Peddapalli District News
-
డిమాండ్లు నెరవేర్చాలి
పెద్దపల్లి: తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఆశ వర్కర్లు కోరారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో రాజీవ్ రహదారిపై సోమవారం రాస్తారోకో చేశారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్కుమార్ తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు స్వప్న మాట్లాడుతూ, తమ హక్కుల సాధన, కనీస వేతనం అమలు, అలవెన్స్ల కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు. ప్రతినిధులు అనవేన స్వరూప, మమత, రాజేశ్వరి, ప్రేమలత, మనీద్ర, రజిత, జ్యోతి, స్వరూప, రమాదేవి, అనురాధ, జ్యోత్న, శోభా, స్వప్న తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ ర్యాంక్ సాధించడమే ధ్యేయం
కోల్సిటీ: రామగుండం బల్దియా స్వచ్ఛ సర్వేక్షణ్లో ఉత్తమ ర్యాంక్ సాధించడమే తమ ధ్యేయమని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. బల్దియా కార్యాలయం – ఫైవింక్లయిన్ వరకు ప్రధాన రహదారిని స్వీపింగ్ యంత్రంతో శుభ్రపరిచే పనులను మేయర్ సోమవారం పర్యవేక్షించారు. పాత స్వీపింగ్ యంత్రం పనిచేకపోవడంతో ఎమ్మెల్యే సహకారంతో హెచ్కేఆర్ నుంచి తెప్పించిన ట్రాక్టర్ స్వీపింగ్ మిషన్తో శుభ్రం చేయిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పారిశుధ్య సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకొని తక్కువ ఖర్చుతో పనిచేసే ట్రాక్టర్ మౌంటెడ్ స్వీపింగ్ యంత్రాలు తెప్పించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లతోపాటు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పీవీ రామన్, టీపీఎస్ నవీన్, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన
జ్యోతినగర్: తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగానికి సైతం సిద్ధమైన వారికి ప్రభుత్వం న్యాయం చేయాలనే డిమాండ్తో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఉద్యమకారులు తోడేటి శంకర్గౌడ్, పొన్నం విజయకుమార్గౌడ్, వొల్లాల మల్లేశం తదితరులు పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ జ్యోతినగర్లోని సింధూర కళాశాల రోడ్డులోని వాటర్ ట్యాంకుపైకి ఎక్కి నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 250 చ.గ. నివాసస్థలంతోపాటు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు. ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్కిరణ్ వెంటనే అక్కడకు చేరి ఉద్యమకారులతో మాట్లాడారు. కిందికు వచ్చేలా చర్యలు చేపట్టారు. అనంతరం అదుపులోకి తీసుకుని వన్టౌన్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో క్రమద్ధీకరీంచారు. -
సీఎస్పీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
గోదావరిఖని: ఆర్జీ–1 ఏరియా సీఎస్పీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని హెచ్ఎంఎస్ అధ్యక్షుడు రియాజ్అహ్మద్ డిమాండ్ చేశారు. సోమవారం ఆర్జీ–1 ఏరియా సీఎస్పీలో జరిగిన గేట్మీటింగ్లో మాట్లాడారు. బొగ్గు దుమ్ము లేవకుండా వాటర్ స్ప్రే చేయాలన్నారు. కార్మికులను చార్జిషీట్లు, సస్పెండ్లు చేస్తామని బెదిరింపులు మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆరెల్లి పోశం, డేగల వరప్రసాద్రావు, మురళీధర్, నాగేందర్, మహ్మద్, మల్లేశ్, ప్రసాద్, బట్టు ప్రసాద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాభవన్ను ముట్టడిస్తాం
గోదావరిఖని: సింగరేణిలో మెడికల్ బోర్డు వెంటనే నిర్వహించాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజాభవన్ ముట్టడిస్తామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి హెచ్చరించారు. సోమవారం ఆర్జీ–1 జీఎం కార్యాలయం ధర్నా నిర్వహించారు. గోల్డెన్ హ్యాండ్ షేక్ పేరిట గతంలో 20వేల మందిని, డిస్మిస్ పేరిట పది వేల మందిని నాటి ప్రభుత్వాలు తొలగించాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదేపోకడ కొనసాగిస్తోందన్నారు. సింగరేణిలో అవినీతి రాజ్యమేలుతోందని, కారుణ్య నియమాకాల ద్వారా నియమితులైన ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసే విధంగా ఉద్యోగులపై ఏసీబీ, విజిలెన్స్ దాడులు చేస్తామని బెదిరింపులకు గురిచేయడం దారుణమన్నారు. సంస్థను పరిరక్షించుకోవడానికి పోరాటానికి సిద్ధ కావాలని ఆయన కోరారు. నాయకులు వడ్డేపల్లి శంకర్, మాదాసు రాంమ్మూర్తి, నూనె కొమరయ్య, చెల్పూరి సతీశ్, జావిద్పాషా, పోలాడి శ్రీనివాసరావు, చల్లా రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కనీస వేతనాలు అమలు చేయాలి
గోదావరిఖని: అసంఘటిత రంగంలోని కార్మికులకు కనీసవేతనాలు అమలు చేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ కోరారు. సోమవారం అసెంబ్లీలో మాట్లాడుతూ, దేశఆర్థిక వ్యవస్థలో అసంఘటిత రంగం కీలక పాత్ర పోషిస్తున్నా.. కార్మికులు ప్రాథమిక హక్కులు, భద్రత, కనీస వేతనాల విషయంలో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్మికులు, భవన నిర్మాణ రంగంలోని కార్మికులు, వ్యవసాయ కూలీలు, గృహ సేవకులు, చిన్నపరిశ్రమల కార్మికులు దేశ అభివృద్ధికి పునాది లాంటివారని, వారికి కనీస వేతనాల అమలును కచ్చితంగా నిర్ధారించాలని కోరారు.స్థానిక అధికారులు, కార్మిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేసి ఈసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. -
క్రీడలకు ఎన్టీపీసీ పెద్దపీట
జ్యోతినగర్: రామగుండంలోని ఎన్టీపీసీ క్రీడలకు పెద్దపీట వేస్తున్నట్లు ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన కుమార్ సామంత అన్నారు. సోమవారం రాత్రి పర్మినెంట్ టౌన్షిప్లోని మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో సదరన్ రీజియన్ స్పోర్ట్స్ మీట్ 2025–26 నిర్వహించారు. ఈసందర్భంగా వాలీబాల్, బాస్కెట్బాల్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యుత్ ఉత్పత్తితోపాటు క్రీడలను సైతం ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ ముకుల్ రాయ్, మనీష్ అగర్వాల్తోపాటు సదరన్ రీజియన్లోని కాయంకుళం, కుడ్డి, సింహాద్రి, వల్లూరు, రామగుండం–తెలంగాణ ప్రాజెక్టులోని క్రీడాకారులు, క్రీడా విభాగం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావాణి అర్జీలకు అధిక ప్రాధాన్యం
పెద్దపల్లి: ప్రజాప్రజావాణి ద్వారా అందిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతం ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అదనపు కలెక్టర్ వేణుతో కలిసి కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన గండు రాజయ్య.. తనకు 1.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, బ్రిక్స్ నుంచి వచ్చే దుమ్ము, ధూళి, బూడిదతో పొలంలో వేసే కూరగాయల పంటకు నష్టం వస్తుందన్నారు. ఇందుకు కారణమైన బ్రిక్స్ యజమానిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పెద్దపల్లి హనుమాన్నగర్కు చెందిన ఎర్రం వరలక్ష్మి.. తనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, తన పోషణ ఎవరూ పట్టించుకోవడం లేదని, వృద్ధుల పోషణ సంరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. పట్టణానికి చెందిన కుమారస్వామి.. తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరాడు. సుల్తానాబాద్ మండలం నీరుకుల్లకు చెందిన ఎర్రబెల్లి రాజేశ్వరరావు.. సర్వే నంబరు 330 నుంచి 331లోని కాలువలో మట్టి తీయాలని అర్జీపెట్టారు. పెద్దపల్లి విద్యానగర్కు చెందిన విఠల్.. గృహజ్యోతి పథకం అమలు చేయాలని కోరాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో సత్వర సేవలు ప్రభుత్వ ఆస్పత్రిలో సత్వర వైద్యసేవలు అందించాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. వైద్యశాఖ పనితీరుపై తన కార్యాలయంలో సమీక్షించారు. రోజూ ఉదయం 9.30 నుంచి 11.00 గంటల వరకు ఓపీ రిస్ట్రేషన్ చేయడం ద్వారా ఎక్కువమందికి సేవలు అందించలేకపోతున్నామని, ప్రతీవిభాగంలో నిర్దిష్ట సంఖ్యలో టోకెన్లు జారీచేసి ఓపీ సేవలు పెంచాలని, ఆ తర్వాత ఆన్లైన్లో నమోదుచేయాలని కలెక్టర్ సూచించారు. ఉదయం తీసుకున్న శాంపిళ్ల నివేదికను సాయంత్రం వరకు పేషెంట్లకు తెలియజేయాలని అన్నారు. ఎక్స్రే యంత్రం, సిబ్బంది నియామకానికి ప్రతిపాదనలు అందించాలని చెప్పారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ప్రమోద్ కుమార్, డీసీహెచ్వో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అత్యున్నతమైనది ఉపాధ్యాయ వృత్తి ఉపాధ్యాయ వృత్తి అత్యున్నతమైనదని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల ఎంపీసీఎస్ ఉపాధ్యాయురాలు మిరియాల సుజాత– ఉద్యోగ విరమణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. క్రమశిక్షణతో కూడిన బోధన విద్యార్థుల భవిష్యత్కు బాటలు వేసిందని ప్రశంసించారు. ప్రజాప్రతినిధులు సిద్ధ తిరుపతి, వేగోళం పద్మ –అబ్బయ్యగౌడ్, ఎంఈవో రాజయ్య, టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్, కాంప్లెక్స్ హెచ్ఎం కవిత, రత్నాకర్రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గుర్రం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పత్తి ధర రూ.7,455
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో సోమవారం పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.7,455 ధర పలికిందని మార్కెట్కమిటీ చైర్మన్ కూరమల్లారెడ్డి, కార్యదర్శి ప్రవీణ్రెడ్డి తెలిపారు. కనిష్టంగా రూ.5,526గా, సగటు రూ.7,055గా ధర ఉందని వారు పేర్కొన్నారు. మెడికల్బోర్డు పునరుద్ధరించాలి గోదావరిఖని: సింగరేణిలో మెడికల్ బోర్డు పునరుద్ధరించాలని టీబీజీకేఎస్ ఆర్జీ–2 ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం ఆర్జీ–2 జీఎం ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. కార్మికుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. సుమారు గంటపాటు నిరసన తెలిపి అనంతరం పర్సనల్ డీజీఎం అరవిందరావుకు వినతిపత్రం అందజేశారు. నాయకులు డి.సురేందర్, మామిడి తిరుపతి, కూర తిరుపతి, రవితేజ, హరిప్రసాద్, బొడ్డు రమేశ్, దాసరి శ్రీనివాస్, శశాంక్ తదితరులు పాల్గొన్నారు.వాకింగ్ చేస్తుండగా చైన్స్నాచింగ్ పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి శివారు బందంపల్లిలో సోమవారం రాత్రి ఇంటిముందు వాకింగ్ చేస్తున్న గుండు లక్ష్మీనర్సమ్మ అనే వృద్ధురాలి మెడలో నుంచి దొంగలు బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. స్థానికుల కథనం ప్రకారం.. రాత్రి భోజనం చేసిన ఇంటిముందు కాలినడకన తిరుగుతుండడాన్ని గమనించిన యువకులు.. బైక్పై వచ్చి మూడుతులాల బంగారు గొలుసు తెంపుకుని వచ్చిన దారినే వెళ్లి పోయారని బాధితురాలు తెలిపింది. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి పెద్దపల్లిరూరల్: పట్టణంలోని రాంపల్లి డబుల్ బెడ్డ్రూమ్ కాలనీలో వీధిదీపాలను ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరారు. ఈ మేరకు డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ కృష్ణ, సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై మల్లేశ్కు వినతిపత్రం అందించారు. అందుకు సానుకూలంగా అధికారులు స్పందించారని వారు పేర్కొన్నారు. హత్యాయత్నం కేసులో నిందితుని అరెస్ట్జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలో శనివారం రాత్రి బాలాజీనగర్కు చెందిన తుమ్మల లోకేశ్పై హత్యాయత్నానికి పాల్పడిన ఓరుగంటి వివేక్ను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. తహసీల్ చౌరస్తా వద్దనున్న అమృత విల్లాస్ హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్న లోకేశ్, అదే హోటల్లో మేనేజర్ వివేక్ మధ్య గొడవ జరిగింది. మాటామాట పెరగడంతో లోకేశ్ను చంపాలనే ఉద్దేశంతో తన వద్దనున్న సర్జికల్ బ్లేడ్తో వీపుపై పొడవగా బలమైన రక్తగాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
రాములోరి పాదముద్రలు ప్రత్యక్షం
మంథని: స్థానిక శ్రీరాంనగర్ సీతారామచంద్రుల ఆలయంలో సోమవారం వరిపిండిలో రాములోరి పాదాల గుర్తులు దర్శనమిచ్చాయి. ఏటా శ్రీరామనవమి తర్వాత నిర్వహించే పట్టాభిషేకం సందర్భంగా రాత్రి వేళ శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయంలోకి వస్తారని భక్తుల విశ్వాసం. ఈక్రమంలోనే ఈనెల 27న స్వామివారి కల్యాణం జరిపించగా, ఆదివారం రాత్రి పట్టాభిషేకం నిర్వహించారు. సోమవారం ఆ యలం తలుపులు తెరిచే సరికి స్వామివారి పాదాల గుర్తులు దర్శనమివ్వడంతో భక్తుల నమ్మ కం పదిలిమైంది. కాలనీవాసులతోపాటు సమీప ప్రాంతాల భక్తులు తరలివచ్చి దర్శనం చేసుకున్నారు. -
పకడ్బందీగా ఓటరు జాబితా
జ్యోతినగర్: ఓటరు జాబితాను పగడ్బందీగా తయారు చేయాలని అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ ఆదేశించారు. ఎన్టీపీసీ పీటీఎస్ కాకతీయ ఆడిటోరియంలో సోమవారం జరిగిన బీఎల్వోల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు జాబితా ఉండాలని సూచించారు. జాబితాలో ఉన్నవారు మరణించినా, ఇతర ప్రాతాలకు వలస వెళ్లినా వారిని గుర్తించి జాబితా నుంచి పేర్లు తొలగించాలని అన్నారు. సమావేశంలో తహసీల్దార్లు రవీందర్ పటేల్, సునీత, లక్ష్మి, సీడీపీవో అలేఖ్య పటేల్ తదితరులు పాల్గొన్నారు.రైలు నుంచిపడి యువకుడి మృతి ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోని లెవల్ క్రాసింగ్గేట్ వద్ద ఆదివారం రాత్రి సంఘమిత్ర ఎక్స్ప్రెస్ రైలునుంచి పండి బిహర్ రాష్ట్రం ఖైమూరు బాబువ జిల్లా ఆసన్ గ్రామానికి చెందిన అఫరోజ్ అన్సారీ(21) మృతిచెందాడు. రామగుండం జీఆర్ఫీఎఫ్ హెడ్కానిస్టేబుల్ తిరుపతి కథనం ప్రకారం.. సూర్యాపేటలో కూలీ పనులు చేసేందుకు దీల్దయాల్ ఉపాధ్యాయ రైల్వేస్టేషన్ నుంచి తన సోదరులతో కలిసి సంఘమిత్ర రైలులో ఖమ్మం ప్రయాణం చేస్తున్నారు. మార్గమధ్యంలోని పొత్కపల్లిలో అఫరోజ్ అన్సారీ ప్రమాదవశాత్తు కిందపడి తలపగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరించారు. శవపరీక్ష చేయించి మృతుడి తమ్ముడికి అప్పగించారు. ఎస్సారెస్పీ కాలువలో దూకి మహిళ ఆత్మహత్యమేడిపల్లి: మండలంలోని వల్లంపల్లి పరిధి ఎస్సారెస్పీ కాలువలో దూకి మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన సార్ల లక్ష్మీ ఆత్మహత్య చేసుకుంది. కాలువలోని తుమ్మచెట్టుకు మహిళ మృతదేహం కనిపించిందన్న బాటసారుల ద్వారా తెలుసుకున్న మేడిపల్లి పోలీస్లు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. లక్ష్మీ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోందని, జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుందని ఆమె భర్త నారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నాణ్యమైన చేపపిల్లలు ఇవ్వాలి
పెద్దపల్లిరూరల్: మత్స్యసహకార సంఘాల్లో నూతన సభ్యత్వాలను నమోదు చేసేందుకు అవకాశం ఇవ్వాలని, చెరువులు, కుంటల్లో నాణ్యమైన చేపపిల్లలను నిబంధనల ప్రకారమే అందించాలని మత్స్యసహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కొలిపాక నర్సయ్య అన్నారు. జిల్లా కేంద్రలో సోమవారం జరిగిన సాధారణ సమావేశంలో జిల్లా మత్స్యశాఖ అధికారి నరేశ్, డైరెక్టర్లు పాల్గొన్నారు. సంఘం సభ్యులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చూడాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల ఫలాలను అందేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అధికారి నరేశ్ అన్నారు. సమావేశంలో సారయ్య, వీరస్వామి, శ్రీనివాస్, తిరుపతి, సుజాత, మొండయ్య, శ్రీకాంత్, కోటయ్య తదితరులు ఉన్నారు. -
చేపలవేటపై శిక్షణ కరువు
పెద్దపల్లిరూరల్: జీవనోపాధికోసం చేపలవేటపై ఆధారపడిన మత్స్యకారులకు నైపుణ్య శిక్షణ కరువైంది. జిల్లాలోని చెరువులు, కుంటల్లో పెంచిన చేపలను పట్టేందుకు సరైన నైపుణ్యం లేక చాలామంది నీటమునిగిపోతున్నారు. ఇందులో చెరువులు, కుంటల్లోకి దిగిన మత్స్యకారులు ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలూ ఉన్నాయి. చేపలను పట్టే వృత్తిపై ఆధారపడి జీవించే వారికి గతంలో ఏటా అవసరమైన నైపుణ్యశిక్షణ ఇప్పించేవారు. సొసైటీలో సభ్యత్వం ఇచ్చే సమయంలోనే సంబంధిత అధికారులు పరీక్షించేశారు. చేపలు పట్టబోయి.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మత్స్యకారులు చేపలు పట్టేందుకు వెళ్లి చెరువులోనే మునిగి మృత్యువాత పడ్డ సంఘటనలు అనేకం ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 12మంది వరకు ఇలా మరణించినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వారికి ప్రభుత్వ పరంగా రూ.5లక్షల పరిహారం అందిస్తున్నారు. కరువైన నైపుణ్యశిక్షణ చేపలు పట్టేందుకు చెరువులోకి దిగే మత్స్యకారుల వృత్తి నైపుణ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం శిక్షణ ఇప్పించడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. నాలుగేళ్లుగా శిక్షణ ఊసే కనిపించడం లేదు. దీంతో కుటుంబపోషణ కోసం చేపలను పట్టేందుకు పూర్వీకుల నుంచి నేర్చుకున్న పద్ధుతులపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆధునిక సాంకేతికపై శ్రద్ధ ఏది? సమాజంలో వస్తున్న ఆధునిక సాంకేతికతతో వివిధ వృత్తులపై ఆధాపడ్డ వారికి యాంత్రీకరణలో భాగంగా పనిముట్లను అందిస్తున్న ప్రభుత్వం.. చేపలు పట్టే వృత్తిపై ఆధారపడ్డ వారిపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని పలువురు ప్రశ్నిస్తున్నారు. గీత కార్మికులకు కాటమయ్యరక్షణ కవచం లాంటి పరికరాలను అందించిన సర్కారు.. తమకు చేపలను పట్టేందుకు వీలుగా పనిముట్లను రూపొందించాలని లేకుంటే కనీసం నైపుణ్యశిక్షణనైనా ఇప్పించాలని కోరుతున్నారు. చెరువులు, కుంటలు 1,076 సొసైటీలు 216 సభ్యుల సంఖ్య 15,337 మత్స్యకార సంఘాలు(పురుషులు) 147 సభ్యుల సంఖ్య 11,575 మహిళా సంఘాలు 46 సభ్యుల సంఖ్య 2,251 మార్కెటింగ్ సొసైటీలు 15 సభ్యులు 1,116 లైసెన్స్డ్ మార్కెటింగ్ సొసైటీలు 08 సభ్యులు 395 -
డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాసప్
పెద్దపల్లి: జిల్లాకు చెందిన వరహగిరి శైలజ – వెంకటరావు దంపతులు తమకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లును కలెక్టర్ కోయ శ్రీహర్షకు సోమవా రం తిరిగి అప్పగించారు. తమ సంతానం సాఫ్ట్వేర్ ఉద్యోగంలో స్థిరపడిన నేపథ్యంలో తమకు ఈ ఇల్లు అవసరం లేదని భావించారు. దీనిని ఇతరపేద కు టుంబానికి కేటాయించాలని కలెక్టర్ను ఆయన కా ర్యాలయంలో సోమవారం కలిసి విన్నవించారు. క లెక్టర్ మాట్లాడుతూ, అవసరం లేకపోయినా ప్రభు త్వ ఆస్తిని తిరిగి ఇచ్చిన శైలజ దంపతులు నిజాయతీకి నిదర్శనమన్నారు. ఇలాంటి వ్యక్తులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని అభినందించారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలు నిజంగా అవసరమైన వారికి అందేలా ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
మానవ సంబంధాలను కాపాడుకుందాం
పెద్దపల్లిరూరల్: సమాజంలో ఆర్థిక సంబంధాల ముందు మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరముందని బంజారా ప్రవచనకర్త, ఆధ్యాత్మిక గురువు ఎస్పీ నాయక్ అన్నారు. హన్మంతునిపేటలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ కృష్ణతో కలిసి పాల్గొన్నారు. హన్మంతునిపేట, చీకురాయి, భోజన్నపేట, మూలసాల, రాంపల్లి, మారెడుగొండ, గుర్రాంపల్లి గ్రామాలకు చెందిన ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను గౌరవించి వారి దీవెనలను పొందాలని ఆయన సూచించారు. సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దు సైబర్నేరాలు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వారి వలలో పడకుండా జాగ్రత్తలు పాటించాలని పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి అన్నారు. సైబర్మోసాల బారిన పడితే వెంటనే 1930 నంబరుకు సమాచారం అందించాలని ఆయన అన్నారు. రోడ్లపై వాహనాలను నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు. సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సైలు మల్లేశ్, శ్వేతతో పాటు సర్పంచులు మ్యాడగోని శ్రీనివాస్, ఓదెల శ్రీనివాస్, త్రివేణి, తొగరి సంపత్, ఉపసర్పంచ్ మేకల కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జెడ్పీహెచ్ఎస్ విద్యార్ధుల ఇండస్ట్రియల్ టూర్
మంథనిరూరల్: ఎగ్లాస్పూర్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్దులు శనివారం బసంత్నగర్ కేశోరాం(అల్ట్రాటెక్) సిమెంట్ ఫ్యాక్టరీ సందర్శించారు. ఇండస్ట్రియల్ టూర్లో భాగంగా ఈకార్యక్రమం చేపట్టారు. రా మెటీరియల్ ఐరన్, జిప్సం క్రషర్, బొగ్గుతో హీట్చేయడం, వీటిని కలిపి క్రషర్ చేసి పొడి చేసి సిమెంట్గా మార్చే విధానాన్ని విద్యార్ధులు ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే సిమెంట్ బ్యాగులు నింపే విధానం, మిషన్ల సాయంతో గూడ్స్ రైలులో ఎక్కించడం, ఆటోమెటిక్ సిస్టంతో నడిచే ఫ్యాక్టరీ విడి భాగాలను పరిశీలించి సిమెంట్ తయారు చేసే పద్ధతులు ప్రాక్టికల్గా తెలుసుకున్నారు. హెచ్ఎం జ్యోతి, ఉపాధ్యాయులు సంతోష్, దొమ్మటి రవి, సుచిత్ర, రాజశేఖర్, అన్నం శ్రీనివాస్, పోచం, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. మంథనిరూరల్: ఎగ్లాస్పూర్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్దులు శనివారం బసంత్నగర్ కేసోరాం సిమెంట్ ఫ్యాక్టరీ సందర్శించారు. ఇండస్ట్రియల్ టూర్లో భాగంగా ఈకార్యక్రమం చేపట్టారు. రా మెటీరియల్ ఐరన్, జిప్సం క్రషర్, బొగ్గుతో హీట్చేయడం, వీటిని కలిపి క్రషర్ చేసి పొడి చేసి సిమెంట్గా మార్చే విధానాన్ని విద్యార్ధులు ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే సిమెంట్ బ్యాగులు నింపే విధానం, మిషన్ల సాయంతో గూడ్స్ రైలులో ఎక్కించడం, ఆటోమెటిక్ సిస్టంతో నడిచే ఫ్యాక్టరీ విడి భాగాలను పరిశీలించి సిమెంట్ తయారు చేసే పద్ధతులు ప్రాక్టికల్గా తెలుసుకున్నారు. హెచ్ఎం జ్యోతి, ఉపాధ్యాయులు సంతోష్, దొమ్మటి రవి, సుచిత్ర, రాజశేఖర్, అన్నం శ్రీనివాస్, పోచం, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. -
అడవుల పరిరక్షణపై ఫోకస్
మంథనిరూరల్: కలప అక్రమ రవాణాను అరికట్టేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన ప్రభుత్వం, అటవీశాఖ.. అడవుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఏటా వేసవిలో అడవి అంటుకుని చెట్లు బుగ్గిపాలయ్యేవి. అనేక వన్యప్రాణులు అగ్నికి ఆహుతి అయ్యేవి. అయితే, అగ్గివ్యాపించకుండా చెట్లు, వన్యప్రాణులను రక్షించుకునేలా అటవీశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఫైర్లైన్లు ఏర్పాటు చేస్తోంది. జిల్లాలో అటవీ విస్తీర్ణం 316.55 చ.కి.మీ. జిల్లాలో 316.55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. మంథని, ముత్తారంతోపాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మల్హర్, మహాముత్తారం, కాటారం, మహదేవ్పూర్ మండలాల్లో అటవీ ప్రాంతం ఉంది. పెద్దవృక్షాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. అనేక రకాల వన్యప్రాణులు జీవిస్తున్నాయి. ఏటా వేసవిలో నిప్పంటుకుని చెట్లతోపాటు వన్యప్రాణులకూ నష్టం వాటిల్లుతుండేది. ఫైర్లైన్స్ ఏర్పాటుతో కొంతవరకు అడవులను రక్షించుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రూనింగ్ పేరిట అడవికి నిప్పు ఏటా వేసవిలో అడవి అంటుకుంటోంది. వేసవి చివరి సమయంలో తునికాకు సేకరణ ఉంటున్న క్రమంలో ప్రూనింగ్పేరిట కొందరు అడవికి నిప్పు పెడుతుంటారు. రాలిపోయిన ఆకులు, చెత్తాచెదారం పూర్తిగా కాలిపోయి కొత్త ఆకులు చిగురిస్తాయి. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఎలుగుడు పడుతుందని పెద్దలు చెబుతుంటారు. ఎండతీవ్రతకు చెట్లకొమ్మలు రాపిడికి గురై మంటలు చెలరేగుతాయని, దీనినే ఎలుగుడు అంటారని వారు వివరిస్తున్నారు. ఇలా ఏదోఒకవిధంగా అడవికి నిప్పు అంటుకుంటూనే ఉంటోంది. ఫైర్లైన్ల ఏర్పాటుతో.. అడవిలో మంటలు వ్యాపించకుండా రెండేళ్లుగా ఫైర్లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. అటవీ ప్రాంతంలోని ప్రధాన రహదారుల గుండా వెళ్లే వాహనదారులు సిగరెట్, బీడీల్లాంటివి పడేస్తే పక్కనే ఉండే ఎండిన ఆకులు అంటుకుని అడవిలోకి మంటలు వ్యాపిస్తాయి. అలాకాకుండా రోడ్డుకు ఐదు మీటర్ల దూరంలో ఎండిన ఆకులు, చెత్తను ఒకచోటికి చేర్చి లైన్లా ఏర్పాటు చేస్తారు. ఆ లైన్కు రెండు వైపులా శుభ్రం చేస్తారు. ఎండిన ఆకులతో ఏర్పాటు చేసిన లైన్కు నిప్పు అంటిస్తారు. ఇదిపూర్తిగా కాలిపోయి బూడిద మిగులుతుంది. ఆ ప్రాంతంలో మంటలు చెలరేగినా ఆ బూడిద లైన్ దాటి లోనికి మంటలు వ్యాపించవు. అడవుల సంరక్షణపై అవగాహన అడవుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేలా అటవీశాఖ అధికారులు వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సమీప గ్రామాల్లోని ప్రజలకు పలు అంశాలు వివరిస్తూ వేసవిలో ఎవరూ అటవీప్రాంతానికి వెళ్లకూడదని, ముఖ్యంగా పశువుల కాపరులు సూచనలు పాటించాలని చెబుతున్నారు. అడవుల్లో అగ్నివ్యాపించేలా ఎలాంటి పనులు చేయవద్దని, అడవులను రక్షించుకోవడం అందరి బాధ్యతని అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైనా అడవికి నిప్పు పెట్టినా, చెట్లు నరికినా చట్టపమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. -
రాజీతో సమన్యాయం
