుతారని మంథని జేఎన్టీయూ ప్రిన్సిపాల్ బులుసు విష్ణువర్ధన్ అన్నా రు. భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, మై భారత్ పెద్దపల్లి జిల్లా, రామగిరి ఫ్రెండ్స్ యూత్ వేల్ఫర్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కళాశాలలో ఏర్పాటు చేసిన బ్లాక్స్థా యి క్రీడాపోటీలను ఆయన ప్రారంభించారు. మానసిక ఒత్తిడి జయించాలన్నా, మానసిక ఉల్లాసం కలగాలన్నా క్రీడలు ముఖ్యమన్నారు. వైస్ ప్రిన్సిపాల్ ఎం.ఉదయ్కుమార్, మై భారత్ జిల్లా ఇన్చార్జి మహేశ్, ఫిజికల్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
సంతోషంగా ఉంది
ఈసారి లాభాల వాటా దసరా పండుగకు ముందే ప్రకటించ డం సంతోషంగా ఉంది. లాభా లు ఎక్కువ, తక్కువ విషయాన్ని పక్కన పెడితే కార్మికులకు పండగ సందర్భంగా చెల్లించే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు. – గజ్జి ఓదెలు, ఈపీ ఆపరేటర్, ఓసీపీ–3 కోత విధించారు కార్మికుల సమస్యలపై సీఎం స్పందిస్తారనుకుంటే లాభాల్లో కోత విధించారు. మసిపూసి మారేడుకాయ చేశారు. స్ట్రక్చర్ సమావేశం బహిష్కరించిన ఏఐటీయూసీ ఈసారి రాజకీయ నేలతో కలిసి ఎందుకు కూర్చుంది? –తుమ్మల రాజారెడ్డి, అధ్యక్షుడు, సీఐటీయూ -
శాతవాహన స్నాతకోత్సవానికి రండి
సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవానికి సిద్ధమైంది. గవర్నర్, శాతవాహన చాన్స్లర్ జిష్ణుదేవ్వర్మ నవంబర్ 7న స్నాతకోత్సవం నిర్వహణకు అను మతినిచ్చినట్లు వర్సిటీ వైస్ చాన్స్లర్ ఉమేశ్కుమార్ తెలిపారు. ఈమేరకు ఆయన సోమవారం గవర్నర్ను కలిశారు. హైదరాబాద్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ బీజేరావు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. స్నాతకోత్సవం సందర్భంగా విద్యార్థులకు బంగారు పతకాలు, పీహెచ్డీ పరిశోధకులకు డాక్టరేట్ పట్టాలు అందజేస్తామని పేర్కొన్నారు. 2019 ఆగస్టులో తొలిస్నాతకోత్సవం జరిగిందని, ఇప్పుడు ద్వితీయ స్నాతకోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు. -
అన్యాయం చేశారు
ప్రభుత్వం, సింగరేణి కలిసి లాభాల వాటా ఏకపక్షంగా ప్రకటించాయి. గతంలో కార్మి క సంఘాలతో కలిసి ప్రకటించేవారు. ఈసా రి అలా జరగలేదు. బొగ్గు ఉత్పత్తి తగ్గిందని, లాభాల్లో కోత విధించడం సరికాదు. – వి.సీతారామయ్య, అధ్యక్షుడు, ఏఐటీయూసీకార్మికులకు నష్టం గతంలో కూడా 33శాతం అని చెప్పి 16.93 శాతమే ఇచ్చారు. 2024–2025 లో సింగరేణి సాధించిన వాస్తవ లాభాలు రూ.6,394 కోట్లు. ఇందులో 34శాతం వాటా రూ.2,173.96 కోట్లు. కానీ, 802.40కోట్లు పంపిణీ చేస్తామంటున్నారు. – యాదగిరి సత్తయ్య, అధ్యక్షుడు, బీఎంఎస్ -
నేడు ఉచిత వైద్యశిబిరం
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో మంగళవా రం ఆయుర్వేద ఉచిత వైద్యశిబిరం నిర్వహి స్తారు. వైద్యశిబిరం ప్రచార పోస్టర్ను కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఆయుష్ అధికారి అరుణ, డాక్ట ర్ మారుతి, డీపీఎం విద్యాసాగర్తో కలిసి సో మవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. స్థానిక ఎంబీ గార్డెన్లో నిర్వహించే మెగా వైద్యశిబిరంలో వాతరోగాలు, కీళ్ల నొప్పులు, అర్షమొలలు, హైబీపీ, అల్సర్, మలబద్ధకం, కిడ్నీలో రాళ్లు, జ్వరం, దగ్గు, జలుబు, ఆస్తమా, జీర్ణవ్యవస్థ సంబంధిత వ్యాధులకు పరీక్షలు చేస్తారు. పరిశ్రమల అభివృద్ధి లక్ష్యం రామగుండం: పరిశ్రమల అభివృద్ధి, పర్యావ రణ పరిరక్షణ, ప్రజల భద్రత, హక్కులను కా పాడడడం ప్రధానమని ఎంపీ వంశీకృష్ణ అన్నా రు. మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారుల సమావేశంలో పాల్గొన్న ఆ యన వివిధ అంశాలపై చర్చించారు. ఎన్టీపీసీ, ఇంధన డిపోలు, బొగ్గు గనులు తదితర పరిశ్రమల స్థాపనతో సమీప గ్రామాల్లో వాతావరణం కాలుష్యం కాకుండా పరిశ్రమల యాజమాన్యాలు చర్యలు చేపట్టాలని సూచించారు. సీఎంను కలిసి ఠాకూర్ గోదావరిఖని: సింగరేణి లాభాల వాటా ప్రకటించిన సీఎం రేవత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ సోమవారం హైదరాబాద్లో కలిసి పుష్పగు చ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. పండుగకు ముందే లాభాల వాటా ప్రకటించడంతో కార్మికులు సంతోషంగా ఉన్నారన్నారు. ఎన్ఎస్ఎస్ వలంటీర్ల సర్వే పెద్దపల్లిరూరల్: స్థానిక ప్రభుత్వ బాలికల జూ నియర్ కాలేజీ విద్యార్థినులు సోమవారం గౌ రె డ్టిపేటలో ఇంటింటి సర్వే చేశారు. బడిబయటి బడీడు పిల్లలుపై ఆరా తీశారు. ప్రోగ్రాం అధి కారి నరహరి, పంచాయతీ కార్యదర్శి తిరుపతి, అధ్యాపకులు ప్రసూన, శ్రీలత, పుష్పలత, అ శోక్, కుమారస్వామి ఉన్నారు. ప్రభుత్వ బాలు ర జూనియర్ కాలేజీ వలంటీర్లు హన్మంతునిపేటలో సర్వే చేశారు. ప్రిన్సిపాల్ రవీందర్రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ సదయ్య, అధ్యాపకులు శ్రీని వాస్, రాజేంద్రప్రసాద్, నర్సింహరాజు, వి.మమత, దివ్య తదితరులు పాల్గొన్నారు.మైనారిటీలకు ఆర్థిక భరోసా పెద్దపల్లిరూరల్: పేద మైనార్టీ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన, రేవంతన్న కా సహా రా పథకాలను ప్రభుత్వం ప్రారంభించిందని జిల్లా ఇన్చార్జి అధికారి రంగారెడ్డి తెలిపారు. దూదెకుల, ఫకీర కుటుంబాలు అర్హులని, అక్టోబరు 6లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. క్రిస్టియన్లకు ఉచిత శిక్షణ నిరుద్యోగ క్రిస్టియన్లకు ప్లంబర్ కోర్సులో ఉచి త శిక్షణ ఇవ్వనున్నట్టు ఇన్చార్జి అధికారి రంగా రెడ్డి తెలిపారు. న్యానాక్ ఆధ్వర్యంలో మూడు నెలలు శిక్షణ ఉంటుందని, ఆసక్తి గలవారు ఈనెల 27లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరా రు. వివరాలకు 99633 13318, 90002 94176 నంబర్లలో సంప్రదించాలన్నారు. ప్లాట్ల విచారణ వాయిదా రామగిరి(మంథని): నాగెపల్లిలో ఓపెన్ ప్లాట్లపై సోమవారం జరపాల్సిన విచారణ వాయిదా ప డింది. ఓపెన్ ప్లాట్లలో అవకతవకలు జరిగా యని గ్రామస్తులు తీగల సమ్మయ్య, కొండవేన ఓదెలు ఫిర్యాదు చేయగా.. డీపీవో వీరబుచ్చయ్య.. విచారణకు కమిటీని నియమించారు. అయితే, అనివార్య కారణాలతో విచారణ వాయిదా పడడంతో మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తారు. మరోవైపు.. వినతిపత్రి ఇంచ్చేందుకు వెళ్లిన తమను గ్రామపంచాయతీ కార్యదర్శి అవమానించారని, ఆయనపై చర్య తీసుకోవాలని వీహెచ్పీఎస్, ఎమ్మార్పీఎస్ నాయకులు ఎంపీడీవోను కోరారు. ఈ విషయంపై సెక్రటరీని సంప్రదించగా.. అదంతా అవాస్తవమన్నారు. -
సైబర్నేరాలపై అవగాహన
గోదావరిఖని: సైబర్నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. తన కార్యాలయంలో సోమవారం సీపీ సైబర్ వారి యర్స్తో నేరాలపై సమీక్షించారు. సైబర్నేరాల్లో అత్యధికంగా సొత్తు రికవరీ చేసిన వారియర్స్కు ప్రసంశాపత్రాలు, టీషర్ట్లు అందజేశారు. దుర్గామాత మండపాలు, బతుకమ్మల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా విజబుల్ పోలీసింగ్ నిర్వహించాలని ఆదేశించారు. మహిళలపై వేధింపు లు, ఈవ్టీజింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండుగ సెలవుల్లో ఊళ్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైన స్థానిక పోలీస్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్క్రైం సీఐలు శ్రీనివాస్, కృష్ణమూర్తి, సీసీ హరీశ్ పాల్గొన్నారు. -
ఆశావహులకు కలిసొచ్చేనా?
జిల్లా సమాచారం సాక్షి పెద్దపల్లి: ప్రభుత్వం స్థానిక ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఆదివారం రిజర్వేషన్లపై మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇక ఎన్నికల నిర్వహణ స్పష్టమైందనే భావనంతో జిల్లాలోని అన్ని పల్లెల్లో ఎక్కడ నలుగురు కలిసినా రిజర్వేషన్లు, ఎన్నికలపైనే ముచ్చటిస్తున్నారు. జెడ్పీ చైర్మన్ బీసీలకేనా..? పంచాయతీరాజ్ ఆదివారం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈమేరకు కలెక్టర్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక సంస్థల అధికారులతో సమావేశం నిర్వహించారు. జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లను కలెక్టర్, ఎంపీటీసీ, సర్పంచ్ పదవులకు ఆర్డీవో, వార్డుల రిజర్వేషన్లను ఎంపీడీవోలు వార్డులల్లోని కులాల వారీగా మా ర్కింగ్ చేసుకుని రిజర్వేషన్లు ప్రకటించనున్నారు. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ కులగణన సర్వే ఆధారంగా బీసీలకు 42శాతం, ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించ నున్నారు. గత ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన సీట్లను మినహాయించి, మిగిలిన కేటగిరీల్లోని స్థానాల్లోనే బీసీలకు అదనంగా కోటా కల్పించనున్నారు. దీంతో గతంలో బీసీలకు కేటయించిన స్థానాలతోపాటు మరికొన్ని స్థానాలు పెరగనుండటంతో ఏయే ఏయే స్థానాలు బీసీలకు కేటాయించనున్నారోననే చర్చ ఆశావాహుల్లో కొనసాగుతోంది. గతంలో కేటాయించిన మహిళా రిజర్వేషన్లుకు తోడు 50శాతానికి తగ్గకుండా లాటరీ పద్ధతిన వారికీ రిజర్వేషన్ వర్తింపజేస్తారు. దీంతో జెడ్పీ చైర్మన్ కుర్చీ బీసీలకే దక్కనుంది. అయితే, బీసీ జనరల్ అవుతుందా? లేదా బీసీ మహిళకు కేటాయిస్తారా? అనేదానిపై ఆశావాహులు అంచనా వేసుకుంటున్నారు. ప్రభుత్వం అధికారికంగా రిజర్వేషన్లు ప్రకటించేవరకు ఎవరికి తోచినట్లు వారు లెక్కలు వేసుకోవడం కొనసాగుతూనే ఉంటుందని అంటున్నారు. తొలుత పరిషత్ ఎన్నికలే.. ఈనెల 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వానికి గడవు విధించిన విషయం విదితమే. ప్రభుత్వం మరింత గడువు కోరాలని చూస్తూనే, మరోపక్క ఎన్నికల నిర్వహణకూ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తుది ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలు ప్రకటించింది. తొలుత పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతుండడంతో తాము పోటీ చేయదల్చుకున్న స్థానంలో రిజర్వేషన్ ఎలా ఉంటుందనే విషయంపై స్పష్టత లేక ఆశావహులు సందిగ్ధ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. పంచాయతీలు263 వార్డులు 2,432 ఎంపీటీసీలు 137 జెడ్పీటీసీలు 13 మొత్తం ఓటర్లు 4,04,181 పురుషులు 1,98,728 మహిళలు 205439 ఇతరులు 14 -
లాభాల వాటా నామమాత్రమే!
గోదావరిఖని: లాభాల వాటాపై సింగరేణి కార్మిక సంఘాలు పెదవి విరుస్తున్నాయి. లాభాలు అధి కంగా ఆర్జించినా భవిష్యత్ అవసరాల కోసం భా రీగా కేటాయించడం ఇందుకు కారణమంటున్నా యి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సాధించిన వాస్తవ లాభాలను సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం హై దరాబాద్లో ప్రకటించారు. రూ.6,394.0కోట్లు లా భాలు రాగా అందులో కార్మికుల వాటా 34 శాతం.. రూ.802.40కోట్లు చెల్లించనున్నట్లు వెల్లడించారు. కాంట్రాక్టు కార్మికులకూ మరో రూ.17 కోట్లు కేటాయించి, ఒక్కో కార్మికుడికి రూ.5,500 చొప్పున పంపిణీ చేస్తారు. భవిష్యత్ అవసరాల కోసమని.. భవిష్యత్ నిధి కోసం గతేడాది లాభాల్లోంచి రూ. 2,289 కోట్లు పక్కన పెట్టగా, ఈసారి రెండింతలు.. రూ.4,034కోట్లు పక్కన పెట్టడంతో కార్మికులకు వాటా చేతికి పెద్దగా అందదంటున్నారు. గ తే డాదికన్నా ఒకశాతం వాటా పెరిగినా.. డబ్బు ల విషయానికస్తే పెంపు పెద్దగా లేదంటున్నారు. గతంలో 33 శాతం వాటాగా రూ.796 కోట్లు కే టాయించగా.. ఈసారి 34 శాతం వాటాతో రూ. 02.40 కోట్లు వస్తే.. అందులో పెరిగింది కేవలం రూ.6.34 కోట్లు మాత్రమే అంటూ కార్మికులు నిరాశ చెందుతున్నారు. సింగరేణి వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా 72 మిలియన్ టన్నులు కాగా 69.01 మిలియన్ టన్నుల సాధించింది. -
తల్సైనిక్ క్యాంపును పూర్తి చేసిన పాల్సన్ రాజ్
గోదావరిఖనిటౌన్(రామగుండం): స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాలలో బీకాం సెకండియర్ చదువుతున్న ఎన్సీసీ విద్యార్థి పాల్స న్ రాజ్ ఎన్సీసీ విభాగంలో జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన తల్సైనిక్ క్యాంపు విజయవంతంగా పూర్తి చేశాడు. కరీంనగర్ 9వ బెటాలియన్లో ఉన్న పాల్సన్ నిజామాబాద్ గ్రూపు స్థాయిలో ఎంపికై న ఏకై క విద్యార్థి. ఈ క్యాంపులో భాగంగా న్యూఢిల్లీలోని డీజీఎన్సీసీ ఆధ్వర్యంలో 12రోజులు ఫైరింగ్ విభాగంలో క్యాంపు విజయవంతంగా పూర్తి చేసి కళాశాలకు వచ్చిన సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ జైకిషన్ ఓజ, వైస్ ప్రిన్సిపాల్ సాంబశివరావు, ఎన్సీసీ అధికారి బి.తిరుపతి, అధ్యాపకులు అభినందించారు. -
మల్లన్న సేవలో అడిషనల్ కలెక్టర్
ఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామిని ఆదివారం అడిషనల్ కలెక్టర్ వేణు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం సీతరామచంద్రస్వామి, నందీశ్వరులను దర్శనం చేసుకున్నారు. సింగరేణి స్టేడియంలో రామ్లీలాగోదావరిఖని(రామగుండం): లామ్లీలా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఆదివారం సినీ నటుడు శివారెడ్డి స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియాన్ని సందర్శించారు. దసరా సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ సూచనల మేరకు కావాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆర్జీ–1 జీఎం లలిత్కుమార్ మాట్లాడుతూ, రామ్లీలా సంబరాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. సింగరేణి యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఏసీపీ మడత రమేశ్, సీఐ ఇంద్రసేనారెడ్డి, డీజీఎం సివిల్ వరప్రసాద్, పర్సనల్ మేనేజర్ రవీందర్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి, పెద్దెల్లి ప్రకాశ్, లింగస్వామి, ముస్తాఫా, గట్ల రమేశ్, సన్నీ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా వాలీబాల్ జట్టుకు నాగచైతన్యఎలిగేడు(పెద్దపల్లి): మండలంలోని ధూళికట్ట జెడ్పీ పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థి జెల్లి నాగచైతన్య అండర్– 14 విభాగంలో ఉమ్మడి జిల్లా వాలీబాల్ జట్టుకు ఎంపికై నట్లు హెచ్ఎం స దయ్య, పీడీ శ్రీకాంత్ తెలిపారు. ఈనెల 19, 20 తేదీల్లో సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభచా టాడు. అలాగే 8వ తరగతి విద్యార్థి సిద్ధార్థ ఉ మ్మడి జిల్లా కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు పే ర్కొన్నారు. ఈసందర్భంగా విద్యార్థులను ఉ పాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. జిల్లాస్థాయి ఖోఖో పోటీలుపెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం అప్పన్నపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం జిల్లాస్థాయి ఖోఖో పోటీలు నిర్వహించారు. ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్స్, జూనియర్స్ విభాగాల పోటీలను జిల్లా అధ్యక్షుడు లక్ష్మయ్య, కార్యదర్శి కుమారస్వామి, నరేశ్, సురేందర్ ప్రారంభించారు. ప్రతిభచాటిన క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. హెచ్ఎం పురుషోత్తం, నారాయణ, తిరుపతిరెడ్డి, షఫీయొద్దీన్, ప్రసాద్, భాస్కర్, భూపతి తదితరులున్నారు. ‘ఖని’ నుంచి బీదర్కు ఆర్టీసీ ప్రత్యేక బస్సుగోదావరిఖనిటౌన్(రామగుండం): గోదావరిఖని నుంచి కర్ణాటకలోని బీదర్కు ఈ నెల 23న ఆర్టీసీ ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును నడుపనున్నట్టు డిపో మేనేజర్ ఎం.నాగభూషణం తెలిపారు. 23న రాత్రి 9 గంటలకు బస్సు గోదావరిఖని బస్టాండ్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం బీదర్కు చేరుకుంటుందని తెలిపారు. బీదర్లోని శ్రీ క్షేత్రఝురాణి నరసింహస్వామి దర్శనం అనంతరం రేజింతల్లోని వరసిద్ధి వినాయకుడు, శ్రీకేతకీ సంగమేశ్వరస్వామి దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం 24న రాత్రి గోదావరిఖనికి తిరుగు ప్రయాణం ఉంటుందని పేర్కొన్నారు. పెద్దలకు రూ.1,600, పిల్లలకు రూ.1,250 చార్జీలు నిర్ణయించడం జరిగిందన్నారు. మరిన్ని వివరాలకు 70135 04982, 73828 47596 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
దీపావళి బోనస్
పెంపుపై పట్టుపదేళ్లలో దీపావళి(పీఎల్ఆర్) బోనస్ చెల్లింపు(రూ.లలో) ఏడాది పెరిగింది చెల్లింపు 2014 5,000 40,000 2015 8,500 48,500 2016 5,500 54,000 2017 3,000 57,000 2018 3,500 60,500 2019 4,200 64,700 2020 3,800 68,500 2021 4,000 72,500 2022 4,000 76,500 2023 8,500 85,000 2024 8,750 93,750 గోదావరిఖని(రామగుండం): దేశంలోని బొగ్గుగని కార్మికులకు దీపావళి బోనస్పై కార్మిక సంఘాలు కోలిండియా యాజమాన్యంతో భేటీ కానున్నాయి. ఈనెల 22న కార్మిక సంఘాలు, కోలిండియా యాజమాన్యంతో సమావేశమై చెల్లింపుపై చర్చించనున్నాయి. గతేడాది బోనస్ కింద ప్రతీ కార్మి కుడికి రూ.93,750చెల్లించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోని బొగ్గుగని కార్మికులకు ఈబోనస్ ను ఏటా దీపావళి సందర్భంగా అందించడం ఆనవాయితీ. ఈసారి బోనస్పై చర్చించేందుకు జేబీసీసీఐ కార్మిక సంఘాలు కోలిండియా యాజమాన్యంతో ఢిల్లీలో సమావేశం కానున్నాయి. రూ.లక్షకు పైగా చెల్లించాలని.. ఈసారి దీపావళి బోనస్ ఒక్కో కార్మికునికి రూ.లక్షకుపైగా చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ఢిల్లీలో జరిగే చర్చల్లో జేబీసీసీఐ సంఘాలు, కోలిండియా యాజమాన్యం చర్చలు జరిపి కార్మికులకు చెల్లించే మొత్తాన్ని ఖరారు చేయనున్నాయి. దసరా అడ్వాన్స్ చెల్లింపులకు ఆదేశాలు సింగరేణి కార్మికులకు దసరా పండుగ అడ్వాన్స్ చెల్లించేందుకు యాజమాన్యం ఆదేశాలు జారీచేసింది. పండుగ ఖర్చుల కోసం అడ్వాన్స్ అందజేసి తర్వాత వారి వేతనాల్లో యాజమాన్యం రికవరీ చేస్తూ వస్తోంది. ఏటా కార్మికులకు యాజమాన్యం పండుగ కోసం ముందస్తు చెల్లింపు జరుపుతోంది. ఈమేరకు సీఆర్పీ/పీఈఆర్/ఐఆర్/ఎఫ్/201/ 1123 పేరున శనివారం ఆదేశాలు జారీఅయ్యాయి. పర్మినెంట్ కార్మికులకు రూ. 25వేలు, బదిలీ వర్కర్లకు రూ.12,500 దసరా అడ్వాన్స్ చెల్లించేందుకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబరు 2న బోనస్ సొమ్మును కార్మికుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమచేయనుంది. నేడు సింగరేణి కార్మికుల లాభాల ప్రకటన : సీఎండీ2024–25 ఆర్థిక సంవత్సరం సింగరేణి కార్మి కుల లాభాలను సోమవారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో ప్రకటించనున్నట్లు సంస్థ సీఎండీ ఎన్.బలరాం తెలిపారు. ఉదయం 10.40 గంటలకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లాభాలను ప్రకటిస్తారని, కార్మికుల వాటా కూడా ఈసందర్భంగా ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. కోల్బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘం నాయకులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు వివరించారు. 2.60లక్షల మంది కార్మికులుదేశవ్యాప్తంగా సుమారు 2.60లక్షల మంది బొగ్గుగని కార్మికులు ఉండగా, సింగరేణి బొగ్గు గనుల సంస్థలో దాదాపు 40వేల మంది ఉద్యోగులకు తాజాగా చేసుకునే ఒప్పందం వర్తించనుంది. గత ఒప్పందం ప్రకారం ఒక్కో కార్మికునికి రూ.93,750 బోనస్ చెల్లించగా, ఈసారి దీన్ని మరింత పెంచాలని కార్మి క సంఘాలు చర్చల్లో పట్టుబట్టే అవకాశం ఉంది. కోలిండియాతో ముడిపడి ఉన్న దీపావళి బోనస్పై యాజమాన్యం, జేబీసీసీఐ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్, హెచ్ఎంఎస్, సీఐటీయూ చర్చించనున్నాయి. -
పండుగ వేళ.. మిరిమిట్లు గొలిపేలా..
