breaking news
Peddapalli District News
-
టెన్త్లో ఉత్తమ ఫలితాల సాధనకు ‘సాక్షి’ స్టడీ మెటీరియల్ దోహదం
● సర్క్యులేషన్ మేనేజర్ మధుకర్రెడ్డి పెద్దపల్లిరూరల్: పదోతరగతి చదివే విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించేందుకు దో హదపడేలా సాక్షి దినపత్రిక స్టడీ మెటీరియల్ రూపొందించిందని ‘సాక్షి’ సర్క్యులేషన్ మేనేజర్ మధుకర్రెడ్డి అన్నారు. పెద్దపల్లి శివారు రంగంపల్లిలోని మహాత్మాజ్యోతిబా పూలే పాఠశాలలో శుక్రవారం స్టడీ మెటీరీయల్ను ప్రిన్సిపాల్ మణిదీప్తితో కలిసి విద్యార్థులకు ఉచితంగా అందించారు. ప్రతీరోజు సాక్షి దినపత్రికలో ప్రచురితమయ్యే స్టడీ మెటీరియల్ ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. దీనిని విద్యార్థులు సద్వినియోగంచేసుకుని మంచి ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన వెంట ఏసీవో తిరుపతి ఉన్నారు. -
కమలం వికసించేదెప్పుడో!
సాక్షి పెద్దపల్లి: దేశంలో కమలం వికసిస్తున్నా .. జిల్లాలో చతికిలబడుతోంది. నేతల మధ్య స మన్వయ లోపం, జిల్లా అధ్యక్షుడి నాయకత్వ లేమి, అనుభవరాహిత్యం తదితర కారణాల తో ప్రజల్లో ఆదరణ ఉన్నా.. దాన్నిఓట్ల రూపంలో పొందలేకపోతోందని ఆ పార్టీ నేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటినా.. పంచాయతీ ఎన్నికల్లో 261 స్థా నాల్లో కేవలం 3 సర్పంచ్ స్థానాలు గెలిచింది. తాజాగా రామగుండం కార్పొరేషన్లో ఒకటి, పెద్దపల్లిలో ఒకటి, సుల్తానాబాద్లో ఒక వార్డులోనే విజయం సాధించింది. 124 స్థానాలకు కేవలం మూడు స్థానాల్లో గెలుపొందింది. మంథనిలో ఖాతా తెరవలేకపోయింది. 16 తర్వాతే విజయోత్సవాలు సుల్తానాబాద్రూరల్: మున్సిపల్ ఎన్నికల్లో గె లుపొదిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకునేందుకు ఈనెల 16 తేదీ తర్వా త అనుమతి ఉంటుందని డీసీపీ రాంరెడ్డి తెలిపారు. సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సరళిని శుక్రవారం డీసీపీ పరిశీలించినంతరం మీడియాతో మాట్లాడారు. ఏసీపీ కృష్ణ, సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై చంద్రకుమార్ ఉన్నారు. ముగిసిన ఎన్నికల ప్రక్రియ పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ శుక్రవారం ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడితో పూర్తయింది. 36వార్డుల్లో 43,789 మంది ఓటర్లు ఉండగా అందులో 32,201 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నా రు. బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను అభ్యర్థుల ముందే కుమ్మరించి లెక్కించి విజేతలను ప్రకటించారు. మదర్ థెరిసా ఇంజినీరింగ్ కాలేజీ లో ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించారు. కమిషనర్ వెంకటేశ్కు సూచనలిచ్చారు. డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ కృష్ణ సారథ్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. కౌన్సిలర్లుగా ఎన్నికై న వారి మద్దతుదారులు సంబురాల్లో మునిగితేలారు. మంథనిలో కాంగ్రెస్ ర్యాలీ మంథని: మున్సిపల్ ఎన్నికల్లో 13 వార్డులకు 11వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయకేత నం ఎగురవేయడంతో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులతో పట్టణంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి శ్రీధర్బాబు అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. జీజీహెచ్ తనిఖీ కోల్సిటీ(రామగుండం): గోదావరిఖని జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)ను కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం తనిఖీ చేశారు. భవన నిర్మాణం ప్రగతిపై ఆరా తీశారు. పేషెంట్లు, సహాయకులు నిలబడి వేచి చూసే అవసరం రాకుండా అదనపు కుర్చీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. వైద్యులు రాజు, అరుణ కృపాభాయ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎఫ్సీఎల్ సందర్శన ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ కర్మకారాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష తనిఖీ చేశారు. ఆర్ఎఫ్సీఎల్ అధికారులతో సమావేశం నిర్వహించారు.వేలాలకు ప్రత్యేక బస్సులు గోదావరిఖనిటౌన్: మహాశివరాత్రి సందర్భంగా గోదావరిఖని నుంచి వేలాల జాతరకు ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు ప్రత్యేక బ స్సులు నడపనున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ నా గభూషణం తెలిపారు. పెద్దలకు రూ.80, పిల్లలకు రూ.50 చార్జీ నిర్ణయించామని అన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉచిత ప్రయాణం వర్తించదని ఆయన వివరించారు. ప్రతిపక్ష మాజీ ఎమ్మెల్యేల వార్డులో కాంగ్రెస్ గెలుపు పెద్దపల్లిరూరల్: మున్సిపల్ 4వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కొమ్ము సుధాకర్ విజయం సాధించారు. ఈవార్డులో బీఆర్ఎస్ మాజీ ఎ మ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి ఓటేశారు. రాముకు అత్యధిక మెజారిటీగోదావరిఖని: 38వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్గా నెలకంటి రాము విజయం సాధించారు. 2,524 ఓట్లకు రాము 1,720ఓట్లు సాధించారు. స మీప బీజేపీ అభ్యర్థి బూడిద శ్రీహర్షవర్ధన్పై 1,048ఓట్ల మెజార్టీ సాధించారు. డివిజన్లో 70శాతం ఓట్లను కై వసం చేసుకుని అత్యధిక ఓట్లు సాధించి రికార్డు నమోదు చేశారు. -
అభివృద్ధికి పట్టం కట్టిన ప్రజలు
గోదావరిఖని: ప్రజామోదంతోనే రామగుండం కార్పొరేషన్లో కాంగ్రెస్కు భారీ మెజార్టీ లభించిందని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో శుక్రవారం ఏ ర్పాట చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. 60 డివిజన్లలో 38 డివిజన్లు కై వసం చేసుకుని ఘన విజయం సాధించామన్నారు. సింగరేణి, ఎ న్టీపీసీ కార్మికులకు రుణపడి ఉంటామన్నారు. ప్రతిపక్షాలు మానసికంగా ఎన్నిఇబ్బందులు పెట్టి నా ప్రజలు గొప్పతీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని చెప్పిన వారికి ఫలితాలు చెంపపెట్టు లాంటివన్నారు. ఎన్నికల్లో ఎవ రెటువైపు వ్యవహరించినా.. ఆ తర్వాత మర్చిపోతామని, కక్షసాధింపు ఉండదని తెలిపారు. కార్పొరేటర్లుగా విజయం సాధించిన కాంగ్రెస్తోపాటు ప్రతిపక్ష, స్వతంత్రులకు అభినందనలు తెలిపా రు. ఓటమిపాలైన వారిని కూడా అభివృద్ధిలో భాగస్వాములను చేస్తామని తెలిపారు. నాయకులు మహంకాళి స్వామి, మారెల్లి రాజిరెడ్డి, గట్ల శ్రీనివాస్, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ -
ఫలించిన దుద్దిళ్ల బ్రదర్స్ వ్యూహం
మంథని: ప్రభుత్వ వ్యవహారాల్లో క్షణం తీరిక లేకుండా సీఎం రేవంత్రెడ్డికి చేదోడు వాదో డుగా ఉంటున్న మంత్రి దుద్దిళ్ల శ్రీదర్బాబు.. మంథని మున్సిపల్ ఎన్నికల్లో సాదాసీదా ప్రచారంతో తన సత్తా చాటారు. రాష్ట్రంలోని కీలకమైన జిల్లాల్లో సీఎంతోపాటు ప్రచారం నిర్వహంచిన మంత్రి శ్రీధర్బాబుకు ఆయన సోదరుడు, టీపీసీసీ ప్రధాన కా ర్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు అండగా నిలిచారు. దీంతో దుద్దిళ్ల బ్రదర్స్ వ్యూహం మంథనితోపాటు ఆ యా మున్సిపాలిటీల్లో సూపర్ హిట్ అయింది. మంథనిలో 13కు 11 వార్డుల్లో కాంగ్రెస్ హవా మంథనిలోని 13 వార్డులకు 11 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఏకపక్షంగా జయకేతనం ఎగురవేశారంటే దుద్దిళ్ల బ్రదర్స్ రచించిన వ్యూహం ప్రతిపక్ష బీఆర్ఎస్కు చావుదెబ్బ కొట్టినట్లయ్యింది. రేవంత్రెడ్డి నమ్మినబంటుగా ఉంటున్న శ్రీధర్బాబు వ్యూహాలు రా ష్ట్రంలనూ ఫలించినట్లు కాంగ్రెస్లో చర్చ కొనసాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా వ్యవహరించిన శ్రీధర్బాబు.. ప్రస్తుతం పురపాలక సంఘ ఎన్నికల్లోనూ దిశానిర్దేశం చేసి భారీ విజయానికి పునాదులు వేసినట్లు చెబుతున్నారు. కంటిమీద కునుకులేకుండా.. శ్రీధర్బాబు, శ్రీనుబాబు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా పనిచేస్తున్నారు. పార్టీ, ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటూనే క్యాడర్లో ఉత్సాహం నింపుతున్నారు. ఈ క్రమంలోనే రాత్రి, పగలు తేడా లేకుండా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి పోలింగ్ వరకు పనిచేశారు. మంథనిపై ప్రత్యేక దృష్టి మంథనిపై ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా రా ష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లోనూ శ్రీధర్బాబు, శ్రీనుబాబు ప్రచారంలో పాల్గొన్నారు. ఒక్కోరోజు మూ డు నుంచి నాలుగు జిల్లాలు కవర్ చేసి క్యాడర్, ప్ర జల్లో ఎంతో ఉత్సాహం నింపారు. అక్కడక్కడా ఉన్న మైనస్లను కేవలం రెండు రోజుల వ్యవధిలోనే సరిచేసి కాంగ్రెస్ అభ్యర్థుల విజయాన్ని ఖరారు చేయడంతో తమదైన ముద్ర వేశారు. ప్రభుత్వంపై విశ్వాసానికి ప్రతీక పురతీర్పు సీఎం నాయకత్వంలోని ప్రజాప్రభుత్వంపై ప్రజలు చూపిన విశ్వాసం మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు ప్రతీక అని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. స్వార్థ రా జకీయాలకు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలనే అజెండాగా పెట్టుకున్న కొన్నిశక్తులకు పురపో రు తీర్పు చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. ఓవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే.. మరోవైపు, అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల చెంతకు చేర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సా గుతోందన్నారు. గెలుపు స్ఫూర్తితో అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. పురపాలక ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపులోతమదైన ముద్ర సాదాసీదా ప్రచారంతో సత్తా -
టిక్..టిక్..టిక్..
శుక్రవారం శ్రీ 13 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సింగరేణిలో సమ్మె ప్రశాంతంగోదావరిఖని(రామగుండం): దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణిలో గురువారం చేపట్టిన సమ్మె ప్రశాంతంగా జరిగింది. కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెకు సంఘీభావం పలికారు. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, టీబీజీకేఎస్ నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. రామగుండం రీజియన్లోని ఆర్జీ–1,2,3, ఏపీఏ ఏరియాల్లో కార్మికుల హాజరుశాతం తగ్గింది. సమ్మె వల్ల ఉత్పత్తికి విఘాతం కలగకుండా ఓసీపీల్లో యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. కోల్బెంచ్ నుంచి బొగ్గును కొద్దిమందితో సీహెచ్పీలకు తరలించారు. సమ్మెతోనైనా కేంద్రం బుద్ధి తెచ్చుకుని నాలుగు లేబర్కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ నాయకులు చేశారు. తుమ్మల రాజారెడ్డి, రియాజ్అహ్మద్, ఐ.కృష్ణ, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఆర్జీ–3లో ఫారెస్ట్ నోడల్ ఆఫీసర్ పర్యటనరామగిరి: ఆర్జీ–3 ఏరియాలో గురువారం ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్, నోడల్ ఆఫీసర్ సి.శరవణన్ పర్యటించారు. ముందుగా రామగిరి అతిథి గృహం నందు ఆర్జీ–3, ఎస్టేట్, మందమర్రి జీఎంలు సుంకర మధుసూదన్, టి.లక్ష్మీపతిగౌడ్, ఎన్.రాధాకృష్ణ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఓసీపీ గని కోసం ఆర్జీ–3 ఏరియా ఓసీపీ–1 ఉపరితల గని పరిధిలోని ఓబీ డంపునకు కేటాయించిన 102 హెక్టార్ల (సీఏ ల్యాండ్) భూమిని ప్రభుత్వం అటవీశాఖకు అప్పగించడానికి చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించగా జీఎంలు పూర్తి వివరాలు తెలియజేశారు. ఆయన వెంట అటవీశాఖ డిప్యూటీ చీఫ్ కన్జర్వేటర్ డాక్టర్ డి.సంహిత, సైంటిఫిక్ ఆఫీసర్ నవీన్, సింగరేణి ఫారెస్ట్రీ అడ్వైజర్ ఫర్గెన్, కాళేశ్వరం అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ డాక్టర్ బి.ప్రభాకర్ , జిల్లా ఫారెస్ట్ అధికారి శివయ్య, ఎఫ్ఆర్వోలు పాల్గొన్నారు. స్ట్రాంగ్ రూం పరిశీలనసుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఏసీపీ కృష్ణ తెలిపారు. సుల్తానాబాద్లోని జూనియర్ కాలేజీలో స్ట్రాంగ్ రూం గురువారం పరిశీలించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. సీఐ సుబ్బారెడ్డి ఎస్సైలు చంద్రకుమార్, అశోక్రెడ్డి ఉన్నారు. కుష్టువ్యాధిపై అవగాహనకాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): కుష్టువ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే నివారించవచ్చని జిల్లా పారామెడికల్ ఆఫీసర్ దేవిసింగ్ తెలిపారు. గురువారం మండలంలోని పెగడపల్లి జెడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. శరీంపై మొద్దుబారిన మచ్చలు రాగిరంగులో ఉంటే వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. వ్యాధి సోకినవారికి ఉచితంగా మందులు పంపిణీ చేసి చికిత్స అందించనునట్లు పేర్కొన్నారు. హెచ్ఈవో ఆరెల్లి లక్ష్మణ్, ఏఎన్ఎంలు శోభ తదితరులు పాల్గొన్నారు. క్వింటాల్ పత్తి రూ.7,421పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మార్కెట్యార్డు ఆవరణలో గురువారం పత్తి క్వింటాల్ గరిష్ట ధర రూ.7,421 పలికింది. కనిష్ట ధర రూ. 5,731, సగటు ధర రూ.7,181 ఉందని మార్కెట్ కమిటీ ఇన్చార్జి కార్యదర్శి ప్రవీణ్రెడ్డి తెలిపారు. 850 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా మున్సిపల్ రాజకీయాల్లో నేడు కీలక ఘట్టం జరగనుంది. జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలకు బుధవారం ఎన్నికలు జరగగా, ఓట్ల లెక్కింపు శుక్రవారం జరగనుంది. రెండు కార్పొరేషన్లలో 126 డివిజన్లకు, 13 మున్సిపాలిటీలలో 341 వార్డుల ఫలితాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లాలో 764, జగిత్యాల 655, పెద్దపల్లి 580, సిరిసిల్ల 287 మొత్తం 2,286 మంది భవితవ్యం నేడు తేలనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ప్రధాన పార్టీల్లో లెక్కలు మొదలయ్యాయి. ఎగ్జిట్ ట్రెండ్స్ ప్రకారం ఉమ్మడి జిల్లాలో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశముందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐదు చోట్ల బీఆర్ఎస్కు ఆధిక్యం కనిపిస్తుండగా, రెండు చోట్ల బీజేపీకి గెలుపు అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరో వైపు ఎనిమిది మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కు సునా యాస విజయం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్యాంపు రాజకీయాలు.. ఫలితాలు వెలువడగానే క్యాంపు రాజకీయాలు మొదలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీల నేతలు ఇండిపెండెంట్ అభ్యర్థులతో ముందస్తు ఒప్పందాలకు సిద్ధమవుతున్నారు. హంగ్ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో, ప్రతి ఒక్క కార్పొరేటర్/కౌన్సిలర్ ఓటు కీలకంగా మారనుంది. అధికార కాంగ్రెస్ పార్టీ కొన్నిచోట్ల అభ్యర్థులను గురువారమే క్యాంపునకు తరలించింది. రామగుండం, మంథని, సుల్తానాబాద్, పెద్దపల్లి, చొప్పదండి, కోరుట్ల, ధర్మపురి, వేములవాడలో అభ్యర్థులను క్యాంపుకు రావాలని ఆదేశాలిచ్చింది. బీఆర్ఎస్ నాయకులు కూడా కరీంనగర్, రామగుండం, సిరిసిల్ల, హుజురాబాద్, జమ్మికుంట, మెట్పల్లి, రాయికల్లో క్యాంపు రాజకీయానికి తెరలేపా రు. కరీంనగర్, వేములవాడలో క్యాంపు కోసం బీజే పీ అభ్యర్థులను సిద్ధంగా ఉండాలని సూచించింది. తారుమారు కానున్న స్థానిక రాజకీయం ఈ పుర ఎన్నికల ఫలితాలు స్థానిక రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. రాష్ట్రస్థాయిలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా మారే అవకాశముంది. అధికార పార్టీలు తమపట్టును నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఉండగా, ప్రతిపక్షాలు బలమైన ప్రాతినిథ్యం సాధించి భవిష్యత్ ఎన్నికలను శాసించేందుకు సిద్ధమవుతున్నాయి. మొత్తానికి, శుక్రవారం వెలువడే ఫలితాలు కేవలం మున్సిపల్ పాలనకే కాదు, జిల్లాలో భవిష్యత్ రాజకీయ దశ, దిశను నిర్ణయించనున్నాయి. అధికార కుర్చీ కోసం జరుగుతున్న ఈ పోరు ఉమ్మడి రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.పెద్దపల్లిలోని కౌంటింగ్ హాల్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్న సిబ్బందిక్యాంపునకు బీఆర్ఎస్ అభ్యర్థులు కోల్సిటీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్లో ఎన్నికల ఫలితాలు విడుదల కాకముందే రాజకీయ వేడి మరింత పెరిగింది. మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంపై ప్రధాన పార్టీల దృష్టి కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ముందస్తు ప్యూహాలకు శ్రీకారం చుట్టింది. గెలుపోటములపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ, తమకు అనుకూలంగా ఉండే అభ్యర్థులను సమీకరించేందుకు క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. కాగా, వివిధ డివిజన్ల నుంచి బీఆర్ఎస్ పక్షాన పోటీ చేసిన అభ్యర్థులను గురువారం రాత్రి గోదావరిఖని మార్కండేయకాలనీలోని ఓ ఫంక్షన్ హాల్ నుంచి క్యాంపునకు తరలించారు. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగింది. ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ, కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో బీఆర్ఎస్కు 30 నుంచి 35 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులను ముందుజాగ్రత్తగా క్యాంపునకు తరలిస్తున్నామని పేర్కొన్నారు. గురువారం కొందరిని హైదరాబాద్ తరలించగా, శుక్రవారం ఫలితాల ఆధారంగా మరికొందరిని క్యాంపునకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్ల్లడించారు. పెద్దపల్లి: జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సి పాలిటీల్లో మహిళల ఓట్లే కీలకం కానున్నాయి. శుక్రవారం ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాటు చే శారు. ఆయా మున్సిపాల్టీల్లోని పలు వార్డుల్లో ఎక్కువగా మహిళలే ఓటు హక్కును వినియోగించుకున్నారు. గెలుపోటములను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తారనడంలో సందేహం లేదు. రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికముత్తారం(మంథని): మండలంలోని ధర్యపూర్ మోడల్ స్కూల్కు చెందిన 9వ తరగతి విద్యార్థి చిరు వెంకటప్రసాద్ రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ సంతోష్కుమార్ తెలిపారు. ఈనెల 13 నుంచి మహబూబ్నగర్లో జరిగే పోటీల్లో పాల్గొంటాడు. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయిలో జరిగిన పోటీల్లో ప్రతిభచాటాడు. నేడే బల్దియా ఎన్నికల ఫలితాలు నాలుగు జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తి 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లలో 5 చోట్ల బీఆర్ఎస్కు, రెండు చోట్ల బీజేపీకి సానుకూలత 8 చోట్ల కాంగ్రెస్కు సునాయాస విజయం క్యాంపు రాజకీయాలకు సిద్ధమైన ప్రధానపార్టీలు ఇండిపెండెంట్లతో పార్టీల ముందస్తు ఒప్పందాలు మధ్యాహ్నంలోగా 126 డివిజన్లు, 341 వార్డుల రిజల్ట్స్ తేలనున్న 2,286 మంది భవితవ్యం పార్టీలకు సానుకూలత ఇక్కడే.. -
కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
గోదావరిఖని(రామగుండం): మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం ఉదయం నుంచి కొనసాగనున్న కౌంటింగ్కు పోలీసుశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్లో రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లోని కౌంటింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. గోదావరి ఖని డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలను పోలీస్ కమిషనర్ అంబర్కిషోర్ఝా సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధి, వెలుపలి రహదారుల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి, అనధికార వాహనాలు, వ్యక్తులు లోనికి అనుమతించబోమని పోలీసుశాఖ స్పష్టం చేసింది. రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డును భద్రతా సిబ్బందికి చూపించిన వారికే కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశం ఉంటుందని పోలీసులు తెలిపారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, లైటర్లు వంటి నిషేధిత వస్తువులను కౌంటింగ్ హాల్లులోకి అనుమతి లేదన్నారు. ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని, బాణాసంచా, డీజేలను పూర్తిగా నిషేధించారు. కమిషనరేట్లో బందోబస్తు ఇలా..డీసీపీలు 02 అడిషనల్ డీసీపీ 01 ఏసీపీలు 07 సీఐలు 33 ఎస్సైలు 96 ఏఎస్సై, హెడ్ కానిస్టేబుళ్లు 149 కానిస్టేబుళ్లు 518 హోంగార్డులు 113 స్పెషల్ పార్టీ, ఆర్మ్డ్ సిబ్బంది 158సహకరించాలి రామగుండం పోలీస్ కమిషరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో సుమారు 1,075 మందితో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశాం. పోలీసుశాఖకు ప్రజలు, నాయకులు సహకరించాలి. – అంబర్కిషోర్ఝా, రామగుండం సీపీ -
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్దే గెలుపు
పెద్దపల్లిరూరల్/పెద్దపల్లి: మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మెజార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి బల్దియాలోని 36 వార్డుల నుంచి అభ్యర్థులుగా పోటీచేసిన వారితో గురువారం సమీక్ష నిర్వహించారు. శుక్రవారం జరిగే ఓట్ల లెక్కింపు సమయంలో అనుసరించాల్సిన పద్ధతులు వివరించారు. మెజార్టీ వార్డులను కాంగ్రెస్ గెలుచుకుని చైర్మన్ పీఠం దక్కించుకుంటుందని పేర్కొన్నారు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం అహర్నిశలు శ్రమించిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోమని, పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
రిజల్ట్ డే
పట్టణం కౌంటింగ్ కేంద్రం టేబుల్స్ పోస్టల్ ఓట్లు పోలైన ఓట్లు రామగుండం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ 59 467 1,24,520 పెద్దపల్లి మదర్ఽథెరిస్సా కాలేజీ 36 215 32,201 సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ 15 72 13,716 మంథని ప్రభుత్వ బాలుర పాఠశాల 13 49 11,056 మొత్తం 123 803 1,81,493జిల్లాలో పోలైన ఓట్లు..సాక్షి పెద్దపల్లి: నిరీక్షణ.. నరాలు తెగే ఉత్కంఠకు.. మరికొన్ని గంటల్లో తెరపడబోతోంది. ఎన్నికల రణక్షేత్రంలో విజేతలెవరో.. పరాజితులెవరో తేలబోతోంది. పట్టణ ప్రజలు ఎవరిని ఆశీర్వదించారో.. ఎవరిని తిరస్కరించారో.. ఎవరికి పట్టం కట్టారో.. ఎవరిని దూరం పెట్టారో నేడు తేలనుంది. మరికొద్ది సేపట్లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. శుక్రవారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా, మధ్యాహ్నానానికి అభ్యర్థుల విజయావకాశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రామగుండం కార్పొరేషన్ సహా మూడు మున్సిపాలిటీల్లో కలిపి 123 వార్డుల్లో 580 మంది బరిలో నిలిచారు. వారందరూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తుండగా, ఫలితాల కోసం పుర ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ముందుగా పోస్టల్ ఓటు ముందుగా ఆయా మున్సిపాలిటీల్లోని 803 పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. అనంతరం, వార్డుకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన టేబుల్స్పై ఆయా వార్డులకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్లను ఓపెన్ చేసి, 25 ఓట్ల చొప్పున కట్టలు కట్టనున్నారు. అనంతరం అభ్యర్థుల వారీగా లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. మధ్యాహ్నం వరకు ఫలితాల సరళిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నువ్వా.. నేనా.. బల్దియాల్లోని పలు వార్డుల్లో నువ్వా, నేనా అన్నట్లుగా ప్రచారం, పోల్ మేనేజ్మ్మెంట్ చేశారు. పోటాపోటీగా డబ్బులు, చీరలు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో గెలుపు తమదేనని అభ్యర్థులు ధీమాగా ఉన్నారు. పోలైన ఓట్ల వివరాలతో అభ్యర్థులు గురువారం లెక్కలు వేసుకున్నారు. ఏ కాలనీలో ఓట్లు పడ్డాయి.. ప్రత్యర్థికి ఏ వర్గం వారు సపోర్టు చేశారు.. అంటూ ఆరా తీస్తూ గెలుపుపై లెక్కలు వేసుకున్నారు. క్యాంపు రాజకీయాలు స్టార్ట్ జిల్లాలోని 124 వార్డుల్లో రామగుండం కార్పొరేషన్ మొదటి డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవగా మిగిలిన 123 వార్డులకు 580 మంది బరిలో నిలిచారు. శుక్రవారం కౌంటింగ్ చేపట్టనుండగా, ఈ నెల 16న మేయర్, మున్సిపల్ చైర్మన్ల ను ఎన్నుకోనున్నారు. ఫలితాల అనంతరం కాంగ్రెస్ అభ్యర్థులను క్యాంపులకు తరలించేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమవుతుండగా, తమ పార్టీ తరఫు న గెలిచిన కార్పొరేటర్స్ చేజారకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా రామగుండం కార్పొరేషన్ పరి ధిలోని బీఆర్ఎస్ అభ్యర్థులను మాజీ ఎమ్మెల్యే క్యా ంపునకు తరలించారు. దీంతో నేడు వెలుబడనున్న ఫలితాలు అందరిలో ఉత్కంఠను రేపుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు చేసిన అధికారులు మొదలైన క్యాంపు రాజకీయాలు, 16న చైర్మన్ ఎన్నిక -
పకడ్బందీగా ఓట్ల లెక్కింపు
కోల్సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఓట్ల లెక్కింవు నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె.అరుణశ్రీ తెలిపారు. గురువారం నగరపాలక కార్యాలయంలో ఆర్వోలు, ఏఆర్వోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 8గంటలకే పోస్టల్ బ్యాలెట్, అనంతరం, 59 డివిజన్లకు సంబంధించి ఏక కాలంలో బ్యాలెట్ బాక్సుల్లో పోలైన ఓట్ల లెక్కింపు జరుగుతుందని వెల్లడించారు. వెయ్యి ఓట్లకు ఒక రౌండ్ చొప్పున దాదాపు మూడు రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందన్నారు. కౌంటింగ్ సూపర్ వైజర్, అసిస్టెంట్లుగా 180 మందిని నియమించినట్లు తెలిపారు. శిక్షకులు కె.శ్రీనివాస్, జె.శ్రీనివాస్ పాల్గొన్నారు. పెద్దపల్లిలో పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డులకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం కలెక్టరేట్ సమీపంలోని మదర్థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో జరగనుంది. ఉదయం 8గంటలకు లెక్కింపు మొదలవుతుందని కమిషనర్ వెంకటేశ్ తెలిపారు. ఆరు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, 120 మంది సిబ్బందిని నియమించినట్టు తెలిపారు.టీపీవో నరేశ్, వినయ్, కిరణ్, ఏఈ సతీశ్, కృష్ణారెడ్డి తదితరులున్నారు. మంథనిలో.. మంథని: మంథనిలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 13 వార్డులకు గాను 13 టేబుళ్లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్లో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, సూపర్వైజర్లు మొత్తం 39 మంది విధుల్లో ఉంటారు. -
బల్దియాలో పోలింగ్ శాతం భిన్నం
కోల్సిటీ(రామగుండం): రామగుండం మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ల స్పందన డివిజన్ల వారీగా విభిన్నంగా కనిపించింది. ఈసారి ఏ డివిజన్లోనూ 90 శాతం పోలింగ్ దాటకపోవడం గమనార్హం. 24వ డివిజన్లో 2,594 మంది ఓటర్లు ఉండగా, 1,214 మాత్రమే పోలింగ్ కావడంతో కేవలం 46.80 శాతం ఓటింగ్ నమోదయింది. 21వ డివిజన్లో 2,802 మంది ఓటర్లకు, 2,442 మంది ఓటును వినియోగించుకోవడంతో అత్యధికంగా 87.15 శాతం పోలింగ్ నమోదైంది. 16వ డివిజన్లో 3,080 మందికి 1,538 పోలింగ్తో 49.94 శాతం, 13వ డివిజన్లో 2,901 ఓట్లకు 2,335 పోలింగ్తో 80.49 శాతం, 29వ డివిజన్లో 2,654 ఓట్లకు 2,079 పోలింగ్తో 78.33 శాతం నమోదయింది. డివిజన్ల వారీగా మారిన ఓటర్ల స్పందన డివిజన్లలో ఇంత వ్యత్యాసం కనిపించడం విశేషం. ఎన్టీపీసీలోని పీటీఎస్, టీటీఎస్, ఎఫ్సీఐ ఎక్స్ రోడ్ ప్రాంతాలు కలిగిన 24వ డివిజన్లో తక్కువ శాతం ఓటింగ్ నమోదవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓటర్ల నిర్లక్ష్యం, వలసలు, స్థానిక సమస్యలపై అసంతృప్తి వంటి అంశాలు కారణాలుగా భావిస్తున్నారు. మరోవైపు లక్ష్మీపురం, వీర్లపల్లి, ఎఫ్సీఐ ఎల్కలపల్లిగేట్ ప్రాంతాలున్న 21వ డివిజన్లో ఓటర్లు ఉత్సాహంగా ఓటుహక్కును వినియోగించుకున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ శాతం తగ్గినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. డివిజన్ల వారీగా నమోదైన పోలింగ్ శాతం ఆధారంగా ఫలితాలపై ఆసక్తి నెలకొంది. అధిక పోలింగ్ నమోదైన ప్రాంతాల్లో పోటీ మరింత ఉత్కంఠభరితంగా ఉండే అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు. -
ఓట్ల జగడం!
● పోలింగ్ కేంద్రాల్లో నేతల వాగ్వాదాలు, లాఠీచార్జ్లు ● కరీంనగర్లో దొంగ ఓట్లంటూ కలకలం ● జగిత్యాలలో దొంగ ఓటరు పట్టివేత ● రామగుండంలో ఓటరు లిస్టుపై రగడసాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో చెదురు మదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 58వ డివిజన్ జిల్లా పరిషత్ పోలింగ్బూత్లో బీఆర్ఎస్ నేతలు తమఓట్లు వేశారంటూ బీజేపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. ఇది లాఠీచార్జ్కు దారి తీసింది. 32వ డివిజన్లో ఎంఐఎం, బీఆర్ఎస్ అభ్యర్థుల వర్గీయులు పరస్పర దాడులకు దిగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. 33వ డివిజన్లో దొంగ ఓట్లు పడ్డయని ప్రచారం జరిగినా.. దాన్ని మున్సిపల్ కమిషనర్ ఖండించారు. 28 డివిజన్లో తమ నేతలను అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 49వ డివిజన్ రాంనగర్ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మశ్రీ భర్త శ్రీనివాస్రెడ్డి సెల్ఫోన్ లాక్కుని బీజేపీ నాయకులు పగులగొట్టారని ఆరోపించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి బీజేపీ అభ్యర్థి భర్త ఎన్నం ప్రకాశ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 36వ డివిజన్లో పోలీసులతో స్వతంత్ర అభ్యర్థి యాదయ్య వాగ్వాదానికి దిగారు. 27 డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి బంధువు అయిన పోలీసు తమపై చేయి చేసుకున్నారని ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి ఆరోపించాడు. పెద్దపల్లి జిల్లాలో.. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డు అభ్యర్థి రజని కష్ణమూర్తి ఫొటోల గుర్తుతో కూడిన ఓటర్ స్లిప్పు పంపిణీ చేశారంటూ బీజేపీ అభ్యర్థి నిరసనకు దిగారు. సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యేలు రామకృష్ణారెడ్డి, మనోహర్రెడ్డి అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రామగుండం కార్పొరేషన్ ఎనిమిదోకాలనీ 17వ డివిజన్ పోలింగ్ కేంద్రంలో అధికారుల వద్ద ఉండాల్సిన ఓటింగ్ లిస్టు బయటికి వచ్చిందని బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. జగిత్యాల జిల్లా జగిత్యాలలోని 31వ వార్డులో ఎంఐఎం బీఆర్ఎస్ పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత నెలకొంది. 26వ వార్డులో ఓటు వేసేందుకు వచ్చిన జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన బాపురపు చంద్రశేఖర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మెట్పల్లి మున్సిపాలిటీలో 12వ వార్డులో ఓ అంగన్వాడీ కార్యకర్త అధికార పార్టీకి అనుకూలంగా ఉందని ఆరోపణలు రావడంతో విధుల నుంచి తొలగించారు. జగిత్యాల 27వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి స్వతంత్ర అభ్యర్థికి మధ్య పలుమార్లు వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. జగిత్యాల 2వ వార్డు నుంచి పోటీ చేసిన అభ్యర్థుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నాయి. ఏకంగా ఒకరినొకరు తోసుకున్నారు. కోరుట్లలో 27 వార్డులో స్వతంత్ర అభ్యర్థి తన ఎన్నికల గుర్తు అయిన ఆపిల్ పండ్లు పంచుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. వేములవాడ 12వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి రామతీర్థపు కృష్ణవేణి తనను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించకుండా బీఆర్ఎస్ అభ్యర్థికి ఓ ఎస్సై సపోర్టు చేస్తున్నారని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించారు. వేములవాడ మున్సిపాలిటీలో 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మారం కుమార్ సతీమణి పోలింగ్ ఏజెంట్గా మరో వ్యక్తి ఐడీ కార్డు మెడలో వేసుకుని ఓట్లు అడిగినట్లు కాంగ్రెస్ అభ్యర్థి తోట రాజు ఆరోపించారు. -
కార్పొరేషన్లు, మున్సిపాలిటీలూ గెలుచుకుంటాం
కమాన్పూర్(మంథని): రాష్ట్రంలోని మెజారిటీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను గెలుచుకుంటామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. బుధవారం హైదరాబాద్ వెళ్తున్న మంత్రిని కమాన్పూర్ ఎక్స్రోడ్డు వద్ద కాంగ్రెస్ నాయకులు కలిసి కాసేపు ముచ్చటించారు. మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలు తమకు పూర్తి మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. దీంతో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు భారీ మోజార్టీతో గెలిపించుకోబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కమాన్పూర్ ఎక్స్రోడ్డు – రాజాపూర్ ఎస్సారెస్పీ కాలువపై శిథిలావస్థలో ఉన్న కల్వర్టును పరిశీలించారు. కల్వర్టు మరమ్మతుకు ప్రతిపాదనలు పంపించాలని ఇరిగేషన్ ఈఈ బలరామయ్యకు సూచించారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వెన్నుపోటుదారులపై చర్యలు తీసుకోవాలని గుండారం గ్రామ మాజీ సర్పంచ్ ఆకుల ఓదెలు మంత్రిని వేడుకున్నారు. సర్పంచులు రంగు సత్యనారాయణ, బొంగొని సదయ్య, ఉపసర్పంచ్ అంబీరు రాజేందర్, కోలేటి మారుతి, ఇనగంటి భాస్కర్రావు, పిడుగు శంకర్, అడ్వాల చంద్రయ్య, వార్డు సభ్యులు పిడు గు సదయ్య, కవిత, కృష్ణ, రవి పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్బాబు -
రైల్వేస్టేషన్లలో తనిఖీలు
రామగుండం/పెద్దపల్లిరూరల్/పెద్దపల్లి: సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ గోపాలకృష్ణన్ బుధవారం రామగుండం, పెద్దపల్లి రైల్వే స్టేషన్లు తనిఖీ చేశారు. అమృత్ భారత్ పథకం ద్వారా చేపట్టిన రామగుండం రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పూర్తయిన నేపథ్యంలో త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ఏర్పాట్లపై కసరత్తు చేసేందుకు ఆయన పర్యటించినట్లు అ ధికారులు తెలిపారు. ఈనెల 15న రైల్వేస్టేషన్ ను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నా.. అ దేరోజు మహాశివరాత్రి ఉండడంతో వాయిదా వేసే అవకాశం ఉంది. కాగా, స్వర్ణజయంతి (12643/44), వెన్గంగా బైవీక్లి(12251/52) సూపర్ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించేందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం ఎగ్జిక్యూటివ్ సభ్యులు జాన్వెస్లీ, దేవిసింగ్ఠాకూర్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్పీఎఫ్ సీఐ రాజేంద్రప్రసాద్, నాగరాజు పాల్గొన్నారు. రైళ్లలో ప్రయాణికుల రద్దీ రామగుండం: ఎన్నికల వేళ కా జీపేట–బల్హర్షా మధ్య నడిచే రైళ్ల న్నీ బుధవారం ప్రయాణికులతో కిక్కిరిసిపోయా యి. జనరల్ బో గీల్లో కనీసం కా లుమోపే పరిస్థి తి లేకుండాపో యింది. స్లీపర్ క్లాస్లోనూ సాధారణ ప్రయాణికులు ఎక్కారు. రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ బల్దియాల్లో ఎన్నికలు జరుగుతుండడంతో ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు భారీసంఖ్యలో తరలివచ్చా రు. మరోవైపు.. ఈనెల 14 వరకు మంచిర్యాల – మందమర్రి మధ్య రైల్వేట్రాక్ ఇంటర్ లాకింగ్ పనులు కొనసాగుతాయి. దీంతో రామగుండం వరకే ప్యాసింజర్ రైళ్లు నడిపిస్తున్నారు. గోటితో తలంబ్రాలు ఒలిచిన భక్తులు కమాన్పూర్(మంథని): స్థానిక శివాలయంలో బుధవారం గోటితో తలంబ్రాలు ఒలిచే కార్యక్రమం చేపట్టారు. భూపాలపల్లి జిల్లా చెల్పూర్ గ్రామానికి చెందిన శ్రీభక్త రామదాసు భక్త మండలి తీసుకొచ్చిన ధాన్యాం గింజలను మహిళలు గోటితో ఒలిచి బియ్యాన్ని తీశారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే శ్రీసీతారామ కల్యాణంలో ఈ తలంబ్రాలుగా ఉపయోగిస్తారని భక్తులు తెలిపారు. పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ కోల్సిటీ(రామగుండం): జగిత్యాల, మంచిర్యా ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల మున్సిపల్ ఎ న్నికల పర్యవేక్షణాధికారి, పురపాలన శాఖ జా యింట్ డైరెక్టర్ వేణుగోపాల్రెడ్డి బుధవారం రామగుండం నగరంలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ కౌంటింగ్ ఏర్పాట్లు తదితర వివరాల గురించి వివరించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్, ఏసీపీ శ్రీహరి, టీపీఎస్ నవీన్ పాల్గొన్నారు.ఉత్తమ పంచాయతీలకు రాజ్యసభలో ప్రశంస ఎలిగేడు(పెద్దపల్లి): సుల్తాన్పూర్ గ్రామాన్ని 2023 సంవత్సరానికి ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక చేశారు. ఇటీవల పచ్చదనం, పారిశుధ్య పంచాయత్ అవార్డు అందజేశారు. దీంతో కేంద్రమంత్రి రాజీవ్ రంజన్సింగ్ రాజ్యసభలో ఉత్తమ పంచాయతీలను ప్రశంసించారు. అదే సమయంలో రూ.50 లక్షల రివార్డును అందజేశారు. దేశవ్యాప్తంగా 2023 నుంచి 2025 వరకు వివిధ కేటగిరీల్లో ఉత్తమ జాతీయ అవార్డులు అందుకున్న పంచాయతీల పేర్లను మంత్రి ప్రకటించారు. ఉత్తమ పంచాయతీలను మిగతా పంచాయతీలు ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. -
బ్యాలెట్ బాక్సుల్లో భవితవ్యం
సాక్షి పెద్దపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తా రు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు విలువను అర్థం చేసుకుని ఓటుహక్కు వినియోగించుకున్నారు. దీంతో బల్దియాల్లో 75.28శాతం పోలింగ్ నమోదైంది. బుధవారం ఉదయం 7గంటల నుంచే ఓటు వేసేందుకు ఉత్సాహంతో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. పోలింగ్ ప్రక్రియ ముగిశాక అధికారులు బ్యాలెట్ బాక్స్లను స్ట్రాంగ్రూంలకు తరలించారు. పర్యవేక్షణ.. భారీ బందోబస్తు రామగుండం కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీ ల్లో పోలింగ్ తీరును అధికారులు నిరంతరం పర్యవేక్షించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష పోలింగ్ కేంద్రాలు పరిశీలించారు. రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి 29వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తమ ఫొటోలు, గుర్తుల తో కూడిన ఓటరు స్లిప్పులు పంపిణీ చేశారని బీజేపీ నేతలు నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు మనో హర్రెడ్డి, రామకృష్ణారెడ్డి చేరుకుని సదరు అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రామగుండం 17వ డివిజన్ అధికారుల వద్ద ఉండాల్సిన ఓట రు జాబితా కాంగ్రెస్ నేతలు బయటకు తీసుకొచ్చా రని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. ఇవి మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఓటుకోసం సొంతూరికి పలు కారణాల రీత్యా ఇతర ప్రాంతాల్లో నివాసం ఉన్నవారు ఓటుహక్కు వినియోగించుకోవడానికి స్వస్థలాలకు తరలివచ్చారు. గెలుపోటములకు ప్ర తీ ఓటుకీలకం కావడడంతో అభ్యర్థులు వారికి రవాణా చార్జీలు చెల్లించి మరీ రప్పించారు. దీంతో గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. కఎలెక్షన్ పదనిసలు ఓటేసిన ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్రావు, ఎమ్మెల్యే రాజ్ఠాకూర్, మాజీ ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, కోరుకంటి చందర్, దాసరి మనోహర్రెడ్డి, గుజ్జుల రామకృష్ణారెడ్డి, పుట్ట మధు, సింగరేణి ఆర్జీ–1 జీఎం లలిత్కుమార్, రామగుండం మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, బీజేపీ సీనియర్ నేత ఎస్.కుమార్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పురపోరు బల్దియాల్లో 75.28 శాతం పోలింగ్ నమోదు ఓటుహక్కు వినియోగించుకున్న 1,81,493 మంది ఓటర్లు సుల్తానాబాద్లో అత్యధికం.. రామగుండంలో అత్యల్పం పోలైన ఓట్లు బల్దియా మొత్తం పోలైనవి మంథని 14,402 11,056 పెద్దపల్లి 43,789 32,201 రామగుండం 1,79,624 1,24,520 సుల్తానాబాద్ 16,824 13,716 గంటల వారీగా పోలింగ్ శాతం ఇలా.. బల్దియా 9.00 11.00 1.00 3.00 ఫైనల్ మంథని 15.60 37.38 57.49 69.48 76.76 పెద్దపల్లి 11.06 30.52 50.69 64.41 73.54 రామగుండం 09.50 24.31 42.12 56.49 69.32 సుల్తానాబాద్ 15.75 38.80 60.70 74.48 81.53 -
ఓటుహక్కే అవ్వ ఆయుధం
కోల్సిటీ(రామగుండం): పేరు కోడూరు మధునమ్మ. వయసు 90 ఏళ్లు. అడుగులు నెమ్మదిగా పడుతున్నా.. మనసులో ప్రజాస్వామ్యంపై అచంచలమైన నమ్మకం. ఓటుహక్కు వినియోగించుకోవాలన్న సంకల్పంతో పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆ వృద్ధురాలు యువతకు స్ఫూర్తిగా నిలిచారు. గోదావరిఖని అడ్డగుంటపల్లికి చెందిన ఈ అవ్వ.. రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చారు. వృద్ధాప్య సమస్యలు, శారీరక అలసటలను లెక్కచేయకుండా బ్యాలెట్ పట్టుకుని మరీ ఓటు వేసిన ఆమె తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. ‘ఓటు వేయడం నా బాధ్యత’ అన్న భావనతో ఆమె చూపిన చైతన్యం అక్కడున్న యువ ఓటర్లను ఆలోచింపజేసింది. ఈ దశ్యం ప్రజాస్వామ్యంలో ప్రతీఓటు ఎంతవిలువైనదో మరోసారి గుర్తుచేసింది. వయసుతో సంబంధం లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలన్న సందేశాన్ని ఈ 90 ఏళ్ల వృద్ధురాలు తనఓటుతో బలంగా చాటి చెప్పారు. 90 ఏళ్ల వయసులోనూ ప్రజాస్వామ్యానికి సెల్యూట్ -
పోలింగ్ కేంద్రంలో ఇండిపెండెంట్ అభ్యర్థిపై దాడి
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 57వ డివిజన్లో ఓ ఇండిపెండెంట్ అభ్యర్థిపై అధికార పార్టీ అనుచరులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. చనిపోయిన వారి ఓట్లకు సంబంధించిన పేర్ల విషయంలో వివాదం ఏర్పడినట్లు చెబుతున్నారు. ఈక్రమంలో అక్కడే ఉన్న అధికార పార్టీ అభ్యర్థి అనుచరులు దాడిచేసినట్లు పేర్కొంటున్నారు. అలాగే స్థానిక 12వ డివిజన్లో మారుమూల గ్రామానికి చెందిన వ్యక్తి ఓటు వేసేందుకు రాగా అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్ అడ్డుకోవడంతో వివాదం ఏర్పడింది. వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డికి సమాచారం అందడంతో వెంటనే అక్కడకు చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. ఓటరు కార్డు, ఆధార్కార్డు, ఓటరు లిస్టు పరిశీలించి రిటర్నింగ్ అధికారి అనుమతి మేరకు ఓటువేసేందుకు అనుమతించడంతో వివాదం సద్దుమణిగింది. పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ ఆందోళనమెట్పల్లి: పట్టణంలోని 12వార్డు పోలింగ్ కేంద్రం వద్ద బుధవారం బీఆర్ఎస్ అభ్యర్థి హారిక, స్వతంత్ర అభ్యర్థి సుమయ్య ముఖీమ్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న అంగన్వాడీ టీచర్ కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తున్నారని సమాచారం రావడంతో ఇరువర్గాలు కేంద్రం వద్దకు చేరుకుని బైఠాయించారు. ఆమైపె చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికారులు జోక్యం చేసుకొని ఆమెను విధుల నుంచి తప్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అలాగే 6, 22వార్డుల్లో కూడా ఇరు వర్గాల మధ్య స్వల్ప గొడవ చోటు చేసుకుంది. ఒకరి ఓటు..మరొకరు వేసిన వైనం 12వార్డుకు చెందిన షేక్ ఆసిఫ్ ఓటు వేయడానికి కేంద్రానికి రాగా.. అప్పటికే అతని ఓటు మరొకరు వేయడంతో కంగుతిన్నాడు. విషయం తెలుసుకున్న కొందరు అభ్యర్థులు దొంగ ఓట్లు పడుతున్నాయని గ్రహించి ఆసిఫ్ ఓటును మరొకరు ఎలా వేస్తారని అధికారులను నిలదీశారు. దీనికి వారు వచ్చిన వ్యక్తి ఓటరు కార్డు చూపడంతో అన్ని వివరాలు సరి చూసుకొని అనుమతించామని బదులిచ్చారు. ఓటు వేసేందుకు కర్నాటక నుంచి రాక కోల్సిటీ(రామగుండం): కర్నాటక రాష్ట్రంలో పనిచేస్తున్న ఓ యువ ఇంజినీ ర్ పెద్దపల్లి జి ల్లా రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో తన ఓటుహక్కును వినియోగించడానికి రెండురోజులు సెలవుపెట్టి తన ఇంటికి వచ్చాడు. గోదావరిఖని రమేశ్నగర్కు చెందిన జయాకర్రాజు కర్నాటక రాష్ట్రంలోని స్టాల్ప్లాంట్లో ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. రోజూ దినపత్రికలు చదవడం అలవాటు ఉన్న జయాకర్రాజుకు రామగుండం కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయని తెసింది. గోదావరిఖనిలోని తన మిత్రుల ద్వారా ఎన్నికల వివరాలు సేకరించాడు. ఓటుహక్కును ఎన్నికల్లో వినియోగించుకోవడానికి గోదావరిఖనికి వచ్చాడు. బుధవారం జవహార్నగర్లోని పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటువేశాడు. తనవంతు బాధ్యత నిర్వర్తించాని తెలిపాడు. ఎక్కడ పనిచేస్తున్నామన్నది ముఖ్యం కాదని, మన ప్రాంత అభివృద్ధికి మన ఓటు ఎంతో కీలకమన్నారు. -
జీవితాంతం మధుర జ్ఞాపకం
కోల్సిటీ/ఫెర్టిలైజర్సిటీ(రామగుండం)/పెద్దపల్లిరూరల్: జిల్లాలోని రామగుండం కార్పొరేషన్తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారి ఓటుహక్కు లభించిన యువత ఉత్సాహంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్న యువఓటర్లు.. ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఇదొక మర్చిపోలేని అనుభూతి అని యువకులు, యువతులు స్పందించారు. ఓటరు జాబితాలో పేరును చూసి, బ్యాలెట్ పేపర్పై నచ్చిన గుర్తుపై స్వస్తిక్ ముద్రవేసిన క్షణం జీవితాంతం గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. నగర, పట్టణ అభివృద్ధి, పారదర్శక పాలన కోసం తమ ఓటు కీలకమని యువత అభిప్రాయపడింది. ప్రజాస్వామ్య పండుగలో తొలిసారి భాగస్వాములైన యువ ఓటర్ల సందడి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హెదరాబాదులో చదువుతున్న. తొలిఓటు వేయడానికి గోదావరిఖనికి వచ్చా. ఓటు వేసిన తర్వాత వాట్సాప్ స్టేటస్లో పెడితే, నా ఫ్రెండ్స్ కూడా ఓటు వేసి స్టేటస్లో పెట్టుకున్నారు. హ్యాపీగా ఉంది. – మామిడి సాయిచరణ్, బీటెక్, గోదావరిఖని మున్సిపల్ ఎన్నికల్లో తొలిఓటు వినియోగించుకున్నందుకు సంతోషంగా ఉంది. నాన్నతో కలిసి ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకున్నా. ఓటు ఎలావేయాలి, ఎవరికి వేయాలనే ఓటు ప్రాధాన్యత గురించి తెలుసుకున్నాను. – సాయిలిఖిత, బీఫార్మసీ, గోదావరిఖని నా పేరున ఇంటికి ఫొటో గుర్తింపు పోల్ చిట్టీరావడం చాలాసంతోషం అనిపించింది. తొలిఓటు వేయడం మర్చిపోలేని అనుభూతి. ఎన్నికల ప్రక్రియ తెలుసుకోవడానికి ఏజెంట్గా కూడా సేవలందించా. – సాయిసుహాస్, బీటెక్, గోదావరిఖని -
రేగు పండ్ల కోసం వెళ్లి..