పెద్దపల్లి: వివిధ కేసుల్లో రాజీతో కుదిరితేనే ఇరువర్గాలకు సమన్యాయం లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత అన్నారు. స్థానిక కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో జడ్జి మాట్లాడారు. కుటుంబ తగాదాలు, ఆస్తిగొడవలు, పిల్లల ఘర్షణలే అధికంగా ఉంటున్నాయని, వీటి పరిష్కారానికి రాజీ కుదుర్చుకోవడం ఉత్తమమన్నారు. జిల్లావ్యాప్తంగా 2,200 కేసులు రాజీ అయినట్లు వివరించారు. జిల్లా జడ్జిలు స్వప్నరాణి, మంజుల, డీసీపీ రాంరెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ డోంకై న రవీందర్, శ్రీనివాస్, కిశోర్, లీగల్ ఎయిడ్ సభ్యుడు మూర్తి, సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సైలు మల్లేశం, పురుషోత్తం పాల్గొన్నారు. కాగా సుల్తానాబాద్ కోర్టులో జరిగిన లోక్అదాలత్లో 525 కేసులు పరిష్కారమైనట్లు జడ్జి గణేశ్ తెలిపారు. సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి బోయిని భూమయ్య, ఏజీపీ ఆంజనేయులు, లోక్ అదాలత్ సభ్యుడు మాడూరి ఆంజనేయులు, ఎస్సై చంద్రకుమార్, న్యాయవాదులు ఆవుల లక్ష్మీరాజం, వొడ్నాల రవీందర్, జోగుల రమేశ్, ఆవుల శివకృష్ణ, సామల రాజేంద్రప్రసాద్, రుద్రారపు నర్సయ్య, సంతోష్, మడూరి పృథ్వీ పాల్గొన్నారు. ధర్మారంలో.. ధర్మారం: నందిమేడారం జూనియల్ సివిల్ కోర్టు లో చేపట్టిన లోక్ అదాలత్లో 211 కేసులు పరిష్కారమైనట్లు లోక్ అదాలత్ సభ్యుడు ఆకారి రాజేశం తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జి సరిత ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహించారు. ఎస్సై ప్రవీణ్కుమార్, లోక్ అదాలత్ సభ్యుడు నూనె సత్యనారాయ ణ, బార్ అసోసియేషన్ కోశాధికారి భీమారపు సంపత్, స్పోర్ట్స్ కార్యదర్శి ఎంపల్లి ప్రకాశ్ పాల్గొన్నారు. రాజీ మార్గమే రాచమార్గం గోదావరిఖనిటౌన్: రాజీమార్గమే రాచమార్గమని గోదావరిఖని మున్సిఫ్ మెజిస్ట్రేట్లు నల్లాల వెంకటసచిన్రెడ్డి, స్వారిక, వెంకటేశ్ దుర్వ అన్నారు. స్థానిక కోర్టుల్లో నిర్వహించిన లోక్ అదాలత్లలో వారు మాట్లాడారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్, లోక్ అదాలత్ సభ్యులు సంజయ్ కుమార్, ఉమర్, కిషన్రావు, గుజ్జేటి సత్యనారాయణ, ముచ్చకుర్తి కుమార్, ఎంచర్ల మహేశ్, నూతి సురేశ్, సబా తబుస్సం, ప్రదీప్ కుమార్, రామటెంకి శ్రీనివాస్, ఏసీపీ రమేశ్, సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాదరావు, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా జడ్జి కుంచాల సునీత -
రుణాల పంపిణీలో అగ్రస్థానం
కోల్సిటీ(రామగుండం): సీ్త్రనిధి రుణాల పంపిణీ, వసూళ్లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా రాష్ట్రస్థాయిలో పురస్కారాలు సాధించింది. శనివారం హైదరాబాద్లో నిర్వహించిన సీ్త్రనిధి 13వ సాధారణ సభలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ధనసరి సీతక్క, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రధాన కార్యనిర్వాహణ అధికారి దివ్య దేవరాజన్ నుంచి అవార్డులు అందుకున్నారు. పట్టణ పరిధిలో రుణాల పంపిణీ, వసూళ్లలో అగ్రస్థానంలో నిలిచినందుకు జిల్లా ప్రాజెక్టు సంచాలకురాలు, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అరుణశ్రీ ప్రతిభా పురస్కారం అందుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సీ్త్రనిధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసినందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి ఎం.కాళిందిని సత్కరించారు. సీ్త్రనిధి నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్కు ప్రశంసలు దక్కగా, జిల్లాస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రాంతీయ నిర్వాహకుడు ఆర్.దుర్గాప్రసాద్కు అత్యున్నత పురస్కారం ప్రదానం చేశారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష మార్గదర్శకత్వంలో సీ్త్రనిధి విశేష ఫలితాలు సాధించి రాష్ట్రస్థాయి గుర్తింపు పొందిందని అధికారులు వెల్లడించారు. -
ఎల్లమ్మతల్లి ఆలయాల్లో చోరీలు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం రాంపల్లి, మారెడుగొండ గ్రామాల్లోని ఎల్లమ్మతల్లి ఆలయాల్లో శనివారం తెల్లవారు జామున చోరీలు జరిగాయి. అమ్మవారి విగ్రహంపై ఆభరణాలు, హుండీలు ఎత్తుకెళ్లారు. ఆలయ ప్రధాన గేటుకు వేసిన తాళాలను పగుల గొట్టి లోనికి చొరబడ్డారు. రాంపల్లి గ్రామంలో ఇటీవలే ఆలయాన్ని నిర్మించుకున్నారు. మారెడుగొండ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిందితుడు గేటుకు వేసిన తాళం పగులగొట్టి లోనికి వెళ్లే దృశ్యాలు రికార్డయ్యాయని స్థానికులు తెలిపారు. ఈ విషయమై తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని రూరల్ ఎస్సై మల్లేశ్ తెలిపారు. హామీలు అమలు చేయాలి గోదావరిఖని: తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమ వేదిక డిప్యూటీ చైర్మన్ తోడేటి శంకర్గౌడ్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొడ్డు రవీందర్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారెంటీలలో భాగంగా ఉద్యమకారులకు కూడా అనేక హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఏఒక్క హామీ అమలు చేయలేదని విమర్శించారు. ప్రతీ ఉద్యమకారునికి గుర్తింపు కార్డులు, 250 చదరపు గజాల ఇంటి జాగ, ఇల్లు కట్టుకోడానికి రూ.10 లక్షలు ఆర్థిక సాయం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్టులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మోసం చేసిందని ధ్వజమెత్తారు. సమావేవంలో నాయకులు రాగం శీను, పొన్నం విజయ్గౌడ్, గంగారపు శాంత, లక్ష్మి, అనుముల కళావతి, తోడేటి స్వరూప తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ డబ్బుల కోసం వచ్చి మృత్యువాతసిరిసిల్ల అర్బన్: పెన్షన్ తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్తున్న క్రమంలో వాహనం రూపంలో మృత్యువు ఆ వృద్ధురాలిని కానరాని లోకాలకు తీసుకెళ్లిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దబోనాలకు చెందిన దానవేని నర్సవ్వ(80) పెన్షన్ డబ్బులు తీసుకునేందుకు స్థానిక బైపాస్రోడ్డు పక్కన ఉన్న బ్యాంకుకు వెళ్లింది. పెన్షన్ తీసుకొని ఇంటికొస్తుండగా కామారెడ్డి నుంచి వేములవాడ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది. కాలు విరిగి దూరంలో ఎగిరిపడింది. మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి నర్సవ్వ రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బైపాస్ రోడ్డు వెంట గాలించడంతో మృతిచెంది కనిపించింది. నర్సవ్వకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘చెత్త’ మున్సి‘పల్టీ’
పెద్దపల్లిరూరల్: పట్టణంలో ఇంటింటికీ వెళ్లి సేకరించిన చెత్తను ఇలా సంచుల్లో నింపి ట్రాక్టర్లు, ట్రాలీల్లో డంపింగ్ యార్డుకు తరలిస్తుంటారు. ఆ సమయంలో చెత్తపై కనీసం పాలితిన్ కవర్ కూడా కప్పక పోవడంతో ఇలా.. జారి ఓ చెత్తసంచి రోడ్డుపై పడిపోయింది. గమనించిన స్థానికులు అరవడంతో పారిశుధ్య సిబ్బంది వాహనాన్ని పక్కకు నిలిపి వచ్చి ఆ సంచులను మోసుకెళ్లి మళ్లీ వాహనంలో వేసుకుని వెళ్లిపోయాడు. చెత్త తరలించేటప్పుడు కనీస జాగ్రత్తలు పాటించడం లేదని, ఫలితంగా చెత్త గాలికి కింద పడుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. ట్రాక్టర్పై కవర్ కప్పకుండానే తరలిస్తున్న చెత్త ట్రాక్టర్ పైనుంచి జారిపడ్డ చెత్త సంచి కిందపడ్డ చెత్త సంచులు తీసుకొస్తున్న కార్మికుడు -
నాసిరకం ఆహారం.. నిషేధిత ప్లాస్టిక్ వినియోగం
● మూడు దుకాణాలకు బల్దియా జరిమానా కోల్సిటీ(రామగుండం): నాణ్యతలేని వస్తువులతో ఆహార పదార్థాలు తయారు చేయడంతోపాటు నిషేధిత ప్లాస్టిక్ వినియోగిస్తున్న మూడు వ్యాపార సంస్థలకు రామగుండం బల్దియా జరిమానా విధించింది. మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ ఆదేశాల మేరకు శనివారం ప్రజారోగ్య విభాగం అధికారులు లక్ష్మీనగర్ ప్రాంతంలోని పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లీలా బార్ అండ్ రెస్టారెంట్లో నాసిరకం పదార్థాలతో వంటలు తయారు చేస్తున్నట్లు గుర్తించి రూ.5,000 జరిమానా విధించారు. అలాగే నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు ఉపయోగిస్తున్న వైష్ణవి స్వీట్స్ అండ్ బేకరీ సెంటర్కు రూ.3,000, లిమ్రా ఫ్రూట్ జ్యూస్ సెంటర్కు రూ.3,000 చొప్పున జరిమానా విధించారు. ఈ తనిఖీల్లో శానిటరీ ఇన్స్పెక్టర్లు నాగభూషణం, సంపత్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ మధూకర్, జూనియర్ అసిస్టెంట్ చంద్రారెడ్డి, జవాన్లు దయానంద్, అశోక్ పాల్గొన్నారు. రైతులకు రాజన్న కోడెలు వేములవాడఅర్బన్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సన్న, చిన్నకారు రైతులకు వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించిన గోశాల కోడెలు ఉచితంగా పంపిణీ చేస్తామని కలెక్టర్ గరీమా అగ్రవాల్ శనివారం తెలిపారు. తిప్పాపూర్లోని గోశాలలో 300 కోడెలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఏప్రిల్ 7న రైతులకు పంపిణీ చేస్తామని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రైతులు కోడెలను పొందేందుకు అర్హులని స్పష్టం చేశారు. కోడెల కోసం 1.5 నుంచి 5 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న సన్న, చిన్నకారు రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచి ంచారు. వివిధ ధ్రువీకరణపత్రాలతో https://rajannasirici lla.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన రైతులకే జియో ట్యాగింగ్ కోడెలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కోడెలు తీసుకెళ్లే రైతులు వాటి సంరక్షణ బాధ్యతను సక్రమంగా చూసుకోవాలని సూచించారు. కో డెలు పక్కదారి పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టెన్త్ పరీక్షలు ప్రశాంతం పెద్దపల్లి: జిల్లావ్యాప్తంగా శనివారం పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖ అధికారి శారద తెలిపారు. గణితం పరీక్షకు 7,495 మంది విద్యార్థులకు 7486 మంది హాజరయ్యారని, 99.9శాతం హాజరు నమోదు అయ్యిందని వివరించారు. -
పైప్లైన్ లీకేజీలకు తక్షణ మరమ్మతు
కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరంలో తాగునీటి సరఫరా అంతరాయానికి కారణమవుతున్న పైప్లైన్ లీకేజీలపై బల్దియా యంత్రాంగం కదిలింది. మేయర్ మహంకాళి స్వామి స్వయంగా రంగంలోకి దిగారు. స్థానిక శారదానగర్ పీజీ కాలేజీ ఎదుట డిస్ట్రిబ్యూషన్ పైప్లైన్లలో ఏర్పడిన లీకేజీలకు చేపట్టిన మరమత్తులను మేయర్ శనివారం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ప్రశాంత్నగర్ నుంచి పవర్హౌస్కాలనీ వరకు నాలుగు డివిజన్లలో నీటి సరఫరా నిలిచిపోయింది. మరమ్మతుల్లో ఆలస్యం కాకుండా సాయంత్రంలోపే పూర్తిచేయాలని, ఆదివారం నుంచి తాగునీటి సరఫరా యథాతథంగా కొనసాగాలని మేయర్ సూచించారు. లీకేజీల సమస్య వస్తే 93924 83959 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు. వేసవి నేపథ్యంలో తాగునీటి వినియోగంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ఆయన కోరారు. ప్రతీ కనెక్షన్కు వాల్వ్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా నీటి నియంత్రణ సాధ్యమవుతుందని అన్నారు. పర్యవేక్షించిన రామగుండం మేయర్ స్వామి -
రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిటకిట
రామగుండం: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు శనివారం క్రయ, విక్రయదారులతో కిటకిటలాడాయి. మరో రెండురోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో ప్రభుత్వం పనివేళలు పొడిగించిన విషయం విదితమే. ఉదయం 9.30గంటల నుంచి రాత్రి 8.30గంటల వరకు కార్యాలయాలు పనిచేస్తున్నాయి. దీంతో చాలామంది స్లాట్ బుక్ చేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యా ప్తంగా 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. సాయంత్రం నాలుగు గంటల వరకు 401 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ పూర్తయ్యాయని, మరోవంద వరకు ఉన్నాయని పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటల వరకు నమోదైన రిజిస్ట్రేషన్లు కరీంనగర్ 27 గంగాధర 22 సిరిసిల్ల 58 పెద్దపల్లి 14 కరీంనగర్ రూరల్ 23 భీమదేవరపల్లి 21 మల్యాల 10 మంథని 7 సుల్తానాబాద్ 26 హుస్నాబాద్ 19 హుజూరాబాద్ 33 రామగుండం 21 మెట్పల్లి 21 వేములవాడ 38 జగిత్యాల 44 పెంచిన పనివేళలతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం -
హైరిస్క్ ప్రెగ్నెన్సీపై అప్రమత్తత అవసరం
పెద్దపల్లి: గర్భధారణ సమయంలో తల్లి, లేదా కడుపులోని శిశువుకు ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తే పరిస్థితిని ‘హైరిస్క్ ప్రెగ్నెన్సీ’గా పరిగణిస్తారని కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రి గైనకాలజిస్ట్ శ్రీనయన, క్రిటికల్ కేర్ నిపుణురాలు పల్లవి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. డయాబెటిస్, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, లివర్, కిడ్నీ సమస్యలు గర్భధారణ సమయంలో తీవ్రమయ్యే ప్రమాదం ఉందని, గర్భధారణతో వచ్చే థైరాయిడ్ సమస్యలు, శిశువు బలహీనత, గర్భసంచి బలహీనత వంటి అంశాలు కూడా హైరిస్క్ కేటగిరీలోకి వస్తాయని చెప్పారు. గతంలో ఎక్కువ శస్త్రచికిత్సలు చేయించుకున్న మహిళలు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. హైరిస్క్ గర్భిణులు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ, ప్రతి దశలో స్కానింగ్లు చేయించుకోవడం ద్వారా తల్లి, శిశువు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. మెడికవర్ లాంటి మల్టీస్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఇలాంటి వాటికి సమగ్ర వైద్య సేవలు లభించడం వల్ల క్లిష్ట పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనవచ్చని వివరించారు. మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, బొంగోని హరీశ్, సంజీవ్ పాల్గొన్నారు. -
సురక్షితంగా చేరుకోవాలి
గోదావరిఖని: ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ గమ్యస్థానాన్ని సురక్షితంగా చేరుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. ట్రాఫిక్ నిబంధనలపై స్థానిక మున్సిపల్ చౌరస్తా వద్ద శనివారం ప్రయాణికులకు అవగాహన కల్పించారు. డీసీపీ రాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీపీ మా ట్లాడుతూ, వాహనదారులు తప్పనిసరిగా సీటుబెల్ట్ ధరించాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 70 శాతం సీటు బెల్ట్ ధరించకనే చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్, వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, రామగుండం ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు, పోలీస్ అధికారులు రమేశ్, అనూష, మనోహర్, హరీశ్శేఖర్, రామరాజు సిబ్బంది పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026
కట్టుదిట్టంగా హాస్టళ్ల నిర్వహణ ● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి: జిల్లాలోని సంక్షేమ హాస్టళ్ల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. హాస్టల్ వార్డెన్లతో శనివారం కలెక్టరేట్లో ఆయన సమీక్షించారు. భోజనం చేసే సమయం, సాయంత్రం స్టడీ అవర్స్లో వార్డెన్లు అందుబాటులో ఉండాలన్నారు. బడ్జెట్ను ఈనెలాఖరులోగా వినియోగించుకోవాలని తెలిపారు. అధికారులు రంగారెడ్డి, రవీందర్ పాల్గొన్నారు. సాక్షి పెద్దపల్లి: గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రజలు చెల్లించే పన్నులే ప్రధాన ఆదాయ వనరు. ఆస్తిపన్ను, భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతులు, నల్లా చార్జీలు, ట్రేడ్లైసెన్స్, అద్దెలు తదితర రూపాల్లో స్థానిక సంస్థలకు ఆదాయం సమకూరుతుంది. వీటిలో ఆస్తిపన్నుదే ప్రధాన వాటా. అయితే 2025–26 ఆర్థిక సంవత్సరం మరోమూడు రోజుల్లో ముగియనుండగా.. ఆస్తిపన్ను వసూలు అంతంత మాత్రంగానే నమోదవుతోంది. జిల్లాలోని గ్రామ పంచాయతీల కన్నా బల్దియాలు వెనుకబడడం గమనార్హం. జిల్లాలో రామగుండం కార్పొరేషన్తోపాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలు ఉన్నాయి. -
ఎన్హెచ్ఎం జేఏసీ ఆవిర్భావం
కోల్సిటీ: జిల్లాలోని నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) ఉద్యోగులు ఐక్యంగా ముందుకు వచ్చి తమహక్కుల సాధనకు జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేసుకు న్నారు. గోదావరిఖనిలోని రాజ స్తాన్ భవన్లో శనివారం నిర్వహించిన సమావేశంలో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్హెచ్ఎం జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా సీహెచ్ మహేందర్, ప్రధాన కార్యదర్శిగా బి.మణికేశ్వర్రెడ్డి, కోశాధికారిగా ఎ న్.పారిజాతం, కార్యనిర్వహణ అ ధ్యక్షురాలిగా స్కైలాబ్రాణి, ఉపాధ్యక్షుడిగా రామకృష్ణను ఎన్నుకున్నారు. నాయకులు మాట్లాడుతూ, జేఏసీ ఏర్పాటుతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల ఐక్యతకు కొత్త బలం చేకూరుతుందన్నారు. -
గురి తప్పని బాణం
● ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ టోర్నీలో స్వర్ణం, రజతం సాధించిన చికిత కరీంనగర్స్పోర్ట్స్/ఎలిగేడు: పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన యువ ఆర్చర్ తానిపర్తి చికిత శుక్రవారం బ్యాంకాక్లో జరిగిన ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ టోర్నీ స్టేజ్–1లో బంగారు, రజత పతకాలు సాధించింది. మిక్స్డ్ టీమ్ విభాగంలో గోల్డ్ మెడల్, మహిళల టీమ్ విభాగంలో సిల్వర్ మెడల్ అందుకుంది. కాంపౌండ్ మిక్స్డ్ టీం విభాగంలో రజత్ చౌహాన్, తానిపర్తి చికిత జోడీ 158–156 పాయింట్ల తేడాతో మలేషియాపై విజయం సాధించి బంగారు పతకం కై వసం చేసుకున్నారు. కాంపౌండ్ మహిళల టీం విభాగంలో తానిపర్తి చికిత, రాజ్ కౌర్, తేజల్ సాల్వేలతో కూడిన జట్టు ఫైనల్లో కజకిస్థాన్పై 227–229 తేడాతో తలపడి రజత పతకాన్ని సాధించారు. కార్పొరేటర్పై కేసు యైటింక్లయిన్కాలనీ: రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్కాలనీ 18వ డివిజన్ కార్పొ రేటర్ చక్రపాణిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు గోదావరిఖని టూటౌన్ పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి యైటింక్లయిన్కాలనీ భక్తాంజనేయ స్వామి దేవాలయం వద్ద బీఆర్ఎస్ నాయకులు గుడెల్లి రాంచందర్కు చక్రపాణికి మధ్య ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో గొడవ జరిగింది. ఈవిషయంలో రాంచందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు సీఐ ప్రసాద్రావు పేర్కొన్నారు. చెరువులోపడి వృద్ధురాలి మృతి కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన ఇనుగాల మధునమ్మ(80) చెరువులో పడి మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. మధునమ్మకు నలుగురు కుమారులు వివిధ కారణాలతో గతంలోనే మృతి చెందారు. మనుమల వద్ద ఆమె ఉంటోంది. వృద్ధాప్యంతోపాటు అనారోగ్య సమస్యలు తీవ్రం కావడంతో ఈనెల 26 నుంచి ఇంట్లోంచి బయటకు వెళ్లింది. శుక్రవారం స్థానిక నీలకంఠం చెరువులో మృతదేహం కనిపించింది. మృతిపై తమకు అనుమానం లేదని మృతురాలు మనుమడు రాకేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు. -
మ్యూల్ అకౌంట్లతో రూ.138 కోట్ల స్కాం
కరీంనగర్ క్రైం: అమాయకులకు డబ్బు ఆశచూపి వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరిపించారు. ఆ ఖాతాల ద్వారా విదేశాల్లోని సైబర్ నేరగాళ్లతో లావాదేవీలు జరిపారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.138 కోట్లు మ్యూల్ అకౌంట్లకు మళ్లించారు. కరీంనగర్లోని కిసాన్నగర్లో ఉన్న రత్నాకర్ బ్యాంకు లిమిటెడ్(ఆర్బీఎల్) కో ఆపరేటివ్ సొసైటీ ద్వారా ఆ కుంభంకోణం జరగగా.. కరెంట్ అకౌంట్లు పొంది సైబర్నేరాల్లో పాలుపంచుకున్న 13మందిని కరీంనగర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సీపీ గౌస్ ఆలం ఈ కేసులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలానికి చెందిన బండారి సాయిరాం(30) అమాయకులతో పాటు డబ్బు అవసరం ఉన్నవారితో నగరంలోని ఆర్బీఎల్ బ్యాంకులో కరెంటు ఖాతాలు తీయించాడు. ఇతనికి బ్యాంకు మేనేజర్ హన్మకొండకు చెందిన భువనగిరి కల్యాణ్(52), క్యాషియర్ నగరానికి చెందిన చెందిన ఆయేషా బేగం(30) సహకరించారు. బుగ్గారం మండలం గోపాల్పూర్కు చెందిన అనుమండ్ల రంజిత్(36), పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి చెందిన అలిగెటి మల్లేశం(37), జగిత్యాలకు చెందిన బోగ రాకేశ్(35), రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన బండి ప్రణయ్(25), పెద్దపల్లి జిల్లా ధర్మారానికి చెందిన విభూది రాంకుమార్(37), జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్కు చెందిన నాతర్ల శ్రీనివాస్(39), జగిత్యాలకు చెందిన కల్లెడ మహేందర్(36), కొండ్ర నరహరి(37), కల్లెడ రాజేశ్(27), వరంగల్కు చెందిన కర్రె రాజు(35)లకు సంబంధించిన మ్యూల్ అకౌంట్ల ద్వారా రూ.138 కోట్ల లావాదేవీలు విదేశాల్లోని సైబర్ నేరగాళ్లతో జరిపినట్లు ఆపరేషన్ క్రాక్డౌన్ ద్వారా పోలీసులు గుర్తించారు. బండారి సాయిరాం కీలకంగా వ్యవహరిస్తూ.. సదరు ఖాతాదారులకు కమీషన్లు అందించినట్లు గుర్తించారు. ఈ కేసు లో మొత్తం 24 మంది ఉన్నట్లు గుర్తించి, పై 13మందిని అరెస్టు చేశారు. కేసును ఛేదించిన కరీంనగర్ టౌన్ ఏ సీపీ వెంటకస్వామి, సీఐలు తిరుమ ల్, సృజన్రెడ్డి, రాంచందర్రా వు, సరిలాల్ను సీపీ అభినందించారు. కమీషన్లకు ఆశపడి సైబర్ నేరగాళ్లకు సాయం ఆపరేషన్ క్రాక్డౌన్ ద్వారా గుట్టు రట్టు 13 మందిని అరెస్టు చేసిన కరీంనగర్ పోలీసులు వివరాలు వెల్లడించిన సీపీ గౌస్ ఆలం -
కొండగట్టుకు శునకం పాదయాత్ర
వారు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్కు చెందిన హనుమాన్ దీక్షాపరులు. మాల విరమణ చేసేందుకు కొండగట్టుకు బయలుదేరారు. దారిలో ఓ శునకం ఎదురుపడగా దానికి ఓ బిస్కట్ ఇచ్చారు. దీంతో ఆ శునకం దీక్షాపరులతో పాటు కొండగట్టు వరకు పాదయాత్ర చేసింది. పాదయాత్ర చేస్తున్న శునకానికి కాళ్లనొప్పులు రావడంతో సాక్స్లు సైతం తొడిగారు. ఐదురోజులుగా పాదయాత్ర చేస్తుందని, వెళ్లగొట్టినా పోవడం లేదని, సుమారు 130 కి.మీ దూరం తమతో నడిచి వచ్చిందని దీక్షాపరులు తెలిపారు. శుక్రవారం కొండగట్టుకు చేరుకున్నామని పేర్కొన్నారు. – జగిత్యాల -
కుక్కల దాడిలో చిన్నారికి గాయాలు
కోల్సిటీ: రామగుండం నగరంలో వరుసగా వీధికుక్కల దాడులు చోటుచేసుకుంటున్నాయి. గోదావరిఖని లక్ష్మీనగర్లోని వ్యాపార కూడళ్లల్లో రోడ్లపై సంచరిస్తూ ప్రజలను తరుముతున్నాయి. తాజాగా బోళ్లబజార్లో గురువారం ఓ చిన్నారిపై రెండు వీధికుక్కలు దాడి చేసి గాయపరిచాయి. కుటుంబ సభ్యులు, స్థానికులు స్థానిక జీజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీధికుక్కల దాడులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రోదిస్తున్నబాలిక, కుక్కకాటు -
వైభవం.. రాములోరి కల్యాణం
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్/ఓదెల/మంథని: ఆకాశమంత పందిళ్లు.. రంగురంగుల విద్యుత్ దీపాలు.. మామిడి తోరణాలు.. అనేకరకాల పూలదండలు.. అందంగా అలంకరించిన వేదికలు.. అశేష భక్తజనం.. వెరసి శ్రీసీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరిపించారు. జిల్లా కేంద్రం పెద్దపల్లితోపాటు గోదావరిఖని, మంథని, సుల్తానాబాద్తోపాటు వివిధ మండల కేంద్రాలు, గ్రామాల్లో రాములోరి పరిణయ వేడుకలు శుక్రవారం కన్నులపండువగా సాగాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్తోపాటు పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు విజయరమణారావు, ఎంఎస్ రాజ్ఠాకూర్ సతీసమేతంగా హాజరై ప్రత్యేక పూజలుచేశారు. వేదపండితులు మంత్రోచ్ఛారణలతో స్వామివారల వివాహం వైభవంగా జరిపించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. -
నీరులేదు.. నీడ కరువు
ఎండలు మండుతున్నాయి. తాగునీరు లభించడంలేదు. కనీసం నిలువ నీడకూడా లేక ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీకావు. పెద్దపల్లి జిల్లాగా అవతరించాక ప్రధాన కూడళ్లలో రిక్వెస్ట్ బస్స్టాప్లు ఏర్పాటు చేసినా షెల్టర్లు నిర్మించలేదు. ప్రయాణికులు బస్సుల కోసం ఎండలోనే గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. అయ్యప్పగుడి చౌరస్తా, కూనారం చౌరస్తా, కమాన్ చౌరస్తా, కోర్టు చౌరస్తా, రంగంపల్లి వరకు ఎక్కడా బస్షెల్టర్ లేదు. తాగునీటి వసతి గగనంగా మారింది. అధికారులు స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
ఆకట్టుకున్న శోభాయాత్ర
పెద్దపల్లి హిందూ వాహినితోపాటు పలు హిందూ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి రాములోరి శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. శ్రీరామసీతాసమేత లక్ష్మణమూర్తి హనుమ విగ్రహాలతో పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు. మినీ ట్యాంక్ బండ్, జెండాకూడలి, శివాలయం చౌరస్తా, అయ్యప్పగుడి నుంచి బస్టాండ్ వరకు యాత్ర కొనసాగింది. దారి పొడవునా మహిళలు నృత్యాలు చేస్తూ, కోలాటాలు ఆడారు. దీక్షాపరులు, చిన్నారులు సీతారామలక్ష్మణ హనుమ వేషాధరణలతో సందడి చేస్తూ ముందుకు సాగారు. కోల్కతా నుంచి వచ్చిన బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హిందూవాహిని పెద్దలతోపాటు లింగేశ్వర పీఠాధిపతి బాలయోగి కృష్ణ మహరాజ్ పాల్గొనగా, ఆదిబట్ల కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు, సినీనటి కల్యాణి ప్రత్యేక ఆకర్షణగా నలిచారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
11 కేవీతో 30 ఏళ్ల సమస్య పరిష్కారం
ధర్మపురి: ముప్పైఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న పట్టణ ప్రజల సమస్యకు 11 కేవీ విద్యుత్ లైన్తో పరిష్కారం లభించిందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ధర్మపురిలో నూతనంగా ఏర్పాటు చేసిన 11 కేవీ విద్యుత్ లైన్ను శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. శ్రీరాములపల్లె నుంచి ధర్మపురి వరకు రోడ్డు పక్కనున్న ఇళ్ల మీదుగా 11 కేవీ లైన్ పోవడంతో చాలా ప్రమాదాలు జరిగాయని, బాధిత కుటుంబాలకు ఇచ్చిన మాట ప్రకారం సమస్యను పరిష్కరించామని వివరించారు. ధర్మపురిలో బస్డిపో ఏర్పాటుకు కృషి చేస్తున్నామని అన్నారు. అలాగే నియోజకవర్గంలో విద్యుత్ షాక్తో మృతిచెందిన గేదెలకు నష్ట పరిహారం కింద ఐదుగురు రైతుల కుటుంబాలకు రూ.1.67 లక్షల విలువ గల చెక్కులను మంత్రి అందజేశారు. మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, వైస్ చైర్మన్ రామన్న, ఏఎంసీ చైర్మన్ చిలుముల లావణ్య, నాయకులు ఎస్.దినేశ్, వేముల రాజు, ట్రాన్స్కో ఎస్ఈ సుదర్శనం, కౌన్సిలర్లు తదితరులున్నారు. శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలిపెగడపల్లి(ధర్మపురి): ప్రతి ఒక్కరూ శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కమార్ అన్నారు. మండలంలోని అయితిపల్లి, ఎల్లాపూర్ రామాలయాల్లో శుక్రవారం జరిగిన శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొని పూజలు చేశారు. రాత్రి నంచర్లలో జరిగిన స్వామివారి కల్యాణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయడం జరుగుతుందన్నారు. అలాగే ప్రజలపై రాముని ఆశీస్సులు ఉండి అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు అంజమ్మ, రాజేశం, రమణాకర్, మాజీ జెడ్పీటీసీ రాజేందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
పెంచడమా.. తగ్గించడమా?