సుల్తానాబాద్(పెద్దపల్లి): పండుగల వేళ గ్రామాలు, పట్టణాల్లో నెలకొన్న చీకట్లు త్వరలో తొలగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వీధి దీపాల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి ఇటీవల ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుండగా, వీధి దీపాలు వెలగక ఇబ్బందులు పడ్డ ప్రజలకు ఉపశమనం లభించింది. అవసరం ఉన్నచోట కొత్త వాటిని ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించిన విషయం తెలిసిందే. వాటి అన్ని బాధ్యతలను ఎంపీడీవోలు, ఎంపీవోలు, అదనపు కలెక్టర్లు చూడాలని సూచించారు. కాగా, కొన్ని నెలలుగా పురపాలికలు, పల్లెల్లో పాలకవర్గాలు లేక వీధి దీపాలను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇరవై శాతం పైగా వెలగని లైట్లే.. జిల్లా కేంద్రంలో మొత్తం 11,234 వీధి దీపాలు ఉన్నాయి. వాటిలో సుమారు వెయ్యికి పైగా వెలగడం లేదనే ఆరోపణలున్నాయి. సెంట్రల్ లైటింగ్ సైతం ఏర్పాటు చేసినా అక్కడక్కడ వెలగడం లేదు. పండుగల సీజన్ కావడంతో వాటన్నింటికీ మరమ్మతులు చేసే అవకాశం ఉంది. జీపీ సెక్రటరీలకు తప్పనున్న కష్టాలు గ్రామాల్లో పాలకవర్గాలు లేక ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. దీంతో భారమంతా పంచాయతీ కార్యదర్శులపై ఉండడంతో మౌలిక వసతుల కల్పనకు ఇబ్బందులు పడ్డారు. వీధి దీపాలు, వాటి విద్యుత్ బిల్లులను సైతం వారి జేబులో నుంచి ఖర్చు చేస్తున్నారు. సీఎం నిర్ణయంతో తమకు భారం తప్పినట్లేనని పలువురు కార్యదర్శులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కొన్ని ప్రాంతాల్లో లైట్లు లేక ఇబ్బంది పడుతుండగా, కొన్ని చోట్ల 24 గంటలూ వెలుగుతూనే ఉంటాయి. వాటి విద్యుత్ వృథాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఎం ఆదేశించారు. జిల్లాలో 54,640.. జిల్లావ్యాప్తంగా 266 గ్రామపంచాయతీల్లో సుమారు 54,640 వీధి దీపాలు ఉన్నట్టు జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య తెలిపారు. పలు చోట్ల వెలగనివాటికి మరమ్మతు చేసినట్లు పేర్కొన్నారు. లైట్లు వెలగకుంటే వెంటనే పంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇవ్వాలని కోరారు. -
రాజన్న సేవలో జైళ్ల శాఖ డీజీ
వేములవాడ: రాజన్నను రాష్ట్ర జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా శనివారం దర్శించుకున్నారు. ఆలయా నికి చేరుకున్న ఆమెకు అర్చకులు, వేదపండితులు స్వా గతం పలికారు. శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం అందజేశారు. జైళ్లశాఖ డీఐజీ సంపత్, ఎస్పీ మహేశ్ బీ గీతే, వేములవాడ అడిషనల్ ఎస్పీ శేషాద్రినిరెడ్డి ఉన్నారు. ఇనుప సామగ్రి తీసుకెళ్తున్న ఉద్యోగి పట్టివేత జ్యోతినగర్(రామగుండం): పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాజెక్టు నుంచి అనుమతి లేకుండా సామాను తీసుకెళ్తున్న ఉద్యోగిని సీఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డబ్ల్యూ–02 ఉద్యోగి యూనిట్–7లో విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం ఉదయం స్క్రాప్ను తన బైక్లో పెట్టుకుని బయటకు తరలిస్తుండగా గేట్ నంబర్–1 వద్ద సీఐఎస్ఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. ఆ తర్వాత నిందితుడితోపాటు స్క్రాప్ను పోలీసులకు అప్పగించారు. స్క్రాప్ బరువు 27 కేజీలు ఉంటుందని సమాచారం. -
విద్యుత్ షాక్తో రైతు మృతి
మేడిపల్లి: కోతుల బెడ ద నుంచి మొక్కజొన్న పంటను కాపడుకునేందుకు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి రైతు మృతి చెందిన ఘటన భీమారం మండలం పసునూర్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మాలోతు సత్యనాయక్ కోతుల నుంచి పంటను కాపాడుకునేందుకు విద్యుత్ వైర్ అమర్చాడు. శనివారం ఉదయం ఎప్పటిలాగే చేనుకు వెళ్లిన సత్యనాయక్.. వైర్లకు తగిలి అక్కడిక్కకడే మృతి చెందాడు. సత్యనాయక్కు భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య భూమిక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్సె శ్రీధర్ రెడ్డి తెలిపారు. తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన పరకాల శ్రీనివాస్(45) బతుకుదెరువు కోసం మహారా ష్ట్రకు వలసవెళ్లాడు. అక్కడే ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. నిరుపేద కుటుంబం కావడంతో చందాలు వేసి అంత్యక్రియలు నిర్వహించారు. రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని రైల్వే వంతెన కింద ట్రాక్ పక్కన ఓ మృతదేహాన్ని గుర్తించినట్లు జీఆర్పీ ఔట్పోస్టు ఇన్చార్జి తిరుపతి శనివారం తెలిపారు. స్థానిక సుభాష్నగర్కు చెందిన తాళ్లపల్లి సమ్మయ్య(52) రైళ్లలో భిక్షాటన చేస్తున్నాడు. బుధవారం ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. అయితే, రైల్వేట్రాక్ పక్కన ముళ్లపొదల్లో లభ్యమైన మృతదేహాన్ని పరిశీలించగా.. అది సమ్మయ్యదిగా నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య దేవమ్మ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కేసు నమోదు చేసుకొన్నారు. గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరింటాలకు చెందిన సంగం ప్రశాంత్(28) కూలీ పనులు చేస్తూ బతుకుతున్నాడు. బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈక్రమంలో రెండు రోజుల క్రితం జగిత్యాలలో ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. తిరిగి వస్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. 108 వాహనంలో కరీంనగర్ తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాయకులు కొమిరిశెట్టి లక్ష్మణ్ తదితరులు కుటుంబ సభ్యులను పరామర్శించి తక్షణ సాయం కింద రూ.25వేలు అందించారు. -
ప్లాట్ల వ్యాపారం ప్రాణం తీసింది
సిరిసిల్ల/వేములవాడ అర్బన్: భూ వివాదాల్లో రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్నగర్కు చెందిన మాజీ కౌన్సిలర్ సిరిగిరి రమేశ్(55) వేములవాడ కమాన్ వద్ద హత్యకు గురయ్యాడు. పాతికేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ప్లాట్ల వ్యాపారం చేసిన రమేశ్ను చివరికి ఆ వివాదాలే బలి తీసుకున్నాయి. వేములవాడ పట్టణానికి చెందిన ఎద్దండి వెంకటేశ్ శుక్రవారం ఉదయం 9 గంటలకు సిరిసిల్ల నుంచి రమేశ్ను కారులో తీసుకెళ్లాడు. రాత్రి వరకూ రమేశ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వేములవాడ–సిరిసిల్ల పట్టణాల మధ్య నందికమాన్ వద్ద గల నందీశ్వర వెంచర్లో తన కారులోనే హత్యకు గురై కనిపించాడు. ఎస్టీడీ బూత్ నుంచి కౌన్సిలర్ వరకు.. సిరిసిల్లలోని విమల్ టాకీస్ ప్రాంతంలో చాలా కాలం ఎస్టీడీ బూత్ను నిర్వహించిన రమేశ్ భాగస్వాములతో కలిసి వేములవాడ, సిరిసిల్ల ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. ఆర్థికంగా కలిసి రావడంతో సొంతంగా వెంచర్లు ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలోనే సిరిసిల్ల మున్సిపల్లో 2005లో ఇండిపెండెంట్గా పోటీచేసి కౌన్సిలర్గా గెలుపొందాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మరింత విస్తరించి వివాదాల్లో ఇరుకున్నాడు. ఏడాది కాలంగా రమేశ్పై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత భూవివాదాలు పరిష్కరించుకుంటుండగా హత్యకు గురయ్యాడు. ఉలిక్కిపడిన రియల్టర్లు రెండున్నర దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న రమేశ్ హత్యకు గురవడంతో రియల్టర్లు ఉ లిక్కి పడ్డారు. వే ములవాడలో రియ ల్ ఎస్టేట్ వివాదా లు ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే అనేక హత్యలు భూ వివాదాల్లో జరిగా యి. రమేశ్ హత్య నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయని పోలీ సు వర్గాలు రహస్యంగా ఆరా తీశారు. ప్రధాన నిందితుడు వెంకటేశ్ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. హత్యకేసులో అతనితోపాటు ఇంకా ఎవరు ఉన్నారు? కుట్రదారులు ఎవరైనా ఉన్నారా? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. కొడుకు, కూతురు వచ్చేంత వరకు... రమేశ్ భార్య సిరిగిరి అనీల అడ్వకేట్. అతని కొడుకు తేజస్విన్వర్మ చైన్నెలో, కూతురు చందనశ్రీ ఢిల్లీలో చదువుతున్నారు. ఇద్దరు పిల్లలు వచ్చే వరకు పోస్టుమార్టం వద్దని అనీల స్పష్టం చేయడంతో శనివారం సాయంత్రం వరకు కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దనే వేచి ఉన్నారు. పిల్లలు రావడంతో పోలీసు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం చేశారు. శవాన్ని సిరిసిల్లలోని అంబేడ్కర్నగర్కు తరలించారు. ఎనిమిది మందిపై కేసు రమేశ్ హత్య కేసులో ఎనిమిది మందిపై కేసు నమోదైనట్లు వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి తెలిపారు. మృతుని భార్య అనీల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వేములవాడకు చెందిన ఎద్దండి వెంకటేశ్ తన భర్తను ఇంటి నుంచి తీసుకెళ్లాడని, ఈ హత్య కేసులో ఎద్దండి వెంకటేశ్తోపాటు సిరిగిరి మురళి, రాధాకృష్ణ, శేషగిరిరావు, రాము, పాస్టర్ వేణు, కుంటయ్య, గంగయ్యతోపాటు మరికొంత మందిపై అనుమానం ఉందని మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి తెలిపారు. వేములవాడలో హత్య.. సిరిసిల్లలో కలకలం ఎనిమిది మందిపై కేసు -
అడవిని పంచుకుని వేట
కాళేశ్వరం: అడవి జీవరాశులను చంపడానికి వేటగాళ్లు బరితెగించారు. తమ పరిధిలోని అడవిని కొంతభాగం పంచుకున్నారు. ఒకరి పరిధిలోకి మరో వేటగాళ్ల ముఠా రాకుండా ఒప్పందం చేసుకుని మరీ యథేచ్ఛగా వేటాడుతున్నారు. ఈ క్రమంలో గతేడాదిలో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బోరంపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు గోదావరి దాటి అమ్మమ్మ ఇంటికి చేరుకునే మార్గంలో అడవిలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చులకు తగిలి అక్కడికక్కడే ప్రాణం వదిలిన ఘటన మహదేవపూర్ మండలం మద్దులపల్లి సమీపంలోని బల్జాపూర్ శివారులో జరిగింది. ఈ ఘటనను పోలీసులు ఛేదించారు. ఈ మేరకు శనివారం కాళేశ్వరం పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాటారం డీఎస్పీ ఎ.సూర్య్యనారాయణ, మహదేవపూర్ సీఐ ఎన్.వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు.. గతేడాది మే 31న బోరంపల్లి గ్రామానికి చెందిన దుర్గం ప్రవీణ్(29) గోదావరి దాటి అడవి మార్గం గుండా మద్దులపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వస్తున్నాడు. మార్గంమధ్యలోని అడవిలో వేటగాళ్లు అడవి జంతువులను చంపడానికి ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలకు అమర్చిన ఇనుప (జే వైర్) తీగల ఉచ్చులకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో అప్పటి నుంచి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం అడవిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న మద్దులపల్లికి చెందిన చకినారపు సంతోష్, వేల్పుల నాగరాజు, కొరళ్ల శేఖర్, చకినారపు బాపు, వేల్పుల సురేశ్, చకినారపు శ్రీనివాస్ పోలీసులకు తారసపడ్డారు. వెంటనే అదుపులోకి తీసుకుని విచారించగా.. తాము ఉచ్చులు పెట్టామని, సదరు యువకుడి మృతికి కారణమని ఒప్పకున్నారు. వీరంతా కొన్ని సంవత్సరాలుగా అడవిలో విద్యుత్ తీగలు అమర్చి అడవి జంతువులను చంపి వాటిని తినడం, మాంసం విక్రయించడం చేస్తున్నారు. దీంతో ఆ ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. -
తల్లి మందలించిందని యువతి ఆత్మహత్య
● నాలుగు రోజుల కిత్రమే అమ్మమ్మ మృతి పాలకుర్తి(రామగుండం): సెల్ఫోన్తో ఆడవద్దని తల్లి మందలించడంతో ఓ యువతి వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శనివారం పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లిలో చోటుచేసుకుంది. బసంత్నగర్ ఎస్సై స్వామి కథనం ప్రకారం.. పెద్దపల్లి మండలం కనగర్తికి చెందిన రేగుల మొండయ్య 15 ఏళ్లుగా తన అత్తగారిల్లు కొత్తపల్లిలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయనకు ఒక కుమారుడు రమేశ్, ఒక కూతురు కవిత(23) ఉన్నారు. మొండయ్య అత్త పర్శ బుగ్గమ్మ నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో తన భార్య లక్ష్మితోపాటు కూతురు, కుమారుడితో కలిసి అత్తగారింటి వద్దే ఉంటున్నారు. కవిత శనివారం సెల్ఫోన్తో ఆడుతుండగా గమనించిన తల్లి.. ఇంట్లో పనిచేయకుండా ఫోన్తో ఆడుతున్నావా? ఒకవైపు అమ్మమ్మ చనిపోయిందనే బాధ కూడా లేదా? అని మందలించింది. కవిత కోపంతో ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయింది. ఆ తర్వాత ఎంతకీ కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు ఆరాతీశారు. స్థానికుల సమాచారంతో గ్రామశివారులోని పంట పొలాల్లో వెతకగా.. ఓ వ్యవసాయబావిలో కవిత శవమై కనిపించింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. నాలుగు రోజుల వ్యవధిలో అమ్మమ్మ, మనుమరాలు మృతిచెందడంతో ఆ కుటుంబాల్లో విషాదం అలముకుంది. వృద్ధురాలి..పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన పిడుగు లచ్చమ్మ(60) శనివారం ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలంగా మతిస్థిమితం లేక తిరుగుతోందని, శనివారం ఈ అఘాయిత్యానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై మల్లేశ్ తెలిపారు. యువ ఉద్యోగి..యైటింక్లయిన్కాలనీ(రామగుండం) : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి యైటింక్లయిన్కాలనీ ఎస్సీ టూ– 175 క్వార్టర్లో నివాసం ఉండే తపేట్ల పవన్కుమార్(28) శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్జీ–3 ఏరియా ఏఎల్పీ గనిలో సీనియర్ మైనింగ్ సర్ధార్గా ఆయన విధులు నిర్వర్తిస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. మహబూబాబాద్ జిల్లా మల్యాల గ్రామానికి చెందిన తపేట్ల వెంకన్నకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో పెద్దకుమారుడు పవన్కుమార్. సింగరేణిలో ఉద్యోగం వచ్చింది. ఆర్జీ–3 ఏరియా ఎల్పీ గనిలో సీనియర్ సర్ధార్గా విధులు నిర్వహిస్తున్నాడు. పదిరోజుల క్రితం ఓ యువతిని ప్రేమించినట్లు తనకు చెప్పాడని తండ్రి వెంకన్న పేర్కొన్నారు. తన కుమారుడి మృతికి ఆ అమ్మాయి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు సీఐ లింగమూర్తి కేసు నమోదు చేశారు. కాగా, పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులు.. పవన్కుమార్ నేత్రాలను హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్కు దానం చేశారు. ఉద్యోగం రాలేదని యువతి..గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజుపేటకు చెందిన యువతి అల్లె ప్రియాంక ఉద్యోగం రావడం లేదనే మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియాంక ఇటీవల బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగం రాకపోవడంతో మనస్థాపానికి గురై ఉరివేసుకుంది. మృతురాలి తండ్రి రమేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్కుమార్ తెలిపారు. -
కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర కీలకం
గోదావరిఖని: దోషులకు శిక్ష పడడంలో కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర కీలకమని రామగుండం పో లీస్ కమీషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. కమిషనరేట్ కార్యాలయంలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలోని కోర్టు డ్యూటీ అధికారులు, లైజనింగ్ అధికారులతో సీపీ వివిధ అంశాల పై శనివారం సమీక్షించారు. నేరస్తులకు శిక్ష ప డితేనే నేరాల సంఖ్య తగ్గుతుందని, బాధితులకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఇందుకోసం సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టాలని తెలిపారు. ఈ సందర్భంగా ఓ కేసులో మూగయువతి సైగలను అనువాదం చేసి కోర్టులో దో షికి 20 ఏళ్ల జైలు శిక్ష పడేలా కృషి చేసి శ్రీరాంపూర్కు చెందిన యోసేపును సీపీ సన్మానించా రు. గోదావరిఖని, ఏఆర్ ఏసీపీలు రమేశ్, ప్ర తాప్, లీగల్ సెల్, ఐటీసెల్ సీఐలు కృష్ణ, చంద్రశేఖర్గౌడ్, సీసీఆర్బీ ఎస్సై చంద్రకుమార్, సీసీ హరీశ్ తదితరులు పాల్గొన్నారు. సనాతన ధర్మం విస్మరించవద్దు కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): సనాతన ధర్మం స ర్వమానవాళి సంక్షేమం, శ్రేయస్సు కోరుతుందని, అందుకే దానిని విస్మరించవద్దని స్థానిక జ్ఞా నమౌనీశ్వర ఆశ్రమ పీఠాధిపతి బసవత్తుల రా జమౌళి ఆచార్యులు అన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్, హరిత సేన ఆధ్వర్యంలో ఆశ్రమం, వేదపాఠశాలలో శనివారం శమీ మొక్కలు నా టారు. ఈసందర్భంగా పీఠాధిపతి ప్రవచించారు. సనాతన ధర్మంలో ఆరోగ్య ప్రయోజనాలు కూడి ఉన్నాయని అన్నారు. హరిత సేన రాష్ట్ర కో ఆర్డినేటర్ చెప్యాల రాజేశ్వర్రావు మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నూనేటి సంపత్యాదవ్, మాజీ జెడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, నాయకులు జూకంటి శిరీష, ఆడెపు రాజు, అనిల్, కరుణాకర్రావు, రంజిత్రెడ్డి, శ్రీకాంత్రావు, విద్యార్థులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ముట్టడి కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): గత ఎన్నికల్లో ఇ చ్చిన హామీ మేరకు పింఛన్ పెంచాలనే డిమాండ్తో ఎమ్మర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అంబాల రాజేందర్ నేతృత్వంలో వృద్ధులు, దివ్యాంగు లు, ఒంటరి మహిళలు గంగారం గ్రామ పంచా యతీ కార్యాలయాన్ని శనివారం ముట్టడించా రు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. అనంతరం రాజేందర్ మాట్లాడుతూ, మాట నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం రూ.6వేల వరకు పింఛన్ పెంచాలన్నారు. కార్యక్రమంలో నాయకులు బైరి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. బీఎంఎస్తోనే ఉద్యోగులకు మెరుగైన వేతన సవరణ జ్యోతినగర్(రామగుండం): ఉద్యోగుల మెరుగై న వేతన సవరణ బీఎంఎస్ అనుబంధ ఎన్టీపీ సీ కార్మిక సంఘ్తోనే సాధ్యమని ఎన్టీపీసీ ఎన్బీ సీ సభ్యుడు, బీఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు సుంకరి మల్లేశం, అదనపు సభ్యుడు ఆర్ఎన్ గ ణేశ్ అన్నారు. ఎన్టీపీసీ ప్రాజెక్టు మెయిన్ గేట్ వ ద్ద శనివారం జరిగిన సమావేశంలో వారు మా ట్లాడారు. నిర్వాసిత కోటాలో ఉద్యోగం పొంది న వారికి పీఆర్ఎంఎస్ సౌకర్యం కల్పించాలని, కేరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రత్యేక శిక్షణ ఇ చ్చి పదోన్నతులు కల్పించాలని కోరారు. ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ ఉద్యోగుల హ క్కుల సాధనలో విఫలమైందని విమర్శించా రు. 2027లో జరిగే వేతన సవరణలో ప్రత్యేక భాగస్వామిగా నిలిపేందుకు ఈనెల 25న జరి గే ఎన్టీపీసీ ఉద్యోగ గుర్తింపు ఎన్నికల్లో గులాబీ పువ్వు గుర్తుపై ఓటు వేసి బీఎంఎస్ను గెలిపించాలని వారు కోరారు. కార్యక్రమంలో నాయ కులు కేతిరెడ్డి భాస్కర్రెడ్డి, సాగర్ రాజు, బండారి కనకయ్య, పోగుల స్వామి, చల్లా సత్యనా రాయణరెడ్డి, యాదగిరి సత్తయ్య, రంజిత్, మహేశ్, ఉద్యోగులు తదతరులు పాల్గొన్నారు. -
ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు
● బల్దియా కమిషనర్ అరుణశ్రీ ఆదేశాలు ● బతుకమ్మ, దసరా ఉత్సవాలపై సమీక్ష కోల్సిటీ(రామగుండం): నగర ప్రజలకు ఇబ్బందు లు తలెత్తకుండా బతుకమ్మ, విజయదశమి పండు గలకు ఏర్పాట్లు చేయాలని రామగుండం బల్దియా కమిషనర్ అరుణశ్రీ ఆదేశించారు. బల్దియా కార్యాలయంలో పండుగల ఏర్పాట్లపై కమిషనర్ సమీక్షించారు. బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో శుభ్రం చేయించాలని, మరుసటి రోజు ఉదయమే ఆకులు, పూలను కంపోస్ట్యార్డ్కు తరలించాలని సూచించారు. వా ర్డు అధికారుల సమాచారం ఆధారంగా రోడ్లపై గుంతలు పూడ్చాలని, లైటింగ్స్ ఏర్పాటు చేయాలన్నా రు. గోదావరి వంతెన వద్ద బతుకమ్మల నిమజ్జనం సాఫీగా సాగడానికి లైటింగ్, ప్లాట్ఫారమ్లు ఏర్పా టు చేయాలన్నారు. ఆయా విభాగాల అధికారుల తో సమన్వయంతో సింగరేణి స్టేడియంలో దసరా ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించా రు. బల్దియా అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసా ద్, ఎస్ఈ గురువీర, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్, డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఉమామహేశ్వర్రావు పాల్గొన్నారు. కాగా, వరల్డ్ క్లీన్ అప్ డే –2025 సందర్భంగా పర్యావరణంపై ప్రజల్లో చైతన్యం కలిగించడానికి జిల్లా నేషనల్ గ్రీన్ కార్ప్స్ రూపొందించిన పోస్టర్ను కమిషనర్ అరుణశ్రీ ఆవిష్కరించారు. నేషనల్ గ్రీన్ కార్ప్స్ బ్రాండ్ అంబాసిడర్ అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గునుగు నవ్వింది
తంగేడు పూసింది– నేటి నుంచి పూల జాతర – బతుకమ్మ సంబరాలకు సిద్ధమవుతున్న ఆడపడుచులు – ఎంగిలిపూలతో వేడుకలు ప్రారంభం 30ఎస్ఆర్ఎల్301,302,303,304) బతుకమ్మ సంబరాల దృశ్యాలు (పాత చిత్రాలు) –––––––––––––––––––––––––––––––––––– చినుకుల చాటు నుంచి కురిసిన మంచు బిందువులు గుమ్మడి ఆకును అలంకరించగా.. సూర్యుడి కన్నా ముందే గుమ్మడి పువ్వు ప్రకాశించగా.. పచ్చపచ్చని తీగల మధ్య ముద్దగౌరమ్మ ముద్దుగా కనిపించగా.. నేలపై పాలు పారినట్లు గునుగు నవ్వంగా.. తంగేడు తన్మయం చెందగా.. పట్టుకుచ్చు పురివిప్పగా.. తొలిపొద్దున చేనులో నుంచి తెంపుకొచ్చి.. దేవుళ్ల ఎదుట ఉంచి.. అందంగా పేర్చి, గౌరమ్మను చేర్చి ఆడపడుచులు ఆడిపాడే బతుకమ్మ పండుగ వచ్చేసింది. నేటి ఎంగిలిపూలతో మొదలయ్యే వేడుక.. సద్దుల బతుకమ్మతో ముగియనుంది. – కరీంనగర్ కల్చరల్/విద్యానగర్/సిరిసిల్లకల్చరల్/కోరుట్ల –––––––––––––––––––––––––––––––––––– వీధులు.. పూల వనాలు రామరామరామ ఉయ్యాలో.. రామనే సీరామ ఉయ్యాలో.. సిరుల మాతల్లి ఉయ్యాలో.. సిరులతో రావమ్మా ఉయ్యాలో.. అని పాడుకుంటూ ఊరూవాడా తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు ఆడిపాడే పండుగ వచ్చేసింది. బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డలకు పెద్ద పండుగ. ఆశ్వయుజ పాఢ్యమి నుంచి ఎంగిలిపూలతో మొదలై తొమ్మిదో రోజు సద్దులతో ముగిసే బతుకమ్మ సంబరాలతో పల్లె, పట్టణాల్లోని వీధులన్నీ పూలవనాలుగా మారనున్నాయి. ఆశ్వయుజ మాసంలో విరివిగా పూసే గుమ్మడి, తంగేడు, గునుగు, పట్టుకుచ్చులు, చామంతి, కట్ల, గోరింటా వంటి పూలతో సిబ్బిలో కళాత్మకంగా బతుకమ్మను పేర్చి సాయంత్రం ఆడపడుచులందరూ ఒక్కచోట చేరి రామరామ అంటూ రమణీయంగా ఆడిపాడనున్నారు. గౌరమ్మకు మొక్కి చల్లంగా చూడమని వేడుకోనున్నారు. –––––––––––––––––––––––––––––––––––– ఆడపడుచుల వేడుక బతుకమ్మ అంటే బతుకునిచ్చే వేడుక. చిన్నాపెద్దా సంతోషంగా ఉండాలని ఆశీర్వదించే అమ్మవారి దీవెన. తల్లి కటాక్షాన్ని ఆకాంక్షిస్తూ ఆడపడుచులంతా ఒక చోట చేరి ఆటపాటలతో సందడి చేస్తారు. అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్లలు బతుకమ్మ పండుగకి పుట్టింటికి రావడంతో ఆ ఇల్లు కొత్తకళను సంతరించుకుంటుంది. బతుకమ్మ పండుగ మొదటిరోజు సందడి ఉంటుంది. కాబట్టి సమీపంలోని చేనూచెలకా నుంచి ఒకరోజు ముందే అవసరమైన పూల సేకరణ జరుగుతుంది. తడి వస్త్రంలో కప్పి ఉంచి వాడిపోకుండా జాగ్రత్త పడతారు. మరుసటి రోజు ఆ పూలతో బతుకమ్మను పేరుస్తారు. ముందురోజు పూలతో పేరుస్తారు కాబట్టి ఎంగిలిపూల బతుకమ్మగా పిలుస్తారు. –––––––––––––––––––––––––––––––––––– కనిపించని గునుగు గునుగుపువ్వు బతుకమ్మ కూర్పులో కీలకం. ఆ రోజుల్లో పట్నాలు.. పల్లెల పరిసరాల్లో ఎక్కడ చూసినా గునుగుపూలకు కొదువ ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది. గునుగు పువ్వు దొరకాలంటే కష్టమవుతోంది. ఎక్కడో మారుమూల పల్లెల్లో.. బీడుభూముల్లో అక్కడక్కడా కనబడుతున్నా.. అనుకున్న రీతిలో లేకపోవడం కలవరపెడుతోంది. ఫలితంగా మార్కెట్లో సరుకుగా మారిపోయింది. ఔషధ గుణాలతో అలరించే గునుగుపూలకు రంగులు పూస్తుండటం మరో సమస్యగా మారింది. ఇప్పుడు గునుగు చిన్నకట్ట రూ.50కి ఇస్తున్నారు. కొంచెం పెద్దకట్ట కావాలంటే రూ.వంద వరకు చెల్లించాల్సిందే. ఈ పది రోజుల పాటు గునుగుపూలకు ఎక్కడాలేని డిమాండ్ ఏర్పడనుంది. –––––––––––––––––––––––––––––––––––– రాజన్న పాట వినాల్సిందే 20ఎస్ఆర్ఎల్226: రేపాక గ్రామానికి చెందిన మీసాల రాజయ్య ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాకకు చెందిన మీసాల రాజయ్య బతుకమ్మ పాటల స్పెషలిస్ట్. తెలంగాణ సంప్రదాయాలు కనుమరుగవుతున్న నేటికాలంలో మహిళలు బతుకమ్మను వదిలిపెడుతున్నారు. ఇలాంటి తరుణంలో రాజయ్య గళంలో బతుకమ్మ పాటల తోట ఉంటోంది. మహిళలకన్నా మధురంగా బతుకమ్మ పాటలు పాడుతున్నాడు. రాజయ్య జానపద యక్షగాన కళాకారుడు. జానపద యక్షగానాలను తన 27వ ఏటే ప్రారంభించాడు. తన సొంత గ్రామంలో బతుకమ్మ పాట పాడుతూ.. బతుకమ్మ పాట రాజయ్యగా గుర్తింపు తెచ్చుకున్నాడు. –––––––––––––––––––––––––––––––––––– 60 ఏళ్లనుంచి ఆడుతున్న మల్యాల: నా పదేళ్ల వయసు నుంచి బతుకమ్మ ఆడుతున్న. పొద్దంతా పనికి పోయి వచ్చి పొద్దూకి ఇంటి వెనక ఉన్న గుమ్మడి పూలతో రోజు బతుకమ్మ పేర్చి ఆడేవాళ్లం. బతుకమ్మ పండుగ నాటికి పూలు పూసేలా పెరట్ల రంగు రంగుల బంతిపూల మొక్కలు, పట్టుకుచ్చుల మొక్కలు పెట్టేవాళ్లం. బతుకమ్మ పండుగకు పూలు కోసుకువచ్చే దాన్ని. తీరొక్కపూలతో పెద్దగా పేర్చేవాళ్లం. పనికి పోయి వచ్చిన తర్వాత వాడకట్టోళ్లందరం చప్పట్లు కొట్టుకుంటూ.. పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆడితే పనికిపోయిన అలసట పోయేది. – ఇట్టిరెడ్డి భూమవ్వ, గుడిపేట, మల్యాల(20సీపీడీ205) –––––––––––––––––––––––––––––––––––– సీ్త్ర అస్తిత్వానికి అద్దం ఫెర్టిలైజర్సిటీ: బతుకమ్మ పండుగ సీ్త్రల అస్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. బతుకమ్మ పాటలో సీ్త్రల జీవనశైలి, కుటుంబ అనుబంధాలను చాటుతుంది. బతుకమ్మ పాటలు గ్రామీణ ప్రాంతాల్లో ఉమ్మడి కుటుంబాల బంధాలను చూపుతుంది. మారుతున్న కాలంతో పాటు బతుకమ్మ పండుగ కొత్త రూపు సంతరించుకుంది. నేటి యువతరం దాండియా ఆటలు, కోలాటలు, డీజే పాటలతో బతుకమ్మ పండుగ ప్రసిద్ధిని మరుగున పడేలా చేస్తున్నారు. – తాళ్ల లక్ష్మి, గృహిణి, గోదావరిఖని(20జీడీకే151) –––––––––––––––––––––––––––––––––––– నుదుటి సిందూరం పండుగల్లో ముఖ్యమైది బతుకమ్మ. ఆడవాళ్లకు ఇష్టమైన వేడుక. పెళ్లయి అత్తారిళ్లకు వెళ్లినవారు పుట్టింటికి చేరుకుని, బంధుమిత్రులతో కలిసి జ్ఞాపకాలు నెమరేసుకునే పండుగ. మన సంప్రదాయాలు, సంస్కృతికి అద్దంగా నిలుస్తుంది. తెలంగాణ పర్వదినాల్లో పూల దేవత పూజదే ప్రాముఖ్యత. – వాసాల స్నేహ, సాయినగర్, కరీంనగర్ (20కెఎన్టి76) విభిన్నం బతుకమ్మఆడపడుచుల వేడుక బతుకమ్మ అంటే బతుకునిచ్చే వేడుక. చిన్నాపెద్దా సంతోషంగా ఉండాలని ఆశీర్వదించే అమ్మవారి దీవెన. తల్లి కటాక్షాన్ని ఆకాంక్షిస్తూ ఆడపడుచులంతా ఒక చోట చేరి ఆటపాటలతో సందడి చేస్తారు. అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్లలు బతుకమ్మ పండుగకి పుట్టింటికి రావడంతో ఆ ఇల్లు కొత్తకళను సంతరించుకుంటుంది. బతుకమ్మ పండుగ మొదటిరోజు సందడి ఉంటుంది. కాబట్టి సమీపంలోని చేనూచెలకా నుంచి ఒకరోజు ముందే అవసరమైన పూల సేకరణ జరుగుతుంది. తడి వస్త్రంలో కప్పి ఉంచి వాడిపోకుండా జాగ్రత్త పడతారు. మరుసటి రోజు ఆ పూలతో బతుకమ్మను పేరుస్తారు. ముందురోజు పూలతో పేరుస్తారు కాబట్టి ఎంగిలిపూల బతుకమ్మగా పిలుస్తారు. వీధులు.. పూల వనాలు రామరామరామ ఉయ్యాలో.. రామనే సీరామ ఉయ్యాలో.. సిరుల మాతల్లి ఉయ్యాలో.. సిరులతో రావమ్మా ఉయ్యాలో.. అని ఊరూవాడా తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు ఆడిపాడే పండుగ వచ్చేసింది. ఆశ్వయుజ పాఢ్యమి నుంచి ఎంగిలిపూలతో మొదలై తొమ్మిదో రోజు సద్దులతో ముగిసే బతుకమ్మ సంబరాలతో పల్లె, పట్టణాల్లోని వీధులన్నీ పూలవనాలు గా మారనున్నాయి. ఆశ్వయుజ మాసంలో విరి విగా పూసే పూలతో సిబ్బిలో పేర్చి సాయంత్రం ఆడపడుచులందరూ ఒక్కచోట చేరి రామరామ అంటూ రమణీయంగా ఆడిపాడనున్నారు. కనిపించని గునుగు గునుగుపువ్వు బతుకమ్మ కూర్పులో కీలకం. ఆ రోజుల్లో పట్నాలు.. పల్లెల పరిసరాల్లో ఎక్కడ చూసినా గునుగుపూలకు కొదువ ఉండేది కాదు. ఇప్పుడు గునుగు దొరకాలంటే కష్టమవుతోంది. ఎక్కడో మారుమూల పల్లెల్లో.. బీడుభూముల్లో కనబడుతున్నా.. అనుకున్న రీతిలో లేకపోవడం కలవరపెడుతోంది. ఫలితంగా మార్కెట్లో సరుకుగా మారిపోయింది. ఔషధ గుణాలతో అలరించే గునుగుపూలకు రంగులు పూస్తుండటం మరో సమస్యగా మారింది. గునుగు చిన్నకట్ట రూ.50కి ఇస్తున్నారు. కొంచెం పెద్దకట్ట కావాలంటే రూ.