● బావిలో పడి విద్యార్థి మృతి వీణవంక: రేగు పండ్లు తెంపుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఓ విద్యార్థి మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఈర్నాల శ్రీనివాస్–శారద దంపతులకు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు రాజు(11) ఉన్నారు. రాజు స్థానిక పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్నాడు. మంగళవారం తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లగా.. గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావి వద్ద రేగు పండ్ల కోసం వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడ్డాడు. పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు రాజు కనిపించకపోవడంతో.. రాజు కోసం వెతికారు. కొలిపాక శ్రీనివాస్ అనే వ్యక్తి బావిలో అదే రోజు అర్ధరాత్రి శవమై కనిపించాడు. విద్యుత్ మోటార్ల సాయంతో బుధవారం వెలికితీశారు. మృతుడి తల్లి శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి విద్యార్థి దహన సంస్కారాలకు రూ.10వేలు అందజేశారు. -
సుల్తానాబాద్ చైర్మన్ పీఠం మాదే : బీజేపీ నేత సంజీవరెడ్డి
సుల్తానాబాద్ రూరల్: సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ పీఠం బీజేపీ దక్కించుకుంటుందని చేసుకుంటామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 15 స్థానాలకు 10 స్థానాలు బీజేపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రజలు అకర్షితులవుతున్నారని అన్నారు. నాయకులు నల్ల మనోహర్రెడ్డి, సౌదరి మహేందర్యాదవ్, కామని రాజేంద్రప్రసాద్, కందుల శ్రీనివాస్, మిట్టపల్లి ప్రవీణ్, హనుమంత్రెడ్డి, కోట నాగేశ్వర్, కొల్లూరి సంతోష్, కొమ్మిడి రాజేందర్రెడ్డి, వడ్లకొండ శశివర్ధన్, దాసరి చందు, వలస సాయి పాల్గొన్నారు. -
సందేశాత్మక పోలింగ్ కేంద్రాలు
కరీంనగర్ 63వ డివిజన్ భాగ్యనగర్ సెయింట్ అల్ఫోన్స్ స్కూల్లో..కరీంనగర్ 62వ డివిజన్ మంకమ్మతోట బాలికల పాఠశాలలోసిరిసిల్ల కుసుమ రామయ్య స్కూల్లో మోడల్ పోలింగ్ కేంద్రం సిరిసిల్ల గాంధీనగర్లో గ్రీన్ పోలింగ్ స్టేషన్ ముఖద్వారం కరీంనగర్, సిరిసిల్ల మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రాలు ఆకట్టుకున్నాయి. సిరిసిల్ల గాంధీనగర్లోని పోలింగ్ స్టేషన్ను గ్రీన్పోలింగ్ స్టేషన్గా పచ్చని మొక్కలు, పచ్చని కార్పెట్స్, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. సిరిసిల్లలోని కుసుమ రామయ్య జెడ్పీ హైస్కూల్లో బెలూన్లతో అలంకరించి, పెఽళ్లి మండపాన్ని తలపించే రీతిలో రెడ్ కార్పెట్ పరిచారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు. సిరిసిల్ల మోడల్ పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింటు ఆకట్టుకుంది. కలెక్టర్ గరీమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ఆర్డీవో వెంకటేశ్వర్లు వృద్ధ మహిళా ఓటరుతో ఫొటోలు దిగారు. కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఐదు రకాల థీమ్స్లతో ఐదు ఆదర్శ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 7వ డివిజన్ కుమార్వాడీ ప్రభుత్వం పాఠశాల పోలింగ్స్టేషన్ వద్ద తడి, పొడి చెత్త సెక్రిగేషన్ థీమ్తో, 19వ డివిజన్ రేకుర్తి లయోలా హైస్కూల్ పోలింగ్ స్టేషన్ వద్ద జనరల్ ఓటర్లను అవగాహన పరిచేలా, 44వ డివిజన్ సప్తగిరికాలనీ ప్రభుత్వ పాఠశాల వద్ద టూరిజం థీమ్గా, 63వ డివిజన్ భాగ్యనగర్ సేయింట్ అల్ఫోన్స్ స్కూల్ వద్ద శానిటేషన్ వర్కర్స్ వెల్ఫేర్ థీమ్గా, 62వ డివిజన్ మంకమ్మతోట ప్రభుత్వ బాలికల హైస్కూల్ వద్ద జీరో ప్లాస్టిక్ ఓన్గ్రీన్థీమ్ ఏర్పాటు చేశారు. – సిరిసిల్ల/కరీంనగర్కల్చరల్ -
విజయవంతం చేయాలి
లేబర్కోడ్ల రద్దు చేయాలి. సింగరేణి కార్మికుల సమ స్యలు పరిష్కరించాలి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత సీఎం గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలతో చర్చిస్తామన్నారు. ఆ హామీని నిలుపుకోవాలి. – వాసిరెడ్డి సీతారామయ్య, ఏఐటీయూసీ అధ్యక్షుడు సమ్మెతో నష్టం ఒకరోజు సమ్మెతో సింగరేణికి నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి దూరంగా ఉన్నాం. ఇందులో సింగరేణికి సంబంధించిన డిమాండ్లు ఏమీ లేవు. ఉద్యోగులు సమ్మెకు దూరంగా ఉండాలి. – లలిత్కుమార్, సింగరేణి ఆర్జీ–1 జీఎం -
హ్యాపీగా ఉంది
ఏపీ నెల్లూరులో సీఎంఏ కోర్సు చేస్తున్న. నా తొలి ఓటుహక్కు వినియోగించుకోవడానికి గోదావరిఖని వచ్చిన. ఫస్ట్ టైం మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయడం హ్యాపీగా ఉంది. – రోహిత, సీఎంఏ, గోదావరిఖని హైదరాబాద్లో చదువుతున్న. మున్సిపల్ ఎన్నికల్లో నా తొలి ఓటుహక్కును వినియోగించుకున్న. చాలా హ్యాపీ. ఓటు వేయడానికి ఆసక్తి, ఉత్సాహంతో గోదావరిఖనికి వచ్చా. – అనన్య, బీటెక్, గోదావరిఖని పెద్దపల్లి మున్సిపల్లో 15వ వార్డు ఓటరుగా పేరు నమోదు చేసుకున్నా. మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారిగా ఓటుహక్కును వినియోగించుకున్నా. ఎంతో అనుభూతినిచ్చింది. – జాపతి అనుదీప్, 15వ వార్డు -
ట్రాన్స్ జెండర్ల ఆదర్శం
కోల్సిటీ(రామగుండం)/పెద్దపల్లిరూరల్: రామగుండం నగరంలోని ట్రాన్స్జెండర్లు బుధవారం జరిగిన ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకొని ఆదర్శంగా నిలిచారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు అవగాహన కోసం నియమించిన ట్రాన్స్జెండర్ ఐకాన్ ఓరుగంటి లైలా ఆదేశాల మేరకు జిల్లా మోడ్రన్ అవీర్నెస్ సొసైటీ ఆధ్వర్యంలో ఓటుహక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపించారు. వారు మాట్లాడుతూ, ప్రలోభాలకు గురికాకుండా సరైన నాయకు న్ని ఎన్నుకునేందుకు ఓటుహక్కు వినియోగించుకున్నామన్నారు. పురుషులు, మహిళలకు తీసిపోని వి ధంగా ట్రాన్స్జెండర్స్ను ఎన్నికల సంఘం గుర్తించి, ప్రత్యేక విభాగం కింద ఓటుహక్కు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఓటుహక్కును వినియోగించుకున్న వారిలో జిల్లా మోడ్రన్ అవేర్నెస్ సొసైటీ సభ్యులు సమక్క, భవాని, శివాని, లాస్య, సుష్మా, అనిత, శ్రావ్య, నాంపల్లి కావ్య, శ్రీవర్ష, అ న్విత, అపరంజి, గాయత్రి ఉన్నారు. మరోవైపు.. జిల్లాకేంద్రంలో హిజ్రాలు జ్వాలాముఖి, రిషిత ఓటుహక్కు వినియోగించుకుని ఆదర్శంగా నిలిచారు. ఓటుహక్కు వినియోగించుకున్న వైనం -
ఓటు లేకున్నా.. పోలింగ్ బూత్లోకి
పోలీసుల అదుపులో యువకుడు జగిత్యాలక్రైం/జగిత్యాలటౌన్: ఓటు లేకున్నా.. ఓ వ్యక్తి ఓటేసేందుకు పోలింగ్ కేంద్రంలోకి వ చ్చిన ఘటన జిల్లాకేంద్రంలోని ఏడోవార్డు బూత్ నంబర్ 22లో చోటుచేసుకుంది. దొంగ ఓటు వేయడానికి వచ్చాడని అనుమానించి న పోలింగ్ ఏజెంట్లు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతను ఓటు వేయలేదని తేలడంతో కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. అలాగే 26వ వార్డులో ఓటేసేందుకు ఓ వ్యక్తి రాగా.. పోలింగ్ కేంద్రం వద్దే స్వతంత్ర అభ్యర్థి భర్త సదరు వ్యక్తిని గుర్తించి నిలదీశాడు. దొంగ ఓటు వేసేందుకు వచ్చినట్లు ఒ ప్పుకున్నాడు. అతడిని పోలీసులకు అప్పగించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు -
పోలింగ్ ప్రశాంతం: పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి
గోదావరిఖని: రామగుండం కార్పొరేషన్ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ఝా నేతృత్వంలో పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి ఆధ్వర్యంలో భారీపోలీసు బందోబస్తు చేపట్టారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంథని, రామగిరి, గోదావరిఖని టూటౌన్, వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని పోలింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ సిబ్బంది విధులు, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలపై డీసీపీ అధికారులతో సమీక్షించారు. పోలింగ్ ముగిసిన తర్వాత భారీ బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్స్లను స్ట్రాంగ్ రూంలకు తరలించారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్, సీఐ ఇంద్రసేనారెడ్డి, ప్రవీణ్కుమార్, ఎస్ఐలు పాల్గొన్నారు. -
సింగరేణిలో సమ్మె మేఘాలు
గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో సమ్మె మేఘాలు అలముకున్నాయి. దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొనాలని జాతీయ కార్మిక, విప్లవ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. గురువారం జరిగే టోకెన్ సమ్మెను విజయవంతం చేయాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్నారు. సమ్మెతో బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లుతుందని మరోవైపు యాజమాన్యం చెబుతోంది. లేబర్ కోడ్లు రద్దు చేయాలని.. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘాల జేఏసీ ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చింది. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, సింగరేణి మెడికల్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని, సొంతింటి పథకం అమలు చేయాలని, పెర్క్స్పై ఇన్కంట్యాక్స్ మాఫీ చేయాలని, డిస్మిస్ కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకోవాలి, మారుపేర్ల కార్మికుల సమస్య పరిష్కరించాలని సింగరేణి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సమ్మెకు దూరంగా ఉండాలి : సింగరేణి.. ఒకరోజు సమ్మెతో 2.20లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగి రూ.77కోట్ల నష్టం వాటిల్లుతుందని, కార్మికులు వేతనాల రూపంలో రూ.12కోట్లు నష్టపోతారని సింగరేణి యాజమాన్యం చెబుతోంది. సింగరేణికి సంబంధించిన డిమాండ్లు ఏమీలేవని, సమ్మెతో సాధించేదేమీ లేదని, కార్మికులు దూరంగా ఉండాలని పేర్కొంటోంది. మరోవైపు.. సమ్మెకు దూరంగా ఉండాలని బీజేపీ అనుబంధ బీఎంఎస్ కోరుతోంది. సమ్మెతో వాటిల్లే నష్టం సింగరేణిలోని ఉద్యోగులు 40,000 బొగ్గు ఉత్పత్తి విలువ(రూ.కోట్లలో) 77 కార్మికుల వేతనం(రూ.కోట్లలో) 12 బొగ్గు ఉత్పత్తి(లక్షల టన్నుల్లో) 2.20 విజయవంతానికి కార్మిక సంఘాల పిలుపు సింగరేణి ఉద్యోగులు దూరంగా ఉండాలి రామగుండం –1 ఏరియా జీఎం లలిత్కుమార్ -
స్కూల్ అసిస్టెంట్ సస్పెన్షన్
పెద్దపల్లి: మంథని జెడ్పీ హైస్కూల్(బాలికలు)లోని స్కూల్ అసిస్టెంట్ కొమురాజు శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి శారద బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. మంథని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నరాదని, సోషల్ మీడియాతోపాటు ప్రెస్ క్లిప్పింగ్ ఆధారంగా ఎంఈవో విచారణ జరిపి నివేదిక అందజేశారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నివేదిక ఆధారంగా సస్పెండ్ చేసినట్లు వివరించారు. మహిళ మెడలోంచి పుస్తెలతాడు చోరీజగిత్యాలక్రైం: జగిత్యాలలోని అరవింద్నగర్లో బుధవారం మహిళ మెడలోంచి గుర్తుతెలియని ఇద్దరు దొంగలు రెండు తులాల పుస్తెలతాడు ఎత్తుకెళ్లారు. పట్టణానికి చెందిన గట్ల శైలజ నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి పుస్తెలతాడు లాక్కెళ్లారు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడేసరికే దొంగలు పారిపోయారు. పట్టణ పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. -
ఓట్ల పండుగ నేడే
సాక్షి పెద్దపల్లి: ఓట్ల పండుగకు వేళఅయ్యింది. జిల్లాలోని రామగుండం రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లోగల 123 డివిజన్లు/వార్డులకు బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రమే ఎన్నికల సామగ్రితో సిబ్బంది త మకు కేటాయించిన సెంటర్లకు చేరుకున్నారు. రా మగుండం కార్పొరేషన్లోని ఒకటో వార్డు మినహా మిగిలిన 123 వార్డుల్లో వివిధ పార్టీలకు చెందిన 580మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2,58,064 మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. మహిళా ఓటర్లు 1,29,749 మంది, 1,28,281 మంది పురుష ఓటర్లు, ఇతరులు 34మంది ఉన్నారు. ఓటరు జాబితాలో పేరు ఉండి ఓటరు గుర్తింపుకార్డే(ఎపిక్ కార్డు) కాకుండా 12 ప్రత్యామ్నాయ ఫొటో ఐడీల్లో ఏదైనా ఒకటి సిబ్బందికి చూపించి ఓటుహక్కు వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు చేరిన సిబ్బంది, సామగ్రి రామగుండంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెద్దపల్లిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ, సుల్తానాబాద్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీ, మంథనిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని పంపిణీ కేంద్రాల నుంచి పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రితో మంగళవారం సాయంత్రమే చేరుకున్నారు. పోలింగ్ తర్వాత బ్యాలెట్ బాక్స్లను ఇవే కేంద్రాల్లోని స్ట్రాంగ్రూంలలో భద్రపరచనున్నారు. ఈనెల 13న ఆయా కేంద్రాల్లో ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. వలస ఓటర్లపై ఫోకస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీఓటు కీలకమే. ఒక్కఓటుతో సైతం ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి. దీంతో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిలో ప్రతీవార్డు, డివిజన్లో సుమారు 150 నుంచి 500 మంది వరకు వలస ఓటర్లు ఉన్నారు. ఈ ఓట్లు అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపనున్నాయి. దీంతో అభ్యర్థుల తరఫున కొందరు వలసఓటర్లకు వాహనాలను సమకూర్చుతున్నారు. ఒకరి ద్దరు ఉంటే బస్సు చార్జీల కు డబ్బులు పంపించి ఇక్కడకు పిలిపించుకుంటున్నారు. మొత్తంగా అభ్యర్థులు వలస ఓట్లపైనే ఆధారపడుతున్నారు. మద్యం, మాంసం జోరుగా పంపిణీ ఓటర్లను తమవైపు తిప్పుకు నేందుకు అ భ్యర్థులు పోటాపోటీగా మద్యం, చికెన్, మటన్ పంపిణీ చేశారు. సోమ, మంగళవారం రాత్రివేళల్లోనే నగదు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేశారు. ఒక్కోవార్డులో ఒక్కోవిధంగా అభ్యర్థుల స్థాయిని బట్టి ప్రలోభాలు ఓటర్లకు అందజేశారు. ఒక అభ్యర్థి ఓటుకు రూ.1000 ఇస్తే.. మరో అభ్యర్థి రూ.2,000 చొప్పున ఇచ్చినట్లు సమాచారం. ఒకరు ఒక్కో ఓటుకు క్వార్టర్ మద్యం పంచితే, మరొకరు హాఫ్ బాటిల్ మద్యం అందించినట్లు తెలిసింది. కొన్నిచోట్ల ఓటుకు రూ.5,000 చొప్పున పంచినట్లు కూడా సమాచారం అందింది. ఇటు ఎన్నికల అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదననే విమర్శలూ వస్తున్నాయి. బల్దియాల సమాచారం బల్దియా వార్డులు ఓటర్లు అభ్యర్థులు పోలింగ్ కేంద్రాలు పీవోలు ఏపీవోలు రామగుండం 59 1,83,049 314 277 332 1,662 పెద్దపల్లి 36 43,789 157 73 89 444 సుల్తానాబాద్ 15 16,824 61 30 36 180 మంథని 13 14,402 48 26 31 155 మొత్తం 123 2,58,064 580 406 488 2,441 -
60 డివిజన్లు.. 277 పోలింగ్ కేంద్రాలు
కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరంలో బుధవారం పోలింగ్ నిర్వహణకు అధికారులు ఏ ర్పాట్లు పూర్తిచేశారు. గోదావరిఖని శారదానగర్ శిశుమందిర్ స్కూల్లో కార్పొరేషన్ కమిషనర్ అరు ణశ్రీ నేతృత్వంలో మంగళవారం సిబ్బందికి ఎన్నిక ల సామగ్రి పంపిణీ చేశారు. నగరంలో 277 పోలింగ్ కేంద్రాలు ఏర్పటు చేయగా.. 1,500 మంది సిబ్బందిని నియమించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష పర్యవేక్షించి అధికారులకు సూచనలిచ్చారు. డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ రమేశ్ బందోబస్తు చేపట్టారు. సిబ్బందికి సామగ్రి పంపిణీ బల్దియాలోని 272 పోలింగ్ కేంద్రాల్లో సేవలు అందించే ఎన్నికల సిబ్బందికి మంగళవారం బ్యాలెట్ బాక్స్లు, ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. వారు 30 రూట్ల ద్వారా పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేక వాహనాల్లో తరలించారు. 13న ఓట్ల లెక్కింపు శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈనెల 13న ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తారు. ఇందుకోసం తరగతి గదుల్లో బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. అక్కడే స్ట్రాంగ్రూమ్ కూడా ఏర్పాటు చేశారు. 72 మంది కౌంటింగ్ సూపర్ వైజర్లుగా, 144 మంది కౌంటింగ్ అసిస్టెంట్లుగా నియమించారు. వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. డిగ్రీ కాలేజీలో ప్రత్యేక పోలీసు భద్రత చర్యలు చేపడుతున్నారు. అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: అర్హులైన వారందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీ, ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, మున్సిపల్ కమిషనర్లు వెంకటేశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. క్రిటికల్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా మంథని: ఓటర్లు పెద్దఎత్తున తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కో య శ్రీహర్ష కోరారు. మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఆయన సందర్శించారు. ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతీపోలింగ్ కేంద్రంలో వెబ్కాస్టింగ్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల బయట కూడా సీసీ కెమెరా లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆర్టీవో సురేశ్, ము న్సిపల్ కమిషనర్ మనోహర్ తదితరులు ఉన్నారు. పోలింగ్ కేంద్రాలకు చేరిన సిబ్బంది పెద్దపల్లి: జిల్లా కేందంల్రోపి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎన్నికల సామగ్రి తీసుకున్న సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సాయంత్రమే చేరుకున్నారు. పోలింగ్ పకడ్బందీగా నిర్వహిస్తామ ని పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ తెలిపారు. ప్రతీ పోలింగ్ కేంద్రానికి రెండు బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేశామని, అత్యవసరమైతే వాటిని ఉపయోగిస్తామని సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ రమేశ్ వివరించారు. అధికారులు పాల్గొన్నారు. ఇంటికి కిలో చికెన్.. కొందరు అభ్యర్థులు తమ మద్దతుదారులతో ఇంటింటికీ కిలో చికెన్తోపాటు రూ.1000 నుంచి రూ.2000 వరకు పంపిణీ చేస్తున్నారు. ఓటర్లను కాపాడుకుంటేనే గెలుపు తమదేననే ధీమాతో దాదాపు అన్నిపార్టీల అభ్యర్థులు చివరి అస్త్రంగా ఆర్థిక బలాన్ని నమ్ముకున్నారు. నగదు పంపిణీ చేయలేని మరికొందరు అభ్యర్థులు ఓటర్ల కాళ్లు మొక్కడమే శరణ్యంగా భావిస్తున్నారు. మంథనిపై ప్రత్యేక దృష్టి మంథని: మంథనిలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో సిబ్బందికి ఎన్నికల సామగ్రి అందజేయగా.. పోలింగ్కేంద్రాలకు చేరుకున్నారు. మంత్రి శ్రీధర్బాబు, మాజీఎమెల్యే పుట్ట మధు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కావడంతో పోరు ప్రతిష్టాత్మకమైంది. అల్లర్లు, హింసాత్మక ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 14 అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి ఎస్సైలను ఇన్చార్జిలుగా నియమించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. -
● రెండు పార్టీల పరస్పర సహకారం ● క్రాస్ఓటింగ్ జరిగే అవకాశం
అయితే బీజేపీ.. లేదంటే బీఆర్ఎస్గోదావరిఖని: రామగుండం కార్పొరేషన్లోని పలు డివిజన్లలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీ జేపీ క్రాస్ఓటింగ్కు సిద్ధమయ్యాయి. బీజేపీ వీక్గా ఉన్న ప్రాంతంలో బీఆర్ఎస్కు ఓటు వేయాలని, బీఆర్ఎస్ వీక్గా ఉన్నడివిజన్లో బీజేపీ అభ్యర్థుల కు ఓటు వేయాలని రెండు పార్టీలు పరస్పరం సహకారం అందించుకుంటున్నట్లు ప్రచారం ప్రారంభమైంది. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు టార్గెట్ గా ఈ రెండు పార్టీలు ముందుకు సాగుతున్నట్లు తె లుస్తోంది. ఈ ప్రభావం పలు డివిజన్లలోని అధికార కాంగ్రెస్ అభ్యర్థులపై పడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. రెండు పార్టీలు ఒక్కటైన విషయాన్ని అ ధికార కాంగ్రెస్ పార్టీ సైతం అంగీకరిస్తోంది. గతంలోకన్నా ఈసారి బీజేపీ నగర ప్రాంత ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి అన్నిప్రయత్నాలూ చేస్తోంది. అయితే కొంచెం వెనకంజలో ఉన్న బీఆర్ఎస్ కూడా బలాబలాలను బేరీజు వేసుకుంటోంది. ఈక్రమంలో రెండు పార్టీల అభ్యర్థులు చాలాచోట్ల ఒక్కటై అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను దెబ్బతీయాలని చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇదేనిజమైతే రామగుండం ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్, బీజేపీ నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీల నిర్ణయం ఏమైనా వారి భవితవ్యం నిర్ణయించేది మాత్రం ఓటర్లే.. -
అగ్రగామిగా రామగుండం
గోదావరిఖని: రామగుండం నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి, రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతానని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ తెలిపారు. అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తేలేదన్నారు. ప్రజల సహకారంతో పనులన్నీ పూర్తిచేస్తానని భరోసా ఇచ్చారు. శాశ్వత ప్రాతిపదికన చేపట్టే అభివృద్ధితోపాటు పర్యాటకం, వ్యాపారం, విద్య, వైద్య రంగాల్లోనూ నంబర్వన్గా నిలపడమే తన లక్ష్యమన్నారు. ‘సాక్షి’ ఇంటర్వ్యూ వివరాలు ఆయన మాటల్లోనే.. రామగుండం అభివృద్ధి ఎలా? ఎమ్మెల్యే: ఇప్పటికే రూ.516కోట్లతో రోడ్లు, డ్రైనేజీలు, ఎస్టీపీపీలు, తాగునీటి సరఫరా తదితర పనులు పూర్తయ్యాయి. మరికొన్ని నిర్మాణదశలో ఉన్నాయి. వాటిని కూడా పూర్తిచేస్తాం. ఆ వ్యాపార అవకాశాలు ఏమిటి? ఎమ్మెల్యే: రోడ్డు, ఎయిర్పోర్టు, రైల్వే కనెక్టివిటీ ద్వారా చాలావ్యాపారాలు విస్తరిస్తాయి. ఇప్పటికే రూ.2కోట్లతో రెండు షాపింగ్ మాల్స్కు టెండర్లు పూర్తయ్యాయి. మరో రెండింటికి ప్రతిపాదించాం. తద్వారా వ్యాపారాలు వేగంగా వృద్ధి చెంది యువతకు ఉపాధి మెరుగవుతుంది. వైద్యరంగం అభివృద్ధిపై ప్రణాళిక ఏమిటి? ఎమ్మెల్యే: వైద్య విద్య ఇప్పటికే చాలాఅభివృద్ధి చెందింది. నగరంలో వైద్య సేవలు మరింత విస్తరిస్తాం. సింగరేణి ఆధ్వర్యంలో నెలరోజుల్లోనే కార్డియాలజీ సెంటర్ ప్రారంభించి గుండెపోటు మరణాలు తగ్గిస్తాం. రూ.36కోట్లతో నర్సింగ్ భవనం, రూ.140 కోట్లతో సిమ్స్, రూ.50కోట్లతో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం.యువతకు ఉపాధి ఇచ్చే హామీ ఏమిటి? ఎమ్మెల్యే: నేను ఎమ్మెల్యేగా గెలిచాక ప్రైవేట్ ఓబీ పనుల్లో స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించా. భవిష్యత్లోనూ ఇలాగే ముందుకు సాగుతా. యువతకు ఉపాధి లభించేలా వ్యాపారాలు విస్తరింపజేస్తాం. నియోజకవర్గ ప్రజలకు భవిష్యత్లో ఏం చేస్తారు? ఎమ్మెల్యే: సింగరేణి స్థలాల్లో ఇళ్లు నిర్మించు కున్న 11 వేల మందికి పట్టాలిస్తాం. ఇప్పటికే 3,500 మందికి పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చాం. మరో దశలో 3,500 పట్టాలు మంజూరు చేసి ఇళ్లు నిర్మిస్తాం. బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు పూర్తికాగానే ఈప్రక్రియ ప్రారంభమవుతుంది. గేటెడ్ కమ్యూనిటీ విధానంలో ఇళ్లు నిర్మిస్తాం. పర్యాటకం పరిస్థితి ఏమిటి? ఎమ్మెల్యే: పర్యాటక రంగ అభివృద్ధికి ప్రణాళిక తయారు చేశాం. రెండు హరిత హోటళ్ల ఏర్పాటుకు ప్రతిపాదించాం. ఒకటి సాయిలీల హోటల్ ఎదుట, మరోటి గోదావరి వంతెన సమీప సమ్మక్క – సారలమ్మ గద్దెల వద్ద నిర్మిస్తాం. గోదావరి నదిలో కాళేశ్వరం బ్యాక్వాటర్ వస్తే ఆహ్లాదంగా తీర్చిదిద్దుతాం. ఎల్లంపల్లి, బుగ్గ సమీపంలోనూ పర్యాటక కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. గోదావరిఖని, ఎల్లంపల్లిలో వాటర్ స్పోర్ట్స్ అందుబాటులోకి తీసుకొస్తాం. మహిళా సంఘాల పాత్ర ఎలా ఉంటుంది? ఎమ్మెల్యే: మహిళా సంఘాలకు ఇప్పటికే రెండు అద్దె బస్సులు ఇచ్చాం. రూ.4కోట్లతో ఫంక్షన్, కమ్యూనిటీహాళ్లు నిర్మించి నిర్వహణ బాధ్యతలు వారికే అప్పగిస్తాం. రూ.లక్ష కోట్ల రుణాలిచ్చి అర్థికంగా బలోపేతం చేస్తాం. -
ప్రతిభావంతులకు ప్రశంస
పెద్దపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో ఈనెల 8న జరిగిన రాష్ట్రస్థాయి కరాటే పో టీల్లో గోల్డ్మెడల్ సాధించిన సహస్ర, సిల్వర్ మెడల్ సాధించిన అహ్మద్, హర్షవర్ధన్, సాహి తి, శివవర్ధిని తదితరులను కలెక్టర్ కోయ శ్రీహ ర్ష అభినందించారు. మంగళవారం కలెక్టరేట్ లో వారికి అభినందించిన కలెక్టర్.. భవిష్యత్ లో మంచిప్రతిభ చూపి మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కరాటే మాస్టర్ సంకెండ్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నేడు వేతనంతో కూడిన సెలవుపెద్దపల్లి: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పె ద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలతోపాటు రామగుండం కార్పొరేషన్లోని అ న్నిరంగాల కార్మికులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని ఉద్యోగులు, సిబ్బందికి ఈనెల 11న వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కోయ శ్రీహర్ష సూ చించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, ఇతర రంగాల యజమానులు ఈ ని బంధనలు అమలు చేయాలని సూచించారు. దరఖాస్తులు ఆహ్వానం సినిమా, నిర్మాణ రంగాల్లో స్వల్పకాలిక నైపు ణ్య కోర్సులు అందిస్తున్నామని, ఆసక్తి గలవా రు దరఖాస్తు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష తెలిపా రు. వివరాలకు 99633 13318, 90002 94176 ఫోన్ నంబర్లలో సంప్రదించాలి. స్వేచ్ఛగా ఓటు వేయండికోల్సిటీ(రామగుండం): రామగుండం నగరంలో బుధవారం జరిగే ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛ గా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ కోరారు. శా రదానగర్ శిశుమందిర్ స్కూల్లో ఏర్పాటు చే సిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లో మంగళవారం సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ చే శారు. కమిషనర్ మాట్లాడుతూ, ఒకటో డివిజ న్ మినహా మిగిలిన 59 డివిజన్లలో బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వ రకు పోలింగ్ జరుగుతుందన్నారు. ప్రతీపోలింగ్ కేంద్రంలో తాగునీరు, మరుగుదొడ్లు తదితర వసతులు కల్పించామని కమిషనర్ అన్నారు. నడవలేని వారికోసం చక్రాల కుర్చీలు, సా యం చేసేందుకు వలంటీర్లను అందుబాటులో ఉంచామని అన్నారు. హెల్ప్డెస్క్, మెడికల్ క్యాంప్ కూడా ఉంటాయని ఆమె వివరించారు. ఎన్నికలకు పటిష్ట బందోబస్తుసుల్తానాబాద్రూరల్: మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని డీసీపీ రాంరెడ్డి అన్నారు. పోలీస్ సిబ్బందికి మంగళవారం ఆయన బందోబస్తుపై దిశానిర్దేశం చేశా రు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఏసీపీ కృష్ణ, సీఐలు సుబ్బారెడ్డి, కృష్ణారెడ్డి, ఎస్సైలు అశోక్రెడ్డి, వెంకటేశ్, రమేశ్, సనత్రెడ్డి, మధుకర్, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు. విద్యారంగానికి నిధులివ్వాలి పెద్దపల్లి: విద్యా రంగానికి బడ్జెట్లో 30 శాతం నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్ కోరారు. జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన ఎస్ఎఫ్ఐ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని, స్కా లర్షిప్లు, ఫీజురీయంబర్స్మెంట్ సకాలంలో విడుదల చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అ ధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని, విద్యారంగానికి బడ్జెట్లో 7.8 శాతమే నిధులు కేటాయించి అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ల సందీప్, జిల్లెల ప్రశాంత్, ఉపాధ్యక్షులు రాజ్కుమార్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి ఓటెయ్యండి
సాక్షి పెద్దపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసిఓటు వేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కోరారు. సీఎం రేవంత్రెడ్డితో తనకున్న సాన్నిహిత్యంతో ఇప్పటికే నియోజకవర్గానికి రూ.1,000కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. భవిష్యత్లోనూ నిధులు భారీగా తీసుకొచ్చి పెద్దపల్లి, సుల్తానాబాద్ను ఆదర్శ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దుతానని ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే మరింత అభివృద్ధి సాధ్యమన్నారు. ఆయన మాటల్లోనే.. ఎన్నికల ప్రచారం ఎలా జరిగింది. ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ఎమ్మెల్యే: గత పదేళ్లలో కాని అభివృద్ధి రెండేళ్లల్లో చేశాం. అనేక సంక్షేమ పథకాలను అమలు చేశాం. ప్రజల్లో సానుకూలత కనిపిస్తుంది. అభివృద్ధి, సంక్షేమ ఫలాలను గడపగడపకూ తీసుకెళ్లాం. పెద్దపల్లి, సుల్తానాబాద్లో మెజార్టీస్థానాలు కై వసం చేసుకుని కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం. పెద్దపల్లిలో మీరు చేసిన అభివృద్ధి ఏమిటి? ఎమ్మెల్యే: పట్టణ అభివృద్ధికి రూ.77.50 కోట్లు వెచ్చించాం. బస్సు డిపో ఏర్పాటు, బైపాస్రోడ్డు, కోర్టు భవన నిర్మాణం, 50 పడకల నుంచి 100 పడకలకు ప్రభుత్వ ఆస్పత్రి ఆధునికీకరణ, సీటీస్కాన్, ఎంఆర్ఐ అందుబాటులోకి తీసుకొచ్చాం. నేను ఎమ్మెల్యేగా గెలిచిన రెండేళ్లలో రూ.40 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాం. వసతులు కల్పించాం. పట్టణ ప్రజల దాహం తీర్చేందుకు ఆర్డీవో కార్యాలయంలో కొత్తగా వాటర్ ట్యాంక్, చందపల్లి డబుల్బెడ్రూమ్ ఇళ్ల ప్రాంతంలో వాటర్ ట్యాంక్ నిర్మిస్తున్నాం. రూ 62.50 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించాం, మరో రూ.15 కోట్లు మంజూరు చేయించాం. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఆధునికీకరణ కోసం రూ.7.5 కోట్లు కేటాయించాం. క్రీడల కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాం. వ్యవసాయ మార్కెట్లో ఇండోర్ బ్యాడ్మింటన్ షటిల్ స్టేడియం నిర్మాణానికి డీఎంఎఫ్టీ నుంచి రూ.2.5 కోట్లు కేటాయించి పనులు చేపట్టాం. గెలిస్తే సుల్తానాబాద్ను ఎలా అభివృద్ధి చేస్తారు? ఎమ్మెల్యే: సుల్తానాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యం. గత పాలకులు తరలించిన కార్యాలయాలను వెనక్కి తీసుకొచ్చా. రెండేళ్లలోనే రూ.20 కోట్లతో అభివృద్ధి చేశాం. రూ.15 కోట్లతో పనులు జరుగుతున్నాయి. రూ.8.50కోట్ల పెద్దచెరువును మినీట్యాంక్ బండ్ మార్చుతాం. ఐబీపాత భవనం కూల్చివేసి రూ.4కోట్లతో కొత్త భవనం నిర్మిస్తాం. రూ.4కోట్లతో కొత్త బస్టాండ్ కట్టిస్తాం. పాత భవనాలు తొలగించి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం. వర్షపు నీరు బయటికి వెళ్లేలా చర్యలు తీసుకుంటాం. అంబేడ్కర్ కాంశ్య విగ్రహం సొంతఖర్చులతో ఏర్పాటు చేస్తా. రూ.65 లక్షలతో ఇటీవల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాం. తెలంగాణ చౌరస్తా – గట్టపల్లి క్రాసింగ్ వరకు రూ.7.50 కోట్లతో సెంట్రల్ లైటింగ్ సిస్టం చేపడతాం. బీఆర్ఎస్, బీజేపీలలో మీకు దేనితో పోటీ అని భావిస్తున్నారు? ఎమ్మెల్యే: బీఆర్ఎస్, బీజేపీలకు అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉంది. పదేళ్ల బీఆర్ఎస్.. పట్టణ అభివృద్ధిని గాలికొదిలేసింది. 8 మంది ఎంపీలను గెలిపించిన బీజేపీ.. కేంద్రం నుంచి రాష్ట్రానికి తెచ్చిన నిధులు సున్నా. అందుకే రాష్ట్రంలో అధికారంలో ఉన్న మా పార్టీ అభ్యర్థులనే కౌన్సిలర్లుగా గెలిపిస్తే అభివృద్ధి సాధ్యం. ఈవిషయాన్ని గుర్తించి ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టాలని కోరుతున్నాం. -
శివాలయంలో రుద్రాభిషేకం
జూలపల్లి: మండల కేంద్రంలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ఆలయ అర్చకులు ఉద్దండ నవీన్ రుద్రాభిషేం నిర్వహించారు. హాజరైన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ పొట్టాల మల్లేశం, కోశాధికారి రమేశ్, ధర్మకర్తలు దేవసాని శంకరయ్య, వజ్రారెడ్డి, వెంకటరమణ ఉన్నారు. ఫెర్టిలైజర్సిటీ: రామగుండం కార్పొరేషన్ 21వ డివిజన్ ఎల్కలపల్లిగేట్లో మూడేళ్ల చిన్నారిపై కోతులు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం లక్ష్మీపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించి రేబీస్ ఇంజక్షన్ వేశారు. కోతుల బెడద నుంచి ప్రజలను కాపాడాలని కాలనీవాసులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. జ్యోతినగర్: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఐఎన్టీయూసీ జాతీయ సీనియర్ కార్యదర్శి బాబర్ సలీంపాషా అన్నారు. ఎన్టీపీసీ రామగుండం ఎఫ్సీఐ క్రాస్ రోడ్ ట్యాక్సీ, ఆటో స్టాండ్ యూనియన్ సభ్యులతో సోమవారం ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రామగుండం కార్పొరేషన్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న 60మందిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు భూమల్ల చందర్, ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ నాయకుడు ఆరెపల్లి రాజేశ్వర్, ట్యాక్సీ, ఆటో యూనియన్ సభ్యులు సభ్యులు పాల్గొన్నారు. ఓదెల: కాజీపేట్ టూ బల్హార్షా సెక్షన్ల మధ్యలోని ఓదెల రైల్వేస్టేషన్లో తిరుపతి, అండమాన్ రైళ్లు, కొలనూర్, పొత్కపల్లి రైల్వేస్టేషన్లో అజ్నీ రైళ్ల హాల్టింగు కోసం న్యూఢిల్లీలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ నివాసంలో కాంగ్రెస్ మండల నాయకుడు అల్లం సతీశ్ సోమవారం వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎంపీ పార్లమెంట్ సమావేశాల్లో రైల్వేశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి రైళ్ల హాల్టింగ్ కల్పిస్తానని హామీ ఇచ్చినట్లు సతీశ్ తెలిపారు. పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆఖరు రోజున ప్రచారం హోరెత్తించారు. పోటీపడుతున్న అభ్యర్థులు వాడవాడలా కార్నర్ మీటింగ్లు నిర్వహించి ఓటర్ల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నించారు. ఒకే వార్డులో ప్రధాన పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు తమ మద్దతుదారులతో ర్యాలీలు నిర్వహించేందుకు పోటీపడ్డారు. ఆ వార్డు ఓటర్లతోనే ప్రదర్శనలు నిర్వహించడంతో ఓ పార్టీ ప్రచారం పూర్తయ్యాక.. వారే మళ్లీ వేరొక పార్టీకి మద్దతుగా ప్రదర్శనలో పాల్గొనడం గమనార్హం. -
ఓటర్లూ.. ఆత్మసాక్షిగా ఓటెయ్యండి
గోదావరిఖని/పెద్దపల్లిరూరల్: తామిచ్చే హామీలు, పార్టీల మాటలు విని మున్సిపల్ ఎన్నికల్లో ఆత్మసాక్షిగా ఓటు వేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. గోదావరిఖని, పెద్దపల్లి, సుల్తానాబాద్లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచారం, అనంతరం జరిగిన విలేకరుల సమావేశాల్లో కిషన్రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో ప్రజాపాలన తీసుకొస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కహామీ కూడా నెరవేర్చలేదని, పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్రానికి చేసిందేమిలేదని విమర్శించారు. బకాయిల పేరుతో సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ దోచుకున్నాయని ఆరోపించారు. సైట్విజిట్ పేరుతో రాష్ట్రం ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ, సింగరేణి యాజమాన్యం దోషం ఉందని అన్నారు. సింగరేణి సంస్థకు పర్మినెంట్ సీఎండీని, మంచి డైరెక్టర్లను నియమిస్తామన్నారు. రూ.1,700 కోట్ల డీఎంఎఫ్టీ నిధులను సింగరేణి ప్రాంతంలోని పదిజిల్లాలకే చెందేలా చూస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉందని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు ఎస్.కుమార్, కందుల సంధ్యారాణి, బల్మూరి వనిత, గుజ్జుల రామకృష్ణారెడ్డి, తూడి రవీందర్, కర్రె సంజీవరెడ్డి, ఠాకూర్ రాంసింగ్, పర్శ సమ్మయ్య, శ్రీనివాసరావు, సదానందం, మోర మంజుల, మనోహర్, శివంగారి సతీశ్, శ్రీనివాస్, రాణీరుద్రమదేవి, గొట్టిముక్కుల సురేశ్రెడ్డి, నల్ల మనోహర్రెడ్డి, కడారి అశోక్రావు, సౌదరి మహేందర్ యాదవ్, కామని రాజేంద్రప్రసాద్, కందుల శ్రీనివాస్, కొమ్ము తిరుపతి, మహేశ్పటేల్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి -
మహిళల రక్షణ కోసం షీటీంలు