గోదావరిఖని: వాట్ నెక్ట్స్? బొగ్గు ఉత్పత్తి లక్ష్యం తగ్గించడమా? పెంచడమా? అనేదానిపై సింగరేణి యాజమాన్యం తర్జనభర్జన పడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి లక్ష్యం భారీగా తగ్గడంతో వార్షిక లక్ష్యంపై తీవ్రప్రభావం చూపుతోంది. ఈ నేపత్యంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలా ముందుకెళ్లాలనే ఆలోచనతో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సింగరేణి సీఎండీ.. అధికారులతో అధ్యయనం చేస్తున్నారు. కొత్తగనులు లేక.. నిల్వలు తగ్గి.. కొత్త బొగ్గు గనులు రాకపోవడం, ఉన్న గనుల్లో బొగ్గు నిల్వలు అడుగంటి పోవడంతో వచ్చే ఏడాదిలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం ఎలా? అనేదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో 60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలనే లక్ష్యం నిర్దేశించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల లక్ష్యం కాగా.. గడువులోగా 60 మిలియన్ టన్నుల కన్నా ఎక్కువగా ఉత్పత్తి చేయడం సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది. ఇప్పటివరకు కేవలం 56.75 మిలయన్ టన్నులే సాధించి 81 శాతం నమోదు చేయడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అన్నిఏరియాల్లోని కార్మికులు మరోనాలుగు రోజులపాటు శ్రమిస్తే 60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధిస్తారని అంచనా వేస్తున్నారు. అయితే వాస్తవ టార్గెట్ 72 మిలియన్ టన్నులు చేరుకోవడం గగనమే అంటున్నారు. లాభాలు సాధించడం కష్టమే.. ఈసారి సింగరేణి లాభాలు భారీగా ఆర్జించడం కష్టమేనని అధికార వర్గాలు నిర్మొహమాటంగా చెబుతున్నాయి. వాస్తవానికి ఈఏడాది భారీగా బొగ్గు ఉత్పత్తి సాధించినా.. గత లోటు పూడ్చేందుకు.. ఉత్పత్తి చేసిన బొగ్గులోంచి కోత విధించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈఎఫెక్ట్ ఈఏడాది బొగ్గు ఉత్పత్తిపై చూపుతోంది. బొగ్గు ఉత్పత్తి రానప్పుడు లాభాలు, లాభాల వాటా ఎలా వస్తుందని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈక్రమంలో ఈఆర్థిక సంవత్సరంలో లాభాల వాటా విషయంలో కార్మికులకు నిరాశమిగులుతుందని అంటున్నారు. -
కార్మికుల తలపై భస్మాసుర హస్తం
గోదావరిఖని: కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు వస్తుందని, నెలకు మూడు మెడికల్ బోర్డులు నిర్వహిస్తామని కార్మికులను మభ్యపెట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు కార్మికుల నెత్తిపై భస్మాసుర హస్తం పెట్టిందని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు 13వేల మందిని ఉద్యోగాల్లో తీసుకున్నారని, దీనిలో అవకతవకలు జరగాయని పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన నియామకాలు 1,900మంది మాత్రమేనని పేర్కొన్నారు. రెండేళ్లుగా విజిలెన్స్, ఏసీబీ పేరుతో అనారోగ్యంతో ఉన్న ఉద్యోగులను మెడికల్ బోర్డుకు పిలవకుండా నిలిపివేసే ప్రయత్నం చేస్తోందన్నారు. 2వేల మంది కార్మికులు మెడికల్ బోర్డు కోసం వేచిచూస్తున్నారన్నారు. సింగరేణి కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన కోరారు. ఈనెల 28న గనులు, డిపార్ట్మెంట్లపై నల్లబ్యాడ్జీలతో నిరసన, 30న అన్ని జీఎం కార్యాలయాల ఎదుట నిరసన, ఆ తర్వాత సింగరేణి, ప్రజాభవన్ ముట్టడి చేపడతామని ఆయన వివరించారు. -
సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడొద్దు
రామగిరి: సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడొ ద్దని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అసిస్టెంట్ సైంటి స్ట్ కనకజ్యోతి సూచించారు. పన్నూర్లోని మంథని జేఎన్టీయూలో ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్తో కలిసి బుధవారం సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పించారు. కనకజ్యోతి మాట్లాడుతూ, సింగిల్ యూస్ ప్లాస్టిక్తో పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణం, వన్యప్రాణులు, నీటివనరులకు ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. వీటికి బదులు బట్ట సంచులు, మళ్లీ ఉపయోగించే సీసాలు, జీవ విచ్ఛిన్నమయ్యే పదార్థాల వంటి సుస్థిర పద్ధతులు అవలంబిచాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరిపాలనాధికారి సుమన్రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ ● ప్రమాదానికి కారణమైన ఇద్దరికి జైలు పెద్దపల్లిరూరల్: మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్ర మాదాలకు కారకులైన వారికి జైలుశిక్ష, జరిమానా వి ధిస్తూ సెకండ్ క్లాస్ ఇన్చార్జి జడ్జి మంజుల బుధవారం తీ ర్పునిచ్చారని ట్రాఫిక్ సీఐ అనిల్కుమార్ తెలిపారు. జి ల్లా కేంద్రంలోనిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ప ట్టుబడ్డ 39 మందిని కోర్టులో హాజరుపర్చామన్నారు. వారిలో శాంతినగర్కు చెందిన నల్గొండ కోటేశ్వర్కు రెండు రోజులు, తమిళనాడు రాష్ట్రంలోని కరూర్కు చెందిన జగదీశ్కు మూడురోజుల శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని వి వరించారు. మిగతా 37మందికి రూ.36,500 జరిమానా విధిస్తున్నట్లు తీర్పులో పేర్కొన్నారని సీఐ పేర్కొన్నారు. గురుకులాల్లో ప్రవేశాలు పెద్దపల్లి: టీజీ సెట్ –2026 ఫలితాలు విడుదలైన నేపథ్యంలో గురుకులాల్లో అర్హత గలవిద్యార్థులు ప్రవేశాలు పొందాలని బీసీ గురుకులాల జిల్లా కో ఆర్డినేటర్ మణిదీప్తి తెలిపారు.https://tgcet.cgg.gov.in వెబ్సైట్లో ఫలితాలు చూసుకుని, ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ విద్యార్థులు ప్రవేశా లు పొందాలన్నారు. -
ఆయుష్.. పనితీరు భేష్
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గల ఆయుష్లో యునాని, హోమియోపతి, ఆయుర్వేదిక్ వైద్యసేవలు మెరుగ్గా అందిస్తున్నారు. వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నా.. జిల్లా లోని పలు ఆస్పత్రుల నుంచి ఆయుర్వేదిక్ వైద్యం కోసం ముగ్గురు వైద్యులు, యునాని, హోమి యోపతి వైద్యం కోసం ఒక్కోవైద్యుడిని డిప్యూటేషన్పై నియమించారు. దీంతో పెద్దపల్లి ఆయుష్ ఆస్పత్రిలో వైద్య సేవలు నిరంతరం అందుతాయనే నమ్మకం పేషెంట్లలో పెరిగింది. ఫలితంగా జిల్లాలోని మండలాలు, గ్రామాల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా పేషెంట్లు పెద్ద సంఖ్యలో పెద్దపల్లికి వైద్యం కోసం వస్తున్నారు. రోజూ 200 మందికి సేవలు ఆయుష్ ఆస్పత్రికి వచ్చే పేషెంట్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇక్కడ యునాని, ఆయుర్వేదిక్, హోమియోపతి సేవల కోసం ప్రతీనిత్యం సుమారు 200 మంది వరకు వస్తున్నారు. తమ వ్యాధి (బీపీ, షుగర్, కీళ్లనొప్పులు, గుండె, కిడ్నీ తదితర వ్యాధులు) నయం చేసుకునేందుకు వచ్చే పేషెంట్లకు అవసరమైన వైద్యపరీక్షలను ఇదే ఆవరణలోని టీహబ్ ద్వారా ఉచితంగానే చేయిస్తున్నారు. జబ్బు ఎలాంటిదైనా సరే.. వైద్యం అందిస్తుండడంతో పేషెంట్లకు నమ్మకం పెరుగుతోంది. కలెక్టర్ ప్రత్యేక చొరవ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయుష్ ఆస్పత్రులకు దాదాపు ఏడాదిగా మందుల సరఫరా అరకొరగానే ఉంది. దీంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్న వారికి అవసరమైన మందులను అందించలేకపోయారు. ఈ విషయాన్ని ఆయుష్ ఆస్పత్రి ఇన్చార్జి డాక్టర్ మారుతి.. ఇటీవల కలెక్టర్ కోయ శ్రీహర్ష దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ వెంటనే ఆస్పత్రిని సందర్శించి వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. అవసరమైన మందులను కేంద్ర ప్రభుత్వమే తయారు చేసే ఉత్తరాఖండ్ నుంచి తెప్పించేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలోని ఏ ఆస్పత్రిలో మందులు లేకున్నా.. పెద్దపల్లి ఆయుష్ కేంద్రంలో మందులను అందుబాటులో ఉంచుతూ మెరుగైన వైద్యం అందించేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు డెప్యుటేషన్పై వైద్యుల నియమాకం ప్రత్యేక చొరవ చూపుతున్న కలెక్టర్ శ్రీహర్ష -
కరీంనగర్లో సినీనటి మెహరిన్ సందడి
కరీంనగర్: కరీంనగర్లో ప్రముఖ సినీనటి మెహరిన్ బుధవారం సందడి చేశారు. సుభాష్నగర్లో నూతనంగా ఏర్పాటైన డాల్ఫిన్ హాస్పిటల్స్ను ప్రారంభించారు. డాల్ఫిన్ హాస్పిటల్స్ ఫర్ ఉమెన్ – చిల్డ్రెన్ సంస్థను కరీంనగర్తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక, నాణ్యమైన, అందుబాటు ధరల్లో వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసినట్లు హాస్పిటల్ యాజమాన్యం తెలిపారు. డాల్ఫిన్ హాస్పిటల్స్ ఫర్ ఉమెన్, చిల్డ్రెన్ ప్రారంభం -
పశువులకు మేతగా టమాట
పెద్దపల్లిరూరల్: మార్కెట్లో టమాట ధరలు పడిపోయాయి. రిటెయిల్గా కిలో రూ.5 దరతోనే విక్రయిస్తున్నారు. హోల్సేల్ ధరలు మరింత తగ్గిపోయాయి. వాటిని తోటలోంచి ఏరితే కూలీల ధర కూడా గిట్టుబాటు కావడంలేదని రైతులు వాపోతున్నారు. మార్కెట్లోనూ అమ్మకాలు అంతంత మాత్రంగానే సాగుతుండడంతో బుధవారం టమాటలు పశువులకు మేతగా పోశారు. 28న డాక్టర్ పోస్టుల భర్తీ పెద్దపల్లి: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల పోస్టుల భర్తీ కోసం ఈనెల ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు. గైనకాలజీ, ఆప్తామాలజీ, రేడియాలజీ, ఆర్థో, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్(ఎంబీబీఎస్) పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తామన్నారు. ఆసక్తి, అర్హతగలవారు బయోడేటాతోపాటు విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్లతో హాజరు కావాలన్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టుకు నెలకు రూ.లక్ష, సివిల్ అసిస్టెంట్ సర్జన్కు రూ.52,351 వేతనం చెల్లిస్తారని, వివరాలకు 84990 61999, 94924 57809 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. క్వింటాల్ పత్తి రూ.7,368 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో బుధవారం పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.7,368 ధర పలికిందని మార్కెట్ కమిటీ చైర్మన్ కూర మల్లారెడ్డి, కార్యదర్శి ప్రవీణ్రెడ్డి తెలిపారు. కనిష్టంగా రూ.5,428గా, సగటు రూ.6,929గా ధర ఉందని వారు వివరించారు. రైతు తాము పండించిన పత్తిని నేరుగా మార్కెట్కు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. -
మంచి మందులు ఇచ్చారు
కీళ్ల నొప్పులతో బాధ పడుతూ ఆయుష్ ఆస్పత్రికి వచ్చా. వైద్యులు పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. రోగం నయమైంది. అవసరమైన అన్నిరకాల పరీక్షలను కూడా ఇక్కడి టీహబ్లోనే చేయించారు. ఆస్పత్రికి వస్తే అన్ని వసతులు ఉండడంతో పాటుమందులు కూడా అందిస్తున్నారు. – నిర్మల, సుల్తానాబాద్ సేవలందిస్తున్నాం జిల్లాలోని మండలాలు, గ్రామాల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా పేషెంట్లు వస్తున్నారు. మందుల కొరతను అధిగమించేందుకు కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అవసరమైన అన్నిరకాల మందులను తెప్పించి అందుబాటులో ఉంచారు. పేషెంట్లకు అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ మారుతి, ఆయుష్ ఆస్పత్రి ఇన్చార్జి -
పాముకాటుతో వృద్ధురాలి మృతి
ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధ ర్మారం మండలం పైడిచింతల పల్లి పంచాయతీ శివారులోని గురుపల్లికి చెందిన నాంపెల్లి ల స్మమ్మ(78) బుధవారం పాముకాటుతో మరణించినట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. తన ఇంటి ఎదుట చింతపండు ఆరబెట్టి అక్కడే నిద్రకు ఉపక్రమించింది. ఈ సమయంలోనే విషపాము కుడిచేతిపై కాటు వేసింది. మెలకువ వచ్చిన వృద్ధురాలు కేకలు వేసింది. స్థానికులు వెంటనే పెద్దపల్లి, అక్కడ నుంచి కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. మృతురాలి కూతురు నీరజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. -
రెస్టారెంట్లో ఆకస్మిక తనిఖీలు
గోదావరిఖని: నగరంలోని హైకింగ్ బార్ అండ్ రెస్టారెంట్లో బుధవారం ఆకస్మికంగా తనిఖీలు చేశామని ఫుడ్ ఇన్స్పెక్టర్ అరవింద్రెడ్డి తెలిపారు. వంటగది, పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు, పిండి పదార్థాల్లో బొద్దింకలు ఉండడాన్ని అధికారులు గుర్తించారు. 35 కిలోల గోధుమపిండి, 10 కిలోల మైదాపిండిని పారబోయిచారు. నిల్వఉంచిన మాంసం, గడువు ముగిసిన పెరుగు, తందూరి చికెన్, పచ్చి చికెన్ స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశామన్నారు. నిల్వ ఉంచిన సలాడ్లను నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని గుర్తించి పారబోశామన్నారు. ఆహార తయారీలో ఉపయోగిస్తున్న సింథటిక్ ఫుడ్ కలర్స్ను(ఆహార రంగులు) గుర్తించి వాటిని తొలగించాలని నిర్వాహకులకు సూచించామని అన్నారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం లైసెన్సింగ్ నిబంధనలు (2011) ఉల్లంఘించినందుకు రెస్టారెంట్ యజమానులపై కేసు నమోదు చేయనున్నట్లు వివరించారు. -
కారుణ్య నియామకాలు ఎత్తివేసే కుట్ర
గోదావరిఖని: సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి కారుణ్య నియామకాలు ఎత్తివేసే కుట్ర చేస్తున్నాయని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. స్థానిక ప్రెస్క్లబ్లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి చంద్రబాబు వారసత్వం కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం గోల్డెన్ హ్యాండ్షేక్ పేరిట పదివేల మంది ఉద్యోగులను విధుల్లోంచి తొలగించిందని గుర్తుచేశారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు 13 వేల మందిని ఉద్యోగాల్లో తీసుకున్నారని, ఇందులో అవకతవకలు జరగాయనడం హాస్యాస్పదమన్నారు. సంస్థలో చోటుచేసుకుంటున్నఅవినీతి, అక్రమాలు, కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాలు, నిధుల దుర్వినియోగంపై పోరాటాలకు కార్మికులు సిద్ధం కావాలని కోరారు. టీబీజీకేఏస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్రెడ్డి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమరయ్య, కోశాధికారి చెల్పూరి సతీశ్, నాయకులు పానుగంటి సత్తయ్య, పోలాడి శ్రీనివాసరావు, చల్లా రవీందర్రెడ్డి, వాసర్ల జోసఫ్, జనగామ మల్లేశ్, పల్లె సురేందర్, పులిపాక సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
ఆటోడ్రైవర్లు ఉత్తమ పౌరులు
రామగుండం: స్థానిక రైల్వేస్టేషన్ ఏరియా ఆ టోడ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, ఒంటరి మహిళలు, ప్రయాణికులను భద్రంగా గ మ్యస్థానాలకు చేర్చడం ద్వారా ఉత్తమ పౌరు లుగా గుర్తింపు తెచ్చుకున్నారని పెద్దపల్లి డీసీపీ రామ్రెడ్డి ప్రశంసించారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్తో కలిసి స్థానిక రైల్వేస్టేషన్ ప్రాంతంలో బుధవారం అరైవ్.. అలైన్ నిర్వహించారు. డీసీ పీ మాట్లాడుతూ, ఆటోడ్రైవర్లపై ఇప్పటివరకు ఒక్క ఫిర్యాదు కూడా రాకపోవడం వారి ప్రవర్తనకు నిదర్శనమన్నారు. సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై సంధ్యారాణి, జీఆర్పీ ఇన్చార్జి తిరుపతి, ఆర్పీఎఫ్ ఎస్సై లింగయ్య పాల్గొన్నారు. ఏప్రిల్లో సమ్మర్ స్పెషల్ రైలు రామగుండం: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షి ణ మధ్య రైల్వే వచ్చే ఏప్రిల్లో హైదరాబాద్ – గోరఖ్పూర్ మధ్య ప్రత్యేక రైలు సౌకర్యం కల్పిస్తోంది. హైదరాబాద్ దక్కన్ నాంపల్లి–గోరఖ్పూర్ (07075) వైపు ఏప్రిల్ 3, 10, 17, 24వ తేదీల్లో, గోరఖ్పూర్ – హైదనాబా ద్(07076) వైపు ఏప్రిల్ 5, 12, 19, 26వ తే దీల్లో ప్రత్యేక రైలు రాకపోకలు సాగించనుంది. సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాలలో హాల్టింగ్ ఉంది. మరోవైపు.. ఓఖా – మధురై మధ్య గతంలో వారాంతపు పద్ధతిన రాకపోకలు సాగించిన మధురై( 19559/60) రైలును రెగ్యులర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా మార్చినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తామని పేర్కొంది. ఇది అకోలా, పూర్ణా, నాందేడ్, నిజామా బాద్, కామారెడ్డి, కాచిగూడ, మహబూబ్నగర్, కర్నూల్ సిటీ, ద్రోణాచలం, గుత్తి, కడప, ఎర్రగుంట్ల మార్గంలో రాకపోకలు సాగించ నుంది. ఇదే రూట్లో రామేశ్వరం–ఓఖా రైలు ఉండడంతో మరో రూట్ నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం నుంచి నడిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఆస్పత్రిలోకి వెళ్లేదెలా? పెద్దపల్లిరూరల్: జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల నుంచి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యసేవలు పొందేందుకు వచ్చే పేషెంట్లు లోనికి వెళ్లడానికి అష్టకష్టాలు పడుతున్నారు. గేట్ ఎదుటనే అడ్డందిడ్డంగా ఆటోలు నిలిపి ఉంచుతున్నారు. రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని ప్రజలు వాపోతున్నారు. పోలీసులు, ఆస్పత్రి నిర్వాహకులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హుండీ ఆదాయం రూ.6లక్షలు కమాన్పూర్(మంథని): స్థానిక శ్రీఆదివరాహస్వామి హుండీ ఆదాయం రూ.6.01 లక్షలు సమకూరినట్లు ఈవో కాంతరెడ్డి తెలిపారు. ఆర్నెల్లలో భక్తులు కానుకలుగా హుండీలో వేసి న సొమ్మును బుధవారం లెక్కించామన్నారు. సర్పంచ్ రంగు సత్యనారాయణగౌడ్, ఉప సర్పంచ్ రఫీక్ సోహెల్, దేవాదాయ, ధర్మాదా య ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, అర్చకుడు రామానుజలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
యూపీఐ లంచం!
కరీంనగర్ అర్బన్ ఎకై ్సజ్ సీఐ గుండెటి రాము వేములవాడలో పనిచేస్తున్న సమయంలో బెల్లం వ్యాపారి వద్ద రెండేళ్లపాటు తన మిత్రుడైన ఉపాధ్యాయుడు జక్కని వేణు ద్వారా యూపీఐ పేమెంట్లతో లంచం తీసుకున్నాడు. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు వెళ్లగా ఈనెల 18న రాము ఇంట్లో సోదాలు చేయగా.. రూ.20 లక్షల నగదు లభ్యమైంది. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్క్రైం: సాంకేతిక విప్లవం ప్రజల జీవన విధానాన్ని వేగవంతం చేయడంతో పాటు అవినీతి అధికారులకు అనుకూలంగా మారుతోంది. ఒకప్పుడు కవర్లలో, బ్యాగుల్లో దూరే నగదు, బళ్ల కింద నుంచి వెళ్లే లంచాలు ఇప్పుడు ‘స్కాన్ అండ్ పే’ రూపంలో అకౌంట్లలో చెలామణి అవుతున్నాయి. ‘నగదు దొరికితేనే కేసు’ అనే పాత భావన నుంచి తప్పించుకోవడానికి అధికారులు డిజిటల్ మార్గాలను ఎంచుకుంటున్నారు. అలాంటి మార్గాలపై నిఘా పెట్టిన అవినీతి నిరోధకశాఖ అధికారులు ఇటీవల ఉమ్మడి జిల్లాలో వరుసదాడులు చేపడుతున్నారు. యూపీఐ ద్వారా లంచం తీసుకున్న అధికారులను ఆధారాలతో సహా పట్టుకుని కటకటాలు లెక్కపెట్టిస్తున్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం కల్లెడలో తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని దొంగలు సోమవారం రాత్రి చోరీకి పాల్ప డ్డారు. గ్రామానికి చెందిన గాండ్ల తిరుపతి ఇంటికి తాళం వేసి ఉపాధి నిమిత్తం ముంబయ్ వెళ్లాడు. దొంగలు చొరబడి పావుతులం బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి నగలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. ఆర్టీసీకే ఎలక్ట్రిక్ బస్సులివ్వాలి గోదావరిఖనిటౌన్: ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ బాధ్యతలను ఆర్టీసీకి అప్పగించి బలోపేతం చేయాలనే డిమాండ్తో స్థానిక డిపో ఎదుట మంగళవారం ధర్నా చేశారు. ఐఎఫ్టీయూ, సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి, నరేశ్ మాట్లాడారు. ఆర్టీసీలో కార్మిక సంఘాలను అనుమతిస్తామని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి విస్మరించిందన్నారు. విద్యుత్ బస్సుల నిర్వహణలో ఆర్టీసీకి ప్రాధాన్యం లేకుండా చేసి దేశీయ, అంతర్జాతీయ ప్రైవేట్ పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చే పద్ధతులను వ్యతిరేకిస్తున్నామన్నారు. దీంతోపాటు విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన పేరుతో ఆర్టీసీలకు ఉన్న భూములను ప్రవేట్ సంస్థలకు అప్పజెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. నాయకులు నరహరిరావు, కృష్ణ, మల్లయ్య, రాజేశం, కొమురయ్య, ప్రేమ్కుమార్తోపాటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు పి.రంగన్న, మద్దెల శ్రీను, టి.శ్రీను, ఏబీ స్వామి, డీఆర్ స్వామి, జి.శ్రీను, సామెల్, చంద్రయ్య, ప్రసాద్, కె.రవి, రాజయ్య, రాజు, భిక్షపతి, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. పోక్సో కేసులో ఒకరి అరెస్ట్ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలకేంద్రానికి చెందిన పుట్టకొక్కుల రంజిత్ను పోక్సో కేసులో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సిరిసిల్ల డీఏస్పీ నాగేంద్రచారి తెలిపిన వివరాలు.. రంజిత్ కొన్నినెలలుగా రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తున్నాడు. ఓ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి బలవంతంగా అనుభవించాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై రాహుల్రెడ్డి కేసు నమోదు చేశారు. డీఏస్పీ నాగేంద్రచారి కేసు దర్యాప్తు చేశారు. రంజిత్ను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. అట్రాసిటీ కేసు నమోదు జమ్మికుంట: కులంపేరుతో దూషించిన ఇద్దరిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ రామకృష్ణ మంగళవారం తెలిపారు. పట్టణంలోని గణేశ్నగర్కు చెందిన చంద్రమౌళి ఇంటి స్థలం ఎదుట ఇసుక పోయించిన నూరి రామకృష్ణ, మేడిపల్లి సదానందంను ప్రశ్నించాడు. దీంతో వారు కులంపేరుతో దూషించి, దాడికి యత్నించారు. భాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
విద్యుత్ షాక్తో మేకల కాపరి మృతి
సైదాపూర్: విద్యుత్ షాక్తో మేకల కాపరి, రెండు మేకలు మృతి చెందిన ఘటన సైదాపూర్ మండలం సర్వాయిపేటలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారంగా సర్వాయిపేటకు చెందిన బొల్లి సమ్మయ్య(49) ఆకునూర్ శివారులో మేకలు మేపుతున్నాడు. హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్కు చెందిన ఓ రైతు కోతుల బెడద తప్పించుకునేందుకు వరి చేను చుట్టూ కరెంట్ షాక్ పెట్టాడు. మేకలు మేపుతూ అటువైపుగా వెళ్లిన బొల్లి సమ్మయ్యకు రెండు మేకలకు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. హుజూరాబాద్ రూరల్ సీఐ పులి వెంకట్, సైదాపూర్ ఎస్సై స్వాతి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతునికి భార్య సరవ్వ, కుమారుడు ఉన్నారు. సీఎంకప్లో తృతీయ స్థానంకరీంనగర్: సీఎం కప్–2025లో రాష్ట్రస్థాయిలో కరీంనగర్ జిల్లా తృతీయస్థానం సాధించింది. హైదరా బాద్ ఎల్బీ స్టేడియంలో మంగళవారం జరిగిన ముగింపు వేడుకల్లో క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహ రి, షట్లర్ సైనా నెహ్వల్ చేతుల మీదుగా డీవైఎస్వో శ్రీనివాస్ ట్రోఫీ అందుకున్నారు. ఆదిలాబాద్ ప్రథమ, రంగారెడ్డి ద్వితీయ స్థానంలో నిలవగా కరీంనగర్ 79.4పాయింట్లతో తృతీయ స్థానం సాధించింది. కలెక్టర్ చిత్రామిశ్రా, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్ధన్రెడ్డి, తుమ్మల రమేశ్రెడ్డి, నాగిరెడ్డి సిద్ధారెడ్డి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. పేకాట ఆడుతూ పట్టుబడిన ఏఎస్సైపై వేటు?మెట్పల్లి: పేకాట ఆడుతూ పట్టుబడిన మెట్పల్లి ఏఎస్సై సత్యనారాయణను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు తెలిసింది. పట్టణంలోని రాంనగర్లో శనివారం రాత్రి ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు అక్కడకు వెళ్లి దాడి చేశారు. అందులో పట్టుబడిన పలువురిలో ఏఎస్సై సత్యనారాయణ ఉన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. కొన్ని నెలల్లో ఉద్యోగ విరమణ చేసే సత్యనారాయణ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది. -
తండ్రి పేరిట ఉన్న నగదు దేశ రక్షణ నిధికి జమ
రామగుండం: ఓ రిటైర్డ్ హెచ్ఎం తండ్రి పేరిట ఉన్న నగదును దేశ రక్షణ నిధికి జమ చేసి దేశంపై ఉన్న అభిమానాన్ని చాటారు. ఆంధ్రప్రదేశ్లోని నూజివీడుకు చెందిన కోట వెంకటశివశాస్త్రి రామగుండం హైస్కూల్లో సుదీర్ఘకాలం హెచ్ఎంగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు. తన తండ్రి ప్రఖ్యాత హరికథా భాగవతార్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట సచ్చిదానందశాస్త్రి వయోభారంతో 2024 సెప్టెంబర్లో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో తన తండ్రి పేరిట ఉన్న రూ.లక్ష నగదును సోమవారం భగత్సింగ్ వర్ధంతిని పురస్కరించుకొని నూజివీడు ఎస్బీఐ బ్యాంకులో దేశ రక్షణ నిధి అకౌంట్ నంబర్కు డిపాజిట్ చేశారు. ఈ విషయమై సదరు రిటైర్డ్ హెచ్ఎం తన పూర్వ విద్యార్థుల వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశారు. రిటైర్డ్ హెచ్ఎంకు పూర్వ విద్యార్థులు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. రిటైర్డ్ హెచ్ఎం నిర్ణయంపై హర్షం -
ఘనంగా ‘సాక్షి’ వార్షికోత్సవం
ఎలిగేడు: పెద్దపల్లి జిల్లా ఎలిగేడులోని శ్రీకోదండ రామాలయంలో మంగళశారం సాక్షి దినపత్రిక 18వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ‘సాక్షి’ పాఠకులు, అభిమానుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. సర్పంచ్ కప్పల ప్రవీణ్ మాట్లాడుతూ, నిజాలను నిర్భయంగా రాస్తూ, నిత్యం ప్రజల పక్షాన నిలుస్తూ లక్షలాది మంది పాఠకుల ఆదరణ పొంది ఉన్నతస్థాయిలో నిలిచిందన్నారు. అనంతరం స్థానిక రిపోర్టర్ రంగు తిరుపతిని సన్మానించారు. సాక్షి యాజమాన్యానికి, రిపోర్టర్లకు, సిబ్బందికి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ సర్పంచులు మండిగ రాయనర్సయ్య, బాసంపల్లి కొండయ్య, బూర్ల వెంకటసత్యం, మాజీ ఎంపీటీసీ గొల్లే భూమేశ్, ఆర్యవైశ్య సంఘం మండల ప్రధాన కార్యదర్శి తాటిపల్లి సతీశ్బాబు, అంబేడ్కర్ సంఘం నాయకుడు కవ్వంపల్లి చంద్రయ్య, వివిధ సంఘాల నాయకులు బుర్ర అజయ్, బుర్ర గణేశ్, మహేందర్, రాకేశ్, రాంరెడ్డితోపాటు ‘సాక్షి’ పాఠకులు, అభిమానులు పాల్గొన్నారు. -
ప్రజాసమస్యలు చర్చకు వచ్చేనా?