వంద వరకు చెల్లించాల్సిందే. ఈ పది రోజుల పాటు గునుగుపూలకు ఎక్కడాలేని డిమాండ్ ఏర్పడనుంది.రాజన్న పాట వినాల్సిందే ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం రేపాకకు చెందిన మీసాల రాజయ్య బతుక మ్మ పాటల స్పెషలిస్ట్. మ హిళలకన్నా మధురంగా పాడుతున్నాడు. రాజయ్య జానపద యక్షగాన కళాకారుడు. జానపద యక్షగానాలను తన 27వ ఏటే ప్రారంభించాడు. సొంత గ్రామంలో బతుక మ్మ పాటలు పాడుతూ.. గుర్తింపు తెచ్చుకున్నాడు. 60 ఏళ్లనుంచి ఆడుతున్న మల్యాల: పదేళ్ల వయసు నుంచి బతుకమ్మ ఆడుతున్న. పొద్దంతా పనికి పోయి వచ్చి పొద్దూకి ఇంటి వెనక ఉన్న గుమ్మడి పూలతో బతుకమ్మ పేర్చి ఆడేవాళ్లం. వాడకట్టోళ్లందరం చప్పట్లు కొట్టుకుంటూ.. పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆడితే పనికిపోయిన అలసట పోయేది. – ఇట్టిరెడ్డి భూమవ్వ, గుడిపేట, మల్యాల నుదుటి సిందూరం పండుగల్లో ముఖ్యమైంది బతుకమ్మ. ఆడవాళ్లకు ఇష్టమైన వేడుక. పెళ్లయి అత్తారిళ్లకు వెళ్లినవారు పుట్టింటికి చేరుకుని, బంధుమిత్రులతో కలిసి జ్ఞాపకాలు నెమరేసుకునే పండుగ. మన సంప్రదాయాలు, సంస్కృతికి అద్దంగా నిలుస్తుంది. తెలంగాణ పర్వదినాల్లో పూల దేవత పూజదే ప్రాముఖ్యత. – వాసాల స్నేహ, సాయినగర్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. అయితే జిల్లాలోని విభిన్న సాంస్కృతుల కారణంగా బతుకమ్మను కూడా విభిన్న తీరిలో జరుపుకుంటారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని వేములవాడ, మానకొండూర్ మండలం శ్రీని వాస్నగర్, రాఘవాపూర్, కరీంనగర్ పరిధిలోని బొమ్మకల్, ఇల్లంతకుంట మండలం పరిధిలోని కొన్ని గ్రామాల్లో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించుకుంటారు. మెజారిటీ ప్రాంతాల్లో తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఆడతారు. రుద్రంగి, చందుర్తి మండలాల్లోని కొన్ని గ్రామాల్లో దసరా మరునాడు బతుకమ్మ ఆడడం ఆనవా యితీ. అదే విధంగా జగిత్యాల జిల్లాలో బావి బతుకమ్మ ఆడతారు. ఎంగిలిపూల రోజున మధ్యలో బావి లాంటి గుంత తవ్వి చుట్టూ బతుకమ్మలు పెట్టి ఆడతారు. తొమ్మిదిరోజులు ఇదే విధంగా ఆడతారు. సద్దుల బతుమ్మ అనంతరం బావిని పూడ్చుతారు.1వ రోజు ఎంగిలి పూల బతుకమ్మ 2వ రోజు అటుకుల బతుకమ్మ 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ 4వ రోజు నానే బియ్యం 5వ రోజు అట్ల బతుకమ్మ 6వ రోజు అలిగిన బతుకమ్మ 7వ రోజు వేపకాయ బతుకమ్మ 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ 9వ రోజు సద్దుల బతుకమ్మచినుకుల చాటు నుంచి కురిసిన మంచు బిందువులు ముత్యం మాదిరిగా గుమ్మడి ఆకును అలంకరించగా.. సూర్యుడి కన్నా ముందే గుమ్మడి పువ్వు ప్రకాశించగా.. పచ్చపచ్చని తీగల మధ్య ముద్దగౌరమ్మ ముద్దుగా కనిపించగా.. నేలపై పాలు పారినట్లు గునుగు నవ్వంగా.. తంగేడు తన్మయం చెందగా.. పట్టుకుచ్చు పురివిప్పగా.. తొలిపొద్దున చేనులో నుంచి తెంపుకొచ్చి.. దేవుళ్ల ఎదుట ఉంచి.. అందంగా పేర్చి, గౌరమ్మను చేర్చి ఆడపడుచులు ఆడిపాడే బతుకమ్మ పండుగ వచ్చేసింది. నేటి ఎంగిలిపూలతో మొదలయ్యే వేడుక.. సద్దుల బతుకమ్మతో ముగియనుంది. – కరీంనగర్ కల్చరల్/విద్యానగర్/సిరిసిల్లకల్చరల్/కోరుట్ల -
అడవుల్లో చెట్లు నరికితే కేసులు
● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిరూరల్: అడవుల్లోని చెట్లను నరికిన వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలె క్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో శనివా రం అడిషనల్ కలెక్టర్ వేణు, డీసీపీ కరుణాకర్తో క లిసి అటవీ సంరక్షణ కమిటీ సమావేశంలో పాల్గొ న్నారు. జిల్లా అటవీ అధికారి శివయ్య.. అడవుల స్థి తిగతులపై ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. జిల్లాలో అటవీ సంపదను కాపాడేందుకు రెవెన్యూ, పోలీసు, ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని కలెక్టర్ సూచించారు. అటవీ భూములు ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షించాలని పే ర్కొన్నారు. ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, ఏసీపీలు కృష్ణ, రమేశ్, ఫారెస్టు అధికారులు పాల్గొన్నారు. -
ఖైదీలకు ఉపాధి అవకాశాలు
● కరీంనగర్ జైలు బంకు సేవలు భేష్ ● జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రాకరీంనగర్క్రైం: జైళ్లలో ఖైదీలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, కరీంనగర్లో ఖైదీలు తయారు చేసిన అగర్బత్తీలు రాష్ట్రవ్యాప్తంగా విక్రయం అవుతున్నాయని జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్యామిశ్రా అన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ జైలుకు ఓ ట్రక్కు, అగర్బత్తీల తయారీ మిషన్, జిరాక్స్ మిషన్, కంప్యూటర్లు బహకరించారు. వాటిని శనివారం జైళ్లశాఖ డీజీ సౌమ్య ఐజీ సంపత్, కరీంనగర్ జైలు సూపరింటెండెంట్ విజయ్దేని, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చీఫ్ మేనేజర్ స్వామినాథన్తో కలిపి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఇండియన్ ఆయిల్ ఆధ్వర్యంలో జైళ్లశాఖకు పెద్దఎత్తున సహాయం అందించారని తెలిపారు. జైలు, ఇండియన్ ఆయిల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న కరీంనగర్ పెట్రోల్ బంక్ సేవల్లో ప్రథమస్థానంలో కొనసాగుతోందన్నారు. కరీంనగర్ జైలులో తయారు అవుతున్న అగర్బత్తీలు రాష్ట్రస్థాయిలో పెరుగాంచాయన్నారు. కరీంనగర్ జైలులో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసి ఖైదీలకు డిజిటల్ టెక్నాలజీపై అవగాహన కల్పిస్తామన్నారు. అనంతరం జైలులో ఖైదీల యోగక్షేమాలు, సదుపాయాలను పరిశీలించారు. జైలర్లు పి.శ్రీనివాస్, బి.రమేశ్, ఎ.శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ జైలర్లు ఎల్.రమేశ్, అజయ్చారి పాల్గొన్నారు. -
పేదలకు కాంగ్రెస్ సర్కార్ అండ
పెద్దపల్లిరూరల్: పేదల కళ్లలో ఆనందం చూడాలన్న దే సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కా రు లక్ష్యమని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నా రు. నియోజకవర్గ పరిధిలోని 133మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా మంజూ రైన రూ.1,33,15,428 విలువైన చెక్కులను శనివా రం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే పంపిణీ చేశారు. సీ ఎం సహాయనిధి నుంచి 820 మందికి మంజూరైన రూ.2,64,06,900 విలువైన చెక్కులు అందజేసి మాట్లాడారు. ప్రజలకు ఆరోగ్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లా ప్రధాన ఆస్పపత్రిని అన్నివిధాలా ఆధునికీకరిస్తున్నామని తెలిపారు. త హసీల్దార్ రాజయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్లు స్వరూప, ప్రకాశ్రావు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల పాత్ర కీలకం సుల్తానాబాద్(పెద్దపల్లి): దేశభవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 29మందిని మండల కేంద్రంలో ఆయన సన్మానించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, ఎంపీడీవో దివ్యదర్శన్రావు, ఎంఈవో రాజ య్య, ప్రతినిధులు దామోదర్ రావు,సాయిరి మ హేందర్, శ్రీగిరి శ్రీనివాస్, పన్నాల రాములు, కిశో ర్, నాయకులు సతీశ్, అబ్బయ్యగౌడ్ పాల్గొన్నారు. నక్కల ఒర్రైపె వంతెన నిర్మించాలికాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మల్యాల – పోచంపల్లి మధ్య నక్కలఒర్రైపె వంతెన నిర్మించాలనే డిమాండ్తో రెండు గ్రామాల రైతులు శనివారం నిరసన తె లిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఒర్రె వరద ఉ ధృతికి మహిళా కూలీలు, రైతులు కొట్టుకు పోయా రని, స్థానికుల అప్రమత్తతతో వారు ప్రాణాలతో బ యట పడ్డారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ నాయకులు నూనేటి సంపత్ యాదవ్, వవంగళ తిరుపతిరెడ్డి, పుప్పాల నాగార్జున్రెడ్డి రైతులు పాల్గొన్నారు. -
లాభాల వాటా ప్రకటించాలి
గోదావరిఖని: సింగరేణి సాధించిన వాస్తవ లాభా లు ప్రకటించాలని, అందులో కార్మికులకు 35శాతం వాటా చెల్లించాలని గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు కూనంనేని సాంబశివరా వు, అధ్యక్షుడు సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ కోరారు. ఈమేరకు సీఎం రేవంత్రెడ్డిని శనివారం హైదరాబాద్లో కలిసి వినతిపత్రం సమర్పించారు. కార్మికులకు సొంతింటి ప థకం అమలు చేయాలని, మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని, అర్జీ పెట్టుకున్నవారందరినీ ఆన్ఫిట్ చే సి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, మారుపేర్ల సమస్యపై అడ్వకేట్ జనరల్ న్యాయ సలహా త్వరగా ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కొత్త బొగ్గు గనుల సాధనకు రాష్ట్రప్రభుత్వం సింగరేణికి ఆదేశాలిచ్చి, కోయగూడెం–3, సత్తుపల్లి–3, తాడిచర్ల–2 బ్లాకులు సాధించేలా చూడాలని కోరారు. -
యువతకు ఉపాధి అవకాశాలు
పెద్దపల్లిరూరల్: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. స్థానిక టాస్క్ సెంటర్లో శుక్రవారం టెలిఫెర్ఫార్మెన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ నిర్వహించిన జాబ్మేళాను కలెక్టర్ సందర్శించి నిర్వాహకులకు సూచనలు చేశారు. మేళాకు 117మంది అభ్యర్థులు హాజరుకాగా 27 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారని కలెక్టర్ తెలిపారు. ఎంప్లాయిమెంట్ ఇన్చార్జి అధికారి తిరు పతిరావు, టాస్క్ ఇన్చార్జి కౌసల్య పాల్గొన్నారు. ‘పోక్సో’పై అవగాహన.. చిన్నారులపై లైంగిక దాడుల నియంత్రణ, నిందితులకు కఠిన శిక్షలు పడేలా పోక్సో యాక్టు అమల్లోకి తెచ్చారని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. పోక్సో యాక్టుపై కలెక్టరేట్లో ఆయన సమీక్షించారు. బాధితులకు మనోధైర్యం కల్పించాలని సూచించారు. డీసీపీ కరుణాకర్, డీడబ్ల్యూవో వేణుగోపాల్, ఏసీపీ కృష్ణ తదితరులు ఉన్నారు. ఇంటర్ విద్యార్థులకు అపార్ కార్డులు.. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ఇంటర్ విద్యార్థులకు అపార్ కార్డు అందించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ఇంటర్ విద్యపై సమీక్షించిన ఆయన.. ప్రతీ శనివారం యూడీసీఐ వివరాలు అప్డేట్ చేయాలన్నారు. ఇంటర్ ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని సూచించారు. జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి కల్పన, అశోక్కుమార్, పీఆర్ఈఈ గిరీశ్కుమార్ తదితరులు ఉన్నారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమేద్దాం గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలతో ఆరోగ్యానికి కలిగే హాని గురించి వివరించడంతోపాటు.. నిషేధిత మత్తు పదార్ధాలను విక్రయించినా, కొనుగోలు చేసినా చర్యలు ఉంటాయని ఊరూరా ప్రచారం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం ప్రచార వాహనాన్ని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. యువత మత్తుకు బానిసై భవిష్యత్ను పాడు చేసుకోవద్దని కలెక్టర్ సూచించారు. ఇంటర్ విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడకుండా అధ్యాపకులు ప్రత్యేక దృష్టిని సారించాలని ఆయన అన్నారు. సర్కారు బడుల్లో డిజిటల్ బోధన జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు డిజిటల్ విద్యా బోధన చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. టెన్త్లో మంచి ఫలితాలు సాధించేలా స్టడీ అవర్స్ ప్రారంభించాలని అయన అన్నారు. ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీల్లో ఎఫ్ఆర్ఎస్ ద్వారా విద్యార్థులు, ఉపా ధ్యాయుల హాజరు నమోదు చేయాలన్నారు. ది వ్యాంగులకు సదరం సర్టిఫికెట్, యూడీఐడీ కార్డు లు జాప్యంలేకుండా జారీచేయాలన్నారు. జెడ్పీ సీఈవో నరేందర్, డీఈవో మాధవి, డీఆర్డీవో కాళిందిని, ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, విజయ్, జీఈసీవో కవిత, జీజీహెచ్ ఆర్ఎంవో రాజు, ఈడీఎం కవిత, ఎంపీఎం రమాదేవి తదితరులు ఉన్నారు. -
ముగిసిన ఎస్జీఎఫ్ ఆటల పోటీలు
● ప్రథమస్థానంలో నిలిచిన సుల్తానాబాద్ డివిజన్ జట్టు సుల్తానాబాద్(పెద్దపల్లి): స్థానిక ప్రభుత్వ జూనియ ర్ కాలేజీలో చేపట్టిన 69వ ఎస్జీఎఫ్ అండర్ –14, 17 బాలబాలికల ఆటల పోటీలు శుక్రవారం రాత్రి ముగిశాయి. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ ముఖ్య అ తిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థి దశనుంచే ప ట్టుదలతో చదివి విజయం సాధించాలన్నారు. ఇంటికి వచ్చాక తల్లిదండ్రులకు సాయంగా ఉండాలని విద్యార్థులకు ఆయన సూచించారు. ఏసీపీ కృష్ణ, డీవైఎస్వో సురేశ్ మాట్లాడారు. సుల్తానాబాద్, పెద్దపల్లి, రామగుండం, మంథని జోన్ల నుంచి 350 మంది క్రీడాకారులు హాజరయ్యారు. విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి రంగారెడ్డి, సీఐలు సుబ్బారెడ్డి, ప్రదీప్కుమార్, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, మున్సిపల్ కమిషనర్ రమేశ్, ఎంఈవో రాజయ్య, ప్రతినిధులు పన్నాల రాములు, పడాల అజయ్గౌడ్, సాయిరి మహేందర్, ముస్త్యాల రవీందర్, అమిరిశేట్టి తిరుపతి, చిలుక సతీశ్, అబ్బయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సేంద్రియం.. ఆరోగ్యం
రకరకాల కూరగాయల పెంపకం పాఠశాల ఆవరణలోని ఖాళీ స్థలంలోని కొంత భాగంలో పలు రకాల కూరగాయలు పండిస్తున్నారు. ఇందులో బెండ, టమాట, వంకాయతోపాటు తీగజాతికి చెందిన సొర, బీర, కాకరకాయ మొక్కల్ని పెంచుతున్నారు. ఇప్పటికే పొర, బీర, బెండ, వంకాయ, టమాట దిగుబడి కూడా వస్తోంది. ఎలాంటి రసాయన మందులు వాడకుండా మధ్యాహ్న భోజనంలోకి కూరలుగా వీటినే వినియోగిస్తున్నారు. ఆరు నెలలకే కాతకు వచ్చే మునగమొక్కలను తెప్పించి పెంచుతున్నట్టు కిచెన్ గార్డెన్ను పర్యవేక్షిస్తున్న ఉపాధ్యాయుడు తెలిపారు. -
కవిత శ్రీరాంపూర్ పర్యటనకు ఏర్పాట్లు
● హెచ్ఎంఎస్ అధ్యక్షుడు రియాజ్అహ్మద్ గోదావరిఖని: తమ యూనియన్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈనెల 23న మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో జరిగే బతుకమ్మ వేడుకలకు హాజరవుతారని హెచ్ఎంఎస్ అధ్యక్షుడు రియాజ్అహ్మద్ తెలిపారు. ఇందుకోసం పెదఎత్తున ఏర్పాట్లు చేయాలన్నారు. స్థానిక ప్రెస్క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక బీగెస్ట్హౌస్ నుంచి శ్రీరాంపూర్ వరకు బైక్ర్యాలీ నిర్వహిస్తామన్నారు. కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు యూనియన్ ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ విఫలమయ్యాయని విమర్శించారు. సొంతింటి పేరిట సీఐటీయూ తప్పుడు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. తాము పదవుల కోసం కాదని, కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటం చేస్తామని అన్నా రు. పండుగ బోనస్పై ఈనెల 22న ఢిల్లీలో జేబీసీసీఐ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నాయకులు దావు రమేశ్, రాంచందర్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. -
గతంలో కన్నా ఘనంగా దసరా ఉత్సవాలు
కోల్సిటీ(రామగుండం): నగరంలో ఈసారి గతంలో కన్నా దసరా ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ కోరారు. బల్దియా కార్యాలయంలో శుక్రవారం కమిషనర్ అ రుణశ్రీతో కలిసి దసరా ఉత్సవాల సన్నాహక సమా వేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, దు ర్గమ్మ విగ్రహాలను రోడ్లపై ఏర్పాటు చేయొద్దన్నా రు. అంబులెన్స్ వెళ్లడానికి దారి ఉంచాలని అన్నా రు. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సింగరేణి మెరుగైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్టీపీసీ ఈసారి కూడా నిధులు మంజూరు చేయాలని, ఆర్ఎఫ్సీఎల్ ఉత్సవాల నిర్వహణలో పాలు పంచుకోవాలని కోరారు. త్వరలో జరిగే సమ్మక్క– సారలమ్మ జాత రకు శాశ్వత ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఏసీపీ రమేశ్, సింగరేణి ఆర్జీ–1 జీఎం లలిత్ కుమా ర్, సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి, సివిల్ డీజీఎం వరప్రసాద్, ఆర్ఎఫ్సీఎల్ మేనేజర్ శుక్లా, వంశీకృష్ణ, ఎన్పీడీసీఎల్ డీఈ ప్రభాకర్, ఏడీఈలు వెంకటేశ్వర్లు, రమేశ్, జిల్లా మత్స్యశాఖాధికారి నరేశ్ కుమా ర్, బల్దియా అడిషనల్ కమిషనర్ మారుతిప్రసాద్, ఎస్ఈ గురువీర, ఏఈ రామన్ పాల్గొన్నారు. -
స్వదేశీ సాంకేతికత భేష్
రామగుండం: స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం, ఆ విష్కరణలు జాతీయ ప్రగతికి సోపానాలని ఎంపీ వంశీకృష్ణ అన్నారు. చంఢీగఢ్లో జరు గుతున్న సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్టుమెంట్స్ ఆర్గనైజేషన్(సీఎస్ఐఆర్) ఆవిష్కరణలను ఆ యన పలువురు ప్రతినిధులతో కలిసి శుక్రవా రం సందర్శించారు. శాసీ్త్రయ పరిశోధనలతో అభివృద్ధి చేసిన స్వదేశీ పరిజ్ఞానం దేశప్రగతి, గ్రామీణ పరిశ్రమల ఎదుగుదలకు తోడ్పడుతుందన్నారు. ఇందులో సుమారు 200పైగా ఆవిష్కరణలు ప్రదర్శించారని తెలిపారు. టీ హబ్తో పేదలకు మేలు పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్ప త్రిలోని టీ హబ్ ద్వారా వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఆధునిక యంత్రాలతో నిర్వహించి పే షెంట్ మొబైల్ నంబర్లకు ఫలితాలు చేరవేస్తు న్నామని జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ అన్నారు. శుక్రవారం టీ హబ్ కేంద్రాన్ని సందర్శించా రు. ల్యాబొరేటరీ పనితీరు గురించి నిపుణుడు శ్రీనివాస్ను అడిగి తెలుసుకున్నారు. ఈనెల లో ఇప్పటిరకు 7,444 మంది పేషెంట్ల నుంచి 24,414 బ్లడ్శాంపిళ్లు సేకరించామని తెలిపా రు. జిల్లాలోని 18 పీహెచ్సీలు, 07 యూపీహెచ్సీలతోపాటు మంథని, సుల్తానాబాద్ క మ్యూనిటీ ఆరోగ్యకేంద్రాలు, పెద్దపల్లి రామ గుండం ఆస్పత్రుల నుంచి సేకరించిన రక్తనమూనాలు పరీక్షిస్తున్నామని అన్నారు. బల్దియా ఎస్ఈగా గురువీర కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థ పబ్లిక్ హెల్త్ విభాగం(పీహెచ్) సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ) గా జి.గురువీర శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లో ఎస్ఈగా విధులు నిర్వహించిన గురువీరను.. ప్రభుత్వం ఇక్కడకు బదిలీ చేసింది. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ )గా ఆర్.శివానంద్, సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ)గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. అయితే ప్రభుత్వం కొత్త ఎస్ఈకి పోస్టింగ్ ఇవ్వడంతో, శివానంద్ను ఎస్ఈ బాధ్యతల నుంచి తప్పించింది. లాభాల వాటా చెల్లించాలి గోదావరిఖని: గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సాధించిన లాభాలు ప్రకటించి, 35 శా తం కార్మికులకు వాటా చెల్లించాలని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. ఆర్జీ –వన్ జీఎం కార్యాల యం ఎదుట శుక్రవారం ధర్నా చేశారు. జీఎం లలిత్కుమార్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. మడ్డి ఎల్లా గౌడ్, పోశం, మోహన్, మహేశ్, రంగు శ్రీను, వెంకట్రెడ్డి, సతీశ్బాబు, రాజు, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఇవే డిమాండ్లపై ఆర్జీ–2 జీఎం ఆఫీస్ ఎదుట కూడా ధర్నా ని ర్వహించారు. నాయకులు ఎల్.ప్రకాశ్, రాజరత్నం, రవీందర్, అన్నారావు, మహేందర్, సంపత్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. చెరువులు.. నిండుకుండలు సుల్తానాబాద్(పెద్దపల్లి): గత ఆగస్టు నుంచి ఈనెలలో ఇప్పటివరకు కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని జలవనరులు నిండి నిండుకుంల్లా తయారయ్యాయి. ఈ వానాకాలంలో సాగుచేసిన పత్తి, వరి, మొక్కజొన్న తదితర పంటలతోపాటు వచ్చే యాసంగి పంటలకూ సాగునీటికి ఢోకాలేకుండాపోయింది. జిల్లాలో సుమారు 1,021 చెరువులు, కుంటలు ఉండగా.. 408 వరకు పూర్తిగా నీటితో నిండి జలకళ సంతరించుకున్నాయి. 613 వరకు మత్తడి దూకుతున్నట్లు అధికారులు తెలిపారు. -
ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోయించాలి
మంథని: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సుమారు 22 నెలలు గడుస్తున్నా నియోజకవర్గంలో 22 ఇంది రమ్మ ఇళ్లను కూడా కట్టించి ఇవ్వలేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు విమర్శించారు. శుక్రవారం పట్టణంలోని రాజగృహలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్ర తీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తే ఇక్కడ 1,400పైచిలుకు మాత్రమే మంజూరు చేశా రని ఆయన దుయ్యబట్టారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎన్ని ఇళ్లు పూర్తిచేశారో, ఎన్ని గృహ ప్రవేశాలు చేశారో సమాధానం చెప్పకుడా ప్రతీ రోజు తమపై ఎలా దాడులు చేయాలే.. పుట్ట మధు ను ఎలా అంతం చేయాలనే ఆలోచన తప్ప చిత్తశుద్దితో పనిచేసిన దాఖలాలు లేవని ఆయన మండిపడ్డారు. ఈదసరా పండుగ వరకు ఇళ్లకు ముగ్గు పో యించాలని ఆయన డిమాండ్ చేశారు. నాయకులు ఏగోళపు శంకర్గౌడ్, తరగం శంకర్లాల్, కనవేన శ్రీనివాస్, మాచిడి రాజూగౌడ్, ఆరెపల్లి కుమార్, మంథని లక్ష్మణ్, ఆకుల రాజబాపు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ హయాంలో కార్మికులకు అన్యాయం
గోదావరిఖని: కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత సింగరేణి కార్మికులకు అన్నింటా అన్యా యం జరుగుతోందని టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షు డు కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి యూనియన్ శ్రేణులతో హైదరాబాద్లోని సింగరేణి భవన్ను శు క్రవారం ముట్టడించారు. సీఎండీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం కొప్పుల మాట్లాడారు. గ తేడాది లాభాల్లో 33శాతం కార్మికులకు ఇవ్వకుండా కేవలం 16శాతమే ఇచ్చి అభివృద్ధి పేరిట రూ. 2,289 కోట్లు పక్కన పెట్టారని ఆరోపించారు. ఇప్పటివరకు వాటి వివరాలు తెలియజేయలేదన్నారు. ఈఏడాది అధిక లాభాలు వచ్చాయని, వాస్తవ లా భాలను ప్రకటించి కార్మికులకు 35శాతం వాటా చె ల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. నాయకులు కాపు కృష్ణ, కేతిరెడ్డి సురేందర్రెడ్డి, పర్లపల్లి రవి, కుసన వీరభద్రం, మంగీలాల్, అన్వేష్, బండి రమే శ్, నాగెల్లి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. -
పిక్కలు తీస్తున్న కుక్కలు
సాక్షి పెద్దపల్లి: జిల్లాలో వీధికుక్కలు హడలెత్తిస్తున్నాయి. నియంత్రణ చర్యలు చేపట్టకపోవడంతో గుంపులుగా తిరుగుతూ పిల్లలు, వద్ధులపై దాడులు చేస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఓచోట కుక్కకాటుతో బాధితులు ఆస్పత్రుల్లో చేరుతూనే ఉన్నారు. శున కాలు పగలు, రాత్రి తేడా లేకుండా రహదారులపై సంచరిస్తూ దడ పుట్టిస్తున్నాయి. ఒంటరిగా వెళ్లాలంటే జనాలు భయాందోళనకు గురవుతున్నారు. గాయాలు.. నరకయాత.. కుక్కల దాడుల్లో చిన్నగాయాలతో బయటపడ్డవాళ్లు కొందరైతే.. ముఖం, కాళ్లు, శరీరంపై లోతైనా గాయాలతో నరకయాతన అనుభవిస్తున్నవారు మరికొందరు. జిల్లావ్యాప్తంగా ఏ వీధిలో చూసినా పాతికకు తక్కువ కాకుండా శునకాలు కలిసి స్వైరవిహారం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దంపండుతోంది. అందులో ఏది మంచిదో, ఏది వ్యాధి సోకినదో తెలియని పరిస్థితి నెలకొంది. కుక్కకాటుకు గురై ప్రభుత్వ, పైవ్రేట్ ఆస్పత్రులకు వెళ్లేవారి సంఖ్య ఇటీవల అధికంగానే నమోదు అవుతోంని వైద్యులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి ఇప్పటివరకు 2,027 కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. అంటే సరాసరిన రోజుకు 12మంది కుక్కకాటు బారినపడ్డారు. గోదావరిఖని ఏరియా ఆస్పత్రిలో 80 కుక్కకాటు కేసులు నమోదయ్యాంటేనే పరిస్థితి ఎంతతీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని నగరవాసులు పేర్కొంటున్నారు. చికెన్ వ్యర్థాలతోనే.. చికెన్ వ్యర్థాలు, వృథా ఆహారం ఎక్కువగా లభించే ప్రాంతాల్లో కుక్కల బెడద అధికంగా ఉంది. ఫంక్షన్హాళ్లు, మటన్, చికెన్ షాపుల వద్ద వ్యర్థాలను తినేందుకు అలవాటు పడ్డాయి. అక్కడ ఆహారం లభించకుంటే జనావాసాల వైపు తరలివస్తున్నాయి. ఆ సమయంలో చేతిసంచితో వెళ్లే ప్రజలపై విరుచుకుపడుతున్నాయి. వాటిని ప్రతిఘంటించలేక అనేకమంది గాయాలపాలవుతున్నారు. నియంత్రణ అంటే వణుకు.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. వీధికుక్కలన్నింటికీ స్థానిక సంస్థల అధికారులు రేబిస్ టీకాలు వేయించాలి. సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేయించాలి. కానీ, అవేవీ అమలుకు నోచుకోవడం లేదు. కుక్కలకు ప్రాణహాని కలిగిస్తే తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందని అధికారులు వాటి జోలికి పోవడానికి వణుకుతున్నారు. అలా అని.. కుక్కల బెడద తగ్గించడానికి అయ్యే వ్యయం మున్సిపాలిటీలు, పంచాయతీలకు భారంగా పరిమణిస్తోంది. స్థానిక సంస్థల్లో ప్రత్యేకాధికారుల పాలనతో నిధులలేమితో పాటు పర్యవేక్షణ కరువైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రామగుండంలో యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని నిర్మిస్తుండగా, నిధుల లేమితో జిల్లాలోని మరో మూడు బల్దియాల్లో వాటిజోలికే పోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.జిల్లాలో నమోదైన కుక్కకాటు కేసులు2022 2,383 2023 2,611 2024 2,833 2025 2,027నిర్లక్ష్యం చేయవద్దు కుక్క కరిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి. లేదంటే రేబిస్ సోకే అవకాశాలు ఉంటాయి. ఇంటివద్ద, పనిప్రదేశాల్లో కుక్కలకు దూరంగా ఉండండి. పెంపుడు కుక్కలు సైతం ఇతరులను కరవకుండా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయి. – వాణిశ్రీ, డీఎంహెచ్వో కుక్క కరిస్తే ఏం చేయాలంటే.. -
ముందడుగు పడేదెప్పుడో?