జ్యోతినగర్: మహిళల రక్షణ కోసమే షీటీంలు పనిచేస్తాయని షీటీం సభ్యురాలు స్నేహలత అన్నారు. ఎన్టీపీసీ రామగుండం సింధూర కళాశాల రోడ్లోని బచ్పన్ స్కూల్లో షీటీమ్ ఇన్చార్జి లావణ్య ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు, విద్యార్థులు 63039 23700 నంబర్కు ఫోన్ చేసి సమస్య తెలియజేయాలని సూచించారు. షీటీమ్ సభ్యులు మౌనిక, సురేశ్, డైరెక్టర్స్ శ్రీధర్, లావణ్య, ప్రిన్సిపల్ ఆయేషా పాల్గొన్నారు. -
అసత్య ప్రచారాలను నమ్మి మోసపోవద్దు
సుల్తానాబాద్ రూరల్: పార్టీ నేతల అసత్య ప్రచారాలు నమ్మి మోసపోవద్దని బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి రమణారావు అన్నారు. సుల్తానాబాద్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే సుల్తానాబాద్ మున్సిపల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో కొన్ని పనులు మిగిలిపోయాయని, వాటిని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తూ తాఆమే సుల్తానాబాద్ పట్టణం అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎంపీపీ పాల రామారావు, తాళ్లపల్లి మనోజ్గౌడ్, మాజీ సర్పంచ్ కోడెం అజయ్, పారుపల్లి గుణపతి, సింగిల్విండో మాజీ చైర్మన్ సందీప్రావు, అనుమాల బాపూరావు, మల్లికార్జున్, అరుణ్, పురం రమణ పాల్గొన్నారు. -
ప్రలోభాల జాతర
సాక్షి పెద్దపల్లి: ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది మొదలు మైకుల మోతలు.. ప్రచార వాహనాల చక్కర్లు.. కార్నర్ మీటింగులు.. బైక్ర్యాలీల హోరు.. రోజూ నిద్రలేచింది మొదలు.. పొద్దుగూకే వరకూ విరామం లేకుండా ఇంటింటికీ వెళ్లి ఓటర్ల దరిచేరిన అభ్యర్థనలు ఎట్టకేలకు సోమవారం మగిశాయి. ప్రచారానికి తెరపడింది. మైకులు మూగబోయాయి. ప్రలోభాల పర్వం ఊపందుకుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఒక్కోఅభ్యర్థి ఒక్కో ప్రయత్నం.. ఎలాగైనా విజయం సాధించాలనే తాపత్రయం. ఎంతఖర్చు అయినా ఓట్లు తమకే పడాలని, కౌన్సిలర్/కార్పొరేట్గా ప్రమాణస్వీకారం చేయాలని, చివరిరోజు జోరుప్రచారం చేసిన అభ్యర్థులు ప్రలోభాలకు తెరతీశారు. ఇకఓట్లు వేసే సమయమే మిగిలిఉంది. బలప్రదర్శనతో ముగింపు చివరిరోజు అన్ని పార్టీల అభ్యర్థులు సాధ్యమైనంత ఎక్కువమంది కార్యకర్తలతో బలప్రదర్శన చేశారు. ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున మంత్రిశ్రీధర్బాబు, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్సింగ్, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, బీజేపీ అభ్యర్థులకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, బీఆర్ఎస్కు మాజీ ఎమ్మెల్యేలు కో రుకంటి చందర్, పుట్ట మధు, దాసరి మనోహర్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మిగిలిన అభ్య ర్థులు సొంతంగానే ఓట్లు కోసం ప్రచారం చేశారు. ఫలితాలు తారుమారయ్యేది ఇప్పుడే.. ఎన్నికల క్రతువులో కీలకంగా భావించే కొన్నిగంటల్లోనే ఫలితాల్ని తారుమారు చేసేందుకు కొందరు అభ్యర్థులు తెరవెనుక రాయ్ఙబేరాలుశ్రీ సాగిస్తున్నారు. డబ్బు, మద్యం.. ఇలా ఏదైనా సరే.. సింగిల్గానైనా.. ఫ్యామిలీ ప్యాకేజీగానైనా ఓకే.. కానీఓట్లు తప్పకుండా తమకే అంటూ తాయిలాలు ఎరవేస్తున్నారు. ఇప్పటికే ప్రచార పర్వంలో ఖర్చు తడిసి మోపైడెనా.. పోలింగ్కు ముందు కీలకమైన ఈ సమయంలోనే వెచ్పించే డబ్బులే ఫలితాన్ని నిర్ణయిస్తాయని అభ్యర్థులు చెబుతున్నారు. ఒక్కోవార్డులో ఒక్కోలా.. ఈ రెండురోజుల్లో కొందరు ఎంతలేదన్నా ఇప్పటివరకు ఖర్చుచేసిన దానికి అదనంగా రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. రిజర్వుడ్ స్థానాల్లోనూ ఖర్చుకు వెనకాడడం లేదంటున్నారు. ప్రత్యర్థి ఓటుకు ఎంత ఇస్తున్నాడని ఆరా తీస్తూ, దానికి అదనంగా పంచేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దాదాపుగా అన్ని బల్దియాల్లో ఓటుకు తక్కువలో తక్కువగా రూ.1,500 నుంచి రూ.3,000 వరకు పంచేందుకు కొందరు సిద్ధమయ్యారు. పోటాపోటీ డివిజన్లు/వార్డులు, చైర్మన్ అభ్యర్థులు పోటీచేస్తున్న ప్రాంతాల్లో ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5వేల వరకూ పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. డిజిటల్ పేమెంట్స్రూపంలోనే.. ఇంటింటికీ తిరిగి పంపిణీ చేయడం రిస్క్తో కూడున్నది కావడంతో కొందరు అభ్యర్థులు అనుచరుల ద్వారా గూగుల్, ఫోన్పే, పేటీఎంతో ఓటర్లకు నేరుగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. దీనిద్వారా ఓటరుకు నేరుగా డబ్బు చేరడంతోపాటు, రిస్క్ తక్కువని భావిస్తున్నారు. మరికొందరు అభ్యర్థులు.. కుటుంబంలో 5 ఓట్లకుపైగా ఉంటే వారికి నేరుగా మొబైల్ ఫోన్స్, వెండికాయిన్లు పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం చీటీలు రాసి సమీప షోరూంలో వాటిని తీసుకోవాలని ఆఫర్ చేస్తున్నారు. నేరుగా డబ్బులు పంపిణీ చేశాక వారితో ప్రమాణం చేయించుకుంటూ ఓటును ఖరారు చేసుకుంటున్నారు. ముగిసిన ప్రచార ఘట్టం మున్సిపల్లో పోటాపోటీ.. మంథని: మంథనిలోని 13 వార్డుల్లో 48 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీ ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున మంత్రి శ్రీధర్బాబు ఇంటింటా ప్రచారం, ర్యాలీ, రోడ్డుషోలు నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ప్రచారం చేశారు. ప్రచారం గడువు ముగియడంతో మైక్ల మోతలు, డప్పుచప్పుళ్లు ఆగిపోయాయి. రాత్రి సమయాల్లో ఓటర్లకు మద్యం పంచేందుకు కొందరు అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంటికి రూ.2వేల నుంచి రూ.3వేలు, మద్యం, చీర, ఇతరత్రా విలువైన వస్తుసామగ్రి పంచి ఓటరును ఆకర్షించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. -
మదర్ థెరిసాలో డిప్లొమా విద్యార్థులకు వర్క్షాప్
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మదర్ థెరిసా ఇంజనీరింగ్ కాలేజీలో టాస్క్ ఆధ్వర్యంలో డీబీఎంఎస్ ప్రోగ్రామింగ్ విత్ ఎస్క్యూఎల్ అనే అంశంపై మూడురోజుల వర్క్షాప్ సోమవారం ప్రారంభమైంది. డీబీఎంఎస్ ప్రోగ్రామింగ్ విత్ ఎస్ క్యూ ఎల్కి సంబంధించి అత్యాధునిక ప్రయోగశాలలు కల్పించినట్లు రిసోర్స్ పర్సన్ రత్నప్రియ తెలిపారు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఏవో పవన్కుమార్, అకడమిక్ ఇన్చార్జి ఇజాజ్ఖాన్, హెచ్వోడీ శశికాంత్, నవ్య, షాకీర్, శిరీష పాల్గొన్నారు. -
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తున్న విద్యార్థిని సీపీ: భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాం. సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నాం. క్విక్ రెస్పాన్స్ టీంలను నియమించాం. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించాం. సీపీ: సమీప పోలీసు బలగాలు వెంటనే రప్పించి పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తాం. చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. సీపీ: ఎన్నికలకు ఒకరోజు ముందు, పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు, గొడవలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశాం. సీపీ: ెపద్దపల్లి జోన్లో 5, మంచిర్యాల జోన్లో 4 ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా పెట్టాం. ఇద్దరు డీసీపీలు, ఏడుగురు ఏసీపీ లు, 28మంది సీఐలు, 86మంది ఎస్సైలు, 596 ఏఎస్సైలు, హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, 195 మంది హోంగార్డులు, 95 క్యూఆర్టీ టీంలు, రూట్మోబైల్ పార్టీలు 69,298 మంది సిబ్బందిని వినియోగిస్తున్నాం. సీపీ: ఓటర్లు ప్రశాంతంగా వచ్చి ఓటుహక్కు వినియోగించుకోవాలి. ప్రలోభాలు, వదంతులకు లోనుకావొద్దు. సీపీ: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రామగుండం,పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని ప్రాంతాల్లో 163 బీఎన్ఎస్ఎస్ యాక్టు అమలులో ఉంటుందని రా మగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. ఈనెల 9న సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు, ఈనెల 13న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్, ఫలితాలు వెల్లడయ్యే వరకూ ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన వివరించారు. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గోదావరిఖని: మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈనెల 11న పోలింగ్ నిర్వహణకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో రామగుండం కార్పొరేషన్తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలు ఉండగా, 124 డివిజన్లు/వార్డుల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 126 పోలింగ్ లొకేషన్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ సాగేందుకు పటిష్ట బందోబస్తు చేపట్టామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన మాటల్లోనే.. -
శ్రీచైతన్య విద్యార్థులకు ఘన స్వాగతం
కరీంనగర్టౌన్: మంకమ్మతోటలోని శ్రీచైతన్య డి గ్రీ, పీజీ కళాశాలకు చెందిన ఇద్దరు ఎన్సీసీ విద్యార్థులకు కరీంనగర్లో ఘన స్వాగతం లభించింది. చెందిన బి.సంధ్య, కె.అజయ్ 2026 సంవత్సరానికి ఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ డే క్యాంపునకు ఎన్నికయ్యారు. సుమారు 40 రోజులపాటు శిక్షణ పొంది జనవరి 26న రాష్ట్రపతి, ప్రధాని సమక్షంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో సంధ్య కర్తవ్యపత్ ర్యాలీలో, అజయ్ పీఎం ర్యాలీలో పాల్గొన్నారు. సో మవారం క్యాంప్ పూర్తిచేసుకొని వచ్చిన ఆ ఇద్దరితో యాజమాన్యం, అధ్యాపక బృందం, విద్యార్థులు 9టీ బెటాలియన్ సిబ్బంది ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. కళాశాల ఆవరణలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో చైర్మన్ ముద్దసాని రమేశ్రెడ్డి మాట్లాడుతూ.. దేశ రాజధానిలో నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక పరేడ్లో తమ విద్యార్థులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సన్మానం చేసి యాజమాన్యం తరఫున రూ.25,000 చొప్పున నగదు బహుమతి అందజేసినట్లు తెలిపారు. -
మాది అవినీతి రహిత పాలన
మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్బాబు, వేదికపై ఎమ్మెల్యే విజయరమణారావు, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు తదితరులు, బైక్ ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణులుపెద్దపల్లిరూరల్/మంథని: కాంగ్రెస్ హయాంలోనే ఽఅవినీతికి ఆస్కారం లేకుండా ఆదర్శవంతమైన పా లన ఉంటుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దు ద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. పెద్దపల్లిలో ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. మంథనిలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి జెండా చౌరస్తాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో మంత్రి మాట్లాడుతూ, గత ఎన్నికల్లో తామి చ్చిన హామీలు ఆచరణలో సాధ్యం కావని బీఆర్ఎస్ బద్నాం చేసినా ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకున్నామన్నారు. రెండేళ్లలోనే మంథని అభివృద్ధికి రూ.50 కోట్లు వెచ్చించినట్లు చెప్పా రు. కుల సంఘాల భవన నిర్మాణాలకు రూ.కోట్లు మంజూరు చేశామని ఆయన అన్నారు. పెద్దపల్లిలో ఆటోనగర్ పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ప్రజాధనాన్ని దోచుకోవడమే ధ్యేయంగా పనిచేసిన బీఆర్ఎస్ పాలనను తిరస్కరించి, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మె ల్యే విజయరమణారావు మాట్లాడుతూ, పెద్దపల్లి రూపురేఖల్ని మార్చుతామన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ భానుప్ర సాదరావు మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో మహిళా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి అధిత ఎన్నికల ఇన్చార్జి బొమ్మ శ్రీరాంచక్రవర్తి, పలువురు అభ్యర్థులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ అభ్యర్థి ఇంట్లో మద్యం నిల్వలు
● పట్టుకున్న ఎంఐఎం కార్యకర్తలు జగిత్యాలక్రైం/ జగిత్యాలలోని ఓ వార్డు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి ఇంట్లో మద్యం బాటిళ్లు డంప్ చేస్తుండగా ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇది తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఎంఐఎం కార్యకర్తలు పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకుని పరిశీలించి వెళ్లిపోయారు. సదరు అభ్యర్థి ఇంట్లోకి వెళ్లకపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతోనే పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోచీబజార్లో మద్యం పట్టివేత పట్టణంలోని మోచీబజార్లో ఆదివారం రాత్రి ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సుప్రియ తెలిపారు. రూ.3,250 విలువైన 13 లీటర్ల మద్యాన్ని ఇంట్లో ఉంచగా.. పోలీసులు పట్టుకున్నారు. అరవింద్నగర్కు చెందిన ఒకరి ఇంట్లోనుంచి రూ.3వేల విలువైన 2.5లీటర్ల మద్యాన్ని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుప్రియ తెలిపారు. -
ప్రజలు రాసిన తీర్పు ఇది
కోల్సిటీ(రామగుండం): అధికార యంత్రాంగం, రాజకీయ శక్తుల అంచనాలు తలకిందులు చేస్తూ ప్రజల మనసును గెలుచుకున్న తొలిమున్సిపల్ ఎన్నికలు రామగుండం రాజకీయ చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచాయి. పెద్దగా ఖర్చులేదు. హడావుడి ప్రచారం లేదు. ఇంటింటా ఒకటేమాట.. వ్యక్తిగత పరిచయం.. సమస్యలపై స్పష్టమైన హామీలే ఆయుధంగా చేసుకున్న అభ్యర్థులు.. ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. దీనివెనుక ఉన్న వ్యూహం, ప్రజల స్పందన, అభివృద్ధిపై మాజీ కౌన్సిలర్ల అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. దగ్గరితనం గెలిపించింది శ్రీతొలిమున్సిపల్ ఎన్నికల సమయంలో మేం ఎదుర్కొన్న ప్రధాన సవాల్ వనరుల కొరత. భారీఫ్లెక్సీలు, వాహనయాత్రలు లేవు. మేమే ఒక్కోవార్డు తిరిగి ఓటర్లతో మాట్లాడాంశ్రీ అని మాజీ కౌన్సిలర్ ఒకరు గుర్తు చేసుకున్నారు. సగటున ఒక్కో అభ్యర్థి చేసిన మొత్తం ఖర్చు ప్రస్తుతంతో పోల్చితే చాలా తక్కువన్నారు. అభివృద్ధికి తొలిఅడుగులు ఎన్నికల తర్వాత కౌన్సిల్ తొలిప్రాధాన్యంగా వసతుల కల్పనపై దృష్టి పెట్టింది. డ్రైనేజీల నిర్మాణం, తాగునీటి సరఫరాలో నాణ్యత, మెయిన్రోడ్ల అభివృద్ధి, విద్యుత్ సదుపాయాలు మెరుగుపర్చింది. రాజకీయానికి పునాది తొలిమున్సిపల్ ఎన్నికలు రామగుండంలో ప్రజాస్వామ్యానికి బలమైన పునాది వేశాయి. డబ్బుకన్నా ప్రజల నమ్మకమే గెలుపునిచ్చే శక్తి అనే సందేశం ఇచ్చాయి. ఆ అనుభవాలు కొత్తతరం నేతలకు మార్గదర్శకమవుతున్నాయి. 1998లో జరిగిన తొలిమున్సిపల్ ఎన్నికల్లో 30వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా పోటీచేసి గెలిచా. కేవలం రూ. మూడు వేలే ఖర్చయ్యాయి. నోటిఫైడ్ ఏరియా నుంచి చురుకుగా, సేవాభావంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్నా. ఇవే నన్ను రాజకీయాల వైపు నడిపించాయి. 1995లో కాంగ్రెస్ పార్టీలో చేరా. కౌన్సిలర్గా పోటీచేయాలని శ్రీపాదరావు టికెట్ ఇచ్చారు. నేను నిర్మించిన రోడ్లు ఇప్పటికీ మన్నికగా ఉన్నాయి. – మారెల్లి రాజిరెడ్డి, మాజీ కౌన్సిలర్ -
స్ట్రాంగ్రూమ్ల వద్ద భద్రత
గోదావరిఖని: స్థానిక డిగ్రీకళాలలోని స్ట్రాంగ్రూమ్లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భ ద్రత చేపట్టాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి సూ చించారు. స్థానిక సరస్వతి శిశుమందిర్ పాఠశాల ఆవరణలోని రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్ట్రాంగ్రూ మ్, కౌంటింగ్ కేంద్రాలను ఆయన సోమవా రం తనిఖీ చేశారు. బ్యాలెట్ బాక్స్ల పంపిణీ, స్ట్రాంగ్రూమ్లలో భద్రత, సీసీ కెమెరాల ఏ ర్పాటు తదితర అంశాలపై నిర్లక్ష్యం వహించవద్దని ఆదేశాలు జారీచేశారు. ఏసీపీ ర మేశ్, సీఐ ఇంద్రసేనారెడ్డి తదితరులు ఉన్నారు. ఎన్నికలకు గట్టి బందోబస్తు సుల్తానాబాద్రూరల్: మున్సిపల్ ఎన్నికలకు ప టిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని డీసీపీ రాంరెడ్డి అన్నారు. పూసాల జెడ్పీహెచ్ఎస్, గడిమహెల్ బాలికల జెడ్పీ హైస్కూల్లోని సమస్యాత్మాక పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఏసీపీ కృష్ణ, సీఐ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. గని కార్మికుల నిరసన గోదావరిఖని: తమపై మహిళా కార్మికురాలు దురుసుగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఆ ర్జీ–1 ఏరియా జీడీకే–1వ గనిపై సింగరేణి కా ర్మికులు సోమవారం నిరసన తెలిపారు. సుమా రు 3గంటల పాటు గనిపై బైఠాయించి కార్మికు రాలికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధ్యురాలిపై చర్యతీసుకుంటే తప్ప ఆందోళన విరమించేది లేదని వారు భీష్మించుకు కూర్చున్నా రు. జీఎం వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్ చే శారు. చివరకు జీఎం హామీతో కార్మికులు ఆందోళన విరమించి విధులకు హాజరయ్యారు. స్విమ్మింగ్లో గోల్డ్మెడల్ కోల్సిటీ(రామగుండం): గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో చేపట్టిన జిల్లాస్థా యి సీఎం కప్ స్విమ్మింగ్ పోటీలు సోమవారం ముగిశాయి. అంతర్గాం జెడ్పీహెచ్ఎస్ పీడీ శో భారాణి, స్విమ్మింగ్ కోచ్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. 30 మంది క్రీడాకారు లు హాజరయ్యారు. లింగాపూర్ మోడల్ స్కూ ల్ పదోతరగతి విద్యార్థి కట్కూరి విఘ్నదీప్ బ్యాక్ స్ట్రోక్ 100 మీటర్లలో గోల్డ్ మెడల్ సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. శో భారాణి, కోచ్ కృష్ణమూర్తి విద్యార్థిని అభినందించారు. గ్రూప్–1 ఫ్రీస్టైల్ 100 మీటర్లలో కె. బాలాజీ ప్రథమ, ఎం.అర్జున్ ద్వితీయ స్థానం దక్కించుకున్నారు. బటర్ఫ్లై 100 మీటర్ల విభాగంలో ఎం.అర్జున్ ప్రథమ, కె.ప్రణీత్ ద్వితీయ స్థానంలో నిలిచారు. పీఈటీలు మౌనిక, నిర్మల, అంజలి పాల్గొన్నారని జిల్లా యువజ న, క్రీడాధికారి సురేశ్ తెలిపారు. ప్రణాళికతో చదవాలి పెద్దపల్లి: పదో తరగతి విద్యార్థులు ప్రణాళిక తో చదివితే విజయం సొంతమవుతుందని జి ల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రవీందర్ అన్నారు. ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల వ సతి గృహాల్లోని పదో తరగతి విద్యార్థులకు జి ల్లా కేంద్రంలో సోమవారం ప్రేరణ అవగాహన తరగతులు నిర్వహించారు. టెన్త్లో వందశా తం ఉత్తీర్ణత సాధించాలని కోరారు. డీఈవో శా రద మాట్లాడారు. ప్రతినిధులు శ్రావణ్కుమా ర్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. క్వింటాల్ పత్తి రూ,7,599 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.7,599 ధర నమోదైందని మార్కెట్ ఇన్చార్జి కార్యదర్శి ప్రవీణ్రెడ్డి తెలిపారు. కనిష్టంగా రూ.6,021, సగటున రూ.7,300గా ధర ఉందన్నారు. 1,118 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు. రూ.50కోట్లతో కొత్తశోభ సుల్తానాబాద్ రూరల్: సుల్తానాబాద్ మున్సిప ల్ను మరో రూ.50కోట్లతో అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచా ర ముగింపు ర్యాలీలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. -
డబ్బు, మందు పంచలేదు
నేను ఆర్ఎంపీగా సేవలు అందించా. పదోవార్డు నుంచి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. డబ్బులు, మందు పంపిణీ చేయలేదు. నా మీద అభిమానంతోనే కౌన్సిలర్గా గెలిపించారు. ప్రచారం కోసం రూ.20 వేల వరకే ఖర్చు అయింది. వాల్రైటింగ్ ద్వారా ప్రచారం చేశా. రోడ్లు, వీధిలైట్లు డ్రైనేజీలు నిర్మించా. ప్రస్తుత కూరగాయల మార్కెట్ వద్ద డ్రైనేజీ నిర్మించింది మా హయాంలోనే. 2001లో సింగరేణిలో ఉద్యోగం వచ్చినా ఆంక్షలు లేవు. కౌన్సిలర్గా సేవలు అందించా. – రేవెల్లి రాజయ్య, మాజీ కౌన్సిలర్ ఐదోవార్డు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి కౌన్సిలర్గా గెలుపొందా. పార్టీ కరపత్రాలు, జండాలు పంపించింది. 20 మందితో ప్రచారం చేశాం. వాల్ రైటింగ్, ఆటోకు మైకుపెట్టి మైక్లో మాట్లాడుతూ ప్రచారం చేశా. సుమారు రూ.25వేలే ఖర్చయింది. అప్పటివరకు రోడ్లకు నోచుకోని గ్రామాలకు రోడ్లు నిర్మించాం. వీధిలైట్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేశాం. మేం వేసిన రోడ్లే ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఆ తర్వాత ఎన్నికలకు రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి రావడంతో దూరంగా ఉంటున్నా. – మామిడాల చంద్రయ్య, మాజీ కౌన్సిలర్ 2004లో జరిగిన ఎన్నికల్లో 33వ వార్డు నుంచి ఎస్టీ రిజర్వేషన్తో గెలిచిన తొలి కౌన్సిలర్ను నేనే. అప్పుడు ఖర్చు కూడా తక్కువే. నేను గెలిచిన వార్డు చాలా పెద్దది. చాలాఅభివృద్ధి పనులు చేసేఅవకాశం దొరికింది. ఎన్టీపీసీ నిర్మాణానికి రాళ్లుమోసిన వలస కుటుంబాలకు అండగా నిలిచిన. పీకే రామయ్యకాలనీలో 664 ఇండ్లు పునరావాసం కోసం ప్రభుత్వ సహకారంతో ఇప్పించా. ప్రగతినగర్లో 360 పట్టాలు, అలేఖ్య థియేటర్ వద్ద 170 ఇళ్లు ఇప్పించా. – కేతావర్ కృష్ణ, మాజీ కౌన్సిలర్ -
కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ
జ్యోతినగర్(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 13న నిర్వహించనున్న ఓట్లలెక్కింపు ప్రక్రియలో పాలుపంచుకునే సిబ్బందికి ఎన్టీపీసీ టౌన్షిప్లోని కాకతీయ కల్యాణ మండపంలో సోమవారం శిక్షణ ఇచ్చారు. 72 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 144మంది కౌంటింగ్ అసిస్టెంట్లను నియమించగా.. వారికి వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ,, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఆర్వో ఆంజనేయులు, ఏసీపీ శ్రీహరి, టీపీఎస్ నవీన్, ట్రెయినర్లు కేడం శ్రీనివాస్, జక్కం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సార్వత్రిక సమ్మె విజయవంతం చేయండి
జ్యోతినగర్: కేంద్రంలో పీఎం మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక విధానాలకు నిరసనగా 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని హెచ్ఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ ఉపేందర్ కోరారు. ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు లేబర్ గేట్ రోడ్లో ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమ్మెలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చిలుక శంకర్, గీట్ల లక్ష్మారెడ్డి, ఇజ్జగిరి భూమయ్య, రాధారపు రాజమల్లయ్య, లక్ష్మ ణ్, పలువురు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో చేరిక
జ్యోతినగర్: ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ అన్నారు. ఎన్టీపీసీ రామగుండంలో 24వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి కొలని కవితారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్ల విజయ్రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు చేతి గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కొత్త విద్యుత్ కేంద్రం స్థాపనతో ఉపాధి కల్పన రామగుండం: త్వరలోనే రామగుండంలో కొత్త విద్యుత్ కేంద్రం స్థాపనతో ఉపాధి కల్పన మెరుగుపడుతుందని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు సలీంబేగ్ ఆధ్వర్యంలో 27వ డివిజన్ విద్యుత్నగర్కు చెందిన బీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు సిరంశెట్టి శ్రీనివాస్, ప్రతినిధులు తాటి కొమురయ్య, సంతోష్కుమార్, మహిపాల్రెడ్డి, రాజిరెడ్డి, వెంకన్న, సతీశ్కు ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
అంతా ఓకేనా..
నేడు ఎన్నికల ప్రచారం సమాప్తం ● ప్రచార సరళిపై అభ్యర్థుల సమీక్ష ● నేడు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెర ● చివరిరోజు ధూంధాం ప్రచారానికి నాయకుల ప్రణాళికసాక్షి పెద్దపల్లి: హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల ప్రచా రానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఈనెల 11న పోలింగ్ జరుగనుంది. నిబంధనల ప్రకారం పోలింగ్కు 48 గంటల ముందే ప్రచారం ముగించాల్సి ఉంటుంది. దీంతో సోమవారం సాయంత్రం 5 గంటల వరకే ప్రచారానికి గడువు ఉంది. ఈ సమయం చాలా విలువైనదిగా అభ్యర్థులు భావిస్తున్నారు. నిధుల కొరతను అధిగమిస్తూ వ్యాపారులు, ఇతర రంగాల వారి సాయం తీసుకుని ఖర్చులకు వెచ్చించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. లోటుపాట్లు సర్దుకునే యత్నం ప్రచారంలో చిన్నచిన్న లోటుపాట్లను సర్దుకునేందుకు అభ్యర్థులు ఆలోచిస్తున్నారు. అసంతృప్తులు చేజారకుండా నమ్మకస్తులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. స్వయంగా కలవని ఓటర్లను ఫోన్ ద్వారా పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. దూరప్రాంతాల్లోని వారిని ఇక్కడకు రప్పించేందుకు రవాణా చార్జీలు భరిస్తామని, తమకు ఓటువేయాలని వేడుకుంటున్నారు. ఇలాంటి వారి జాబితా తయారుచేసుకొని వారితో మాట్లాడే బాధ్యతను అనుచరులకు అప్పగిస్తున్నారు. కులాల వారీగా సమీక్షిస్తున్నారు. తటస్థ ఓటర్లు ఎటువైపు? అభ్యర్థులు, ముఖ్యనేతలు జాబితా ఆధారంగా ఓట ర్ల వివరాలు తెలుసుకునేందుకు డివిజన్లలో జల్లెడ పడుతున్నారు. అనుకూలంగా ఓట్లు వేసే వారెంద రు? ప్రత్యర్థికి ఓట్లు వేసే వారెందరు? తటస్థులు ఎందరు? అనే వివరాలు సేకరిస్తున్నారు. దీనిద్వా రా చీలిపోయే ఓట్లు ఏ అభ్యర్థికి నష్టం కల్గిస్తాయి? అనే ప్రాథమిక అంచనాకు వస్తున్నారు. తమకు తప్పక ఓట్లు వేస్తారని భావిస్తున్న ఓటర్లను కాపాడుకోవడంతోపాటు వైరిపక్షానికి వెళ్తారని భావిస్తున్న ఓటర్లు, తటస్థులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. తమవైపు తిప్పుకోవడానికి యత్నిస్తున్నారు. కాలనీపెద్దలతో మమేకమవుతూ ఎవరు చెబితే వింటారో?వారితో ఫోన్లు చేయిస్తూ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, బస్తీవాసులు ప్రస్తావిస్తున్న డిమాండ్లను నెరవేరుస్తామని హామీలిస్తున్నారు. ముఖ్యల ఇళ్లకు ప్రత్యర్థులు వెళ్లిరాగానే, ఇతర అభ్యర్థులు వెంటనే ఆ ఇళ్ల వద్దకు వెళ్లి తమకే మద్దతు ఇవ్వాలని వేడుకుంటున్నారు. చివరిరోజు బలనిరూపణకు సన్నద్ధం గెలుపు లక్ష్యంగా ప్రచారంలో చివరిరోజు ఇంటింటి ప్రచారంలో తమ వెనుక ఎక్కువ మంది ఉండేలా అభ్యర్థులు చాలాజాగ్రత్త తీసుకుంటున్నారు. ఇలాచేస్తే తమకే మద్దతు అధికంగా ఉందనే భావన ఓటర్లలో కలిగించవచ్చనే కోణంలో కొందరు వ్యూహాలు రచిస్తున్నారు. మరికొందరు బైక్ర్యాలీలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటుండగా, నేతల వెనుక ఉండి జైకొట్టేవాళ్ల కొరత లేకుండా వైరిపక్షం కన్నా రూ.100 కూలి అధికంగా ఇచ్చేసైనా సరే బలప్రదర్శనతో ప్రచారాన్ని ఉత్సాహంగా ముగించే ఏర్పాట్లలో నిమగ్నమైంది. ‘సండే’ ఎఫెక్ట్ ప్రచారం చివరిదశకు చేరడం.. ఆదివారం కలిసిరావడంతో జిల్లాలోని 124 వార్డులు/డివిజన్లలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ముందస్తు ప్రలోభాలకు తెరతీశారు. ఉదయం వేళ ఓటర్ల కుటుంబాల ఇళ్లకు చికెన్ పంపిణీ చేశారు. రోజూ చీఫ్ లిక్కర్ తాగేవాళ్లు కూడా బ్రాండ్ మారుస్తుండటంతో అభ్యర్థులు వారికి కాస్ట్లీ మద్యం పంపిణీ చేశారు. ఇది తెలిసిన మిగిలిన వార్డు ఓటర్లు కూడా తమకు చికెన్ కావాలంటూ అభ్యర్థులకు ఫోన్స్చేసి మరీ డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. పెద్దపల్లి: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 5 గంటలకు తెరపడనుంది. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ఎన్నికల ప్రచారం ఉధృతం చేశారు. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఈ ఎన్నికలను సవాల్గా తీసుకుని ప్రచారం ముమ్మరం చేశారు. మున్సిపల్పై జెండా ఎగురవేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నారు. కార్నర్ మీటింగ్లతో ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో ఎన్నికల ప్రచారం చేశారు. మరోవైపు.. గోదావరిఖని వెళ్తూ కేంద్రమంత్రి కిషన్రెడ్డి పెద్దపల్లి, సుల్తానాబాద్లో రోడ్డుషో చేపట్టే అవకాశం ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి తెలిపారు. -
దుబాయ్లో కంచర్ల యువకుడి ఆత్మహత్య
వీర్నపల్లి(సిరిసిల్ల): ఉపాధి కోసం ఏడాది క్రితం గల్ఫ్ వెళ్లిన యువకుడు అక్కడ తనువు చాలించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో విషాదం నింపింది. మండలంలోని కంచర్ల గ్రామానికి చెందిన వరికుప్పల రాకేశ్ (22) దుబాయ్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. రాకేశ్ ఇంటి ఆర్థిక పరిస్థితులు బాగా లేక, ఇంటి నిర్మాణానికి చేసిన రూ.10 లక్షల అప్పు తీర్చేందుకు దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఆశించిన స్థాయిలో జీతం రాకపోవడం, అప్పులు తీరే మార్గం కనిపించక కొంతకాలంగా మానసిక వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికి అందిన కొడుకు విగతజీవిగా మారాడన్న వార్త విన్న తల్లి లక్ష్మి, సోదరుడు సతీశ్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సర్పంచ్ సామర్ల దేవరాజు, వడ్డెర సంఘం నాయకులు గోగుల రమేశ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రాకేశ్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జగిత్యాలక్రైం: జగిత్యాలలోని టీఆర్నగర్కు చెందిన షేక్ నయూం(43) ఎస్సారెస్పీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నయూం ఈనెల 6న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. తల్లి జరీనాబేగం ఈనెల 7న రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో నయూం నర్సింగాపూర్ శివారు ఎస్సారెస్పీ కాలువలో శవమై కనిపించాడు. నయూంకు భార్యతో కొద్దికాలంగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. తల్లి వద్దే ఉంటున్న ఆయన మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ ఉమాసాగర్ తెలిపారు. గుండెపోటుతో వృద్ధుడి మృతికొడిమ్యాల(చొప్పదండి): మండలకేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో వృద్ధుడు మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కొడిమ్యాల మండలం సంద్రాలపల్లి గ్రామానికి చెందిన చిన్న శంకరయ్య అనే వృద్ధుడు అస్వస్థతకు గురైన అతన్ని చికిత్స కోసం హాస్పిటల్కు తీసుకు వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తుండగా కొడిమ్యాల బస్టాండ్ ఆవరణలో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే అంబులెన్న్స్కు స్థానికులు సమాచారం అందించగా 108 సిబ్బంది శంకరయ్యను పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. మంథని: మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారి గంగాపురి సమీపంలో సిమెంట్ బ్రిక్స్ ఇటుక లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ ఎక్సెల్ రాడ్ విరగడంతో అదుపుతప్పి దారి పక్కనే ఉన్న పొలంలో పడిపోయింది. ట్రాక్టర్ తలకిందులుగా పడడంతో దానిపై ఉన్న కూలీలు చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో పెద్దపల్లి వైపు వెళ్తున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు పోలీసులకు సమాచారం అందించారు. జేసీబీ సాయంతో ట్రాక్టర్ కింద ఇరుక్కున్న కూలీలను సురక్షితంగా బయటకు తీశారు. మంథని మండలం లక్కేపూర్కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ రాయమల్లు, మహారాష్ట్రలోని ఐరీ ప్రాంతానికి చెందిన రాజేశ్, రవి, చైతన్య స్వల్ప గాయాలతో బయట పడ్డారు. వీరికి స్థానిక సామాజిక వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. -
కాంగ్రెస్కు ఓటు వేయాలి
● మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ గోదావరిఖని: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నారు. స్థానిక ఓల్డ్అశోక టాకీస్ సెంటర్లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్నర్ మీ టింగ్లో వారు మాట్లాడారు. ప్రతీ హామీని అమలు చేస్తున్నామన్నారు. సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి పట్టాలు పంపిణీ చేస్తామని హామీ ఇ చ్చారు. ప్రభుత్వ సలహాదారు హర్కరవేణుగోపా ల్, ఐఎన్టీయూసీ నేత జనక్ప్రసాద్ పాల్గొన్నారు. కాంగ్రెస్లో చేరిన మాజీ ఎంపీపీ మంథని: బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ మదాడి శ్రీనివాస్రెడ్డి, సింగిల్విండో మాజీ చైర్మన్ ఎక్కేటి అనంతరెడ్డి తదితరులు మంత్రి శ్రీధర్బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీనియర్ నాయకులు కాంగ్రెస్లో చేరడం చాలాసంతోషంగా ఉందని మంత్రి అన్నారు. -
అభివృద్ధికి పట్టం
మంథని: మున్సిపల్ను మరింత అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ఉన్న అభ్యర్థులకు తమ ఆశీర్వాదం ఉంటుందని, ఇందుకోసం ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉండా లని పట్టణవాసులు అభిప్రాయపడ్డారు. మున్సిపల్ ఎన్నికలపై ‘సాక్షి’ ఆదివారం పట్టణంలో నిర్వహించిన చర్చావేదికలో పలువురు ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. రైతులు, వ్యాపా రులు, న్యాయవాదులు, ఆలయ పూజారులు, యువకులు తమ మనోగతం వెల్లడించారు. వారిమాటల్లోనే.. ప్రజా సమస్యల పరిష్కారంపై అవగాహన అవసరం మంథని మున్సిపల్లో మిగిలిన పనులు పూర్తిచేయాలి ‘సాక్షి’ చర్చావేదికలో పట్టణ ప్రజల అభిప్రాయాలు -
ఇస్రో సైంటిస్టుగా కొడిమ్యాల యువకుడు
కరీంనగర్టౌన్: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన ముమ్మాడి రాజసింహ ఇస్రో సైంటిస్ట్గా ఎంపికయ్యాడు. గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాజశేఖర్, ఉమారాణిల కుమారుడు రాజసింహ జగిత్యాలలో 10 వ తరగతి, వరంగల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశా డు. జేఈఈ అడ్వాన్స్ ద్వారా కేరళ తిరువనంతపురంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఏరో స్పేస్ ఇంజినీరింగ్ సీటు సాధించాడు. బీటెక్ చివరి సంవత్సరం చదువుతుండగానే క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఇస్రో సైంటిస్టుగా ఎంపికయ్యాడు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు రాజసింహను అభినందించారు. -
ఓటరు మహాశయులారా
కోల్సిటీ(రామగుండం): పొద్దున లేచించి మొదలు.. రాత్రి వరకూ గల్లీలన్నీ పాటలతో మార్మోగుతున్నాయి. మైకుల శబ్దం, వాహనాల గర్జన మధ్య ‘పలానా గుర్తుకే మన ఓటు’ అని వినిపించే జానపద పాటలు ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. వాటికి చిన్నారులు స్టెప్పులు వేస్తుంటే.. పెద్దలు చిరునవ్వుతో తలూపుతున్నారు. అయితే, అభ్యర్థుల పేర్లకన్నా ముందే ఓటర్ల చెవుల్లో నాటుకుపోయే స్వరాల వెనుక ఉన్నవారు ఎవరు? ఒక్క పాటతో గల్లీని కదిలించే ఆ గొంతులు ఎలా ఉంటాయి? ఎన్నికల రణరంగంలో వాహనాలపై తిరుగుతూ రాత్రింబవళ్లు స్వరం వినిపిస్తూ ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేసే గాయకుల కథ ఇదే. ఓటు రాజకీయాల మధ్య నడిచే కళాకారుల కనబడని ప్రయాణమిది. కళను కాపాడాలంటే కళాకారులను నిలబెట్టాల్సిందే అంటున్నారు. లేదంటే పాట మిగులుతుంది కానీ.. పాట పుట్టిన గొంతు కష్టాల్లోనే కరిగిపోతుంది. మూడు దశాబ్దాలుగా కళనే శ్వాసగా, జీవనాధారంగా నమ్ముకున్నాడు. డప్పు ప్లేయర్గా, గాయకుడిగా, నృత్య మాస్టర్గా, రచయితగా తనదైన ముద్ర వేశాడు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి చైతన్య గీతాలు, ఉద్యమ గీతాలు అందించారు. అంబేడ్కర్ ఆశయాలను ప్రతిబింబించే బహుజన గీతాలు, ప్రజల్ని కదిలించే ప్రచార గీతాలు రచించి పాడారు. కళను నమ్ముకున్నా.. చాలీచాలని సంపాదనతో కుటుంబాన్ని పోషించే ఆదాయం సమకూరడంలేదు. అవార్డులు, రివార్డులు వచ్చాయి. సన్మానాలు, సత్కారాలు జరిగాయి. అవి జీవనానికి భరోసా ఇవ్వలేకపోయాయి. – గాజుల రమేశ్, డప్పు కళాకారుడు, గోదావరిఖని -
సుస్థిరం.. రామగుండం
రామగుండం: శ్రీరాముడు అరణ్యవాసంలో ఉండగా.. రామగుండం ప్రాంతంలో పర్యటించారని, ఆయన అడుగుజాడలతో జలఊటలు ఏర్పడ్డాయని, అవే రామునిగుండాలు కావడంతో దీనికి రామగుండంగా పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం ముడిసరుకుల లభ్యతతో విద్యుత్ కేంద్రాలకు నిలయంగా మారింది. విద్యుత్ రంగంలో దేశవ్యాప్త ఖ్యాతి గడిచింది. భిన్నవర్గాల ఓటర్ల సమ్మేళనంగానూ అవతరించింది. రామగుండంలో ఒకే రైల్వేస్టేషన్ ఉన్నా.. గోదావరిఖనిలో పోలీస్ కమిషరేట్, మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నా.. వాటిపేరు రామగుండంపైనే ఉంటాయి. దేశ రాజధాని ఢిల్లీలో సైతం రామగుండం అంటేనే గుర్తింపు లభిస్తుంది. -
అభివృద్ధి బాధ్యత నాదే..
● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లి: కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మూడోవార్డు నుంచి మొలుగూరి కమల్, ఐదోవార్డు నుంచి గుజ్జుల కుమార్, పదోవార్డు నుంచి అక్కపల్లి సుజాత–క్రాంతికుమార్, 11వ వార్డు నుంచి పూదరి అ నూష–మహేందర్, 19వ వార్డు నుంచి నల్లాల ప ద్మ, 20వ వార్డు నుంచి బండి రమ్యకృష్ణ, 22వ వా ర్డు నుంచి ఉప్పు స్వరూప–రాజు, 25వ వార్డు నుంచి బూత్కూరి జానవి, 26వ వార్డు నుంచి సుధమల్ల అమ్రేష్, 30వ వార్డు నుంచి సాజిదా భాను తదితర కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే ఆదివా రం ఎన్నికల ప్రచారం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను ఓటర్లు తీసుకుంటే, పట్టణాన్ని సకల సౌకర్యాలతో అభివృద్ధి చేసేబాధ్యతను తాను భుజాన వేసుకుంటానన్నారు. అత్యధిక నిధులు మంజూరు చేయించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. ఈనెల 11న జరిగే ఎన్నికల్లో చేతిగుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. -
ఎన్నికలకు ఏర్పాట్లు
కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరంలో ఈనెల 11న పోలింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 60 డివిజన్లలోని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి తరలించేందుకు శారదనగర్ శిశుమందిర్ స్కూల్లో పంపిణీ సెంటర్ ప్రారంభించారు. టెంట్లు, టే బుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. సిబ్బందికి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు. సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో స్ట్రాంగ్రూమ్లు ఏర్పాటు చేస్తారు. ఇక్కడే ఓట్ల లెక్కింపు కోసం 60 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. లేబర్ కోడ్లు రద్దుచేయాలి జ్యోతినగర్(రామగుండం): కేంద్రప్రభుత్వం రూపొందించిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఐఎఫ్టీయూ అనుబంధ కాంట్రాక్టు కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చి లుక శంకర్ డిమాండ్ చేశారు. ఎన్టీపీసీ ఆటోన గర్ యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 12న చేపట్టే సమ్మెను విజయవంతం చేయాలని ఆయన కోరారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరించారు. నాయకులు గుండు రాజన్న, దుర్గం రవీందర్, దండు రమేశ్, రాజు, నాగరాజు, మల్లేశ్, వసంత్, రాయమల్లు పాల్గొన్నారు. వ్యాయామంతో ఆరోగ్యం జ్యోతినగర్(రామగుండం): రోజూ వ్యాయా మం చేస్తే ఆరోగ్యంగా ఉంటామని ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. పర్మినెంట్ టౌన్షిప్ ఎకో పార్క్లో ఆదివారం నిర్వహించిన ఆరోగ్య మేళాలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. క్రమం తప్పకుండా యోగా, ఫిట్నెస్ ఆటలు ఆడాలని సూచించారు. దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత, ఉన్నతాధికారులు, అధికారులు, వివిధ యూనియన్ల ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. నేను ఓటు వేశా జ్యోతినగర్(రామగుండం): ఈనెల 11న జరిగే ఎన్నికల్లో తాను ఓటుహక్కు వినియోగించుకున్నానని ఎన్టీపీసీ పోలీస్ కానిస్టేబుల్ అబ్దుల్ ఫహీద్ తెలిపారు. ఆదివారం ఎన్టీపీసీ టెంపర రీ టౌన్షిప్ ఉద్యోగ వికాస కేంద్రంలో ఏర్పా టు చేసిన పోస్టల్ బ్యాలెట్ సెంటర్లో తాను ఓటుహక్కు వినియోగించుకున్నానని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాలుపంచుకునే ప్రభుత్వ ఉద్యోగులు ఓటుహక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఎన్టీపీసీ పోస్టల్ బ్యాలెట్ సెంటర్లో కల్పించారు. 212 పోస్టల్ బ్యాలెట్లు నమోదు పెద్దపల్లి: ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగుల కోసం ఈనెల 7, 8వ తేదీల్లో పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాల్లో చేపట్టిన పోస్టల్ బ్యాలెట్లో 212 మంది ఉద్యోగులు తమఓటుహక్కు వినియోగించుకున్నారని మున్సిపల్ కమిషనర్లు వెంకటేశ్, రమేశ్ ఆదివారం తెలిపారు. పెద్దపల్లిలో 150, సుల్తానాబాద్లో 62 మంది ఓట్లు వేసినట్లు వారు వివరించారు. వసతులు కల్పించాలి కోల్సిటీ(రామగుండం): పోలింగ్ కేంద్రాల్లో వ సతులు కల్పనపై కమిషనర్ అరుణశ్రీ ఆదివా రం సమీక్షించారు. తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్దీపాలు, చక్రాల కుర్చీలు తదితర వసతులు ఉండాలన్నారు. ఓటర్లకు సాయం చేసేందుకు హెల్ప్డెస్క్, వైద్యశిబిరంతోపాటు అవసరమైన సేవలు అందించడానికి వలంటీర్లను కూడా సిద్ధంగా ఉంచాలన్నారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి మహేశ్వర్రెడ్డి, ఆర్వో ఆంజనేయులు, డీఈ శాంతిస్వరూప్, ఏఈ జమీల్, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నేను.. నా పోరాటం
సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట: ‘విప్లవ పార్టీలో దళ సభ్యుడిగా మొదలైన నా ప్రయాణం గడ్చిరోలికి చేరింది. ఇస్రోజీవాడి నుంచి గడ్చిరోలి వరకు విప్లవ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు.. అంతకు మించి సంతృప్తి.. కాలక్రమంలో గడ్చిరోలి నుంచి.. అబూజ్మడ్ అడవులకు చేరి.. అక్కడే గిరిజనుల హక్కుల కోసం పోరాడిన వైనం.. తాడిత, పీడిత ప్రజల పక్షాన నిలిచిన ఘటనలకు సాక్ష్యం చందర్ అలియాస్ పడ్కల్ స్వామి అలియాస్ ప్రభాకర్ జీవిత చరిత్ర. నక్సలైట్ ఉద్యమంలో తొలి ఆత్మకథ చందర్దే కావడం విశేషం. ఎన్కౌంటర్కు ముందు తాను రాసుకున్న విప్లవ ఆత్మకథ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది’. ఈనెల 5న ఎన్కౌంటర్లో చనిపోయిన సీపీఐ(ఎంఎల్) మావోయిస్టు పార్టీ ఛత్తీస్గఢ్– మహారాష్ట్ర వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శి లోకేటి చందర్రావు(57) అలియాస్ పడ్కల్ స్వామి అలియాస్ ప్రభాకర్ మృతదేహం కామారెడ్డి జిల్లాలోని ఆయన సొంత ఊరు ఇస్రోజివాడికి ఆదివారం తీసుకొచ్చారు. ఆయన అంత్యక్రియలకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పలువురు మాజీ నక్సలైట్లు హాజరయ్యారు. ఎర్రజెండాలు, విప్లవ నినాదాలు, పాటలతో ఆయన అంత్యక్రియలు సాగాయి. ప్రభాకర్ ఆత్మకథలోని కొన్ని ముఖ్య ఘటనలు.. ● మావోయిస్టు ఉద్యమకారుడు స్వామి తన ఆత్మకథలో పలు ఆసక్తికరమైన విషయాలను ఆవిష్కరించారు. ఇస్రోజీవాడిలో జరిగిన ఒక సంఘటన చందర్ను అడవిబాట పట్టేలా చేసింది. గ్రామంలోని మాలి పటేల్, ఇతర పెత్తందార్లకు వ్యతిరేకంగా చేస్తున్న విప్లవ కార్యకలాపాలకు చెక్ పెట్టాలని పోలీసులతో గ్రామస్తులను పోలీస్స్టేషన్లో బంధించారు. పోలీసులకు లొంగిపోవాలని, లేదా అడవిబాట పట్టాలని సభ్యులపై ఒత్తిడి తేగా.. ఆ కుట్రను ఛేదించారు. ● 1991లో పూర్తిస్థాయిలో అప్పటి పీపుల్స్వార్లో చేరిపోయారు. 1991 నుంచి 33 నెలలపాటు కామారెడ్డి దళంలో పనిచేశారు. తర్వాత దళ అవసరం రీత్యా సిర్నాపల్లి దళంలో సభ్యుడికి చేరి, కమాండర్, డివిజన్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ● రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి ఎస్సైగా పని చేస్తున్న శ్రీనివాస్రావును 1998లో మందుపాతర పేల్చి చంపిన ఘటనలో ముగ్గురితో కలిసి తాను అంబూష్లో పాల్గొన్నారు. నిజానికి ఈ ఘటన రాంచందర్ చేసినట్లు ప్రచారం జరగ్గా.. ఆ రాంచందర్ వన్పల్లి ఎన్కౌంటర్లో మరణించాడు. కానీ, లోకేటి చందర్రావు అలియాస్ స్వామి నాయకత్వంలోనే ఈ ఘటన జరిగినట్లు ఆయన ఆత్మకథలో పేర్కొన్నారు. ● 1999లో కోనరావుపేట మండలం మరిమడ్లలో పోలీసులను గుర్తించడంలో విఫలమైన తమ సెంట్రీ విఫలమయ్యాడని, దీంతో పోలీసులు సమీపించగానే ముందుగా కాల్పులు జరపడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, ప్రాణనష్టం, కిట్బ్యాగుల నష్టం ఏమీ కాలేదని, మెదక్ జిల్లా పాపన్నపేట పోలీస్స్టేషన్పై దాడి చేసిన ఘటనను కళ్లకు కట్టినట్లు వివరించారు. ● 1999 నుంచి 2000 వరకు కామారెడ్డి ఏరియాకు ఇన్చార్జిగా, 2000 నుంచి 2003 వరకు సిరిసిల్ల ఏరియాకు జిల్లా కమిటీ సభ్యుడిగా ఉన్నారు. పార్టీ నిర్ణయం మేరకు 2003లో దండకారణ్యం వెళ్లారు. అక్కడ ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2006లో ఎజేడ్సీలోకి, 2011లో దక్షిణ సబ్ జోన్ నుంచి పశ్చిమ సబ్ జోన్కు వెళ్లారు. ఇక్కడే 2020 వరకు సబ్ జోనల్ బ్యూరో మెంబర్గా, పశ్చిమ సబ్ జోనల్ కమాండర్ ఇన్ చీఫ్గా, ఉత్తర గడ్చిరోలి డివిజన్కు సబ్ జోనల్ బ్యూరో నుంచి ఇన్చార్జిగా పనిచేశారు. 2020 నుంచి 2024 వరకు పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో ప్రభారిగా పనిచేశారు. ● ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలో ఆయన పని చేసిన కాలంలో జరిగిన ఘటనలు, నిజామాబాద్ జిల్లా జాక్రాన్పల్లి మండలం పడ్కల్లో జరిగిన ఎన్కౌంటర్ను, తన 35 ఏళ్ల అజ్ఞాత జీవితం, భార్యాపిల్లల జీవనం, సాయుధ పోరాటం, పేదల ప్రజలపై దండకారణ్యంలో చేసిన ప్రజాపోరాటాలను తన ఆత్మకథలో సమగ్రంగా వివరించారు. కొసా దాదా అంత్యక్రియలకు హాజరైన స్వామి రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాల్రావుపల్లెలో సెప్టెంబరు 25న జరిగిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కొసా దాదా అలియాస్ కడారి సత్యనారాయణరెడ్డి అంత్యక్రియల్లో స్వామి పాల్గొని కడసారి చూపులు చూసుకున్నట్లు సమాచారం. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో సెప్టెంబరు 21న పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో కొసా, ఆయనతో పాటు మావోయిస్టు పార్టీ మరో కేంద్ర కమిటీ సభ్యుడు కట్ట రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ మరణించారు. సెప్టెంబరు 25న గోపాల్రావుపల్లెలో కొసా దాదా అంత్యక్రియల్లో అంత్యంత రహస్యంగా స్వామి పాల్గొని అగ్రనేతకు నివాళి అర్పించడం విశేషం. పోలీసుల నిఘా మధ్య, ఆయన గోపాల్రావుపల్లెకు చేరుకుని అంత్యక్రియల్లో ఎవరూ గుర్తించకుండా పాల్గొని వెళ్లడం ఆ పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పోరాట క్షేత్రంగా ఆత్మకథ పోరాట క్షేత్రంగా తన కళ్ల ముందే చనిపోయిన సహచరుల పేర్లు, వారి కులాలు, నేపథ్యాలను స్వామి గుర్తు పెట్టుకుని ఆత్మకథలో రాశారు. ముఖ్యంగా తన గార్డుగా ఉండి ప్రాణాలు కోల్పోయిన మానస గురించి రాసిన తీరు ఆయన సహచర ప్రేమను చాటుతోంది. కరుడుగట్టిన విప్లవకారుడి లోపల కూడా ఒక సున్నితమైన మనిషి ఉంటాడని స్వామి ఆత్మకథ స్పష్టం చేస్తుంది. కన్నీటి వీడ్కోలు మా ఊరు ఇస్రోజివాడి అంటూ.. స్వామి తన అజ్ఞాత జీవితాన్ని ఆవిష్కరించారు. తల్లి పేరు లోకేటి కిష్టాబాయి, తండ్రి వీరన్న, నలుగురు సంతానంలో నేను నాలుగో వాడిని. మా పెద్ద అక్క గంగబాయి, ఆ తరువాత ఇద్దరు అన్నలు రాజేశ్వర్రావు, మానిక్రావు, నేను చిన్నోడిని చందర్రావును. నేను 1969లో జన్మించాను. అంటూ.. తాను 6వ తరగతి పాస్ అయ్యాయని.. రాడికల్ యూత్ లీగ్(ఆర్వైఎల్)లో పని చేస్తూ.. మావోయిస్టు ఉద్యమంలో చేరిన కళ్లకు కట్టినట్లు వివరించారు. ఛత్తీస్గఢ్లో కూంబింగ్కు వచ్చిన హెలీకాప్టర్ను కూల్చడం నుంచి మొదలు పెడితే.. అనేక హింసాత్మక ఘటనలను ఉటంకించారు. 35 ఏళ్ల పాటు సాయుధ పోరాటం సాగించిన స్వామి తుదకు ఎన్కౌంటర్లో అమరుడై.. సొంత ఊరికి చేరితే కన్నీటితో వీడ్కోలు పలికింది ఇస్రోజివాడి. 22 ఏళ్ల ప్రాయంలో అడవిబాట దళ సభ్యుడిగా మొదలైన ప్రయాణం ఎన్నెన్నో దాడులు.. యుద్ధరీతులు ముందే ఆత్మకథలో ఆవిష్కరించిన స్వామి సోషల్ మీడియాలో వైరల్ -
● వేములవాడలో మాంసం మాయ
పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): కార్పొరేషన్ పరిధిలోని ఫెర్టిలైజర్సిటీ(ఎఫ్సీఐ)టౌన్షిప్లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ 2000–01 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు 25ఏళ్ల రీయూనియన్ సమావేశం ఆదివారం హైదరాబాద్లోని డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్లో నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో స్థిరపడిన వారంతా ఒకేవేదికపైకి చేరారు. బాల్యంలోని స్వర్ణయుగాన్ని గుర్తుచేసుకుంటూ పాఠశాలలో గడిపిన మధురమైన క్షణాలను ఆనందంగా పంచుకున్నారు. ఎఫ్సీఐ టౌన్షిప్లో గడిపిన రోజులను శ్రీభూమిపై స్వర్గంశ్రీగా అభివర్ణిస్తూ స్నేహాలు, ఆటలు, ఉత్సాహభరితమైన వాతావరణాన్ని స్మరించుకున్నారు. తరగతి గదులు, ఆటస్థలాలు, గురువుల మార్గదర్శనం, స్నేహితులతో గడిపిన చిరునవ్వుల రోజులను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. 25 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకోవడం వారికి అపూర్వమైన ఆనందాన్ని ఇచ్చింది. సభ్యులంతా తమ జీవిత ప్రయాణాలు, వత్తిపరమైన అనుభవాలు, విజయాలను పంచుకుంటూ భవిష్యత్లో ఇలాంటి సమావేశాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించారు. రోడ్డుపై పడిపోయిన బండరాయిచిగురుమామిడి: చిగురుమామిడి మండలంలోని సీతారాంపూర్ స్టేజీ వద్ద హుస్నాబాద్– కరీంనగర్ ప్రధాన రహదారిపై గ్రానైట్ లారీ నుంచి బండరాయి పడిపోయింది. ఆదివారం మధ్యాహ్నం బొమ్మనపల్లి గ్రానైట్ క్వారీ నుంచి ఆసిఫ్నగర్కు కటింగ్ నిమిత్తం లారీలో తీసుకెళ్తుండగా కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వస్తున్న కారును తప్పించబోయిన, డ్రైవర్ బ్రేక్ వేయడంతో గ్రానైట్ రాయి లారీ నుంచి రహదారిపై పడింది. గ్రానైట్ రాయి పడినచోట రహదారి పూర్తిగా ధ్వంసమైంది. చిగురుమామిడి ఏఎస్సై తిరుపతి ఘటనా స్థలానికి వెళ్లి, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. గుంతపడిన చోట మట్టితో పూడ్చివేయించారు. వేములవాడ: ఆదివారం అంటే చికెన్, మటన్ ప్రియులు ప్రత్యేకంగా రుచి వైపు మగ్గుతారు. అయితే మున్సిపల్ ఎన్నికలకు ఈ ఆదివారమే చివరిది కావడంతో మటన్, చికెన్ బిర్యాని పొట్లాలతో అభ్యర్థులు తమ వార్డుల్లో హడావుడి చేస్తూ వారి అనుయాయులు, ఓటర్లకు ముందస్తు పండుగ చూపించారు. మున్సిపల్ ఎన్నికలు ఈనెల 11న జరగనున్న నేపథ్యంలో రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతోంది. ఇంటింటి ప్రచారంతోపాటు, ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు వినూత్న మార్గాలు అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం వేములవాడలోని పలు వార్డుల్లో మటన్, చికెన్ పొట్లాల పంపిణీ జోరుగా సాగింది. ఒకవైపు అభివృద్ధి హామీలు, మరోవైపు సంక్షేమ పథకాల మాటలు వినిపిస్తుండగా మరోవైపు పొట్లాల రాజకీయాలు చర్చకు దారితీస్తున్నాయి. ఓటు వేయించే ముందు కడుపు నింపితే సరిపోతుందా? అనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. అయినా ఎన్నికల వేళ ఇలాంటి పరిణామాలు కొత్తేమీ కాదని పలువురు పేర్కొంటున్నారు. బ్యాలెట్ బాక్స్ దగ్గర ఫలితం ఎలా ఉంటుందో చూడాలి కానీ, ఆదివారం మాత్రం చాలా ఇళ్లలో రాజకీయ రుచితో భోజనాలు జరిగాయని మాత్రం చెప్పొచ్చు. పంపకాలకు ప్లాన్ మున్సిపల్ ఎన్నికల ప్రచారపర్వం సోమవారం సాయంత్రంతో ముగియనుంది. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు ఇక అసలు పంపకాలపై దృష్టి సారించనున్నారు. కుల సంఘాలు, యూత్, మహిళా సంఘాలు, గ్రూపులవారీగా పంపకాలు జరిపేందుకు ప్లాన్ సిద్ధం చేసి పెట్టుకున్నారు. కరీంనగర్ కార్పొరేషన్: వారంతా బంధువులు. ఒకే కులానికి చెందిన వివిధ పార్టీల నాయకులు. మున్పిపల్ ఎన్నికల్లో మాత్రం వైరివర్గాలుగా మారిపోయారు. ఆయా పార్టీల నుంచి కార్పొరేటర్ స్థానానికి పోటీపడుతున్నారు. నగరపాలకసంస్థలో సం్ఙకులశ్రీ సమరానికి వేదికగా మారింది 23వ డివిజన్. పోటీలో ఉన్న ప్రత్యర్థులంతా మున్నూరుకాపులు కావడమే ఆ డివిజన్ స్పెషల్. నగరంలోని 23వ డివిజన్ స్థానానికి మున్నూరు కాపు కులస్తులే పోటీపడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ కార్పొరేటర్ జంగిలి సాగర్, బీజేపీ నుంచి పాదం శివరాజ్, కాంగ్రెస్ నుంచి గుమ్మడి రాజ్కుమార్, స్వతంత్ర అభ్యర్థిగా ఎడ్ల శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. వీరంతా కూడా మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్లే. పైగా బంధువులు కావడంతో ఆ డివిజన్ ప్రస్తుత ఎన్నికల్లో స్పెషల్గా మారింది. 1, 2, 36వ డివిజన్లలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి. కాకపోతే 1వ డివిజన్లో ఐదుగురు అభ్యర్థులకు గాను నలుగురు, 2వ డివిజన్లో ఆరుగురిలో ఐదుగురు, 36వ డివిజన్లో ఏడుగురిలో ఆరుగురు మున్నూరుకాపులే పోటీలో ఉండడం విశేషం. నగరంలో ఈ సం‘కుల’ సమరం ఆసక్తి రేపుతోంది. కరీంనగర్ కార్పొరేషన్: ‘అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. మా ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందలేదు. మేము పన్నులుకట్టడం లేదా. మేం చెల్లించిన పన్నులు ఎక్కడికి వెళ్తున్నాయి. మీకు ఎందుకు ఓటు వేయాలి. మా ఇంటికి రాకండి’.. అంటూ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ ఓ ఇంటి యజమాని వినూత్న తరహాలో నిరసన తెలిపారు. కరీంనగర్ నగరపాలకసంస్థ 36వ డివిజన్లోని మారుతినగర్కు చెందిన కోటేశ్వర్ అనే వ్యక్తి తన ఇంటికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కాలనీలో చర్చనీయాంశంగా మారింది. తమ ప్రాంతంలో రోడ్లు బతికుండగానే నరకాన్ని చూపిస్తున్నాయని... మీకు ఎందుకు ఓటువేయాలంటూ ఆయన ఫ్లెక్సీ ద్వారా ప్రశ్నలు సంధించారు. మున్సిపల్ పోరు.. నాన్వెజ్ జోరుబంధువులే ప్రత్యర్థులు -
బరిలో వీళ్లు.. దూరంగా వాళ్లు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు పోటీచేస్తున్నారు. ప్రస్తుత చైర్పర్సన్ ఈర్ల స్వరూప ఎమ్మెల్యే విజయరమణారావు సూచనతో తన పదవికి రాజీనామా చేశారు. ఏడోవార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. మార్కెట్కమిటీ మాజీ చైర్మన్ జడల సురేందర్ 23వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని ఆశించి భంగపడ్డారు. అయినా ఆల్ఇండియా ఫార్వర్డ్బ్లాక్ అభ్యర్థిగా 23వ వార్డు నుంచి పోటీపడుతున్నారు. మరోవైపు.. మున్సిపల్ మాజీ చైర్పర్సన్లు ఎల్.రాజయ్య, మమతారెడ్డి ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. చైర్మన్ పీఠం బీసీ జనరల్కు కేటాయించడంతో మమతారెడ్డి పోటీచేసేందుకు అవకాశం లేకుండాపోయింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఎల్.రాజయ్య కూడా ఈసారి పోటీ చేయడంలేదు. జడల సురేందర్ ఈర్ల స్వరూప ఎల్.రాజయ్య మమతారెడ్డి -
మద్యం అక్రమ రవాణాపై నిఘా
పెద్దపల్లిరూరల్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు జరిగే రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో మద్యం అక్రమ నిల్వలు, రవాణాపై ఎకై ్సజ్ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు. పట్టణాలు, నగర శివారుల్లోని బెల్ట్ దుకాణాల్లో నాన్డ్యూటీ పెయిడ్ మద్యం విక్రయిస్తున్నారనే అనుమానాలపై తనిఖీలు ముమ్మరం చేశారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని 46 మద్యం దుకాణాలను ఈనెల 9(సోమవారం)న సాయంత్రం ఐదు గంటల నుంచి పోలింగ్ ముగిసేదాకా మూసిఉంచుతామని జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి మహిపాల్రెడ్డి ‘సాక్షి’కి వివరించారు. ఆయన మాటల్లోనే.. ● పొరుగు రాష్ట్రాల నుంచి రాకుండా కట్టడి ● నేటి సాయంత్రం నుంచి మద్యం దుకాణాల మూసివేత ● ‘సాక్షి’తో జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి మహిపాల్రెడ్డి -
స్థిర ఆదాయం కావాలి
కౌన్సిలర్, కార్పొరేటర్ అభ్యర్థుల ప్రచారంతో మొదలైన నా వాయిస్ ఓవర్ ప్రయాణం.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వరకూ విస్తరించింది. ప్రధాన పార్టీలే కాదు.. స్వతంత్ర అభ్యర్థులూ ‘ఈ వాయిస్ కావాలి’ అంటున్నారు. రామగుండమే కాదు.. మంథని, మంచిర్యాలలోనే నా గొంతు వినిపించింది. ఎన్నికల ప్రచారానికే కాకుండా.. ఆలయాల ప్రారంభం, బ్రహ్మోత్సవాలు, పుష్కరాలు, సమ్మక్క – సారలమ్మ జాతర, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వ్యాపార–వాణిజ్య ప్రకటనల వరకూ ప్రత్యక్ష వ్యాఖ్యాతగా, వాయిస్ ఓవర్గా సేవలందించాను. 1986 నుంచి దాదాపు 40 ఏళ్లుగా ఈ రంగంలో కొనసాగుతున్నా. సుమారు 4వేల వరకు వాయిస్ ఓవర్ ఇచ్చాను. దివంగత సీఎం వైఎస్సార్ హాజరైన 4 బహిరంగ సభలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడం, పెద్దపల్లి జిల్లా ఆవిర్భావ సభకు వాయిస్ ఇవ్వడం నా జీవితంలో మైలు రాళ్లు. 2000 సంవత్సరంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. అప్పటివరకు ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పనిచేశా. అరకొర జీతంతోపాటు, కళా రంగం ఇచ్చిన ఆదాయం నా కుటుంబ జీవనాన్ని పెద్దగా ఇబ్బందులు లేకుండా నడిపించింది. ఇప్పుడు రిటైర్ అయ్యాను. అనుభవం, సేవాభావం, అంకితభావం ఉన్న కళాకారులను గుర్తించి, గౌరవంతోపాటు స్థిరమైన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత సమాజానిదే. ఎందుకంటే కళాకారుడి గొంతు మౌనమైతే.. చరిత్రే మౌనమవుతుంది. – మేజిక్రాజా, వాయిస్ ఓవర్ కళాకారుడు, గోదావరిఖని -
వేగంగా అభివృద్ధి
మంథని మున్సిపల్లో అభివృద్ధి శరవేగంగా సాగుతోంది. కొన్ని పను లు మిగిలి ఉన్నాయి. మంత్రి శ్రీధర్బాబు సహకారంతో అవికూడా పూర్తవుతాయి. ఇందుకో సం సమర్థవంతమైన నాయకత్వం, ప్రజా సమస్యలపై అవగాహన అవసరం. – మూల పురుషోత్తంరెడ్డి, రైతు, 11వ వార్డు రోడ్లు నిర్మించాలి మా కాలనీలో ఇరవై ఏళ్లుగా కొత్త ఇండ్ల నిర్మాణం జరుగుతోంది. ఇందుకు అనుగుణంగా పట్టణంలో అంతర్గత రహదారుల నిర్మాణం చేపట్టాలి. కొన్నిచోట్ల మట్టిరోడ్లు అసౌకర్యంగా ఉన్నాయి. మా కాలనీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. – తాత రాయమల్లు, రిటైర్డ్ ఉద్యోగి, గోదావరిరోడ్డు డ్రైనేజీలు అవసరం మా కాలనీలో మురుగునీటి కాలువలు సరిగ్గా లేవు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. మురుగునీటి కాలువలు కూడా నిర్మించి మిగిలిన సమస్యలు పరిష్కరించండి. కోతులు, కుక్కలతో ఇబ్బందులు లేకుండా చూడాలి. – కట్టకోళ్ల కిష్టయ్య, శ్రీరామకాలనీ ఇల్లు మంజూరు చేయండి ప్రస్తుతం మేం ఉంటున్న ఇల్లు శిథిలావస్థకు చేరింది. కొత్త ఇల్లు మంజూరు చేస్తే నిర్మించుకుంటా. మా కాలనీలో మిగిలిన పనులు వెంటనే పూర్తి చేయండి. వార్డుల్లో ఉన్న సమస్యలు గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలి. – గందం నగేశ్, ఫొటోగ్రాఫర్, శ్రీపాదకాలనీ కోతుల బెడద తీర్చండి మా వార్డులో కోతులు బీభత్సం చేస్తున్నాయి. ఇండ్లలోకి చొరబడి సామగ్రి ఎత్తుకెళ్తున్నాయి. ప్రజలపై దాడిచేసి గాయపరుస్తున్నాయి. కోతుల సమస్య తీవ్రంగా ఉంది. కొత్తపాలక వర్గం కోతుల సమస్య పరిష్కారినికి ప్రయత్నాలు చేయాలి. – చింతపట్ల అరుణ్కుమార్, ఒకటోవార్డు గదులు కట్టించాలి మంథని సమీప గోదావరి నదిలో స్నానాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేయాలి. ప్రధానంగా మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేకంగా గదులు నిర్మించాలి. వాకింగ్ కోసం వెళ్లే సమయంలో సమస్య తీవ్రత కనబడుతుంది. – అయిలి సత్యనారాయణ, వ్యాపారి శ్మశానవాటిక మార్చాలి గోదావరి తీరంలో శ్మశాన వాటికను మార్చాలి. నదిలో స్నానాలు చేసే ప్రాంతం సమీపంలోనే ఉండడంతో అసౌకర్యం కలుగుతోంది. నది ఒడ్డున కొత్తగా ఏర్పాటు చేసిన గ్యాస్ బర్నింగ్ పై ప్రజల్లో పర్యావరణ సమస్యపై వివరించాలి. – బొట్ల ఆంజనేయులు, న్యాయవాది గోదావరి రోడ్డు విస్తరించాలి బస్సు డిపో – గోదావరి నది మధ్య రోడ్డు విస్తరించాలి. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. సురాభాండేశ్వర దేవాలయం నుంచి గౌతమేశ్వర దేవాలయం వరకు గోదావరి నదిపై పర్మినెంట్ రోడ్డు నిర్మించి భక్తులకు సౌకర్యం కల్పించాలి. – గట్టు రాము, రామాలయ పూజారి -
పెద్దపులి సంచారంతో అప్రమత్తంగా ఉండాలి
చిగురుమామిడి: కోహెడ మండల పరిధిలో పెద్దపులి సంచరిస్తుందన్న సమాచారంతో చిగురుమామిడి మండలంలోని రైతులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ ఎం.రమేశ్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. కోహెడ మండల అటవీప్రాంతంలో పెద్దపులి తిష్టవేసినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారని తెలిపారు. పులి కదలికలు చిగురుమామిడి మండల సరిహద్దులకు చేరువలో ఉండటంతో రానున్న రెండు రోజులు రైతులు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రైతులు పొలాల వద్దకు ఒంటరిగా వెళ్లవద్దని, చుట్టుపక్కల రైతులతో కలిసి వెళ్లాలని సూచించారు. పులికదలికలు కనిపించినా, పశువులపై దాడిచేసి చంపినట్లు కనిపించినా తక్షణమే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
కళకు అంకితమైతే..
ఇరవై ఐదేళ్లు.. ఇదొక సాధారణ కాలం కాదు. కళనే శ్వాసగా, పాటనే ఆయుధంగా మలుచుకుని సాగించిన పోరాట కాలం. కమాన్పూర్ మండలం రొమ్మికుంట గ్రామానికి చెందిన పులిపాక బాలయ్య అనే కాళాకారుడు కళాకారుడిగా అనేక సేవలు చేశాడు. పాటలు రాయడం నుంచి వేదికలపై పాడటం వరకూ ప్రజల మధ్య చైతన్యం నింపే కార్యక్రమాల నుంచి సామాజిక సందేశాల వరకూ అన్ని రకాల ప్రోగ్రామ్స్ చేశాడు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఉద్యమ గీతాల ద్వారా ప్రజల గుండెల్లో స్పందన రేపాడు. ఉద్యమాల వేడి వేదికలపై కనిపించినా.. జీవితంలో కష్టాలే ఎదురయ్యాయి. ఇంతకాలం కళకు అంకితమై ఉన్నా కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి వెంటాడుతోంది. ప్రస్తుతం సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ,చాలీచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కళాకారుడి ప్రతిభను చూసే సమాజం, అతడి బతుకును చూడడం మరిచిపోతుందంటున్నాడు. ఉద్యమాల సమయంలో అవసరమైన కళాకారులు.. ఆ ఉద్యమం ఫలించిన తర్వాత పక్కన పడిపోవడం బాధాకరమని వ్యాఖ్యానిస్తున్నాడు. ప్రభుత్వం స్పందించాలని, కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన కోరుతున్నాడు. – పులిపాక బానయ్య, పాటల రచయిత, కమాన్పూర్ -
జన బలమా.. ధన బలమా?