కోల్సిటీ(రామగుండం): రామగుండం బల్దియా కార్యాలయంలో బుధవారం బడ్జెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈసందర్భంగా తొలిజనరల్ బాడీ సమావేశం కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈమేరకు మంగళవారం కౌన్సిల్హాల్ను సిబ్బంది శుభ్రం చేశారు. బడ్జెట్ రూ.248కోట్లు.. నగర అభివృద్ధి కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.248కోట్ల 66లక్షల 51వేలతో బడ్జెట్ రూపొందించారు. అయితే, ప్రజాసమస్యలపై కార్పొరేటర్లు చర్చిస్తారా? చప్పట్లు కొట్టి అజెండా అంశాలకు ఆమోదం తెలుపుతారా? అనేది ఆశక్తిగా మారింది. అజెండీలో 8 అంశాలు పాలకర్గం ఏర్పడిన తర్వాత మేయర్ మహంకాళి స్వామి అధ్యక్షతన తొలి సమావేశం నిర్వహిస్తారు. ఇందుకోసం నాలుగు రోజుల క్రితమే కార్పొరేటర్లకు బడ్జెట్ అజెండాతోపాటు ఎనిమిది అంశాలతో కూడిన కాపీలను అందజేశారు. కార్మికులకు అందని వేతనాలు బల్దియాలోని సుమారు 125 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు ఈనెల 24వ తేదీ వరకు జీతాలు అందలేదు. మరో ఐదురోజుల్లో రెండోనెల వేతనాలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతీనెల 5వ తేదీన్నే చెల్లిస్తున్న అధికారులు ఈసారి నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలున్నాయి. మరోవైపు.. ఈఈ ఎస్ఎల్ ద్వారా ఏడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు పనిచేసిన అవుట్సోర్సింగ్ ఎలక్ట్రీషియన్లకు ఉద్యోగ భద్రత లేక మానసిక ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఎలక్ట్రికల్ విభాగంలోని ఆరుగురు ఎలక్ట్రీషియన్లకు నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. నేడు రామగుండం బల్దియా బడ్జెట్ సమావేశం -
జాగ్రత్తలు తప్పనిసరి
ఒంటిపూట బడి..పెద్దపల్లి: ఎండల తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రప్రభుత్వం పాఠశాలలను ఈనెల 16 నుంచి ఒక్కపూటే నడిపిస్తోంది. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాతే విద్యార్థులను ఇంటికి పంపిస్తోంది. మధ్యాహ్నం తర్వాత బడిలేకపోవడంతో పిల్లలు ఆడుకునేందుకు బయటకు వెళ్తున్నారు. ఇలా అనేకమంది ఆటాపాటల్లో మునిగితేలుతున్నారు. ఇలాంటి ఆనంద సమయాల్లో విషాదాలు పొంచి ఉంటాయని తల్లిదండ్రులను గ్రహించాలి. పిల్లలపై శ్రద్ధ తీసుకోవాలి ఒంటిపూట బడిసమయంలోనూ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులపై మరింత శ్రద్ధ తీసుకోవాలి. పాఠశాలలో స్వచ్ఛమైన తాగునీటి వసతితోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రాథమిక చికిత్స కిట్లు అందుబాటులో ఉండేలా చూడాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశించారు. తరగతి గదుల్లో ఫ్యాన్లు తిరిగేటట్లు శ్రద్ధ వహించాలి. మధ్యాహ్న భోజనం నీడ కింద కూర్చుని తినేలా ఏర్పాట్లు చేయాలి. ఎండలో ఆటలాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బావులు, చెరువుల వద్దకు వెళ్లకుండా.. పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, ఉపాధిహామీలో మట్టి తీసిన గుంతల్లో ప్రస్తుతం నీరు నిల్వఉంది. విద్యార్థులు అటువైపు వెళ్లకుండా చూసుకోవాలి. బావుల్లో సరదా కోసం ఈత నేర్చుకునేందుకు వెళ్లిన పిల్లలు మునిగిపోయిన విషాద ఘటనలు ఏటా పదుల సంఖ్యలో ఉంటున్నాయి. డ్రైవింగ్ మోజులో.. ద్విచక్ర వాహనాలు, సైకిళ్లపై మోజుతో కొందరు విద్యార్థులు ఇళ్లలో చెప్పకుండా రోడ్డెక్కితే ప్రమాదాల బారిన పడే ఆస్కారం అధికంగా ఉంది. బడి వదలగానే కొందరు పిల్లలు సమయం దొరికిందని ఎండలో ఆడతారు. దీంతో వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇంట్లో ఖాళీగా వీడియో గేమ్స్, టీవీ, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. దృష్టిలోపాలతో పాటు మానసిక బలహీనులుగా మారే అవకాశం ఉంది. వీటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రులు సరదాగా సమయం కేటాయించి వారితో ఉంటూ ఆటలు ఆడిపించాలి. జాగ్రత్తలు అవసరం ఉదయాన్నే కచ్చితంగా అల్పాహారం పెట్టి పాఠశాలలకు పంపించాలి. నీళ్లసీసా వెంట ఉంచాలి. ఉదయం 7.30 గంటల్లోపు బడికి పంపించేందుకు శ్రద్ధ తీసుకోవాలి. మధ్యాహ్న భోజనం 12.30 గంటలకు వడ్డిస్తారు. దూరప్రాంతాల విద్యార్థులు ఎండలో నడిచి వెళ్లకుండా ఆటోలు తదితర వాహనాలు ఏర్పాటు చేసుకోవాలి.పిల్లలు మధ్యాహ్నం బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండేలా తల్లిదండ్రులు చూసుకోవాలి. ఎండలు ఎక్కువైన కొద్దీ పిల్లలు ఆహారం తీసుకునేందుకు మారాం చేసే అవకాశముంది. వీరికి ఇష్టమైన ద్రవ పదార్థాలు, పండ్లరసాలు ఎక్కువగా తీసుకునేలా చొరవ తీసుకోవాలి. – డాక్టర్ ఉదయ్ కుమార్, పీహెచ్సీ, గర్రెపల్లి పిల్లలను కంట కనిపెట్టాల్సిందే.. ఆడుకుంటూ వెళ్లి ప్రమాదాల బారిన పడే అవకాశం ఆటలపై దృష్టి సారించేలా చూస్తే బెటర్ -
‘పారాక్వాట్’ను నిషేధించాలి
కరీంనగర్: అత్యంత విషపూరితమైన పారాక్వాట్ గడ్డిమందును నిషేధించాలని రాష్ట్రస్థాయి వైద్య నిపుణులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలో ని ఐఎంఏ భవనంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.కిషన్ మా ట్లాడుతూ.. పారాక్వాట్కు కచ్చితమైన విరుగుడు లే కపోవడం అత్యంత ప్రమాదకరమన్నారు. స్వల్ప పరి మాణంలో సేవించినా ప్రాణాపాయం తప్పదని, ఆసుపత్రికి చేరినా చికిత్స అందించడం కష్టమని పేర్కొన్నారు. దీనికి ప్రత్యామ్నాయ మందులను రైతులకు అందుబా టులోకి తేవాలని సూచించారు. బీఎన్.రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గడ్డిమందు నిషేధంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం అన్నారు. డాక్టర్ పి.రంగారెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయంలో సులభత కోసం వాడుతున్న ఈ రసాయనం ప్రాణాంతకమైందని, రైతుల భద్రత దృష్ట్యా దీని వినియోగాన్ని నియంత్రించా లన్నారు. తానా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అరుణ్ కటారి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంట్లో ఈ మందు అందుబాటులో ఉండటం వల్ల క్షణికావేశంలో సేవించి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోందన్నా రు. బీఎన్.రావు మాట్లాడుతూ ఈ మందు ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతిని శ్వాస తీసుకోవడం కష్టమవుతుందని వివరించారు. ప్రభుత్వం దీనిపై కట్టుదిట్టమైన నియంత్రణలు అమలు చేయాలని, సురక్షిత ప్రత్యామ్నాయాలపై రైతులకు అవగాహన కల్పించాలని వైద్యులు కోరారు. ఐఎంఏ జిల్లా అధ్యక్షురాలు ఆకుల శైలజ, ప్రధాన కార్యదర్శి మహేశ్ బాబు, ట్రెజరర్ నీలిమా, అలీం, కాంగ్రెస్ డాక్టర్ వింగ్ చైర్మన్ వెంకటేశ్వర్లు, వైద్యులు శ్రీధర్, కిరణ్, రాంచందర్ పాల్గొన్నారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు పి.కిషన్ -
భారతావనికి ఎన్టీపీసీ వెలుగులు
గోదావరిఖని/జ్యోతినగర్: దక్షిణాదితోపాటు దేశవ్యాప్తంగా విద్యుత్ అందించడంలో పెద్దపల్లి జిల్లా రామగుండంలోని తెలంగాణ ప్రాజెక్టు అగ్రభాగాన నిలిచిందని ఆ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) చందన్ కుమార్ సామంత వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ టెంపరరీ టౌన్షిప్లో మంగళవారం ఏర్పాటు చేసిన జర్నలిస్టుల సమావేశంలో ఈడీ మాట్లాడారు. ప్రాజెక్టులోని 200 మెగావాట్ల రెండో యూనిట్, 500 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల రెండు యూనిట్లు(4వ, 6వ) వార్షిక మరమ్మత్తులు పూర్తిచేసుకుని విద్యుత్లోకి వచ్చాయని వెల్లడించారు. త్వరలోనే తెలంగాణ స్టేజ్–2కు రానుందని, తెలంగాణ ప్రభుత్వం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్(పీపీఏ) ప్రక్రియ వేగవంతం చేసిందన్నారు. వేసవిలో డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించామని అన్నారు. ప్రజెక్టులో బొగ్గు , ఇంధన నిల్వలు.. థర్మల్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు, ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ఈడీ సామంత అన్నారు. 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్, 10 మెగావాట్ల గ్రౌండ్ మౌంట్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు ఉత్పత్తిలో ఉండగా, ఈనెలలోనే 176 మెగావాట్ల (120 మెగావాట్లు గ్రౌండ్, 56 మెగావాట్లు ఫ్లోటింగ్) సోలార్ ప్రాజెక్టులు కమిషనింగ్కు సిద్ధమయ్యాయని తెలిపారు. గ్రిడ్ నుంచి ఫస్ట్ టైమ్ చార్జింగ్ కోసం ఎదురుచూస్తున్నట్లు వివరించారు. ఆర్థిక సంవత్సరంలో రామగుండం థర్మల్ ప్రాజెక్టు 13.4 బిలియన్ యూనిట్లు(86.3 శాతం), తెలంగాణ స్టేజ్–1 ప్రాజెక్టు 9.3 బిలియన్ మెగావాట్లు(91.4శాతం ) విద్యుత్ ఉత్పత్తి చేశాయని ప్రకటించారు. పారదర్శకత, ప్రజావిశ్వాసాన్ని పెంపొందించడంలో మీడియా కీలకపాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. పర్యావరణ హిత చర్యలు పటిష్టం విద్యుత్ ఉత్పత్తితోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఈడీ స్పష్టం చేశారు. తక్కువ కార్బన్ ఉద్గారాల దిశగా బ్యాటరీ స్టోరేజ్ యూనిట్, కార్బనేటెడ్ బ్రిక్స్ తయారీ ప్రాజెక్టులు చేపట్టినట్లు వెల్లడించారు. పర్యావరణ నిబంధనల అమలులో భాగంగా ఎఫ్జీడీ వ్యవస్థ తెలంగాణ ప్రాజెక్టులో అమల్లో ఉండగా, రామగుండంలో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎఫ్జీడీ ద్వారా 1.35 టన్నుల జిప్సం సేకరించామని పేర్కొన్నారు. సంస్థ ప్రభావిత, పునరావాస గ్రామాల్లో విద్య, వైద్యం, వసతుల కల్పనకు సామాజిక సేవా బాధ్యతా పథకం నిధులు రూ.7 కోట్ల నుంచి రూ.15 కోట్లకు పెంచామని వెల్లడించారు. జనరల్ మేనేజర్లు ముకుల్ రాయ్, మనీష్ అగర్వాల్, అభిజిత్ దత్తా, బినోయ్ జోస్, తెలంగాణ ప్రాజెక్టు హెచ్వోడీ డీఎస్ రావత్, ఏజీఎం బిజయ్కుమార్ సిగ్దర్, సీఎస్సార్ ప్రతినిధులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. సోలార్, థర్మల్ విద్యుత్ సామర్థ్యాల పెంపు వేసవి డిమాండ్కు ముందస్తు ఏర్పాట్లు సమృద్ధిగా బొగ్గు, ఇందన నిల్వలు రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు ఈడీ చందన్ కుమార్ సామంత -
‘ఆపరేషన్ యాత్రి సురక్షా’లో ప్రతిభ
రామగుండం: సికింద్రాబాద్ డివిజన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగంలో నిర్వహించే ‘ఆపరేషన్ యాత్రి సురక్షా’లో భాగంగా పలు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లలో ఆర్పీఎఫ్ సిబ్బంది ఆకస్మిక సోదాలు నిర్వహించడం పరిపాటి. ఈ సందర్భంగా అనుమానితులను గుర్తించి, చోరీకి గురైన సామగ్రిని స్వాధీనం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే రామగుండం రైల్వే భద్రత దళానికి చెందిన ఏఎస్ఐ మాసాని నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ ప్రదీప్కుమార్ నిర్వహించిన ఆపరేషన్ యాత్రి సురక్షాలో ఓ దొంగను గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించారు. ఈక్రమంలో పెద్దపల్లి, మంచిర్యాల రైల్వేస్టేషన్ల మధ్య నడిచే రైళ్లలో ప్రయాణికుల మొబైల్ ఫోన్లు 8 దొంగిలించినటు్ల్ ఆర్పీఎఫ్ సిబ్బంది వెల్లడించారు. వాటి విలువ సుమారు రూ.61వేల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఇందులో ప్రతిభ కనబరిచిన ఏఎస్ఐ నాగరాజు, హెచ్సీ ప్రదీప్కుమార్ను ఉత్తమ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు సికింద్రాబాద్ డివిజనల్ ఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ నరేంద్రకుమార్వర్మ ప్రకటించారు. ఈవిషయాన్ని రామగుండం సీఐ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఉద్యోగులను డివిజనల్ కమిషనర్ ఆలకుంట నవీన్కుమార్, రామగుండం ఆర్పీఎఫ్ ఎస్సై క్రాంతి తదితరులు అభినందించారు. ఈనెలలో రూ.61వేల విలువైన వస్తువుల రికవరీ ఉత్తమ సిబ్బందిగా గుర్తించిన రైల్వే అసిస్టెంట్ కమిషనర్ -
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె
పెద్దపల్లి: విద్యుత్ సంస్థలోని 23,667మంది ఆర్టిజన్లకు సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని ఆర్టిజన్స్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జేఏసీ చైర్మన్ తూళ్ల నాగరాజు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్క్లబ్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2016కు ముందు అన్నిఅర్హతలు ఉన్న వారందరినీ, ఆన్మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలన్నారు. అన్నివిభాగాల వారికి జీవో నంబర్11 ప్రకారం కనీస వేతన చట్టం, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు వర్తింపజేయాలన్నారు. లేనిపక్షంలో ఈనెల 26, 30వ తేదీల్లో డివిజన్ కార్యాలయాల వద్ద ధర్నా, ఏప్రిల్ 2న సర్కిల్ కార్యాలయాల ఎదుట వంటావార్పు చేస్తామని, ఏప్రిల్ 7న వరంగల్ డీసీఎల్ కార్యాలయం వద్ద మహాధర్నా చేస్తామని, అయినా స్పందించకుంటే ఏప్రిల్ 8న నిరవధిక సమ్మెకు వెళ్తామని స్పష్టం చేశారు. పాలకుర్తి మండలం బసంత్నగర్ధిలో పనిచేస్తున్న అర్టిజన్ గడ్డం జయదేవ్ను వేధిస్తున్న ఏఈపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు ఖలీమొద్దీన్, ఎం.కృష్ణారెడ్డి, ఎం.ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్టిజన్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా జేఏసీ నేత నాగరాజు -
కొత్తగా ఐదు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/సాక్షి, పెద్దపల్లి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొత్తగా ఐదు అసెంబ్లీ స్థానాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్, పెద్దపల్లి, రామగుండం, మంథని, రాజన్న సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియలో కొత్తగా సుల్తానాబాద్, కరీంనగర్ రూరల్, జగిత్యాల రూరల్, మెట్పల్లి, ఎల్లారెడ్డిపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. కొత్తవాటితో కలుపుకుంటే ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 17కు చేరనుంది. కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో కొత్త నియోజకవర్గాల ఏర్పాటు రాజకీయ సమీకరణాలను మార్చేస్తుందనే చర్చ సాగుతోంది. ఈ ప్రక్రియ ఎవరికి కలిసివస్తుంది? ఎవరికి తలనొప్పి తెస్తుందో’ అని ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. ప్రయోజనాలు ఏమిటి? మున్సిపల్, సమీప గ్రామాల ప్రజలకు ప్రత్యేక ప్రాతినిధ్యం లభించనుంది. అభివృద్ధి పనులు, నిధులు, స్థానిక సమస్యల పరిష్కారం వేగవంతమవుతుంది. జిల్లా మొత్తం సమాంతరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా రాజకీయ అవకాశాలు రాక ఎన్నికల్లో పోటీచేయలేని వారికి బరిలో నిలిచే అవకాశాలు పెరగనున్నాయి. 33 శాతం మహిళా రిజర్వేషన్తో.. కేంద్ర ప్రభుత్వం తాజాగా చేపట్టే జనాభా లెక్కలు –2026 ఆధారంగా.. మహిళా రిజర్వేషన్ కోటా నిర్ణయించనున్నారు. పాత శాసనసభా స్థానాలతోపాటు కొత్తగా ఏర్పడే అసెంబ్లీ స్థానాలతో కలిపి రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజవర్గాలు మొత్తం 179కు చేరనున్నాయి. ఇందులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తే 59 సీట్లు దక్కనున్నాయి. అప్పుడు ఉమ్మడిలోని 17స్థానాల్లో నాలుగు నుంచి ఐదు సీట్లు మహిళలకు దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే, మహిళలకు కేటాయించేవి ఏమిటి, మహి ళా ఓటర్లు ఎక్కడ అధికంగా ఉన్నారే అంశాలపై నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. ఎస్సీ రిజర్వేడ్ స్థానాలు ఏమిటో? ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చొప్పదండి, మానకొండూరు, ధర్మపురి నియోజకవర్గాలు ఎస్సీలకు కేటాయించారు. డీలిమిటేషన్ తర్వాత ఎస్సీలకు కేటాయించే స్థానాలపై ఎవరికి వారే జోరుగా లెక్కలేసుకుంటున్నారు.ప్రస్తుతం ఒక్కో నియోజకవర్గం రెండు, మూడు జిల్లాల్లో విస్తరించిఉంది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు జిల్లాలే ప్రాతిపదిక అని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టంలో స్పష్టంగా ఉంది. దీంతో జిల్లా యూనిట్గా దేశవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. అంటే.. జిల్లాలోని మండలాల ఆధారంగానే కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలకు సరిహద్దులు ఏర్పాటు చేయనున్నారు. ఉదాహరణకు.. సుల్తానాబాద్ మున్సిపల్, రూరల్తోపాటు సమీపంలోని ఎలిగేడు, కాల్వశ్రీరాంపూర్, ఓదెల మండలాలతో కలిపి సుల్తానాబాద్ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అలాగే రూరల్ ప్రాంతంతో కరీంనగర్ రూరల్, రాయిక ల్, సారంగాపూర్, బీర్పూర్ మండలాలతో జగి త్యాల రూరల్ నియోజకవర్గం, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేటతో ఎల్లారెడ్డిపేట నియోజకవర్గం, మెట్పల్లి నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నట్లు రాజకీ య విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
పెట్రోల్.. నోస్టాక్
కాల్వశ్రీరాంపూర్: మండల కేంద్రంలోని పెట్రో ల్ బంకుల్లో ‘నోస్టాక్’బోర్డులు దర్శనమిస్తున్నా యి. రెండు రోజులుగా పెట్రోల్ దొరకక వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. కొందరు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇరాన్ యుద్ధం ప్రభావం రా నున్న రోజుల్లో ఇంకెంత ఉంటుందోనని వాహనదారులు వాపోతున్నారు. వరికోతల సీజన్ ప్రారంభం కావడంతో హార్వెస్టర్లు ఎలా పనిచేస్తాయనే ఆందోళన రైతులను వెంటాడుతోంది. మరోవైపు.. ఆకాశంలో మేఘాలు కమ్ముకోవ డం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. -
గర్భిణులకు మెరుగైన వైద్యసేవలు
పెద్దపల్లి: ఎంసీహెచ్ ద్వారా గర్భిణులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మాతా శిశు సంరక్షణ కేంద్రం పనితీరుపై కలెక్టరేట్లో అధికారులతో మంగళవారం సమీక్షించా రు. ప్రసవం గడువు సమీపించిన గర్భిణుల వివరాలు ఈడీబీ రిజిష్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. ప్రసవం తర్వాత కూడా తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మంథని ఎంసీహెచ్ పనితీరు గతం కన్నా మెరుగైందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి ప్రమోద్ కుమార్, జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. సీఎస్సార్ నిధులు సద్వినియోగం చేసుకోవాలి సీఎస్సార్ నిధులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. సీఎస్సార్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి అధికారులతో సమీక్షించారు. సింగరేణి ద్వారా రామగుండంలో రూ.ఐదు కోట్లతో అభివృద్ధి పనులకు ప్రతిపాదించామన్నారు. ఎన్టీపీసీ యాష్ పాండ్ వద్ద ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలని ఆయన సూచించారు. భూ సమస్యల పరిష్కారానికి చర్యలు పాలకుర్తి: భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. స్లాట్ బుకింగ్ ప్రకారం రిజిస్ట్రేషన్లు సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. తహసీల్దార్ సునీత, అంగన్వాడీ కేంద్రం నిర్వాహకురాలు రజిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కులం పేరుతో దూషించిన వారిపై కేసు
చందుర్తి(వేములవాడ): సీతారామచంద్రస్వామి ఆలయ చైర్మన్ పదవి విషయంలో తలెత్తిన వివాదంలో కులం పేరుతో సర్పంచ్, ఉపసర్పంచ్తోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు చందుర్తి ఎస్సై జిల్లెల రమేశ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేటలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ చైర్మన్ పదవి విషయంలో అదే గ్రామానికి చెందిన తర్రె శేఖర్కు సర్పంచ్ నరేశ్, ఉపసర్పంచ్ ఆకుల ఎల్లయ్య, మరో వ్యక్తి సుంకి వేణులకు శనివారం రాత్రి వివాదం తలెత్తింది. ఈ వివాదంతో తర్రె శేఖర్ను సర్పంచ్ నరేశ్, ఉపసర్పంచ్ ఆకుల ఎల్లయ్య, సుంకి వేణు కులం పేరుతో దూషించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై సోమవారం వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు లింగంపేట ఆలయ ప్రాంగణంలో విచారణ చేపట్టారు. గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వేణులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయగా.. ఈ వివాదాన్ని ప్రోత్సహించిన డప్పుల అశోక్పై కేసు నమోదు చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ శ్రీరామనవమి వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. ఉత్సవాలను పాత ఆలయ కమిటీ పర్యవేక్షణలో చేసుకోవాలని, అల్లర్లు సృష్టించి, గొడవలకు దిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. లింగంపేటలో విచారించిన డీఎస్పీ శ్రీనివాసులు -
మార్కెట్ తరలింపు
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ప్రధాన కూరగాయల మార్కెట్ను కూల్చివేసి అదేస్థలంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన భవన సముదాయం నిర్మించే పనులు ప్రారంభం కానున్నాయి. వ్యాపారుల కోసం స్థానిక వ్యవసాయ మార్కెట్లో తాత్కాలికంగా స్థలం కేటాయించారు. దీనిని మున్సిపల్ చైర్మన్, కమిషనర్, అధికారులు సోమవారం పరిశీలించారు. తమకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని వ్యవసాయ మార్కెట్కమిటీ చైర్మన్ కూర మల్లారెడ్డి జిల్లా మార్కెటింగ్ అఽధికారి ప్రవీణ్రెడ్డిని కోరారు. ఇందుకోసం మార్కెట్యార్డులోని ఓ షెడ్డును, ఖాళీస్థలాన్ని పరిశీలించారు. కొత్త మార్కెట్ పనులు పూర్తయ్యే వరకూ కూరగాయల మార్కెట్ను తాత్కాలికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కమిషనర్ వెంకటేశ్ తెలిపారు. చిరువ్యాపారులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏఈ సతీశ్ తదితరులు ఉన్నారు. -
హద్దులు నిర్ణయించి.. ఆక్రమణలు ఆపండి
● గొర్రెలకాపరుల సంక్షేమ సంఘం నేతల డిమాండ్ ● కలెక్టరేట్ ఎదుట గొంగడితో కళాకారుల నిరసన పెద్దపల్లి: తమకు కేటాయించిన స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చూడాలని గొ ర్రెల కాపరుల సంక్షేమ సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమ వారం కలెక్టరేట్ ఎదుట గొంగడి ధరించి నిరసన తెలిపారు. గొర్రెలు, మేకల మార్కెట్ యార్డు స్థలాలకు హద్దులు నిర్ణయించలేదన్నారు. జిల్లా యంత్రాంగం హద్దులు నిర్ణయించి, ఆక్రమణలు ఆపాలాని కోరారు. తొలుత ఒగ్గు కళాకారుడు నర్ర సతీశ్ బృందం గొంగడితో ప్రదర్శన నిర్వహించారు. గొర్రెల కాపరుల సంక్షే మ సంఘం జిల్లా అధ్యక్షుడు సలేంద్ర రాములు యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్, ఉపాధ్యక్షుడు శిలారపు పర్వతాలు యాదవ్ మాట్లాడారు. ప్రతినిధులు తాత రాజుయాదవ్, మేకల్ నర్సయ్య యాదవ్, దాడి చంద్రమౌళి యాదవ్, వేల్పుల రామ్మూర్తి యాదవ్, తాత సదానందం, తమ్మిన వేణి కొమరయ్య, అట్లా లక్ష్మయ్య, నూనేటి సంపత్ యాదవ్, ఆవుల లత ఉన్నారు. -
ప్రజల సహకారంతో సుందరీకరణ
జ్యోతినగర్: రామగుండం నగర ప్రజల సహకారంతో సుందరీకరణ పనులు చేపడతామని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ఎన్టీపీసీ సింధూర కళాశాల రోడ్డు, ఎఫ్సీఐ క్రాస్రోడ్డు, రాజీవ్ రహదారి సర్వీసు రోడ్డులో కార్పొరేటర్లు వెంగల బాపు, కొలని కవితారెడ్డి, భూలక్ష్మి, స్వప్నప్రియ, ఎన్టీపీసీ ఏజీఎం బిజయ్కుమార్ సిగ్దర్తో కలిసి సోమవారం పర్యటించారు. స్వామి మాట్లాడు తూ, ఎన్టీపీసీ సోలార్ ప్రాజెక్టుకు నిర్మించిన ప్రహరీ ప్రమాదకరంగా ఉందన్నారు. ఓపెన్ డ్రైనేజీలో చెత్త పేరుకుపోయిందని, దానిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎఫ్సీఐ క్రాస్ రోడ్డులో కూల్చివేసిన సులభ్కాంప్లెక్స్ శిథిలాలను వెంటనే తొలగించి బస్షెల్టర్ను ప్రయాణికులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీకుకురావావాలని అన్నారు. త్వరలోనే ఎఫ్సీఐ క్రాస్ రోడ్డు సెంటర్ను విస్తరించి, సుందరీకరణ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్, అధికారులు, ఎన్టీపీసీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సీస్సార్ ప్రత్యేక నిధులు కేటాయించాలి రామగుండం మేయర్ మహంకాళి స్వామి -
ఏఐటీయూసీపై విమర్శలు సరికాదు
● యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్యగోదావరిఖని: కార్మిక వర్గ శ్రేయస్సు, హక్కుల సాధన కోసం పోరాటం చేస్తున్న ఏఐటీయూసీని విమర్శిస్తే ఊరుకోబోమని ఆ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరివి రాజ్కుమార్ హెచ్చరించారు. సోమవారం స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తమ ఉద్యమానికి సంఘీభావం తెలిపి కార్మికుల ఐక్యతను చాటాలని వారు కోరారు. సింగరేణిలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు, యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సేవ్ సింగరేణి పోరుజాత కార్యక్రమం ప్రారంభించామని అన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కారం చేయకుండా సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. అందుకే పోరుబాట ఎంచుకున్నామని వారు అన్నారు. దీనిపై ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్లు కార్మిక వర్గాన్ని బలహీన పర్చేలా విమర్శలు చేయడం సరికాదన్నారు. ఈనెల 30 వరకు జాతా కొనసాగుతుందని, చివరగా కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ఎదుట వంటావార్పు, ముట్టడితో కార్యక్రమం ముగుస్తుందని తెలిపారు. సమస్యలు పరిష్కరించకుంటే ఏప్రిల్లో సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, వీరభద్రం, ముస్కె సమ్మయ్య, సంకె అశోక్, రంగు శ్రీను, విజయలక్ష్మి, ఎంఏగౌస్ తదితరులు పాల్గొన్నారు. గనులపై గేట్ మీటింగ్లు సేవ్ సింగరేణి పోరుజాత కార్యక్రమంలో భాగంగా ఆర్జీ–1 ఏరియాలోని అన్ని గనులపై ఏఐటీయూసీ నాయకులు గేట్ మీటింగ్లు నిర్వహించారు. సంస్థ స్థితిగతులపై కార్మికులకు వివరించారు. పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు. -
ఆర్టీసీలో సమ్మె సైరన్
కరీంనగర్టౌన్: సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. రెండున్నరేళ్లుగా తమ వినతులను యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 26 తర్వాత సమ్మెకు దిగుతామంటూ ఇటీవల హైదరాబాద్లో ఎండీ వై.నాగిరెడ్డికి సమ్మె నోటీస్ అందజేయడంతో చాలా రోజుల తర్వాత ఆర్టీసీలో జంగ్ సైరన్ మోగనుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నాయకులు సమ్మె నోటీసు ఇవ్వడంతో కరీంనగర్ రీజినల్ పరిధిలోని 11 డిపోలలో ఉద్యోగులు, కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. 11 డిపోలు, 972 బస్సులు ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు కరీంనగర్ రీజినల్ పరిధిలో కరీంనగర్– 1, కరీంనగర్ 2, హుస్నాబాద్, హుజురాబాద్, మంథని, గోదావరిఖని, వేములవాడ, కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, సిరిసిల్ల డిపోలలో పని చేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు ఇతర సిబ్బంది మొత్తం 3,236 మంది సమ్మెలోకి వెళ్లనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. అవసరమైతే నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు చేపట్టి తమ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరిస్తేనే రవాణా సేవలు అంతరాయం లేకుండా కొనసాగుతాయని, లేకుంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వంలో విలీనానికి నోటీసు ఈనెల 26 తర్వాత ఏ క్షణమైనా సమ్మెకు సిద్ధం ఇటీవల జేఏసీ ఆధ్వర్యంలో ఎండీకి నోటీస్ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి. 2017 నుంచి అలవెన్స్, బెనిఫిట్స్, వేతన సవరణ బకాయిలు చెల్లించాలి. రిటైర్డ్ ఉద్యోగులకు 2017 వేతన సవరణ అమలు చేయడం, 2021 వేతన సవరణ 30 శాతం ఫిట్మెంట్ చేయడం. 2025 వేతన సవరణ అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలి. మహాలక్ష్మి పథకంలో జీరో టికెట్ బదులు మహిళలకు స్మార్ట్ కార్డు ఇవ్వాలి. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ప్రతినెలా కోత విధించకుండా రూ.400కోట్లు ఇవ్వాలి. పాత బకాయిలు రూ.2,500 కోట్లు చెల్లించాలి. అన్ని కేటగిరిల్లో ఖాళీలు భర్తీచేసి అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలి. ప్రతీ కార్మికుడికి 21 రోజుల హాజరుతో ఇన్సెంటివ్ ఇవ్వాలి. ఉద్యోగి కుటుంబానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్య సౌకర్యం కల్పించాలి. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి. రిటైర్డ్ కాబోతున్న ఉద్యోగులకు ఆదేరోజు సెటిల్మెంట్ మొత్తం చెల్లించాలి. -
రైలులో ప్రయాణికుడి హఠాన్మరణం
రామగుండం: కర్ణాటక రాష్ట్రంలోని యెలహంక నుంచి మధ్యప్రదేశ్లోని గ్వా లియర్కు వెళ్తు న్న ప్రయాణికుడు ధర్మేంద్రసింగ్ రాథోర్(42) సోమవారం అస్వస్థతతో హఠాన్మరణం చెందాడు. జీఆర్పీ ఔట్పోస్టు ఇన్చార్జి తిరుపతి కథనం ప్రకారం.. బెంగళూరులో టైల్స్ వర్క్ చేసే ధర్మేంద్రసింగ్రాథోర్ రైలు నంబరు 11085లో ఆదివారం సాయంత్రం గ్వాలియర్ వెళ్తున్న సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణం చేస్తున్నాడు. బోగినంబరరు ఎస్–4లో పడుకున్న ప్రయాణికుడిని సోమవారం ఉదయం టికెట్ పర్యవేక్షకుడు నిద్రలేపారు. ఎంతకీ లేకపోవడంతో సెంట్రల్కు మెసేజ్ ఇచ్చాడు. అప్పటికే రైలు కాజీపేట దాటింది. బల్హార్షా వరకు హాల్టింగ్లేదు. అత్యవసరంగా రామగుండం రైల్వేస్టేషన్లో నిలిపి రైల్వే డాక్టర్తో పరీక్షించారు. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్ ధ్రువీకరించడంతో మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆధార్కార్డు ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతికి గల కారణాలు పూర్తిగా తెలియరాలేదు. బాలుడిని కాటేసిన కరెంట్ ● మెట్లకింద ఆడుకుంటుండగా విద్యుదాఘాతం ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికెనపల్లి గ్రామానికి చెందిన బొజ్జ సంపత్ కుమారుడు బొజ్జ అభిరాం(6) సోమవారం సాయంత్రం ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురై మరణించినట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. ఇదే గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లిన అభిరాం.. సమీపంలోని బల్ల కుమార్ ఇంటి వద్ద అడుకుంటూ ఉన్నాడు. ఈక్రమంలో మెట్ల కిందికి వెళ్లగా అక్కడఉన్న కరెంట్ ఎర్త్వైర్కు ప్రమాదవశాత్తు తగిలాడు. దానితో కరెంట్ షాక్కు గురై అక్కడకక్కడే మరణించినట్లు మృతి తండ్రి సంపత్ ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసునమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. ప్రమాదఘటన చూసి.. భయంతో సొమ్మసిల్లి● మృతి చెందిన మహిళ రఘునాథపల్లి: హన్మకొండ–హైదరాబాద్ జాతీయ రహదారిలోని వెంకటాయపాలెం వద్ద సోమవారం జరిగిన ప్రమాద ఘటనను చూసిన ఓ మహిళ తీవ్ర భయాందోళన చెంది మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పందిళ్ల గ్రామానికి చెందిన ఇల్లందుల పుష్పలత (45) కుటుంబ సభ్యులతో కలిసి కారులో హైదరాబాద్కు బయలుదేరారు. వెంకటయాపాలెం వద్ద టాయ్లెట్ కోసం కారు నిలిపి పుష్పలత కిందకు దిగగా, అదే సమయంలో ఓ ద్విచక్రవాహనదారుడు ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ఘటనను చూసిన పుష్పలత సొమ్మసిల్లి పడిపోగా కుటుంబ సభ్యులు వెంటనే జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దూదిమెట్ల నరేశ్ తెలిపారు. త్వరలో క్యాథ్ల్యాబ్ సేవలు గోదావరిఖని: సింగరేణిలోనే తొలిసారి ఏర్పాటు చేస్తున్న క్యాథ్ ల్యాబ్ పనులపై ఆ సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్రాజ్కుమార్ సోమవారం సమావేశమయ్యారు. రెనే హాస్పిటల్, హాస్పిటల్ వెండర్స్ మధ్య సమావేశం నిర్వహించారు. పనులు యుద్ధ ప్రాతిపదిక పూర్తిచేసి త్వరగా ప్రారంభించాలని ఆయన సూచించారు. డాక్టర్లు బాలకోటయ్య, అంబికా, రాజేశ్వర్రావు, రమేశ్, రెనే హాస్పిటల్ చైర్మన్ బంగారి స్వామి, డాక్టర్లు పాల్గొన్నారు. -
అర్జీలపై నిర్లక్ష్యం వద్దు
మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2026పెద్దపల్లి: ప్రజావాణి ద్వారా అందిన అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అదనపు కలెక్టర్ వేణుతో కలిసి కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన ఎ.శ్యామల.. సర్వే నంబర్ 12/ఆ/2, 47ఆ/5లో తన భర్తకు భూమి ఉండేదని, ఆయన మరణించినందున ఆ భూమి తన పేరిట విరాసత్ చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకుంది. పెద్దపల్లి మండలం పెద్దకల్వలకు చెందిన నారసాని వెంకటేశ్.. గ్రామంలో తనకు మీసేవ కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు. పకడ్బందీగా ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై అ దనపు కలెక్టర్ వేణుతో కలిసి కలెక్టరేట్లో ఆయన సమీక్షించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది కదలికలపై ని ఘా ఉంచాలన్నారు. పెండింగ్ ఫైళ్ల పరిష్కారంలో పురో గతి లేదన్నారు. ప్రొటోకాల్ ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యేల క న్నా ప్రభుత్వ విప్ ముందువరుసలో ఉంటారని, ఈ విషయంపై అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రూ. 25.77 కోట్లతో చేపట్టిన 398 సీసీ రోడ్లు తదితర అభివృద్ధి పనులను ఈనెల 28వరకు పూర్తిచేయాలని చెప్పారు. అనంతరం పలు విభాగాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో ప్రమోద్కుమార్, డీఆర్డీవో కాళిందిని, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, కలెక్టరేట్ ఏవో ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం ఈ యాసంగిలో 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై సమీ క్షించారు. కూనారం రైల్వే ఫ్లైఓవర్ భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఆర్డీవో గంగయ్య, ఆర్ అండ్ బీ ఈఈ భావ్సింగ్, తహసిల్దార్ రాజ్కుమా ర్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ పాల్గొన్నారు. దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు ప్రజావాణి ద్వారా అర్జీల స్వీకరణ -
యుద్ధాన్ని ఆపేందుకు చర్చించండి
కరీంనగర్టౌన్: ఒక దేశంపై మరో దేశం దాడులు చేయకుండా జరగాలంటే అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరగాలని.. ఇందుకు ఐక్యరాజ్యసమితి, దేశ ప్రధాని నరేంద్రమోదీ చొరవ తీసుకోవాలని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కోరారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డిభవన్లో సోమవారం నిర్వహించిన సీపీఐ జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయేల్ దేశాలు చేస్తున్న యుద్ధంతో చమురు, గ్యాస్ కొరత ఏర్పడుతుందన్నారు. ఈక్రమంలోనే వంటగ్యాస్ను బ్లాక్ మార్కెట్కు తరలించి కొరత సృష్టిస్తున్నారన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ప్రధాని మోదీ సంప్రదింపులు చేయాలని కోరారు. పార్లమెంటు సమావేశాల్లో అత్యధిక రోజులు పాల్గొన్నానని గొప్పలు చెప్పుకునే ప్రధాని మోదీ దేశప్రజల ప్రయోజనాల కోసం ఏం చేశౠరో చెప్పాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థలు నిర్వీర్యం అయ్యాయని, కార్పొరేట్ సంస్థలు బాగుపడ్డాయని విమర్శించారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఏప్రిల్లో ఇంటింటికీ సీపీఐ నినాదంతో ప్రజల వద్దకు వెళ్లనున్నట్లు తెలిపారు. జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు టేకుమల్ల సమ్మయ్య, పొనగంటి కేదారి, అందె స్వామి, కొయ్యడ సృజన్కుమార్, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, కసిరెడ్డి సురేందర్రెడ్డి, బత్తుల బాబు, టేకుమల్ల సమ్మయ్య, నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి, పిట్టల సమ్మయ్య న్యాలపట్ల రాజు పాల్గొన్నారు. సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి -
వాగేశ్వరి కళాశాలకు ఎన్బీఏ గుర్తింపు
తిమ్మాపూర్(మానకొండూర్): మండలంలోని రామకృష్ణకాలనీలో గల వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాలకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ గుర్తింపు లభించినట్లు కళాశాల జనరల్ సెక్రెటరీ గండ్ర శ్రీనివాస్రెడ్డి సోమవారం తెలిపారు. జనవరిలో అధికారుల బృందం కళాశాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారని, అధికారుల నివేదిక ఆధారంగా కళాశాలలో బీటెక్ సీఎస్సీ, ఈసీఈ, ఈఈఈ కోర్సులకు మూడేళ్ల పరిమితితో నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ గుర్తింపు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సహకరించిన అధ్యాపకులు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కళాశాల ఆవరణలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. జాయింట్ సెక్రెటరీ దావు శ్రీనివాస్రెడ్డి, డైరెక్టర్లు వినోద్, ప్రకాష్రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫార్మసీ కళాశాలకు అటానమస్ మండలంలోని వాగేశ్వరి ఫార్మసీ కళాశాలకు అటానమస్ గుర్తింపు వచ్చినట్లు కళాశాల జనరల్ సెక్రటరీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఉత్తర తెలంగాణాలోనే మొట్టమొదటిసారిగా వాగేశ్వరీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలకు జేఎన్టీయూ అటానమస్ గుర్తింపు ఇచ్చిందన్నారు. మొదట నాక్ ఏ ప్లస్ వచ్చిందని, సోమవారం తమ కళాశాలకు అటానమస్ హోదా వచ్చిందన్నారు. తమ కళాశాలకు అటానమస్ రావడం సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎన్బీఏ వచ్చేలా తాము, ప్రిన్సిపాల్, ఫ్యాకల్టీ కృషి చేస్తామని పేర్కొన్నారు. -
వైభవంగా ‘రామకోటి యజ్ఞం’
హుజూరాబాద్: పట్టణంలోని ఓ కన్వెన్షన్ హాల్లో సోమవారం రామకోటి యజ్ఞం వైభవంగా నిర్వహించారు. లోక కల్యాణార్థం చేపట్టిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనగా, రామనామ స్మరణతో హాల్ మారుమోగింది. ఈ యజ్ఞంలో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ శ్వేత ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సుమారు 650 మంది మహిళలను ఏకం చేసి, ఈ ఆధ్యాత్మిక క్రతువు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. గందె శ్రీనివాస్, సుద్దాల హరిశంకర్, గర్రెపల్లి శ్రీనివాస్, పుల్లూరి శ్రీకాంత్, బల్లు పున్నం, రేణుకుంట్ల సురేష్, ఆర్యవైశ్య నాయకులు నార్ల రాజేందర్, ఎస్ఆర్పీ శివనాథుని వేణుగోపాల్, కటుకం మారుతి, శివనాథుని శ్రీనివాస్, కటుకం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యూనిఫామ్ కుట్టుపై శిక్షణ జూలపల్లి: మహిళలను అర్థికంగా బలోపేతం చేసేందుకు విద్యార్థుల యూనిఫామ్ కుట్టుపై అవగాహన కల్పించారు. స్థానిక వెలుగు సమాఖ్య కార్యాలయంలో సోమవారం శిక్షణ శిబిరం నిర్వహించగా.. సమాఖ్య అసిస్టెంట్ ప్రోగ్రాం మేనేజరు సుధాకర్ మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. 13 పంచాయతీల నుంచి 45 మంది మహిళలు శిక్షణకు హాజరయ్యారు. ట్రెయినర్లు మసూద, సీసీలు ఆనంద్, అనిత, అకౌంటెంట్ అనిత తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు సుల్తానాబాద్రూరల్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ప్రమోద్కుమార్ అన్నారు. గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. గైనిక్, డెంటల్, ఆప్తాల్మిక్, చిల్డ్రన్, ఆర్థో, జనరల్ మెడికల్ సర్జన్ తదితర నిపుణులు వైద్య సేవలు అందించారు. పీహెచ్సీ పరిధిలోని గ్రామాలు, అనుబంధ గ్రామాలకు చెందిన దాదాపు 500 మంది ప్రజలు పరీక్షలు చేయించున్నట్లు డాక్టర్ ఉదయ్కుమార్ తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్వో రాములు, ఎంఎల్హెచ్పీఎస్, పీహెచ్ఎన్, సూపర్వైజర్, ఏఎన్ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు. -
సింగరేణిలో ఉద్యోగావకాశాలు
గోదావరిఖని: సింగరేణిలోని అంతర్గత ఉద్యోగాల భర్తీకి యాజమాన్యం నిర్ణయించింది. ఈమేరకు పర్సనల్ మేనేజ్మెంట్ విభాగం అన్ని ఏరియాలకు ఉత్తర్వులు జారీచేసింది. ఆసక్తి, అర్హతగల ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. టెక్నికల్ విభాగంలో సర్వేయర్, డ్రిల్లర్, సీనియర్ కెమిస్ట్, చీఫ్ టెక్నీషన్ రేడియాలజీ, చీఫ్ టెక్నీషియన్ పాథలజీ, చీఫ్ ఫార్మసిస్ట్, మేట్రన్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కనీసం నాలుగు నుంచి ఆరేళ్ల అనుభవం ఉన్నవారు అర్హులని పేర్కొంది. నాన్ టెక్నికల్లో ఆఫీస్ సూపరింటెండెంట్, పర్సనల్ అసిస్టెంట్, లా అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఈనెల 23 వరకు ఆయా డిపార్ట్మెంట్ లేదా జీఎం కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించింది. ఈనెల 26లోగా కార్పొరేట్ కార్యాలయానికి వాటిని అందజేయాలని కోరింది. సీనియార్టీ, మెరిట్ ప్రతిపాదికన ఉద్యోగులను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించింది. మస్టర్లకు 5మార్కులు, టెక్నికల్, నాన్టెక్నికల్ ఉద్యోగులకు సీనియార్టీకి మూడు నుంచి ఐదు మార్కులు కేటాయిస్తారు. పోస్టు ఖాళీలు జూనియర్ అకౌంటెంట్ 07 ఆఫీస్ సూపరింటెండెంట్ 02 పర్సనల్ అసిస్టెంట్ 02 లా అసిస్టెంట్ 02 డ్రిల్లర్ 01 సర్వేయర్ 02 చీఫ్టెక్నీషియన్(రేడియాలజీ) 01 చీఫ్టెక్నీషియన్(పాథలజీ) 01 మేట్రిన్ 01 సీనియర్ కెమిస్ట్ 02 చీఫ్ ఫార్మసిస్ట్ 01 అంతర్గతంగానే నియామకాలు సింగరేణి కార్మికులకే అవకాశం 23 వరకు దరఖాస్తుల స్వీకరణ -
మిల్లర్లకు సహకరించిన అధికారులపై చర్యలేవి?