గోదావరిఖని(రామగుండం): గతేడాది సెప్టెంబర్–20న రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సాధించిన వార్షిక లాభాలు ప్రకటించింది. కార్మికుల వాటాగా 33శాతం చెల్లిస్తామని సీఎం ప్రకటించారు. కానీ ఈఆర్థిక సంవత్సరం పూర్తయి ఐదునెలల పూర్తయ్యింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 72మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా యాజమాన్యం ముందుకెళ్లింది. అయితే 69.01మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించింది. సాంకేతిక పరంగా కోలిండియా సంస్థలకు దీటుగా ముందుకు సాగుతున్న సింగరేణి యాజమాన్యం సాధ్యమైనంత త్వరగా లాభాలు ప్రకటిస్తుందని కార్మికులు ఆశగా ఎదురు చూస్తున్నారు. సంస్థ సీఎండీ ఫైనాన్స్ డైరెక్టర్గా బాధ్యతలు చూస్తుండటంతో లాభాలు త్వరగానే తేల్చేస్తారని భావిస్తున్నారు. ఐదు నెలల గడిచినా దీనిపై ప్రకటన రాకపోవడంతో గుర్తింపు సంఘం, జాతీయ కార్మిక సంఘాలు, కార్మికులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇతర కంపెనీలకు దీటుగా.. బొగ్గు, విద్యుత్ ఉత్పత్తితో పలు రంగాల్లో వేగంగా దూసుకవెళ్తున్న సింగరేణి భారత రత్న, మినీ రత్న కంపెనీలకు దీటుగా ముందుకు సాగుతూ వరుసలాభాలతో అగ్రగామిగా నిలుస్తోంది. సంస్థ సాధించిన ప్రగతిపై ఏటా ఆర్థిక నివేదికలు సమర్పిస్తూ వస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 2,388.50కోట్లు లాభాలు సాధించింది. అందులో కార్మికుల వాటా 33శాతం ప్రకటించారు. ఈలెక్కన గత ఆర్థిక సంవత్సరం రూ.788.20కోట్లు కార్మికుల వాటాగా నిర్ణయించారు. గతేడాదికన్నా బొగ్గు ఉత్పత్తి తగ్గినా, వార్షిక టర్నోవర్ పెరగడంతో సంస్థకు ఈసారి లాభాలు భారీగా ఉంటాయని భావిస్తున్నారు. 35శాతం చెల్లించాలని డిమాండ్ ఏటా సింగరేణి లాభాలను ప్రకటించి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తుంది. దానిలో కార్మికులకు లాభాల వాటాను ముఖ్యమంత్రి ఖరారు చేసి ప్రకటిస్తారు. కాగా గతేడాది 33శాతం లాభాల వాటా ఉండగా, ఈసారి మరింత పెంచే అవకాశాలుంటాయని కార్మికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 35శాతం వాటా చెల్లించాలని, కాంట్రాక్టు కార్మికులకు కూడా వాటా పెంచాలని గెలిచిన సంఘాలతో పాటు జాతీయ కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఏడాది లాభాలు వాటా చెల్లింపు చెల్లింపు రూ.కోట్లలో శాతం రూ.కోట్లలో తేదీ 2015–16 1,066.13 23 245.20 07–10–16 2016–17 395.38 25 98.84 29–09–17 2017–18 1,212.75 27 327.27 29–08–18 2018–19 1,766.00 28 493.00 04–10–19 2019–20 993.00 28 278.04 14–10–20 2020–21 272.20 29 79.06 11–10–21 2021–22 1,227.00 30 368.00 10–10–22 2022–23 2,222.00 32 711.00 22–10–23 2023–24 2,388.50 33 788.20 20–09–24 -
సీబీఐ ఇక బిజీబిజీ!
హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్రావు– నాగమణి జంటహత్య కేసు విచారణకు గురువారం సీబీఐ రంగప్రవేశం చేసింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఫోన్ట్యాపింగ్ కేసును కూడా సీబీఐకు అప్పగిస్తే ఉమ్మడి జిల్లాలోనే మూడు కేసుల విచారణ కొనసాగనుంది. ఈ మూడు కేసులతో ఉమ్మడి జిల్లాకు లింక్ ఉండటంతో రాజకీయం హీటెక్కుతోంది. –సాక్షిప్రతినిధి, కరీంనగర్జంట హత్యల కేసు2021 ఫిబ్రవరి 17న హైకోర్టు న్యాయవాదులు వామన్రావు, నాగమణి దంపతులు రామగిరి పోలీస్స్టేషన్ పరిధిలోని కల్వచర్ల సమీపంలో హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఏడుగురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం సీబీఐ పునర్విచారణతో వామన్రావు తండ్రి ఆరోపిస్తున్నట్లు బీఆర్ఎస్ నేత ప్రమేయంపై ఏం తేల్చస్తుందోనని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తల్లో జోరుగా చర్చ నడుస్తోంది.ఫోన్ట్యాపింగ్ కేసుతో లింకులుఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని పార్టీలకు చెందిన ముఖ్యనేతలుండగా వారి కదలికలను పసిగట్టేందకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ట్యాపింగ్ చేసినట్లు బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సందర్భంగా కేంద్రసహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్, కరీంనగర్ గ్రంఽథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు తమ ఫోన్లు ట్యాపింగ్ అయినట్లు సిట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణ ఎదుర్కొంటున్న డీఎస్పీ ప్రణీత్రావును 2024 మార్చిలో సిరిసిల్లలో అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ట్యాపింగ్ కేసును కూడా సీబీఐకి అప్పగిస్తే రాష్ట్రంలో సంచలం సృష్టించిన ఈ మూడు కేసులు ఉమ్మడి జిల్లాతో ఉన్న లింకులు బయటపడనున్నాయి. ‘కాళేశ్వరం’పైమంథని నియోజకవర్గం పరిధిలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ వైఫల్యానికి ప్రణాళిక, డిజైన్, నాణ్యత లోపాలు, నిర్మాణం కారణమని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ చేపట్టాలని అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ప్రభుత్వం లేఖ రాసింది. పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా విచారణ చేపట్టొద్దని హైకోర్టు బ్రేకులు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇచ్చిన నివేదిక ఆధారంగా విచారణ చేపడుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇస్తే సీబీఐ అధికారులు విచారణ చేపట్టే అవకాశాలున్నాయి.కేంద్ర దర్యాప్తు సంస్థల పరంపర● ఉమ్మడి జిల్లాలో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ ఇదేం కొత్త కాదు. గత ప్రభుత్వ హయాంలోనూ పలుమార్లు ఉమ్మడి కరీంనగర్ కేంద్రంగా అనేక కేసుల్లో విచారణ చేపట్టాయి. కొన్ని దాడులతో సరిపెట్టగా.. మరికొన్నిట్లో నోటీసుల వరకు వెళ్లాయి. ఇంకొన్నిట్లో విచారణ నేటికీ సాగుతోంది.● ఈ ఏడాది మార్చిలో మయన్మార్ కేంద్రంగా సైబర్ కేఫ్ల వద్ద బంధీలుగా మారిన భారతీయులను కేంద్రం విడిపించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులు, బాధితులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారు కావడం గమనార్హం. ఈ కేసుపై ఎన్ఐఏ, సీబీఐ, ఇమిగ్రేషన్ సంస్థలు సంయుక్తంగా విచారణ చేపడుతున్నాయి.● 2022 సెప్టెంబరులో పీఎఫ్ఐ సానుభూతిపరులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. దేశ్యాప్తంగా పీఎఫ్ఐ సానుభూతిపరులను ఏకకాలంలో బెంబేలెత్తించింది. కరీంనగర్లోనూ ఇద్దరిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది.● సీబీఐ ఆఫీసర్ అంటూ ఓ వ్యక్తి పలువురు వీఐపీలను మోసం చేసిన కేసులో అతని గురించి సమాచారం ఇవ్వాలంటూ 2022 డిసెంబరులో అప్పటి మంత్రి గంగుల కమలాకర్కు సీబీఐ అధికారులు నోటీసులు జారీచేశారు. ఈ ఘటన తరువాత ఉమ్మడి జిల్లాలో సీబీఐ అడుగుపెట్టడం ఇదే తొలిసారి.● లిక్కర్స్కాంలో విచారణలో భాగంగా కరీంనగర్ చెందిన అనేక మంది ప్రముఖుల ఇళ్లపై హైదరాబాద్లో 2022 సెప్టెంబరులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. వీరి స్వస్థలమైన కరీంనగర్ నుంచి కూడా రహస్యంగా పలు ఫైళ్లు, ఇతర సమాచారం సేకరించింది.● 2022 నవంబరులో గ్రానైట్ మైనింగ్లో అక్రమాలు జరిగాయని, ప్రభుత్వానికి భారీగా పన్ను ఎగవేశారని ఈడీ, ఇన్కం ట్యాక్స్ (ఐటీ) పలువురు వ్యాపారుల ఇళ్లలో సోదాలు నిర్వహించాయి. -
నేడు జాబ్మేళా
పెద్దపల్లిరూరల్: నిరుద్యోగ యువతకు టెలిపెర్ఫార్మెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు శుక్రవారం (ఈనెల 19న) జాబ్మేళా నిర్వహించనున్నట్టు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ కాంటెంట్ మోడల్ అనలిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. 2022 నుంచి 2025 వరకు డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన వారు అర్హులని, ఆసక్తిగల సంబంధిత సర్టిఫికెట్ల జిరాక్సు ప్రతులతో జాబ్మేళాకు హాజరు కావాలన్నారు. పూర్తి వివరాలకు 90595 06807 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. న్యాయవిజ్ఞానంపై అవగాహన ఉండాలిపాలకుర్తి(రామగుండం): సమాజంలోని ప్రతిపౌరుడికి న్యాయవిజ్ఞానం, చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి స్వప్నరాణి అన్నారు. మండలంలోని కు క్కలగూడూరు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. మ త్తు పదార్థాలతో కలిగే అనర్థాలపై వివరించా రు. పోక్సోయాక్టు కింద నమోదయ్యే కేసులపై అవగాహన కల్పించారు. ఎవరైనా న్యాయపరమైన సలహాలు కావాలనుకుంటే టోల్ఫ్రీ నంబరు 15100కు డయల్ చేసి పొందవచ్చని తెలి పారు. ఉచిత న్యాయసేవల కోసం జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు. పాఠశాల హెచ్ఎం తోపాటు గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరం హిందీ మాట్లాడుదాం జ్యోతినగర్(రామగుండం): హిందీ మన దేశ భాష అని, అందరం మాట్లాకుందామని ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్కుమార్ సామంత అన్నారు. హిందీ పక్షోత్సవాల్లో భాగంగా గురువారం ప్రాజెక్టు ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సదస్సును ప్రారంభించి మాట్లాడారు. ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టులో హిందీ అమలులో విశిష్టమైన పనితీరు కనబర్చినందులకు గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన కార్యక్రమంలో అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ మేరకు అధికారులకు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఉద్యోగులు మాట్లాడడంతో పాటు హిందీలో గమనికలు రాయాలని కోరారు. జనరల్ మేనేజర్లు ముకుల్రాయ్, మనీశ్ అగ్రవాల్, ఏజీఎం(హెచ్ఆర్)బిజయ్కుమార్ సిగ్దర్, రాజభాషా విభాగం, విశాఖపట్నం సహాయ డైరెక్టర్ గౌసియా బేగం, సీనియర్ మేనేజర్ స్నేహలత తదితరులు పాల్గొన్నారు. ఇండోర్ స్టేడియాన్ని సద్వినియోగం చేసుకోవాలి రామగిరి(మంథని): మంథని జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇండోర్ స్టేడియాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ బులుసు విష్ణువర్ధన్ అన్నారు. కళాశాలలో ఏర్పాటు చేసిన ఇండోర్ స్టేడియాన్ని గురువారం ప్రారంభించి మాట్లాడారు. వీసీ కిషన్కుమార్రెడ్డి మంథని జేఎన్టీయూ కళాశాలను సందర్శించినప్పుడు ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరగా నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. రూ.3 లక్షలతో సింథటిక్ రబ్బర్ మ్యాట్లతో మూడు షటిల్ బాడ్మింటన్ కోర్టులు, రూ.2 లక్షలతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రబ్బర్ కబడ్డీ మ్యాట్లు, టేబుల్ టెన్నీస్ మ్యాట్లు మంజూరు చేశారని, అలాగే 4 క్యారమ్ బోర్డులు, పది చెస్ బోర్డులతో కలిసి అన్ని ఒకే దగ్గర ఉండేలా ఇండోర్ స్టేడియం నిర్మించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఉదయ్కుమార్, పరిపాలనాధికారి సీహెచ్.సుమన్రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ విజయ్పాల్, ఫిజికల్ డైరెక్టర్లు పింగిలి కృష్ణారెడ్డి, సునీల్కుమార్గౌడ్, ఏఈఈ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
భూ సమస్యలపై ఫోకస్
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న భూసమస్యల పరిష్కారంపై రెవెన్యూ అధికారులు దృష్టిసారించారు. భూభారతి చట్టం అమల్లోకి రావడం, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి హైకోర్టు క్లియరెన్స్ ఇవ్వడం, గ్రామానికో గ్రామపంచాయతీ అధికారి(జీపీఓ)ను కేటాయించడంతో రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టారు. సర్వే నంబర్లు, భూయజమాని ఇంటి పేరు, యజమాని పేర్లలో తప్పులు దొర్లడం, విస్తీర్ణం తక్కువగా నమోదవడం, నిషేధిత భూముల జాబితాలో పట్టా భూమి సర్వే నంబర్లు రావడం, సర్వే నంబర్లు మిస్ కావడం, సాదాబైనామా, మ్యుటేషన్, ఆసైన్డ్ భూముల పట్టా, వారసత్వ పట్టా వంటివి దాదాపు 20 కేటగిరీలకు సంబంధించిన సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భూసమస్యలపై 83,520 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 9,705 దరఖాస్తులు మాత్రమే పరిష్కారమయ్యాయి. ఇంకా 89శాతం దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోలేదు. సాదాబైనామా దరఖాస్తులే ఎక్కువ ఉమ్మడి జిల్లా పరిధిలో మే నెలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో కరీంనగర్ జిల్లాలో 31,325 దరఖాస్తులు వస్తే 3,182 పరిష్కారమయ్యాయి. జగిత్యాలలో 25,675 దరఖాస్తులు వస్తే 1,600 , రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8,929 దరఖాస్తులకు 2,706, పెద్దపల్లి జిల్లాలో 17,592 దరఖాస్తుల్లో 2,217 పరిష్కారమయ్యాయి. గతంలో తెల్లకాగితాలపై భూములు కొనుగోలు చేసి కాస్తులో ఉన్నవారు 2020లో పట్టాదారు పాస్పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో ధరణి చట్టం ప్రకారం.. సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం వీలుకాదని గతంలో హైకోర్టు స్టే విధించడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. భూభారతి చట్టంలో సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి వెసులుబాటు కల్పించినట్లు కోర్టుకు ప్రభుత్వం నివేదించడంతో స్టే ఎత్తేసింది. దీంతో సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం లభించే అవకాశముంది. జిల్లా దరఖాస్తులు పరిష్కారమైనవి కరీంనగర్ 31,325 3,182 జగిత్యాల 25,675 1,600 రాజన్న సిరిసిల్ల 8,928 2,706 పెద్దపల్లి 17,592 2,217 -
కేంద్ర దర్యాప్తు సంస్థల పరంపర
● ఉమ్మడి జిల్లాలో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ ఇదేం కొత్త కాదు. గత ప్రభుత్వ హయాంలోనూ పలుమార్లు ఉమ్మడి కరీంనగర్ కేంద్రంగా అనేక కేసుల్లో విచారణ చేపట్టాయి. కొన్ని దాడులతో సరిపెట్టగా.. మరికొన్నిట్లో నోటీసుల వరకు వెళ్లాయి. ఇంకొన్నిట్లో విచారణ నేటికీ సాగుతోంది.● ఈ ఏడాది మార్చిలో మయన్మార్ కేంద్రంగా సైబర్ కేఫ్ల వద్ద బంధీలుగా మారిన భారతీయులను కేంద్రం విడిపించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులు, బాధితులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారు కావడం గమనార్హం. ఈ కేసుపై ఎన్ఐఏ, సీబీఐ, ఇమిగ్రేషన్ సంస్థలు సంయుక్తంగా విచారణ చేపడుతున్నాయి.● 2022 సెప్టెంబరులో పీఎఫ్ఐ సానుభూతిపరులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. దేశ్యాప్తంగా పీఎఫ్ఐ సానుభూతిపరులను ఏకకాలంలో బెంబేలెత్తించింది. కరీంనగర్లోనూ ఇద్దరిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది.● సీబీఐ ఆఫీసర్ అంటూ ఓ వ్యక్తి పలువురు వీఐపీలను మోసం చేసిన కేసులో అతని గురించి సమాచారం ఇవ్వాలంటూ 2022 డిసెంబరులో అప్పటి మంత్రి గంగుల కమలాకర్కు సీబీఐ అధికారులు నోటీసులు జారీచేశారు. ఈ ఘటన తరువాత ఉమ్మడి జిల్లాలో సీబీఐ అడుగుపెట్టడం ఇదే తొలిసారి.● లిక్కర్స్కాంలో విచారణలో భాగంగా కరీంనగర్ చెందిన అనేక మంది ప్రముఖుల ఇళ్లపై హైదరాబాద్లో 2022 సెప్టెంబరులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. వీరి స్వస్థలమైన కరీంనగర్ నుంచి కూడా రహస్యంగా పలు ఫైళ్లు, ఇతర సమాచారం సేకరించింది.● 2022 నవంబరులో గ్రానైట్ మైనింగ్లో అక్రమాలు జరిగాయని, ప్రభుత్వానికి భారీగా పన్ను ఎగవేశారని ఈడీ, ఇన్కం ట్యాక్స్ (ఐటీ) పలువురు వ్యాపారుల ఇళ్లలో సోదాలు నిర్వహించాయి. -
మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యం
పాలకుర్తి(రామగుండం): ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ అన్నారు. గురువారం మండలంలోని బసంత్నగర్ వర్కర్స్ క్లబ్ ఆవరణలో మక్కాన్సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరం, సంచార చేపల విక్రయ వాహనాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.10లక్షల ఆరోగ్యశ్రీతో పాటు ఖర్చు ఎక్కువైతే ఎల్వోసీ ఇస్తున్నామని పేర్కొన్నారు. అధిక శాతం కార్మిక కుటుంబాలు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యాధులను గుర్తించి మెరుగైన వైద్య సేవల కోసం అవసరమైతే హైదరాబాద్లోని ఆస్పత్రికి పంపిస్తామని భరోసా ఇచ్చారు. వివిధ విభాగాలకు చెందిన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని వివరించారు. ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్, వైద్యులు క్యాస శ్రీనివాస్, లక్ష్మీ వాణి, నాగిరెడ్డి, అనీశ్పబ్బా, రాజశేఖరరెడ్డి, నాగరాజు, రాజీవ్, గోపికాంత్, కన్నాల విండో చైర్మన్ బయ్యపు మనోహర్రెడ్డి, పరుషవేణి శ్రీనివాస్, తవ్వ సతీశ్ పాల్గొన్నారు. -
విత్తనోత్పత్తిపై రైతులు దృష్టి సారించాలి
ఎలిగేడు(పెద్దపల్లి): రైతులు విత్తనోత్పత్తిపై దృష్టి సారించాలని కూనారం, ఏరువాక శాస్త్రవేత్తలు సతీశ్చంద్ర, హరికృష్ణ అన్నారు. గురువారం మండలంలోని ర్యాకల్దేవుపల్లి, ఎలిగేడు, శివపల్లి గ్రామాల్లో వరిపంటలను పరిశీలించారు. ఈసందర్భంగా రైతులకు విత్తన ఉత్పత్తిలో పాటించాల్సిన మెలకువలు, చీడపీడల నివారణ, సస్యరక్షణ చర్యలపై వివరించారు. ఈ పంట ద్వారా వచ్చే విత్తనాలను వచ్చే పంటకు ఆయా గ్రామాల్లోని ఇతర రైతులకు అందించాలని సూచించారు. నానో యూరియా పిచికారీ చేసిన పొలాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మండల వ్యవసాయ అధికారి ఎం.ఉమాపతి, ఏఈవోలు సురేశ్, గణేశ్ పాల్గొన్నారు. తెగుళ్లు పరిశీలనకమాన్పూర్(మంథని): నాణ్యమైన విత్తనం–రైతన్నకు నేస్తం కార్యక్రమంలో భాగంగా మండలంలోని గుండారం, రాజాపూర్, కమాన్పూర్, గొల్ల్లపల్లె గ్రామాల్లో రైతులు సాగు చేసిన వరి పంటలను గురువారం శాస్త్రవేత్తలు పరిశీలించారు. వరిలో ఆకునల్లి నివారణకు పైరుపై వాడే మందుల గురించి రైతులకు వివరించారు. శాస్త్రవేత్త సతీశ్చంద్ర, ఏవో రామకృష్ణ, ఏఈవో అనూష పాల్గొన్నారు. -
వంతెనల నిర్మాణానికి రూ.5 కోట్లు
● ఎమ్మెల్యే విజయరమణారావుపెద్దపల్లిరూరల్: పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పని చేస్తున్నానని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. నియోజకవర్గంలోని ఆరు ప్రాంతాల్లో హైలెవల్ వంతెనల కోసం ప్రభుత్వం నుంచి రూ.5కోట్లు మంజూరు చేయించానని తెలిపారు. పెద్దపల్లి మండలం రంగాపూర్ నుంచి రాఘవాపూర్ మార్గంలో అగుల్ల ఒర్రైపె రూ.కోటి వ్యయంతో వంతెన నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అలాగే రాఘవాపూర్ నుంచి రంగాపూర్ మార్గంలోని జాలు కాలువపై రూ.50లక్షలతో, శ్రీరాంపూర్ మండలం తారుపల్లి–మీర్జంపేట నడుమ నక్కలవాగుపై రూ. కోటి 25లక్షలతో, జూలపల్లి మండలం కీచులాటపల్లి–వడ్కాపూర్ మార్గంలోని చెరువు మత్తడి వద్ద రూ.50లక్షలతో లోలెవల్ వంతెన, ఎలిగేడు మండలం శివపల్లి–నర్సయ్యపల్లి మార్గంలోని ఊర చెరువు కెనాల్పై రూ.85లక్షలతో హైలెవల్ వంతెన, సుల్తానాబాద్ మండలం కనుకుల–గుండ్లపల్లి నడుమ చెరువు రోడ్లో రూ.90లక్షలతో వంతెన నిర్మాణాల పనులు చేపట్టనున్నట్లు వివరించారు. -
కలెక్టరేట్లో విశ్వకర్మ జయంతి
పెద్దపల్లిరూరల్: విరాట్ విశ్వకర్మ యజ్ఙమహోత్సవ్ను కలెక్టరేట్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటం వద్ద మైనారిటీస్ ఫైనా న్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్ సాహె బ్, కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యే విజయరమణారావు.. అడిషనల్ కలెక్టర్లు అరుణశ్రీ, వేణుతో కలిసి ప్రత్యేకపూజలు చేశారు. ప్రభుత్వాదేశాలతో విశ్వకర్మ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నామ ని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెలవు ప్రకటించాలని సంఘం జిల్లా అ ధ్యక్షుడు కట్ట రాజానందం, నాయకులు కోరారు. బీసీ సంక్షేమశాఖ అధికారి రంగారెడ్డి పాల్గొన్నారు. -
ఎన్టీపీసీలో విశ్వకర్మ జయంతి
జ్యోతినగర్(రామగుండం): రామగుండం ఎన్టీపీసీ – తెలంగాణ ప్రాజెక్టులో బుధవారం శ్రీవిశ్వకర్మ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) చందన్కుమార్ సామంత ప్రత్యేక పూ జలు చేశారు. అనంతరం సుమారు 2వేల మంది కార్మికులకు ప్రసాదం పంపిణీ చేశారు. కా ర్యక్రమంలో జనరల్ మేనేజర్లు ముకుల్ రా య్, మనీశ్అగర్వాల్, అవిజిత్ దత్తా, బినోయ్జోస్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.సైబర్ నేరాలపై అవగాహన అవసరంజ్యోతినగర్(రామగుండం): సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు అంగన్వాడీ టీచర్లు బాధ్యతగా వ్యవహరించాలని సైబర్ క్రై మ్ ఎస్సై కృష్ణమూర్తి సూచించారు. ఎన్టీపీసీ మిలీనియం హాల్లో బుధవారం ఏర్పాటు చే సిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడా రు. అనుమాతులు ఫోన్కాల్ చేస్తే బ్యాంక్, ఆ ధార్ తదితర వివరాలు తెలియజేయవద్దన్నా రు. ఓటీపీ, ఓఎల్ఎక్స్, పేటీఎం, ఫోన్ పే, గూ గుల్ పే, ఈ కేవైసీ అప్డేట్ తదితర సమాచా రం అడిగినా సమాధానం ఇవ్వొద్దని ఆయన సూచించారు. సైబర్ నేరాల బారినపడితే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్చేసి ఫిర్యా దు అందించాలని ఆయన కోరారు. అంగన్వాడీ టీచర్ల అసోసియేషన్ జిల్లా కో ఆర్డినేటర్ అనిల్, రామగుండం ప్రాజెక్ట్ సీడీపీవో అలేఖ్య పటేల్ తదితరులు పాల్గొన్నారు. వైద్య సిబ్బందికి టీకాలు పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రధాన ఆస్పత్రిలో బుధవారం వైద్యసిబ్బందికి హైపటైటిస్– బీవ్యాధి నిరోధక టీకాలు వేశారు. ఈవ్యాధితో రక్తం, శరీరద్రవ్యాలు వ్యాప్తి చెందుతాయని డీఎంహెచ్వో వాణిశ్రీ, సూపరింటెండెంట్ శ్రీధర్ అన్నా రు. జీరో డోస్ తీసుకున్నాక నెలకు ఒక డోస్, ఆరునెలల తర్వాత రెండోడోస్ తీసుకోవాలని వారు సూచించారు. ప్రోగ్రాం అధికారి కిరణ్, ఆర్ఎంవో విజయ్, నర్సింగ్ సూపరింటెండెంట్ జమున తదితరులు పాల్గొన్నారు.బీజేపీ జిల్లా కార్యవర్గంలో పలువురికి చోటు సుల్తానాబాద్(పెద్దపల్లి): బీజేపీ జిల్లా కార్యవర్గంలో పలువురికి చోటు కల్పించినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి బుధవారం తెలిపారు. ఉపాధ్యక్షులుగా అమరగాని ప్రదీప్ కుమార్, ముస్కూల భాస్కర్రెడ్డి, శనిగరపు రమేశ్, సౌదరి మహేందర్, మచ్చగిరి రాము, కాసాగోని నిర్మలగౌడ్, ప్రధాన కార్యదర్శులు గా కోమల మహేశ్ కుమార్, పల్లె సదానందం, కడారి అశోక్రావు, కార్యదర్శులుగా సో మా రపు లావణ్య, బిరుదు గట్టయ్య, మోటం న ర్సింగం, గర్రెపల్లి నారాయణస్వామి, దాడి సంతోష్, శివంగారి సతీశ్, కోశాధికారిగా కామని రాజేంద్రప్రసాద్ను నియమించామన్నారు. ఆ ఫీస్ కార్యదర్శిగా ఎస్ఎంసీ వనజ, సోషల్ మీ డియా ఇన్చార్జిగా కుమ్మ వెంకటకృషష్ణ, మీ డియా కన్వీనర్గా వెన్నంపల్లి శ్రీనివాస్రావు, ఐటీ ఇన్చార్జిగా అక్కపల్లి క్రాంతిని నియమించామన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో సంజీవరెడ్డి మాట్లాడుతూ, బీజేపీని మరింత బలోపేం చేసి వచ్చే అసంబ్లీ ఎన్నికల్లో విజ యమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. కబడ్డీపోటీలకు ఎంపిక ఎలిగేడు(పెద్దపల్లి): స్థానిక జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని మీనుగు భూలక్ష్మి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం దేవేందర్రావు బుధవారం తెలిపారు. జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన సబ్ జూనియర్ కబడ్డీ ఎంపిక పో టీల్లో భూలక్ష్మి ప్రతిభ చూపిందన్నారు. ఈనెల 25న నిజామాబాద్లో నిర్వహించే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో ఆమె పాల్గొంటుందని పేర్కొన్నారు. బాలికను హెచ్ఎం, ఉపాధ్యాయులతోపాటు ఫిజికల్ డైరెక్టర్ ప్రణయ్కుమార్, గ్రామస్తులు అభినందించారు. -
మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
పెద్దపల్లిరూరల్: మహిళలకు మెరుగైన ఆరోగ్యసేవ లు అందించేందుకు స్వస్థ్నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ అమలు చేస్తున్నామని కలెక్టర్ శ్రీహర్ష, ఎంపీ వంశీకృష్ణ అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం పథకం ప్రారంభించి మాట్లాడారు. మహిళ లు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందన్నారు. డీఎంహెచ్వో వాణిశ్రీ, సూపరింటెండెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.గోపాలమిత్రలకు సన్మానం గోపాలమిత్రల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడిగా వునుకొండ శ్రీధర్, అధ్యక్షుడిగా కల్వల శ్రీనివాస్ను నియమించగా.. వారిని ఎంపీ సన్మానించారు. పాడిరైతులకు అండగా ఉండాలని సూచించారు. -
అభివృద్ధి..సంక్షేమమే ధ్యేయం
పెద్దపల్లిరూరల్: అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం పాలన సాగిస్తోందని మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఒబెదుల్లా కొత్వాల్ సాహెబ్ అన్నారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, అడిషనల్ కలెక్టర్లు అరుణశ్రీ, వేణుతో కలిసి ఆయన పాల్గొన్నారు. డీసీ పీ కరుణాకర్ ఆధ్వర్యంలో పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ఆరు గ్యారంటీల అమలు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే పదేళ్లపాటు పాలించిన తొలిపాలకుల తీరుతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని కొత్వాల్ విమర్శించారు. అయినా ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్ర యాణం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రూ. 500కే సిలిండర్, గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్ తదితర పథకాలు అందిస్తున్నట్లు వివరించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని ఒబెదుల్లా కొత్వాల్ అన్నారు. ఇందుకోసం కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీలో నిరసన చేపట్టారని ఆయన గుర్తుచేశారు. ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుందన్నారు. జిల్లాలో ఆయకట్టు స్థిరీకరణ జిల్లా రైతులకు సాగునీటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మహ్మద్ ఒబెదుల్లా కొత్వాల్ అన్నారు. 2 లక్షల 30 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించి, 10వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరందించేలా శ్రీలక్ష్మీనర్సింహాస్వామి పత్తిపా క రిజర్వాయర్ను 3 టీఎంసీల నుంచి 5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నామని అన్నారు. రూ.కోటి 10 లక్షలను డీపీఆర్ తయారీకి మంజూరు చేసిన ట్లు ఆయన తెలిపారు. 13 వేల 396 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేసే రామగుండం ఎత్తిపోతల పెండింగ్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. అర్హులందరికీ రేషన్కార్డులు, సన్నబియ్యం.. అర్హులైన పేదలు పదేళ్లుగా రేషన్కార్డుల కోసం ఎదురుచూసి విసిగిపోయారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జిల్లాలో 12,168మందికి రేషన్కార్డులు అందించామని ఒబెదుల్లా కొత్వాల్ తెలిపారు. ప్రభుత్వ ఖజానాపై భారం పడుతున్నా ఉగాది పండుగ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల ఆధునికీకరణ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందు కు జిల్లా ప్రధాన ఆస్పత్రిని రూ.52కోట్లతో ఆధునికీకరిస్తున్నామని ఒబెదుల్లా తెలిపారు. గోదావరిఖని జనరల్ ఆస్పత్రిని రూ.160కోట్లతో నిర్మిస్తన్నామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా అందించే సేవలను రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు ప్రభుత్వం పెంచిందని ఆయన తెలిపారు. పెద్దపల్లిలో 100 పడకలు, మంథనిలో 50 పడకలు ఆస్పత్రుల నిర్మాణం పురోగతిలో ఉందన్నారు. రూ.173కోట్లతో అభివృద్ధి పనులు జిల్లాలో రూ.173 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని కొత్వాల్ అన్నారు. ఇందులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బీటీ రోడ్లు ఉన్నాయన్నారు. మత్స్యకారులు, మహిళా సంఘా లు ఆర్థికాభ్యున్నతి సాధించేలా రాయితీ రుణాలు అందిస్తున్నామని ఆయన వివరించారు. ఆర్డీవో గంగయ్య, కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్తోపాటు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వేడుకలకు హాజరైన ప్రముఖులుపోలీసుల గౌరవ వందనంమాట్లాడుతున్న మహ్మద్ ఒబెదుల్లా కొత్వాల్రామగుండం సీపీ కార్యాలయంలో.. -
రక్తదానంతో మరొకరికి ప్రాణదానం
సుల్తానాబాద్(పెద్దపల్లి): రక్తదానం ద్వారా మరొక రికి ప్రాణదానం చేసిన వారవుతారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, సేవా పక్వాడ జిల్లా క న్వీనర్ నల్ల మనోహర్రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి మోదీ జన్మదినం సందర్భంగా రెడ్క్రాస్ సొసైటీ ఆ ధ్వర్యంలో స్థానిక ఆర్యవైశ్య భవనంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. సంజీవరెడ్డి, మనోహర్రెడ్డి శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. దేశా న్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దిన ఘనత ప్రధాని మో దీకే దక్కుతుందన్నారు. అంతకుముందు పట్టణంలోని పూసాల రోడ్డులో తెలంగాణ విమోచన దినోత్సవం జరిపారు. నాయకులు కందుల శ్రీనివాస్, మీస అర్జున్రావు, కడారి అశోక్రావు, సౌదరి మ హేందర్యాదవ్, కామని రాజేంద్రప్రసాద్, చింతల లింగారెడ్డి, రఘుపతిరావు, చాతరాజు రమేశ్, గుంటి కుమార్, కోట నాగేశ్వర్, ఎళ్లేంకి రాజు, కొల్లూరి సంతోష్ కుమార్, కందునూరి కుమార్, గుడ్ల వెంకటేశ్, సతీశ్, సమ్మిరెడ్డి పాల్గొన్నారు. 2 వరకు సేవా కార్యక్రమాలు పెద్దపల్లిరూరల్: ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా అక్టోబర్ 2వ తేదీవరకు వివిధ సేవా కార్యక్రమాలు చేపడతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, సేవా పక్వాడ కన్వీనర్ నల్ల మనోహర్రెడ్డి తెలిపారు. మోదీ జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలో కేక్కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశా రు. రెడ్క్రాస్ సొసైటీ రక్తదాన శిబిరం నిర్వహించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దేశాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకుపోతున్నారన్నారు. కార్యక్రమంలో నా యకులు రాకేశ్, పల్లె సదానందం, అశోక్రావు, ప్ర దీప్, నిర్మల, శివంగారి సతీశ్, నర్సింగం, నారాయణస్వామి, చిలారపు పర్వతాలు, క్రాంతి, సంపత్, దిలీప్, రాజగోపాల్, మహంతకృష్ణ, సురేందర్, ఉమేశ్, రాజవీరు, హరీశ్ తదితరులు పాల్గొన్నారు. -
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
● మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ధర్మారం(ధర్మపురి): ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ఇటీవల మృతి చెందిన మార్కెట్ యార్డులోని హమాలీ మెడవేని రాజేశంకు మార్కెటింగ్శాఖ ద్వారా మంజూరైన రూ.లక్ష విలువైన చెక్కును మృతుడి కుటుంబసభ్యులకు బుధవారం మంత్రి అందజేసి మాట్లాడా రు. మార్కెట్లో అదనపు షెడ్ నిర్మాణానికి రూ.1.40కోట్లు, యార్డు చదును చేసేందుకు మరో రూ.28 లక్షలు, ధర్మారం మెడవేనివాడ – ఎండపల్లిక్రాస్ రోడ్డు వరకు బైపాస్ నిర్మాణానికి రూ.3.20కోట్లు మంజూరైనట్లు ఆయన వివరించారు. వీటితోపాటు వివిధ అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయించిన ఘనత తనదేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, మాజీ వైస్ చైర్మన్ పాలకుర్తి రాజేశంగౌడ్, డైరెక్టర్లు బద్దం గంగారెడ్డి, కాంపెల్లి రాజేశం, అల్వాల రాజేశం, కోల శ్రీనివాస్, గందం మహిపాల్, జనగామ తిరుపతి, ఈదుల శ్రీనివాస్, ఎలగందుల అశోక్, నాయకులు ఓరం చిరంజీవి, కాంసాని ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న రోజు..
గోదావరిఖని: నిజాం నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న రోజును తెలంగాణ ప్రజాపాలన దినంగా నిర్వహిస్తున్నామని సింగరేణి ఆర్జీ –వన్ జీఎం లలిత్కుమార్ అన్నారు. గోదావరిఖనిలోని ఆర్జీ – వన్ జీఎం కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం నిర్వహించగా, జీఎం జాతీయ జెండా ఎగురవేసి మాట్లాడారు. ఐఈడీ ఏజీఎం ఆంజనేయులు, క్వాలిటీ అధికారి బ్రహ్మాజీ, సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, సర్వే డీజీఎం జీఎల్రాజు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆర్జీ–2 ఏరియాలో జరిగిన కార్యక్రమంలో ఎస్వోటూ జీఎం రా ముడు, ఐఈడీ డీజీఎం మురళీకృష్ణ, సివిల్ డీజీఎం ధనుంజయ్, ఏరియా రక్షణాధికారి సంతోష్కుమార్, ఎస్టేట్ అధికారి సునీత, పర్సనల్అధికారి సాధన్ తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యానికి మించి బొగ్గు ఉత్పత్తి
● సింగరేణిలోనే ద్వితీయస్థానం ● దూకుడు పెంచిన ఆర్జీ–2 ఏరియా గోదావరిఖని: వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో సింగరేణిలోని ఆర్జీ–2 ఏరియా దూకుడుగా ముందుకు సాగుతోంది. సంస్థలోనే అతిపెద్ద ఓసీపీ–3 ఉత్పత్తి సాధనలో అగ్రస్థానంలో ఉంది. ఓబీ వెలికితీత, బొగ్గు ఉత్పత్తి, రవాణాలో ముందుకు సాగుతోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు చివరి నాటి 129 శాతం బొగ్గు ఉత్పత్తి నమోదుచేసి సింగరేణిలోనే నంబర్వన్గా నిలిచింది. ఉత్పత్తి లక్ష్య సాధనకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది. ఇదేసమయంలో ఉద్యోగులను అప్రమత్తం చేస్తోంది. రక్షణ, ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించడంతో లక్ష్య సాధన సులభమవుతోంది. స్థితిగతులను వివరిస్తూ.. సింగరేణి సంస్థ స్థితిగతులను ఉద్యోగులకు వివరిస్తూ లక్ష్య సాధనలో కార్మోన్ముఖులను చేయడంలో అధికారులు విజయం సాధించారు. దీంతో బొగ్గు వెలికితీయడంతో సంస్థలోనే ఆర్జీ–2 ఏరియా నంబర్వన్గా నిలిచింది. ప్రాజెక్టులోని ప్రైవేట్ ఓబీ కంపెనీల్లో మట్టి వెలికితీత లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగడం, డిపార్ట్మెంట్ పరంగా ఉత్ప త్తి, ఓబీ వెలికితీత పెరగడంతో బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి అడ్డంకి లేకుండా పోయింది. అంతేకాకుండా డిపార్ట్మెంటల్ ఓబీ, బొగ్గు వెలికితీత కోసం భారీ యంత్రాలను యాజమాన్యం కొనుగోలు చేసింది. దీంతో ఉత్పత్తికి అనుకూల మార్గాలు ఏర్పడ్డాయి. వకీల్పల్లి గని కూడా ఉత్పత్తిలో దూసుకుపోతోంది. ఏరియాలోని ఓసీపీ–3, వకీల్పల్లి గనులు పోటాపోటీగా ఉత్పత్తి చేస్తూ లక్ష్య సాధనలో పాలుపంచుకుంటున్నాయి. ఆదినుంచీ దూకుడుగానే.. ఆర్జీ–2 ఏరియా బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో ఆదినుంచీ దూకుడుగానే సాగుతోంది. గత ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు నిర్దేశిత లక్ష్యానికి మించి 129 శాతం బొగ్గు ఉతత్తి చేసింది. వర్షాలు కురిసి.. తెరిపి ఇవ్వగానే ఉత్పత్తిని వేగవంతం చేస్తోంది.నెల వారీగా..(టన్నుల్లో) నెల లక్ష్యం సాధించింది శాతం ఏప్రిల్ 2,28,400 4,99,986 218 మే 5,29,000 7,05,271 133 జూన్ 5,50,000 7,20,574 131 జూలై 6,80,500 7,31,703 107 ఆగస్టు 5,78,400 6,44,656 111 -
స్వచ్ఛతా హీ సేవలో భాగస్వాములు కావాలి
కోల్సిటీ(రామగుండం): స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా బుధవారం నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు చేపట్టే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ కోరారు. బల్దియా కార్యాలయంలో బుధవారం ప్రజాపాలన సందర్భంగా జాతీయ పతాకం ఎగురవేసి మాట్లాడారు. నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిన రోజు సందర్భంగా ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రెండువారాల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం పచ్చజెండా ఊపి స్వచ్ఛతా హీ సేవా ర్యాలీ ప్రారంభించారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఉమామహేశ్వర్రావు, ఈఈ రామన్, అకౌంట్స్ ఆఫీసర్ రాజు, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆర్ఐ శంకర్రావు, శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్రావు, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ మధుకర్, మెప్మా టీఎంసీ మౌనిక పాల్గొన్నారు. -
నేటి నుంచి వైద్యశిబిరాలు
పెద్దపల్లిరూరల్: మహిళల ఆరోగ్యం కోసం ఈ నెల 17 నుంచి ప్రత్యేక వైద్యశిబిరాలను నిర్వహించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం అడిషనల్ కలెక్టర్ అరుణ శ్రీతో కలిసి స్వస్థ్ నారీ స్వశక్తి అభియాన్ పథ కం అమలుపై సమీక్షించారు. బుధవారం నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. బాలికల స్కూళ్లు, కాలేజీల్లోనూ ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించాలన్నారు. డయాబెటిస్, బ్రెస్ట్క్యా న్సర్, హైపర్ టెన్షన్, సర్వికల్ క్యాన్సర్, ఎనీమి యా, టీబీ లాంటి వ్యాధుల నిర్ధారణకు పరీక్ష లు నిర్వహిస్తారని వివరించారు. డీఎంహెచ్వో వాణిశ్రీ, డీపీవో వీరబుచ్చయ్య, డీఈవో మాధ వి, డీడబ్ల్యూవో వేణుగోపాల్ పాల్గొన్నారు. ‘ఎల్లంపల్లి’కి భారీ ఇన్ఫ్లో రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో భారీగా వచ్చి చేరుతోంది. దీంతో మంగళవా రం ప్రాజెక్టు 38 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వి డుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్ర స్తుతం 19.20 టీఎంసీలు ఉందని నీటి పారు దల శాఖ అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి 4.60 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉందని, దిగు వన ఉన్న గోదావరి నదిలోకి 4.91 లక్షల క్యూ సెక్కులు విడుదల చేస్తున్నామన్నారు. ఎస్సారెస్పీ నుంచి అత్యధికంగా 2.32 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉందని వారు వివరించారు. పోలీస్ స్పోర్ట్స్ మీట్కు ఎంపికకమాన్పూర్(మంథని): పోలీస్ కానిస్టేబుల్ కూరపాటి శ్రీలత ఆల్ ఇండియా పోలీస్ స్పో ర్ట్స్ మీట్లో యోగా పోటీలకు ఎంపికయ్యారు. ఇందుకోసం పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకు నేందుకు వెళ్తున్నారు. ఆమెను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝూ, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐ శ్రీనివాస్ మంగళవారం అభినందించారు. ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ 13 నుంచి 17వ తేదీ వరకు ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించనున్నారు. యూరియా అందించాలి రామగుండం: అన్నదాతలకు సరిపడా యూ రియా అందజేయాలని అఖిల భారత రైతు కూ లీ సంఘం రాష్ట్ర నాయకుడు ఎం.చంద్రయ్య డిమాండ్ చేశారు. అంతర్గాం మండలం పెద్దంపేటలోని రైతు కూలీ సంఘం కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్ర భుత్వం రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్ను ల యూరియా ఇవ్వాల్సి ఉండగా.. 5.30 లక్షల మెట్రిక్ టన్నులే ఇవ్వడంతోనే కొరత ఏర్పడిందని విమర్శించారు. యూరియా కొరత తీర్చాలని, భారీవర్షాలతో పంటలు నష్టపోయిన రై తులకు ఎకరాకు రూ.50వేల పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. నాయకులు ఇ.నరేశ్, కొల్లూరి మల్లేశ్, ఎడ్ల రవికుమార్, బోనాల లింగయ్య, తూళ్ల లింగయ్య, ఆరుముళ్ల శంకర్, గట్టయ్య తదితరులు ఉన్నారు. నియామకం జ్యోతినగర్(రామగుండం): తె లంగాణ నేషన ల్ గ్రీన్కార్ప్స్ పర్యావరణ వి ద్య జిల్లా బ్రాండ్ అంబాసిడర్ గా అంజన్కుమార్ను నియమించారు. ఈ మేరకు ఎన్జీసీ డైరెక్టర్ ప్రసన్నకుమార్ ఉత్తర్వులు జారీచేశా రు. ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్లో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు గూళ్ల అంజన్కుమార్.. పర్యావరణ పరిరక్షణ, స్థిరత్వం, విద్యపై నిబద్ధత గురించి యువతకు అవగాహన కల్పించాలని, పర్యావరణ పరిరక్షణ కోసం సమష్టి చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
గోద్ ఫౌండేషన్ బ్రాండ్ అంబాసిడర్గా రష్మీ ఠాకూర్
జ్యోతినగర్(రామగుండం): గోద్ ఫౌండేషన్ జాతీయ బ్రాండ్ అంబాసిడర్గా మిస్ ప్లానెట్ ఇండియా రష్మీ ఠాకూర్ను నియమించారు. ఈమేరకు ఫౌండేషన్ చైర్పర్సన్, రాజ్యసభ సభ్యురాలు మ మతా మెహంతా, వైస్ చైర్మన్ నిజామొద్దీన్ మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఎన్టీపీసీ ప్రాంతానికి చెందిన రష్మీ ఠాకూర్ సేవా, సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భ్రూణహత్యల నివారణ, ఆడపిల్లల సంరక్షణపై అవగాహన పెంచడమే ఫౌండేషన్ లక్ష్యమన్నారు. చట్టాలను బలోపేతం చేయడం, మహిళా చట్టాల అమలుకు కృషి చేయడం, ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు పడేలా అవగాహన కల్పించడం తన బాధ్యతని రష్మీ ఠాకూర్ వివరించారు. -
చేయిపట్టి చూడరు.. ఆపరేషన్ చేయరు!
● ఇయ్యాల్టి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్● ఉమ్మడి జిల్లాలో నెట్వర్క్ నిలిపివేత ● బోధనాసుపత్రులు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో యథావిధిగా సేవలుకరీంనగర్టౌన్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలు బుధవారం నుంచి పూర్తిస్థాయిలో నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం కారణంగానే సేవలు నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటించా యి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమా అని 17 సంవత్సరాలుగా నిరుపేద, మ ధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుతుండగా.. ఈ ఏడాదిలోనే జనవరిలో ఒకసారి సేవలు నిలిపివేశారు. అయినప్పటికీ బిల్లుల పంచాయితీ తేలకపోవడంతో మరోమారు సేవల నిలిపివేతకు నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. రోడ్డు ప్రమాదాలు, గుండె సమస్యలు, అపెండిసైటిస లాంటి అత్యవసర సేవలకు తీవ్ర అవస్థలుపడే పరిస్థితి ఏర్పడనుంది. గతంలో ఈ పథకం కింద ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా ఓపీ, రక్తపరీక్షలు, ఆపరేషన్లు నిర్వహించే వారు. ఇందుకోసం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును నేరుగా ఆసుపత్రుల ఖాతాల్లోకే జమచేసేవారు. కొంత కాలంగా బకాయిలు పెరిగిపోవడంతో నిర్వహణ భారమైన ఆసుపత్రులు ఈ నిర్ణయం తీసుకోవడంతో వైద్యం నిరుపేదలకు అందని ద్రాక్షగా మారనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 49 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ఉండగా, అందులో 32 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ, ప్రైవేటు బోధనాసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులైన అపోలో రీచ్, మెడికవర్ మినహా అన్ని ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయనున్నాయి. దీంతో పేషెంట్లు ప్రైవేటు బోధనాసుపత్రులకు పరుగులు తీసే అవకాశం ఉంది. ఆసుపత్రులన్నీ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడంతో ప్రైవేటు బోధనాసుపత్రులకు, కార్పొరేట్ ఆసుపత్రులకు పేషెంట్ల తాకిడి పెరగనుంది. ఉమ్మడి జిల్లాలో ప్రతీరోజు సుమారు 70 మందికిపైగా ఆరోగ్యశ్రీ పథకం కింద ఆసుపత్రులలో చికిత్స పొందేవారు. సేవలు నిలిపివేస్తుండడంతో ప్రభుత్వ తీరు, ఆసుపత్రుల వ్యవహారశైలిపై పేషెంట్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రభుత్వమే నిర్వహించాలి
● సీపీఐ జిల్లా కార్యదర్శి సదానందంపెద్దపల్లిరూరల్: తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను ప్రభుత్వమే నిర్వహించాలని సీపీఐ జి ల్లా కార్యదర్శి తాండ్ర సదానందం డిమాండ్ చేశా రు. స్థానిక బస్టాండ్ వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు గౌతం గోవర్ధన్ తో కలిసి మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరా ట చరిత్రను భావితరాలకు తెలిసేలా పాఠ్యపుస్తకా ల్లో సిలబస్ చేర్చాలన్నారు. నిజాం నిరంకుశ పాలనకు చరమ గీతం పాడేందుకు నాయకులు రావి నా రాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూం మొహియుద్దీన్ ఇచ్చిన పిలుపు మేరకు వీరోచితంగా పోరాడి అనేకమంది అమరులయ్యారని అన్నారు. పూసాల రమేశ్, మానస్, నవీన్, ఉదయ్, అంజి, సదానందం, శంకర్, తిరుమల్, ఎల్లయ్య, రాజేశ్ ఉన్నారు. -
విస్తరిస్తున్న క్షయ!