గోదావరిఖని: పోలింగ్ సమీపిస్తోంది. తమ పార్టీ అభ్యర్థులను ముఖ్య నేతలు ఓటర్లను అభ్యర్థిస్తున్నా రు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ కాంగ్రెస్ అభ్యర్థుల కోసం సుడిగాలి పర్యటన చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీజేపీ నుంచి ముఖ్య నేతలు, సింహం గుర్తుపై పోటీచేస్తున్న వారు ఎన్నికల ప్రచారంలో తలమునకలయ్యారు. ఖర్చు తడిసి మోపెడు.. కొందరు అభ్యర్థులు తమ స్థాయిని బట్టి ధన ప్రవా హానికి తెరలేపాలని ప్రణాళిక సిద్ధం చేశారు. మద్యం పంపిణీ చేయడంతోపాటు జనాలమద్దతు కూడా కూడగట్టుకుంటున్నారు. ఐదేళ్లు సేవ చేసినా చేతులు తడపాల్సిందేనా? ఐదేళ్లపాటు ప్రజాసేవ చేసినా ఇప్పుడు గెలవాలంటే మళ్లీ ఓటర్ల చేతులు తడపాల్సిందేనా? అని చాలామంది అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. కొందరు డబ్బులు పంచితే గెలుస్తామని నమ్మితే.. మరికొందరు తమకు జనబలం ఉందని, ఎలాగైనా కుర్చీ దక్కుతుందని ధీమాతో ఉన్నారు. మెజార్టీ స్థానాలపై కాంగ్రెస్ నజర్ కాంగ్రెస్ మేయర్ పీఠం కై వం చేసుకోవడంపై దృష్టి సారించింది. ఇందుకోసం 60 డివిజన్లలో మెజార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు విశ్వప్రయత్నా లు చేస్తోంది. అభ్యర్థుల బలాబలాలు సేకరిస్తోంది. ఆశించిన మెజార్టీ రాకుంటే అనుసరించాల్సిన వ్యూ హాలపై కసరత్తు చేస్తోంది. మరోరెండు రోజుల్లో ఫలితాలపై అంచనా రానుండగా.. అభ్యర్థులు అందరూ తమ బలాబలాలపై ఫోకస్ పెట్టారు. ఐదేళ్ల సేవకు ఓటర్ల మార్కులు -
అధికార పార్టీ అభ్యర్థుల గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం
రామగుండం: కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థుల గెలుపుతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్రావు అన్నారు. ఆదివారం అబాది రామగుండంలోని ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ లింగాపూర్ గ్రామం కార్పొరేషన్లో విలీనం కావడంతో పట్టణీకరణలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన ఇతరత్రా అభివృద్ధి పనులు అధికార పార్టీ అభ్యర్థుల గెలుపుతోనే సాధ్యమన్నారు. అబాది రామగుండం, లింగాపూర్ గ్రామ రైతులకు శాశ్వతంగా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. -
కాంగ్రెస్ ఖాతాలోనే పెద్దపల్లి
పెద్దపల్లి: పెద్దపల్లిపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మున్సిపల్ 2, 8, తొమ్మితో వా ర్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పస్తం లక్ష్మి, ఎరుకల కల్పన, ఎండీ నాదీమ్కు మద్దతుగా ఎమ్మెల్యే శనివారం ఆయా ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పెద్దపల్లి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.కో ట్లు తీసుకొచ్చామని తెలిపారు. ఆర్టీసీ బస్ డిపో, బైపాస్ రోడ్డు మంజూరు చేయించామని అ న్నా రు. ప్రధాన హదారులను అభివృద్ధి చేయడంతో పాటు వీధుల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభి వృద్ధి, సంక్షేమాన్నిచూసి చేతిగుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్కు ఓట్లు అడిగే హక్కులేదు సుల్తానాబాద్ రూరల్: బీఆర్ఎస్కు సుల్తానాబాద్ పట్టణంలో ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా సుల్తానాబాద్ పట్టణంలో ఆయన శనివారం ఇంటింటా ప్రచారం చేశారు. అనంతరం కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న గతప్రభుత్వం సుల్తానాబాద్ అభివృద్ధికి చేసింది శూన్యమన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించిందని, వాటిని మళ్లీ వెనక్కి తీసుకొచ్చిన ఘనత తనకే దక్కిందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను ఈ ఎన్నికల్లో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాశ్రావు, నాయకుడు దుగ్యాల సందీప్రావు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మహిళలు పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎమ్మెల్యే విజయరమణారావు, ఓటు వేయాలని అభ్యర్థిస్తూ.. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు -
చట్టాలపై అవగాహన అవసరం
రామగుండం: రాజ్యాంగం, న్యాయపరమైన అంశాలపై విద్యార్థులకు సంపూర్ణ అవగాహన ఉండాలని జిల్లా అడిషనల్, సెషన్స్ జడ్జి(గోదావరిఖని) జీవన్ గ్లోరీ అన్నారు. స్థానిక ఐటీ ఐ ఏటీసీలోని విద్యార్థులకు శనివారం చట్టాల పై జడ్జి అవగాహన కల్పించారు. సైబర్ నేరా లు, మహిళలపై అఘాయిత్యాలు, ఆన్లైన్ మో సాలు, మత్తుపదార్థాలతో ఎదురయ్యే సమస్యలపై ఆయన వివరించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మంచి చదువులతో ఉన్నతంగా ఎదగాలని సూచించా రు. ఎస్సై సంధ్యారాణి, ప్రిన్సిపాల్ సురేందర్, వైస్ ప్రిన్సిపాల్ విద్యాసాగర్రెడ్డి, న్యాయవాది గుడికందుల భూమయ్య పాల్గొన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాట్ల పరిశీలన పెద్దపల్లిరూరల్: పోలింగ్ కేంద్రాలకు సామగ్రి తరలించేందుకు వీలుగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. టీపీవో వినయ్, ఏఈ సతీశ్ పాల్గొన్నారు. ముగిసిన శిక్షణ పెద్దపల్లిరూరల్: జాతీయ ప్రకృతి వ్యవసాయమిషన్లో భాగంగా సుస్థిర వ్యవసాయ సంస్థ(ఎన్జీవో) ఆధ్వర్యంలో ఐదురోజులుగా కృషి సఖిలకు సాగిన శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి రైతువేదికలో నిర్వహించిన ఈ శిక్షణ తరగ తులకు జిల్లాలోని 15 క్లస్టర్ల నుంచి సుమారు 125 మంది రైతులు హాజరయ్యారు. వీరికి వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. అనంతరం సర్టిఫికెట్లను జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు.పోలింగ్ కేంద్రాల తనిఖీ గోదావరిఖని: నగరంలోని సమస్యాత్మక పో లింగ్ కేంద్రాలను పెద్దపల్లి డీసీపీ రామ్రెడ్డి, గోదావరిఖని ఏసీపీ రమేశ్ శనివారం తనిఖీ చేశారు. అశోక్నగర్, రమేశ్నగర్, చంద్రశేఖర్, 7ఎల్ఈపీ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న భద్రతా చర్యలు, పరిసరాల్లో ఏ ర్పాట్లు, బందోబస్తు, సిబ్బంది కేటాయింపు వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఉన్నారు. ప్రణాళికతో చదవాలి పెద్దపల్లి: పోటీపరీక్షల కోసం నిరుద్యోగులు ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం సాధిస్తా రని జిల్లా ఉపాధి కల్పనాధికారి రాజశేఖర్ అ న్నారు. టాస్క్ రీజినల్ సెంటర్లో బ్యాంకింగ్ ఉద్యోగాల కల్పనపై శనివారం జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిగ్రీ చదువుతున్న దశలోనే పోటీపరీక్షలకు సన్నద్ధం కావాలన్నా రు. ఉపాధి అవకాశాలు, కెరీర్ ప్రణాళిక, పోటీపరీక్షల అవగాహన తదితర అంశాలపై వివ రించారు. టాస్క్ జిల్లా మేనేజర్ గంగాప్రసాద్, రీజినల్ సెంటర్ ఇన్చార్జి కౌసల్య, ప్రిన్సిపాల్స్ ఉగేందర్, రాకేశ్, సమద్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ను గెలిపిస్తేనే అభివృద్ధి
గోదావరిఖని: కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే పారిశ్రామిక ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధిని మ రింత వేగవంతం చేస్తామని రామగుండం ఎమ్మె ల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నారు. రామగుండం నగరంలో శనివారం జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. త్వరలోనే సింగరేణి ఆస్పత్రిలో కార్డియాలజీ అందుబాటులోకి వస్తుందని, తద్వారా గుండెపోటు బాధితులకు సకాలంలో చికిత్స అందుతుందని తెలిపారు. మాజీ మేయర్ బంగి అనిల్కుమార్, నాయకులు మహంకాళి స్వామి, ము స్తాఫా తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆర్జీ–2 ఏరియా ఓసీపీ–3లో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతోందన్నారు. కారు ణ్య నియామకాలు, మారుపేర్ల సమస్య, కార్మికు ల సొంతింటి పథకం, పెర్క్స్పై ఇన్కంట్యాక్స్ మాఫీ తదితర సమస్యలు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లామని ఆయన అన్నారు. నాయకులు గుండేటి రాజేశ్, శంకర్నాయక్, మారెల్లి రాజిరెడ్డి, కొత్త సత్యనారాయణరెడ్డి, ఆకుల రాజిరెడ్డి, దశరథం, సంపత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ -
కాంగ్రెస్ డీఎన్ఏలోనే మోసం ఉంది
గోదావరిఖని: కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే మోసం ఉందని, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఇప్పుడు మాయ మాటలతో మోసం చేస్తోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. నగరంలోని 48, 9, 39, 11, 43, 42, 13, 55, 57వ డివిజన్లలో శనివారం జరిగిన కార్నర్ మీటింగ్ల్లో వారు మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏమయ్యాయని ఓట్లకోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ప్రజలను కోరారు. రామగుండంలో రాక్షసపాలన నడుస్తోందని, ఇళ్లను కూల్చి వ్యాపారులను రోడ్డుపై పడేశారని ధ్వజమెత్తారు. రెండేళ్లుగా వి ధ్వంసం కొనసాగుతోందన్నారు. ప్రశ్నిస్తే కేసులు, ఎదిరిస్తే బెదిరింపులు జరుగుతున్నాయన్నారు. ని యంతపాలన పోవాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమ ని అన్నారు. నాయకులు గోపు అయులయ్య యా దవ్, పెంట రాజేశ్, నడిపెల్లి మురళీధర్రావు, పర్లపల్లి రవి, నారాయణదాసు మారుతి పాల్గొన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ -
రామగుండం.. రసవత్తరం
గోదావరిఖని: రామగుండం కార్పొరేషన్ ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. పోలింగ్కు కొద్దిరోజులే గడువు ఉంది. అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం ఉధృతం చేశాయి. అధికార కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్, బీఆర్ఎస్ నుంచి మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీజేపీ నుంచి జాతీయ నేత ఎస్.కుమార్, నియోజకవర్గ ఇన్చార్జి కందుల సంధ్యారాణి తదితరులు తమ అభ్యర్థులకు మద్దతుగా కార్యక్షేత్రంలో దూసుకెళ్తున్నారు. ఈసారి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ‘నువ్వానేనా’ అంటున్నాయి. నగరంలో 60 డివిజన్లు.. నగరంలో 60 డివిజన్లు ఉన్నాయి. ఎన్నికలు అన్నివర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఈసారి మహిళలు, పురుషు ఓటర్ల సంఖ్య దాదాపు సమానంగానే ఉంది. మహిళతోపాటు పురుష ఓటర్లనూ ప్రస న్నం చేసుకోవడం కోసం అభ్యర్థులు ప్రత్యేక ప్ర ణాళికతో ముందుకెళ్తున్నారు. సగం.. సగం.. రామగుండం నగరంలో 60 డివిజన్లు ఉండగా.. 1,83,049 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు 91,578 మంది కాగా, 91,441 మంది పురుషులు, మరో 30మంది టాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారు. 60 డివిజన్లలో 27 డివిజన్లు మహిళలకు కేటాయించారు. దీంతో కార్పొరేటర్ సీటుకోసం మహిళలు కూడా భారీసంఖ్యలోనే పోటీపడుతున్నారు. రిటైర్డ్ కార్మికుల ఓట్లపై నజర్ సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో సుమారు 34 డివిజన్లు కలిసి ఉన్నాయి. ప్రతీనెల కనీసం 20 మంది సింగరేణి కార్మికులు ఉద్యోగ విరమణ పొందుతున్నారు. వీరిలో కొందరు స్థానికంగానే నివాసం ఉంటున్నారు. మరికొందరు హైదరాబాద్లాంటి దూరప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఈసారి ఎన్నికల్లో రిటైర్డ్ కార్మికులు, వారి కుటుంబాల ఓట్లు అత్యంత కీలకం కానున్నాయి. వివిధ కారణాల రీత్యా దూర ప్రాంతాల్లో స్థిరపడిన ఇలాంటి రిటైర్డ్ కార్మికులు, వారి కుటుంబాలను ఇక్కడకు తీసుకొచ్చి ఓట్లు వేయించుకునేలా కొందరు అభ్యర్థులు తమ ప్రయత్నా లు ప్రారంభించారు. దూరప్రాంత ఓటర్ల రాకపోకలకు అయ్యే రవాణా, ఇతరత్రా ఖర్చులు భ రించేందుకు ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నారు.ట్రాన్స్జెండర్లు ఆసక్తికరంగా రిటైర్డ్ కార్మికుల ఓట్లు మహిళలు.. పురుషులూ సగం సగం.. -
అక్రిడిటేషన్ కార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
పెద్దపల్లి: జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులు 2026–28 సంవత్సరానికి అక్రిడిటేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న అక్రిడిటేషన్కార్డుల గడువు ఈనెల 28వ తేదీతో ముగియనుందన్నారు. ఈక్రమంలో కొత్తకార్డుల కోసం సమాచార, పౌర సంబంధాల అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ద రఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 9న ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవు తుందని, అర్హులైన జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. మోనా.. ‘బంగారం’ కోల్సిటీ(రామగుండం): సింగరేణి ఉద్యోగి కైలాస లక్ష్మీ కాంతారావు–సంధ్యారాణి దంపతుల కూతు రు కై లాస మోనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్లో యూనివర్సిటీ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించింది. శనివారం హైదరాబాద్లోని జేఎన్టీయూలో నిర్వహించిన స్నా తకోత్సవంలో వైస్ చాన్సలర్ పి.కిషన్కుమార్రెడ్డి గోల్డ్ మెడల్తోపాటు పట్టా అందజేశారు. విఠల్నగర్కు చెందిన మోనా.. హుజూరాబాద్లోని ఓ ఇంజి నీరింగ్ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మిషన్ లెర్నింగ్ పూర్తిచేసింది. ఆమె తండ్రి లక్ష్మీకాంతారావు సింగరేణి ఆర్జీ–3 ఓసీపీ–2లో డ్రైవర్. -
ఆరోగ్యశాఖ అప్రమత్తం
● ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద సిబ్బంది ● ఓటర్లు, సిబ్బంది అస్వస్థతకు గురైతే సత్వర వైద్యసేలు ● అందుబాటులో 108 వాహనం కూడా ● ‘సాక్షి’తో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి ప్రమోద్కుమార్ పెద్దపల్లిరూరల్: మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఓటర్లతోపాటు ఎన్నికల సిబ్బందికి ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తినా సత్వర వైద్యసేవలు అందించేందుకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలతోపాటు రామగుండం కార్పొరేషన్లోని ఒక్కో కేంద్రం వద్ద ఒక ఏఎన్ఎం, ఒక ఆశ వర్కర్తోపాటు అందుబాటులో ఒక మెడికల్ ఆఫీసర్ను నియమిస్తారు. వీరితోపాటు 108 అంబులెన్స్నూ సిద్ధంగా ఉంచుతారు. ఈ విషయంపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ప్రమోద్కుమార్ ‘సాక్షి’కి వివరాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే.. -
మంథనిలో తూర్పు నేతలు!
మంథని: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మంథనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ అభ్యర్థులు విజయం సాధించేందుకు శతవిధాలా ప్రయత్నా లు చేస్తున్నాయి. నియోజకవర్గంలోని తమపార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులను రప్పించుకుని మరీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. పొరుగు జిల్లా నుంచి.. నియోజకవర్గంలో భాగమైన జయశంకర్ భూపా లపల్లి జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు మంథనిలో మకాం వేశారు. ఇంటింటా పర్యటిస్తూ తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఇతర మండలా లకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు వా ర్డుల వారీగా ఇన్చార్జిలను నియమించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మంథనిలో ఇతర నా యకుల ప్రచారంపై ఓటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇతర జిల్లాలకు చెందిన నాయకులే ఓటర్లను అభ్యర్థించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీన్నిబట్టి గెలుపు రెండు పార్టీలకు ఎంతప్రతిష్టాత్మకమనేది అర్థమవుతోంది. రెండు పార్టీల నాయకులు ఇంటింటా పర్యటిస్తూ ఓట్లను అభ్యర్థించడం శాసనసభ ఎన్నికలను తలపిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు పార్టీల నేతలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్న మున్సి‘పోల్స్’ -
కనీస విద్యా ప్రమాణాలు ఉండాలి
పెద్దపల్లి: విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. రంగంపల్లిలోని వెంకటపద్మ ఫంక్షన్హాల్లో ప్రాథమిక తరగతి ఉపాధ్యాయులతో ఎఫ్ఎల్ఎన్ అమలుపై ఉపాధ్యాయులు, విద్యాధికారులతో శనివారం సమీక్షించారు. మిడ్లైన్ పరీక్ష ఫలితాలతో పిల్లల విద్యా ప్రమాణాలను అంచనా వేయొచ్చన్నారు. కనీసం 80 శాతం మంది పిల్లలు చదవడం, 60 శాతం మంది రాయడం, 90 శాతం మంది నంబర్లను గుర్తించండం, 80 శాతం మంది బేసిక్ మ్యాథ్స్ ప్రమాణాలు పొందేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. జెడ్పీ సీఈవో నరేందర్, డీఈవో శారద, ప్లానింగ్ సెక్టోరియల్ ఆఫీసర్ మల్లేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష -
పరీక్షల కాలం.. ఆరోగ్యం పైలం!
కరీంనగర్కు చెందిన ప్రైవేటు ఉద్యోగిని లక్ష్మి కుమారుడు పదోతరగతి బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. పరీక్షలంటే కుమారుడి కన్నా తల్లికే ఎక్కువగా ఆందోళన ఉంది. పిల్లాడు ఒత్తిడికి, ఆందోళనకు గురికాకుండా, ఆరోగ్యంపై దుష్ప్రభావం పడకుండా చూసుకోవడం లక్ష్మికి పెద్ద సవాలే. జమ్మికుంటకు చెందిన స్నేహకు భయమెక్కువ. పరీక్షలంటేనే వణికిపోతుంది. ప్రస్తుతం పదోతరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధం అవుతోంది. కొద్దిరోజుల్లో బోర్డు పరీక్షలు ప్రారంభం అవుతుండగా.. స్నేహకు తల్లిదండ్రులు ధైర్యం చెబు తున్నారు. అయినా భయం పోవడం లేదు. చదివింది గుర్తుండటం లేదు. పరీక్షల సమయానికి ఎలాంటి ఇబ్బంది ఉంటుందోనని స్నేహ ఆందోళన చెందుతోంది.హుజూరాబాద్/ కరీంనగర్ స్పోర్ట్స్: ప్రస్తుతం పరీక్షల కాలం.. మరో పక్షం రోజుల్లో ఇంటర్, 35 రోజుల్లోపు పదోతరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు విజయం సాధించాలంటే ఇప్పటికే పుస్తకాలతో కుస్తీ పట్టాలి. సమయం దగ్గర పడుతున్న కొద్దీ పిల్లల్లో నిశ్శబ్ధం మొదలవుతుంది. గుండెల్లో వేగం పెరుగుతుంది. కళ్లు మూసినా.. తెరిచినా పుస్తకాలే కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో చదివింది గుర్తుపెట్టుకోవడంతో పాటు ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో ఏది పడితే అది తింటే ఆరోగ్యంపై ప్రభావం చూపు తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిద్ర లేకుండా పుస్తకాలతో కుస్తీ పట్టడం సరికాదని సూచిస్తున్నారు. పరీక్షల కాలంలో ఆరోగ్యం పైలంగా ఉంచుకోవాలని పేర్కొంటున్నారు. రాత్రంతా చదవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. మెదడుకు ఎక్కదు. అనవసర ఆందోళనకు కారణమవుతుంది. రోజూ కనీసం 7 నుంచి 8 గంటలపాటు నిద్ర తప్పనిసరి. ఎంత ప్రణాళిక వేసుకున్నా.. సరే.. కొందరికి పరీక్షలంటే భయం ఇలాంటి వారితో పెద్దలు అప్రమత్తంగా ఉంటూ అవసరమైతే నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించాలి. పరీక్షల సమయంలో పిల్లలకు ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్, డీప్ఫ్రైడ్ ఆహారం ఇవ్వకూడదు. బయట నుంచి ఆహారం పూర్తిగా తగ్గించాలి. అల్పాహారం తప్పకుండా ఇవ్వాలి. చిరు ధాన్యాలతో చేసిన ఆహారం, పండ్ల ముక్కలు, గుడ్డు, పాలు అందించాలి. -
అంబులెన్స్లోనే కేసు విచారణ
● ఫిర్యాది వృద్ధాప్యం.. పక్షవాతంతో ఇబ్బంది ● న్యాయమూర్తి ఫిర్యాది వద్దకు వచ్చిన వైనంకరీంనగర్క్రైం: ఫిర్యాదుదారు వృద్ధాప్యంతోపాటు పక్షవాతంతో లేవలేని స్థితిలో ఉండడంతో న్యాయమూర్తి అంబులెన్స్లోకి వచ్చి వాంగ్మూలం స్వీకరించిన సంఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడికి చెందిన అనువోజు రాజేశ్వరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. వారికి పెళ్లిళ్లు కావాటంతోపాటు ఆమె భర్త చనిపోవడంతో ఒంటరిగా మిగిలింది. తనని ఉద్యోగి అయిన కొడుకు అణువోజు వెంకటేశ్వర్లు పట్టించుకోకపోవడంతో ఇబ్బందుల్లో ఉన్న ఆమె ఆర్డీవో వద్ద కొడుకుపై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును విచారించిన ఆర్డీవో వెంకటేశ్వర్లు నెలకు రూ.4వేలు పోషణ నిమిత్తం తల్లికి చెల్లించాలని తీర్పునిచ్చారు. కొడుకు డబ్బులు చెల్లించకపోవడంతో ఇబ్బందుల్లో ఉన్న వృద్ధురాలు చిగురుమామిడి పోలీసులకు కొడుకుపై ఫిర్యాదు చేసింది. అక్కడి పోలీసులు కొడుకు వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు రాగా ఫిర్యాది రాజేశ్వరీ సాక్ష్యం కోర్టు స్వీకరించాల్సి ఉంది. పక్షవాతం వచ్చి ఆమె రాలేని పరిస్థితిలో ఉండగా అంబులెన్స్లో జిల్లా కోర్టుకు తీసుకొచ్చారు. అంబులెన్స్లో ఉన్న రాజేశ్వరి వద్దకు మెజిస్ట్రేట్ బానోత్ రాజేశ్వర్ వెళ్లారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయవాది సమక్షంలో ఫిర్యాది రాజేశ్వరి వాంగ్మూలాన్ని అంబులెన్సులోనే స్వీకరించారు. ఈ క్రమంలో ఫిర్యాది కొడుకు వెంకటేశ్వర్లుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ కేసులపై పోలీసుల నిర్లక్ష్యం తగదు ● కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేశ్ కరీంనగర్టౌన్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై బాధితులకు న్యాయం చేయడంలో కరీంనగర్ జిల్లా పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేశ్ విమర్శించారు. నగరంలోని మంకమ్మతోట జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 261 ఎస్సీ, ఎస్టీ, కేసులు నమోదైతే.. అందులో 154 కేసులు ఎఫ్ఐఆర్ దశలో ఉన్నాయన్నారు. 2024 నుంచి 2026 వరకు 12 కేసుల్లోనే చార్జిషీట్ నమోదు చేశారని, ఒక్క కేసులోనే శిక్ష పడిందన్నారు. 94 కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. కేసులు విచారణ సకాలంలో పూర్తిచేసి కోర్టుకు సాక్ష్యాధారాలు సమర్పించడంలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో 17 జూన్ 2024లో కేసు నమోదైతే.. ఇప్పటి వరకు చార్జిషీట్ దాఖలు చేయలేదన్నారు. డీఎస్పీ స్థాయి పోలీస్ అధికారులతో 30 రోజుల్లో పూర్తివిచారణ చేయాలని చట్టం చెబుతున్నా.. పోలీసులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసుల నిర్లక్ష్యంపై సామాజిక సంఘాలతో కలిసి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాధితులు భూతం మల్లేశ్, కళ్లెం శివాజీ, టేకు నర్సింహులు, మిరియాల కృష్ణమూర్తి ఉన్నారు. -
బస్సెక్కాలంటే పరుగెత్తాల్సిందే..
కాలేజీలో తరగతులు ముగిశాయి. విద్యార్థులు ఇళ్లకు వెళ్లేందుకు బస్సు కోసం బస్టాప్కు వచ్చారు. లగ్జరీ, రాజధానితోపాటు ఎలక్ట్రిక్, ఎక్స్ప్రెస్ బస్సులు ఎలాగూ అక్కడ ఆగవు. పల్లెవెలుగు ఒక్కటే వారికి దిక్కు. ఆపాలని చేతులు చూపినా పల్లెవెలుగు బస్సు డ్రైవర్ ఆపలేదు. అప్పటికే బస్సునిండా ప్రయాణికులు కిక్కిరిసి ఉన్నారు. రోడ్డుపై అంతకు రెట్టింపు మంది ఉన్నారు.. వీరందరూ బస్సులో నిల్చొనేందుకూ స్థలం లేదని డ్రైవర్ వాదన. ఇంతలోనే మరోబస్సు వచ్చింది.. అప్పటికే గంటల కొద్దీ నిరీక్షించి నీరసించిన విద్యార్థులు.. ఇదిగో చూడండి.. శక్తినంతా కూడబట్టుకుని ఇలా పరుగెత్తుతున్నారు. పెద్దపల్లి శివారులో శుక్రవారం చోటుచేసుకున్న దృశ్యాలు ఇవి.. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
మరో 500 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు
పెద్దపల్లి: వచ్చేమార్చి నాటికి జిల్లాలో మరో 500 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఆయిల్పామ్ సాగుపై ఆయన శుక్రవారం సమీక్షించారు. ప్రస్తుతం 525 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగవుతోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల బేస్మెంట్ను ఈనెల 28 వ తేదీవరకు పూర్తిచేయాలని ఆదేశించారు. స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా వ్య క్తిగత మరుగుదొడ్లు మంజూరు చేసిన ఇళ్లకు బిల్లులు చెల్లించాలన్నారు.23లోగా సీఎంఆర్ ఇవ్వాలి రైస్మిమిల్లరు ఈనెల 23లోగా సీఎమ్మార్ పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సకాలంలో సీఎమ్మార్ డెలివరీ చేయని మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అదనపు కలెక్టర్ వేణు, ఎన్ఫోర్స్మెంట్ అధికారి ప్రభాకర్, అధికారులు శ్రీనాథ్, శ్రీకాంత్, జగన్మోహన్రెడ్డి, మహేశ్, రాజేశ్వర్రావు, భావ్సింగ్, గంగాధర్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష -
40 ఏళ్లుగా రాజకీయాల్లో వాసాల
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి (హెచ్) వార్డు సభ్యుడిగా.. ఉపసర్పంచ్గా.. సర్పంచ్గా.. ఎంపీటీసీగా.. కరీంనగర్ మండల పరిషత్ అధ్యక్షుడిగా.. కౌన్సిలర్గా.. ఓటమి ఎరగని నేతగా 40ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు కొత్తపల్లికి చెందిన వాసాల రమేశ్. కొత్తపల్లి చేనేత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిగా, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా (1998–2001), కరీంనగర్ నియోజకవర్గ ఏసీడీపీ సభ్యుడిగా సేవలందించారు. గ్యాడ్యుయేషన్ పూర్తి చేసిన రమేశ్ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుతున్నారు. ప్రస్తుతం కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో 18వ డివిజన్ (కొత్తపల్లి) అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. -
ఆరోగ్యం పైలం!
పరీక్షల కాలం..కరీంనగర్ స్పోర్ట్స్/హుజూరాబాద్: వార్షిక పరీక్షల సమయం దగ్గర పడుతోంది. పక్షం రోజుల్లో ఇంటర్, 35రోజుల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి పుస్తకాలతో సబ్జెక్టులపై యుద్ధం చేస్తున్నారు. ప్రత్యేక తరగతులకు హాజరవుతూ.. అనుమానాలు నివృత్తి చేసుకుంటున్నారు. ఏడాదిలో విన్న పాఠాలను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. పరీక్షలు ఉన్నాయని చదవడమే కాదు.. ఆర్యోగ్యాన్ని కాపాడుకోవడమూ మఖ్యమని నిపుణులు అంటున్నారు. సరైన ఆహారం తీసుకోవాలని, జంక్ఫుడ్ జోలికి వెళ్లొద్దని, నిద్రముఖ్యమని సూచిస్తున్నారు. – వివరాలు 8లో.. -
అమ్మకు అక్షర వికాసం
గంభీరావుపేట(సిరిసిల్ల): గ్రామాల్లోని నిరక్షరాస్యులైన స్వయం సహాయక సంఘాల మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమం చేపట్టాయి. అక్షరాలు నేర్వని అతివలకు సులభ పద్ధతిలో చదవడం, రాయడం, అంకెలను గుర్తించడం, లెక్కలను నేర్పించడం కోసం ‘ఉల్లాస్’(అండర్ స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని 12 మండలాల్లో 411 గ్రామైక్య సంఘాలు ఉన్నాయి. వీరిలో లక్షకు పైగా సభ్యులు ఉన్నారు. దాదాపు 23,800 మంది నిరక్షరాస్యులైన మహిళా సభ్యులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారి వివరాలను ఉల్లాస్ యాప్లో నమోదు చేశారు. వీరికి చదువు నేర్పించడానికి వలంటీర్లను గుర్తించారు. వలంటీర్లు నిరక్షరాస్యులైన మహిళలకు చదవడం, రాయడం నేర్పిస్తున్నారు. మార్చి నెల వరకు సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా ఉల్లాస్ అమలు చేస్తున్నారు. మహిళా సభ్యులు విద్యావంతులైతే సంఘాలు మరింత పటిష్టంగా పనిచేస్తాయని, నిధులు దుర్వినియోగం కాకుండా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఒక్కో వలంటీర్ పది మంది నిరక్షరాస్యులైన మహిళలకు చదువు చెప్పడం జరుగుతోంది. ఇంటింటా చదువు.. ఊరంతా వెలుగు.. అక్షర వికాసం పేరుతో పుస్తకాలను ముద్రించి అందుబాటులోకి తెచ్చారు. ఈ పుస్తకాల్లో ఉన్న విషయాలను వలంటీర్లు, వీవోఏలు నిరక్షరాస్యులైన మహిళలకు నేర్పుతున్నారు. ఇప్పటికే అక్షరజ్ఞానం నేర్పించడానికి వలంటీర్లకు, వీవోఏలకు, వీవోల అధ్యక్ష, కార్యదర్శులతోపాటు సీసీలు, ఏపీఎంలకు మండలాలవారీగా శిక్షణనిచ్చారు. జిల్లా విద్యాశాఖ, వయోజన విద్య, డీఆర్డీవో విభాగాలు ఈ అక్షరజ్ఞాన కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. సంఘాల్లోని మహిళలు ఇప్పటికే అక్షరాస్యులై ఉంటే.. టెన్త్, ఇంటర్ పూర్తి చేయని వారైతే వారిని ఓపెన్స్కూల్లో చేర్పించి పరీక్షలు రాయించే ఏర్పాట్లు చేస్తున్నారు. ‘ఉల్లాస్’తో విద్యాబోధన మహిళా సంఘాల్లోని సభ్యుల అక్షరాస్యతే లక్ష్యం జిల్లాలో 23 వేల మంది నిరక్షరాస్యుల గుర్తింపు -
ముచ్చటగా మూడు రూపాలు !
● నగర.. గ్రామపంచాయతీ.. మున్సిపల్ ● కోరుట్ల మున్సిపల్ తీరుకోరుట్ల: ‘కోరుట్ల’..కొన్నాళ్లు నగర పంచాయతీ.. మరికొన్నాళ్లు గ్రామపంచాయతీ.. ప్రస్తుతం మున్సిపాల్టీ ఇలా మూడు మార్పులు పొందింది. 1957లో ఈ ప్రాంతంలో సుమారు 5వేల ఓటర్లు ఉన్న ఉన్న గ్రామంగా కోరుట్ల గుర్తింపు పొందింది. ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అన్నింటికంటే ఎక్కువ ఓటర్లు ఉండడంతో కోరుట్లను నగర పంచాయతీ (బల్దియా)గా మార్చారు. మొదటగా వాసం శంకరయ్య, నీలి కిష్టయ్య, నీలి గంగారాం 20 సంవత్సరాలపాటు నగర పంచాయతీ చైర్మన్లుగా వ్యవహరించారు. గ్రామ పంచాయతీ ఆ తరువాత కాలంలో 1988 వరకు కోరుట్ల గ్రామపంచాయతీగా కొనసాగింది. ఈ సమయంలో ఉ ప్పులపు భూపతి, నీలి గంగారాం, రహీంపాషాలు సర్పంచులుగా కొనసాగారు. 1988 తరువాత థర్డ్ గ్రేడ్ మున్సిపాల్టీగా మారిన కోరుట్లలో ఏడేళ్లపాటు స్పెషలాఫీసర్ల పాలన కొనసాగింది. స్పెషలాఫీసర్ల కాలంలో కోరుట్ల అభివృద్ధి కుంటుపడింది. 1995లో మున్సిపల్ ఎన్నికలు మొదటిసారి మున్సిపాల్టీకి ప్రత్యక్ష ఎన్నికలు జరగగా అంబల్ల మాధవి మున్సిపల్ తొలి చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఆ తరువాత షేర్ నర్సయ్య, ఎంఏ గఫార్, శీలం వేణు అవిశ్వాస తీర్మానంతో ఎన్నికై న గడ్డమీద పవన్, అన్నం లావణ్య చైర్మన్, చైర్పర్సన్లుగా వ్యవహరించారు. ప్రస్తుతం సెకండ్ గ్రేడ్ మున్సిపాల్టీగా మారిన కోరుట్లకు ఇవి ఆరో మున్సిపల్ ఎన్నికలు కావడం విశేషం. -
విజన్ ఉన్నవారికే ఓటు
● నిజాయతీ, నిబద్ధత ఉన్నవారికే పట్టం ● సమస్యలపై అవగాహన ఉన్నవారినే ఆదరించాలి ● ‘సాక్షి’ డిబేట్లో పట్టణవాసుల అభిప్రాయాలు కోతుల బెడద తీర్చండి స్కూల్కు వెళ్తున్న విద్యా ర్థుల వెంటపడి కోతులు టిఫిన్ బాక్స్లు ఎత్తుకెళ్తున్నాయి. కూరగాయలకు వెళ్లే మహిళలపై దాడులు చేస్తున్నాయి. కోతుల నుంచి కాపాడాలి. – సయ్యద్ తాజ్, మూడోవార్డు పనులు చేసేవారికే ఓట్లు ఐదోవార్డుకు రోడ్డు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదు. పనులు చేయించేలా చొరవ తీసుకోవాలి. మాటలు చెప్పేవారికి కాకుండా పనులు చేసేవారిని ఎన్నుకోవాలి. – శంకరయ్య, పదోవార్డు డ్రైనేజీలు క్లీన్ చేయడం లేదు డ్రైనేజీలు రోజూ క్లీన్ చేయడం లేదు. ఇంట్లోకి దుర్వాసన వస్తుంది. రోజూ శుబ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లించాలి. – హనుమంతు, రిటైర్డ్ ఉద్యోగి, 23వవార్డురోజూ ఫాగింగ్ అవసరం విషజ్వరాలు రాకుండా మున్సిపల్ సిబ్బంది, అధికారులు రోజూ ఫాగింగ్ చేయాలి. ప్రజలకు జ్వరం రాకుండా చూడాల్సిన బాధ్యత పాలకులదే. నిజాయతీతో పనిచేసేవారినే గెలిపించాలి. – కొట్టే లక్ష్మయ్య, వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. పార్క్ స్థలం కాపాడాలి పమా వార్డులో పార్క్ ఉన్నట్లు ఎవరికీ తెలియదు. ఆ స్థలంపై పాలకులు దృష్టి పెట్టకపోతే కబ్జా అయ్యే అవకాశం ఉంది. పార్క్ స్థలం చుట్టూ హద్దులు ఏర్పాటు చేయాలి. వసతులు కల్పించాలి. – బుచ్చిబాబు, 23వవార్డుసాక్షి,పెద్దపల్లి/పెద్దపల్లి: వార్డుల్లోని సమస్యలపై అవగాహన, ప్రణాళికతో అభివృద్ధి చేసే విజన్ ఉన్న నేతలకే ఓటు వేస్తామని పెద్దపల్లి పట్టణ ప్రజలు అన్నారు. జిల్లా కేంద్రంలో ‘సాక్షి’ నిర్వహించిన చర్చా వేదికలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు, పలువురు ప్రముఖులు, రిటైర్డ్ ఉద్యోగులు, స్థానికులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వారి మాటల్లోనే..అభివృద్ధి బాధ్యత నాదే పెద్దపల్లిలో ఆర్టీసీ బస్సు డిపో కల నేర్చిన. బైపాస్, రాఘవపూర్లో కోర్టు భవనం నిర్మిస్తాం. పట్టణ అభివృద్ధికి రూ.100 కోట్లు వెచ్చించాం. ప్రభుత్వ ఆస్పత్రిలో అనేక రకాల వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. త్వరలోనే ఐటీ హబ్ వస్తుంది. నన్ను చూసి కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయండి. అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వండి. – విజయరమణారావు, ఎమ్మెల్యే, పెద్దపల్లి సమస్యలు పరిష్కరించాలి మున్సిపల్లో విలీనమైన తర్వాత రంగంపల్లిలో వసతులు కల్పిస్తున్నారు. ఇది ఇంకా వేగంగా సాగాలి. సమస్యలు పరిష్కరించే వారికే ఓటువేయాలి. – ఓదెలు యాదవ్, 11వ వార్డు, రంగంపల్లి బైపాస్ నిర్మించాలి బైపాస్ రోడ్డు నిర్మాణంలో వేగం పెంచాలి. తరచూ జరిగే రోడ్డు ప్రమాదాలు నియింత్రించాలి. పనుల్లో వేగం పెంచాలి. – ప్రసన్నకుమార్, రెండోవార్డువసతుల కల్పనపై దృష్టి ఎమ్మెల్యే విజయరమణారావు సహకారంతో పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాం. అన్నికాలనీల్లో డ్రైనేజీలు, సీసీరోడ్లు నిర్మిస్తాం. వీధిలైట్లు, పారిశుధ్యం నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తాం. – నూగిల్ల మల్లయ్య చైర్మన్ అభ్యర్థి మైదానం అభివృద్ధి చేయాలి ఐటీఐ గౌండ్లోని వాకర్స్ అసోసియేషన్లో 300 మందికి సభ్యత్వం ఉంది. ట్రాక్కోర్టు ఏర్పాటు చేయాలి. మా సమస్య పరిష్కరించేందుకు ఎమ్మెల్యే ముందుకు రావడం శుభపరిణామం. – వెంకట్రెడ్డి, మూడోవార్డు డ్రైనేజీలు శుభ్రం చేయాలి రోజూ డ్రైనేజీ శుభ్రం చేస్తే దోమల బెడద ఉండదు. పట్టణంలో సెంట్రల్ లైటింగ్ సిస్టం సరిగా పనిచేయడంలేదు. కొన్నిచోట్ల లైట్లు వెలగడంలేదు. కొత్త పాలకవర్దం దీనిపైనే ఫోకస్ చేయాలి. – రంగు శ్రీనివాస్, 14వవార్డు -
అంతర్జాతీయ వేదికపై ‘జ్యోతిష్మతి’ కీర్తి పతాక
తిమ్మాపూర్: జ్యోతిష్మతి కళాశాల కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ వేదికపై ఎగురవేశారు. ఆ కళాశాల విద్యార్థులు దుబాయ్లో జరిగిన గ్లోబల్ ఇన్నోవేషన్ సమిట్– రిట్రీట్–2026లో అసాధారణ ప్రదర్శన కనబర్చారు. గతనెల 9 నుంచి 11వ తేదీ వరకు ఇంటర్ కాంటినెంటల్ ఫెస్టివల్ సిటీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారతదేశం నుంచి 1,700 టీంలు పోటీపడ్డాయి. అజిత్ షనగొండ, మొహమ్మద్ షోయబ్ బృందం ఫైనల్స్కు చేరి కళాశాల కీర్తిని చాటింది. అంతర్జాతీయ స్థాయికి కళాశాల కీర్తిని తీసుకెళ్లిన విద్యార్థులను కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్రావు అభినందించారు. సామాజిక ఉద్దేశాలతో నూతన ఆలోచనలను ప్రోత్సహించడం సంస్థ లక్ష్యమన్నారు. సెక్రటరీ జె.సుమిత్సాయి ఎంట్రప్రెన్యూర్షిప్ నిబద్ధతను హైలైట్ చేశారు. ప్రిన్సిపాల్ టి.అనిల్ కుమార్, డీన్ పీకే వైశాలీ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. -
8న కరీంనగర్లో ఐటీ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం
కరీంనగర్: యువతకు ఐటీరంగంపై అవగాహ న కల్పించేందుకు కోడింగ్ ట్యూటర్ ఆధ్వర్యంలో ఐటీ జాబ్మేళా, ఇంటర్న్షిష్, కెరీర్ గైడెన్స్ నిర్వహిస్తున్నారు. ఈనెల 8న ఆదివారం ఉద యం 10 గంటలకు, కరీంనగర్లోని శ్వేత హో టల్లో కార్యక్రమం ఉంటుంది. ఐటీ రంగంలో ప్రస్తుత అవకాశాలు, కంపెనీలు ఏ నైపుణ్యాల ను ఆశిస్తున్నాయి, గ్రాడ్యుయేషన్ తర్వాత యు వత ఎలా సాఫ్ట్వేర్ రంగంలోకి అడుగుపెట్టవచ్చు.. ఇంటర్న్షిప్ ద్వారా ఉద్యోగ అవకాశాలు ఎలా వస్తాయనే విషయాలను ఫణిరాజ్ జాలిగామ వివరించనున్నారు. డిగ్రీ/ఇంజినీరింగ్ పూర్తిచేసిన, ఫైనల్ ఇయర్ విద్యార్థులు, ఐటీ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్ని స్తున్న వారికి ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. హాజరయ్యేవారు 89888 87333 నంబర్కి ఫోన్చేసి తప్పనిసరిగా రిజి స్టర్ అవ్వాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసిన వారికే ప్రవేశం కల్పించబడుతుందన్నారు. రెబల్స్పై చర్యలకు సిద్ధం? గోదావరిఖని: అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బరిలో ఉన్న, ప్రచారం చేస్తున్న వారిపై ఆ పార్టీ అధిష్టానం చర్యలకు సిద్ధమైంది. పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా నామినేషన్ వేసి, పార్టీ పేరుతో ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకుని.. అధికార పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకుంది. రెబ ల్ అభ్యర్థులు, వారికి మద్దతుగా ప్రచారం చే స్తున్న నాయకులు తమ పద్ధతి మార్చుకోవాలని, లేనిపక్షంలో పార్టీ నుంచి బహిష్కరించే నిర్ణ యం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. క్వింటాల్ పత్తి రూ.7,716 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.7,716 ధర పలికిందని మార్కెట్ ఇన్చార్జి కార్యదర్శి ప్రవీణ్రెడ్డి తెలిపారు. కనిష్టంగా రూ.6,011, సగటు రూ.7,411గా నమోదు అయిందని పేర్కొన్నారు. 1,094 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు. ఉద్యోగులకు మినహాయింపు గోదావరిఖని: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 11న ఉద్యోగులకు మినహాయింపు ఇ చ్చేందుకు సింగరేణి సీఆర్పీ/పీఈఆర్/ఐఆర్/119 పేరిట శుక్రవారం ఆ దేశాలు జారీ చే సింది. మొదటి, జనరల్ షిఫ్ట్ కార్మికులకు షిప్ట్ చివరి సమయానికి రెండు గంటల మినహాయింపు ఇచ్చారు. సత్తుపల్లి, ఆర్జీ–1,2,3, భూ పాలపల్లి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల ఉద్యోగులకు ఈసర్క్యులర్ వర్తిస్తుందని యాజమాన్యం పేర్కొంది. అందరూ ఓటు వేయాలి పెద్దపల్లిరూరల్: అర్హులైన వారందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటుహక్కు వినిగించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ఝా సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను శుక్రవారం సీపీ పరిశీలించారు. ఎన్నికల బందోబస్తుపై డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ కృష్ణకు పలు సూచనలిచ్చారు. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించి చా క్లెట్లు అందించారు. సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై లక్ష్మణ్రావు తదితరులు ఉన్నారు. పశుసంరక్షణకే వైద్యశిబిరాలు మంథనిరూరల్: పాడి పశువుల సంరక్షణకే ప్ర త్యేక వైద్య శిబిరాలు చేపట్టామని జిల్లా పశువై ద్యాఽధికారి విజయభాస్కర్ అన్నారు. సిరిపు రం శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక పశువైద్య శిబిరంలో ఆయన మాట్లాడారు. పశువులు వ్యా ధు బారినపడకుండా వ్యాధి నిరోధక టీకాలు, మందులు వేస్తున్నామన్నారు. సర్పంచ్ గోదారి లక్ష్మి, ఉపసర్పంచ్ ఈసంపల్లి నారాయణ, గో పాలమిత్రలు పానుగంటి సంజీవ్కుమార్, కొండయ్య, రామకృష్ణ, మల్లేశ్ పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల తనిఖీ మంథని: పట్టణంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను డీసీపీ రామ్రెడ్డి, ఏసీపీ రమేశ్ శుక్రవారం తనిఖీ చేశారు. బాలికల హైస్కూల్, బో యిన్పేట ప్రైమరీ స్కూల్ను పరిశీలించారు. జీరో పెండెన్సీ లక్ష్యం రామగిరి(మంథని): జీరో పెండెన్సీ లక్ష్యంతో పనిచేయాలని రామగుండం రీజియన్ సీఎంపీఎఫ్ కమిషనర్లు హరిపచౌరి, కె.గోవర్ధన్ సూచించారు. ఆర్జీ–3 జీఎం కార్యాలయంలో ప్రయాస్ ఆరో షెడ్యూల్పై శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన సూచనలు చేశారు. కార్యక్రమంలో పలువురు అధికా రులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మున్సి‘పోల్స్’కు సన్నద్ధం
● 36 వార్డులు.. 74 కేంద్రాలు ● ఎన్నికల అధికారులకు శిక్షణ పూర్తి ● ‘సాక్షి’తో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్ పెద్దపల్లిరూరల్: బల్దియాలో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈనెల 11న పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 43,789 మంది ఓటర్లు ఉండగా అందులో 22,127 మంది మహిళలు, 21,660 మంది పురుషులు, మిగతా వారు ఇతరులు ఉన్నారు. వీరు ఓటుహక్కు వినియోగించుకనేందుకు 74 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, వెబ్కాస్టింగ్ అమలు చేస్తారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్వర్లు ‘సాక్షి’కి వివరాలు వెల్లడించారు. -
కూడికలు.. తీసివేతలు
గోదావరిఖని: రామగుండం కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉండగా 315 మంది పోటీ పడుతున్నారు. ఒక్కో డివిజన్లో అత్యల్పంగా ఇద్దరు, అత్యధికంగా 13 మంది నువ్వానేనా అంటున్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతోపాటు ఏఐఎఫ్బీ, సీపీఐ, సీపీఎం అభ్యర్థులు విజయం ఎలా సాధించాలనే దానిపై లెక్కలు వేసుకుంటున్నారు. ఒక్కో డివిజన్లో అతితక్కువగా 2,300 మంది ఓటర్లు ఉంటే.. మరో డివిజన్లో అత్యధికంగా 4,210 మంది ఓటర్లు ఉన్నారు. అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నచోట కొద్దిగా శ్రమిస్తే విజయం ఖాయమనే ధీమాతో అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. కొన్నిఓట్లను సాధించినా గెలుస్తామంటూ కూ డికలు, తీసివేతల్లో నిమగ్నమయ్యారు. 60 డివిజన్లు.. 1.83లక్షల మంది ఓటర్లు.. నగరంలోని 60 డివిజన్లలో మొత్తం 1,83,049 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 91,441 మంది పురుషులు, 91,578మంది మహిళలు మిగతావారు ట్రాన్స్జెండర్లు ఉన్నారు. 22వ డివిజన్లో అత్యల్పంగా 2,085 మంది ఓటర్లు ఉంటే.. 42వ డివిజన్లో అత్యధికంగా 4,210 మంది ఓటర్లు ఉన్నారు. అయితే, ఎక్కడ పోటీలో ఎక్కువ మంది ఉంటే అక్కడ విజయం సులభం అవుందనే భావనతో అభ్యర్థులు ప్రత్యేక దృష్టి సారించి ప్రచారం చేస్తున్నారు. 13, 15, 31 డివిజన్లలో ఇద్దరేసి అభ్యర్థులే పోటీపడుతున్నారు. 48వ డివిజన్లో 13మంది పో టీ పడుతున్నారు. 13, 15, 31వ డివిజన్లలో గెలుపు అంత సులభం ఏమీకాదని, అత్యధికంగా 13మంది పోటీపడుతున్న 48వ డివిజన్లో కొద్దిమంది ఓటర్లు దయచూపితే విజయం ఖాయమనే ధీమాతో అభ్య ర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ఈనెల 13న వారి భవితవ్యం ఏమిటో తేలనుంది. గోదావరిఖని నగరం స్వల్ప మెజారిటీ వచ్చినా గెలిచే అవకాశాలు కొన్నిచోట్ల అత్యధిక మంది పోటీచేయడమే కారణం మెజారిటీ ఓటింగ్పై దృష్టి సారిస్తున్న అభ్యర్థులు -
చదువు, ఆరోగ్యం రెండూ కీలకమే
పరీక్షల సమయం దగ్గరపడుతుండటంతో విద్యార్థుల్లో ఒత్తిడి పెరుగుతోంది. మంచి ఫలితాలు సాధించాలనే ఆత్రంతో చాలామంది నిద్రను త్యాగం చేసి, సరైన ఆహారం తీసుకోకుండా పుస్తకాలతో కుస్తీ పడుతారు. ఇలా చేయడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. పరీక్షల సమయంలో మెదడు చురుకుగా పనిచేయాలంటే సమతుల్యమైన ఆహారం అవసరం. పాలు, పెరుగు, గుడ్లు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, బాదం, వేరుశెనగ తీసుకుంటే జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఫాస్ట్ఫుడ్, నూనెతో చేసిన పదార్థాలు, శీతల పానీయాలకు దూరంగా ఉంచాలి. జంక్ఫుడ్ మరుసటి రోజు చదువుపై ప్రభావం చూపుతుంది. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి. – వివేక్రావు, పిల్లల వైద్య నిపుణుడు, కరీంనగర్ -
ఆందోళన ఉప్పు లాంటిది
విద్యార్థులు విజువలైజేషన్ టెక్నిక్ పాటిస్తే మేలు. రాని ప్రశ్నలు వస్తాయేమో, మంచి మార్కులు రావేమో అని భయపడడం వల్లే ఆందోళన. అలా కాకుండా అన్నీ చదివిన ప్రశ్నలే వచ్చినట్లూ, పరీక్ష బాగా రాసినట్లూ, మంచి మార్కులు తెచ్చుకున్నట్లూ... ఊహించుకోవాలి. అప్పుడు శరీరంలో హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఆటోమేటిగ్గా ఒత్తిడి తగ్గిపోతుంది. ప్రశాంతంగా పరీక్ష రాయొచ్చు. ఆందోళన ఉప్పు లాంటిదని దానికి దూరంగా ఉండాలి. – జి.వెంకటరాజం, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, చెల్పూర్ -
పిల్లల మనసును నిర్బంధించొద్దు
పరీక్షల సమయంలో ప్రిపరేషన్ పేరిట పిల్లల ఏకాగ్రత ఇతర వ్యాపకాలపైకి వెళ్లకుండా దృష్టిని కేంద్రీకరించాలి. మానసిక సంఘర్షణకు గురి చేయొద్దు. పరీక్షల కోసం పిల్లల మనసును నిర్బంధించొద్దు. ప్రిపరేషన్ ప్రశాంతంగా కొనసాగేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక భారాన్ని తట్టుకోలేనివారిని మానసిక నిపుణులకు చూపించి, పరీక్షలకు సంసిద్ధం చేయాలి. పరీక్షల సమయంలో పిల్లల మానసిక రుగ్మతలకు సంబంధించిన అంశాలపై తెలంగాణ సైకలాజికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆన్లైన్ హెల్ప్లైన్ అందుబాటులో ఉంది. కౌన్సెలింగ్కు 9440488571 నంబరులో సంప్రదించవచ్చు. – ఎంఏ కరీం, సీనియర్ సైకాలజిస్ట్ -
ఒత్తిడి తగ్గించుకోవాలి
టైంటేబుల్ పెట్టుకొని ప్రతి సబ్జెక్టు కొంత సమయం చదువుకుంటూ పోవాలి. ఏకదాటిగా పుస్తకాలతో కుస్తీ పట్టకుండా కాస్తంత విశ్రాంతి తీసుకోవాలి. రాత్రంతా చదవటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. పరీక్షలకు ముందు ఒత్తిడి తగ్గించుకోవాలి. తగినంత నిద్ర పోవాలి. ఎక్కువగా ఆయిల్ ఫుడ్, డీప్ప్రై ఆహారం తీసుకోవద్దు. బయటి ఆహారం పూర్తిగా తగ్గించాలి. అల్పాహారం తప్పకుండా తీసుకోవాలి. చిరుధాన్యాలతో చేసిన పోహా, రాగి దోశ, ఇడ్లీ, ఓట్స్, పండ్ల ముక్కలు, గుడ్లు, పాలు తీసుకోవాలి. – ఉడుగుల సురేశ్, జనరల్ ఫిజీషియన్, హుజూరాబాద్ -
బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం నమ్మవద్దు
● రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ గోదావరిఖని: కాంగ్రెస్పార్టీపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు ఖండించాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ కోరారు. నగరంలోని పవర్ హోస్నగర్, గంగానగర్ కాలనీల్లో జరిగిన కార్నర్ మీటింగ్లలో ఎమ్మెల్యే సమాట్లాడారు. రోడ్డు వెడల్పు చేస్తామని బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. నగరంలో ఇంత పెద్దరోడ్డు ఎక్కడా లేదని తెలిపారు. రోడ్డు విస్తరించే ఆలోచన తమకు లేదని అన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే ఈ ప్రాంతం సమగ్ర అభివృద్ధి సా ధిస్తుందని, కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టితో గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. -
పోలింగ్ సిబ్బంది సహకరించాలి
జ్యోతినగర్(రామగుండం): మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి పోలింగ్ సిబ్బంది సహకరించాలని అదనపు కలెక్టర్ అరుణశ్రీ కోరారు. ఎన్టీపీసీ కాకతీయ ఆడిటోరియంలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు రెండోవిడత శిక్షణ తరగతులు శుక్రవారం నిర్వహించారు. ఓటరు ఒరిజినల్ గుర్తింపు కార్డు పరిశీలించిన తర్వాతే ఓటు వేయడానికి అనుమతించాలని సూచించారు. ట్రైనర్లు కేడం శ్రీనివాస్, జె.శ్రీనివాస్, అవగాహన కల్పించారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, రెవెన్యూ ఆఫీసర్ ఆంజనేయులు, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆర్ఐ శంకర్రావు పాల్గొన్నారు. -
అక్షరాలు నేర్చుకుంటున్నం
మా సంఘంలోని చదువురాని సభ్యులకు అక్షరాలు నేర్పిస్తున్నారు. మాకు చదువుపై ఆసక్తి కూడా పెరిగింది. సంతకాలు చేయడానికి, సంఘంలో లెక్కలు అర్థం చేసుకోవడానికి చదువు ఉపయోపడుతుంది. – గోపగారి లీల, గంభీరావుపేట పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నం మండల సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా సంఘాల్లోని వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి ఉల్లాస్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నం. గ్రామైక్య సంఘాలకు పుస్తకాలు కూడా అందించాం. వాటి ద్వారా విద్యాబోధన జరుగుతోంది. అక్షరజ్ఞానం కలిగించడం కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం. – జయసుధ, ఐకేపీ ఏపీఎం, గంభీరావుపేట -
నమ్మి మోసపోతే.. గోసపడక తప్పదు
మంథని: గత ప్రభుత్వంలో మంథనిలో జరిగిన అ భివృద్ధిని చూసి మరింత ప్రగతి సాధనకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఎన్నుకోవాలని మంథని మాజీ ఎ మ్మెల్యే పుట్ట మధు కోరారు. మున్సిపల్ ఎన్నికల ప్ర చారంలో భాగంగా గురువారం మున్సిపల్ పరిఽ దిలోని 2వ వార్డులో ఎరుకల గూడెం, ముత్యాలమ్మ వాడ, 3వ అంబేడ్కర్ నగర్లో ఆయన అభ్యర్థులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పట్టణ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేశామని, అలాగే మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్గా, ము న్సిపల్ చైర్పర్సన్గా పుట్ట శైలజ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. -
నువ్వక్కడ.. నేనిక్కడ!