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని రైస్మిల్లర్లకు అధికారులు లోపాయికారీగా సహకరించడంతోనే అక్రమాలకు పాల్పడి రూ.కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆదివారం నాయకుడు గొట్టిముక్కుల సురేశ్రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. నిజాయతీగా సీఎంఆర్ అప్పగించిన మిల్లర్లకు అలాట్మెంట్ ఇవ్వకుండా డీఫాల్టర్లకే మళ్లీ కేటాయింపులు చేయడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉండడంతోనే రూ.కోట్లు దోచుకున్నారని, అందులో అధికారులకు, ప్రజాప్రతినిధులకు వాటాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ విషయమై సీబీఐతో విచారణ జరిపించి దోషులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు దిలీప్, విజయ్ తదితరులు ఉన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి -
స్కీంలకు గండికొట్టిన సర్కార్
పెద్దపల్లి: రాష్ట్ర ప్రభుత్వం స్కీంలకు గండికొట్టి స్కాంలను ప్రోత్సహిస్తోందని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, కోరుకంటి చందర్, పుట్ట మధుకర్తో కలిసి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈశ్వర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నివర్గాలను మోసం చేసేలా ఉందన్నారు. రెండున్నరేళ్ల తన పాలనలో రూ.3.47 లక్షల కోట్ల అప్పు చేశామని గర్వంగా చెబుతున్న సీఎం రేవంత్రెడ్డి.. వాటితో ఏ ప్రాజెక్టు పూర్తి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ అంకెల గారడీ తప్ప ఏమీ లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కష్టాలు, కన్నీళ్లు, కూల్చివేతలు, పేల్చివేతలు అని ఆయన విమర్శించారు. భట్టి విక్రమార్క ప్రసంగం పచ్చి అబద్దాలు, మోసాలతో కూడినదని మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపితే.. కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలోనే తిరోగమనంలోకి నెట్టివేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పెద్దపల్లి పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్కుమార్, నాయకులు గోపు ఐలయ్య యాదవ్, నడిపెల్లి మురళీధర్రావు, నారదాసు మారుతి, పూదరి చంద్రశేఖర్, కేధం కిశోర్, అఫ్జల్ బాబా, ప్రేమ్కుమార్, గాజుల అరుణ్, నేరటి శ్రీనివాస్, బొడ్డుపల్లి శ్రీనివాస్, మేడి సదానందం, దాసరి బాలరాజు, కుమార్ నాయక్, మేకల కొమురయ్య, కుమార్ యాదవ్, బోన్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు. స్కాంలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజం -
కోల్కారిడార్.. బస్సుల్లేక పరేషాన్
గోదావరిఖని(రామగుండం): బొగ్గు గనులు, కార్మికవాడలను అనుసంధానిస్తున్న నిర్మించిన కోల్కారిడార్ వెంట ఆర్టీసీ బస్సు సౌకర్యంలేక సింగరేణి కార్మికులు, ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మార్గంలో నిత్యం వందలాది మంది కార్మికులు, వారి కుటుంబాలు ప్రయాణం చేస్తున్నాయి. బస్సు సౌకర్యం సకాలంలో గమ్యస్థానాలు చేరుకోలేపోతున్నారు. గోదావరిఖని, సెంటినరీకాలనీ నుంచి.. గోదావరిఖని, చౌరస్తా, ఫైవింక్లయిన్, వీర్లపల్లి, యైటింక్లయిన్కాలనీ, పోతనకాలనీ, సెంటినరీకాలనీ నుంచి భూపాలపల్లి, మణుగూరు వరకు ఆర్టీసీ బస్సు నడిపిస్తే కార్మికులు, వారి కుటుంబాలకు సౌకర్యంగా ఉంటుంది. పోతనకాలనీ, న్యూమారేడుపాక, యైటింక్లయిన్కాలనీ నుంచి భూపాలపల్లికి వెళ్లే కార్మికులు సుమారు 6 కి.మీ. దూరంలోని జీడీకే–11 వద్ద ఉన్న బస్స్టాప్ వద్దకు వెళ్లాల్సి వస్తోంది. మూడు షిఫ్టులకు వెళ్లే కార్మికులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొత్తగూడెం, మణుగూరు ప్రాంతాల నుంచి నేరుగా ఈప్రాంతాలకు రావాలన్నా బస్సు సౌకర్యం లేదు. షిఫ్ట్వేళల్లో బస్సులు నడిపించాలి సింగరేణి కార్మికులు విధులకు హాజరయ్యే మూడు షిఫ్టుల వేళల్లో కోల్కారిడార్ నుంచి గోదావరిఖని, ఫైవింక్లయిన్, పోతనకాలనీ, యైటింక్లయిన్కాలనీ, సెంటినరీకాలనీ, మంథని, భూపాలపల్లి, మణుగూరు వరకు ఆర్టీసీ బస్సు నడిపించాలని కోరుతున్నారు. ఇక్కడ నుంచి విధులకు వెళ్లే ఉద్యోగులకు షిఫ్ట్ సమయాలకు రెండుగంటల ముందుగా ట్రిప్పు ఏర్పాటు చేయాలంటున్నారు. కనెక్టివిటీగా కోల్కారిడార్ సింగరేణి కార్మికులు దూరప్రాంతాల నుంచి తమ కుటుంబ సభ్యుల వద్దకు రావడం, ఇక్కడి నుంచి స్వగ్రామాలకు వెళ్లడానికి కోల్కారిడార్ నుంచి నడిచే ఆర్టీసీ బస్సులు ఎంతగానో ఉపయోగపడతాయి. గోదావరిఖని నుంచి భూపాలపల్లి వరకు ప్రతీ అర్ధగంటకోసారి బస్సు నడిపినా.. పోతనకాలనీ, యైటింక్లయిన్కాలనీ, సెంటినరీకాలనీ నుంచి ఒక్కటి కూడాలేదు. -
సమష్టి కృషితోనే రికార్డు
గోదావరిఖని: సమష్టి కృషితో ఓసీపీ–3 కార్మికులు రికార్డుస్థాయి బొగ్గు ఉత్పత్తి సాధించారని సింగరేణి ఆర్జీ–2 జీఎం వెంకటయ్య అభినందించారు. ఆదివారం ఓసీపీ–3 కృషి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం ఓబీ 1.95లక్షల క్యూబిక్ మీటర్లకు 2.35 క్యూబిక్ మీటర్లు వెలికితీశారన్నారు. రోజులో 39,807 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పారన్నారు. నిర్దేశిత లక్ష్య సాధనలో కృషి చేసిన ఉద్యోగులందరికీ అభినందనలు తెలిపారు. మెరుగైన ప్రణాళికతో సరైన సమయంలో భారీ యంత్రాలను సద్వినియోగం చేసుకోవడంతో ఈస్థాయిలో ఉత్పత్తి సాధ్యమైందని అన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి ఆర్థిక సంవత్సరం చివరి వరకు మరిన్ని విజయాలు సాధించాలని ఆయన కోరారు. రక్షణతో ఉత్పత్తికి ప్రతీఒక్కరు పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉదయ్హరిజన్, మేనేజర్ భారత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా కార్మికులకు స్వీట్లు పంపిణీ చేశారు. సింగరేణి ఆర్జీ–2జీఎం వెంకటయ్య -
బంకుల్లో పెట్రోల్ కొరత
కాల్వశ్రీరాంపూర్: మండల కేంద్రంలోని బంకుల్లో పెట్రోల్ కొరత ఏర్పడింది. గ్యాస్ ఏజెన్సీల్లో ఎల్పీజీ సిలిండర్లు నో స్టాక్ అని బోర్డు దర్శనమిస్తోంది. ఇన్నాళ్లూ అవసరం మేరకు పెట్రోల్, వంటగ్యాస్ వినియోగదారుల ఇళ్లకు ఎప్పుడుపడితే అప్పడు చేరాయి. ప్రస్తుతం నిర్వాహకులు నోస్టాక్ అని బోర్డులు పెట్టి చేతులెత్తేశారు. చాలామంది ప్రజలు తమకు తెలిసినవారు, బంధువుల ఇళ్లలో వంటగ్యాస్ సిలిండర్ల కోసం వాకబు చేస్తున్నారు. యుద్ధం భయంతో అదనపు సిలిండర్లు ఉన్నా తమవద్ద లేవంటూ కొందరు చెబుతున్నారు. మరోవైపు.. ఇండెంట్ పెట్టినా స్టాక్ రావడంలేదని ఏజెన్సీ మండల కేంద్రంలోని ఇండేన్ గ్యాస్ నిర్వహకులు తెలిపారు. భారత్, హెచ్ీ ప గ్యాస్ ఓదెల, జమ్మికుంట ప్రాంతాల నుంచి సరఫరా చేస్తున్నారు. మండలంలో అత్యధికంగా కనెక్షన్లు ఉన్న ఇండేన్ సిలిండర్లు లభించక వినియోగదారులు ప్రత్యామ్నాయం కోసం విఫలయత్నం చేస్తున్నారు. -
రోజూ ఇబ్బంది
రోజూ ప్రయాణం ఇబ్బందిగా ఉంది. వంద మందికిపైగా షిఫ్టుల వారీగా వెళ్లి వస్తున్నాం. కార్మికవాడలను కలుపుతూ బస్సు నడిపిస్తే మాకు సౌకర్యంగా ఉంటుంది. సింగరేణి చొరవ తీసుకుని కార్మిక కుటుంబాల ప్రయాణానికి అనుగుణంగా బస్సు సౌకర్యం కల్పించాలి. – బండ కుమార్, ఈపీ ఆపరేటర్ నేరుగా నడిపించాలి ప్రతీరోజు కోల్కారిడార్ వెంట బస్సులు నడపాలి. మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నేరుగా భూపాలపల్లి, మణుగూరు, కొత్తగూడెం వరకు బస్సులు నడిపించాలి. ఈవిషయంలో గోదావరిఖని డిపో అధికారులు చర్యలు తీసుకోవాలి. – రాము, ఈపీ ఆపరేటర్, సెంటినరీకాలనీ రూట్ సర్వే చేయిస్తాం కోల్కారిడార్ వెంట బస్సు రూట్ సర్వే చేయిస్తాం. సింగరేణి ఉద్యోగులు నేరుగా డిపోకు వచ్చి కలిస్తే వారి సౌకర్యార్థం బస్సు రూట్ ప్రారంభిస్తాం. షిఫ్టులకు అనుకూలంగా బస్సుల సంఖ్య పెంచే విషయంలో అక్యుపెన్సీ ఆధారంగా ముందుకెళ్తాం. – ఎం.నాగభూషణం, డిపోమేనేజర్, గోదావరిఖని కాలనీ నుంచి భూపాలపల్లికి యైటింక్లయిన్కాలనీలో ఉంటూ భూపాలపల్లిలో డ్యూటీ చేస్తున్న. రోజూ వెళ్లిరావడం కష్టంగా ఉంది. కాలనీ నుంచి జీడీకే–11 గని వరకు బైక్పై వెళ్లి అక్కడి నుంచి బస్సులో మంథని, భూపాలపల్లికి వెళ్లాల్సి వస్తోంది. కాలనీ మీ దుగా బస్సు నడిపిస్తే సౌకర్యంగా ఉంటుంది. – రాములు, ఈపీ ఆపరేటర్, భూపాలపల్లి -
పెద్దమ్మ పట్నాలకు మంత్రి హాజరు
ధర్మారం: కొత్తూరులో ఆదివారం నిర్వహించి న పెద్దమ్మతల్లి పట్నాలకు మంత్రి లక్ష్మణ్కుమార్ హాజరయ్యారు. సర్పంచ్ భూక్య సంగీత ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆయనకు స్వాగతం పలికారు. భక్తుల విన్నపం మేరకు పెద్దమ్మ మండప నిర్మాణానికి రూ.15 లక్షలుల మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కొత్త నర్సింహం, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అసోద అజయ్, శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయ కమి టీ చైర్మన్ సంతోష్, మాజీ సర్పంచ్ మల్లేశం, నాయకులు చింతల ప్రదీప్రెడ్డి, కాల్వ మల్ల య్య, ఎదుల్ల అంజయ్య పాల్గొన్నారు. ఘనంగా గంగౌర్ సింజార పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని రాజస్తానీ మహిళా మండలి ఆధ్వర్యంలో ఆదివారం గంగౌర్ సింజార ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎల్లమ్మ చెరువు సమీపంలోని హనుమాన్ ఆలయంలో వారం రోజులుగా ని త్యం గౌరీదేవి వ్రతం నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయం నుంచి దేవతామూర్తులతో పట్టణంలో ప్రదర్శన నిర్వహించి మళ్లీ ఆలయానికి చేరుకున్నారు. సంప్రదాయం ప్రకారం జొన్నలు ఇతర పూజాసామమాగ్రిని మరుసటిరోజు ప్రవహించే నీటిలో నిమజ్జనం చేస్తారని మండలి సభ్యులు తెలిపారు. సర్వేయర్ల జిల్లా కార్యవర్గం పెద్దపల్లి: లైసెన్స్డ్ సర్వేయర్ల అసోసియేషన్ జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సాతూరు అనిల్ ఏకగ్రీవమయ్యారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులుగా జుబేర్, సురేశ్, ప్రధాన కార్యదర్శిగా వేల్పుల తిరుపతి, కోశాధికారిగా సాన కుమార్, కార్యవర్గ సభ్యులుగా వంశీ, భరత్, వెంకటేశ్, సురేశ్, గోపి, మహేశ్, వెంకటేశ్, హరీశ్, లక్ష్మణ్, శ్రీనివాస్, సాగర్, సతీశ్, అభిలాష్, తేజ, మహిళా ప్రతినిధులుగా శ్యామల, సంధ్యా, శ్రీలత, వనిత ఎన్నికయ్యారు. మట్టి రవాణా అడ్డగింత కాల్వశ్రీరాంపూర్: పెగడపల్లి గ్రామస్తులు ఆదివారం మట్టి రవాణాను అడ్డుకున్నారు. ఎల్ల మ్మ గుట్ట నుంచి పొకెల్యిన్ ద్వారా తవ్వుతూ టిప్పర్లలో నింపి తరలిస్తుండగా రైతులు, గ్రా మస్తులు అడ్డుకున్నారు. ప్రకృతి సంపదను కొ ల్లగొట్టి భవిష్యత్ తరాల మనుగడ ప్రశ్నార్థకం చేస్తున్నారని, పర్యావరణ సమతుల్యత నాశ నం చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం మైనింగ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చి టిప్పర్లను పోలీస్టేషన్కు తరలించారు. బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు, సింగిల్విండో మాజీ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి మా ట్లాడుతూ, పంచాయతీ పాలకవర్గం అలసత్వంతోనే మట్టి అక్రమంగా తరలిస్తున్నారన్నా రు. మట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వే యాలని గ్రామస్తుడు అల్లం సదయ్య డిమాండ్ చేశారు. ఈవిషయమై ఎస్నైని వివరణ కోరగా.. మట్టి తరలిస్తున్న టిప్పర్లను మైనింగ్ అధికారులు తమకు అప్పగించారన్నారు. కేజీ చికెన్ రూ.350 పెద్దపల్లిరూరల్: కోడిమాంసం ధరలకు రెక్కలొచ్చాయి. బాయిలర్ చికెన్ ధరలు భారీగా పెరిగాయి. చికెన్ కిలోకు ఆదివారం రూ.350(స్కిన్లెస్) ధర పలికింది. స్కిన్తో కేజీ ధర రూ.320తో విక్రయిస్తున్నట్లు చికెన్ సెంటర్ యజమానులు తెలిపారు. -
పూరీ.. వర్రీ
పెద్దపల్లిరూరల్: గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తలెత్తి న అంతరాయం జిల్లాపై తీవ్రప్రభావం చూపుతోంది. ప్రధానంగా హోటళ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులను ముప్పుతిప్పలు పెడుతోంది. అమెరికా, ఇ జ్రాయిల్, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సరఫరాలో జాప్యం జరుగుతోంది. వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ల సరఫరా అంతంతమాత్రంగానే ఉంది. హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గ్యాస్ కొరతతో తా ము వ్యాపారం నిర్వహించలేమని కొందరు టిఫిన్ సెంటర్లు, హోటళ్లను మూసేస్తున్నారు. ఇంకొందరు కేవలం టిఫిన్లు మాత్రమే.. అదికూడా ఉదయం పూటనే తయారు చేస్తున్నారు. సాయంకాల వ్యాపారమైన బజ్జీ, మిర్చీ, గారెలు వేయడం మానేశారు. మూసివేత బాటలో కర్రీ పాయింట్లు.. ఉద్యోగులు, విద్యార్థులు, బ్యాచిలర్లు తమ గదుల్లో అన్నం వండుకుని కూరలను కర్రీపాయింట్లలో కొనుక్కునే వారు. గ్యాస్ కొరతతో కర్రీ పాయింట్లు మూతపడుతున్నాయి. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో కూరగాయలు, ఆకుకూరల ధరలు తక్కువ ధరలకే లభ్యమవుతున్నా.. వాటిని వండేందుకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ల సరఫరా లేక తాము ఉపాధి కోల్పోవాల్సి వస్తోందని పలువురు సిబ్బంది వాపోతున్నారు. ధరలు పెంచేశారు టిఫిన్లు, భోజనం, చపాతీ, ఫాస్ట్ఫుడ్ ఇలా.. రకరకాల ఆహార పదార్థాల తయారీకి అవసరమైన గ్యా స్ ధర పెరగడం, సకాలంలో దొరక్క పోవడంతో సగం వరకు హోటళ్లు మూతపడ్డాయి. అరకొరగా నడిపే హోటల్, బేకరీ తదితర ఆహారపదార్ధాల త యారీ, విక్రయదారులు వాటిధరలను కొంత పెంచేశారు. టిఫిన్ సెంటర్లలో ఇదివరకు ఉన్న ధరలపై రూ.5 నుంచి రూ.10 వరకు పెంచి అమ్ముతున్నా రు. ధర పెంచినా టిఫిన్ దొరుకుందని తెలిసిన వా రు ఆ హోటల్కు వెళ్లి ఉన్నది తినేసి వస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల కొరత తీరి ఎప్పుడు సరఫరా మెరుగవుతుందో.. ఏమోనని, ఇప్పటి పరిస్థితులు ఐదా రేళ్ల కిందటి కరోనా పరిస్థితులను గుర్తు చేస్తున్నా యని పలువురు యజమానులు పేర్కొంటున్నారు. రెస్టారెంట్లుమెస్లుటిఫిన్ సెంటర్లు బేకరీలు స్వీట్హౌస్లుఫాస్ట్ఫుడ్ సెంటర్లు ఇడ్లీ.. ధర పెరిగి – దోశ ఊరించి.. జిల్లాలో తీవ్రమైన వంటగ్యాస్ కొరత మూతపడుతున్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు కొన్నింటిని తెరుస్తున్నా పెరిగిన ధరలు రెస్టారెంట్లు, బేకరీలు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, తోపుడుబండ్లపై టిఫిన్ తయారు చేసేవాళ్లూ ఇవే వంటగ్యాస్ కష్టాలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. కొందరు నిర్వాహకులు ప్లేట్పై రూ.5 ధర పెంచి విక్రయిస్తున్నారు. పెద్దపల్లిలో హోటళ్లు ‘రోజూ పొద్దున్నే పూరీ, దోశ, ఇడ్లీ, వడ, ఊతప్ప ఇలా.. రకరకాల టిఫిన్లను తయారు చేసేటోళ్లం. కొద్దిరోజులుగా వంటగ్యాస్ దొరకడం కష్టంగా మారింది. దీంతోనే హోటల్ను మూసివేశాం’ అని జిల్లా కేంద్రంలోని కూనారం రోడ్డు టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు రమేశ్ ఆవేదన చెందారు. ఒక్కపూటే నడుపుతున్నం రోజూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు టిఫిన్లు, సాయంత్రం బజ్జీ, మిర్చీ చేసోటోళ్లం. గ్యాస్ సిలిండర్ల కొరతతో ఉదయం టిఫిన్ చేసి 11 గంటల వరకు టిఫిన్ సెంటర్ మూసేస్తున్నం. గ్యాస్ సిలిండర్ ధర పెంచడంతో టిఫిన్లపై రూ.5 పెంచి అమ్ముతున్నం. – కుర్రె లింగయ్య, టిఫిన్ సెంటర్ యజమాని, పెద్దపల్లి -
నేడు భగత్సింగ్ వర్ధంతి
పెద్దపల్లి: దేశస్వాతంత్య్ర సాధనలో అసువులు బాసిన భగత్సింగ్ వర్ధంతిని ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తామని ఏఐఎఫ్టీయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్, జిల్లా అధ్యక్షుడు మల్లేశ్ తెలిపారు. వర్ధంతి ప్రచార పోస్టర్ను జిల్లా కేంద్రంలో శనివారం వారు ఆవిష్కరించి మాట్లాడారు. దేశభక్తులు భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ అమరత్వాన్ని గుర్తుచేస్తూ, సామ్రాజ్యవాద అధర్మ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 23 తేదీన పల్లెలు, పట్టణాల్లో సభలు, సమావేశాలు నిర్వహించాలని వారు కోరారు. నాయకులు బుద్ధుల రమేశ్, వెల్తురు సదానందం, రవీందర్, మహేందర్, తిర్రి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. టీజీ సెట్కు అర్హత పెద్దపల్లిరూరల్: పట్టణా నికి చెందిన కుదిర శ్రీల త టీజీ సెట్కు అర్హత సాధించారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష –2025 ఫలితాల్లో శ్రీలత 152 మార్కులను సాధించారు. ఉస్మానియా యూనివర్సిటీలో 29 సబ్జెక్టులకు రాష్ట్రవ్యాప్తంగా 18 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మంచి మార్కులు సాధించిన శ్రీలతను పలువురు అభినందించారు. పటిష్ట పోలీస్ బందోబస్తు గోదావరిఖనిటౌన్: రంజాన్ సందర్భంగా నగరంలోని వివిధ ఈద్గాల వద్ద పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు చేపట్టారు. తొలుత ఆయన ఫైవింక్లయిన్ ఏరియా ఈద్గాను శనివారం ఆయన సందర్శించి బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు. ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. డీసీపీ మాట్లాడు తూ, శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి ప్రతీఒక్కరు సహకరించాలన్నారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్, వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, రామగుండం ట్రాఫిక్ సీఐ రాజేశ్వర్రావు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. మొక్కల సంరక్షణపై నిర్లక్ష్యం మంథనిరూరల్: మొక్కలు పెంచి ప్రకృతిని కాపాడాలనే సంకల్పంతో ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవం అధికారుల నిర్లక్ష్యంతో అభాసుపాలవుతోంది. ఉపాధిహామీ ద్వారా ఏటా నర్సరీల్లో మొక్కలు పెంచి వనమహోత్సవంలో నాటుతున్నారు. అధికారుల పర్యవేక్షణ, సిబ్బంది అలసత్వంతో మొక్కలు ఆదిలోనే నశించిపోతున్నాయి. మంథని మండలం ఉప్పట్ల – గుంజపడుగు మధ్య రహదారి వెంట నాటిన మొక్కలు అగ్నికి ఆహుతి అయ్యాయి. మొక్కలు ఏటా ఇలా అగ్నిప్రమాదంలో కాలిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. తద్వారా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. 4 కిలోల కణతి తొలగింపు గోదావరిఖని: కడుపు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన సింగరేణి కార్మికుడి భార్యకు శస్త్రచికిత్స చేసి 4 కిలోల కణతిని విజయవంతంగా తొలగించారు పలువురు వైద్యులు. గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో వైద్య బృందం శ్రమించి జీడీకే–వన్ ఇంక్లయిన్లో ఉద్యోగి తిరుపతి భార్య సుమలతకు ఆపరేషన్ చేసి కణితి వెలికితీశారు. డాక్టర్లు మద్దిలేటి, వినోద్కుమార్, శ్యామలతోపాటు పారామెడికల్ బృందం స్వరూప, రాణి, అశోక్, రాములు బృందాన్ని సీఎంవో కిరణ్రాజ్కుమార్, గోదావరిఖని ఏసీఎంవో అంబిక అభినందించారు. విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించి కడుపునొప్పి బాధ నుంచి విముక్తి కల్పించిన వైద్యులకు కార్మికుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
పీఎస్కే.. బ్రాండ్ సెట్టర్
● కొనే స్థాయి నుంచి అమ్మే స్థాయికి.. ● వ్యాపారవేత్తగా రాణిస్తున్న సిరిసిల్ల యువకుడు ● వంద మందికి పైగా ఉపాధి ● నేటి యువతకు స్ఫూర్తి పుల్లూరి శ్రీకాంత్సిరిసిల్ల: ఏం చదివామనేది ముఖ్యం కాదు.. చివరికి ఏ స్థాయిలో ఉన్నామనేదే ప్రధానం. నలుగురు నడిచిన దారిలో వెళ్లడం సాధారణం.. మనమే ఓ దారిని వేసుకెళ్లడం వినూత్నం. ఈ కోవలోకే వస్తారు సిరిసిల్లకు చెందిన పుల్లూరి శ్రీకాంత్. తన పేరుతోనే ఓ కంపెనీని మొదలుపెట్టి ఓ బ్రాండ్గా మలచడంలో సక్సెస్ అయ్యారు. వ్యాపార కుటుంబంలో పుట్టిన శ్రీకాంత్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ చదివారు. కుటుంబం నుంచి వచ్చిన హార్డ్వేర్ వ్యాపారంలోకి దిగారు. పుల్లూరి శ్రీకాంత్(పీఎస్కే) పేరుతో హైదరాబాద్లో కంపెనీని ఏర్పాటు చేసి హోల్సేల్గా భవన నిర్మాణ సామగ్రిని సరఫరా చేయడం ప్రారంభించారు. ఇంజినీరింగ్ చదువు తర్వాత ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్లిన శ్రీకాంత్.. ప్రస్తుతం వందలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న పీఎస్కే కంపెనీ వ్యవస్థాపకులు పుల్లూరి శ్రీకాంత్ సక్సెస్ స్టోరీ. – వివరాలు 8లో.. -
ఆదివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2026
సందేశం ఇస్తున్న మతపెద్దపెద్దపల్లి ఈద్గా వద్ద ప్రార్థనలు చేస్తున్న ముస్లింలుప్రార్థన చేస్తున్న చిన్నారిభక్తిశ్రద్ధలతో రంజాన్చిన్నారుల అలయ్.. బలయ్కార్మిక నేత బాబర్ సలీంపాషాకు సన్మానంమాట్లాడుతున్న ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్చిన్నారులతో విప్ విజయరమణారావుపెద్దపల్లి/పెద్దపల్లిరూరల్/రామగుండం/జ్యోతినగర్/గోదావరిఖనిటౌన్: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ముస్లింలు శనివారం రంజాన్ వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కొత్తదుస్తులు ధరించిన ముస్లింలు ఉదయమే ఆయా ప్రాంతాల్లోని ఈద్గాలకు చేరుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దతలు వివిధ సందేశాలు చదివి వినిపించారు. పలువురు ప్రముఖులు వారిని కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.వాటర్ బాటిళ్లు పంపిణీ చేస్తున్న హనుమాన్ భక్తులుమాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి -
కార్మికుడి కుటుంబానికి న్యాయం చేస్తాం
గోదావరిఖని: సింగరేణి రామగుండం డివిజన్–2 పరిధిలోని ఓసీపీ–3లో గతేడాది దసరా రోజు జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఈపీ ఆపరేటర్ లక్ష్మీనారాయణను కొత్తగూడెం చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్రాజ్కుమార్ శనివారం పరీక్షించారు. కార్మికుడి ఆరోగ్యపరిస్థితి మెరుగుపడక పోవడంతో ఆయన కుటుంబానికి రావాల్సిన బెనిఫిట్స్ కోసం సింగరేణి డాక ర్లతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. చికిత్స పొందుతు న్న ఉద్యోగి వివరాలు సేకరించి ప్రత్యేక నివేదిక తయారుచేసి కార్పొరేట్ ఆసుపత్రికి పంపించనున్నట్లు కిరణ్రాజ్ కుమార్ తెలిపారు. కమిటీ సభ్యులుగా డాక్టర్ అంబిక, ఏసీఎంవో శ్రీకాంత్, రామకృష్ణాపూర్ డాక్టర్ వెంకటరమ ణ, డాక్టర్ అరవింద్ ఉన్నారు. డాక్టర్ల నివేదిక అనంతరం కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు బెనిఫిట్స్ విషయంలో కూడా ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. సీఎంవో కిరణ్రాజ్కుమార్ -
ఇలాగైతే ఆడేదెలా?