● మధ్యలో మందులు మానేస్తున్న పేషెంట్ల ● చిన్న పిల్లల్లోనూ బయటపడుతున్న వ్యాధి లక్షణాలుసాక్షి, పెద్దపల్లి: జిల్లాలో క్షయ చాపకింద నీరులా విస్తరిస్తోంది. వయోవృద్ధుల నుంచి చిన్నపిల్లల వరకూ వ్యాధి బారిన పడుతున్నారు. గతంలో 50 ఏళ్లకు పైబడిన వారే టీబీ బారిన పడుతుండే వారు. మారుతున్న జీవన విధానం, తగ్గుతున్న వ్యాధి నిరోధకశక్తితో కొన్నేళ్లుగా చిన్నారులు కూడా క్షయ పీడితులవుతున్నారు. బాధితుల్లో కొంతమంది మధ్యలో చికిత్స ఆపేస్తుండడంతో వ్యాధి మళ్లీ తిరగబెడుతోందంటున్నారు. తర్వాత ముదిరి మొండిగా మారి ప్రాణాలు తీస్తోంది. క్షయ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా పూర్తిస్థాయిలో నిరోధించలేకపోతున్నాయి. క్షయబారిన 87 మంది చిన్నారులు జిల్లాలో గత నాలుగేళ్లలో 4,805 మంది క్షయ బారినపడగా, అందులో 87 మంది చిన్నారులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. శిశువు పుట్టిన 24 గంటల్లోపు క్షయను నివారించే బీసీజీ టీకా ఇస్తారు. లేదా పుట్టిన రెండేళ్లలోపు ఎప్పుడైనా టీకా ఇప్పించవచ్చు. పుట్టే శిశువుల్లో దాదాపు 99 శాతం మందికి బీసీజీ ఇస్తున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతుండగా.. క్షయ బాధిత పిల్లలు ఇంకా ఉండడమేమిట న్నది జవాబులేఇ ప్రశ్నగా మారింది. ప్రభుత్వ, ప్రై వేట్ ఆస్పత్రులతోపాటు ఇళ్లవద్ద కాన్పు జరిగిన శి శువులకు కచ్చితంగా బీసీజీ టీకా అందించేలా సర్కార్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాపకింద నీరులా.. జిల్లాలో క్షయ నిర్మూలన కోసం అధికారులు క్షేత్రస్థాయిలో క్రమం తప్పకుండా వైద్యశిబిరాలు నిర్వహిస్తూ వ్యాధిగ్రస్తులను గుర్తించి, చికిత్స అందిస్తున్నారు. అయినా కేసులు తగ్గుముఖం పట్టడం లే దు. వేళకు మందులు వేసుకోవడం, పౌష్టికాహారం తీసుకోవడం, డాక్టర్ల సూచనల మేరకు నడక, వ్యా యామం చేయడం వంటివి క్రమం తప్పకుండా చే సిన వారు చాలావరకు ఆరోగ్యవంతులుగా మారుతున్నారు. మరికొందరు రెండు, మూడు నెలల్లో వ్యాధి లక్షణాలు తగ్గగానే మందులు మానేస్తున్నారు. దీంతో చాలామందిలో వ్యా ధి తిరగబెడుతోంది. తీవ్రత ఆధారంగా డ్రగ్ సెన్సిటివ్ టీబీ, డ్రగ్ రెసిస్టెంట్ టీబీ గా విభజించారు. డ్రగ్ సె న్సిటివ్ టీబీకి ఆరునెలల పాటు చికిత్స తీసుకోవాల్సి ఉండగా, డ్రగ్ రెసిస్టెంట్ టీబీకి వ్యాధి తీవ్రత ఆధారంగా ఆరు నెలల నుంచి 18 నెలల వరకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. వ్యాధి లక్షణాలివే.. క్షయ ఒక అంటువ్యాధి. పేషెంట్ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు క్రిములు ఇతరులకు వ్యాపిస్తాయి. ఎవరికై నా వ్యాధి సోకితే రెండువారాలకు మించి దగ్గు, జ్వరం, బరువు, ఆకలి తగ్గుదల ఉంటుంది. దగ్గినప్పుడు క్రిములు గాలి ద్వారా వ్యాపిస్తాయి. ఉమ్మినప్పుడు రక్తం పడటం వంటి లక్షణాలు గుర్తి స్తే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో సంప్రదించాలి. పిల్లల్లో లక్షణాలు పెద్దల్లో మాదిరిగా తీవ్రదగ్గు ఉండదు. ఆకలి తగ్గిపోతుంది. అన్నం తినాలని బలవంతం చేస్తే ఏడుస్తా రు. పిల్లల్లో వయస్సుకు తగ్గట్లుగా ఎదుగుదల ఉండదు. బరువు పెరగరు. సాయంత్రం వేళల్లో జ్వరం వస్తుంది. మెడ పక్కన లింపు గ్రంథుల్లో వాపు, గడ్డల్లాగా వస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.జిల్లా సమాచారం ఏడాది 2022 2020 2024 2025 (ఇప్పటివరకు) టెస్టులు 23,880 23,694 22,956 14,670 కేసులు 1,291 1,426 1,246 842 15ఏళ్లలోపు 32 29 13 13 మరణాలు 73 41 43 12 సకాలంలో గుర్తించాలి క్షయ అనుమానితులకు ఎప్పటికప్పుడు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. మందుల పంపిణీతోపాటు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. బాధితులు త్వరగా రికవరీ అవుతున్నారు. క్షయను సకాలంలో గుర్తించి క్రమంగా మందులు వాడితే తప్పకుండా అదుపులోకి వస్తుంది. – సుధాకర్రెడ్డి, జిల్లా క్షయ నివారణ అధికారి -
ఆరోగ్యశ్రీ నిలిపివేయడం బాధాకరం
నిరుపేదలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం నిలిపివేయడం బాధాకరం. డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకోలేని నిరుపేదలు చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. బకాయిలను కూడా విడుదల చేసి ఆస్పత్రులకు చేయూత ఇవ్వాలి. – బి.రాజాకిషన్గౌడ్, కరీంనగర్ బకాయిల భారం పెరగడంతోనే.. ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తు న్న ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బ కాయిలు పెరిగిపోయాయి. నిర్వహణ భారంగా మారింది. వేతనాలు, మెయింటెనెన్స్ కష్టంగా మారడంతోనే ఉమ్మడి జిల్లా ఆసుపత్రుల యాజమాన్యాలు సమష్టిగా ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసే నిర్ణయం తీసుకున్నాం. – విష్ణువర్ధన్రెడ్డి, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా -
మత్తు పదార్థాలను తరిమేద్దాం
● యువత డ్రగ్స్కు బానిసలు కావొద్దు ● పెద్దపల్లి ఎమెల్యే విజయరమణారావు పెద్దపల్లిరూరల్: యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలో మత్తు పదార్థాల ని వారణపై అవగాహ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఎమ్మెల్యే విజయరమణారావు ర్యాలీని ప్రారంభించారు. అ మర్నగర్, మేన్రోడ్డు, జెండా, సుభాష్నగర్ మీదు గా ర్యాలీ సాగింది. అనంతరం యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బొంకూరి అవినాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడా రు. యువత తమ భవిష్యత్ను బంగారుమయం చేసుకోవాలన్నారు. మత్తు పదార్థాలను అంటగట్టి బానిసలు చేసేందుకు పన్నే కుట్రలో బందీ కా వొద్దని సూచించారు. సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు ప దార్థాలను ఉక్కుపాదంతో అణచివేసేందుకు ఈగల్ నినాదంతో ముందుకు సాగుతోందని తెలిపారు. మత్తు పదార్థాల వినియోగంతో కలిగే నష్టాలపై అందరికీ అర్థమయ్యేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ కరుణాకర్, ఏసీపీ కృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూప, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్, నాయకులు జడల సురేందర్, కొట్టె సదానందం, మస్రత్, ముత్యాల నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
తలవంచిన నిరంకుశత్వం
బాంచెన్ కాల్మొక్త అన్న సామాన్యులే.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం బందుకూతో గడి పునాదులను పెకిలించారు.. నిజాం నిరంకుశ పాలనలో మగ్గిపోతున్న తెలంగాణ ప్రజల విముక్తి కోసం కదంతొక్కారు.. జాగిరీదారులు, మక్తేదారులు, ఇనాందారులు, వతన్దారుల దుర్మార్గాలు, దౌర్జన్యాలపై పోరాటం సాగించారు..ఎందరో రజకార్లను తరిమికొట్టారు.. తెలంగాణ సాయుధ పోరాటంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కీలక పాత్ర పోషించింది. అందులో ఇప్పటి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రాంతం మడమతిప్పని పోరాటం సాగించింది.. బానిస సంకెళ్ల విముక్తి కోసం ఎందరో తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలారు. నేడు సెప్టెంబర్ 17 సందర్భంగా పలువురు యోధుల కథనాలు. – పెద్దపల్లి రూరల్ / మంథని రూరల్ / కరీంనగర్ / సిరిసిల్ల / ఇల్లంతకుంట / బోయినపల్లి -
దేశ నిర్మాణంలో ఇంజినీర్లపాత్ర అద్వితీయం
● రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా జ్యోతినగర్(రామగుండం): దేశ నిర్వాణంలో ఇంజి నీర్లపాత్ర అద్వితీయమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. ఇంజినీర్స్ డే సందర్భంగా ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్లోని కాకతీయ ఆడిటోరియంలో ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీపీసీ ఎగిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంతతో కలిసి సీపీ జ్యోతి ప్రజ్వలన చేశారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేశారు. సీపీ మాట్లాడుతూ, ఎన్టీపీసీ వెలుగులు అందించడంలో దేశంలో అగ్రభాగాన నిలిచిందన్నారు. నూతన సాంకేతిక విధానాలతో విద్యుత్ ఉత్పత్తిని చేపట్టేందుకు ఇంజినీర్లు చేస్తున్న కృషి అమోఘమని అన్నారు. సీపీని ఎన్టీపీసీ ఈడీ చందన్కుమార్ సా మంత శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అ నంతరం జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ప్రతినిధులు నితీశ్కుమార్, మహేంద్రకుమార్లతో పాటు పలువురు పాల్గొన్నారు. -
‘పుట్ట’ ఇంటి ఎదుట కాంగ్రెస్ ధర్నా
● శ్రీపాదరావు, శ్రీధర్బాబుపై వ్యాఖ్యలకు నిరసన మంథని: మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఇంటి ఎదుట కాంగ్రెస్ నాయకులు మంగళవారం ధర్నా చేశారు. దివంగత మాజీ స్పీకర్ శ్రీపాదరావు, మంత్రి శ్రీధర్బాబుపై పుట్ట మధు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు దిగారు. రాజకీయ భిక్ష పెట్టిన శ్రీపాదరావుపై వ్యాఖ్యలు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుద్దిళ్ల కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో మధు ఇంట్లో లే రు. ఆయన భార్య, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పు ట్ట శైలజ ఇంట్లో బయటకు వచ్చి మాట్లాడారు. రెండు గంటలకుపైగా తన ఇంటిఎదుట ధర్నా చేస్తుంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? అంటూ ఆ గ్రహం వ్యక్తం చేశారు. పోలీసులే దగ్గరుండి ధర్నా చేయిస్తారా? అని ప్రశ్నించారు. ఈ క్రమంలో స్పల్ప ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు బీఆర్ఎస్ శ్రే ణులను అక్కడినుంచి పంపించి వేశశారు. అనంతరం అంబేడ్కర్, శ్రీపాదరావు విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. కాసేపటి తర్వాత పుట్ట మధు స్థానిక ప్రధాన చౌరస్తాలోని ఓ దుకాణంలో కూర్చుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలుపుతారేమోననే అనుమానంతో ప్రధాన చౌరస్తాతో పాటు ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, విద్యుత్ నియంత్రణ మండల సలహా కమిటీ సభ్యుడు శశిభూషణ్ కాచే, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, నాయకులు ఎరుకల ప్రవీణ్, కొండ శంకర్, ఆరెల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ తప్పా? కమాన్పూర్ మండలం పెంచికల్పేటలో అంబే డ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం పుట్ట మధు చేసిన తప్పా? అని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పుట్ట శైలజ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడవక ముందే దాడులకు దిగుతారా? అని నిలదీశారు. కాంగ్రెస్ నాయకులు తమ ఇంటిపై దాడికి పూనుకున్నారని పుట్ట శైలజ ఎస్సైకి ఇచ్చిన ఫిర్యా దులో పేర్కొన్నారు. పుట్ట మధును చంపడానికి ప్రయత్నించారని అందులో పేర్కొన్నారు. -
ఇక ‘ఏఐ’తో పశువైద్యం!
పెద్దపల్లిరూరల్: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) సాంకేతికతను వినియోగించి రూపొందించిన యాప్ ద్వారా పాడిరైతు పశువు ఫొటోతీసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే చాలు.. ఆ పశువుకు ఏ రకమైన వ్యాధి సోకింది, దాని నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే వివరాలన్నీ వెల్లడిస్తుంది. దేశంలోనే తొలిసారి.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అమలుకు శ్రీకారం చుడుతోంది. జిల్లాకు చెందిన మంత్రి శ్రీధర్బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని నియోజకవర్గంలోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాల్లో ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేసేందుకు నిర్ణయించింది. సుమారు ఏడెనిమిది నెలల క్రితం ఈ ప్రక్రియ చేపట్టారు. మంత్రి శ్రీధర్బాబు, కలెక్టర్ చొరవతో ఏఐ సాంకేతికతతో మూగజీవాలకు నాణ్యమైన వైద్యం సకాలంలో అందించేందుకు కొత్త విధానం ఉపకరిస్తుందని భావిస్తున్నారు. ఆ నాలుగు మండలాల్లోని 132 మంది పాడిరైతులకు చెందిన 451 పశువులకు సంబంధించిన 1,600 ఫొటోలను ఇప్పటికే ఆన్లైన్లో అప్లోడ్ చేశారని అధికారులు తెలిపారు. ‘ఆరోగ్య వైద్యరేఖ’ యాప్ రూపకల్పన జిల్లాలో ప్రయోగాత్మకంగా పశుసంవర్థక శాఖ ద్వారా మూగజీవాలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏఐ సాంకేతికతతో 9 నెలల్లో ఆరోగ్య వైద్యరేఖ యాప్ రూపొందించారు. క్యాటిల్ హెల్త్ మానిటరింగ్ ఇంటలిజెన్స్(సీహెచ్ఎం ఐటీ) పశు వుల సమాచారాన్ని ఏ మేర సేకరించి యాప్లో నమోదు చేయగలిగితే ఏఐ టూల్స్ అంత మెరుగ్గా సమాచారం అందిస్తుందని జిల్లాస్థాయి అధికారులు చెబుతున్నారు. మేలుజాతి పశువుల సంతానోత్పత్తికి.. ఈ యాప్ ద్వారా పశువు ఎదను సకాలంలో గుర్తించి కృత్రిమ గర్భాధారణ చేస్తే మేలుజాతి ఆడదూడలను ఉత్పత్తి చేయడం సులువని పశువైద్యాధికారులు అంటున్నారు. గర్భకోశవ్యాధులను గుర్తించి గొడ్డుమోతుతనాన్ని కూడా నియంత్రించి పశువు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఈ విధానం దోహపడుతుందని అంటున్నారు. సకాలంలో వైద్యసేవలు అందించేలా.. పశువులు, గొర్రెలు, ఇతర మూగజీవాలు వ్యాధుల బారిన పడితే వాటి ఫొటోను యాప్ ద్వారా అప్లోడ్ చేయాలి. ఆ వెంటనే గోపాలమిత్ర, పశువైద్యాధికారులు, ఏఐ బృందం, కలెక్టర్కు సమాచారం చేరుతుంది. ఇంటర్నెట్ లేని ఫోన్లలోనూ ఫొటో తీస్తే లొకేషన్ మారదని, ఇంటర్నెట్ ఉన్న స్థలం నుంచి అప్లోడ్ చేసుకోవచ్చని అధికారులు వివరించారు. ఈ విధానం సమర్థవంతంగా అమలు చేసేందుకు అఽధికార యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా కార్యాచరణకు సిద్ధమవుతోంది. లోగో ఆవిష్కరణ పశువులకు సోకిన వ్యాధిని గుర్తించి సకాలంలో వైద్యం అందించేందుకు రూపొందించిన ఆరోగ్యవైద్యరేఖ యాప్ను కలెక్టర్ శ్రీహర్ష, నీర్ సంస్థ సీఈవో జయశంకర్, రాంచందర్, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి విజయభాస్కర్ సోమవారం ఆవిష్కరించారు.జిల్లా సమాచారం -
17న ‘ప్రజాపాలన’ వేడుకలు
పెద్దపల్లిరూరల్: కలెక్టరేట్లో ఈనెల 17న ప్ర జాపాలన దినోత్సవం నిర్వహిస్తారు. ఇందు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యఅ తిథిగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఒబెదుల్లా కొత్వాల్ హాజరవుతార ని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.అంబేడ్కర్ ఆశయాలు సాధిస్తాంకమాన్పూర్(మంథని): అంబేడ్కర్ ఆశయ సా ధనకు కృషి చేయాలని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. పేంచికల్పేటలో పుట్ట లింగ మ్మ చారిటబుల్ ట్రస్ట్, ఏఐఐవైఎస్ రాష్ట్ర కార్య వర్గ సభ్యుడు ఇరుగురాల కిష్టయ్య ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుతో కలిసి కొప్పుల సోమవారం ప్రా రంభించి మాట్లాడారు. బహుజనులకు 82శా తం రాజ్యాధికారం కావాలని కలలు గన్నారన్నారు. పుట మధు మాట్లాడుతూ, విగ్రహాల విగ్రహాల ఏర్పాటులో అవంతరాలు సృష్టిస్తే శ్రీపాదరావు విగ్రహాల స్థానాల్లో అంబేడ్కర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ మండల కన్వీనర్ శంకర్, మాజీ సర్పంచ్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన సుల్తానాబాద్(పెద్దపల్లి): స్థానిక ప్రభుత్వ జూ నియర్ కళాశాలలో సోమవారం ఇంటర్ ప్ర థమ సంవత్సరం విద్యార్థులతో ఫ్రెషర్స్ డే ని ర్వహించారు. జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధి కారి కల్పన మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలన్నారు. అనంతరం వి ద్యార్థులు చేపట్టిన సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మిమిక్రీ ఆర్టిస్ట్ రాజ్కుమార్, ప్రిన్సిపాల్ శ్రీధర్, అధ్యాపకులు పాల్గొన్నారు. హిందీ భాషా దినోత్సవం పెద్దపల్లిరూరల్: రాఘవాపూర్ జెడ్పీ హైస్కూ ల్లో సోమవారం హిందీభాషా దినోత్సవం ని ర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, పద్యపఠనం, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులను ప్రదా నం చేశారు. హెచ్ఎం హన్మంతు, ఉపాధ్యాయులు జీలుగ రవీందర్ పాల్గొన్నారు. గోపాలమిత్ర కార్యవర్గం పెద్దపల్లిరూరల్: గోపాలమిత్రల సంఘం జిల్లా అ ధ్యక్షుడిగా కల్వల శ్రీనివా స్, ప్రధాన కార్యదర్శిగా మీసాల తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పశుసంవర్థక శాఖ ఆ ధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో సమావేశ మై కార్యవర్గాన్ని ఖరారు చేశారు. ఉపాధ్యక్షులు గా తిరుమల్ రాజేశం, మంద మల్లేశం, కుంబా ల చంద్రయ్య, సహాయ కార్యదర్శులుగా కుంట కుమార్, శ్రీపతి ఉమామహేశ్, కోశాధికారిగా పంజాల సురేశ్తోపాటు ఐదుగురిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఎస్సారెస్పీ ఉపకాలువకు బుంగపెద్దపల్లిరూరల్: హన్మంతునిపేట శివారు (స మ్మక్క – సారలమ్మ గద్దె) ప్రాంతంలోని ఎస్సారెస్పీ డీ–83, ఎం – 22ఆర్ ఉపకాలువకు ఇటీ వల కురిసిన వర్షాలతో బుంగ పడింది. నీరంతా వృథాగా పోతుండడంతో స్థానిక రైతులు ఇ రిగేషన్ అధికారులకు సమాచారం అందించా రు. స్పందించిన అధికారులు.. ఇసుక బస్తాల తో తాత్కాలికంగా అడ్డుకట్ట వేశారు. ప్రైవేట్ కాలేజీల నిరసన -
మంగళవారం శ్రీ 16 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: క్రిప్టో కరెన్సీ వ్యవహారం రానురాను తీవ్ర రూపం దాల్చేలా కనిపిస్తోంది. తాజాగా ఈ కేసు విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా స్పందించడం గమనార్హం. మెటా ఫండ్ క్రిప్టో కరెన్సీ వ్యవహారంలో నిందితులను ఎవరినీ వదలవద్దని డిపార్ట్మెంట్కు బండి సంజయ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ కేసును కరీంనగర్ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితులు డబ్బులు వసూలు చేసిన తీరుపై పోలీసులు దృష్టి సారించారు. టూ టౌన్, రూరల్ ఠాణాల్లో కేసులు నమోదైనా.. సీసీఎస్ సాయంతో కేసును సీపీ గౌస్ ఆలం స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. బాధితులు, నిందితుల నుంచి డబ్బుల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఫిర్యాదు చేసేందుకు మరిన్ని బృందాలు ముందుకు వస్తుండగా.. మరికొందరు కేసు నమోదుకు వెనకాడుతున్నా.. దర్యాప్తునకు దోహదపడేలా ఆధారాలు మాత్రం పోలీసులకు ఇస్తున్నారు. ఓ వైపు నిందితులు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు కస్టడీ పిటిషన్ వేయడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. పోలీసులు, మాజీ మంత్రి పాత్రపై ఆరా మెటా క్రిప్టో స్కాంలో రాష్ట్ర, కేంద్ర నిఘా వర్గాలు నాలుగు నెలల క్రితమే వేర్వేరుగా వివరాలు సేకరించాయి. ఇప్పటి వరకూ అరైస్టెన ఐదుగురు నిందితుల్లో ఒకరికి మాజీ మంత్రి, ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడితో గతంలో బాగా సఖ్యత ఉండేది. సదరు వ్యక్తి మంత్రి హోదాలో తరచుగా కరీంనగర్ వచ్చిన ప్రతీసారీ, అతని ఇంటికి తప్పకుండా వెళ్లేవారు. ఈ క్రమంలోనే కేంద్ర దర్యాప్తు సంస్థలు సదరు మాజీ మంత్రి పాత్రపై ఆరా తీశాయి. వసూలు చేసిన డబ్బును నిందితులు దేశం దాటించారని బాధితులు ఆరోపిస్తున్న క్రమంలో సదరు మాజీ మంత్రికి, నిందితుడికి ఏమైనా లావాదేవీలు జరిగాయా? అన్న కోణంలో తనిఖీలు చేశాయి. అదే సమయంలో బాధితులు (ప్రభుత్వ ఉద్యోగులు) నిందితుడిని డబ్బుల కోసం నిలదీసిన ప్రతీసారి సదరు మాజీ మంత్రి పేరు చెప్పి వారిని బెదిరించినట్లు సమాచారం. అదే సమయంలో క్రిప్టోలో పెట్టుబడులు పెట్టిన నలుగురు సీఐల వివరాలు కూడా నిఘా వర్గాలు సేకరించాయి. వారికి డబ్బులు ఇవ్వకుండా జాప్యం చేయడమే కాకుండా.. పైపెచ్చు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లిన వైనంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వేధిస్తున్న విధానాన్ని కూడా గుర్తించినట్లు తెలిసింది. అదే సమయంలో క్రిప్టో కేసులో మోసపోయిన బాధితులను బెదిరించి, నిందితులకు సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఎస్హెచ్వో పాత్రపైనా ఉన్నతాధికారులకు అన్ని వివరాలు అందాయి. -
సింగరేణి అధికారులకు పీఆర్పీ
● గ్రీన్సిగ్నల్ ఇచ్చిన సీఎం కార్యాలయం ఏడాది చెల్లింపులు(రూ.కోట్లలో) 2022–23 110 2023–24 170 గోదావరిఖని: సింగరేణిలోని 2,500 మంది అధికారులకు రెండేళ్ల పీఆర్పీ చెల్లించేందుకు గ్రీన్సిగ్నల్ లభించింది. ఈమేరకు ఫెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్(పీఆర్పీ) చెల్లింపులకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ ఫైల్పై సోమవారం సీఎం సంతకం చేసినట్లు చెబుతున్నారు. పీఆర్పీ కోసం అధికారుల సంఘం నాయకులు సింగరేణిలో కొద్దిరోజులుగా దశలవారీగా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల మంచిర్యాల జిల్లాలో జరిగిన రక్షణ వార్షికోత్సవంలో అధికారులకు అతి త్వరలో పీఆర్పీ చెల్లిస్తామని సింగరేణీ సీఎండీ బలరాం హామీ ఇచ్చారు. దీనిపై దృష్టి సారించిన ఆయన.. ఫైల్ కదలికలో వేగం పెంచారు. మూడు రోజుల క్రితం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క వద్ద ఫైల్కు క్లియరెన్స్ లభించింది. మరో రెండు రోజుల్లో యాజమాన్యం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుంది. కాగా, ఒక్కో అధికారి సీనియార్టీ, హోదాను బట్టి సుమారు రూ.2 లక్షల నుంచి రూ. రూ.10లక్షల వరకు పీఆర్పీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. కాగా 2007–2014 ఆర్థిక సంవత్సరంలో రావాల్సిన పీఆర్పీ రూ.35కోట్లు కూడా చెల్లించేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
వ్యాపారాభివృద్ధికే రోడ్ల విస్తరణ
● ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ కోల్సిటీ/యైటింక్లయిన్కాలనీ/రామగుండం: వ్యా పారాభివృద్ధి కోసమే నగరంలో రోడ్ల విస్తరణ చేపట్టామని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నా రు. రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో రూ.4.83 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సోమవారం శంకుస్థాపన చేశారు. భూగర్భ డ్రైనేజీలు, అదనపు తరగతి గదులు, అ సంపూర్తి పనులు ఇందులో ఉన్నాయి. బల్దియా క మిషనర్ అరుణశ్రీ ఎమ్మెల్యే వెంట ఉన్నారు. ఠాకూ ర్ మాట్లాడుతూ, సింగరేణి క్వార్టర్లతో సంబంధం లేకుండా పేద, మధ్య, ధనిక వర్గాలు, రిటైర్డ్ కార్మికులు అధికంగా ఉండే మార్కండేయకాలనీలో కనీ స సదుపాయాల కోసం నిధులు మంజూరు చేయించామన్నారు. అందరికీ అన్నివ్యాధులకు వైద్యసేవలు అందుబాటులో ఉండేలా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మరోరెండు భవన బ్లాకులు సిద్ధం చేయిస్తున్నామని అన్నారు. గోదావరిఖని – సెంటినరీకాలనీ మధ్య ఫోర్లేన్ రోడ్డు నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. బల్దియా డీఈలు షాభాజ్, శాంతి స్వరూప్, జమీల్, ఏఈలు మీర్, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్, ఎంఈవో మల్లేశం, మాజీ కార్పొరేటర్లు మహంకాళి స్వామి, బొంతల రాజేశ్, శంకర్ నాయక్, సాగంటి శంకర్, కొలిపాక సుజాత, మెప్మా టీఎంసీ మౌనిక, సీవోలు ఊర్మిళ, శ్వేత, శమంత పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా
మంథని: తమ డిమాండ్లు పరిష్కరించాలని అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లు సో మవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదు ట ధర్నా చేశారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జ్యోతి మాట్లాడుతూ నూత న జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ నిర్ణయం సరికాదన్నారు. దీనిద్వారా అంగన్వాడీ కేంద్రాలు నీరుగారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆమె కోరారు. ధర్నా సమాచారం మంత్రి శ్రీధర్బాబు దృష్టికి తీసుకెళ్లడంతో సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల అధ్యక్షులు సత్యవాణి, వనజారాణి, నాయకులు పద్మ, బూడిద గణేశ్, శ్యామల, రామలక్ష్మి, శ్రీకళ, శాలిని, మంజు తదితరులు ఉన్నారు. -
సులభంగా అప్లోడ్
మూగజీవాలకు మెరుగైన వైద్యాన్ని సకాలంలో అందించేందుకు ఏఐ టెక్నాలజీ ద్వారా రూపొందించిన ఆరోగ్యరేఖ యాప్ ఉపకరిస్తుంది. పశువు ఫొటో తీసి అప్లోడ్ చేస్తే వ్యాధి వివరాలు, నివారణ చర్యలు, సమీపంలోని పశువైద్యాధికారి సెల్ నంబరు సహా పూర్తిసమాచారం వస్తుంది. – కుమార్, గోపాలమిత్ర, రామగిరి అవగాహన కల్పిస్తాం రాష్ట్రంలోనే తొలిసారి మంత్రి శ్రీధర్బాబు, కలెక్టర్ శ్రీహర్ష చొరవ చూపడంతోనే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టాం. సత్ఫలితాలు రావడంతో జిల్లా వ్యాప్తంగా అమలు చేసేందుకు నిర్ణయించాం. పాడిరైతుల్లో అవగాహన కల్పిస్తాం. – విజయభాస్కర్, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి పాడిరైతుకు మేలు పశువులకు వ్యాధి వస్తే పాడిరైతుకు వ్యయ, ప్రయాసలు లేకుండా మెరుగైన వైద్యసేవలు సకాలంలో అందించాలన్నదే లక్ష్యం. ఎదకొచ్చిన పశువులకు మేలుజాతి పశువులు ఉత్పత్తి అయ్యేలా కృత్రిమ గర్భాధారణ చేసేందుకూ అవకాశం ఉంది. ఏఐ వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించాలి. – కోయ శ్రీహర్ష, కలెక్టర్ -
సమస్యలకు సత్వర పరిష్కారం