● బల్దియా బరిలో భార్యాభర్తలు కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా గెలిచేందుకు భార్యభర్తలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వేర్వేరు డివిజన్లలో భార్యాభర్తలు పోటీచేసి గెలుపొందిన సంఘటనలు గతంలో ఉండగా, ఈ సారి నగరంలో మూడు జంటలు బల్దియా పోరులో నిలిచాయి. బీఆర్ఎస్ నుంచి 47వ డివిజన్లో మాజీ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, ఆమె భర్త బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ 21వ డివిజన్ నుంచి పోటీచేస్తున్నారు. 58వ డివిజన్ నుంచి దుడ్డెల శ్రీధర్, 57వ డివిజన్ నుంచి ఆయన భార్య దుడ్డెల మంజుల పోటీకి దిగారు. బీజేపీ నుంచి టికెట్ ఆశించిన వీరు, దక్కకపోవడంతో స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. 46వ డివిజన్ నుంచి మాజీ కౌన్సిలర్ వరాల నారాయణ, 13వ డివిజన్ నుంచి ఆయన భార్య వరాల అనసూయ స్వతంత్రులు పోటీపడుతున్నారు. బీఆర్ఎస్ టికెట్ ఆశించినప్పటికి, రాకపోవడంతో స్వతంత్రులుగా పోటీలో నిలిచారు. -
ఇంటికొస్తున్నామని.. అంతలోనే దూరమై
● రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి ● ఎదురెదురుగా వాహనాలు ఢీకొని దుర్మరణం కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): విధులు ముగించుకొని ఇంటికి బయలుదేరామని ఫోన్లో చెప్పిన ఇద్దరు యువకులు.. అంతలోనే ఎదురెదురుగా వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో మృతిచెందారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం చిన్నరాతుపల్లి– తారుపల్లి గ్రామాల మధ్యలో క్రాస్ రోడ్డు వద్ద గురువారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. ఓదెల మండల పొత్కపల్లికి చెందిన పచ్చిక నాగఫణీందర్రెడ్డి(28) పెద్దరాతుపల్లిలో సోలార్ ప్లాంట్లో టెక్నీషియన్గా పని చేస్తుండగా, పెద్దరాతుపల్లి గ్రామానికి చెందిన బొజ్జం సురేశ్(27)వ్యవసాయం చేస్తాడు. ఫణీందర్రెడ్డి విధులు ముగించుకుని బైక్పై ఇంటికి వెళ్తుండగా, సురేశ్ కాల్వశ్రీరాంపూర్ నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తూ ఇద్దరూ ఎదురెదురుగా ఢీకొని తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు కాల్వశ్రీరాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు పేర్కొన్నారు. కాగా సురేశ్కు వివాహం జరిగి ఏడాది కూడా దాటలేదు. ఫణీందర్రెడ్డికి ఏడాదిన్నర క్రితం వివాహం అయినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇద్దరు యువకుల మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అభివృద్ధితో ప్రత్యేక గుర్తింపు
● అర్ధంతరంగా నిలిచిన పనులపై దృష్టిపెట్టాం ● మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలు ● ‘సాక్షి’తో రామగుండం బల్దియా మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ కోల్సిటీ(రామగుండం): రామగుండం మొదటి మున్సిపల్ చైర్మన్గా పలు అభివృద్ధి పనులు, సంస్కరణలు చేపట్టి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి సోమారపు సత్యనారాయణ. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఆర్టీసీ చైర్మన్గా పని చేశారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా గెస్ట్ ఫాకల్టీగా ఐఏఎస్ హోదా కలిగిన అధికారులకు పాఠాలు బోధించగల విజ్ఞానం ఆయన సొంతం. ఇంజినీరింగ్తోపాటు ఎంబీఏ చదివిన ఆయన తనకున్న సాంకేతిక పరిజ్ఞానం, మేనేజ్మెంట్ నైపుణ్యంతో చేపట్టిన పనులు మున్సిపల్ చైర్మన్ పదవికే వన్నె తెచ్చాయి. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న సత్యనారాయణను మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ‘సాక్షి’ పలకరించగా నాటి అనుభవాలు, విశేషాలను ఇలా పంచుకున్నారు. సోమారపు సత్యనారాయణ రామగుండం మొదటి చైర్మన్గా ఎన్నికైనప్పు డు ఉన్న పరిస్థితుల్లో మీ అనుభవం? పాలకవర్గం లేకపోవడంతో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొని ఉన్న కాలంలో చైర్మన్గా ఎన్నికయ్యాను. సింగరేణి నీటి సరఫరా తప్ప మున్సిపల్ నీళ్లు లేవు. అక్కడక్కడా ఉన్న బోర్వెల్ నీరే ఆధారం. డ్రైనేజీ వ్యవస్థ, సరైన రోడ్లు కూడా లేవు. సింగరేణి స్థలాల్లో కట్టుకున్న ఇళ్లకు ఇంటి పన్ను లేకపోవడంతో నిధులు చాలా తక్కువ. అలాంటి పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లారు..? ముందుగా నిధుల కొరత అధిగమించే ప్రయత్నం చేశాను. సింగరేణి స్థలాల్లో కట్టుకున్న ఇళ్లకు నంబర్లు ఇచ్చి నామమాత్రపు పన్ను విధించాం. దగ్గరున్న బ్యాంకుల్లో కట్టుకోవడానికి వీలుగా చలానాలు పంపిణీ చేశాం. ఆ రశీదుల కారణంగానే తర్వాత కాలంలో వారికి సింగరేణి స్థలాల క్రమబద్ధీకరణలో భాగంగా ఇళ్ల పట్టాలు ఇచ్చారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ నిధులు పొందడానికి రామగుండంకు అర్హత ఉండగా, నాటి సీఎంను ఒప్పించి ముందుగానే నిధులు రాబట్టి అభివృద్ధి పనులు చేపట్టాం. దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? తాగునీటి సరఫరాపై ముందు దృష్టిపెట్టాను. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగం ద్వారా అర్ధాంతరంగా నిలిచిన పనులపై దృష్టిపెట్టి, హెడ్ వర్క్స్, ట్యాంకులు నిర్మించడంతో మున్సిపల్ నీటి సరఫరా ప్రారంభమైంది. ఆ తర్వాత 24 గంటల నీటి సరఫరా చేసి దేశం దృష్టిని ఆకర్షించేలా చేయగలిగాను. ఆ తర్వాత దేనిపై దృష్టి పెట్టారు? పారిశుధ్యం దృష్టి పెట్టాను. శానిటేషన్తో పాటు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో దేశంలోనే మొదటిసారిగా తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించడం జరిగింది. చెత్త ఏరుకొని జీవించే వారిని గుర్తించి, వారికి పరుగు పందెం నిర్వహించి శారీరక సామథ్యం ఉన్నవారికి ఉచితంగా రిక్షాలు ఇచ్చి ఇంటింటా చెత్త సేకరించడం జరిగింది. అలాగే ఎడ్ల బండ్లతో చెత్త సేకరించే పారిశుధ్య కార్మికులకు ఆటోలు ఇచ్చాం. స్వశక్తి సంఘాలకు బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు ఇప్పించి ట్రాక్టర్లు కొనుగోలు చేయించాం. వాటికి మున్సిపల్ నుంచి అద్దె చెల్లించడం ద్వారా ఒకపక్క ఉపాధి పొందడంతోపాటు మరో పక్క రుణం తీరిపోయి, వారే ఆ వాహనాలకు యజమానులయ్యారు. రోడ్లు, కాలువలను ఎలా అభివృద్ధి చేశారు? మున్సిపాలిటీలో నిధుల్లేవు, పబ్లిక్, ప్రయివేట్ పార్టీసిపేషన్ అంటే నగరపాలక సంస్థ, ప్రజల భాగస్వామ్యంతో 80: 20 ప్రాతిపదికన ఎవరూ ముందుకొస్తే అక్కడ రోడ్లు, కాలువలు నిర్మించాం. నా చొరవతో నాటి ముఖ్యమంత్రి డీఎఫ్ఐడీ నిధులు రామగుండంకు మంజూరు చేయడంతో రోడ్లు, కాలువలు వంటి అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం దొరికింది. వినూత్నంగా ఆలోచించి చేపట్టిన పనులేవి? పట్టణానికి తగినట్టుగా దేశంలోనే మొదటిసారిగా బేబీ డ్రెయిన్లతో కాలువల నిర్మాణం చేపట్టాం. డ్రై వెదర్ డ్రెయిన్, ఫెర్రో సిమెంట్ డ్రెయిన్ల నిర్మాణం నా హయాంలో చేపట్టడం జరిగింది. అత్యంత మన్నికతో వేసిన సీసీ రోడ్లు కొన్ని చోట్ల ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. మీటర్లు ఏర్పాటు చేసి వాడిన నీటికే బిల్లు తీసుకున్నాం. జనన, మరణ ధ్రు వీకరణ పత్రాలు కొరియర్ ద్వారా ఇంటికే పంపాం. పైరవీలకు తావు లేకుండా జరిగింది. కొత్త వెలుగు కోసం ఏం చర్యలు తీసుకున్నారు? చాలా మంది రిటైర్డ్ కార్మికులు ఇక్కడ సరైన వసతులు లేవని ఇతర ప్రాంతాలు, సొంత ఊళ్లకు వెళ్తున్న తరుణంలో అందరికీ అందుబాటులో ఉండేలా మున్సిపల్ కార్యాలయ భవనం, వినూత్న డిజైన్తో కొత్త కూరగాయల మార్కెట్ నిర్మించాను. ఐడీఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ భవనానికి నిధులు మంజూరు చేయించి పునాది వేశాను. తాగునీటి సరఫరా, సెంట్రల్ లైటింగ్, ఇంటి ముందుకే చెత్త బండి రావడం తదితర సౌకర్యాలు సమకూరడంతో ఇళ్ల నిర్మాణం పెరిగింది. స్వశక్తి మహిళలకు సీఆర్సీ భవనం నిర్మించి, వారితో సూపర్ మార్కెట్లు పెట్టించాం. నేపాల్ నుంచి నిపుణులను రప్పించి టోపీలు కుట్టించే శిక్షణ ఇప్పించాను. మలుపు అనే పథకం ద్వారా వందల మందికి చెప్పులు కుట్టే శిక్షణ ఇప్పించాను. ఇలా అనేక ఉపాధి అవకాశాలు కల్పించాను. మీ పనులు ప్రభావితం చేశాయా? చేశాయి. దేశ, విదేశాల నుంచి ఎంతో మంది స్టడీ టూర్లో భాగంగా రామగుండం సందర్శించారు. మున్సిపల్ విద్యుత్ బిల్లుల్లో రామగుండంకు రూ.25లక్షలు నేను రికవరీ చేసిన విధానం నచ్చి, అలాగే చేయాలని అన్ని మున్సిపాలిటీలకు నాటి ముఖ్యమంత్రి సర్క్యులర్ జారీ చేయించారు. రాగ్పిక్కర్ విధానం, 24 గంటల నీటి సరఫరా తీరును అనేక మంది పరిశీలించి వెళ్లారు. చైర్మన్గా గొప్పగా భావించేది ఏది? మురికివాడలను అభివృద్ధి చేయడం అన్నింటి కంటే ఎక్కువగా చెప్పుకోతగ్గది. నాడు రామగుండంలో 45 నోటిఫైడ్ 47 నాన్ నోటిఫైడ్ స్లమ్స్ ఉండేవి. నేను చేపట్టిన పనులతో అవి ఇప్పుడు స్లమ్స్లా కనబడతలేవు. గుర్తింపు వచ్చిన సందర్భాలు ఉన్నాయా? అవార్డులకు ఎప్పుడూ నామినేషన్ వేయలేదు. కానీ, చేంజ్ మేనేజ్మెంట్ ఫోరంలో దేశంలో కేవలం ఇద్దరు మున్సిపల్ చైర్మన్లను ఎంపిక చేయగా, అందులో నేను ఒక్కడిని కావడం నాకు ఇచ్చిన పెద్ద గుర్తింపుగా భావిస్తున్న. ఏమైనా సలహాలు ఇస్తారా? ఎవరి ఐడియాలజీ వారికి ఉంటుంది. ఆ ఐడియాలజీ ప్రకారం పని చేసుకుంటూ పోతారు. -
రూ.200 పుచ్చుకో... జెండా పట్టుకో !
వేములవాడ: మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ, పొలిమేర గ్రామాల్లోని మహిళలకు ఉపాధి పుష్కలంగా లభిస్తుంది. నామినేషన్లపర్వం ముగిసిపోయి బుధవారం నుంచి ప్రచారం ప్రారంభమైంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బరిలో నిలిచిన అభ్యర్థులు వార్డుల్లో ప్రచారం చేస్తున్నారు. ఈక్రమంలో తన వెంట ఎక్కువ మంది కనిపించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. స్థానిక మహిళలతోపాటు పొరుగున్న ఉన్న పల్లెల నుంచి రూ.200 చొప్పున కూలీ చెల్లించి తమ వెంట ప్రచారానికి తెచ్చుకుంటున్నారు. వారు జెండా పట్టుకొని అభ్యర్థులు వెనుక ఉంటూ.. ‘.. మన అన్నకే ఓటేయాలి’, ‘అన్న గెలుపుతోనే వార్డు అభివృద్ధి’ అంటూ నినాదాలు చేయా లి. వీరు వచ్చిపోయేందుకు ఆటోలు పెడుతున్నారు. ప్రచారానికి వచ్చిన వారికి అభ్యర్థి ఇంటి వద్ద లేదా తన వార్డు ఆఫీస్ వద్ద భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. పురుషులు ప్రచారానికి వస్తే అదనంగా మందు ఖర్చు చేస్తున్నారు. దీంతో పట్టణంలోని చికెన్, మటన్ సెంటర్ల వద్ద గిరాకీ పెరిగింది. సాధారణ రోజులతో పోల్చితే ఇప్పుడు బిర్యానీ ఆర్డర్లు రెట్టింపయ్యాయని బిర్యానీ సెంటర్ నిర్వాహకులు తెలిపారు. -
జనరలైనా.. తగ్గేదే లే..
● ఆసక్తికరంగా 63వ డివిజన్ పోరు కరీంనగర్ కార్పొరేషన్: మహిళా రిజర్వేషన్కే ఆ నాయకురాళ్లు పరిమితం కాలేదు. జనరల్ అంటే పురుషులకు కేటాయించినట్లు కాదంటూ, తాము బరిలోకి దిగి ఆ మహిళలు పోరుకు సై అన్నారు. నగరంలోని 63వ డివిజన్ పోరు ఆసక్తికరంగా మారింది. డివిజన్ రిజర్వేషన్ బీసీ జనరల్ అయినప్పటికి మూడు ప్రధాన పార్టీల నుంచి అతివలే బరిలోకి దిగారు. మాజీ కార్పొరేటర్ గందె మాధవి బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ కర్రె పావని, బీజేపీ నుంచి దేశ శిల్ప పోటీపడుతున్నారు. డివిజన్ నుంచి మొత్తం నలుగురు పోటీలో ఉండగా.. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బీసీ ఉద్యమ నేత కేశిపెద్ది శ్రీధర్రాజు బరిలో నిలిచారు. -
ముగ్గురు ముఖ్యుల ఓట్లు 30వ డివిజన్లోనే..
రామగుండం: రామగుండం నగరంలోని 30వ డివిజన్పైనే అందరి దృష్టి నెలకొంది. కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఈ డివిజన్లో ముగ్గురు ముఖ్యులు అయోధ్యనగర్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ఠాకూర్, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్, బీఆర్ఎస్ కార్మిక సంఘం నేత కౌశిక హరి కాగా, ఇటీవల అంతర్గాం మండల పరిధిలోకి తన ఓటును బదిలీ చేయించుకున్నట్లు తెలిసింది. కాగా దీని పక్కనున్న 28వ డివిజన్ అబాది రామగుండంలోని ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, పీసీసీ ప్రోటోకాల్ చైర్మన్, ఏఐసీసీ ప్రతినిధి హర్కర వేణుగోపాల్రావు ఓటరుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 30వ డివిజన్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపోటములు ముగ్గురు ముఖ్యుల ఆధిపత్యాన్ని స్పష్టం చేయనుందనే చర్చ సర్వత్రా ఆసక్తికరంగా మారింది. వేణుగోపాల్రావుకోలేటి దామోదర్కౌశికహరిమక్కాన్సింగ్ రామగుండంలో సర్వత్రా ఆసక్తికర చర్చ -
తైబజార్ లేని మున్సిపాలిటీ జగిత్యాల
జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీకి ప్రత్యేకత ఉంది. ఏ మున్సిపాలిటీలోనైనా తైబజార్ వసూలు చేస్తుంటారు. ఇక్కడ మాత్రం తైబజార్ వసూలు చేయరు. కూరగాయల వ్యాపారులైనా.. తోపుడు బండ్ల వ్యాపారులైనా.. రోడ్లపై చిన్నచిన్న వస్తువులను ఎవరైనా అమ్ముకోవచ్చు. ఇలాంటి వారికి తైబజార్ లేకపోవడం ఎంతో వెలుసుబాటు కలిగిస్తోంది. పైగా వైఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ మున్సిపాలిటీలో అప్పటి పాలకవర్గం రూ.200కే నల్లా కనెక్షన్ అమలు చేశారు. అప్పటినుంచి అదే అమలువుతోంది. ఏ మున్సిపాలిటిలోనైనా నల్లా కనెక్షన్ తీసుకోవాలంటే కొంతమొత్తం వసూలు చేస్తుంటారు. ఇక్కడ కేవలం రూ.200కే కనెక్షన్ ఇస్తున్నారు. రైతులు, వ్యాపారులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు కొనసాగుతున్న రూ.200కే నల్లా కనెక్షన్ -
● శ్రద్ధాంజలి ఘటించిన మంత్రులు శ్రీధర్బాబు, వివేక్
రామన్నకు అశ్రునివాళిమంథని: అనారోగ్యంతో బాధపడుతూ రెండురోజుల క్రితం హైదరాబాద్లో మృతి చెందిన మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి(రామన్న)కి పార్టీలకు అతీతంగా అశ్రునివాళి అర్పించారు. బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి మంథనికి రాంరెడ్డి భౌతికకాయం తీసుకువచ్చారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుతో పాటు పలువురు నివాళి అర్పించారు. గురువారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, కార్మిక, మైనింగ్శాఖ మంత్రి గడ్డం వివేక్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు నివాళి అర్పించారు. అనంతరం మంథని నుంచి పెద్ద ఎత్తున అంతిమ యాత్ర సాగగా ముత్తారం మండలం సీతంపేటలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. మంథనిలో కూరగాయల మార్కెట్, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. -
పంచిన మద్యం సీసాలు వైన్స్షాపుల్లోకి..
కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని ఓ వార్డులో ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ప్రతిరోజూ సాయంత్రం ముగ్గురు అభ్యర్థులు అడిగినవారికి లేదనకుండా మందు పంపిణీ చేస్తున్నారు. అయితే ముగ్గురు ఇచ్చిన మందును ఒకేరోజూ తాగలేకపోతున్నారు. దీంతో వారు కొత్త ఐడియాకు తెరతీశారు. ఒక అభ్యర్థి ఇచ్చిన మందును ఆ రోజు తాగి.. మిగిలిన అభ్యర్థులు ఇచ్చిన మందు బాటిళ్లను వైన్స్షాపులకు తీసుకెళ్లి ఇచ్చి నగదు తీసుకుంటున్నారు. ఇలా సమకూరిన డబ్బులను తలాకొంత పంచుకుంటుండడం విశేషం. ప్రచారంలో భాగంగా వచ్చిన మద్యం బాటిళ్లను ఇచ్చి డబ్బులు తీసుకెళ్లడంతో వైన్స్షాపు నిర్వాహకులు నివ్వెరపోతున్నారు. కండువాలు మారుతున్నాయ్.. కొందరు కార్యకర్తలు ఉదయం ఒకపార్టీకి.. మధ్యాహ్నం మరోపార్టీకి.. సాయంత్రం ఇంకో పార్టీకి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎప్పడికప్పుడు కండువాలు మారుస్తూ.. పోటీలో ఉన్న అభ్యర్థులను కంగారుపెడుతున్నారు. మహిళాసంఘాల సభ్యులైతే ఎవరు ప్రచారానికి రమ్మంటే వారివెంట వెళ్తున్నారు. అభ్యర్థులు కూడా కార్నర్ మీటింగ్లకు మహిళాసంఘాల సభ్యులను తరలిస్తున్నారు. వీరికి ఆయా పార్టీల వారు రూ.200 నుంచి రూ.300 వరకు ఇస్తున్నట్లు సమాచారం. పొద్దంతా మూడు పూటల మూడు పార్టీల ప్రచారంలో పాల్గొంటే ఎంత తక్కువనుకున్నా రూ.వెయ్యి వరకు గిట్టుబాటు అవుతోంది. కొంతమంది మహిళా సంఘాల ప్రతినిధులు బరిలో ఉన్న అభ్యర్థులకు ఫోన్ చేసి ‘మీరేమీ అనుకోవద్దు.. మేం మీకే ఓటు వేయిస్తాం..’ కేవలం డబ్బుల కోసం ఓ పూట ప్రచారానికి వెళుతున్నామని చెబుతుండడం గమనార్హం. బాటిళ్లు ఇచ్చి నగదు తీసుకుంటున్న వైనం ఒక్కోరోజు ఒక్కో అభ్యర్థి పంచిన మద్యం సేవనం మిగిలిన వారు ఇచ్చిన బాటిళ్లకు వచ్చిన డబ్బులు తలాకొంత -
విద్యుత్ షాక్తో రైతు మృతి
మెట్పల్లిరూరల్: విద్యుత్షాక్తో ఓ రైతు మృతి చెందినట్లు ఇబ్రహీంపట్నం ఎస్సై నవీన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలోని మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేట గ్రామానికి చెందిన సబ్బని గణేశ్ రైతు. పంటకు అడవి పందుల బెడద ఉందని బుధవారం రాత్రి సమయంలో పొలం వద్దకు కాపలా కోసమని అదే గ్రామానికి చెందిన వినోద్, సురేశ్ను వెంటబెట్టుకుని వెళ్లాడు. ఆ ప్రాంతంలో చీకటి ఉందని సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ లైట్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో విద్యుత్ షాక్ రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. అతడిని వెంట ఉన్న వినోద్, సురేశ్ మెట్పల్లిలోని ఓ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం ప్రమాదమని తెలిసినా.. గణేశ్కు సహకరించిన వినోద్, సురేశ్పై మృతుడి భార్య లహరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. 12 రోజుల్లో ఇద్దరు..రుద్రంగి(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో విషజ్వరాలు ప్రబలు తున్నాయి. 12 రోజుల్లో ఇద్దరు విషజ్వరంతో మృతి చెందడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. విషజ్వరం, రక్తకణాలు తగ్గిపోయి బోయిని రాములు అనే వ్యక్తి జనవరి 25న మృతిచెందగా విషజ్వరం, రక్తకణాలు పడిపోయి, జాండీస్తో కట్కూరి సంజీవ్(48) గురువారం మృతిచెందారు. ప్రభుత్వ వైద్యాధికారులు పరీక్షలు చేసి మరణాలకు గల కారణాలను తెలుసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సంజీవ్ మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా బుధవారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి కరీంనగర్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. సంజీవ్కు తల్లి లక్ష్మి, భార్య మంజూల, కొడుకులు వంశీ(25), సన్ని(19), శ్రావణ్(16) ఉన్నారు. గోదావరిలో గుర్తుతెలియని మృతదేహం రామగుండం: అంతర్గాం మండలం గోలివాడ శివారు గోదావరినదిలో గురువారం గుర్తుతెలియని లభించినట్లు ఎస్సై వెంకటస్వామి పేర్కొన్నారు. మృతుడికి సుమారు 40 ఏళ్ల వయసు ఉంటుందని, ఆకు పచ్చ రంగు ఫుల్ టీ షర్ట్, దానిలో తెలుపు రంగు, లేత ఆకుపచ్చ జీన్స్ ప్యాంట్, కుడి చేతికి 3 స్టార్ టాటూస్, ఎడమ చేతికి టీ, ఎం, ఎన్ ఇంగ్లిష్ అక్షరాలను టాటూ వేయించుకున్నాడు. ఆచూకీ తెలిసినవారు 87126 56527 నంబర్కు సమాచారం అందించాలని ఎస్సై కోరారు. ఈనెల 2న గుర్తు తెలియని పురుషుడి మృతదేహం లభ్యం కాగా రెండురోజుల వ్యవధిలో మరో మృతదేహం లభ్యమవడం చర్చనీయాంశంగా మారింది. -
ఆరుగురు బంగారం దొంగలు, వ్యాపారి అరెస్ట్
మెట్పల్లి: మెట్పల్లి ప్రాంతంలో పలు దొంగతనాలకు పాల్పడిన ఆరుగురు నిందితులు.. వారు తెచ్చిన సొత్తును కొనుగోలు చేసిన వ్యాపారిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది జనవరిలో మెట్పల్లి ప్రాంతంలో ఆరుచోట్ల దొంగతనాలు జరిగాయి. మెట్పల్లి శివారులో వన్నెల గంగుపై పట్టపగలే దాడి చేసి ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడును ఎత్తుకెళ్లారు. ఇలా వరుస దొంగతనాలు జరగడాన్ని సీరియస్గా తీసుకున్న అధికారులు.. నిందితుల కోసం డీఎస్పీ రాములు ఆధ్వర్యంలో సీఐ అనిల్కుమార్, ఎస్సైలు కిరణ్కుమార్, అనిల్, నవీన్తో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు మెట్పల్లి, నిజామాబాద్తోపాటు పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ సీసీ కెమెరాలు పరిశీలించారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్ట నిందితులను గుర్తించారు. అప్పటినుంచి వారి కోసం గాలిస్తుండగా గురువారం మెట్పల్లిలోని కొత్త బస్టాండ్ వద్ద పండుగ రమేశ్, పల్లెపు రమేశ్ అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా వారు ఇచ్చిన సమాచారంతో మరో నలుగురు నిందితులు గుంజె గంగాధర్, గంగమణి, గైని కిరణ్, పెద్దూరు మల్లేశ్వరితోపాటు దొంగ సొత్తును కొనుగోలు చేస్తున్న వ్యాపారి ఇందూరి రాకేశ్ను అరెస్ట్ చేశారు. వీరందరి నుంచి 15 తులాల బంగారు, 32తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగవంతంగా చేధించిన డీఎస్పీ, సీఐ, ఎస్సైతో పాటు ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు అందించారు. నిందితులపై అనేక కేసులు అరెస్టయిన నిందితుల్లో నలుగురిపై గతంలో పలు స్టేషన్లలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కిరణ్పై 35, పండుగ రమేశ్పై 23, గంగాధర్పై 16, పల్లెపు రమేశ్పై 13 కేసులున్నాయని ఎస్పీ పేర్కొన్నారు. 15 తులాల బంగారం, 32 తులాల వెండి స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ అశోక్కుమార్ -
మహిళల భద్రతకు భరోసా
గోదావరిఖని(రామగుండం): మహిళల భద్రతకు భరోసాగా షీటీంలు నిలుస్తున్నాయని, నిర్భయంగా మహిళలు ఫిర్యాదు చేయవచ్చని రామగుండం సీపీ అంబర్కిషోర్ఝా కోరారు. వేధింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందన్నారు. కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి జోన్లో ఒక షీ టీం పనిచేస్తోందని, 63039 23700 వాట్సాప్, 87126 59386 నంబర్కు ఫిర్యాదు చేయవచ్చని, డయల్ 100కు కాల్ చేయవచ్చన్నారు. జనవరిలో షీటీంలకు 56 ఫిర్యాదులు అందా యని, వాటిలో 13 ఫిర్యాదులపై ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, 8 పెట్టీ కేసులు, నలుగురికి కౌన్సెలింగ్ నిర్వహించామని పేర్కొన్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుగోదావరిఖని(రామగుండం): సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పెద్దపల్లి డీసీపీ రామ్రెడ్డి ఆదేశించారు. గురువారం రాత్రి గోదావరిఖని వన్టౌన్ పరిధిలోని పవర్హౌస్కాలనీ, సప్తగిరికాలనీ, గంగానగర్, జీఎంకాలనీ, విద్యానగర్, రాంనగర్, తదితర సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఏసీపీ రమేశ్తో పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సీఐ ఇంద్రసేనారెడ్డి, తదితరులున్నారు. ఎన్నికల నియమావళిపై అవగాహనపెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మున్సిపాలిటీ వార్డు స్థానాలకు పోటీపడుతున్న అభ్యర్థులకు గురువారం ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించారు. 36 వార్డులకు 157మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం అనుసరించాల్సిన పద్ధతులపై పరిశీలకులు పద్మజరాణి, సుజాత వివరించారు. కమిషనర్ వెంకటేశ్, టీపీవో నరేశ్, వినయ్కిరణ్, మాస్టర్ ట్రేనర్ కృష్ణారెడ్డి, ఏవో నాగవేణి తదితరులున్నారు. ఓటర్లకు స్లిప్పులు అందించాలిజ్యోతినగర్(రామగుండం): రామగుండం కార్పొరేషన్లోని అన్ని డివిజన్లలో ఓటర్లకు స్లిప్పులు అందించాలని కమిషనర్ జె. అరుణశ్రీ అన్నారు. గురువారం ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్లోని కాకతీయ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఓటరు స్లిప్పు పంపిణీ చేసినప్పుడు పోలింగ్ కేంద్రం చిరునామా తెలియజేయాలని సూచించారు. విధుల్లో ఉన్న సిబ్బంది మాత్రమే ఇళ్లకు వెళ్లి స్లిప్పులు పంపిణీ చేయాలని, ఇతరులకు ఇవ్వరాదని ఆదేశించారు. ఎన్నికల పరిశీలకులు పద్మజారాణి, సుజాత, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఎంఈవో మల్లేశం, ఏసీపీ శ్రీహరి, టీపీఎస్ నవీన్, ట్రైనర్లు పాల్గొన్నారు. డీఎల్పీవో విచారణపెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం అప్పన్నపేట పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై గురువారం డీఎల్పీవో దేవకీదేవి విచారణ జరిపారు. మాజీ ఉపసర్పంచ్ చీకటి పోచాలు గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన రూ.6లక్షల చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై మాజీ కార్యదర్శి శ్రీనివాస్, ప్రస్తుత కార్యదర్శి శ్రీలతతో పాటు పలువురిని డీఎల్పీవో విచారించారు. ఇరువర్గాల వాదనలు విన్న సంబందిత రికార్డులు తెప్పించాలన్నారు. అయితే విచారణ సమయంలో అవసరమైన రికార్డులు అందుబాటులో లేకపోవడంతో నాలుగురోజుల్లో సిద్ధంగా ఉంచాలని డీఎల్పీవో ఆదేశించారు. -
గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు
రామగుండం/గోదావరిఖనిటౌన్: రాబోయే ఏడాదిలో నిర్వహించే గోదావరినది పుష్కరాలను పురస్కరించుకొని గురువారం అంతర్గాం మండలం గోలివాడ, గోదావరిఖని వద్ద నది ప్రాంతాలను కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించారు. పుష్కర సమయంలో 30వేల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించనున్నారనే అంచనాతో పుష్కర ఘాట్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు నిర్ణయించారు. ఆర్డీవో బి.గంగయ్య, సురేశ్, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ, సర్పంచ్ కొలిపాక చంద్రారెడ్డి, జాతర కమిటీ చైర్మన్ గీట్ల శంకర్రెడ్డి తదితరులున్నారు. పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించాలి పెద్దపల్లి: అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఎదుగుదలను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. జిల్లాలోని 90 అంగన్వాడీ కేంద్రాల మరమ్మతుకు రూ.2 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశామని, వాటిని సద్వినియోగం చేయాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు కేంద్రాలకు వచ్చి ఒకపూట భోజనం తీసుకునేలా చూడాలన్నారు. కేంద్రం నుంచి అందించే ఆహారపదార్థాల నాణ్యతను రెగ్యులర్గా చెక్ చేయాలని పేర్కొన్నారు. ప్రతీవారం అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్ల పనితీరును పరిశీలిస్తానని తెలిపారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు పక్కా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్లో మా ట్లాడారు. గత పుష్కరాల్లో ఎదురైన అనుభవా లను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలన్నారు. అదనపు కలెక్టర్ వేణు, ఆర్డీవో గంగయ్య, జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్రావు, సురేశ్, సీడీపీవోలు అలేఖ్య, పుష్ప తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ జెండా ఎగరాలి
సాక్షిప్రతినిధి, కరీంనగర్/చొప్పదండి: కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని బల్దియాలపై కాంగ్రెస్ జెండా ఎగరాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్లో గురువారం నిర్వహించిన ప్రజాపాలన– ప్రగతిబాట బహిరంగ సభకు హాజ రై కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహాన్ని నింపారు. ముందుగా రామడుగు మండలంలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ), గంగాధరలో డిగ్రీ కాలేజీ, రామడుగు దత్తోజీపేటలో సోలార్ప్లాంట్ పనులకు శంకుస్థాపన చేశారు. సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజ లు పెద్ద ఎత్తున హాజరు కాగా.. ముఖ్యమంత్రి ప్రసంగం కార్యకర్తల్లో నూతనోత్తేజన్ని నింపింది. పట్టం కట్టి.. పనులు చేయించుకోండి సభా వేదికపైకి వచ్చిన సీఎం రేవంత్ బీజేపీ– బీఆర్ఎస్ బంధంపై నిప్పులు చెరిగారు. రెండేళ్ల వ్యవధిలో తాము చేసిన అభివృద్ధిని వివరించా రు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, కార్పోరేషన్లకు రెండేళ్లలో రూ.17,442 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. కరీంనగర్ జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలకు సుమారు రూ.2,778 కోట్లు ఇచ్చామన్నారు. రామగుండానికి రూ.586 కోట్లు, కరీంనగర్ కార్పొరేషన్కు రూ.1,489 కోట్లు, చొప్పదండి మున్సిపాలిటీకి రూ.50 కోట్లు ఇచ్చామన్నా రు. ఇవన్ని పనులు జరగాల్సి ఉందని, కాంగ్రెస్ అభ్యర్థులకు పట్టం కట్టి, గెలిపించి పనులు పూర్తి చేయించుకోవాలని కోరారు. ఏప్రిల్లో రెండో విడు త ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. జగిత్యాల ఎమ్మె ల్యే డాక్టర్ సంజయ్ పట్టణంలోని యావర్ రోడ్డును విస్తరించాలని సీఎంను కోరారు. చొప్పదండి ఎమ్మె ల్యే మేడిపల్లి సత్యం రెండు పేజీల సమస్యలు ఇచ్చారని పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ● మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. సుదీర్ఘంగా పట్టి పీడిస్తున్న రాష్ట్రంలోని సమస్యల పరిష్కారానికి సీఎం కృషి చేస్తున్నారని తెలిపా రు. రాహుల్ గాంధీ, పార్టీ సూచనతో రాష్ట్రంలో కులగణన చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నా రు. మనల్ని చూసి కేంద్రం కులగణనకు తల వంచిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ పట్టం కట్టాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కేబుల్ బ్రిడ్జి, రింగురోడ్డు, రివర్ ఫ్రంట్, డ్రైనేజీ పనులు పూర్తి చేయిస్తామన్నారు. ● మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పిల్లల్లో నైపుణ్యం పెంచాలని సీఎంను కోరడం ద్వారా ఏటీసీ మంజూరైందన్నారు. డిగ్రీ కళాశాలను ఎమ్మెల్యే సీఎం సహకారంతో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో పట్టణాల్లోని బంధువులకు చెప్పి ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ● మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాల్లో ఎనిమిది సీట్లలో ప్రజలు గెలిపించారని, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వానికి పట్టం కట్టాలని కోరారు. తెలంగాణపై విషం చిమ్ముతున్న పవన్ కల్యాణ్తో బీజేపీ పొత్తు పెట్టుకొని ప్రజల మధ్యకు వస్తోందన్నారు. ● మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయం, కొండగట్టు అంజన్న ఆలయం, ధర్మపురి లక్ష్మి నృసింహస్వామి ఆలయాలను అభివద్ధి చేయాలని కోరారు. రాబోయే గోదావరి పుష్కరాలకు బాసర నుంచి భద్రాచలం వరకు సౌకర్యాలు కల్పించాలన్నారు. యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి నాయకత్వంలో తమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందన్నారు. సీఎం కాగానే రూ.240 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్ మంజూరు చేశారని, గంగాధరలో డిగ్రీ కళాశాల నిర్మాణానికి నిధులతో పాటు, పోస్టులు మంజూరు చేశారన్నారు. కొండగట్టుకు ఇటీవలే టీటీడీ ద్వారా రూ.35 కోట్లు ఇచ్చారని, మన ప్రభుత్వం కూడా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని కోరారు. విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు రాజ్ఠాకూర్, విజయరమణారావు, కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
గోదావరిఖని(రామగుండం): కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ పేర్కొన్నారు. గురువారం రాత్రి స్థానిక ప్రధాన చౌరస్తా సమీపంలో కార్నర్ మీటింగ్లో పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా 9, 10, 37, 38, 39, 47,48,49, 50 డివిజన్ల ప్రజలతో మాట్లాడారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ముఖ్యమంత్రితో మాట్లాడి ఈప్రాంతానికి మరిన్ని నిధులు తీసుకవచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు మహంకాళి స్వామి, పలువురు కాంగ్రెస్ అభ్యర్థులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో అరాచక పాలన
గోదావరిఖని/ఫెర్టిలైజర్సిటీ: రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గురువారం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో రామగుండంలోని 23,52,53,54, 55,41,35వ వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో ప్రజలను ఆశపెట్టి గద్దెనెక్కిందన్నారు. ప్రజలు ఆశపడడం తప్పు కాదని, వారిని మోసం చేయడం కాంగ్రెస్ తప్పన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచినా ప్రజలకు చేసిందేమీ లేదని, రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేరని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రౌడీల పాలనకు చరమగీతం పాడాలని కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. అభివృద్ధి పేరిట విధ్వంసం జరుగుతోందన్నారు. రాత్రి పూట దొంగల వలె మైసమ్మ ఆలయాలు, దుకాణాలు కూల్చడం ఇక్కడ నిత్యం జరుగుతుందన్నారు. రామగుండంలో నియంత పాలన పోవాలంటే బీఆర్ఎస్ గెలుపుతోనే సాధ్యమన్నారు. అభ్యర్థులను పోలీసులతో బెదిరిస్తూ విత్ర్ డ్రా చేయించారని, అబద్ధాలు, మోసాలకు కేరాఫ్గా కాంగ్రెస్ నిలిచిందన్నారు. ఓట్లు అడిగేందుకు వచ్చే ఆ పార్టీ నాయకులను ప్రజలు నిలదీయాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమాల్లో నాయకులు మూల విజయరెడ్డి, కౌశిక హరి, నడిపెల్లి మురళీధర్రావు, నారాయణదాసు మారుతి, అచ్చే వేణు తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధిని చూసి ఓటెయ్యండి
పెద్దపల్లిరూరల్/సుల్తానాబాద్రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి పాటుపడుతోందని, అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. గురువారం పెద్దపల్లి పట్టణంలోని 23,4వ వార్డులో తాడూరి శ్రీమాన్, కొమ్ము సుధాకర్, సుల్తానాబాద్లోని 4, 11,12,13,14,15వ వార్డుల్లో బిరుదు రాధాకృష్ణ, కల్వల అంజలి, దున్నపోతుల లలిత, సిద్ధ తిరుపతి, వేగోళం పద్మ, గాదాసు మంజులకు మద్దతుగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్నయ్యగౌడ్, మార్కె ట్ కమిటీ చైర్మన్ ప్రకాష్రావు, ముడుసు సాంబిరెడ్డి, రమేశ్, సునిత, రాజేందర్ పాల్గొన్నారు. -
హామీలు అమలు చేస్తున్నాం
మంథని: ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇచ్చిన హమీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. గురువారం మంథని మున్సిపాలిటీ పరిధిలోని బోయిన్పేట, ముత్యాలమ్మ వీధి, కూరగాయల మార్కెట్ తదితర ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేయడం ఏంటని ప్రశ్నించారు. మంథని మున్సిపాలిటీ అభివృద్దికి రూ.40 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు పలకాలని కో రారు. కార్యక్రమంలో వొడ్నాల శ్రీనివాస్, ముస్కుల సహేందర్రెడ్డి, పోలు శివ, సీపతి బానయ్య, నూకల కమల్ తదితరులు పాల్గొన్నారు. -
క్యాన్సర్ నివారణపై అవగాహన ఉండాలి