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మానసిక, శారీరక వికాసం సాధించేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయి. పాఠశాల స్థాయిలో క్రీడలపై శ్రద్ధ చూపుతున్న విద్యాశాఖ కళాశాల స్థాయిలో పట్టింపు కరువైంది. విద్యార్థులు స్కూల్ లెవల్లో వివిధ పోటీల్లో పాల్గొన్న వారు ఇంటర్కు వచ్చేసరికి శిక్షకులు లేక నైపుణ్యం కరువైంది. క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్థులు సైతం శిక్షణకు దూరమై వివిధ పోటీల్లో పాల్గొనలేకపోతున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో రెండు డిగ్రీ, పది ఇంటర్ ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా అగ్రహారం డిగ్రీ కాలేజీలో మినహా ఎక్కడ కూడా పీడీ(ఫిజికల్ డైరెక్టర్)లు లేరు. దీంతో విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. లెక్చరర్లతోనే శిక్షణ ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు ఇటీవల ప్రభుత్వం ఒక్కో కాలేజీకి రూ.10వేలు కేటాయించింది. ఈ నిధులతో క్రీడా సామగ్రిని సైతం కొనుగోలు చేశారు. కానీ విద్యార్థులకు ఆటలపై పట్టు సాధించేలా శిక్షణ ఇచ్చే పీడీలు లేరు. దీంతో కాలేజీలోని వివిధ సబ్జెక్టుల అధ్యాపకులే ప్రతీ శనివారం సాయంత్రం శిక్షణ ఇస్తున్నారు. వీరి శిక్షణలో విద్యార్థులు పెద్దగా ఆటలపై పట్టు సాధించడం లేదు. దీంతో వీరు ఏ క్రీడా పోటీల్లో పాల్గొనడం లేదు. ఒకవేళ పాల్గొన్న పతకాలు రావడం లేదు. ఇదే సమయంలో గురుకులాల్లో ప్రత్యేక శిక్షకులు ఉండడంతో అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు నిత్యం సాధన చేస్తూ వివిధ క్రీడావిభాగాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. వారికి ఉన్నత విద్యలో స్పోర్ట్స్ విభాగంలో రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి. క్రీడాకోటాలో చాలా మంది విద్యార్థులు ఉద్యోగాలు సైతం సాధించారు. గురుకుల విద్యార్థులకు క్రీడలతో లబ్ధి జరుగుతుండగా ప్రభు త్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న పేద విద్యార్థులకు మాత్రం ఆ ఫలితాలు దక్కడం లేదు. జిల్లాలో పీడీలు కరువు విద్యార్థులకు అందని క్రీడాశిక్షణ క్రీడాసామగ్రికి నిధులు.. శిక్షకులు కరువు జిల్లాలో 10 జూనియర్, రెండు డిగ్రీ కళాశాలలు ఆటలకు దూరంగా విద్యార్థులు -
ఒర్రెలో ‘ఆరోగ్యలక్ష్మి’ పాలప్యాకెట్లు
కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మడంలం మొట్లపల్లి కొత్తకుంట ఒర్రెలో అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసిన ఆరోగ్యలక్ష్మి పాలప్యాకెట్లు సుమారు 15 వరకు శుక్రవారం గ్రామస్తులు కనుగొన్నారు. పాలప్యాకెట్లపై డిసెంబర్– 2025 తేదీతో ముద్రణ ఉంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందాల్సిన పాలప్యాకెట్లు వృథాగా నీటిపాలు కావడం చర్చనీయాంశంగా మారింది. ఐసీడీఎస్ అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకుని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూటాలని మొట్లపల్లి సర్పంచ్ తులా మనోహర్రావు కోరారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడు మృతి
మెట్పల్లి (కోరుట్ల): పట్టణంలోని ఆర్టీసీ బస్స్టేషన్ ఇన్ గేట్ వద్ద శుక్రవారం బస్సు ఢీకొని వృద్ధుడు మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. శాంతినగర్కు చెందిన దుర్గయ్య(65) ఆర్టీసీ బస్ స్టేషన్ ఇన్గేట్ నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా, అదే సమయంలో వేగంగా లోపలికి వస్తున్న బస్సు అతన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. రాజన్న గుడి వద్ద నాగుపామువేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో రాజేశ్వరపురం వద్ద నిర్మాణం పనుల ప్రాంతంలో శుక్రవారం రాత్రి నాగుపాము ప్రత్యక్షమైంది. దీంతో పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది ఆలయ అధికారులకు సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ జగదీశ్ చేరుకుని నాగుపామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు. సివిల్ సప్లయ్ అధికారుల తనిఖీలు మంథని: పెద్దపల్లి జిల్లా మంథనిలోని పలు హోటళ్లలో సివిల్ సప్లయ్ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. గృహ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న ఆరింటిని సీజ్ చేశారు. 6 హోటళ్లపై కేసులు నమోదు చేశారు. డీసీఎస్ రవీందర్రెడ్డి, సివిల్ సప్లయ్ ఇన్స్పెక్టర్ వెంకటరాజిరెడ్డి, ఆర్ఐ అనిల్రెడ్డి పాల్గొన్నారు. పిడుగుపడి ఎద్దు మృతి ఇల్లంతకుంట(మానకొండూర్): పిడుగుపడి శుక్రవారం తెల్లవారుజామున ఎద్దు మరణించింది. ఇల్లంతకుంట మండలం గాలిపెల్లిలో కేశవేణి ఎల్లయ్యకు చెందిన పశువుల కొట్టం వద్ద రెండు ఎడ్లను కట్టివేశాడు. శుక్రవారం తెల్లవారుజామున వర్షంతోపాటు పిడుగు పడడంతో ఒక ఎద్దు చనిపోయింది. గతేడాది హఠాత్తుగా ఒక ఎద్దు చనిపోయిందని, ఇప్పుడు మరో ఎద్దు చనిపోవడంతో అప్పులపాలైనట్లు రైతు రోదించాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
ఈత సరదా.. విషాదం కావొద్దు
ప్రస్తుతం ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో కొందరు విద్యార్థులు ఈత నేర్చుకునేందుకు మధ్యాహ్నం వేళ చెరువులు, కుంటలు, కాలువల్లోకి వెళ్లి సరదాగా ఈత కొడుతున్నారు. ఈత సరదా ఎవరి ఇంట్లోనూ విషాదం కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, నిపుణులు సూచిస్తున్నారు. పెద్దపల్లి శివారులోని నిట్టూరు మార్గంలో ఎస్సారెస్పీ ఉపకాలువలో ఈదుతూ, కేరింతలు కొడుతూ సందడి చేస్తున్న చిన్నారులు ‘సాక్షి’ కెమెరాకు ఇలాకనిపించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్,పెద్దపల్లి -
తాపీమేసీ్త్ర ఆత్మహత్య
రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగెపల్లి గ్రామానికి చెందిన మట్ట రాజయ్య(48)ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాజయ్యమేసీ్త్ర పనిచేస్తున్నాడు. కొందరి వద్ద డబ్బులు తీసుని ఇళ్లు నిర్మిస్తూ ఇచ్చేవాడు. ఈక్రమంలో అప్పుల పాలయ్యాడు. కొందరు యజమానులకు ఇళ్లు నిర్మించి ఇవ్వకపోవడంతో వారు ఇళ్లు ఎప్పుడు కట్టిస్తావని తరచూ అడిగారు. మనస్తాపం చెందిన రాజయ్య రత్నాపూర్లో స్లాబ్వర్క్ ఉందని చెప్పి శుక్రవారం ఇంట్లోంచి వెళ్లిపోయాడు. మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వెళ్లలేదు. భార్య ఓదేమ్మ ఫోన్చేసినా లిఫ్ట్ చేయలేదు. తన తమ్ముడు రాజాపూర్లోని కలవేన సంపత్కు ఆమె ఫోన్చేసి విషయం చెప్పింది. అతడు రాజాపూర్లోని ఓ కొత్త ఇంటికి వెళ్లి చూడగా తలుపులు పెట్టి ఉన్నాయి. కిటికీలోంచి చూడగా తాడుతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. తన భర్త మరణంపై అనుమానాలు లేవని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఆన్సైట్ ఎఫ్ఐఆర్ నమోదు కాగా, సమాచారం అందుకున్న ఎస్సై శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి నుంచి అక్కడే ఫిర్యాదు స్వీకరించి అప్పటికప్పుడే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ పత్రాన్ని బాధితురాలికి అందజేశారు. బాధితులకు ఇబ్బందులు లేకుండా ఆన్సైట్ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నామని ఎస్సై వివరించారు. రుద్రంగిలో చిరుత కలకలంరుద్రంగి(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన నాగారం బొర్రయ్య రైతు పొలం వద్ద ఉన్న కాపాల కుక్కపై చిరుత దాడి చేసి చంపేసింది. రోజు మాదిరిగానే గురువారం రాత్రి ఆవులు, గేదెలను పాకలో కట్టేసి, రెండు కుక్కలను కాపలాగా కట్టేశాడు. శుక్రవారం ఉదయం వెళ్లి చూడగా ఒక కుక్కను చిరుత చంపివేసింది. కుక్కను రూ.8 వేలకు కొన్నట్లు రైతు బొర్రయ్య తెలిపాడు. గతంలోనూ ఇదే ఏరియాలో లేగదూడపై చిరుత దాడి చేసి చంపిందని రైతులు తెలిపారు. ఈ విషయంపై ఫారెస్టు ఆఫీనర్ రవీందర్ను వివరణ కోరగా చిరుత ఆనవాళ్లు కనిసించలేదన్నారు. కుక్కపై దాడి చేసిందని హైనా కావచ్చని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రుద్రంగి మండల కేంద్రంలోని అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తూ కుక్కను చంపిన ప్రదేశాన్ని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై మోతీరాం పరిశీలించారు. వారు మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుత సంచరించినట్లు ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే పోలీస్, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
పూజలు చేస్తామని నమ్మించి ఆభరణాలు చోరీ
కాల్వశ్రీరాంపూర్: పూజలు చేస్తామని నమ్మించి మత్తుమందు చల్లి బంగారు నగలు, నగదుతో ఉడాయించిన దొంగబాబా ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గోనె లక్ష్మి– రాజారాం దంపతులు, దామెర మొగిలి, బందెల కలమ్మ మల్లయ్య ఇంటికి సోమవారం వెళ్లిన దొంగ బాబా.. మీపై ఇతరుల దృష్టి పడిందని, పూజలు చేస్తే దోషం తొలగిపోతుందని నమ్మించాడు. ఇందుకోసం ఆభరణాలు, నగదు అవసరమని చెప్పారు. ఈక్రమంలో వారు అవి అప్పగించగా వాటిని పట్టుకుని వెళ్లాడు. సుమారు రూ.లక్ష నగదు, తులంన్నర బంగారు ఆభరాణాలు పట్టుకుని పోయాడు. మళ్లీ బుధవారం తీసుకు వస్తానని చెప్పి వెళ్లిన బాబా తిరిగి రాక పోయే సరికి తాము మోసపోయామని గమనించి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిమ్మపల్లిలో మూడిళ్లలో దొంగతనానికి యత్నం కోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లిలో తాళం వేసి ఉన్న మూడు ఇళ్లలో శుక్రవారం దొంగతనానికి యత్నించారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. నిమ్మపల్లికి చెందిన ఇద్దగిరి మల్లేశం గల్ఫ్కు వెళ్లగా భార్య సుజాత బంధువుల ఇంటికి వెళ్లింది. శుక్రవారం ఇంటికి తిరిగి రాగా తాళం పగులగొట్టి ఉంది. అయితే ఎలాంటి వస్తువులు చోరీకి గురికాలేదు. అదే గ్రామానికి చెందిన ఇద్దగిరి మల్లయ్య(తండ్రి చిన్నమల్లయ్య), ఇద్దగిరి మల్లయ్య(తండ్రి రాజయ్య) ఇళ్లల్లోనూ చోరీకి యత్నించారు. కోనరావుపేట పోలీసులు విచారణ చేపడుతున్నారు. పుస్తెలు దొంగిలించిన ఇద్దరి రిమాండ్ సిరిసిల్ల క్రైం: జిల్లా కేంద్రంలోని సాయినగర్లో మహిళ మెడలోని బంగారు పుస్తెలు దొంగిలించిన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తుర్కాశినగర్కు చెందిన సయ్యద్ మౌలానా, కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరకు చెందిన మంగూరు ప్రకాశ్యాదవ్ను శుక్రవారం రిమాండ్కు తరలించారు. వారి నుంచి బంగారు పుస్తెలు, ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు. ఈనెల 17న రాత్రి సాయినగర్ ఏరియాలో మేర్గు లత ఇంటి గేటు బయటకు రాగా, ఇద్దరు వ్యక్తులు అడ్రస్ అడిగినట్లు నటించి ఆమె మెడలోని బంగారు పుస్తెలను లాక్కొని, బైక్పై పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. సయ్యద్ మౌలానా, మంగూరు ప్రకాశ్యాదవ్ను రగుడు చౌరస్తా వద్ద అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 4.4 గ్రాముల బంగారు పుస్తెలు, ఒక ద్విచక్ర వాహనం, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎగువమానేరులో యువకుడి మృతదేహం● కామారెడ్డి జిల్లావాసిగా గుర్తింపు గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టులో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్పూర్కు చెందిన దుంపటి వినయ్కుమార్(32)గా గుర్తించారు. మానేరులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. కాగా, మృతునికి నెల రోజుల క్రితమే వివాహమైనట్లు తెలుస్తోంది. గత నెల కవలల దినోత్సవం రోజున పెళ్లయినట్లు సమాచారం -
ధైర్యంగా ఉండండి.. అండగా ఉంటాం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): బీజేపీ జిల్లా వాణిజ్య సెల్ అధ్యక్షుడు చందుపట్ల రాజిరెడ్డి గుండెపోటుతో మరణించడం బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ మనోధైర్యం కల్పించారు. మృతుడు రాజిరెడ్డి కుటుంబ సభ్యులతో శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని సూచించారు. పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. రాజిరెడ్డి మృతి అనంతరం మంత్రి రెండోసారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రాజిరెడ్డి బతికున్న కాలంలో పార్టీకి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. మంత్రి ఫోన్లో మాట్లాడుతున్న సందర్భంలో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్లో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించిన మంత్రి -
బట్ట సంచులకు డిమాండ్
మంథని: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం అనేక రంగాలపై ప్రభావం చూపుతోంది. ప్రధానంగా ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై నిషేధం ఉన్నా విచ్చలవిడిగా వాడుతూనే ఉన్నారు. తక్కువ పరిమాణంగల ప్లాస్టిక్ కవర్లు మార్కెట్లో అందుబాటులో ఉండడంతో అనేకమంది వాటినే ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా కూరగాయలు, నిత్యావసరాలకు వాడే పాలితిన్ కవర్లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో లేవు. ఫలితంగా ప్రజలు తప్పనిసరి బట్ట సంచులు, బుట్టలతో మార్కెట్కు వస్తున్నారు. చేతి సంచులతో సందడి పాలితిన్ కవర్ల కొరతతో పట్టణంలోని కూరగాయల మార్కెట్తోపాటు కిరాణాల్లో నిత్యావసరాలు తీసుకెళ్లే ప్రజలు చేతిసంచులు, బుట్టలతో సందడి చేస్తున్నారు. గతంలో చేతిసంచులు, బుట్టలతోనే కూరగాయలు, నిత్యావసరాలు తీసుకెళ్లే జనం.. ఇప్పుడు పాతరోజులను గుర్తుచేసుకుంటున్నారు. చేతి సంచులు, బుట్టలతో వచ్చే కస్టమర్లను ఆకర్శించడానికి వ్యాపారులు కొత్తిమీరకట్ట, ఆకుకూర కట్టలను ఉచితంగా అందిస్తున్నారు. ఇలా కొనసాగితే.. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు, పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్న ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని అధికారులు ఎన్నిమార్లు విన్నవించినా.. కొన్ని మున్సిపాలిటీల్లో జరిమానాలు విధిస్తు న్నా ప్రజలు, వ్యాపారుల్లో మార్పు రావడం లేదు. కానీ, యుద్ధం నేపథ్యంలో పాలితిన్ కవర్ల దిగుమ తికి ఆటంకం ఏర్పడింది. వాటి కొరతతో ప్రజలు పాతరోజుల్లో మాదిరిగా బుట్ట, బట్ట సంచులను వినియోగిస్తున్నారు. ఇదే పద్ధతిని జనం అలవాటు చేసుకుంటే అనేక అనర్థాల నుంచి దూరం కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బట్ట సంచిలో కూరగాయలు తీసుకెళ్తున్న స్థానికులు ప్లాస్టిక్ కవర్లకు కొరత తీవ్రతరం మార్కెట్లపై యుద్ధ ప్రభావం -
రూ.1.50లక్షల విరాళం
మల్యాల: హైదరాబాద్కు చెందిన పార్కంపేట వెంకటేశ్ దంపతులు శుక్రవారం కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు ఉచిత నిత్యాన్నదానం కోసం తమవంతుగా రూ.1.50లక్షలు అందజేశారు. ఈవో అంజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు యువకుల అరెస్ట్మానకొండూర్: మానకొండూర్ మండలంలోని జగ్గయ్యపల్లి గ్రామానికి చెందిన అనిల్రెడ్డి, లింగాపూర్ గ్రామానికి చెందిన భరత్ గంజాయి సేవిస్తుండగా పట్టుకున్నట్లు సీఐ శ్రీలత శుక్రవారం తెలిపారు. మానకొండూర్ రైస్మిల్లుల వద్ద గంజాయి సేవిస్తుండగా పట్టుకుని రిమాండ్కు పంపినట్లు వివరించారు. -
సమయం తక్కువ.. ఖర్చు ఆదా
గాల్లో చెక్కర్లు కొడుతూ దూసుకుపోతోంది డ్రోన్. ఒకప్పుడు పెళ్లి వేడుకలనే చిత్రీకరించిన డ్రోన్.. ఇప్పుడు వ్యవసాయ రంగంలోనూ దూసుకెళ్తోంది. ఎరువులు, పురుగుమందులను పంటలపై పిచికారీ చేయడంలో తాను సైతం అంటోంది. సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా తక్కువ నీటితో, ఖర్చు ఆదా చేస్తూ పురుగుమందులు, ఇతర మందులు పిచికారీ చేస్తోంది. పెద్దపల్లి శివారు నిట్టూరులోని వరి పొలాల్లో డ్రోన్తో పిచికారీ చేస్తూ ‘సాక్షి’ కెమెరాకు కనిపించారు కొందరు రైతులు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
ప్రజారంజక బడ్జెట్
గోదావరిఖని: అన్నివర్గాలలకు ఆమోదయోగ్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప నిచేస్తోంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం రేవంత్రె డ్డి, డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖమంత్రి భట్టి విక్రమార్కకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వంటి పథకాలకు నిధుల భరోసా లభించింది. రైతు రుణమాఫీ ప్రక్రియను కొనసాగించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. – రాజ్ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండం -
గడువులోగా పనులు పూర్తిచేయాలి
మంథని: డివిజన్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. పట్టణంలో చేపట్టిన సంగీత నృత్యపాఠశాల, మున్సిపల్ కార్యాలయం, జూనియర్ బాయ్స్ స్కూల్, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలోని పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. అనంతరం షెడ్యూల్డ్ కులాల బాలికల వసతి గృహం, ప్రభుత్వ ఆస్పత్రి తనిఖీ చేశారు. అభివృద్ధి పనులు పూర్తిచేసి మంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గురుకులంలోని స్టేజీ, డార్మెటరీ, డైనింగ్ హాల్ వంటి పనులు పూర్తిచేశామని, పాత స్కూలు భవనం, హాస్టల్కు అవసరమైన మరమ్మతులు చేయించి పెయింటింగ్ వేయాలని సూచించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రెనోవేషన్ భాగంగా పెయింటింగ్, అంతర్గత సీసీ రోడ్డు పనులు త్వ రగా పూర్తిచేయాలని తెలిపారు. 50 పడకల ఆస్పత్రి పనులు స్లాబ్దశలో ఉన్నాయని, వీటిని గడువులోగా పూర్తిచేయాలని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ మనోహర్, టీజీఎంఎస్ఐడీసీ ఈఈ వి క్రమ్, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, ఏఈలు అనుదీప్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల పరిశీలన రామగిరి(మంథని): రామగిరి తహసీల్దార్ కార్యాల య భవనం కోసం కేటాయించిన స్థలం, పన్నూర్ లోని కేజీబీవీని కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించా రు. కేజీబీవీలోని మాడ్యులర్ కిచెన్ ప్రారంభించా రు. కాంపౌండ్ పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. తహసీల్దార్ సుమన్ ఉన్నారు. -
సంక్షేమానికి పెద్దపీట
పెద్దపల్లి: బడ్జెట్లో సంక్షే మానికి రాష్ట్రప్రభుత్వం పెద్దపీట వేసింది. అభివృద్ధి కోసం సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క పేదరిక నిర్మూలన కోసం, పేదల అభివృద్ధి కోసం బడ్జెట్ రూపకల్పన చేశారు. వైద్యం, వ్యవసాయం, బీసీ, ఎస్సీ, ఎస్టీలు, రైతులు, యువతకు రాజీవ్యువ వికాసానికి నిధులు కేటాయించారు. ఇందిరమ్మ ఇళ్లు పేదలకు ఇవ్వాలనే సంకల్పంతో నిధులు కేటాయించారు. – విజయరమణారావు, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, పెద్దపల్లి -
ఉమ్మడి జిల్లాలో అల్పాహారం పథకం వివరాలు
స్కూళ్లు1,8202111జగిత్యాల8,70012పెద్దపల్లి15,000కరీంనగర్ 651పెద్దపల్లి 527కరీంనగర్సిరిసిల్ల 403103878,300సిరిసిల్లకళాశాలలు -
ఫ్లడ్ ఫ్లో కెనాల్ రూ.249.85 కోట్లు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు రూ.449.66 కోట్లు బొక్కలవాగు రూ.34 లక్షలు గోదావరి పుష్కరాలకు రూ.500 కోట్లు (మొత్తం రాష్ట్రానికి) శాతవాహన యూనివర్సిటీ రూ.25 కోట్లు టీఎస్ స్పోర్ట్స్ స్కూల్ వరంగల్ అండ్ కరీంనగర్ రూ.42.80
దళిత, గిరిజన, అట్టడుగు వర్గాల సాధికారతను కేంద్రబిందువుగా చేసుకుని సీఎం రేవంత్, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రూపొందించిన 2026–27 బడ్జెట్ సమగ్రాభివృద్ధికి మార్గదర్శిగా నిలుస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ప్రతిపాదించి న సామాజిక న్యాయం, సమాన అవకాశాల లక్ష్యాలను ప్రతిబింబించే బడ్జెట్. – మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్ ఇన్సూరెన్స్ సంచలన స్కీంను ప్రారంభించింది. ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, యువత సాధికారత, ఆర్థిక క్రమశిక్షణల మధ్య సమతుల్యం దిశగా ప్రజా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. – సత్తు మల్లేశ్, కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ అల్పాహారం పథకం పేద,మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు వరం. మఽ ద్యాహ్న భోజన పథకానికి ఇది తోడవడంతో డ్రాపౌ ట్స్ మరింత తగ్గుతాయి. ఈ పథకాన్ని ఇంటర్ విద్యార్థులకూ వర్తింపజేయడం సాహసోపేతమైన నిర్ణయం. విద్యా కమిషన్ సిఫారసులను అమలు చేసిన సీఎంకు కృతజ్ఞతలు. – డాక్టర్ సూరేపల్లి సుజాత, విద్యా కమిషన్ సభ్యురాలు -
సీఎంను కలిసిన ప్రభుత్వ విప్
పెద్దపల్లి: ప్రభుత్వ విప్గా నియమితులైన ఎమ్మెల్యే విజయరమణారావు శుక్రవారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్ను కలిశారు. వారిని శాలువాలతో సన్మానించారు. ‘రైతుభరోసా’కు వేళాయె పెద్దపల్లి: రైతుభరోసాపై ప్రభుత్వం ప్రకటన చేయడంతో అన్నదాతల ముఖాల్లో ఆనందం వెళ్లి విరుస్తోంది. కొత్తవారి నుంచి సైతం దర ఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈనెల 22న సిద్దిపే టలో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి.. రైతుభరోసా నిధులు వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకుంటారని జిల్లా వ్య వ సాయాధికారి శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో 1,51,300 మంది రైతుల రూ.162 కోట్ల 52 ల క్షలు జమచేయనున్నట్లు ఆయన వివరించారు. 23న ‘చలో హైదరాబాద్’ పెద్దపల్లి: నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలనే డిమాండ్తో ఈనెల 23న హైదరాబాద్ సెంట్రల్ లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు నరేశ్ కోరారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ధర్నా ప్రచార పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.అశోక్, ఉపాధ్యక్షుడు జిలుక శంకర్, నాయకులు ఐ.రాజేశం, ఎం.దుర్గయ్య, కె.ఎల్లయ్య, డి.బుచ్చమ్మ, పెరిక వెంకటస్వామి, డి.రాజేశం, ఎం.కొమరయ్య, ఎం.కాంతయ్య, ఆర్.రాయమల్లు, ఆర్.సదానందం, గుండు రాజయ్య, రమేశ్, కె.మల్లేశం, శోభన్ పాల్గొన్నారు. ఏర్పాట్లు పరిశీలన పెద్దపల్లిరూరల్: పట్టణ శివారులోని చందపల్లి ఈద్గావద్ద ముస్లింల రంజాన్ ప్రార్థనల కోసం చేపట్టిన ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, కమిషనర్ వెంకటేశ్ శుక్రవారం పరిశీలించారు. శనివారం జరిగే సామూహిక ప్రార్థనల కోసం వచ్చే ముస్లింలకు ఇబ్బందులు తలెత్తకుండా టెంట్లు, తాగునీటి వసతి కల్పించినట్లు మున్సిపల్ చైర్మన్ మల్లయ్య తెలిపారు. కౌన్సిలర్లు ఫణీంద్రభూపతి, కొలిపాక సంపత్, అశ్రఫ్, అస్లాం, ఏఈ సతీశ్తోపాటు రమాకాంత్, రాజు తదితరులు ఉన్నారు. తగ్గుతున్న పిచ్చుకల సంఖ్యగోదావరిఖని: మొబైల్ టవర్లు, కాలుష్యం, పచ్చదనం తగ్గిపోవడంతో పిచ్చుకలు అంతరించి పోతున్నాయని సింగరేణి ఆర్జీ–వన్ జీఎం లలిత్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా శుక్రవారం తన కార్యాలయంలో వాల్పోస్టర్ విడుదల చేశారు. పర్యావరణ సమతుల్యతకు పిచ్చుకలు ఎంతో కీలకమన్నారు. వాటి సంరక్షణకు ప్రతీఒక్కరు బాధ్యతగా ముందుకు రావా లని కోరారు. కార్యక్రమంలో గ్రీన్ వారియర్ జేవీఎస్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఆర్థికాభివృద్ధికి చేయూత జ్యోతినగర్: మహిళల ఆర్థికాభివృద్ధికి ఎన్టీపీసీ చేయూత అందిస్తోందని దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత అన్నారు. మేడిపల్లి సెంటర్ సమీపంలోని వృత్తి శిక్షణ కేంద్రంలో కుట్టు శిక్షణ పొందిన మహిళలకు శుక్రవారం ఆమె సర్టిఫికెట్లను అందించి మాట్లాడారు. మహిళలు ఖాళీగా ఉండకుండా కుటీర పరిశ్రమలను నెలకొల్పి ఆదాయ మార్గాలను సమకూర్చుకోవాలన్నారు. ఎన్టీపీసీ ప్రభావిత, పునరావాస ప్రాంతాల్లోని యువతీయువకులకు వృత్తి శిక్షణ అందిస్తుందని తెలిపారు. అనంతరం జూట్ బ్యాగులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో దీప్తి మహిళా సేవా సమితి సభ్యులు, సీఎస్సార్ ప్రతినిధులు, కుట్టు శిక్షణ పొందిన మహిళలు తదితరులు పాల్గొన్నారు. -
బీమా..