● కలెక్టర్ కోయ శ్రీహర్ష ● ప్రజావాణి ద్వారా అర్జీల స్వీకరణ పెద్దపల్లిరూరల్: జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల నుంచి తరలివచ్చే ప్రజలు అందించిన సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లావాసులు అందించిన వినతులను కలెక్టర్ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్ వేణు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. వాటి పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. కార్యక్రమంలో పలు శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రాయికల్ శివాలయంలో చోరీ
పోలీస్ల అదుపులో నిందితుడు? రాయికల్: రాయికల్ పట్టణంలోని శివాలయంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోని హుండిని పగలగొట్టి నగదును దొంగలించారు. దొంగ ముందస్తుగా సీసీ కెమెరాలు పగలగొట్టి దొంగతనానికి ప్రయత్నించాడు. దానికి ముందు రికార్డయిన వీడియో ఆధారంగా ఆదివారం సదరు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇల్లంతకుంట(మానకొండూర్):ఓ మైనర్ బాలిక నగ్న వీడియోలు చిత్రీకరించి, ఇతరులకు పంపించిన యువకుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. బాలిక నగ్న వీడియోలు తీసిన యువకుడు గతంలో గంజాయి కేసులో నిందితుడు అని ప్రచారంలో ఉంది. ఈ వీడియోలు ప్రస్తుతం వెలుగుచూడడంతో బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. సదరు యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇటీవల మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక ఆత్మహత్య ఉదంతం మరిచిపోకముందే మరో మైనర్ నగ్న వీడియోలు చిత్రీకరించినట్లు వెలుగులోకి రావడం మండలంలో చర్చకు దారితీసింది. పిడుగుపాటుకు కాలిపోయిన ట్రాక్టర్ సుల్తానాబాద్రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున భారీవర్షం కురిసింది. ఈక్రమంలో పిడుగుపడి ట్రాక్టర్ స్ట్రీరింగ్ కాలిపోయింది. గ్రామంలోని చెట్టుపై పిడుగుపడగా దానికిందనే పార్క్చేసిఉన్న గ్రామపంచాయతీకి చెందిన ట్రాక్టర్ కాలిపోయింది. -
అద్భుత కట్టడం.. నాగులపేట సైఫన్
● ఆసియాలోనే అరుదైన కట్టడంగా గుర్తింపు కోరుట్ల రూరల్: ఇంజినీరింగ్ పనితీరుకు అద్భుత కట్టడంగా నిలుస్తుంది కోరుట్ల మండలం నాగులపేట వద్దగల సైఫన్. ఇది ఆసియాలో అరుదైన కట్టడాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అప్పటి సూపరింటెండెంట్ ఇంజనీర్ పీఎస్.రామకృష్ణారాజు సైఫన్ నిర్మాణానికి డిజైనింగ్ చేశారు. నాగులపేట వద్ద కాకతీయ కాలువ సుమారు 100 మీటర్ల వెడల్పుతో ప్రవహించే పెద్దవాగు దాటాల్సి ఉంటుంది. వాగుకు అడ్డంగా కాలువ నిర్మించడం కష్టం కావటంతో వాగుపై నుంచే 100 మీటర్ల సొరంగమార్గం తవ్వి.. ఎప్పటిలాగే వాగు ప్రవహించేలా డిజైన్ చేశారు. 100 మీటర్ల పొడవు.. సుమారు 30 ఫీట్ల లోతు.. 25 ఫీట్ల వెడల్పుతో సైఫన్ నిర్మాణం చేపట్టారు. సైఫన్ సొరంగమార్గం ద్వారా కాలువ నీరు.. వాగులో వరద ప్రవాహం.. ఈ అద్భుత కట్టడం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. -
ఉత్సాహంగా రోలార్ స్కేటింగ్ పోటీలు
కరీంనగర్స్పోర్ట్స్/కరీంనగర్రూరల్: అంబేడ్క ర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ఉ మ్మ డి జిల్లాస్థాయి రోలార్ స్కేటింగ్ పోటీలకు స్పందన వచ్చింది. అల్ఫోర్స్ విద్యాసంస్థల అ ధినేత వి.నరేందర్రెడ్డి పోటీలు ప్రారంభించా రు. క్రీడలతో విద్యార్థులకు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. అలాగే బొమ్మకల్లోని బిర్లా ఇంటర్నేషనల్ స్కూల్లో రోడ్ ఈవెంట్ స్టేట్ సెలక్షన్ పోటీలు నిర్వహించారు. స్కేటింగ్ బాధ్యులు విజయభాస్కర్, గట్టు అనిల్కుమార్గౌడ్, డి.వీరన్న, కృష్ణమూర్తిగౌడ్, సాయినరహరి తదితరులు పాల్గొన్నారు. కబడ్డీ పోటీలకు స్పందనకరీంనగర్స్పోర్ట్స్: అంబేడ్కర్ స్టేడియంలో ఆది వారం నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీలకు స్పందన వచ్చింది. వివిధ మండలాల నుంచి సుమారు 150 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. అంతకుముందు తెలంగాణ కబడ్డీ సంఘం ఉపాధ్యక్షుడు సీహెచ్.సంపత్రావు పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ఈ పోటీల్లో రాణించిన క్రీడాకారులను ఈ నెల 25 నుంచి నిజామాబాద్ జిల్లా ముప్కల్ మండలంలో జరిగే రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కబడ్డీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర ఎల్లయ్యగౌడ్, సీహెచ్.మల్లేశ్, ప్రధాన కార్యదర్శి బుర్ర మల్లేశ్గౌడ్, పెటా కార్యదర్శి ఆడెపు శ్రీనివాస్, సీనియర్ క్రీడాకారులు మాధవరెడ్డి, నరేశ్, తదితరులు పాల్గొన్నారు. -
పట్టపగలు వివాహిత దారుణ హత్య
● కుటుంబ కలహాలే కారణం ● భార్యను చంపిన భర్త రామగిరి(మంథని): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూర్ గ్రామపంచాయతీ పరిధి వకీల్పల్లి ప్లా ట్స్ లో ఆదివారం పూసల రమాదేవి ఉర ఫ్ ప్రశాంతి(35) దారుణ హత్యకు గు రైంది. స్థానికుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా రెడ్డికాలనీకి చెందిన రమాదేవి ఉరఫ్ ప్ర శాంతిని పన్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని వకీల్పల్లి ప్లాట్స్కాలనీలో నివాసం ఉండే పూసల కృపాకర్ సుమారు 13 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కు మారుడు జాన్సన్, కుమార్తెలు జోషిత(9), జ్యోత్స్న ఉన్నా రు. ఏడాదిగా వీరి మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నా యి. అప్పటినుంచి భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. రమాదేవి ఆదివారం కృపాకర్ ఇంటికి చేరుకుంది. ఈక్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో కత్తితో రమాదేవిపై కృపాకర్ దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఎస్సై శ్రీనివాస్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్య అనంతరం కృపాకర్, అతడి తల్లిదండ్రులు పరారయ్యారు. అయితే, తల్లిదండ్రులు మంథని పోలీసుస్టేషన్లో ఉన్నట్లు సమాచారం. పోలీసులు కృపాకర్ కోసం ఆరా తీస్తున్నారు. కుటుంబ కలహాలే హత్యకు కారణామని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎస్సై వివరించారు. పంచాయితీయే ప్రాణం తీసిందా? ఏడాదిగా వేర్వేరుగా ఉంటున్న రమాదేవి ఆదివారం అత్తగారింటికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. సెంటినరికాలనీకి చెందిన ఒకమతపెద్ద ద్వారా కృపాకర్ రాయబరం చేయడంతో రమాదేవిని అక్కడకు వచ్చిందని, మతపెద్ద సమక్షంలో పంచాయితీ జరిగిందని తెలిసింది. ఆ తర్వాత రమాదేవి వకీల్పల్లి ప్లాట్స్కాలనీకి చేరుగా.. భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని, ఈక్రమంలోన అత్తగారింటి ఎదుట రోడ్డుపై విగతజీవిగా పడిపోయిందని స్థానికులు కంటతడి పెట్టారు. క్షణికావేశంలో భార్యను చంపండంతో ముగ్గురు పిల్లలు రోడ్డున పడ్డారని ఆవేదన చెందారు. కుటుంబ కలహాలు పచ్చనికాపురంలో చిచ్చుపెట్టడంతో పిల్లలు దిక్కులేనివారయ్యారు. -
బీరుసీసాలతో యువకుల దాడులు
సుల్తానాబాద్రూరల్: మద్యం మత్తులో యువకులు బీరుసీసాలతో స్పరస్పరం దా డులు చేసుకున్నారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని ఓ వైన్స్ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సుల్తానాబాద్లోని మార్కెండేయకాలనీకి చెందిన యువకులు అనిల్, టోన్ ఓ వైన్స్ వద్ద మద్యం తాగారు. మద్యం మత్తులో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహంతో ఇద్దరూ బీరుసీసాలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలుకాగా స్థానికులు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వైద్యచికిత్స అందిస్తున్నారు. ● మద్యం మత్తులో వీరంగం ● ఇద్దరికి తీవ్రగాయాలు -
అనంతారం అద్భుతం
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండలం అనంతరం ప్రాజెక్టు 500 ఏళ్ల క్రితం నిర్మించారు. ప్రాజెక్టు ఆయకట్టు దాదాపు 800 ఎకరాల వరకు ఉంటుంది. అనంతారం ప్రాజె క్టు నీటితో నిండితే బిక్కవాగు పరివాహక ప్రాంతమైన అనంతారం, రహీంఖాన్పేట, ఇల్లంతకుంట, వంతడుపుల, నర్సక్కపేట గ్రామాల్లోని పంటలకు సమృద్ధిగా సాగునీరు లభిస్తుంది. డాక్ బంగ్లా అనంతారం ప్రాజెక్టు పరిధిలోని డాక్ బంగ్లాను రెండెరాల విస్తీర్ణంలో నిర్మించారు. ప్రాజెక్టు పరి శీలనకు వచ్చిన ఇరిగేషన్ అధికారులు ఇక్కడే సే ద తీరేవారు. డాక్బంగ్లా ఇల్లంతకుంట మండలంలో ప్రాముఖ్యత సంతరించుకుని ఉంది. -
చరిత్రకు సాక్ష్యం ఎలగందుల ఖిలా
కొత్తపల్లి(కరీంనగర్): చరిత్రకు సాక్ష్యంగా కొత్తపల్లి మండలంలోని ఎలగందుల ఖిలా నిలుస్తోంది. కాకతీయులు, కులీకుతుబ్షాహీల శిల్ప కళావైభవానికి ప్రతీకగా ఖిలాలోని కట్టడాలు నిలుస్తున్నాయి. ఈ కోటలో టర్కీ, ఫ్రెంచ్ ఇంజినీర్ల ప్రభావం కనిపిస్తోంది. ఫ్రెంచి, టర్కీ ఇంజినీర్ల ప్రభావంతో ఈ కోట అనేక విషయాల్లో మధ్యయుగపు ఐరోపా శైలిని పోలి ఉంది. 200 అడుగుల ఎత్తు, 2.5 మైళ్ల విస్తీర్ణంలో మానేరునదిని ఆనుకొని ఉంది. ఎలగందుల కోటను కాకతీయులు 1083– 1323 మధ్య నిర్మించారు. ఈ కోటకు మొదటి పేరు ‘వెలిగుండుల’. దీనిని ముసునూరి నాయకులు, రాచర్ల పద్మనాయకులు ధృడంగా తయారు చేశారు. కోట చుట్టూ సుమారు 5 కిలోమీటర్ల వెడల్పు, 4 మీటర్ల లోతు నీటి కందకాన్ని తవ్వించి మొసళ్లతో నింపి శత్రువుల నుంచి రక్షణగా ఏర్పాటు చేశారు. 16వ శతాబ్దంలో ఈ కోటను కుతుబ్షాహీలు ఆక్రమించారు. తర్వాత మొఘల్ సామ్రాజ్యాధీనంలోకి వచ్చింది. హైదరాబాద్ నిజాం పాలనలో నిజాం ఉల్ ముల్క్ అసఫ్జాహి (1724–1748) కాలంలో అమీన్ఖాన్ ఈ కోట ఖిలేదార్గా బాధ్యతలు చేపట్టారు. 1754లో నవాబ్ సలాబత్ జంగ్ కాలంలో మీర్జా ఇబ్రహీం దంసా ఈ కోటను పునర్నిర్మించారు. 1905లో ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ జిల్లా కేంద్రాన్ని ఎలగందుల్ నుంచి కరీంనగర్కు మార్చారు. కోటలో నీలకంఠస్వామి, లక్ష్మీనరసింహస్వామి ఆలయాలతోపాటు మసీదు హిందూ, ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయి. ఎలగందుల ఖిలా -
ప్రాజెక్టుల ల్యాండ్మార్క్ మిడ్మానేరు
బోయినపల్లి(చొప్పదండి): తెలంగాణ ప్రాజెక్టులకు ల్యాండ్మార్క్లా మధ్యమానేరు నిలుస్తోంది. ఎగువ మానేరు, దిగువ మానేరుకు మధ్యలో ఉన్న మిడ్మానేరు 5.8 లక్షల క్యూసెక్కుల వరదపోటును తట్టుకుంటుంది. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద శ్రీరాజరాజేశ్వర(మధ్యమానేరు) ప్రాజెక్టును 27.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. సుమారు రూ.750 కోట్ల అంచనాలతో నిర్మించారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలో సుమారు 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందకు 2006లో దివంగత సీఎం వైఎస్సార్ ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజినీర్లందరూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారే. ప్రాజెక్టు మొత్తం 32 సీసీ కెమెరాల నిఘాలో ఉంటుంది. 25 రేడియల్ గేట్లు, పవర్ ప్యాక్స్, లోకల్ కంట్రోల్ ప్యానల్, రిమోట్ కంట్రోల్ ప్యానల్స్ వంటి కొత్త పద్ధతులు ఉన్నాయి. ప్రాజెక్టులో 4 రివర్స్ స్లూయిస్లు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులో చేరిన సిల్ట్ రివర్స్స్లూయిస్ల ద్వారా బయటకు వెళ్తుంది. ప్రాజెక్టు నిర్మాణంలో సిమెంట్, కాంక్రిట్, మట్టి, రౌతు, స్టీల్, వాడారు. ప్రాజెక్టు అడుగు భాగానికి వెళ్లడానికి గ్యాలరీని ఏర్పాటు చేశారు. దీనిలోకి వెళ్లడానికి మెట్లు, అధునాతన లిఫ్ట్ ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులోకి వచ్చే నీరు నిల్వ చేయడం వల్ల ఎయిర్ వెళ్లడానికి గ్యాలరీలో పరికరాలు అమర్చారు. 500 మీటర్ల మేర స్పిల్వే, 10 కిలోమీటర్ల మేర కట్టను నిర్మించారు. -
కనుపాపను కాపాడండి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఇంట్లో చలాకిగా తిరగాల్సిన చిన్నారి ఆస్పత్రి బెడ్పై కదలలేని స్థితిలో ఉంది. ఆడపిల్ల పుట్టగానే సంతోషించిన తల్లిదండ్రులకు ఆమెకు వచ్చిన అనారోగ్య సమస్యతో వేదన మొదలైంది. చక్కగా బడికి వెళ్లే చిన్నారి వెన్నుముక సమస్యతో కాళ్లు చేతులు పడిపోవడంతో మంచానికే పరిమితమైంది. ఆపరేషన్ చేస్తే నడుస్తుందన్న వైద్యుల సూచనలతో హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సకు రూ.4లక్షలు అవసరం ఉంటాయని వైద్యులు తెలపడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్కు చెందిన మిడిదొడ్డి భాగ్య–మల్లేశం దంపతులకు ఐదో తరగతి చదువుతున్న కూతురు సాత్విక ఉంది. నిత్యం చలాకీగా బడికి వెళ్లే చిన్నారి హఠాత్తుగా అనారోగ్యానికి గురైంది. నడవలేని స్థితిలో మంచానికే పరిమితం కావడంతో వైద్యులను సంప్రదించారు. పరీక్షలు చేసిన వైద్యులు వెన్నుపూసలో సమస్య ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్కు రూ.4లక్షలు ఖర్చు అవుతుందని తెలపడంతో చేతిలో చిల్లిగవ్వలేని వారు ఆ డబ్బులు ఎలా సమకూర్చాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలోనే కలెక్టర్ సందీప్కుమార్ ఝాను కలవగా.. స్పందించిన కలెక్టర్ రూ.74,938 చెక్కును అందించారు. దీంతో వారు చిన్నారిని నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. శస్త్రచికిత్సకు ఈ మొత్తం సరిపోకపోవడంతో దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సాయం చేయాల్సిన దాతలు మిడిదొడ్డి భాగ్యకు 96181 51488లో సాయం చేయాలని వేడుకుంటున్నారు. వెన్నుపూస సమస్యతో బాధపడుతున్న విద్యార్థిని బడిలో ఉండాల్సిన చిన్నారి ఆస్పత్రిలో.. నిమ్స్లో చికిత్స పొందుతున్న సాత్విక శస్త్రచికిత్సకు రూ.4లక్షలు అవసరం ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు -
బోనస్ కోసం నిరీక్షణ
సాక్షి పెద్దపల్లి: యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తయి సుమారు మూడు నెలలు దాటింది. అయినా, సన్నరకం ధాన్యం తాలూకు బోనస్ రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమకాలేదు. ఇదే అదనుగా రైతుల నుంచి సీడ్ వడ్లు కొనుగోలు చేసిన పలు కంపెనీలు, మిల్లర్లు సైతం బోనస్ చెల్లించడం లేదు. దీంతో చేతిలో డబ్బుల్లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే బస్తాపై రెండు కేజీల నుంచి మూడు కేజీల వరకు కోత పెట్టి అడ్డగోలుగా దోచుకుంటున్న రైస్ మిల్లర్ల బారినుంచి తప్పించుకునేందుకు రైతులు సీడ్వడ్లు సాగుచేసైనా లబ్ధిపొందుతామనుకుంటే.. ఇక్కడ కూడా మోసానికి గురికాక తప్పడం లేదు. సీడ్ సాగు చేసిన రైతులకు బోనస్ చెల్లిస్తామని మూడు నెలల క్రితమే సన్నవడ్లు సేకరించిన మిల్లర్లు.. ఇప్పటివరకు డబ్బులు చెల్లించకుండా ఎగనామం పెట్టేందుకు సిద్ధమవుతున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాభం సీడ్ మిల్లర్లకే. సాధారణంగా రైతుల నుంచి సేకరించిన సన్నరకం ధాన్యాన్ని శుద్ధి చేసి 25 కిలోల చొప్పున బ్యాగుల్లో నింపి బస్తాకు కొంత లాభం చూసుకొని వ్యాపారు లు ధర నిర్ణయించి విక్రయిస్తుంటారు. గతేడాది 25 కిలోల విత్తన సంచిని లోకల్ మార్కెట్లో రూ.900 నుంచి రూ.950 ధరతో విక్రయించగా ఇతర రాష్ట్రాలకు రూ.1,249 ధర ముద్రించి విక్రయించారు. గతేడాది ప్రభుత్వం బోనస్ ప్రకటించలేదు. ఈ ఏడాది బోనస్ ప్రకటించింది. దీంతో రైతులు సీడ్ మిల్లు యజమానులతో ప్రభుత్వం ఇస్తున్నట్లు బోనస్ ఇవ్వాలని, క్వింటాల్కు రూ.2,820 చెల్లిస్తేనే ధాన్యం విక్రయిస్తామని రైతులు తేల్చి చెప్పారు. దీంతో రైస్మిల్లు యజమానులు ధర పెంచారు. వ్యాపారులకు 25 కిలోల విత్తన సంచికి ధర పెంచి రూ.1,050 నుంచి రూ.1,100 వరకు విక్రయించారు. అంటే.. క్వింటాల్కు రూ.600 లాభంతో అమ్మకాలు సాగిస్తున్నారు. కానీ, రైతులకు ఇచ్చే బోనస్ మాత్రం చెల్లించడం లేదు. ఎగవేతకు యత్నం.. ముందుగా క్వింటాల్కు రూ.2,820 ధర ఇస్తానని చెప్పి ఇప్పుడేమో తగ్గించి ఇస్తామంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు అమ్మిన వడ్లకు డబ్బులు ఇవ్వకుండా నెలల తరబడి జాప్యం చేస్తుండగా.. మరోవైపు బోనస్ విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. క్వింటాల్కు రూ.2,820కి బదులు రూ.2,500 మాత్రమే ఇస్తామని అంటున్నారని, మరికొందరు మద్దతు ధర రూ.2,320 ఇస్తామంటున్నారని పేర్కొంటున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో సీడ్ వరి సాగవుతోంది. ఇక్కడ పండిన సన్నవడ్ల విత్తనాలకు నాణ్యతపరంగా ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. ఏటా ఇక్కడి సీడ్మిల్లు వ్యాపారులు రైతుల నుంచి ధాన్యం సేకరించి, మిల్లుల్లో శుద్ధి చేసి విత్తనాలుగా విక్రయిస్తుంటారు. ఈఏడాది యాసంగిలోనూ సాగు చేసిన వరిలో సగానికిపైగా విత్తనాల కోసం ధాన్యం సేకరించారు. అయితే, ప్రభుత్వం సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడంతో మద్దతు ధర రూ.2,320కు బోనస్ కలిపి రూ.2,820 ఇస్తామని చెప్పి సుమారు 5 వేల మంది రైతుల నుంచి దాదాపు 40 వేల టన్నుల వరకు ధాన్యం తీసుకున్నారు. డబ్బులు అత్యవసరం ఉన్న కొందరు రైతులకు క్వింటాల్కు రూ.2,500 చొప్పున చెల్లించగా.. మిగతా రైతులకు ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదు. జిల్లా యంత్రాంగం చొరవ చూపితేనే తమకు న్యాయం జరుగుతుందని పలువురు అన్నదాతలు వేడుకుంటున్నారు.జిల్లా సమాచారం.. ధాన్యం కొనుగోలు కేంద్రాలు 315 సన్నధాన్యం విక్రయించిన రైతులు 77,761 జమకావాల్సిన బోనస్(రూ.కోట్లలో) 39.8 సీడ్ సాగు చేసిన రైతులు(సుమారు) 5,000 మిలర్లకు విక్రయించిన ధాన్యం 40,000 (మెట్రిక్ టన్నుల్లో) -
హక్కుల సాధనలో ఐఎన్టీయూసీ విఫలం
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ ఉద్యోగుల హ క్కుల సాధనలో ఐఎన్టీయూసీ విఫలమైందని సీ ఐటీయూ అనుబంధ ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఎన్.భిక్షపతి విమర్శించారు. పీటీఎస్లోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. ఈనెల 25న ఎన్టీపీసీ ఉద్యోగ గుర్తింపు సంఘం ఎన్నికల్లో సీఐటీయూ నక్షత్రం గుర్తుకుఓ టు వేయాలని అభ్యర్థించారు. ఇప్పటికే రెండుసార్లు గెలిచిన ఐఎన్టీయూసీ అనుబంధ ఎన్టీపీసీ మజ్దూ ర్ యూనియన్.. అవినీతి, అక్రమాలకు పాల్పడు తోందని ధ్వజమెత్తారు. ఉద్యోగానంతరం వైద్య సౌ కర్యం, పీఆర్ఎంఎస్ వర్తింపజేసేలా మార్పులు తీ సుకొస్తామని, విద్యార్హతలను బట్టి ఫాస్ట్ట్రాక్ ప్ర మోషన్ పాలసీ అమలు చేయిస్తామని, కిందిస్థాయి ఉద్యోగులకు కేరీర్ ప్రోగ్రాం అమలు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యనిర్వాక అధ్యక్షుడు భూమయ్య, ప్రధాన కార్యదర్శి ఈదునూరి రాజేశ్వర్, కోశాధికా రి భిక్షపతి, హెచ్ఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ ఉపేందర్, సీఐటీయూ జిల్లా కోశాధికారి రామాచారి, నాయకులు రాజు, అశోక్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్
● ప్రతిభ చూపిన స్కూల్కు రూ.లక్ష సాయం సుల్తానాబాద్(పెద్దపల్లి): నాణ్యమైన బోధన, పరిసరాల పరిశుభ్రత, విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ.. ఇలాంటి అంశాల్లో ప్రతిభ చూపిన ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం రేటింగ్ ఇస్తోంది. సుమారు ఐదేళ్లక్రితం నిలిచిన ఈ పథకాన్ని ఇటీవల మళ్లీ పునరుద్ధరించింది. జిల్లాలో 543 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, అందులో 85,785 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీలు స్కూళ్లలో తనిఖీలు చేసి మార్కులు కేటాయిస్తాయి. ఐదు పాయింట్లు సాధించిన పాఠశాలలకు కేంద్రప్రభుత్వం నేరుగా పురస్కారాలు అందింస్తుంది. జిల్లాస్థాయిలో కలెక్టర్, డీఈవో, జిల్లా వైద్యాధికారి, డీఈఈ, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, ఉపాధ్యాయులతో కమిటీ ఏర్పాటు చేస్తారు. వచ్చే అక్టోబర్లో ఈ కమిటీ స్కూళ్లను తనిఖీ చేసి మార్కులు కేటాయిస్తుంది. 30 వరకు గడువు రేటింగ్ సాధించి పురస్కారాలు అందుకునేందుకు ప్రభుత్వ పాఠశాలలు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. ఇందుకోసం ఈనెల 30వ తేదీ వరకు గడువు ఉంది. దరఖాస్తులను జిల్లాస్థాయిలో కమిటీ పరిశీలించి రేటింగ్ ఇస్తుంది. జాతీయస్థాయిలో ఎంపికై తే రూ.లక్ష ప్రోత్సాహకం అందుతుంది. – మాధవి, డీఈవో -
ఉద్యోగుల సంక్షేమానికి కృషి
● ఎన్టీపీసీ ఎన్బీసీ సభ్యుడు సుంకరి మల్లేశం జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ ఉద్యోగుల సంక్షేమానికి బీఎంఎస్ అనుబంధ ఎన్టీపీసీ కార్మిక సంఘ్ కృషి చేస్తుందని ఎన్టీపీసీ ఎన్బీసీ సభ్యుడు, బీఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు సుంకరి మల్లేశం అన్నారు. ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్ జ్యోతిభవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూ నిర్వాసిత కోటాలో ఉద్యోగం పొందిన ఉద్యోగులకు పీఆర్ఎంఎస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కేరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(సీడీపీ)లో ప్రత్యేక శిక్షణ అందించి పదోన్నతులు కల్పించాలని కోరారు. గతంలో ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉండేదని, ప్రస్తుతం ఆ సంఖ్య వందలకు పడిపోయిందని అన్నారు. ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో యాజమాన్యానికి తెలియజేశామని ఆయన వెల్లడించారు. 2027లో జరిగే వేతన సవరణలో ప్రత్యేక భాగస్వామిగా నిలిచేందుకు బీఎంఎస్ను గెలిపించాలని ఆయన కోరారు. సమావేశంలో బీఎంఎస్ అనుభంధ ఎన్టీపీసీ కార్మిక సంఘ్ అధ్యక్షుడు కేతిరెడ్డి భాస్కర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి సాగర్ రాజు, నాయకులు బండారి కనకయ్య, పోగుల స్వామి, చల్లా సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్, సతీశ్కుమార్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
కంపెనీ విత్తనాలు వేసిన
గోపరపల్లిలో వరుణ్ సీడ్ కంపెనీ విత్తనాలతో పంట వేసిన. బోనస్ ఇస్తాం అంటేనే దొడ్డువడ్లు పక్కకు పెట్టి సీడ్ వడ్లు సాగు చేసిన. కింటాల్కు బోనస్ రూ.500 ఇస్తానన్నారు. ప్రభుత్వం బోనస్ ఇవ్వకపోవడంతో కంపెనీ వాళ్లు సైతం బోనస్ ఎగవేయడానికి ప్రయత్నిస్తున్నారు. – కర్రే ప్రభాకర్రెడ్డి, రైతు, గోపరపల్లి అధికారులు ఇప్పించాలి నాకున్న పదెకరాల్లో వరుణ్ కంపెనీ సీడ్ వరి సాగు చేసిన. పెట్టుబడి రూ.3.60లక్షలు అయ్యింది. క్వింటాల్కు బోనస్తో కలిపి రూ.2,820 ఇస్తామన్నరు. ఇప్పుడేమో ప్రభుత్వం బోనస్ ఇవ్వడం లేదు కాబట్టి మేము ఇవ్వమంటున్నరు. అధికారులే బోనస్ ఇప్పించాలె. – అమ్ముల మల్లేశ్, రైతు, హరిపురం -
అవగాహన లేక.. సాయం అందక
రామగుండం: కుటుంబాన్ని పోషించే యజమాని ఆకస్మికంగా మరణిస్తే.. ఆ కుటుంబానికి ఆర్థికంగా బాసటగా నిలిచేందుకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం – ఎన్ఎఫ్బీఎస్)ను కేంద్రప్రభుత్వం అమలు చేస్తోంది. దీనిద్వారా బాధిత కుటుంబానికి రూ.ఇరవై వేల సాయం అందుతుంది. 2017లోనే ఈ పథకం అమలులోకి వచ్చింది. అయితే, దీనిపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన లేక ప్రభుత్వ ఆశయం నెరవేరడంలేదు. అంతేకాదు.. ఆ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు బాధితులూ ఆసక్తి చూపడంలేదు. కుటుంబ సభ్యుల ధ్రువీకరణపత్రం జారీ విషయంలో రెవెన్యూ అధికారుల ద్వారా ఎదురయ్యే ఇబ్బందులు ఇందుకు కారణమవుతోంది. ఏటా రూ.7వేల మందికి ప్రయోజనం కలిగేలా ఎన్ఎఫ్బీఎస్ ద్వారా ఏటా 7,794 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేలా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్థానికంగా ఉండే ఐకేపీ ప్రతినిధులు చెబుతున్నారు. వివిధ ప్రమాదాల్లో ఏటా లక్షల మంది మృత్యువాత పడుతున్నా.. కేవలం అవగాహన లేక బాధిత కుటుంబాలు ఈ పథకానికి దరఖాస్తు చేయలేకపోతున్నాయి. దీనికి గడువు అంటూ ఏమీ ఉండదని, అర్హులైన వారు దరఖాస్తు చేయాలని అంతర్గాం ఐకేపీ ఏపీఎం సదానందం, సీసీ రాంబాబు తెలిపారు. ఎవరు అర్హులంటే.. -
క్రీడాస్థలం అభివృద్ధికి కృషి
● మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ధర్మారం(ధర్మపురి): మండల కేంద్రంలోని క్రీడా స్థలాన్ని అభివృద్ధి చేస్తామని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ హామీ ఇచ్చారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమీపంలోని క్రీడా స్థలాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు. మంత్రి మాట్లా డుతూ, క్రీడామైదానం లేక యువకులు ఇబ్బందు లు పడుతున్నారన్నారు. ఈ స్థలాన్ని మైనింగ్శాఖ ద్వారా అభివృద్ధి చేయిస్తానని మంత్రి అన్నారు. చుట్టూ ఉన్న బండలు, చెట్లను తొలగించి స్థలం చదును చేయించి అందుబాటులోకి తీసుకొస్తానని తెలిపారు. క్రీడా మైదానం పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తే గ్రామస్తులు వాకింగ్ చేసేందుకు అనువుగా ఉంటుందని అడ్లూరి వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, మాజీ వైస్ చైర్మన్ కాడే సూర్యనారాయణ, మాజీ ఎంపీటీసీ సభ్యుడు తోడేటి రాజలింగయ్య, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సోగాల తిరుపతి, నాయకులు జంగ మహేందర్యాదవ్, ఓరం చిరంజీవి, పాలకుర్తి సాయిగౌడ్, ఎల్లయ్య, పొనవేని స్వామి తదితరులు పాల్గొన్నారు. -
వైకల్యాన్ని జయించి.. స్వయం ఉపాధి ఎంచుకుని ..