పెద్దపల్లి: క్యాన్సర్పై అవగాహన ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖ సూచించిన క్యాన్సర్ నివారణ చర్యలపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని, వాటిని ఆచరించి కుటుంబ సభ్యులకు కూడా తెలుపాలని సూచించారు. బాలికలు, మహిళలు ప్రతి నెల స్వయంగా బ్రెస్ట్ స్క్రీనింగ్ చేసుకోవాలని, ఏవైనా అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదించాలన్నారు. వ్యాయామం, యోగా సాధన నిత్యజీవితంలో భాగం చేసుకోవాలన్నారు. డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ మాట్లాడుతూ, క్యాన్సర్కు ప్రధాన కారణాలైన పొగాకు ఉత్పత్తులు, మద్యం తాగడం మానుకోవాలన్నారు. సెల్ఫోన్ వినియోగం తగ్గించి, హెపటైటిస్–బి, హెచ్పీవీ టీకాలు వేయించుకోవాలని తెలిపారు. ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రిలో మొదటిసారి కీమోథెరపీ చేయించుకున్న రోగులకు తదుపరి కీమోథెరపీ చికిత్స అందించేందుకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, రామగుండంలో 10 పడకలతో క్యాన్సర్ కేర్ వార్డు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అకస్మాత్తుగా బరువుతగ్గడం, ఎడతెగని దగ్గు, కంతులు పెరగడం, దగ్గినప్పుడు లేదా విసర్జన సమయంలో రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదించాలని సూచించారు. జిల్లా ప్రోగ్రాం అధికారి, డాక్టర్లు రాజమౌళి, లక్ష్మీభవాని, ఎన్.శ్రీనివాస్, ఎం.బాలకృష్ణ, కె.సంకీర్తన, ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
సాక్షి పెద్దపల్లి: పదేళ్ల పాలనలో పట్టణాలు, పల్లెలను గాలికొదిలేసిన బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ఐటీ పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రశ్నించారు. ఎన్నికలు వస్తే అడ్డగోలుగా మాట్లాడే పార్టీలు బీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధిచేప్పేలా, అధికార కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమైనా.. కాంగ్రెస్ సర్కార్ గాడిలోపెట్టిందన్నారు. ఒక్కో హామీ అమలు చేస్తోందని తెలిపారు. పెద్దపల్లికి ఐటీ పార్క్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అరకొరగా కట్టి లబ్ధిదారులకు అందించలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలు క ల్పించి లబ్ధిదారులకు అందించిన ఘనత ఎమ్మెల్యే విజయరమణారావుకే దక్కిందన్నారు. ఐఎన్టీయూసీ నేత జనక్ప్రసాద్, మాజీ జెడ్పీటీసీ గోపగాని సారయ్యగౌడ్, శశిభూషణ్ కాచే, శ్రీమాన్, తొట్ల తిరుపతియాదవ్ తదితరులు పాల్గొన్నారు. ● అధికారంలో ఉన్నవారిని గెలిపిస్తేనే మరింత అభివృద్ధి ● ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు -
కోతులను తరిమేయాలి
సాక్షి, పెద్దపల్లి/పెద్దపల్లి: కాలనీలు, గల్లీల్లో కోతులు, కుక్కలు గుంపులుగా సంచరిస్తున్నాయని, ఎప్పుడు, ఎటువైపు నుంచి దాడి చేస్తాయో తెలియక భయాందోళనకు గురవుతున్నామని సుల్తానాబాద్ పట్టణవాసులు ఆవేదన చెందారు. మున్సిపల్ కొత్త పాలకవర్గం ఈ సమస్యపై దృష్టి సారించాలన్నారు. సుల్తానాబాద్లో బుధవారం ‘సాక్షి’ నిర్వహించిన చర్చావేదికలో పలువురు మాట్లాడారు. తీవ్రంగా వేధిస్తున్న కోతులు, కుక్కల బారినుంచి కాపాడే వారికే ఓటేస్తామన్నారు. ఇందుకోసం స్పష్టమైన ప్రణాళిక ప్రకటించాలని డిమాండ్ చేశారు. పట్టణం విస్తరిస్తోందని, ఇందుకు అనుగుణంగా వసతులు కల్పించాలని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే విజయరమణారావు.. సమస్యలను విన్నారు. సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పట్టణ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మరికొందరు మన్నారంటే.. కుక్కల బారినుంచి కాపాడాలి వాకింగ్ ట్రాక్, సీసీ రోడ్లు నిర్మించాలి పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలి ‘సాక్షి’ చర్చావేదికలో సుల్తానాబాద్ మున్సిపల్ ప్రజల అభిప్రాయాలు సమస్యలు పరిష్కరిస్తాం ఎమ్మెల్యే విజయరమణారావు -
గ్రౌండ్ను విస్తరించాలి
పట్టణవాసులు ఉదయం, సాయంత్రం ఇదే గ్రౌండ్కు వస్తున్నారు. పోలీస్, కేంద్ర పారామిలిటరీ ఉద్యోగాలు సాధించేందుకు శిక్షణ పొందుతున్న వారు ప్రాక్టిస్ చేస్తున్నారు. వాకింగ్ ట్రాక్, జిమ్ ఏర్పాటు చేయాలి. – అవినాష్, అగ్నివీర్కు ఎంపికై న యువకుడుఅభివృద్ధికి కట్టుబడి ఉన్నాం నేను సర్పంచ్గా పనిచేసిన సమయంలో మానేరులో రెండు బావులు తవ్వించా. తాగునీటి సమస్య పరిష్కరించా. కానీ, గత పదేళ్ల ప్రభుత్వంలో పట్టణ ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడ్డారు. అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. – అంతటి అన్నయ్యగౌడ్, జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ -
వాకింగ్ట్రాక్ ఏర్పాటు చేయాలి
ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వాకింగ్ ట్రాక్ నిర్మించాలి. గత పాలకవర్గం నిధులు మంజూరు అయ్యాయని చెప్పింది. కానీ, జీవో రాలేదు. పనులు జరగలేదు. కొత్త పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారించాలి. – రాజేంద్రప్రసాద్, రిటైర్డ్ ఉపాధ్యాయుడు అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలి వార్డుల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలి. భవిష్యత్ తరాలకు ఇబ్బందులు కలుగకుండా ముందుకు వెళ్లాలి. రోడ్లపైకి మురుగునీరు రాకుండా చూసుకోవాలి. అప్పుడే స్వచ్ఛ సుల్తానాబాద్గా మారుతుంది. – స్వామి, ఉద్యోగి, 12వవార్డు -
ప్రవర్తనా నియమావళి పాటించాలి
జ్యోతినగర్(రామగుండం): అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనానియమావళిని పాటించాలని అదనపు కలె క్టర్, రామగుండం కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ కోరారు. ఎన్టీపీసీ కాకతీయ ఆడిటోరియంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సందేహాల నివృత్తి కోసం రిటర్నింగ్ అధికారులు, బల్దియా కార్యాలయంలోని ఎన్నికల సెల్ను సంప్రదించాలని సూచించారు. ప్రచార వాహనాలకు అనుమతి పొందాలని, అనుమతి పత్రాన్ని మా త్రమే అంటించాలని సూచించారు. ఎన్నికల వ్యయ పరిమితి రూ.1.50 లక్షలకు మించరాదని అన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటామని ఏసీపీ రమేశ్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమలుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి అన్నారు. ట్రైనర్లు స్వరూప్ చంద్, శ్రీనివాస్.. అభ్యర్థులు అనురించాల్సిన ప్రవర్తనా నియమావళిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఎన్నికల పరిశీలకురాలు పద్మజారాణి, వ్యయ పరిశీలకులు సుజాత, కృష్ణమోహన్, రవిబాబు, బల్దియా అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, శ్రీహరి, నవీన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీ -
క్రీడల్లో రాణించాలి
పెద్దపల్లి: క్రీడలకు పుట్టినిల్లు సుల్తానాబాద్ అ ని డీవైఎస్వో సురేశ్ అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో చేపట్టిన సీ ఎం కప్ క్రీడా పోటీలు బుధవారం ముగిశా యి. సురేశ్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే క్రీడల్లోనూ రాణించాలన్నారు. అనంతరం వి విధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన వారికి బ హుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. మున్సిపల్ కమిషనర్ రమేశ్, ఎంఈవో రాజ య్య, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు రవీందర్, ఎస్జీఎఫ్ మండల కార్యదర్శి ప్రణయ్, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రసాద్, సంధ్య, శ్రీవాణి, వెంకటేశ్, ఆసియా బేగం, సత్యం, సతీశ్, సంపత్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిభకు పురస్కారం పెద్దపల్లి: విధి నిర్వహణలో ప్రతిభ చూపిన జి ల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ సా యిభవాని, ల్యాబ్ టెక్నీషియన్ అజయ్కు స్టా ర్ పెర్ఫార్మెన్స్ అవార్డు అందించినట్లు సూపరింటెండెంట్ శ్రీధర్ బుధవారం తెలిపారు. కలెక్టర్ సూచన మేరకు అన్ని కేటగిరీల సిబ్బందికి పనితీరు ఆధారంగా ప్రతినెలా పురస్కా రం అందిస్తున్నామన్నారు. కాగా, గాల్బ్లాడర్ లో స్టోన్తో బాధపడుతున్న గోదావరిఖనికి చెందిన ఇద్దరు మహిళలకు డాక్టర్లు అమరసింహారెడ్డి, సాయిప్రసాద్, రామం, భవాని బృందం ఆధునిక పద్ధతుల్లో శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేశారని శ్రీధర్ వివరించారు. వైద్యులను ఆయన అభినందించారు. ఆస్పత్రి లో అందిస్తున్న 2డీ ఇకో, లాప్రోస్కోపిక్, యూరాలజీ, రూట్కెనాల్ తదితర సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆర్ఎంవో విజయ్కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ జమున పాల్గొన్నారు. ఆర్ఐఈ శిక్షణకు ఎంపిక సుల్తానాబాద్రూరల్: చిన్నబొంకూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ కిషన్ బెంగళూరులోని రీజినల్ ఇ నిస్టిట్యూట్ ఆఫ్ ఇంగి ఫ్లాష్ (ఆర్ఐఈ)లో 30 రోజుల పాటు చేపట్టే కోర్స్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్(సీఈఎల్డీ)శిక్షణకు ఎంపికయ్యారు. మనరాష్ట్రం నుంచి 50 మంది ఉపాధ్యాయులు ఎంపిక కాగా మనజిల్లా నుంచి అందులో కిషన్ ఉన్నా రు. ఆయనను పలువురు అభినందించారు. ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ పెద్దపల్లి: పురపాలక సంఘ పరిధిలోని ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ రమేశ్ బుధవా రం కోరారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వారి చిరునామాలు సేకరించామని, పోస్టల్ బ్యాలెట్ ముద్రణ పూర్తయిన వెంటనే వారికి బ్యాలెట్ పేపర్లు పంపిస్తామని అన్నారు. ఉద్యోగులు ఓటుహక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. ప్రశ్నించే గొంతుక అవసరంమంథని: హామీలను అమలు చేయడంతో విఫలమై కాంగ్రెస్.. మున్సిపల్ ఎన్నికల పేరిట మ రోమారు ప్రజలకు ముందుకు వస్తోందని, ఆ పార్టీకి ఎందుకు ఓటు వేయాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారని మాజీమంత్రి కొప్పుల ఈశ్వ ర్ అన్నారు. స్థానిక గాంధీచౌక్లో బీఆర్ఎస్ అ భ్యర్థుల పరిచయ వేదిక పేరిట బుధవారం ని ర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రభు త్వ విధానాలతో విసిగిపోయిన ప్రజలు ఆ పా ర్టీకి గుణపాఠం చెప్పే సమయం వచ్చిందన్నా రు. బీఆర్ఎస్ అభ్యర్ఖులను ఆదిరించాలని కో రారు. మాజీఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడా రు. మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ పుట్ట శైలజ, ఎన్నికల సమన్వయకర్త శ్రీధర్రెడ్డి ఉన్నారు. -
3 వార్డులు.. ముగ్గురు అన్నదమ్ములు
పెద్దపల్లిరూరల్: ఒకేకుటుంబంలోని ముగ్గు రు అన్నదమ్ములు మూడు వార్డుల్లో పోటీకి దిగారు. కాంగ్రెస్ నుంచి కొలిపాక శ్రీనివా స్, కొలిపాక చిరంజీవి ఉన్నారు. కాంగ్రెస్ తో విభేదించిన కొలిపాక శ్రీనివాస్ (15వ వార్డు) ఆల్ఇండియా ఫార్వర్డ్బ్లాక్ చైర్మన్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. తనకు మద్దతుగా 24 మందిని కూడా పోటీలో నిలిపారు. ఈ క్రమంలోనే తన సోదరులు కొలిపాక చిరంజీవి(17వ వార్డు), కొలిపాక సంపత్ (18వవార్డు) నుంచి పోటీకి దింపారు. ముగ్గురు అన్నదమ్ములు పోటీపడుతుండడం చర్చనీయాశంగా మారింది. బరిలో తోడికోడళ్లు ఫ్యామిలీ పాలిటిక్స్ -
వెనుకబడిన వర్గాల అభివృద్ధికి చర్యలు
పెద్దపల్లి: వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సో షల్ జస్టిస్ డేలో అదనపు కలెక్టర్ వేణుతో కలిసి ఆ యన పాల్గొన్నారు. అనంతరం శిక్షణ పూర్తిచేసుకు న్న 61మంది సర్వేయర్లకు లైసెన్స్లు అందజేసి మా ట్లాడారు. ప్రభుత్వం శాసీ్త్రయ పద్ధతిలో కుల సర్వే చేసిందన్నారు. భూ రికార్డులపై భరోసా కల్పించేలా లైసెన్స్డ్ సర్వేయర్లు పనిచేయాలని సూచించా రు. అధికారులు రవీందర్, వేణుగోపాల్, రంగారెడ్డి, ప్రకాశ్, సోమేశ్వర్, గంగయ్య పాల్గొన్నారు. చైన్మెన్ సస్పెన్షన్ మంథని ఆర్డీవో కార్యాలయంలో డిప్యుటేషన్పై పనిచేస్తున్న చైన్మన్ ఇ.రఘును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శ్రీహర్ష ఉత్తర్వులు జారీచేశారు. విధుల్లో ని ర్లక్ష్యం చేస్తున్నారని ఇప్పటికే అనేకసార్లు మెమోలు జారీ చేసినా మార్పు లేదని, గత జనవరి 13న సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరయ్యా రని మంథని ఆర్డీవో నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శి.. కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): 2025– 26 ఆర్థిక సంవత్సరంలో ఆస్తిపన్ను, నల్లాబిల్లులు రూ.4,26,850 నుంచి రూ.2,82,247 ప్రభుత్వ ఖజానాకు జమ చేయకపోవడంతో కాల్వశ్రీరాంపూర్ పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శ్రీహర్ష ఉత్తర్వులు జారీచేశారు. రాఘవాపూర్లో.. పెద్దపల్లిరూరల్: రాఘవాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రవిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శ్రీహర్ష ఉత్తర్వులు జారీచేశారు. పంచాయతీలో వసూలు చేసిన పన్నులు, బిల్లుల సొమ్మును సొంతానికి వాడుకున్న ట్లు విచారణలో తేలడంతో ఈ చర్యలు తీసుకున్న ట్టు సమాచారం. ధర్మారంలో.. ధర్మారం(ధర్మపురి): ధర్మారం గ్రామ పంచాయతీ కార్యదర్శి రవిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శ్రీహర్ష ఉత్తర్వులు జారీచేశారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో వసూలు చేసిన ఆస్తిపన్ను రూ.63,332 ట్రెజరీలో జమచేయకుండా సొంతానికి వాడుకోవడం, ఆస్తిపన్ను వసూలు చేయడంలో నిర్లక్ష్యం వ హించడంతో ఎంపీడీవో నివేదిక ఆధారంగా సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో ఆయన వివరించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష -
భార్యాభర్తలు.. వేర్వేరు డివిజన్లు
జ్యోతినగర్: రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో భార్యాభర్తలు వేర్వేరు డివిజన్లలో పోటీ చేస్తున్నారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం ఎన్టీపీసీ ప్రాంతంలోని 34వ డివిజన్లో భార్య పొన్నం సుమలత, రెండోడివిజన్లో భర్త పొన్నం విజయ్గౌడ్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన బరిలో నిలిచారు. దీంతో వారు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. యూరియా ఉత్పత్తిలో కీలకం ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): దేశీయంగా ఎరువుల ఉత్పత్తిలో ఆర్ఎఫ్సీఎల్ కీలకపాత్ర పోషిస్తోంది. ప్లాంట్ రోజూవారి సామర్థ్యం 3,850 మెట్రిక్ టన్నుల యూరియా, 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా. వార్షిక ఉత్పత్తి లక్ష్యం 12.7 లక్షల మెట్రిక్ టన్నులు. ప్రస్తుతం 90శాతం సామర్థ్యంతో ఉత్పత్తి సాగుతోంది. జనవరిలో 1,08,002.32 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో తెలంగాణకు 50.5 శాతం యూరియా కేటాయించారు. మిగతా యూరియాలో ఆంధ్రప్రదేశ్కు 23,165.82 మెట్రిక్ టన్నులు, కర్ణాటకకు 19,506.78 మెట్రిక్ టన్నులు, మహారాష్ట్రకు 5,225.22 మెట్రిక్ టన్నులు, తమిళనాడుకు 2,629.53 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు అధికారులు వివరించారు. -
గతపాలకులు భ్రష్టుపట్టించారు
పెద్దపల్లి: గత పాలకులు సుల్తానాబాద్ మున్సిపల్ను భ్రష్టు పట్టించారని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ధ్వజమెత్తారు. సుల్తానాబాద్ రెండోవార్డు అభ్యర్థి గాజుల రాజమల్లయ్య, మూడోవార్డు అభ్యర్థి మహమ్మద్ నిషాద్కు మద్దతుగా ఎమ్మెల్యే మంగళవారం ప్రచారం చేశారు. మేజర్ పంచాయతీ నుంచి మున్సిపల్గా ఆవిర్భవించిన సుల్తానాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందాల్సిన ఉన్నా.. గతపాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలోనే రూ.20 కోట్లతో సుల్తానాబాద్ను అభివృద్ధి చేశామని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. నాయకులు అన్నయ్యగౌడ్, ప్రకాశరావు, మహేందర్, ఐల రమేశ్, శ్రీగిరి శ్రీనివాస్, బిరుదు కృష్ణ, అంతటి పుష్పలత, దుగ్యాల సంతోష్రావు, పెగడ పరుషరాములు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు -
పోలీస్స్టేషన్కు పిలిపించి బెదిరింపులా?
గోదావరిఖని: రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్.. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను పోలీస్స్టేషన్కు పిలిపించి బెదిరిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు. స్థానిక ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ సేవకులుగా మారిపోయారని ఆయన మండిపడ్డారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలన నియంతలా, దుర్మార్గంగా సా గుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిచే దమ్ము, ధైర్యం లేనిఎమ్మెల్యే.. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భయపెట్టి సంబరపడిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈఎన్నికల్లో తామంటే ఏమిటో చూపిస్తామని కోరుకంటి చందర్ సవాల్ చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని అన్నారు. నాయకులు నడిపెల్లి అభిషేక్రావు, గోపు అయిలయ్యయాదవ్, నడిపెల్లి మురళీధర్రావు, నారాయణదాసు మారుతి, చల్లా రవీందర్రెడ్డి పాల్గొన్నారు. -
ప్రభుత్వ లక్ష్య సాధనకు తోడ్పాటు అందించాలి
పెద్దపల్లి: బ్యాంకర్లు ప్రభుత్వ లక్ష్య సాధనలో తోడ్పాటు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవంతంగా సాగుతున్న ఇందిరా మహిళాశక్తి వ్యాపారాలకు మరిన్ని రుణాలు అందించేందుకు బ్యాంకులు ముందుకు రావాలని సూచించారు. 2025–26లో పంట రుణాలు రూ.1,916 కోట్లకు రూ.1,471 కోట్లు, వ్యవసాయ టర్మ్ రుణాలు రూ.651 కోట్లు పంపిణీ చేశామని తెలిపారు. 5,111 స్వశక్తి సంఘాలకు రూ.361 కోట్ల 60 లక్షల బ్యాంక్ రుణాలు అందించామని తెలిపారు. మెప్మా నిర్దేశించిన లక్ష్యం కన్నా 494 సంఘాలకు రూ.63 కోట్ల 2 లక్షల రుణాలు అధికంగా పంపిణీ చేశామన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వా రా రూ.8 కోట్ల 57 లక్షల సబ్సిడీతో 119 యూనిట్లు, స్టాండ్అప్ ఇండియా ద్వారా రూ.5కో ట్ల 17 లక్షల రాయితీతో 57 యూనిట్లు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ముద్ర రుణాల ద్వారా 14,718 మందికి రూ.173 కోట్లు అందించామని అన్నారు. చిన్న ఆహార శుద్ధి కేంద్రాల కో సం వచ్చిన 74 దరఖాస్తులను ఆమోదించి రుణా లు పంపిణీ చేశామని, మరో 37 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. పీఎం విశ్వకర్మ స్కీం ద్వారా 1,270 మందికి రూ.11 కోట్ల 43 లక్షల రుణాలు పంపిణీ చేశామన్నారు. లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష బ్యాంకర్లతో సమావేశం -
ఇక సమరమే
సాక్షి పెద్దపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ముగిసింది. పోటీలో నిలిచిన వారిజాబితా ప్రకటన, గుర్తుల కేటాయింపు పూర్తికావడంతో అభ్యర్థులు ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించారు. కరపత్రాలు, వాల్పోస్టర్లతో పనులు ప్రారంభించారు. అన్నివార్డుల్లోనూ ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోటీఉంది. కొందరు తమకు కేటాయించిన గుర్తులతోపాటు తమ ఫొటోలు ఉండేలా పెద్ద బ్యానర్లు సిద్ధంచేసి వార్డుల్లోని ప్రధాన కూడ ళ్లు, కాలనీల్లో ఏర్పాటు చేస్తున్నారు. 124 వార్డులు/డివిజన్లు.. బరిలో 581 మంది రామగుండం కార్పొరేషన్లో 60 డివిజన్లకు 452 మంది నామినేషన్లు దాఖలు చేయగా, ఉపసంహర ణ అనంతరం315 మంది బరిలో ఉన్నారు. పెద్దపల్లి మున్సిపల్లో 36 వార్డులకు 194మంది నామినేషన్లు వేయగా, 37మంది విత్డ్రా చేసుకున్నారు. 157 మంది బరిలో నిలిచారు. సుల్తానాబాద్లో 15 వార్డులకు 75 మంది నామినేషన్లు వేయగా..14మంది విత్డ్రా అయ్యారు. 61మంది బరిలో ఉన్నా రు. మంథనిలో 13 వార్డులకు 107 మంది దరఖా స్తు చేయగా 55 మంది ఉపసంహరించుకున్నారు. 48 మంది పోటీలో మిగిలారు. పెద్దపల్లిలో 36 వార్డులకు బీజేపీ నుంచి 26 మంది, బీఆర్ఎస్ నుంచి 35 మంది బరిలో ఉండగా, మంథనిలో 13వా ర్డులకు బీజేపీ తరఫున 12మంది పోటీచేస్తున్నారు. గుర్తులతో ప్రచారంపై ఫోకస్ అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులతోపాటు ఎన్నికల్లో తమను గెలిపిస్తే చేసే పనుల చిట్టాను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వార్డులు/డివిజన్ల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకుంటున్న వాట్సాప్ గ్రూప్లను ఇందుకు వేదికగా చేసుకుని ఆన్లైన్ ప్రచారం హోరెత్తిస్తున్నారు. కొందరు రీల్స్ సైతం చేస్తూ కౌన్సిలర్, కార్పొరేటర్గా గెలుపు కోసం విభిన్న పంథాలు అనుసరిస్తున్నారు. దీంతో మున్సిపల్ పోరు రసవత్తరంగా మారింది. ఇతర ప్రాంతాల్లోని తమవార్డు ఓటర్లకు వాట్సాప్ ద్వారా నే తమగుర్తు, హామీలను పంపుతూ ఓట్లు అభ్యరి స్తున్నారు. మరో ఆరురోజుల సమయమే మిగిలి ఉండడంతో తమ బంధుగణంతోపాటు స్నేహితులతో గెలుపు మంతనాలు చేస్తున్నారు. కులాలు, యూత్ అసోసియేషన్ల వారీగా హామీలు గుప్పిస్తున్నారు. ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. టికెట్ ఖరారు.. ప్రచారం షురూ గల్లీల్లో హోరెత్తించేలా ప్రణాళిక 124 స్థానాల్లో 581 మంది అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా అసంతృప్తి నేతలు బరిలో నిలిచిన అభ్యర్థులు బల్దియా వార్డులు అభ్యర్థులు రామగుండం 60 315 పెద్దపల్లి 36 157 మంథని 13 48 సుల్తానాబాద్ 15 61 మొత్తం 124 581 -
కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫామ్లు
గోదావరిఖని/రామగుండం: రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ మంగళవారం బీఫామ్లు అందజేశారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 60 డివిజన్ల నుంచి పోటీపడుతున్న కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫామ్లు అందజేశారు. తొలుత స్థానిక పవర్హౌస్కాలనీ శివాలయం, రామగుండం అంజనాద్రిగుట్టపై ఉన్న శ్రీధనుర్భానారామాంజనేయస్వామి ఆలయంలో బీఫామ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి శివుడు, ఆంజనేయస్వామి ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. -
అసంతృప్తుల జ్వాలలు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల పరిధిలో టికెట్లు ఆశించిన ఆశావహులకు నిరాశ ఎదురవడంతో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం ముగియడంతో బీఫారాలు అందుకున్న అభ్యర్థులు ప్రచార బరిలో దిగారు. ప్రధాన పార్టీల్లో టికెట్లు దక్కలేదన్న ఆగ్రహంతో పలువురు బహిరంగ నిరసనలకు దిగారు. పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆశావహులు రోడ్డెక్కారు. పార్టీ సభ్యత్వాలు, పదవులకు రాజీనామా చేయడం, నాయకుల దిష్టిబొమ్మలు దహనం చేయడం, నేతల ఇళ్ల ముందు ఆందోళనలు నిర్వహించడం, పరస్పర వాగ్వాదాలకు దిగడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ పలువురు ఆశావహులు పార్టీ పెద్దల ఇళ్లముందు ఆందోళన చేపట్టారు. పార్టీ నిర్ణయాలను ధిక్కరిస్తూ కొందరు స్వతంత్రులుగా.. మరికొందరు పార్టీ రెబల్స్గా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు తమ పార్టీలకు రాజీనామా చేసి ప్రత్యామ్నాయ రాజకీయ మార్గాలపై దృష్టి పెట్టారు. ఈ పరిణామాలు ప్రధాన పార్టీలకు కొత్త తలనొప్పిగా మారాయి. రెబల్స్ ప్రభావం ఎన్నికల ఫలితాలపై తీవ్రంగా పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసంతృప్తులను బుజ్జగించేందుకు సీనియర్ నేతలు రంగంలోకి దిగుతున్నప్పటికీ.. చాలాచోట్ల పరిస్థితి అదుపులోకి రావడం లేదు. టికెట్ల వ్యవహారం మరింత మంటలు రాజేస్తుండటంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రాజకీయ పోరు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. టికెట్లు దక్కలేదని నిరసనలు ప్రధాన పార్టీలకు తప్పని రెబల్స్ బెడద పార్టీలకు పలువురు రాజీనామా స్వతంత్రులుగా పోటీకి సిద్ధం కరీంనగర్లో రెండు బీ ఫామ్లు ఇచ్చి రచ్చకెక్కిన కాంగ్రెస్ నాయకులురెబల్స్ బెడద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీఫామ్లు అందించే సమయంలో హైడ్రామా నెలకొంది. ఒకే డివిజన్కు రెండు బీఫామ్లు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. పీసీసీ ఆదేశాలకు వ్యతిరేకంగా స్థానిక నాయకులు బీఫామ్లు అందించడం కలకలం రేపింది. తొలుత 50వ డివిజన్ అభ్యర్థిగా కొత్త అనిల్ను హైకమాండ్ ప్రకటించింది. అదే సమయంలో పార్టీ కార్పొరేషన్ ఇన్చార్జి వైద్యుల అంజన్కుమార్ బీఫామ్ను చక్రధర్రావుకు అందించారు. ఈ విషయం తెలిసి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు అవాక్కయ్యారు. అనిల్కు కాదని బీఫామ్ ఇవ్వడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఎలాగైనా అనిల్కు న్యాయం చేయాలనే ఆలోచనతో హైకమాండ్ అప్పటికే 57వ డివిజన్ పొత్తులో భాగంగా కమ్యూనిస్టులకు కేటాయించిన బీఫామ్ అందించారు. ఒక విధంగా అటు నగర, అసెంబ్లీ ఇన్చార్జిలు పార్టీ నిబంధనలు ఉల్లంఘించారని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. -
సమ్మక్క హుండీ ఆదాయం రూ.9.51 లక్షలు
రామగుండం: అంతర్గాం మండలం గోలివాడ సమ్మక్క – సారలమ్మ జాతర హుండీల ఆదా యాన్ని మంగళవారం లెక్కించారు. ఈ సందర్భంగా రూ.9,51,287 ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. వీటితో పాటు 206 గ్రాముల మిశ్రమ వెండి, 0.380 మిల్లీ గ్రాముల మిశ్రమ బంగారం సమకూరిందని వారు వివరించారు. టికెట్లు, టెండర్ల ద్వారా సమకూరిన ఆదాయం ఇందులో పేర్కొనలేదు. దీనిపై ఈవో రాజ్కుమార్ను సంప్రదించేందుకు యత్నించగా స్పందించలేదు. జాతర కమిటీ చైర్మన్ గీట్ల శంకర్రెడ్డి, వైస్ చైర్మన్ నరేందర్, ప్రతినిధులు బాలసాని సత్తయ్య, ఆవుల గోపాల్యాదవ్, కోల రామ్మూర్తిగౌడ్, పల్లికొండ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.ధర్నాలు, రాస్తారోకోలకు అనుమతి తప్పనిసరిగోదావరిఖని: రామగుండం పోలీసు కమిషనరేట్లో అ నుమతిలేకుండా ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, స భలు, సమావేశాలునిర్వహించరాదని సీపీ అంబర్ కిశోర్ఝా స్పష్టం చేశారు. అత్యవసరమైతే ముందుగా పోలీస్ అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించారు. బహి రంగ ప్రదేశాల్లో మద్యపానంపై నిషేధాజ్ఞలు కొనసాగుతాయని, అనుమతిలేకుండా డ్రోన్ లు, డీజే సౌండ్స్పై కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. కమిషనరేట్లో ఈనెల ఒకటినుంచి వచ్చేనెల ఒకటో తేదీ వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు. ఆరేళ్ల సమస్యకు పరిష్కారం జూలపల్లి(పెద్దపల్లి): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆరేళ్లుగా కొనసాగుతున్న లో వోల్టేజీ సమస్యకు ట్రాన్స్కో అధికారులు పరిష్కారం చూపుతున్నారు. కొత్త ట్రాన్స్ఫార్మ ర్ ఏర్పాటుకు రూ.2,34,892 విలువైన డీడీలు చెల్లించినా ట్రాన్స్కో కార్యాలయంలో నిర్లక్ష్యంగా వాటిని మూలన పడేశారు. స్థానికుడు, ధర్మారం ఏడీఈ విజయ్పాల్సింగ్ ఇటీవల ఇక్కడ పర్యటించగా.. డీడీల విషయం వెలుగుచూసింది. దీంతో ఆయన ట్రాన్స్ఫార్మర్, తీగలు, స్తంభాలు మంజూరు చేశారు. ఆయన సూచనలతో కళాశాలలో విద్యుత్ ట్రాన్స్ఫార్మ ర్ ఏర్పాటుకు సిబ్బంది మంగళవారం పనులు ప్రారంభించారు. అధ్యాపకులు, గ్రామస్తులు, విద్యార్థులు ఏడీఈకి కృతజ్ఞతలు తెలిపారు. క్వింటాల్ పత్తి రూ.7,811 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో మంగళవారం పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.7,811 ధర పలికింది. కని ష్టంగా రూ.6,016, సగటు రూ.7,512 గా ధర నమోదైందని మార్కెట్ ఇన్చార్జి కార్యదర్శి ప్ర వీణ్రెడ్డి తెలిపారు. మొత్తం 529 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు. కమిటీలు ఏర్పాటు చేయాలి పెద్దపల్లి: పది మంది, అంతకుమించి మహిళలు పనిచేస్తున్న ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా సంక్షేమాధికారి వేణుగోపాల్రావు సూచించారు. జిల్లాలోని ప్ర భుత్వ, ప్రైవేట్ రంగాల్లో కచ్చితంగా కమిటీ లు వేయాలన్నారు. ఈనెల 20వ తేదీలోగా http:// shebox.tgwdcw.in వెబ్సైట్లో వివరాలు న మోదు చేయాలని ఆయన సూచించారు. 4 వారాలు.. 28 రోజులు పెద్దపల్లిరూరల్: ఈఏడాది ఫిబ్రవరి నెలకు ప్ర త్యేకత ఉంది. ఈనెల పౌర్ణమి (ఫిబ్రవరి1)తో మొదలవుతోంది. అంతేకాదు.. ఈనెలలో వ చ్చే ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారం.. ఇలా అన్నిరోజులూ సమానంగా.. నాలుగేసిచొప్పున ఉండడమే విశేషం. ఇలాంటి అద్భుతమైన మాసం 823 ఏళ్ల తర్వాత వచ్చిందని వేదపండితుడొకరు వివరించారు. -
ఆన్లైన్లో పెట్టుబడి పెట్టించిన వ్యక్తి అరెస్ట్
జగిత్యాలక్రైం: ఆన్లైన్ యూబెట్ ట్రేడింగ్లో పెట్టుబడి పెడితే అధిక లాభం వస్తుందని నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. మంగళవారం పట్టణ పోలీస్స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. జగిత్యాలలోని అంగడిబజార్కు చెందిన కట్కం చంద్రశేఖర్ను పట్టణానికి చెందిన వేముల మల్లికార్జున్ మల్టీలెవల్ మార్కెటింగ్లో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ వస్తుందని యూబిట్ ట్రేడింగ్ యాప్లో క్రిప్టో కరెన్సీ ద్వారా గొలుసుకట్టు వ్యాపారంలో రూ.20 లక్షలు పెట్టించాడు. మల్లికార్జున్తోపాటు, పిల్లి కిషన్, ధరూర్కు చెందిన శివగంగ, యూబెట్ కంపెనీ మేనేజర్ బ్రిజ్ మోహన్, సంజయ్ గుప్తా కంపెనీ నడిపిస్తున్నారని చెప్పారు. ఇటీవల కంపెనీ మూతపడటంతో తన డబ్బులు చెల్లించాలని చంద్రశేఖర్ అడగగా తప్పించుకుతిరుగుతున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జనవరి ఒకటోతేదీన కేసు నమోదు చేసి మల్లికార్జున్ను ధరూర్ క్యాంప్లోని ఆయన ఇంటి వద్ద అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో పట్టణ సీఐ కరుణాకర్ పాల్గొన్నారు. -
బర్త్డే పార్టీలో యువకులపై దాడి
కరీంనగర్రూరల్: నడిరోడ్డుపై బర్త్ డే పార్టీ చేసుకోవడమే కాకుండా కారుపైకి ఎక్కి తల్వార్తో కేక్ కట్ చేసి హంగామా చేసి, ఇరువురిపై దాడి చేసి డబ్బులు,సెల్ఫోన్ తీసుకున్న తొమ్మిది మందిని మంగళవారం కరీంనగర్రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నిరంజన్రెడ్డి కథనం మేరకు.. తీగలగుట్టపల్లిలోని హన్మాన్నగర్లో గత నెల 31న అర్ధరాత్రి 12గంటలకు నడిరోడ్డుపై ఓ మైనర్ బర్త్ డే పార్టీని యువకులు నిర్వహించారు. కారుపైకి ఎక్కి తల్వార్తో కేక్ ట్ చేయడంతోపాటు టపాసులు కాల్చుతూ కాలనీవాసులను భయభ్రాంతులకు గురిచేశారు.ఈ సమయంలో టెంట్హౌజ్ సామగ్రిని వాహనం నుంచి దించుతున్న యుగంధర్, చరణ్పై కొందరు యువకులు కర్రలు, బండలతో దాడి చేశారు. వారి వద్ద ఉన్న రూ.2వేలతోపాటు సెల్ఫోన్ తీసుకుని పగులకొట్టారు. స్థానికులు వచ్చి యువకులను అక్కడి నుంచి వెళ్లగొట్టి బాధితులను ఆస్పత్రిలో చేర్పించారు. మరుసటిరోజు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం తొమ్మిదిమందిని అరెస్టు చేశారు. అజయ్, విఘ్నేష్, రంజిత్లు మేజర్లు కాగా మిగితా ఆరుగురు మైనర్లున్నారని సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. ముగ్గురిని కరీంనగర్జైలుకు, ఆరుగురు మైనర్లను వరంగల్ జువైనల్హోమ్కు తరలించినట్లు వివరించారు. తొమ్మిది మంది అరెస్టు -
7న నవోదయ పరీక్ష
చొప్పదండి: జవహర్ నవోదయ విద్యాలయంలో 9,11వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష ఈ నెల 7న జరుగుతుందని ఇన్చార్జి ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. హాల్ టికెట్ల పంపిణీ ఆన్లైన్ ద్వారా చేశామని, డౌన్లోడ్ చేసుకోవాలని, ఇంకా హాల్ టికెట్ రానివారు ఈ నెల 4న చొప్పదండిలోని జవహర్ నవోదయ విద్యాలయ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఏవైనా సందేహాలుంటే 7989693572 నంబర్లో సంప్రదించాలని కోరారు. రూ.1.40 లక్షల నగదు సీజ్సిరిసిల్లక్రైం: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సిరిసిల్ల మండలం తంగళ్ళపల్లి బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ చెక్పోస్టులో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ 03బీ జెడ్ 9740 నంబర్ గల కారును తనిఖీ చేయగా, అనుమానాస్పద నగదు రూ.1.40 లక్షలను పోలీసులు గుర్తించారు. తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్కు చెందిన డ్రైవర్ నందగిరి నాగరాజు నుంచి నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిజాయితీ చాటుకున్న ఆటోడ్రైవర్కరీంనగర్క్రైం: ఓ మహిళ కరీంనగర్ బస్టాండ్ సమీపంలో తన బంగారు ఆభరణాలు కలిగిన పర్సు పోగొట్టుకోగా ఆటోడ్రైవర్కు దొరకడంతో వన్టౌన్ పోలీసుస్టేషన్లో అందచేసి నిజాయితీ చాటుకున్నాడు. రామడుగు మండలానికి చెందిన బొజ్జ లక్ష్మి మంగళవారం ఇల్లంతకుంట మండలం జవారీపేటకు వెళ్లేందుకు కరీంనగర్ వచ్చింది. బస్టాండు సమీపంలో 1.5 తులాల బంగారు రింగు, గుండ్లు, నగదు కలిగిన పర్సును పోగొట్టుకుంది. ఆ పర్సు భగత్నగర్కు చెందిన ఆటోడ్రైవర్ కోలపూరి జగన్కు దొరికింది. బస్టాండులోని పోలీసు అవుట్పోస్టు వద్దకు వచ్చి వన్టౌన్ ఎస్సై రాజన్న ఆధ్వర్యంలో లక్ష్మీకి పర్సు అందజేశాడు. ఆటోడ్రైవర్ జగన్ను పోలీసులు, స్థానికులు అభినందించారు. బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని తడగొండ గ్రామంలో రైతుల చేల వద్ద బావులు, బోరు మోటార్లకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన కనెక్టింగ్ కేబుల్ వైర్లను దొంగలు ఎత్తుకెళ్లినట్లు పలువురు రైతులు తెలిపారు. సుమారు 20మంది రైతుల కేబుల్ వైర్లు సోమవారం రాత్రి అపహరణకు గురైనట్లు పేర్కొన్నారు. ఉదయం పొలాలకు వెళ్లిన పలువురు రైతులు వైర్లు కట్ చేసి ఉండటాన్ని గమనించారు. కేబుల్ వైర్లు కాల్చి అందులోని రాగిని తీసి అమ్ముకునేందుకు వైర్లు కట్చేసి తీసుకెళ్లి ఉంటారని గంగారెడ్డి తదితర రైతులు చెబుతున్నారు. ఇలా పలుసార్లు పొలాల వద్ద వైర్లు ఎత్తుకెళ్తున్నారని వాపోయారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణంమెట్పల్లి: పట్టణంలోని ఆరపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందినట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. సాయిరాంకాలనీకి చెందిన కేతావత్ ప్రవీణ్ బుల్లెట్ వాహనంపై స్నేహితుడు జలిగం వెంకటేశ్తో కలిసి సోమవారం రాత్రి సమయంలో కోరుట్లకు బయలుదేరాడు. మార్గంమధ్యలో ఆరపేట వద్దకు చేరుకోగానే.. అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రవీణ్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రవీణ్ భార్య సురేఖ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే దాకా..