అల్పాహారం!ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాప్రతీ కుటుంబానికి రూ.5లక్షల జీవిత బీమా ప్రస్తుతం 41 లక్షల కుటుంబాలు (2011 ప్రకారం.. 37 లక్షలు) ఇందిరమ్మ బీమా పొందే కుటుంబాలు: 8,00,000ఉమ్మడి జిల్లాకు కనీస అంచనా రూ.400 కోట్లుసాక్షి ప్రతినిధి, కరీంనగర్: 2026–27 రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం విద్యార్థులు, పేదలకు పెద్దపీట వేసింది. అల్పాహారం, కుటుంబ బీమాలతో ఉమ్మడి జిల్లాలో లక్షలాదిమంది లబ్ధిదారులుగా మారనున్నారు. అల్పాహారం పథకంతో 2.01లక్షల మంది పాఠశాల విద్యార్థులు, 33 వేల మందికిపైగా ఇంటర్ విద్యార్థులు లబ్ధిపొందనున్నారు. పథకం సమర్థంగా అమలు చేస్తే.. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్లు తగ్గుతాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో వరదకాలువకు రూ.249 కోట్లు, ఎల్లంపల్లికి రూ.449 కోట్లు చొప్పున కేటాయించింది. ఉమ్మడి జిల్లా నీటిపారుదలకు దాదాపు రూ.700 కోట్లు కేటాయించింది. శాతవాహన వర్సిటీకి ఏకంగా రూ.25 కోట్లు, ఏడాది జరగనున్న పుష్కరాలకు రూ.500 కోట్లు కేటాయించింది. ఉమ్మడి జిల్లాలోని ఽగోదావరి తీరాన ఉన్న ధర్మపురి, కోటిలింగాల, గోదావరిఖని, మంథని ఘాట్లలో సదుపాయాలు కల్పనకు త్వరలోనే పనులు మొదలు కానున్నాయి.హైదరాబాద్– కరీంనగర్ను అనుసంధానించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులైన కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వే లైన్కు ఎంత నిధులు ఇచ్చారన్నది స్పష్టం చేయలేదు. జగిత్యాల జిల్లా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, రాజన్న ఆలయ పునరుద్ధరణ, మాస్టర్ప్లాన్ కోసం వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ)కు నిధులు, పెద్దపల్లి జిల్లాలో ప్రతిష్టాత్మక పత్తిపాక రిజర్వాయర్పై ప్రకటన, కరీంనగర్ జిల్లా శంకరపట్నంలోని కల్వల ప్రాజెక్టు నిర్మాణాల విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. -
విప్ పదవి ప్రజలకే అంకితం
పెద్దపల్లి/సుల్తానాబాద్రూరల్: ప్రభుత్వం తనకు అప్పగించిన విప్ పదవి ప్రజలు, కార్యకర్తలకే అంకితం ఇస్తున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు అన్నారు. వి ప్గా నియాకమైన తర్వాత తొలిసారి హైదరాబాద్ నుంచి ఆయన శుక్రవారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి నుంచి జిల్లా కేంద్రంలోని జెండా కూడలి వరకూ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. దారిపొడవు నా ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆయనకు బ్రహ్మర థం పట్టారు. గర్రెపల్లి, సుల్తానాబాద్తోపాటు పె ద్దపల్లి జెండాకూడలిలో జరిగిన బహిరంగ సభలో ప్రభుత్వ విప్ మాట్లాడారు. రూ.156 కోట్ల వ్యయంతో పెద్దపల్లి బైపాస్ పనులకు ఏప్రిల్ మొదటివారంలో శంకుస్థాపన చేస్తామన్నారు. పెద్దపల్లిలోని పలు వార్డుల అభివృద్ధికి రూ.75 కోట్లు మంజూరయ్యాయని, రూ.1,350కోట్లతో నియోజకవర్గంలో చేపట్టిన అభివద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయని అన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే తన లక్ష్యమన్నారు. నియోజకవర్గంలో మిగిలిన పనులను పూర్తిచేస్తానని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి, ఐటీమంత్రి శ్రీధర్బాబు, మంత్రుల సహకారంతో తనకు విప్ లభించిందని పేర్కొన్నారు. కాగా, సుల్తానాబాద్లో కౌన్సిలర్ అమిరిశెట్టి శ్రావణి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అమిరిశెట్టి తిరుపతి ఆధ్వర్యంలో మంగళహారతులతో ఆయనకు స్వాగతం పలికారు. మాజీ ఎంపీటీసీ పల్లా సురేశ్ గజమాలతో సత్కరించారు. సుల్తానాబాద్, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్లు బిరుదు రాధా కృష్ణ, నూగిల్ల మల్లయ్య, జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావుతోపాటు మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, మొండయ్య, ప్రేమ్సాగర్రెడ్డి, సతీశ్, ఆకుల నర్సయ్య, శ్రీగిరి శ్రీనివాస్, అంతటి పుష్పలత, కళ్లపల్లి జానీ, పడాల అజయ్గౌడ్ పాల్గొన్నారు. -
భట్టి బడ్జెట్పై ఆశలు..!
● హుజూరాబాద్ నియోజకవర్గం రైతుల చిరకాలవాంఛ అయిన కల్వల ప్రాజెక్టు రూ.70 కోట్ల ప్రతిపాదనలతో నిర్మాణానికి ఇటీవల డీపీఆర్ కూడా సిద్ధమైంది. ఈ బడ్జెట్లో ప్రాజెక్టు నిర్మాణంపై ఎలాంటి ప్రకటన ఉంటుందోనని స్థానికులు ఎదురుచూస్తున్నారు.సాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాసనసభలో నేడు ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్పై ఉమ్మడి జిల్లావాసులు అనేక ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న పలు ప్రధాన ప్రాజెక్టులకు ఈసారైనా మోక్షం లభించేనా..? అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్ – కరీంనగర్ను అనుసంధానించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులైన కొత్తపల్లి – మనోహరాబాద్ రైల్వేలైన్, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, రాజన్న ఆలయ పునరుద్ధరణ, మాస్టర్ప్లాన్ కోసం వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ)కి నిధులు, పెద్దపల్లి జిల్లాలో ప్రతిష్టాత్మక పత్తిపాక రిజర్వాయర్పై ప్రకటన, కల్వల ప్రాజెక్టు నిర్మాణాలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటనలు చేస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.● వేములవాడ ఆలయ పునరుద్ధరణ, మాస్టర్ ప్లాన్ అమలు కోసం వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ) ఇప్పటి వరకు రూ.150 కోట్ల వరకు ఖర్చు చేసింది. మాస్టర్ప్లాన్ సమగ్ర అమలు, ఆలయ నిర్మాణం పూర్తవాలంటే.. మరో రూ.200 కోట్ల వరకు అవసరమవుతాయని అంచనా.● జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట దక్క న్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై ప్ర భుత్వం నుంచి ప్రకటన కోసం స్థానిక రైతులు ఎదురుచూస్తున్నారు. 2015లో మూ తబడిన ఈ పరిశ్రమను తిరిగి తెరిపిస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకూ రూ.172 కోట్ల బ కాయిలు చెల్లించింది. ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం దాదాపు రూ.250 కోట్ల వరకు అవసరమవుతాయని అంచనా వేసింది. 2025లో ఫ్యాక్టరీని తెరిపిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. నేటి బడ్జెట్లో ఆ మేరకు నిధులు కేటాయిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.● మనోహరాబాద్ నుంచి కొ త్తపల్లి వరకు రూ.2,780 కోట్లతో రైల్వేప్రాజెక్టు లైన్ పనులు నడుస్తున్నాయి. సిరిసిల్ల వరకు లైన్ పూర్తవగా.. సిద్ధిపేట – సికింద్రాబాద్ వరకు రైలు అందుబాటులోకి వచ్చింది. మిడ్మానేరులో బ్రిడ్జి పనులు ఇటీవల మొదలయ్యాయి. ఇక వేములవాడ, వెదిర, కొత్తపల్లి వరకు పనులు సాగుతున్నాయి. రాష్ట్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు, భూసేకరణ వంటి సమస్యలతో పనులు జాప్యమవుతున్నాయి. ఈ రైల్వేలైన్ పూర్తయితే.. ఉత్తర తెలంగాణ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. ఉమ్మడి జిల్లాకు రాజధానితో కనెక్టివిటీ పెరగడంతోపాటు కొమురవెల్లి, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి వంటి పుణ్యక్షేత్రాలకు భక్తుల రద్దీ పెరుగుతుంది.● రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి 2018లో కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తాత్సారంతో దాని నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఈఎస్ఐ ఆస్పత్రి పరిధిలో పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల ప్రాంతాల్లో పనిచేసే సుమారు 60వేల మంది కార్మికులకు వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. కేంద్రం రూ.150 కోట్లు నిధులు కేటాయించినా.. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా.. క్షేత్ర స్థాయిలో భూ కేటాయింపులు, తదితర పనుల జాప్యంతో ముందుకు సాగడం లేదు.● పెద్దపల్లితోపాటు కరీంనగర్, జగిత్యాల జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఎస్సారెస్పీ ఆయకట్టు భూములను స్థిరీకరించేందుకు ప్రతిపాదించిన శ్రీలక్ష్మీనరసింహ పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి నిధుల విడుదలపై ఉమ్మడి జిల్లా వాసులు ఆశలు పెట్టుకున్నారు. గతేడాది డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) తయారీ కోసం రూ.1.10 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. మూడు నుంచి ఐదు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే పత్తిపాక రిజర్వాయర్ పూర్తయితే పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, మంథని, కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, చొప్పదండి, జగిత్యాల జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గాల్లోని 2.40 లక్షల ఎకరాలతోపాటు కొత్తగా 10 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించవచ్చు.● రామగుండం బీ థర్మల్ పవర్ ప్లాంట్ మూసివేత అనంతరం, రాష్ట్ర ప్రభుత్వం 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల మంత్రివర్గంలో మంత్రుల బృందం ఎన్టీపీసీ, జెన్కో సంస్థల్లో ఏది తక్కువ వ్యయంతో ప్లాంట్ నిర్మించి, తక్కువ రేట్కు కరెంట్ ఇచ్చే సంస్థకు నిర్మించే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుని, నిధులు కేటాయిస్తేనే ఈ ప్రాంతవాసుల కోరికై నా ప్లాంట్ నిర్మాణానికి అడుగులు పడనున్నాయి. ప్రస్తుతం పాత బీ థర్మల్ ప్లాంట్ మిషనరినీ తుక్కు కింద విక్రయించేందుకు వివిధ విభాగాల అధికారులు అంచనాలు సిద్ధం చేస్తున్నారు. -
పెద్దపల్లి
శుక్రవారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2026ఘనంగా ‘ఉగాది’ వేడుకలు7బాసర ట్రిపుల్ ఐటీకి దరఖాస్తులుబాసర ట్రిపుల్ ఐటీలో ఆరేళ్ల బీటెక్ సమీకృత కోర్సులో చేరేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఓదెల: ఓదెల మల్లికార్జునస్వామి ఆలయంలో గురువారం హరిపురంకు చెందిన భక్తులు పోతుల రథంతో మొక్కులు సమర్పించుకున్నారు. అందరూ ఆశ్చర్యంగా చూశారు.ఓదెల మల్లికార్జునస్వామి ఆలయంలో వాహన పూజలురామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో పంచాంగ శ్రవణంశాంతినగర్ ఆలయంలో ..ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాంగ శ్రవణంతెలుగు సంవత్సరాది శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలను గురువారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఇళ్ల గుమ్మాలను మామిడితోరణాలతో అలంకరించారు. షడ్రుచులతో చేసిన పచ్చడిని ఇంటిల్లిపాది ఆరగించారు. సమీప ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకుల నుంచి పంచాంగ ఫలాలు తెలుసుకున్నారు. ఓదెల మల్లికార్జున స్వామి ఆలయం, కమాన్పూర్ శ్రీఆదివరాహస్వామి ఆలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు క్యాంపు కార్యాలయంలో పంచాంగ శ్రవణం చేయించి ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. పెద్దపల్లి మండలం పెద్దకల్వలలో మల్లన్నపట్నాలు, బోనాలతో మొక్కులు సమర్పించుకున్నారు. – పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్ -
కలెక్టర్ను కలిసిన ఎయిర్ హోస్టెస్
పెద్దపల్లి: ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాలకు ఎంపికై న 12 మంది గురువారం జిల్లా యువజన, క్రీడాధికారి సురేష్ ఆధ్వర్యంలో కలెక్టర్ శ్రీహర్షను కలిశారు. కలెక్టర్ అభినందించి జిల్లాలో ఎంపికై న బాలికల పూర్తి ఖర్చులు చెల్లిస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో గో ఫ్లై డైరెక్టర్ విశ్వరూపిణి, వ్యాయామ ఉపాధ్యాయులు కుమార్, ఉద్యోగం పొందిన అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. నాగవెళ్లి పట్నంజూలపల్లి: మండలంలోని కాచాపూర్లో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న శ్రీమల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామికి నాగవెళ్లి పట్నం వేశారు. ప్రతీ యాదవ సంఘ సభ్యుడు ఇంటి నుంచి బోనాలను శోభాయాత్రగా తీసుకొచ్చి పట్నంపై పెట్టి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు. ఒగ్గు కళాకారులు మలికార్జున స్వామి కల్యాణం జరిపించి, జీవిత చరిత్రను ఒగ్గు కథగా చెప్పడం ఆకట్టుకుంది. యాదవ సంఘ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కొత్త సాగు ప్రారంభంకాల్వశ్రీరాంపూర్: ఉగాది పండుగ రోజు రైతులు కొత్త సాగు ప్రారంభించడం అనవాయితీగా వస్తోంది. వేద పండితులు చెప్పిన విధంగా కొందరు రైతులు తమ రాశులు, నక్షత్రం ప్రకారం వ్యవసాయ పనులు ప్రారంభిస్తుండగా.. మరికొందరు ఉగాది రోజు ప్రారంభిస్తారు. పంట పొలంలో తుమ్మలు, పొరకలు, పత్తి చెట్లు గొడ్డలితో నరికి వేస్తారు. ఇలా గొడ్డలి ఉపయోగించి తుమ్మలు తొలిగించడమే కొమ్మ కొట్టడం అని పిలుస్తారు. కొమ్మ కొట్టడంతో వ్యవసాయ పనులు ప్రారంభమైనట్లే. వీలు చూసుకుని ఎరువు తోలడం, దున్నడం చేస్తారు. విగ్రహ ప్రతిష్ఠకు మంత్రి రూ.3,00,116 విరాళంధర్మారం: ధర్మారం మండలం నందిమేడారంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న గంగమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్కుమార్ రూ.3,00,116 విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని గురువారం ధర్మారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అరిగె లింగయ్య చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం నాయకులు సభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. వెలుగులు పంచాలిజ్యోతినగర్: శ్రీపరాభవ నామ తెలుగు సంవత్సరం ప్రజలందరికీ వెలుగులు పంచాలని ఎన్టీపీసీ రామగుండం తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. గురువారం పర్మినెంట్ టౌన్షిప్ జ్యో తిక రిక్రియేషన్ క్లబ్ మ్యూజిక్ హాలులో ఏర్పా టు చేసిన ఉగాది వేడుకల్లో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు రుధ్రభట్ల శ్రీకాంత్ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. జీఎంలు ముకుల్రా య్, మనీష్ అగర్వాల్, కార్పొరేటర్ కవితారె డ్డి, ఏజీఎం బిజయ్కుమార్ సిగ్దర్, ఎన్టీపీసీ ఉ ద్యోగ గుర్తింపు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు భాస్కర్రెడ్డి, సాగర్ రాజు, ఐఎన్టీయూసీ నా యకులు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ విప్గా విజయరమణారావు
సాక్షి పెద్దపల్లి:శాసనసభ విప్గా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావును నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్టారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వ కార్యకలాపాలను మరింత వేగవంతం చేసేందుకూ, శాసనసభ వ్యవహారాలను సమన్వయం చేసేందుకు వీలుగా ప్రభుత్వం కొత్తగా ముగ్గురు ఎమ్మెల్యేలను విప్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుకు విప్గా అవకాశం రావటంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. జిల్లాకు మరో పదవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ విప్గా దుద్దిళ్ల శ్రీధర్బాబు వ్యవహరించగా, తాజాగా మరో సారి విజయరమణారావుకు ప్రభుత్వ విప్గా అవకాశం దక్కింది. పెద్దపల్లి జిల్లా నుంచి ఇప్పటికే మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు మంత్రిగా వ్యవహరిస్తూ, ఐటీ పరిశ్రమల శాఖలతో పాటు శాసనసభ వ్యవహారాలు సైతం మంత్రి శ్రీధర్బాబు పర్యవేక్షిస్తుండగా, తాజాగా పెద్దపల్లి నుంచే ఎమ్మెల్యే విజయరమణారావు విప్గా నియామాకమయ్యారు. మొత్తంగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మంత్రి శ్రీధర్బాబుతో పాటు అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వివేక్లు ప్రాతినిథ్యం వహిస్తుండగా, తాజాగా విజయరమణారావుకు పదవి వరించింది. కాల్వశ్రీరాంపూర్ మండలం ఆరెపల్లి గ్రామంతో అనుబంధం ఉన్న ఎమ్మెల్యే బల్మూరి వెంకట్ సైతం శాసనమండలి విప్గా నియామకయ్యారు. సీఎం సన్నిహితుడుకి దక్కిన గౌరవం సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే విజయరమణారా వులు ఇరువురు టీడీపీ పార్టీలో నుంచి సన్నిహితులు. వీరిద్దరు ఒకేసారి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ఎమ్మెల్యే విజయరమణారావుకు విప్ పదవి దక్కనున్నట్లు ప్రచారం జరిగిన నియామకం జరగలేదు. తాజాగా ముగ్గురు విప్లను నియమించగా, అందులో సీఎం రేవంత్రెడ్డి తన సన్నిహితుడు విజయరమణారావుకు అవకాశం కల్పించారు. సభా నిర్వహణలో విప్లదే కీలక పాత్ర శాసనసభలో ఏదైనా బిల్లుపై ఓటింగ్ జరిగినప్పుడు లేదా ముఖ్యమైన చర్చలు జరిగినప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలందరూ హాజరయ్యేలా చూడటంలో విప్ల పాత్ర అత్యంత కీలకం. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరూ ఓటు వేయకుండా పార్టీ లైన్ను అమలు చేయటం వారి ప్రధాన బాధ్యత. కాంగ్రెస్లో జోష్ పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడిగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ వ్యవహరిస్తుండగా, 58 కార్యవర్గంతో పూర్తిస్థాయి డీసీసీ కమిటీలను గురువారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ ప్రకటించారు. 6గురు డీసీసీ ఉపాధ్యక్షులు, 12మంది ప్రధాన కార్యదర్శులు, ఒక్క ట్రెజరీ, నలుగురు అధికార ప్రతినిధులు, 16సెక్రటరీలు, 19మంది కార్యవర్గ సభ్యులతో జంబో కమిటీలను నియామించటంతో ఎన్నో రోజులుగా పార్టీ పదవుల కోసం ఎదురుచూస్తున్న వారికి అవకాశం దక్కటంతో వారిలో ఆనందం వ్యక్తమవుతుంది. డీసీసీ కమిటీతో పాటు జిల్లాకు మరో పదవి వరించటంతో జిల్లా కాంగ్రెస్లో జోష్ పెరిగింది.1983లో టీడీపీ పార్టీతో రాజకీయ ప్రవేశం చేసిన విజయమరమణరావు, 1993–95 వరకు జూలపల్లి మండల టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1995 నుంచి 2000వరకు జూలపల్లి జెడ్పీటీసీగా, 2001–23లో ఉమ్మడి కరీంనగర్ తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా, 2003–05వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీడీపీ పార్టీ సెక్రటరీగా, 2005–07వరకు ఆర్గనైజింగ్ సెక్రటరీగా, 2007–09వరకు వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా మొదటిసారి ఎన్నికయ్యారు. 2010–17 వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసి. 2017 అక్టోబర్లో రేవంత్రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023లో రెండోసారి పెద్దపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. -
వీరబ్రహ్మేంద్రస్వామికి పూజలు
మంథని: విశ్వబ్రాహ్మణులు తమ ఆచారం ప్రకారం ప్రతీఉగాది పండుగ ముందు వచ్చే అమావాస్య నుంచి మూడురోజులపాటు స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో బుధవారం కూడా ప్రత్యేక పూజలు చేశారు. అడవిలో లభించే తీగదారి పుష్పాలతో మండపాలను ప్రత్యేకంగా తయారు చేసుకున్నారు. అందులో వీర బ్రహ్మేంద్రస్వామి చిత్రపటం, పనిముట్లను ఉంచారు. మూడు రోజులపాటు విశేష పూజలు చేయనున్నారు. తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్చార్జిగా ఎస్.కుమార్ గోదావరిఖని: తమిళ నాడు రాష్ట్ర బీజేపీ ఎన్ని కల కో ఇన్చార్జిగా రా మగుండం ప్రాంతానికి చెందిన ఎస్.కుమార్ను నియమించారు. బుధవారం నియామక ఉత్తర్వులు జారీచేశారు. త మిళనాడులో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎ న్నికలను పురస్కరించుకుని ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్సింగ్ఆర్య ఉత్తర్వు లు జారీచేశారు. తమిళనాడు, పశ్చిమబెంగా ల్, అసోం, పుదుచ్చేరి, కేరళం రాష్ట్రాలకు కూ డా ఎస్సీ మోర్చా తరఫున ప్రభారీ, సహ ప్ర భారీలను నియమించారు. ఇందులో భాగంగా తమిళనాడుకు ప్రభారీగా శంభునాథ్తుండియా, సహ ప్రభారీలుగా ఎస్.కుమార్, మాజీ ఎంపీ మునిస్వామిని నియమించారు. రాజకీయ కక్షతోనే దాడి ఎలిగేడు: బుర్హాన్మియాపేటకు చెందిన రజకుడు చంద్రగిరి పరశురాములుపై అగ్రవర్ణ వ్యక్తులు రాజకీయ కక్షతోనే దాడిచేశారని తె లంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూ సాల సంపత్ కుమార్ ఆరోపించారు. బా ధిడుతు పరశురాములును బుధవారం సంపత్కుమార్ పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. నాగర్కర్నూల్ జిల్లా కొమ్మెర ఘటన మరువక ముందే బుర్హాన్మి యాపేటలో పోచమ్మకు మొక్కులు చెల్లించు కుని ఇంటికి చేరుకున్న పరశురాములును కు లం పేరుతో దూషించి దాడి చేయడం దు ర్మార్గమన్నారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిందితుల అరెస్ట్ విషయంలో స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు జోక్యం చేసుకోరాదని ఆయన కోరారు. నాయకులు గంగిపెల్లి శంకర్ పొన్నం శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆకట్టుకున్న ‘సంప్రదాయం’ యైయెటింక్లయిన్కాలనీ: ఉగాది పండుగను పురస్కరించుకొని జల్లారంలోని ఓ ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగులు బుధవారం సంప్రదా య దుస్తులతో విధులకు హాజరయ్యారు. సి బ్బంది అందరూ ఒకేరకమైన రంగులతో కూ డిన దుస్తులు ధరించి కనిపించడంతో ఖాతా దారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వా త వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చీఫ్ మేనేజర్ సంజయ్ కుమార్, ఉద్యోగులు విజయభాస్కర్, రాములు, దీపక్, దినేశ్, ప్రసన్న, శ్రీకాంత్, మణికంఠ, దుర్గారావు, విజయ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు పెద్దపల్లి: పదో తరగతి పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయని డీఈవో శారద తెలిపారు. మొత్తం 7,489 మంది విద్యార్థులకు 7,480 మంది హాజరయ్యారని, 99.9 శాతం హాజరు నమోదు అయ్యిందన్నారు. ‘విజన్లేని నివేదిక’ధర్మారం: ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి నేతృత్వంలోని విద్యా కమిషన్ ప్రభుత్వానికి అందించిన నివేదికకు విజన్ లేదని తపస్ జి ల్లా ప్రధానకార్యదర్శి జగన్ విమర్శించారు. మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో జగన్ మాట్లాడా రు. మురళి అందించిన రిపోర్టు విద్యా వ్యవస్థ ను భ్రష్టు పట్టించేలా ఉందని ధ్వజమెత్తారు. నివేదిక రూపొందించే ముందు క్షేత్ర స్థాయి లో పనిచేసే ఉపాధ్యాయుల అభిప్రాయాల ను పరిగణనలోకి తీసుకుని సమీక్షించుకోవా లని సూచించారు. తపస్ మండల అధ్యక్షుడు గుర్రాల గంగారెడ్డి, బాధ్యులు వనపర్తి అంజ య్య, జైపాల్రెడ్డి, శశిధర్, సతీశ్, శ్రీనివాస్రె డ్డి, ఉమాశంకర్, శ్రీనివాస్,ప్రశాంత్ ఉన్నారు. -
గ్రామీణ క్రీడలతో ప్రతిభ వికాసం
జ్యోతినగర్: గ్రామీణ క్రీడలతో క్రీడాకారుల్లోని ప్రతిభ వికసిస్తుందని ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. బుధవారం ఎన్టీపీసీ టెంపరరీ టౌన్షిప్ జెడ్పీ హైస్కూల్ క్రీడా మైదానంలో మూడురోజులుగా ఎన్టీపీసీ నిర్వహిస్తున్న గ్రామీణ క్రీడా పోటీలు(ఖోఖో, వాలీబాల్) బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా విజేతలకు ఈడీ బహుమతులు అందించి మాట్లాడారు. యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు క్రీడలు అవసరమన్నారు. సీఎస్సార్ కార్యక్రమాల ద్వారా ఎన్టీపీసీ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. విద్య, ఆరోగ్యం, క్రీడలు వంటి రంగాల్లోనూ విశేష సేవలు అందిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం బిజయ్ కుమార్ సిగ్దర్, ప్రవీణ్ కే చౌదరి, ఫిజికల్ డైరెక్టర్లు, రామగుండం, అంతర్గాం, పాలకుర్తి, కమాన్పూర్ మండలాల్లోని 21 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన సుమారు 1,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
బలోపేతం అవుతాయి
గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను సర్పంచులు పర్యవేక్షిస్తే మరింత బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సర్పంచులకు అదనపు బాధ్యతలు అయినా కేంద్రాల నిర్వహణ బాగుంటుంది. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం సక్రమంగా అందిస్తారు. – దండెవేన సంధ్య – బానేశ్, సర్పంచ్, గుంజపడుగు ప్రభుత్వ నిర్ణయం సరైనదే అంగన్వాడీ కేంద్రాలను పటిష్టం చేసే దిశగా ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం హర్షణీయం. ప్రతీగ్రామంలోని అంగన్వాడీ కేంద్రం పర్యవేక్షణ బాధ్యత సర్పంచ్కు అప్పగించడం చాలా మంచిది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సేవలు మరింత మెరుగుపడతాయి. అంగన్వాడీ కేంద్రాలు సక్రమంగా నిర్వహించేలా పర్యవేక్షణ చేస్తాం. – ఎరవెల్లి కృష్ణవేణి – నరేశ్రావు, సర్పంచ్, దుబ్బపల్లి -
స్వశక్తి మహిళలకు అనిత ఆదర్శం
కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరంలో స్వశక్తి మహిళలకు బూర్గుల అనిత ఆదర్శంగా నిలిచారని మేయర్ మహంకాళి స్వామి, మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ ప్రశంసించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇటీవల నిర్వహించిన అమృత్మిత్ర మహోత్సవ్లో నగరం నుంచి ప్రాతినిధ్యం వహించిన బూర్గుల అనితను బుధవారం మేయర్, కమిషనర్ తమ చాంబర్లలో ప్రత్యేకంగా అభినందించారు. 59వలోని మార్గదర్శి స్లమ్ సమాఖ్యలో భాగమైన శ్రీసరస్వతి మహిళా పొదుపు సంఘం సభ్యురాలు బూర్గుల అనిత అమృత్ మిత్రగా ఎంపికై కొంతకాలంగా దుర్గానగర్ అమృత్ పార్క్లో పనిచేస్తున్నారు. ఈనెల 13న న్యూఢిల్లీలో నిర్వహించిన అమృత్మిత్ర మహోత్సవ్లో పాల్గొనడానికి తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి ఐదుగురిని నామినేట్ చేయగా, అందులో రామగుండం నుంచి అనితకు అవకాశం లభించింది. న్యూఢిల్లీ వెళ్లి వచ్చిన అనిత.. మర్యాద పూర్వకంగా మేయర్, కమిషనర్ను కలిశారు. -
మహిళలు చదవాలి.. ఉన్నతంగా ఎదగాలి
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: మహిళలు విద్యావంతులైతే ఆ కుటుంబమే కాదు సమాజంలో కూడా మార్పు కనిపిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్జి మాట్లాడారు. మహిళల కోసం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామని, కానీ, మహిళలు ఏ పనిచేయకుండా ఉంటే ఆ రోజే గడవదన్నారు. సమాజంలో వస్తున్న ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా మహిళలు సైతం పోటీపడుతున్నారని అన్నారు. మహిళల కోసం అనేక చట్టాలు అమల్లో ఉన్నాయన్నారు. న్యాయసేవలను ఉచితంగా పొందేందుకు జిల్లా కోర్టు ఆవరణలో న్యాయసేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందిని, వేణుగోపాల్, రవీందర్, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డుపై చెత్తవేసినందుకు రూ.10వేల జరిమానా
పెద్దపల్లిరూరల్: పట్టణంలోని రోడ్లపై చెత్తను పడేస్తే జరిమానా కట్టాల్సిందే. పట్టణ శివారు రంగంపల్లిలోని టైల్స్ దుకాణం నుంచి వెలువడ్డ చెత్తను రోడ్డుపై వేసినందుకు మున్సిపల్ అధికారి రమాకాంత్ బుధవారం నిర్వాహకులకు రూ. 10వేలను జరిమానా విధించారు. పట్టణాన్ని స్వచ్ఛపెద్దపల్లిగా తీర్చిదిద్దడంలో ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ కోరారు. నివాసాలు, వ్యాపార స్థలాల నుంచి వెలువడే వ్యర్థాలను, పాలితిన్ కవర్లను రోడ్లపై, డ్రైనేజీల్లో పడేయొద్దని సూచించారు. పారిశుధ్య సిబ్బంది ఇంటింటికీ, దుకాణాల వద్దకు వచ్చి చెత్త సేకరిస్తారని, వారికే చెత్త అందించాలని ఆయన సూచించారు. నిర్లక్ష్యంగా రోడ్లపై పడేసే వారిని గుర్తించి జరిమానా విధిస్తామని ఆయన హెచ్చరించారు. -
అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
పెద్దపల్లి: జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. స్థానిక జెడ్పీ హైస్కూల్(బాలురు)లోని పదో తరగతి పరీక్ష కేంద్రం, ప్రభుత్వ ఐటీఐలో చేపట్టిన స్విమ్మింగ్పూల్, వ్యవసాయ మార్కెట్లో చేపట్టిన ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ కాంప్లెక్స్ పనులను బుధవారం ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టరేట్లో మూడురోజులుగా జరుగుతున్న శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. 2027లో చేపట్టే జనగణన తొలిదశలో నివాసాలు, భవనాలను పారదర్శకంగా నమోదు చేయాలన్నారు. జిల్లా అవసరాలకు సరిపడా ఎల్పీజీ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. వంటగ్యాస్ను బ్లాక్ మార్కెట్కు తరలించి కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటి వరకు 12 కేసులు నమోదు చేసి 29 సిలిండర్లు సీజ్ చేశామని తెలిపారు. సమాచారం కోసం హెల్ప్లైన్ 08728– 224045కు ఫోన్చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీ పాల్గొన్నారు. -
లేబర్ కోడ్లు రద్దు చేయాలి
గోదావరిఖని: నాలుగు లేబర్కోడ్లు రద్దు చేయాల ని ఐఎఫ్టీయూ నాయకులు కోరారు. బుధవారం జీఎం కార్యాలయంలో పర్సనల్అధికారి వేణుగోపాల్కు ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్ వి నతిపత్రం అందజేశారు. రామకృష్ణ, చింతల శేఖర్, ఎం.కాంతయ్య రాజయ్య, శేఖర్ పాల్గొన్నారు. నాయబ్ తహసీల్దార్లకు పదోన్నతి కరీంనగర్ అర్బన్: ఉమ్మడి జిల్లాలో పలువురు నా యబ్ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతి కల్పి స్తూ సీసీఎల్ఎ ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెంన 14మంది నాయబ్ తహసీల్దార్లకు పదోన్నతి లభించగా ఇతర జిల్లాల్లో పదోన్నతి పొందిన ఐదుగురిని ఉమ్మడి జిల్లాకు అలాట్ చేశారు. బదిలీ అయిన వారి వివరాలు అబ్దుల్ ఖాదీర్ జగిత్యాల నుంచి నిర్మల్కు, బీఎస్ఎ స్ వరప్రసాద్ జగిత్యాల నుంచి ఆదిలాబాద్కు, స య్యద్ నిజాముద్దీన్ కరీంనగర్ నుంచి కొమురంబీం ఆసిఫాబాద్కు, మన్లోజ్ కిరణ్కుమార్ జగిత్యాల నుంచి నిజామాబాద్కు, దోమ మారుతిరెడ్డి రాజన్న సిరిసిల్లలోనే పోస్టింగ్ తీసుకున్నారు. కట్ట విష్ణు జగి త్యాల నుంచి నిజామాబాద్కు, ముక్తర్ పాషా రాజ న్న సిరిసిల్ల నుంచి జగిత్యాలకు, తూకుంట్ల వసంతరావు కరీంనగర్ నుంచి జయశంకర్భూపాలపల్లికి, తడ స్వరూపరాణి కరీంనగర్ నుంచి జయశంకర్ భూపాలపల్లికి బదిలీ అయ్యారు. బైరం అచ్యూతరెడ్డి జగిత్యాల నుంచి నిజామాబాద్కు, అజ్మత్ నవాజ్ క రీంనగర్ నుంచి నిజామాబాద్కు, బొమ్మకంటి శ్రీని వాస్ జగిత్యాల నుంచి ఆదిలాబాద్కు, వైశాలి కరీంనగర్ నుంచి రాజన్న సిరిసిల్లకు, దివ్యజ్యోతి రాజన్న సిరిసిల్ల నుంచి నిజామాబాద్కు బదిలీ అయ్యారు. ఇతర జిల్లాల నుంచి వచ్చినవారు కొలుగూరి రవీందర్రావు వరంగల్ నుంచి పెద్దపల్లికి బదిలీ అయ్యారు. బి.రాజశేఖర్, ఎం.దత్తాద్రి, ఎండి.మునీరుద్దీన్ నిజామాబాద్ నుంచి, బానపు రం జ్యోతి కామారెడ్డి నుంచి జగిత్యాలకు వచ్చారు. అధికారికి కంపల్సరీ రిటైర్మెంట్ గోదావరిఖని: సింగరేణి అధికారికి కంపల్సరీ రిటైర్మెంట్ ఇస్తూ యాజమాన్యం బుధవారం ఆదేశా లు జారీ చేసింది. రామగుండం రీజియన్లోని ఈ అండ్ఎంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ ఇంజినీర్ను కంపల్సరీ రిటైర్మెంట్ చేయాలని ఆదేశాలు జారీఅయ్యాయి. ఇల్లెందులో పనిచేస్తున్న సమయంలో ఓ చోరీ విషయంలో బాధ్యుడిగా చేస్తూ విజిలె న్స్ విచారణ కొనసాగింది. సదరు అధికారి హస్తం ఉందని తేలడంతో యాజమాన్యం కంపల్సరీ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
చెరువులో అస్థికలు లభ్యం
మూడు నెలల క్రితం అదృశ్యం.. కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన జిలుకర లింగయ్య(87) మూడు నెలల క్రితం అదృశ్యమయ్యాడు. మంగళవారం టేకుమట్ల మండలం బోర్నపల్లి శివారులోని చెరువులో అస్థికలు లభ్యం అయ్యాయి. లింగయ్య మతిస్థిమితం కోల్పోయాడు. మూడునెలల క్రితం ఇంట్లో చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పొరుగున ఉన్న టేకుమట్ల, చిట్యాల, ఓదెల, జమ్మికుంట, ముత్తారం మండలాల్లో లింగయ్య ఫొటోతో వాల్పోస్టర్లు వేశారు. లింగయ్య అస్థికలు, దుస్తులతో కూడిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అవి.. తమ తండ్రివేనని కుమారుడు రమేశ్ గుర్తించాడు. అంతేకాదు.. బోర్నపల్లికి వెళ్లి అవి తన తండ్రి లింగయ్య వేనని నిర్ధారణ చేశాడు. దీంతో అక్కడి పోలీసులు వరంగల్ ఎంజీఎం ఫోరెనిక్స్ పంపించారు. మృతుడి అస్థికలను స్వగ్రామమైన మొట్లపల్లిలో రాత్రి ఖననం చేశారు. మృతుడికి కుమారుడు రమేశ్, కూతురు లక్ష్మి ఉన్నారు. మొట్లపల్లి సర్పంచ్ తులా మనోహర్రావు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. -
కొందరికే వేతనాలు..