● విధిరాతను అధిగమిస్తూ ముందుకు.. ● ఊరూరా తిరుగుతూ పగ్గాల విక్రయం ● ఆదర్శంగా నిలుస్తున్న ‘ఆరుపదుల వ్యక్తి’మంథనిరూరల్: చిన్నతనంలోనే పోలియో బారినపడ్డాడు.. రెండుకాళ్లు చచ్చుబడిపోయినా ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు.. విధిరాతను ఎదురించాడు.. ఆత్మస్థైర్యాన్ని ఆయుధంగా చేసుకున్నాడు.. అడుగు ముందుకు వేశాడు.. ఆరుపదుల వయసులోనూ ఉపాధి మార్గం ఎంచుకున్నాడు.. ఎంతోకొంత సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ఉప్పట్ల గ్రామానికి చెందిన కాసిపేట రాయమల్లు. చిన్నతనంలోనే పోలియో బారినపడి.. రాయమల్లు చిన్నతనంలోనే పోలియో బారినపడ్డాడు. కాళ్లు చచ్చుబడిపోయినా మొక్కవోని ధైర్యం నింపుకుని స్వయం ఉపాధి ఎంచుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక కూడా ఎవరిపైనా ఆధారడకుండా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు ఒక కూతురు, ఒక కుమారుడు ఉండగా పదేళ్ల క్రితమే కూతురుకు వివాహం చేశాడు. కొడుకు హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. పగ్గాలు, బుట్టలు తయారు చేస్తూ.. ఒకప్పుడు సింగరేణి సంస్థలో కార్డు ద్వారా ఇచ్చే బొగ్గును తీసుకువచ్చి అమ్ముకుని కుటుంబాన్ని పోషించేవాడు రాయమల్లు. ఆ తర్వాత చిన్నాచితక పనులు చేసేవాడు. ఇరవై ఆరేళ్లుగా ప్లాస్టిక్ సంచుల దారాలతో పగ్గాలు, బుట్టలు తయారు చేస్తూ విక్రయిస్తున్నాడు. వ్యవసాయం చేసే రైతులు తమ ఎడ్లకు అవసరమైన పగ్గాలు, బుట్టలను రాయమల్లు వద్దే కొనుగోలు చేస్తున్నారు. జతపగ్గం ధర రూ.250తో విక్రయం.. నాలుగు రోజులు కష్టపడితే ఒకజత పగ్గం తయారు అవుతుంది. ప్లాస్టిక్ సంచులను చీరి, దారాలను వేరుచేసి పేని తయారు చేసిన జతపగ్గాలను రూ. 250కు విక్రయిస్తున్నాడు. ఇలా నెలలో పదిజతల పగ్గాలు, పది జతల బుట్టలు తయారు చేస్తేనే కూలి గిట్టుబాటు అవుతుందని రాయమల్లు తెలిపాడు. ఐదు కిలో మీటర్ల పరిధిలో.. సుమారు ఐదు కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలకు రాయమల్లు తన మూడు చక్రాల సైకిల్ సాయంతో తిరుగుతూ పగ్గాలు, బుట్టలు అమ్ముతున్నాడు. ఎడ్లకు పగ్గాలు, మూతికి కట్టే బుట్టలనే ఎక్కువగా వాడుతుంటారు. రాయమల్లు తయారు చేసిన పగ్గాలు, బుట్టలు నాణ్యంగా ఉంటాయని, అందుకే కొనుగోలు చేస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. ఆర్థికసాయం అందించాలి రెండుకాళ్లు చచ్చుబడిపోయినా కుటుంబాన్ని సాకేందుకు ఎంతో కష్టపడుతున్న. ఏ పనులకూ నన్ను ఎవరూ పిలువరు. చేసేదేమీలేక ఉపాధి కోసం పగ్గాలు, బుట్టలు తయారు చేస్తున్న. ప్రభుత్వం, అధికారులు రుణం మంజూరు చేస్తే మరింత పనితనం మెరుగుపర్చుకుంట. మూడు చక్రల సైకిల్ పనిచేయడంలేదు. ప్రభుత్వం సాయం అందించి ఆదుకోవాలి. – కాసిపేట రాయమల్లు, ఉప్పట్ల -
తెల్లవారకముందే క్యూలైన్లో..
సుల్తానాబాద్లో..కాల్వశ్రీరాంపూర్: కూనారంలో.. కాల్వశ్రీరాంపూర్/సుల్తానాబాద్/ ఓదెల (పెద్దపల్లి): యూరియా కోసం రైతులు తెల్లవారక ముందే సింగిల్విండో కార్యాలయాలు, ఆగ్రోస్ కేంద్రాలు, ప్రైవేట్ ఎరువుల దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు. ఆదివారం కూడా అన్నదాతలు అన్ని పనులు వదిలేసి మండల కేంద్రాలకు పరుగులు తీశారు. కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం, ఓదెల మండలం గూడెం, సుల్తానాబాద్ మండలం పూసాలలో అన్నదాతలు ఎరువుల కోసం గంటల తరబడి బారులు తీరి కనిపించారు. -
‘సర్కార్ వైఫల్యమే కారణం’
పెద్దపల్లిరూరల్: రైతు సంక్షేమమే ధ్యేయమంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పాలకులు.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ సరిపడా యూరియా అందించినా రైతులకు పంపిణీ చే యలేని నిస్సహాయస్థితిలో ఉన్నారని బీజేపీ రా ష్ట్ర నాయకుడు గొట్టిముక్కుల సురేశ్రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వరి సా గు చేస్తున్న రైతుల కోసం 6.12లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని రాష్ట్రం వి న్నవించగానే కేంద్రప్రభుత్వం సమకూర్చిందన్నారు. రాష్ట్రంలో 1.76లక్షల నిల్వలు ఉన్నా కొరత ఏర్పడడం సందేహాలకు తావిస్తోందని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకని రైతులకు సరిపడా యూరియా అందించాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ సుల్తానాబాద్ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్, జీఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు కనుకుంట్ల జోగేందర్, నాయకుడు బొడ్డుపల్లి కుమార్ పాల్గొన్నారు. ఐక్య ఉద్యమాలే శరణ్యం గోదావరిఖని: కార్మికుల హక్కుల సాధన కో సం గుర్తింపు యూనియన్ ఏఐటీయూసీ ఐక్య ఉద్యమాలకు ముందుకు రావాలని జీఎల్బీకేఎస్ గౌరవ సలహాదారు టి.శ్రీనివాస్ కోరారు. స్థానిక ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన ము ఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుర్తింపు ఎన్నికల సందర్భంగా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నేతలు.. కార్మికులకు ఆదాయ పన్ను, పెర్క్స్పై ఇన్కంట్యాక్స్ రద్దు, సొంత ఇంటి పథకం, నూతన గనుల ఏర్పాటు, వారసత్వ ఉద్యోగాలు తదితర సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చాయని గుర్తుచేశారు. ఆ హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. హామీల అమలుకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన కోరారు. నాయకులు జె.సీతారామయ్య, ఎ.వెంకన్న, డి.బ్రహ్మానందం, ఎండీ రాసుద్దీన్, గౌని నాగేశ్వరరావు, ఇ.నరేశ్, టి.శ్రీనివాసు, జి.మల్లేశ్, ఎస్.నర్సింగం, ఐ.రాజేశం, ఎం.సిద్దయ్య, కొండపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నేడు బంద్ పాటించాలి జ్యోతినగర్(రామగుండం): మేడిపల్లి సెంటర్లోని నిర్మాణాల కూల్చివేతల్లో పారదర్శకత పాటించాలనే డిమాండ్తో సోమవారం చేపట్టిన పట్టణ బంద్ను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. తొలుత మెయిన్ రోడ్డు వెడల్పు 40 అడుగులు విస్తరించాలని మార్కింగ్ ఇవ్వగా, దానిని 35 అడుగులకు కుదించి మార్కింగ్ ఇచ్చారన్నారు. మున్సిపల్ సిబ్బంది మళ్లీ 40 అడుగుల వరకు విస్తరించాలని, ఈక్రమంలో అవరోధంగా ఉ న్న కట్టటడాలను కూల్చివేయాలనడంతో వ్యా పారులు భయబ్రాంతులకు గురవుతున్నారని మండిపడ్డారు. బల్దియా సిబ్బంది తీరు సరికాదన్నారు. ఈమేరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన పట్టణ బంద్ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ప్రచార పోస్టర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానికులు, నాయకులు పాల్గొన్నారు. మిలాద్ ఉన్ నబీ ర్యాలీ గోదావరిఖనిటౌన్: మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నగరంలో ఆదివారం ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. స్థానిక గాంధీనగర్ మదర్సా నుంచి ప్రధాన చౌరస్తా వరకు ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ నాయకులు మహమ్మద్ నసీర్, షేక్ హజీ అలీ, మహమ్మద్ షరీఫ్, ఉమర్, హబీబ్, గులాం సాబ్రి, గౌస్, కలీమ్, నజీమొద్దీన్, షేక్ అలీ, రియాజ్, ముబీన్, జానీ పాల్గొన్నారు. -
● సమస్యలు పరిష్కరించాలని పలువురి విన్నపం
రామగుండం: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవ, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ గోపాలకృష్ణణ్ శనివా రం స్థానిక రైల్వేస్టేషన్ను సందర్శించారు. అధికారులతో కలిసి ప్రత్యేక రైలులో వారు రామగుండం చేరుకున్నారు. రూ.24 కోట్లతో చేపట్టిన రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు పరిశీలించారు. ఆ ర్జీ–2లోని ఓసీపీ–3ని సందర్శించారు. బొగ్గు ర వాణాపై సింగరేణి అధికారులతో సమీక్షించారు. కాగా, ఈనెల 25న రైల్వేస్టేషన్ను ప్రారంభిస్తార ని తెలిసింది. బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి కందుల సంధ్యారాణి, రైల్వే ప్రజా సంబంధాల ప్ర తినిధి అనుమాస శ్రీనివాస్ తదితరులు జీఎం శ్రీవాస్తవకు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. కుందనపల్లి, పెద్దంపేట రైల్వే ఫ్లైఓవర్లు, ఎక్స్ప్రెస్ రైళ్ల హాల్టింగ్ల విషయమై వినతిపత్రం అందజేశారు. కుందనపల్లి రైల్వేగేట్ టెండర్ పూర్తిచేయించాలని కోరారు. ఆటోల పార్కింగ్ ఫీజు మినహాయించాలని విన్నవించారు. నవజీవన్, స్వర్ణజయంతి, మిలీనియం, గంగా – కావేరి, గరీబ్రథ్, కర్ణాటక సంపర్క్ క్రాంతి, జైపూర్ తదితర సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ క ల్పించాలని కోరారు. పలు యూనియన్ల ప్రతినిధులు ఓవై స్వామి, రాథోడ్ ఆనంద్, వీరన్న, మోజెస్, అజ్మీరా వీరన్ననాయక్ పాల్గొన్నారు. పెద్దపల్లి రైల్వేస్టేషన్ సందర్శన పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి జంక్షన్ను సౌత్ సెంట్ర ల్ రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాత్సవ, డీఆర్ఎం రాధాకృష్ణ సందర్శించారు. అభివృద్ధి పను లను పరిశీలించారు. డీఆర్యూసీసీ సభ్యుడు నారాయణదాస్ తివారీ తదితరులు జీఎం శ్రీవాత్సవను సత్కరించి సమస్యలను విన్నవించారు. -
ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంచలనం రేపిన మె టా క్రిప్టో కరెన్సీ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ వ్యవహారంలో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కట్ల సతీశ్ను పోలీసులు గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కీలక నిందితులుగా ఉన్న దాసరి రాజు, దాసరి రమేశ్, బూర శ్రీధర్, తులసీ ప్రకాశ్ను సీసీఎస్ పోలీసులు అదే రోజు ఉదయం అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే క్రిప్టోలో అధికలాభాలు అంటూ ఉమ్మడి జిల్లాలో దాదాపు రూ.100 కోట్లు కొల్లగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. లాభాల ఆశచూపి.. అధికలాభాల ఆశచూపగానే పోలీసులు, రెవెన్యూ, ప్రభుత్వ టీచర్లు భారీగా పెట్టుబడులు పెట్టారు. వీరిని గతేడాది పలుమార్లు బ్యాంకాక్, మలేషియా, సింగపూర్ తదితర దేశాలకు తీసుకెళ్లారు. ఇలా దాదాపు రూ.100 కోట్ల వరకు వసూలు చేశారని, ఈ డబ్బుతో సూత్రధారుల్లో లోకేశ్ అనే వ్యక్తి ద్వా రా దుబాయ్ తదితర దేశాల్లో పలు వ్యాపారాలు స్థాపించారని బాధితులు ఆరోపించారు. ‘నష్టపోయాం మహాప్రభో.. మా డబ్బులు మాకివ్వాలని’ బాధితులు కోరినా.. ఎవరికీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను వేధించేందుకు లీగల్ టీంను ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. బెదిరింపులు... బ్లాక్మెయిల్ మెటా క్రిప్టోలో చేరిన వారిలో సాధారణ వ్యక్తులు నిలదీస్తే కోర్టుల్లో ప్రైవేటు కేసులు వేశారు. దీనికి కొందరు పోలీసులు కూడా సహకరించడం గమనార్హం. బాధితులు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులైతే బ్లాక్మెయిల్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు విదేశాలకు వెళ్తే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ...అది ఎక్కడా జరగలేదు. అంతేకాదు వారికి విదేశాల్లో అమ్మాయిలతో మసాజ్లు చేయించి వారి వీడియోలు దగ్గర పెట్టుకున్నారు. తమ డబ్బులు తమకు ఇవ్వమని అడిగితే.. ‘నా మీద కేసులు పెడితే.. మీరు అక్రమంగా విదేశాలకు వెళ్లడం, అక్కడ చేసిన పనుల మీద ఎదురుకేసులు పెట్టాల్సి వస్తుందని’ బెదిరింపులకు దిగారు. ఏయే చట్టాల కింద కేసు పెట్టారంటే? మాజీ కార్పొరేటర్ కట్ల సతీశ్ మాటలు నమ్మి నూనావత్ భాస్కర్ మరో 16మంది కలిసి దాదాపు రూ.1.20 కోట్లు డబ్బును మెటాలో పెట్టుబడులుగా పెట్టారు. బాధితుల ఫిర్యాదుతో కరీంనగర్ త్రీటౌన్లో గురువారం రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. అనంతరం అతన్ని రిమాండ్కు తరలించారు. తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్సియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1999 సెక్షన్ (5) కింద కట్ల సతీశ్పై కేసు నమోదు చేశారు. ఇది నాన్బెయిలబుల్. డిపాజిటర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును దుర్వినియోగం చేసిన సందర్భాల్లో ఈ సెక్షన్ను పోలీసులు ప్రయోగిస్తారు. పోలీసుల అభియోగాలు రుజువైతే రూ.లక్ష జరిమానాతోపాటు పదేళ్ల కఠిన కారాగార శిక్ష కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఈ సెక్షన్ ప్రకారం దర్యాప్తులో భాగంగా డిపాజిటర్ల నుంచి సేకరించిన పెట్టుబడులతో కొన్న ఆస్తులను స్వాధీనం చేసుకుని, వాటిని వేలం వేసి బాధితులకు అందజేసే వీలుంది. అదే సమయంలో ఈ కేసు విచారణకు ప్రత్యేక కోర్టు కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటాయి. వీటితోపాటు ద ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్కులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ 1978 సెక్షన్ (3), (4) కూడా పెట్టడం గమనార్హం.దక్షిణ మధ్య రైల్వే జీఎం పర్యటన క్రిప్టో నిందితులపై కఠిన చర్య తీసుకోవాలికరీంనగర్ కార్పొరేషన్: క్రిప్టో కరెన్సీ పేరిట మోసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు ఒక ప్రకటనలో కోరారు. ఈ వ్యవహారంలో ఎంత పెద్దవాళ్లు ఉన్నా విడిచి పెట్టవద్దన్నారు. మెటా ఫండ్ క్రిప్టో కరెన్సీ కేసులో అరెస్టయిన మాజీ కార్పొరేటర్ కట్ల సతీశ్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని పీసీసీ, డీసీసీ అధ్యక్షులకు లేఖ రాసినట్లు తెలిపారు. సతీశ్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడే క్రిప్టో పేరిట డబ్బులు వసూలు చేశాడని అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే కఠిన చర్యలు తీసుకుంటే చాలామంది మోసపోకుండా ఉండేవారని అన్నారు. క్రిప్టో నిందితులపై కఠిన చర్యలు తీసుకుని, ప్రజలకు న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. -
రాజీ పడితేనే మంచిది
మంథని: రాజీకి అవకాశం ఉన్న కే సులను కక్షిదారు లు రాజీ చేసుకోవచ్చని, ఒకసారి లోక్ అదాలత్లో కేసు రాజీ చేసుకుంటే ఇరుపక్షాలు పైకోర్టుకు వెళ్లే అ వకాశం ఉండదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీ త కుంచాల అన్నారు. స్థానిక కోర్టులో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్తో జడ్జి మాట్లాడారు. క్రిమినల్, కుటుంబ తగాదాలు, సివిల్ దావాలు, చెక్బౌన్స్, అన్నదమ్ముల ఆస్తి తగాదాలు వంటి కే సులు లోక్అదాలత్లో పరిష్కరించుకోవచ్చన్నారు. కేసు పరిష్కారమైతే మానసికంగా ప్రశాంతంగా ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా మంథనిలో 271 కేసులు పరిష్కారమయ్యాయి. నందిమేడారంలో 154తోపాటు పెద్దపల్లి, గోదావరిఖని, జూలప ల్లిలోనూ పలు కేసులు పరిష్కారమయ్యాయి. సీని యర్ సివిల్ జడ్జి భవాని, అడిషనల్ జూనియర్ సివి ల్ జడ్జి సుధారాణి, ద్వితీయ శ్రేణి న్యాయాధికారి అ నురాధ, ఆర్డీవో సురేశ్, గోదావరిఖని ఏసీపీ రమేశ్, మంథని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిబాబు, తహసీల్దార్ కుమారస్వామి పాల్గొన్నారు. -
భయం పోయింది
రేడియో జాకీగా మారిన తర్వాత స్టేజీ ఫియర్ పోయి ంది. మాట్లాడేటప్పుడు ఎలాంటి భయం లేకుండా సార్లు చెప్పిన అంశాలను క్లియర్ చెబుతున్న. దీనిద్వారా తెలియని విషయాలు తెలుస్తున్నాయి. – జ్యోత్స్న, 9వ తరగతిఎఫ్ఎం రేడియో ప్రసారాలతో విద్యార్థుల హా జరుశాతం పెరిగింది. క్రమశిక్షణ మెరుగైంది. స్టేజీ ఫియర్ తగ్గింది. చిన్నారులు బాగా మాట్లాడుతున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య స్నేహపూరిత వాతావరణ ఏర్పడింది. సమయం వృథా కాకుండా ఎఫ్ఎం ప్రసారాలు చేస్తున్నాం. – రాజ్కుమార్, ప్రిన్సిపాల్ఎఫ్ఎం ఎంతో ఉపయోగపడుతోంది. మ ధ్యాహ్న భోజ న సమయంలో పాఠశాల అంతా చిందరవందరగా ఉండేది. ఎఫ్ఎంతో మంచి వాతావరణం ఏర్పడింది. వివిధ అంశాలపైనా అవగాహన వస్తోంది. – శ్రీనిధి, 9వ తరగతి -
జర్నలిస్ట్లపై దాడితో సమాజానికి నష్టం
పత్రికలు, జర్నలిస్ట్లను సమాజం కాపాడుకోవాలని కార్మిక సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. ప్రజాసమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న సాక్షి దినపత్రికపై ఏపీ ప్రభు త్వ కక్ష సాధింపు సరికాదన్నారు. ‘సాక్షి’ ఎడి టర్ ధనంజయరెడ్డితోపాటు జర్నలిస్ట్లపై అక్రమ కేసులు పెట్టి భయాందోళనకు గురి చేస్తోందని, ఏపీ ప్రభుత్వ నిరంకుశవైఖరిని ప్రజాస్వామ్యవాదులు, కార్మిక సంఘాలు ఖండించాలంటున్నారు. – గోదావరిఖని ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు ప్రజాస్వామ్యంలో పత్రికలపాత్ర కీలకం. వ్యతిరేకంగా వార్తలు రాశారని పోలీ సులు కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. ఏపీ ప్రభుత్వం నిరంకుశ ధోరణి మానుకోవాలి. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, జర్నలిస్ట్లపై కేసులు విరమించుకోవాలి. – వాసిరెడ్డి సీతారామయ్య, అధ్యక్షుడు, ఏఐటీయూసీ వాస్తవాలు వెలికితీసేవి పత్రికలు వాస్తవాలను వెలికితీసి ప్రజల ముందు ఉంచే పత్రికలకు గౌరవం, స్వేచ్ఛ ఇవ్వాలి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు, ప్రజల స్వరాన్ని వినిపించే అవకాశం పత్రికలకు మాత్రమే ఉంది. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. – తుమ్మల రాజారెడ్డి, అధ్యక్షుడు, సీఐటీయూ వేధింపులు సరికాదు నిజాలను నిర్భయంగా రాసే సాక్షి దినపత్రికపై వేధింపులు తగవు. అన్నిపార్టీలు, ప్రజల మనోగతాన్ని ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత పత్రికలపై ఉంది. తమకు వ్యతిరేకంగా వార్తలు రాశారని ఎడిటర్పై కేసులు నమోదు చేయడం సరికాదు. – జనక్ప్రసాద్, సెక్రటరీ జనరల్, ఐఎన్టీయూసీ వాస్తవాలు బయట పెట్టేవే.. వాస్తవాలను బయట పెట్టేవే పత్రికలు. వాటిని బతికించుకోవాల్సిన అవసరం సమాజానికి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పత్రికలతోనే ప్రజలకు అనేక విషయాలు తెలుస్తున్నాయి. సాక్షి ఎడిటర్, జర్నలిస్ట్లపై ఏపీ ప్రభుత్వం పెట్టిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలి. – రియాజ్ అహ్మద్, అధ్యక్షుడు, హెచ్ఎంఎస్ పత్రికా స్వేచ్ఛను కాపాడాలి పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రతీఒక్కరి పై ఉంది. ప్రతీఅంశంపై ప్రజలను చైతన్యవంతం చేయడమే మీడియా ఉద్దేశం. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతున్నారనే అక్కసుతోనే కేసులు నమోదు చేయడం సరికాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించాలి. – మిర్యాల రాజిరెడ్డి, అధ్యక్షుడు, టీబీజీకేఎస్ కేంద్ర ప్రభుత్వం స్పందించాలి ఏపీ ప్రభుత్వం సాక్షి ఎడిటర్, జర్నలిస్ట్లపై కేసులు నమోదు చేసి బెదిరింపులకు దిగుతోంది. ఈవిషయంలో కేంద్రప్రభుత్వం స్పందించాలి. పత్రికాస్వేచ్ఛను కాపాడాలి. అన్యాయాల్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు నమోదు చేయడం సిగ్గు చేటు. – యాదగిరి సత్తయ్య, అధ్యక్షుడు, బీఎంఎస్