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన చంద్రుపట్ల రాంరెడ్డి 1970లోనే సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తర్వాత ఎంపీపీగా పనిచేసి 1994లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సర్పంచ్ మొదలు.. ఎమ్మెల్యే వరకు ఆయన అనేక ప్రజాసమస్యలపై పోరాటం చేశారు. ప్రజల్లో తన పేరును పదిలం చేసుకున్నారు. 1970లో రాజకీయాల్లోకి.. 1970లో రాజకీయాల్లోకి వచ్చిన రాంరెడ్డి.. సర్పంచ్గా కొనసాగుతూనే మండల ప్రెసిడెంట్ బాధ్యలు నిర్వహించారు. 1989లో ఎంపీపీగా ఎన్నికయ్యారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావుపై విజయం సాధించారు. 1999లో శ్రీధర్బాబుపై ఓటమి చెందారు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్లో చేరి చురుకుగా పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా విషయంలో విద్యుత్ అధికారులపై దాడిచేసి గుర్తింపు పొందారు. పదవుల కన్నా ప్రజలే ముఖ్యమని భావించారు. రాంరెడ్డి కుమారుడు సునీల్రెడ్డి(బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు) కాగా, రెండోకుమారుడు అమెరికాలో స్థరపడ్డారు. గురువారం ముత్తారం మండలం సీతంపేటలోని వ్యవసాయ క్షేత్రంలో రాంరెడ్డి అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. రామన్న మృతిపై స్వగ్రామంతోపాటు నియోజకవర్గంలోని అయన అభిమానులు, బీజేపీ తదితర పార్టీలు, కుటుంభ సభ్యుల్లో విషాదం నింపింది. పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ప్రజాసేవలో రాంరెడ్డి ప్రత్యేక ముద్ర అనారోగ్యంతో మంథని మాజీ ఎమ్మెల్యే కన్నుమూత -
చాలాశ్రమించాం
నోటిఫైడ్ ఏరియా నుంచి పురపాలక సంఘంగా మారిన తర్వాత ఆస్తిపన్ను వసూలు చేయడం కష్టంగా ఉండేది. ఒక్కోఇంటికి వందలసార్లు తిరగాల్సి వచ్చేది. ఇంత శ్రమించినా ఏడాదికి రూ.60లక్షలకు మించి వసూలయ్యేదికాదు. తొలి మున్సిపల్ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ప్రత్యేక చొరవతో ఆస్తిపన్ను క్రమంగా రూ.2 కోట్ల వరకు చేరింది. ఇందులోంచే మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు జీతాలు చెల్లించేవాళ్లం. ఆర్థిక క్రమశిక్షణ పాటించేవాళ్లం. ప్రణాళికాబద్ధంగా అడుగులు వేసేవాళ్లం. దీంతోనే రామగుండం కార్పొరేషన్ స్థాయికి చేరింది. దీనివెనుక అనేక ఆలోచనలు, అనేక ప్రయాణాలు ఉన్నాయి. – పిల్లి శివయ్య, అప్పటి ఆర్ఐ -
చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి
మెట్పల్లిరూరల్: చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మెట్పల్లి మండలం వేంపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మల్లాపూర్ మండలం ధర్మారంకుచెందిన దండె నర్సింహులు (46) కొన్నేళ్లుగా వేంపేటలో నివాసం ఉంటున్నాడు. పశువుల కాపరిగా ఉంటూ జీవనం సాగి స్తున్న నర్సింహులు.. సోమవారం సాయంత్రం గ్రామ శివారులోని వాగులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. విద్యుత్ తీగ సహాయంతో చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు తీగ తగిలి మృతి చెందాడు. నర్సి ంహులు భార్య నర్సు ఫిర్యాదు మేర కు కేసు నమో దు చేసినట్లు ఎస్సై కిరణ్కుమార్ పేర్కొన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి.. జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం హ స్నాబాద్లో జనవరి 22న పెట్రోల్ పోసుకుని ఆ త్మహత్యాయత్నానికి పాల్పడిన అనగోని క్రాంతి కుమార్ (41) చికిత్స పొందుతూ మంగళవారం కరీంనగర్లో మృతిచెందాడు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్కు చెందిన క్రాంతికుమార్ హస్నాబాద్కు చెందిన మహిళను వి వాహం చేసుకున్నాడు. ఆర్నెళ్ల క్రితం అతని త మ్ముడు మృతిచెందడంతో అప్పటినుంచి మద్యానికి బానిసయ్యాడు. భార్య కోసమని గతనెల 22 న హస్నాబాద్ వచ్చాడు. భార్య లేకపోవడంతో తాగిన మైకంలో వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒ ంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమని ంచిన అత్తింటివారు వెంటనే కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందు తూ మృతిచెందాడు. క్రాంతికుమార్ సో దరుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ హెడ్కానిస్టేబుల్ రవీందర్ తెలిపారు. ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జి ల్లా జిల్లా ఓదెల మండలం కొలనూర్ గ్రామానికి చెందిన సా త్తూరి సందీప్(31) బైక్ అదుపుతప్పి పంట పొలాల్లో పడి మృతిచెందాడు. ఎస్సై రమేశ్ కథ నం ప్రకారం.. పెద్దపల్లిలోని ఓ ఫైనాన్స్ కంపెనీ లో ఉద్యోగం చేస్తున్న సందీప్.. రోజూ బైక్పై వెళ్లి వస్తుంటాడు. సోమవారం కూడా బైక్పై వెళ్లి సా యంత్రం తిరిగి వస్తున్నాడు. కొలనూర్ శివారులో కి రాగా బైక్ అదుపుతప్పి పొలాల్లో పడి గాయాల కు గురై మృతి చెందాడు. మంగళవారం ఉ దయం రైతులు గుర్తించి కుటుంబ సభ్యులకు స మాచారం అందించారు. మృతుడి తండ్రి మొండయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్తపల్లి(కరీంనగర్): మండలంలో దొంగతనాల కు పాల్పడుతున్న ఐదుగురిని పట్టుకొని రిమాండ్కు తరలించినట్లు సీఐ బిల్లా కోటేశ్వర్ తెలి పారు. కమాన్పూర్ గ్రామానికి చెందిన గిర్ర దేవేందర్ కుటుంబసభ్యులతో కలిసి రామడుగు మండలం గోలిరామయ్యపల్లికి వెళ్లారు. గమనించిన దొంగలు ఈ నెల 24వ తేదీన రాత్రి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని రూ.89వేల విలువ గల బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితుడిచ్చిన ఫిర్యాదుతో సీసీ కెమరాలు, టెక్నాలజీని ఉపయోగించి దొంగల ను పట్టుకున్నారు. దొంగతనానికి పాల్పడ్డ క మాన్పూర్ వడ్డెపల్లికి చెందిన సూర సీతారాం, తపాలా స్వామికుమార్, బంజారా కార్తీక్, చింతకుంటకు చెందిన చందా రాజు, కమాన్పూర్ కు చెందిన బోనాల శివను మంగళవారం అరె స్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల ను పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్సైలు సాంబమూర్తి, తిరుపతిని సీఐ అభినందించారు. -
క్షణాల్లో ఘోరం.. అంతులేని విషాదం
మల్లాపూర్: వారందరిదీ నిరుపేద కుటుంబాలు. రెక్కాడితేనే డొక్కాడుతుంది. అలాంటి కూలీలు ఉపాధి కోసం మండలంలోని మొగిలిపేటకు చెందిన ఎర్రంశెట్టి గంగాధర్ రైతు పొలంలో పసుపు ఏరడానికి ట్రాక్టర్లో వెళ్లారు. సుమారు 15 మంది కూలీలతో గంగాధర్ తన సొంత ట్రాక్టర్లో బయల్దేరాడు. తోటి కూలీలుతో సరదాగా మాట్లాడుకుంటూ అలసట మర్చిపోయి పొద్దంతా పనులు పూర్తి చేసుకున్నారు. సాయంత్రం సమయంలో గంగాధర్ ట్రాక్టర్లోనే ఇంటికి బయల్దేరారు. మరో 10 నిమిషాల్లో ఇళ్లు చేరేదే. అంతలోనే ట్రాక్టర్ను గంగాధర్ స్పీడ్గా నడపడంతో రోడ్డు పక్కనున్న నీటి గుంతలో పడిపోయింది. ఆ కూలీలను కానరాని లోకాలకు తీసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మంగళారపు లలిత (45), పెద్దిరెడ్డి గంగు(45), సంపంగి సాయమ్మ(38), రొడ్డ వైష్ణవి(13) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. అంతా క్షణాల్లోనే జరగడంతో ఏం జరిగిందో కూడా కూలీలకు అర్థం కాలేదు. ఆర్తనాదాల మధ్య స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు, పోలీసులు క్షతగాత్రులను ప్రైవేటు వాహనాలు, 108లో మెట్పల్లి ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన సంపంగి సాయమ్మది నిరుపేద కుటుంబం. భర్త ఎల్లయ్య ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. ఇద్దరు పిల్లలతో కూలీ పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతోంది. పెద్దిరెడ్డి గంగు భర్త గంగాధర్ ఆర్థిక ఇబ్బందులతో ఐదేళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. కూలీ పనులు చేసుకుంటూనే ఇద్దరు పిల్లలను పోషించుకుంటోంది. రొడ్డ పోశయ్య, అనిత దంపతులకు ముగ్గురు కూతుళ్లు. రెండో కుమార్తె వైష్ణవి స్థానిక ప్రభుత్వ పాఠశాల 8వ తరగతి చదువుకుంటూనే కుటుంబానికి అండగా నిలవాలని అప్పుడప్పుడు కూలీ పనులకు వెళ్తోంది. మంగళారపు లలితకు భర్త ధర్మరాజు, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ధర్మరాజు నాయీబ్రాహ్మణ వృత్తి చేసుకుంటున్నాడు. పెద్ద కూతురుకు వివాహం జరిపించాడు. మిగిలిన కూతుళ్లు, కుమారుడిని చదివించేందుకు లలిత కూలీ పనులకు వెళ్తోంది. మృతదేహాలను ఆస్పత్రికి తరలించడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కుటుంబసభ్యులు, బంధువుల రోధనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే, నాయకులు, అధికారులు ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా అందించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్కుమార్, కాంగ్రెస్ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ చిట్నేని రఘు హామీ ఇచ్చారు. తహశీల్దార్ శ్రీనివాస్, సీఐ అనిల్కుమార్, ఎస్సైలు అనిల్, కిరణ్, నవీన్కుమార్ మృతదేహాలను పరిశీలించారు. పోలీసుల అదుపులో ట్రాక్టర్ యజమాని ప్రమాదానికి కారణమైన ఎర్రంశెట్టి గంగాధర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కూలీ పనులకు వెళ్లి విగతజీవులుగా ఇంటికి తిరిగొస్తూ.. కానరానిలోకాలకు.. నలుగురి మృతి.. మరో ఎనిమిదిమందికి గాయాలు మల్లాపూర్ మండలం మొగిలిపేటలో విషాదం -
పక్కాప్రణాళిక.. ‘పరుగుల’ ప్రయాణం
● ఆస్తిపన్ను వసూలు కోసం అనేక ఒడిదొడుకులు ● రూ.60 లక్షల నుంచి రూ.17.75 కోట్లకు ఆదాయం ● చెత్త సేకరణకు ఎడ్లబండ్ల నుంచి.. ఆధునిక వాహనాలు ● వినూత్న ప్రయోగాలతో సత్ఫలితాలు ● రామగుండం కార్పొరేషన్ ప్రస్థానం కోల్సిటీ(రామగుండం): సుమారు 44 ఏళ్లక్రితం వరకు రామగుండం నోటిఫైడ్ ఏరియాగా ఉంది. అప్పటి ఆస్తిపన్ను డిమాండ్ రూ.60 లక్షలు. ఇప్పుడు కార్పొరేషన్ స్థాయికి ఎదిగింది. ఆస్తిపన్ను డిమాండ్ రూ.19.75 కోట్లకు చేరింది. భౌగోళికంగా విస్తరించడమే కాకుండా ఆదాయ వనరుల పెంపుకోసం బల్దియా యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారు. అప్పుడు ఎడ్లబండ్లు.. ఇప్పుడు ఆటో ట్రాలీలు.. గతంలో ఎడ్లబండ్ల ద్వారా ఇంటింటా చెత్త సేకరించేవారు. ప్రస్తుతం ఆటో ట్రాలీలు, ట్రాక్టర్లు, ఆధునిక వాహనాలు వినియోగిస్తున్నారు. నగర విస్తరణకు అనుగుణంగా కొత్తకాలనీలు, వాణిజ్య ప్రాంతాలు ఏర్పడుతున్నాయి. ఆస్తిపన్ను పరిధీ విస్తరిస్తోంది. సదుపాయాల కల్పన, పారిశుధ్యం నిర్వహణ, వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించడంతోపాటు ఆర్థిక స్వావలంబన దిశగా సాగుతోంది. కార్పొరేషన్ ప్రస్థానం ఇలా.. ● జనగామ పంచాయతీతోపాటు 11 గ్రామాలను విలీనం చేస్తూ 1982 జనవరి 19న రామగుండం నోటిఫైడ్ ఏరియాగా ప్రకటించారు. అప్పట్నుంచి 1983 వరకు ఆర్డీవో ద్వారా ప్రత్యేక పాలన సాగింది. ● 1995 మే 15న ద్వితీయ శ్రేణి, 2001 ఆగస్టు 3న ప్రథమ శ్రేణి, 2003 నవంబర్ 3న ప్రత్యేక శ్రేణి పురపాలక సంఘంగా, 2010 ఫిబ్రవరి 25న నగరపాలక సంస్థగా ఆవిర్భవించింది. ● 1998 జూన్ 6న పురపాలక సంఘం తొలి, 2004 జూన్ 22న రెండోసారి ఎన్నికలు జరిగాయి. ● 2014 మార్చి 30న నగరపాలక సంస్థకు తొలిసారి, 2020 జనవరి 22న రెండోసారి నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిగాయి. తొలిమున్సిపల్ చైర్మన్ ‘సోమారపు’ రామగుండం మున్సిపల్కు 1998 జూన్ 6న ప్రత్యక్ష పద్ధతిన ఎన్నికలు జరిగాయి. తొలిచైర్మన్గా సోమారపు సత్యనారాయణ ఎన్నికయ్యారు. 1998 జూన్ 6 నుంచి 2003 జూన్ వరకు ఆయన మున్సిపల్ చైర్మన్గా వ్యవహరించారు. ఆస్తిపన్ను విప్లవానికి నాంది గుడిసెలు, పెంకుటిళ్లు, రేకుల షెడ్లు.. ఎక్కడోఓచోట కొన్ని భవనాలు రామగుండం తొలిపురపాలక సంఘం పరిధిలోని నివాసాలు. ఏడాదికి గరిష్ఠంగా రూ.60 లక్షల వరకే ఆస్తిపన్ను వసూలయ్యేది. మున్సిపల్ కమిషనర్ను మినహా ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బంది, కార్మికుల వేతనాలు ఇందులోంచే చెల్లించాల్సి వచ్చేది. వాహనాల ఇంధనం, నిర్వహణ ఖర్చులు, ఇతర కార్యకలాపాలనూ నెట్టుకొచ్చేవారు. ఆదాయం తక్కువ, వ్యయం అధికం కావడంతో ఆర్థికపరిస్థితి సంక్లిష్టంగా మారింది. తొలిమున్సిపల్ చైర్మన్ సోమారపు సత్యనారాయణ.. వినూత్న ఆలోచనతో ఎన్టీపీసీ, సింగరేణి, ఎరువుల కర్మాగారం వంటి భారీ పరిశ్రమలకు చెందిన ఖాళీ స్థలాలపై ‘వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్’ విధించేందుకు సాహసం చేశారు. దీంతో ఆస్తిపన్ను ఏకంగా రూ.2 కోట్లకు చేరింది. బల్దియా ఆర్థికంగా బలోపేతమైంది. ఇలాంటి ప్రణాళికాబద్ధమైన నిర్ణయాలు, వినూత్న ఆలోచనలే బల్దియాను కార్పొరేషన్ స్థాయికి చేర్చాయి. పారిశుధ్య నిర్వహణ కీలకం.. రామగుండం నగరం నోటిఫైడ్ ఏరియా నుంచి కార్పొరేషన్ స్థాయికి చేరే ప్రయాణంలో పారిశుధ్యం నిర్వహణ కీలకంగా నిలిచింది. ఎడ్లబండ్లలో చెత్త తరలించే వారికే ఆటోట్రాలీలు కేటాయించింది. వీధుల్లో ప్లాస్టిక్ ఏరుకునే పేదలను గుర్తించి ఇంటింటా చెత్త సేకరించే పని కల్పించింది. చెత్త సేకరణలో వినూత్నతం ఇంటింటా చెత్త సేకరణ కోసం తొలుత 40 రిక్షాలు కొనుగోలు చేశారు. ర్యాగ్ పిక్కర్స్ పేరిట పేదలకు వాటిపై ఉపాధి కల్పించారు. ఈ విధానం విజయవంతం కావడంతో మరో 60 రిక్షాలు కొనుగోలు చేశారు. వీటిపై పని చేయడానికి కార్మికులు పోటీపడ్డారు. పరుగుపందెంతో నియామకం రిక్షా కార్మికులుగా ఉపాధి కల్పించేందుకు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి అవకాశం కల్పిస్తామని పురపాలక సంస్థ తొలిపాలక వర్గం నిబంధన విధించింది. ఇందుకోసం పరుగుపందెం నిర్వహించింది. తద్వారా ఆ కుటుంబానికి ఉపాధి లబించడంతోపాటు ఆర్థిస్థిరత్వం ఏర్పడింది. ఒక్కో ఇంటినుంచి చెత్త సేకరణ ఫీజుగా రూ.20 చొప్పున కార్మికులే వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. తద్వారా బల్దియాపై ఆర్థికభారం కూడా తగ్గింది. సేంద్రియ ఎరువు తయారీ చెత్తను వృథా చేయకుండా సేంద్రియ ఎరువుగా మార్చేవిధానాన్ని రామగుండం పురపాలక సంఘం విజయవంతంగా అమలు చేసింది. ఇలా ఆదాయం సాధించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణలోనూ ముందంజ వేసింది. రామగుండం బల్దియా ప్రొఫైల్ డివిజన్లు 60 విస్తీర్ణం(చ.కి.మీ.) 100 స్లమ్ ఏరియాలు 50 జనాభా(అంచనా లక్షల్లో) 2.35 ఓటర్లు 1,83,049 అసెస్మెంట్లు 51,345 ఆస్తిపన్ను డిమాండ్(రూ.కోట్లలో) 19.75 రోజూ వెలువడే చెత్త(మె.టన్నుల్లో) 150 కాంట్రాక్టు కార్మికులు 448 రెగ్యులర్ కార్మికులు 43 -
నిబంధనల ప్రకారమే పాలన
పెద్దపల్లి: గ్రామాల్లో నిబంధనల ప్రకారమే పాలన సాగాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. గ్రా మ పంచాయతీల్లో ప్రభుత్వ పాలనపై కార్యదర్శులతో కలెక్టరేట్లో సోమవారం ఆయన సమీక్షించా రు. ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు విడుదల చే సిందని, వాటితో పారిశుధ్యం మెరుగుపర్చాలన్నా రు. ఈ ఏడాదిలో జీరో డెంగీ కేసులు లక్ష్యంగా పని చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఉపాధిహామీ పనులు తదితర అంశాలపై సూచన లు చేశారు. జెడ్పీ సీఈవో నరేందర్, డీఆర్డీవో కాళిందిని, హౌసింగ్ పీడీ రాజేశ్వర్ పాల్గొన్నారు. ప్రాథమిక సామర్థ్యాలు అవవసరం విద్యార్థులందరికీ ప్రాథమిక విద్యా సామర్థ్యాలు తప్పనిసరని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. విద్యా శాఖ అధికారులతో ఎఫ్ఎల్ఎన్ అమలుపై జరిగిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. మూడోతరగతి పూ ర్తయ్యే వరకు ప్రతీవిద్యార్థి ధారాళంగా చదవడం, రాయడం, కూడికలు, తీసివేతలు వంటి ప్రాథమిక గణిత సామర్థ్యాలు సాధించేలా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈనెల ఒకటి నుంచి ఏడో తేదీ వరకు ఎంపికచేసిన 54 గ్రామాల్లో ని ర్వహించే ప్రత్యేక పశువైద్య శిబిరాలను సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష పడిరైతులను కో రారు. డీఈవో శారద, అకడమిక్ మానిటరింగ్ అధి కారి షేక్, ఎంఈవోలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎన్ని కల కమిషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్కు కలెక్టర్తోపాటు పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ హాజరయ్యారు. -
జ్వరం.. ఒళ్లు నొప్పులు
‘జాతర వోయచ్చినం బిడ్డా.. లచ్చలమంది జనం.. నీళ్లు మారినయ్.. బాగ దూరం నడ్సినం.. దుమ్ము, ధూళి.. ఏమైందో గనీ.. ఒకటే దగ్గు, తుమ్ములు.. పెయ్యినొప్పులు.. జెరం.. వాంతులు, విరేచనాలు.. తగ్గుతనే లెవ్వు.. గందుకే గీ దవాఖానాకు అచ్చినం బిడ్డా’ అని సమాధానం ఇచ్చారు పలువురు పేషెంట్లు. మొన్నటి జాతరలకు వెళ్లినవారిలో కొందరు తీవ్రఅస్వస్థతకు గురై పీఎంపీలు, ఆర్ఎంపీల వద్ద చికిత్స తీసుకుంటున్నారు. చాలామంది సోమవారం పెద్దపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రి కి తరలివచ్చారు. వారిరాకతో సర్కారు ఆస్పత్రి రద్దీగా మారింది. అవే ఈ దృశ్యాలు.. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
సింహం ధైర్యం..!
ఏనుగు బలం..సాక్షిప్రతినిధి, కరీంనగర్: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ సమీకరణలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల్లో టికెట్లు దక్కని ఆశావహులు ఇప్పుడు ప్రత్యామ్నాయ పార్టీల వైపు చూస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఏఐఎఫ్బీ (సింహం గుర్తు), బీఎస్పీ (ఏనుగు గుర్తు) పార్టీలకు అనూహ్య డిమాండ్ ఏర్పడింది. సింహం ధైర్యానికి, ఏనుగు బలానికి ప్రతీకగా భావించే ఈ గుర్తులు ఇప్పుడు రాజకీయంగా కూడా బలమైన ఆయుధాలుగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల్లో అంతర్గత అసంతృప్తి, రెబెల్స్ బెడద ఎక్కువగా ఉన్న వార్డులు, డివిజన్లలో ఈ గుర్తులు ప్రధాన పార్టీలకు గట్టిపోటీ ఇస్తున్నాయి. ముందస్తు వ్యూహాలు టికెట్ రాకపోతే ప్రత్యామ్నాయంగా పోటీ చేసేందుకు ముందుగానే వ్యూహం సిద్ధం చేసుకుంటున్న నేతలు ఏఐఎఫ్బీ, బీఎస్పీ నాయకత్వాలతో చర్చలు జరిపి, అవసరమైతే తమకు ఆ పార్టీ గుర్తు కేటాయించాలంటూ మాట తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రధాన పార్టీల తరఫున నామినేషన్ దాఖలు చేస్తూనే, ప్రత్యామ్నాయంగా ఏఐఎఫ్బీ, బీఎస్పీ పార్టీల పేర్లతో కూడా నామినేషన్లు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల పరిధిలో ఉన్న రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ముఖ్యంగా చివరి నిమిషాల్లో ‘ఆపద్బాంధవ’ పార్టీలుగా ఏఐఎఫ్బీ, బీఎస్పీలు మారుతున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలకు సవాల్ ఏఐఎఫ్బీ, బీఎస్పీ, జనసేనతో పాటు ఇతర చిన్న పార్టీల రంగప్రవేశం కూడా ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మారుస్తోంది. ఓటు చీలిక, రెబెల్ ప్రభావం, గుర్తుల సెంటిమెంట్స్ కలసి ప్రధాన పార్టీలకు సవాళ్లను విసురుతున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీ కంటే గుర్తే బలం అన్న నమ్మకం బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సింహం, ఏనుగు గుర్తులపై పోటీ చేసే అభ్యర్థులు ఎంతవరకు ప్రధాన పార్టీలను దెబ్బతీస్తారో, ఎవరి లెక్కలు ఎవరి మీద పనిచేస్తాయో తేలాల్సి ఉంది. సెంటిమెంట్ ఏఐఎఫ్బీ గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ విస్తృతంగా పోటీ చేసి విజయాలు సాధించింది. ప్రజల్లో పార్టీకి ఆదరణ పెరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 224 మంది అభ్యర్థులను బరిలో దింపగా, 102 స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ ఘన విజయం సాధించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 జెడ్పీటీసీ, 49 ఎంపీటీసీ స్థానాలను ఫార్వర్డ్ బ్లాక్ గెలుచుకుంది. గత మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 17 స్థానాలను పార్టీ కై వసం చేసుకుంది. చొప్పదండిలో 1, పెద్దపల్లి 1, రామగుండం 9, కరీంనగర్ 3, జగిత్యాల 1, రాయికల్లో 2 స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ విజయం సాధించింది. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 230 మంది అభ్యర్థులు బరిలో దిగారు. బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) కరీంనగర్ జిల్లాలో 20 స్థానాల్లో పోటీ చేస్తుంది. కరీంనగర్ కార్పొరేషన్లో 10 స్థానాలు, జమ్మికుంట మున్సిపాలిటీలో 4, హుజురాబాద్లో 4, చొప్పదండిలో 2 సీట్లల్లో పోటీ చేస్తుంది. మొదటిసారిగా బీఎస్పీకి స్థానిక ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై పోటీ చేసేందుకు అనుమతి లభించింది. ఈసారి సత్తా చాటుతాం. – నల్లాల శ్రీనివాస్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడుప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుస్తాం. ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఫార్వర్డ్ బ్లాక్ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వ వైఫల్యం, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పన్నాగం రాబోయే ఎన్నికల్లో తేలిపోతుంది. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలిపి, అత్యధిక స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా ఫార్వర్డ్ బ్లాక్ పనిచేస్తుంది. ప్రజల మద్దతుతో ఫార్వర్డ్ బ్లాక్ను మరింత బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతాం – అంబటి జోజిరెడ్డి, ఏఐఎఫ్బీ రాష్ట్ర కన్వీనర్ -
● చైర్పర్సన్ కుర్చీపై నజర్ ● ఆశలు పెంచుకున్న అధికార పార్టీ ● ఎలాగైనా ఓడిస్తామంటూ ఎంట్రీ ఇచ్చిన ‘సింహం’
పెద్దపల్లిరూరల్: మున్సిపల్ పీఠం తమదేనని అధికార కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీకి కు ర్చీ దక్కకుండా చేయాలని అసమ్మతివర్గం ఎత్తులు వేస్తోంది. దీంతో పెద్దపల్లి రాజకీయం వేడెక్కుతోంది. మొత్తం 36 వార్డులు ఉండగా, చైర్మన్ స్థానం బీసీ(జనరల్)కు కేటాయించారు. అన్నివార్డుల్లో పోటీ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ 36 వార్డుల్లో అభ్యర్థులతో నామినేషన్లు వేయించాయి. బీజేపీ 27 వార్డుల్లోనే తమ అభ్యర్థులను బరిలో దింపింది. కాంగ్రెస్ను ఓడించడమే ధ్యేయంగా తెలంగాణ జా గృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సహకారంతో ఏఐఎఫ్బీ(ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్) పార్టీ ‘సింహం’ గుర్తుతో ఎంట్రీ ఇచ్చిన మాజీ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్.. 26 మంది అభ్యర్థులతో జాబితా ప్రకటించారు. చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటామ ంటున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జనసేన 9 వార్డుల్లో పోటీకి దిగింది. అభివృద్ధిపై కాంగ్రెస్ ఆశలు సీఎం రేవంత్రెడ్డి సహకారంతో పెద్దపల్లిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని కాంగ్రెస్ చెబుతోంది. పెద్దపల్లి, సుల్తానాబాద్ పీఠాలు దక్కించుకుంటామనే ధీమాతో ఉంది. గత పాలకులు అభివృద్ధిని విస్మరించారని, డీఎంఎఫ్టీ నిధులను ఇత ర ప్రాంతాలకు ఎత్తుకెళ్లారని ఆరోపిస్తోంది. ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటు చేస్తున్నామని, 4 పోలీస్స్టేషన్లు ఒకేసారి ప్రారంభించామని, పదెకరాల్లో జిల్లా కోర్టు సముదాయాలు, బైపాస్రోడ్డు, పార్క్, హిందూ శ్మశానవాటిక తదితర పనులు చేపడతా మని ఎమ్మెల్యే విజయరమణారావు ప్రకటించారు. సర్వే చేయించి గెలిచే సత్తా ఉన్నవారినే పోటీలో నిలిపామని, తమకు ఎవరూ పోటీ ఇవ్వలేరంటున్నారు. బరిలో బీఆర్ఎస్, బీజేపీ.. బీఆర్ఎస్, బీజేపీలు కూడా తమ అభ్యర్థులను బరి లో నిలిపాయి. అయితే, ఆయా పార్టీలు, ప్రధాన నేతల నుంచి తమకు ఆశించిన మద్దతు లభించడం లేదని కొందరు భావిస్తున్నారు. బీజేపీలో గ్రూపు రా జకీయాలు అభ్యర్థుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చే స్తున్నాయి. మంగళవారం నామినేషన్ల ఉపసంహర ణ గడువు ముగిసి గుర్తులు కేటాయించిన తర్వాత ప్రచార పర్వంతో స్పష్టత వస్తుందని అంటున్నారు. ‘సింహం’ ఎంట్రీ.. మారిన రాజకీయం మాజీ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ చైర్మన్ పీఠంపై కన్నేశారు. కాంగ్రెస్లోని అసమ్మతివాదులు ఆయ నకు అండగా నిలుస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి పో టీచేయాలని తొలుత భావించి రాష్ట్ర నాయకత్వాన్ని ఆశ్రయించినా స్థానిక నేతల నుంచి వ్యతిరేకత వ చ్చిందని, దీంతోనే ఆ వ్యవహారం ఫలించలేదనే చర్చసాగుతోంది. దీంతో కమలనాథులను కలిసి కాషాయ తీర్థం తీసుకునేందుకు ఇంకో ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఓ వర్గం పార్టీ రాష్ట్ర నాయ కత్వం వద్దకు తీసుకెళ్లి సానుకూలత లభించేలా చేసిన ప్రయత్నాలపై మరోవర్గం అభ్యంతరం వ్య క్తం చేయడంతో.. గ్రూపు రాజకీయాలతో వేగలేమని భావించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కలిసినట్లు సమాచారం. పట్టుసాధించేందుకు ఇదో అవకాశమని.. పెద్దపల్లిలో పట్టు సాధించేందుకు మంచిఅవకాశమ ని భావించిన జాగృతి కవిత.. ఆశావహులకు ఆల్ఇండియా ఫార్వర్డ్బ్లాక్ పార్టీ బీఫామ్లు ఇప్పించిన ట్లు చర్చ సాగుతోంది. ఎన్నికల ప్రచారంలోనూ ఆమె పాల్గొని సింహం గుర్తు అభ్యర్థుల విజయానికి ప్రయత్నిస్తారని సమాచారం. దీంతో కొలిపాక శ్రీని వాస్.. 26 మంది అభ్యర్థులను బరిలో నిలిపి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఏదేమైనా ఈనె ల 13న జరిగే ఓట్ల లెక్కింపు, 16న నిర్వహించే చైర్మ న్ ఎన్నిక ఆశావహుల భవితవ్యం తేల్చుతాయి.మున్సిపల్ సమాచారం చైర్మన్ పీఠం బీసీ(జనరల్) పట్టణ విస్తీర్ణం(చ.కి.మీ.లలో) 35.19 ఓటర్లు 43,789 పురుషులు 21,660 మహిళలు 22,126 ఇతరులు 03 వార్డులు 36 ప్రధాన పార్టీల అభ్యర్థులు కాంగ్రెస్ 36 బీఆర్ఎస్ 36 బీజేపీ 27 ఫార్వర్డ్ బ్లాక్ 26 జనసేన 09 -
సుందరంగా తీర్చిదిద్దుతా
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రం హోదాకు తగిన వి ధంగా పెద్దపల్లిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మున్సిపల్ 12, 29, 31వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థు లు జగదీశ్, ఇల్లందుల రజని, మంథని నర్సింగ్కు మద్దతుగా సోమవారం పట్టణంలో ఎన్నికల ప్రచా రం చేశారు. అంతకుముందు ఎల్లమ్మ చెరువు హను మాన్ ఆలయంలో పూజలు చేశారు. ఈనెల 11న జ రగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకే ఓటువేసి గెలిపించాలని కోరారు. సురేశ్గౌడ్, వ్యాపారవేత్త బాల్కిషన్ జాకొటియా, నాయకులు సత్యనారాయణరెడ్డి, రంగు శ్రీనివాస్ ఎడెల్లి శంకర్ ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి ఎలిగేడు(పెద్దపల్లి): మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే విజయరమణారావు సూచించారు. శివపల్లిలోని తన నివాసంలో కాంగ్రెస్ ముఖ్యనాయకులతో మున్సిపల్ ఎన్ని కల ప్రచారంపై సమీక్షించారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోనిప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రతీ ఇంటికి తీసుకెళ్లాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించేలా సహకరించాలని కోరారు. ప్రతిభావంతులకు ప్రశంస పెద్దపల్లి: అమర్చందర్ కల్యాణ మండపంలో సో మవారం టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. జిల్లాస్థా యిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈకార్య క్రమంలో డీఈవో శారద, అధికారులు పీఎం షేక్, హనుమంతు, ఆగయ్య, పురుషోత్తం, లింగం శ్రీనివాస్, ముద్రబోయిన కుమారస్వామి, భాస్కర్ గడ్డం రాజనర్సు, కొండం శ్రీనివాసరెడ్డి, గుర్రం గంగారెడ్డి, మూల శ్రీనివాస్, రామచంద్రన్, పట్టెం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమిస్తేనే సమస్యల పరిష్కారం
పెద్దపల్లి: ఐక్యతతో ఉద్యమిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి రాణీరుద్రమ దేవి అన్నారు. సుల్తానాబాద్లో సోమవారం జరిగి న సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభు త్వ నిధులతోనే గ్రామాలు, పట్టణాలు, నగరాలు అ భివృద్ధి చెందుతున్నాయన్నారు. ఈ విషయం ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలని సూచించారు. టికెట్లు దక్కనివారు నిరుత్సాహానికి గురికాకుండా పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. నాయకులు రాజమౌళిగౌడ్, మీస అర్జున్రావు, కర్రె సంజీవరెడ్డి, నల్లమనోహర్రెడ్డి, కడారి అశోక్రావు, సౌదరి మహేందర్ యాదవ్, మిట్టపల్లి ప్రవీణ్ కు మార్, కామని రాజేంద్రప్రసాద్, శ్రీనివాస్, నాగరాజు, రాజన్న, రాజన్నపటేల్, మహేశ్ పాల్గొన్నారు. -
విధుల్లో పారదర్శకత ఉండాలి
జ్యోతినగర్(రామగుండం): పోలింగ్ విధులను పకడ్బందీగా నిర్వహించాలని కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ సూచించారు. ఎన్టీపీ సీ కాకతీయ ఆడిటోరియంలో సోమవారం ప్రి సైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆమె మాట్లా డుతూ, విధుల్లో పారదర్శకత ఉండాలన్నారు. ట్రైనర్స్ శ్రీనివాస్, రాజేందర్రెడ్డి, కృష్ణారెడ్డి, అంజన్కుమార్ వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లా ఎన్నికల పరిశీలకులు ప ద్మజారాణి శిక్షణ తరగతులను తనిఖీ చేశారు. బల్దియా కమిషనర్లు మనోహర్, వెంకటేశ్, రమేశ్, ఎస్ఈ గురువీర, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఆర్వో ఆంజనేయులు, సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సెక్యూరిటీ సిబ్బంది కీలకం గోదావరిఖని: సింగరేణి ఆస్తుల పరిరక్షణలో సెక్యూరిటీ సిబ్బంది పాత్ర కీలకమని ఆర్జీ –వ న్ జీఎం లలిత్కుమార్ అన్నారు. సెక్యూరిటీ సిబ్బందికి సోమవారం టార్చిలైట్లు, ఫైబర్ లా ఠీలు అందజేసి మాట్లాడారు. సెక్యూరిటీ అధి కారి వీరారెడ్డి, ఏఐటీయూసీ కార్యదర్శి రెడ్డి వెంకటస్వామి, జూనియర్ ఇన్స్పెక్టర్లు శ్రీని వా స్, మహ్మద్ అక్బర్అలీ, జమేదార్లు తిరుపతి, మురళికృష్ణ, ఓదెలు, శ్రీనివాస్, మొండ య్య, సదానందం, ఇంటలిజెన్స్ టీం రాధాకృష్ణ, మధు, తిరుపతి, రమేశ్ పాల్గొన్నారు. క్వింటాల్ పత్తి రూ.7,831 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ లో సోమవారం పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.7,831, కనిష్టంగా రూ.6,331, సగటు ధర రూ.7,531గా నమోదైందని మార్కెట్ ఇన్చార్జి కార్యదర్శి ప్రవీణ్రెడ్డి తెలిపారు. 416 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు వివరించారు. మజ్దూర్ యూనియన్ నిరసనరామగుండం: దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక రైల్వేస్టేషన్లో ఆందోళన చేశారు. 8వ వేతన సంఘం సిఫార్సులు వర్తింపజేయాలని, సేఫ్టీ కేటగిరీ సిబ్బందికి రిస్క్, హార్డ్షిప్ అలవెన్స్ చెల్లించాలనే తదితర డిమాండ్లతో నిరసన తెలిపారు. నేతలు మెట్ట రామారావు, ఓవై స్వామి, మోజెన్, ఆనంద్ రాథోడ్, అరవింద్, రాజ్కుమార్, రఘు, సతీశ్, గౌతమ్ ఉన్నారు. హుండీల ఆదాయం లెక్కింపు ఓదెల(పెద్దపల్లి): కొలనూర్ సమ్మక్క – సారలమ్మ జాతర హుండీల ద్వారా రూ.8,31,08 ఆదాయం సమకూరిందని జాతర కమిటీ చైర్మ న్ కొలిపాక మధునయ్య సోమవారం తెలిపా రు. సర్పంచ్ పల్లె కనుకయ్య, ఉపసర్పంచ్ పా కాల సంపత్రెడ్డి, ఓదెల మల్లన్న ఆలయ ఈవో సదయ్య, జూనియర్ అసిస్టెంట్ పాల్గొన్నారు. గుండారంలో.. కమాన్పూర్(మంథని): గుండారం సమ్మక్క– సారలమ్మ జాతర హుండీలను లెక్కించగా.. రూ.2,13,286 ఆదాయం సమకూరిందని కమిటీ చైర్మన్ పిడుగు శంకర్ తెలిపారు. సర్పంచ్ జంగిలి పోచాలు, ఉప సర్పంచ్ అంబీర్ రాజేందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. పకడ్బందీగా వ్యవహరించాలిగోదావరిఖని: మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, సిబ్బంది నియామకంలో పకడ్బందీగా వ్యవహరించాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి సూచించారు. గోదావరిఖని వన్టౌన్ పోలీస్స్టేషన్ను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈనెల 11న పోలింగ్ నేపథ్యంలో లా అండ్ ఆర్డర్, ప్రజాభద్రత తదితర అంశాలపై పో లీస్ అధికారులకు సూచనలు చేశారు. డీసీపీ వెంట ఏసీపీ రమేశ్, సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సైలు రమేశ్, మనోహర్, అనూష ఉన్నారు. -
దయచూపని నిర్మలమ్మ
సోమవారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026ఉమ్మడి జిల్లాకు దక్కని ప్రత్యేక హామీలుసాక్షి ప్రతినిధి, కరీంనగర్: కేంద్రప్రభుత్వం ఆదివా రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026–27లో ఉమ్మడి జిల్లాకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. ఉమ్మడి జిల్లాకు చెందిన రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు కేటాయింపులపై ఎలాంటి ప్రత్యేక ప్రకటనలు రానప్పటికీ.. నేడో, రేపో వాటిపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే ప్రాజెక్టు ఉమ్మడి జిల్లాలోనే అతి పెద్దది. అలాంటి ప్రాజెక్టుకు కేటాయింపులపై ప్రకటన రాలేదు. అదే సమయంలో ప్రతిష్టాత్మక రాఘవాపురం–మణుగూరు, హసన్పర్తి – కరీంనగర్, నిజామాబాద్ – కరీంనగర్ – పెద్దపల్లి డబ్లింగ్, పెద్దపల్లి బైపాస్ రైల్వేలైన్ వర్క్స్ కేటాయింపులపై ఉమ్మడి జిల్లా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు. దీనిపై దక్షిణ మధ్య రైల్వే అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా.. పింక్ బుక్ విడుదల ఈసారి లేకపోవడంతో నిధుల కేటాయింపుపై ఇప్పటివరకు తమకు సమాచారం లేదని, తాము కూడా కేంద్ర రైల్వేమంత్రి విలేకరుల సమావేశం కోసం ఎదురుచూస్తున్నామని వివరించారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి జోన్ల వారీగా నిధుల కేటాయింపులపై వివరాలు త్వరలోనే విడుదలవుతాయని పేర్కొన్నారు. గతేడాది ఉమ్మడి జిల్లాల్లో రైల్వే ప్రాజెక్టులకు రూ.435 కోట్లు కేటాయించగా.. ఈసారి ఎంత అనేది ఆసక్తిగా మారింది. -
ఎడ్యుకేషనల్ హబ్ అవసరం
రామగుండం ఎడ్యుకేషనల్ హబ్గా మారాలి. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటు చేయాలి. ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. శుద్ధిచేసిన తాగునీరు అందించాలి. – డాక్టర్ క్యాస శ్రీనివాస్, గోదావరిఖని నోటుకు ఓటు వద్దు కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థులను చూసి ఓటు వేయాలి. వారు ఇచ్చే డబ్బులు, మద్యానికి ఓటు అమ్ముకోవద్దు. నిజాయతీని చూసి ఓటేస్తేనే అభివృద్ధి సాధ్యం అవుతుంది. – రాందాస్, 45వ డివిజన్