కోల్సిటీ(రామగుండం): ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా ఆనందం వెల్లివిరియాల్సిన ఆ కుటుంబాల్లో ఆందోళన, ఆవేదన, నిరాశే మిగిలింది. రామగుండం కార్పొరేషన్లో పనిచేసే సుమారు 125 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అందక వారి కుటుంబాలు పండుగపూట పస్తులు ఉండాల్సిన దుస్థితి తలెత్తింది. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వీరికి మూడోవారం గడుస్తున్నా జీతాలు అందలేదు. ‘ఆర్థిక సంక్షోభం’, మూడోవారం గడుస్తున్నా కార్మికులకు అందని వేతనాలు శీర్షికన బుధవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించినా.. అందరికీ న్యాయం జరగలేదు. శానిటేషన్ సిబ్బందికే ఊరట ‘సాక్షి’ కథనంతో తక్షణ చర్యలు చేపట్టిన అధికారులు.. శానిటేషన్లోని 448 మంది అవుట్సోర్సింగ్ కార్మికుల వేతనాలను బ్యాంక్ ఖాతాల్లో జమచేశారు. ఇతర విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 125 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేదు. వీరికి జీతాలు చెల్లించడానికి సుమారు రూ.21 లక్షలు అవసరమని, ప్రస్తుతం ఆ మేరకు నిధులు లేవని అధికారులు చేతులెత్తేశారు. పండగపూట కష్టాలు శానిటేషన్ సిబ్బందికి జీతాలు జమకావడంతో.. తమకూ వస్తాయని ఆశతో ఎదురుచూసిన ఆఫీస్ సిబ్బందికి నిరాశే మిగిలింది. ఉగాది, రంజాన్ పండగల వేళ కుటుంబ ఖర్చులు పెరిగి, చేతిలో డబ్బు లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. అండగా నిలవని సంఘాలు వేతన సమస్యపై అధికారులను ప్రశ్నించేందుకు కార్మిక సంఘాలు, ప్రజాప్రతినిధులు ముందుకు రాకపోవడం ఉద్యోగుల్లో మరింత ఆవేదన కలిగిస్తోంది. సమస్యను ఎవరూ పట్టించుకోకపోవడంతో తమ పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. సమాధానం లేని అధికారులు వేతనాల చెల్లింపుల్లో ఆలస్యంపై అధికారులను ప్రశ్నిస్తే స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియక ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. వేతనాల కోసం ఎదురుచూస్తున్న కార్మికులు, పండగపూట పస్తులుండాల్సి వచ్చింది. దీంతో బల్దియా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీవితం అనిశ్చితిలో కూరుకుపోయింది. -
‘పర్యవేక్షణ’ ఫలితమిచ్చేనా?
మంథనిరూరల్: ఐదేళ్ల వయసులోపు చిన్నారులతోపాటు గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే అంగన్వాడీ కేంద్రాలను మరింత పటిష్టం చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే అధికారులు పర్యవేక్షించే అంగన్వాడీ కేంద్రాలపై సర్పంచులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ గాడితప్పుతోందనే ఆరోపణల నేపథ్యంలో సర్పంచులకు అదనంగా అప్పగించిన పర్యవేక్షణ బాధ్యతలు ఫలితమిస్తాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 706 అంగన్వాడీ కేంద్రాలు జిల్లాలో మొత్తం 706 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 40 వేల మందికిపైగా చిన్నా రులు, 3వేల మంది గర్భిణులు, 2,900 మంది బాలింతలు ప్రయోజనం పొందుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరికి ప్రతీరోజు కోడిగుడ్లు, పాలు, పౌష్టికాహారం అందించాలి. పౌష్టికాహారం, వివిధ సేవలు, విద్యా కార్యక్రమాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం తాజా చర్యలు చేపట్టింది. సర్పంచ్ చైర్మన్గా కమిటీలు ప్రతీఅంగన్వాడీ కేంద్రంలో సర్పంచ్ చైర్మన్గా 11మంది సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తారు. ఇందులో సర్పంచ్, అంగన్వాడీ టీచర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, రిటైర్డ్ ఉద్యోగి, ఏఎన్ఎం, చిన్నారుల తల్లులతో కమిటీలు ఏర్పాటు చేస్తారు. గతంలో కూడా కమిటీలు ఉన్నా.. పర్యవేక్షణ నామమాత్రంగానే సాగేది. సర్కార్ తాజా నిర్ణయం ద్వారా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ గాడిలో పడే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. ప్రతీ అంశాన్ని పరిశీలించాల్సిందే అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలు సర్పంచులకు అప్పగించిన క్రమంలో వాటినిర్వహణలో ప్రతీఅంశంపై పరిశీలించాల్సి ఉంది. సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ద్వారా సరఫరా చేసే గుడ్లు, పాలు, కందిపప్పు, బియ్యం, బాలామృతం పంపిణీ సక్రమంగా జరుగుతుందా? లేదా అని పరిశీలించాలి. ప్రభుత్వం అందించే నిధుల వినియోగం, ప్రతీనెల సరుకుల పంపిణీ, నాణ్యత తదితర అంశాలు తనిఖీ చేయాలి. ప్రతీనెల సమావేశం నిర్వహించి లోపాలను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించాలి. -
ఏం తింటున్నారు?
సాక్షి పెద్దపల్లి: సుమారు పదహారేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, పర్యవేక్షణ అధికారులు, సామగ్రి తదితర అంశాలపై దృష్టి సారించింది. సిబ్బంది నియామకం, గ్రామాల వారీగా మ్యాప్ల తయారీ తదితర వాటిపై కసరత్తు చేస్తోంది. ఇది దేశంలో తొలిసారి పూర్తిగా డిజిటల్ పద్థతిలో జరిగే జనగణన కావడం గమనార్హం. మొబైల్ ఫోన్లలో నమోదు ఈసారి డిజిటల్ విధానంలో జనగణన చేపట్టనుండడంతో ఎన్యూమరేటర్లు తమ మొబైల్ ఫోన్లలోని ప్రత్యేక యాప్ లేదా పోర్టల్ ద్వారా సమాచారాన్ని అక్కడికక్కడే ఆన్లైన్లో పొందుపరుస్తారు. ప్రజలు కూడా స్వయంగా ఆన్లైన్లో తమ వివరాలను నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే, ఎక్కడ కూడా డబుల్ ఎంట్రీలు ఉండకుండా పర్యవేక్షించేందుకు అధికారులకు శిక్షణ ఇచ్చారు. రెండు విడతలుగా గణన జన గణనకు కేంద్ర హోంశాఖ గతేడాది జూన్లోనే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2027 మార్చి ఒకటో తేదీ నాటికి రెండు దశల్లో జనాభా లెక్కలు సేకరించనున్నారు. తొలిదశలో ఇళ్ల జాబితాను వెలువరించి, రెండోదశలో జన గణన చేపడతారు. సాధారణంగా పదేళ్లకోసారి జనాభా లెక్కలు సేకరించాలి. చివరిసారిగా 2011లో జన గణన నిర్వహించారు. ఆ తర్వాత 2021 లె క్కించాల్సి ఉండగా, 2020లో కోవిడ్ నేపథ్యంలో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా 16వ జనగణనకు రంగం సిద్ధమైంది. జనగణనతోపాటు ఈసారి కుల గణన, జాతీయ పౌర పట్టిక (నేషనల్ సివిల్ రిజిష్టర్) ఒకేసారి చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మే 11 నుంచి నివాసాల గుర్తింపు ఈఏడాది తొలుత నివాసాల గుర్తింపు (హౌస్ లిస్టింగ్) ప్ర క్రియ చేపడతారు. అనంతరం రెవెన్యూ, మున్సిపల్, గ్రామ పంచాయతీ, ప్రణాళిక శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సరిపోల్చుతారు. 2027 ఫిబ్రవరిలో ఇంటింటికీ వెళ్లి జన గణన చేపడతారు. ఫిబ్రవరి 28 తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు జన్మించిన వారివివరాలనూ నమోదు చేస్తారు. మార్చి ఒక టో తేదీ వరకు జనగణన ప్రక్రియ ముగుస్తుంది. గణకులు గా నియమితులయ్యే వారికి త్వరలో శిక్షణ ఇవ్వనున్నారు. ఇంటింటికీ రెండు దఫాలుగా.. ఈసారి మొబైల్ యాప్లో జనాభా వివరాలు నమోదు చేస్తారు. ఎన్యూమరేటర్లు ప్రతీ ఇంటికి రెండుదఫాలుగా వెళతారు. తొలిసారి నివాసాలను లెక్కిండంతోపాటు కుటుంబ స్థితిగతులు, ఆస్తులు, ఆదాయం, వసతులు వంటివి సేకరిస్తారు. రెండోదశలో జనాభా వివరాలు సేకరించేందుకు ఇంటింటికీ వెళతారు. కుల, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సమాచారం సేకరిస్తారు. ఏ ఇంట్లో ఉంటున్నారు? ఏం తింటున్నారు? ప్రధాన తాగునీటి వసతి ఏమిటి? వంట చేయడం కోసం ఏ ఉపయోగిస్తున్నారు? మరుగుదొడ్డి సౌకర్యం ఉందా? తదితర 33 ప్రశ్నలు అడిగి వివరాలు నమోదు చేస్తారు. అన్నింటికీ ఇదే ఆధారం రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చబోయే నియోజకవర్గాల డీలిమిటేషన్, లోక్సభ స్థానాల సంఖ్య పెంపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లతో పాటు మహిళా రిజర్వేషన్, కేంద్రప్రభుత్వం రాష్టాలకు ఇచ్చే ఆర్థిక సంఘం నిధులు, ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టే పథకాలకు జనాభా లెక్కలు కీలకం కానున్నాయి. అందుకే పొరపాట్లు తలెత్తకుండా జనాభా లెక్కలు ప్రక్రియకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. అధికారులకు బాధ్యతలు కలెక్టర్ నేతృత్వంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ), డీఆర్వో, సీపీవో సహా రాష్ట్ర ప్రభుత్వం నియమించే మరోఅధికారితో జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తారు. మండలస్థాయిలో తహసీల్దార్ జనగణన అధికారిగా వ్యవహరిస్తే.. ఏఎస్వో (అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్) సహాయకుడిగా పనిచేస్తారు. గణకులు (ఎన్యూమరేటర్లు)గా ప్రభుత్వ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తారు. ఐదారుగురు గణకులకు ఒక సూపర్వైజర్ ఉంటారు. ఎక్కడుంటున్నారు? మీ ఆదాయం ఎంత? మీ ఇంట్లో మరుగుదొడ్డి ఉందా? మొదలైన జనాభా లెక్కల సన్నాహాలు ఈఏడాది నివాసాల గుర్తింపు వచ్చే ఏడాది జనాభా లెక్కింపు తొలిసారి డిజిటల్ విధానం అమలు -
శ్రీపరాభవ నామం.. షడ్రుచుల మేళం
● నేడు ఉగాది పర్వదినంకోల్సిటీ(రామగుండం): వనాలన్నీ చిగురించే వేళ, పూల పరిమళాలు వెదజల్లే సమయాన.. లేలేత చివుళ్లు వేసి... కోయిలమ్మల కుహు కుహూ రాగాలు .. హాయినిచ్చే వెచ్చని గాలులు.. వచ్చేది వసంతం.. ఆరు రుతువుల్లో ఇది ప్రత్యేకం. తెలుగు సంవత్సర ఉగాదిని ప్రతి ఏడాది చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకోవడం అనవాయితీ. నేటి నుంచి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆరంభం కానుంది. ‘పరాభవ నామ సంవత్సరం’ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, సామాజిక, జీవన మార్గదర్శక భావనలను అందిస్తుంది. ‘పరాభవ’’ అనే పదానికి సాధారణంగా ‘పరాజయం’ అనే అర్థం ఉన్నప్పటికీ, ఇది మన లోపాలను గుర్తించి, వాటిని జయించి, విజయానికి పునాది వేయాలని సూచిస్తుంది. నేడు ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణానికి ఏర్పాట్లు చేశారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరపనున్నారు. -
వడగండ్లు.. కడగండ్లు
కాల్వశ్రీరాంపూర్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం వేకువజామున సుమారు గంటపాటు భారీవర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో గోదావరిఖని, పెద్దపల్లి, మంథ ని తదితర ప్రాంతాల్లో లోతట్టు జలమయం అ య్యాయి. వివిధ గ్రామాల్లో పలు పంటలు దెబ్బతిన్నాయి కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి, మంగపేట, కూనారం, మడిపెల్లి, పెగడపల్లి, గంగారం, పందిల్ల తదితర గ్రామాల్లో మొక్కజొన్నకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. వెన్నంపల్లి గ్రామంలో 65 మంది రైతులకు చెందిన 95 ఎకరాలు, మంగపేటలో 25 మందికి చెందిన 35 ఎకరాలు, కూనారంలో 72 మందికి చెందిన 110 ఎకరాలు, మడిపెల్లిలో 68 మందికి చెందిన 105 ఎకరాలు, పెగడపల్లిలో 82 మందికి చెందిన 132 ఎకరాలు, గంగారంలో 66 మందికి చెందిన 82 ఎకరాలు, పందిల్లలో ఎకరం విస్తీర్ణంలో మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయాలధికారుల ప్రాథమిక అంచనా. మరికొన్ని గ్రామాల్లోనూ పంట పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం. జూలపల్లిలో వర్షం జూలపల్లి(పెద్దపల్లి): మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో వేకువజామున వర్షం కురిసింది. వరి కంకి వేసే దశలో ఉండగా, మొక్కజొన్న కంకులు పాలుపోసుకునే దశలో ఉన్నాయి. ఈ సమయంలో వర్షం కురవడంతో పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓదెలలో.. ఓదెల: ఓదెల, కొలనూర్, పొత్కపల్లి, గుంపులలో వరి, మొక్కజొన్న దెబ్బతిన్నాయి. జిల్లాకు వర్ష సూచన పెద్దపల్లి: రానున్న 24గంట్లో జిల్లాలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలియజేసింది. కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీవర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అకాల వర్షంతో అన్నదాత ఆగం 560 ఎకరాల్లో మొక్కజొన్న నేలపాలు -
జెడ్పీ భవనం.. పునాదులకే పరిమితం
పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయానికి సొంతభవనం కరువైంది. అనూహ్యంగా జిల్లాగా అవతరించిన పెద్దపల్లి.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి విడిపోయాక తాత్కాలికంగా తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని ఓ భవనం కేటాయించారు. తొలిజెడ్పీ పాలకమండలి పదవీకాలం పూర్తయ్యే వరకూ అందులోనే కార్యకలాపాలు నిర్వహించారు. ఆ భవనం కూల్చివేసి తహసీల్దార్ ఆఫీస్ను జెడ్పీ భవనంలోకి మార్చారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలకు ప్రైవేట్ ఫంక్షన్హాళ్లు, ఎన్టీపీసీలోని మిలీనియం హాల్ దిక్కయ్యాయి. స్థానిక బస్టాండ్ సమీపంలోని ఎంపీడీవో కార్యాలయ స్థలంలో జెడ్పీ భవనం నిర్మించాలని అప్పట్లో యోచించినా అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఎంపీడీవో కార్యాలయ భవన స్థలాన్ని ఆర్టీసీ బస్సు డిపోకు కేటాయించిన విషయం పాఠకులకు తెలిసిందే. రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలోకి.. ప్రస్తుతం జెడ్పీ సీఈవోతోపాటు అధికారులు, సిబ్బంది సమీప రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారు. అరకొర సౌకర్యాల మధ్య అవస్థల పాలవుతున్నారు. జెడ్పీ పాలక మండలి గడువు ముగియడంతో అధికారు లు, సిబ్బంది ఎలాగోలా విధులు కానిచ్చేస్తున్నారు. స్పెషలాఫీసర్గా కలెక్టర్.. జెడ్పీ చైర్మన్, సభ్యుల పదవీకాలం 2024 జూలై 4న ముగిసింది. జెడ్పీ సీఈవోతోపాటు ప్రత్యేకాధికారిగా కలెక్టర్ పాలన సాగిస్తున్నారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణకు వచ్చి వెళ్లి పోయారే తప్ప ఇప్పటివరకు ఆఫీసులో అడుగుపెట్టిన దాఖలాలు లేవు. రూ.1.60 కోట్లతో పనులు తహసీల్దార్ ఆఫీసు ఆవరణలోని స్థలంలోనే జెడ్పీ కార్యాలయం (ఇదే భవనంలో ఎంపీడీవో ఆఫీసు కూడా) నిర్మించేందుకు రూ.కోటి 60లక్షలతో ఏడు నెలల క్రితం పనులు ప్రారంభించారు. ఏడాదిలో పనులు పూర్తిచేయాలని నిర్ణయించారు. ఇప్పటికీ పునాదుల స్థాయిలోనే పనులు ఉన్నాయి. పనులు చేపట్టిన కాంట్రాక్టర్కు రూ.40లక్షల బిల్లులు చెల్లించేందుకు చెక్కులు జారీ చేసినా.. ఆ నిధులు ఇంకా విడుదల కాలేదు. దీంతో పనులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఎంపీడీవో ఆఫీసుదీ ఓ దీనగాథ బస్టాండ్ను ఆనుకుని ఐదుదశాబ్దాల పాటు సేవలు అందించిన ఎంపీడీవో కార్యాలయ భవనం కూల్చి ఆ స్థలాన్ని ఆర్టీసీ బస్సుడిపో ఏర్పాటుకు కేటాయించారు. దీంతో ఎంపీడీవో ఆఫీసు నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కొన్నినెలల పాటుస్టేషన్ రోడ్డులోని ఓ ఇరుకై న అద్దెభవనంలో మండల పరిషత్ పాలన సాగింది. అద్దెభవనాలను ఖాళీ చేయాలని సర్కారు ఆదేశాలివ్వడంతో మళ్లీ అద్దెభవనంలో నుంచి ప్రభుత్వ ఐటీఐ భవనంలోని మార్చారు. ఇరుకైన రెండు గదుల్లోనే ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కొత్త పాలకులు వస్తే ఇంకా ఇబ్బందే పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తే కొత్తపాలక మండళ్లు ఎక్కడ సమావేశాలు నిర్వహిస్తారు? విధులు ఎలా నిర్వర్తిస్తారో అంతుబట్టడం లేదు. అందుకే జెడ్పీ సొంత భవనం నిర్మించే పనుల్లో వేగం పెంచేలా ఎమ్మెల్యే, కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లావాసులు కోరుతున్నారు. ముందుకు సాగని నిర్మాణ పనులు కొత్త పాలక మండలికి నీడ కరువు మండల పరిషత్ ఆఫీస్దీ అదేపరిస్థితి -
రజకులపై దాడి హేయం
ఎలిగేడు: బుర్హాన్మియాపేటలో రజకులపై దాడి హేయమని రజక సంఘం జిల్లా అధ్యక్షుడు పెండ్యా ల మహేశ్ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వలేదనే అక్కసుతో గాదల వెంకట్రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, అనుచరులు కలిసి రజక కులానికి చెందిన పరుశరాములుపై దాడి చేశారని, దీనిని తాము రజక జాతిపై జరిగిన దాడిగా పరిగణిస్తామన్నారు. దాడిపై విచారణ చేసిన పోలీసులు తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇందు లో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గవద్దని కోరారు. రజక సంఘం జిల్లా కార్యదర్శి గంగిపల్లి వెంకటేశ్వర్లు, గోపు లక్ష్మారెడ్డి, గుజ్జుల మల్లారెడ్డి, రవీందర్రావు, మధుకర్, నిరంజన్, ముంజంపల్లి సాయిలు, ముంజంపల్లి ఆగయ్య, చంద్రయ్య, రాకేశ్, రాజేశ్, మల్లేశ్, అనిల్, ఓదెలు, రమేశ్ పాల్గొన్నారు. -
ప్రహరీ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు..
ఓదెల: గోపరపల్లె పాఠశాల ప్రహరీ నిర్మాణాన్ని కొంద రు అడ్డుకుంటున్నారని సర్పంచ్ మద్దెనవేని రవి ఆరోపించారు. ఈమేరకు గ్రామస్తులతో కలిసి మంగళవారం గ్రామంలో రాస్తారోకో చేశారు. కలెక్టర్ ప్రత్యేక చొరవతో నిధులు మంజూరయ్యాయని, ఆ నిధులతో పాఠశాల భద్రత కోసం ప్రహరీ నిర్మాణం చేపట్టామని గ్రామస్తులు తెలిపారు. తహసీల్దార్, ఆర్ఐ, కార్యదర్శి 25 ఏళ్ల క్రితమే పాఠశాల కోసం స్థలం కొనుగోలు చేశారని అన్నారు. అయినా, దానిపై లీగల్ నోటీసు ఉందని పనులు చేసే కాంట్రాక్టర్ను కొందరు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాన రహదారి పక్కనే పాఠశాల ఉందని, విద్యార్థులకు ప్రమాదాలు జరిగితే అధికారులే బాధ్యత వహిస్తున్నారని తెలిపారు. సుమారు రెండు గంటలపాటు రోడ్డుపై గ్రామస్తులు బైఠాయించారు. సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలకు అంతరాయం కలిగింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన విరమింపజేశారు. గోపరపల్లె గ్రామస్తుల ఆరోపణ -
లోక్ అదాలత్లతో సత్వర పరిష్కారం
గోదావరిఖనిటౌన్: లోక్ అదాలత్లతో సత్వర న్యాయం సాధ్యమని అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్ అన్నారు. స్థానిక న్యాయ స్థానం ఆవరణలో పోలీస్ సబ్ డివిజన్ అధికారులతో మంగళవారం నిర్వహించిన సన్నాహక సదస్సులో జడ్జి మాట్లాడారు. ఈనెల 28న చేపట్టే లోక్ అదాలత్లో కక్షిదారులు అధికంగా పాల్గొని కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. క్షణికావేశంలో కేసులపాలై కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృథాచేసుకోకుండా రాజీ కుదుర్చుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వెంకటసచిన్ రెడ్డి, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్, ఏసీపీ రమేశ్, సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాద్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ జూలపల్లి: తెలుకుంట రైతువేదికలో మంగళవారం రైతునేస్తం నిర్వహించారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్పై రైతులకు శిక్షణ ఇచ్చారు. ఎరువుల యాప్, డ్రోన్ వినియోగంపై అధికారులు అవగాహన కల్పించారు. అనంతరం భూసార పరీక్షల పత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ప్రత్యూష, సర్పంచ్ సంపత్కుమార్, ఉపసర్పంచ్ దావు సంపత్రెడ్డి, ఏఈవో కిరణ్మయి, శ్యామల, రైతులు పాల్గొన్నారు. దళారులను నమ్మొద్దు పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని దళారులు ప్రచారం చేస్తున్నట్లు తమకు సమాచారం అందిందని, వారిని నమ్మి మోసపోవద్దని జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్ శ్రీధర్ సూచించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాలు కలెక్టర్ నేతృత్వంలో వారధి సొసైటీ ద్వారా ని ర్వహిస్తారన్నారు. నిరుద్యోగులు ఈ విషయా న్ని గమనించాలని కోరారు. ఉద్యోగం కావాలనుకునే వారు నేరుగా కలెక్టర్ కార్యాలయంలోని వారధి సొసైటీలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. పత్తి మార్కెట్కు సెలవులు పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డుకు ఉగాది పండుగ సందర్భంగా గురువారం నుంచి నాలుగు రోజుల పాటు కొనుగోళ్లు ఉండవని మార్కెట్ కమిటీ చైర్మన్ కూర మల్లారెడ్డి తెలిపారు. ఈనెల 19 ఉగాది (గురువారం) నుంచి ఆదివారం (ఈనెల 22 వరకు) పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నారు. తిరిగి ఈనెల 23వ తేదీ సోమవారం నుంచి కొనుగోళ్లు సాగుతాయని, రైతులు గమనించాలని మల్లారెడ్డి కోరారు. ఆస్పత్రి భవనం పరిశీలన ధర్మారం: నందిమేడారంలో చేపట్టిన కొత్త భ వనం పనులను జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్ శ్రీధర్ మంగళవారం పరిశీలించారు. ఆ స్పత్రికి అందించిన వైద్య పరికరాలను తనిఖీ చేశారు. త్వరలోనే వైద్య సేవలు ప్రారంభిస్తా మని శ్రీధర్ తెలిపారు. అధికారులు ఉన్నారు. పెద్దపల్లిరూరల్: మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ పదవులకు పోటీచేసిన వారు తమ ఎన్నికల ఖర్చు వివరాలను ఈనెల 23వ తేదీలోగా అందించాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ తెలిపారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధి లోని 36 వార్డులకు 157మంది పోటీచేయగా.. అందులో 64 మంది మాత్రమే ఖర్చు వివరాలను అందించారని ఆయన పేర్కొన్నారు. మిగతావారు ఈనెల 23వ తేదీలోగా మున్సిపల్ కార్యాలయంలోని రూం నంబరు 204లో జూనియర్ అసిస్టెంట్ మహేశ్(సెల్ నంబరు 99590 98981)లో అందించాలన్నారు. సకాలంలో ఖర్చు వివరాలు అందించని అభ్యర్థులు రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకునే చర్యలకు బాధ్యులవుతారని ఆయన హెచ్చరించారు. -
బాల్య వివాహాలను నిర్మూలిద్దాం
పెద్దపల్లిరూరల్: బాలలు బడికి వెళ్లేలా చూడాలని, బాలికలకు పెళ్లిళ్లు జరగకుండా చూడాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు చందన అన్నారు. బ్రాహ్మణపల్లిలో మంగళవారం ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ రోజారాణి అధ్యక్షతన బాలల పరిరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. చందన మాట్లాడుతూ, బడీడు పిల్లలంతా క్రమశిక్షణతో చదువుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఇందులో తల్లిదండ్రుల పాత్ర కీలకమని అన్నారు. బాల్య వివాహ రహిత గ్రామం బ్రాహ్మణపల్లి పెద్దపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లిలో ఏడాదిగా బాల్య వివాహాలు జరగడంలేదు. ప్రతీ విద్యార్థి రెగ్యులర్గా పాఠశాలకు వెళ్లడం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న అధికారులు.. బ్రాహ్మణపల్లి గ్రామాన్ని బాల్య వివాహరహిత గ్రామంగా ప్రకటించారు. బాల్యవివాహాలను నిర్మూలించడం కోసం ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్రావు, సీడీపీవో కవిత తదితరులు పాల్గొన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు చందన చైల్డ్ మ్యారేజీ ఫ్రీ విలేజ్గా బ్రాహ్మణపల్లి ఎంపిక -
పండుగపూట పస్తులేనా?
పెద్దపల్లి/రామగుండం: రెండు నెలలుగా వేతనాలు అందడం లేదనే మనోవేదనతో జిల్లాలోని ఆశ కార్యకర్తలు సోమవారం నుంచి సమ్మె చేస్తున్నారు. వచ్చే ఉగాది, రంజాన్ పండుగలు జరుపుకునేందుకు చేతిలో డబ్బుల్లేవని ఆవేదన చెందారు. వేతనాలు, హక్కుల సాధన తదితర అంశాలపై ఈనెల 5 నుంచే ఆశ వర్కర్లు దశలవారీగా ఆందోళనలు చేస్తున్నారు. జిల్లాలోని మొత్తం 489 మంది సమ్మెలోకి వెళ్లడంతో సేవలకు అంతరాయం కలుగుతోంది. ఇవీ సేవలు.. ఇవీ డిమాండ్లు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం రూ.18వేలకు పెంచాలని, విధుల్లో మరణిస్తే కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని, బీమా సౌకర్యం కల్పిస్తూ రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన ఆశ వర్కర్లకు ఇళ్లు మంజూరు చేయాలని, ఆశ వర్కర్లలో ఉన్నత విద్యార్హతలు గలవారిని గుర్తించి పదోన్నతి కల్పించాలని కోరుతున్నారు. ఆశ కార్యకర్తల ఆవేదన విధులు బహిష్కరించి నిరసన రెండు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ -
వేతనాలు చెల్లిస్తాం
కార్మికులకు వేతనాలు చెల్లించాలని అధికారులకు ఇప్పటికే సూచించాం. బుధవారం వరకు పెండింగ్ వేతనాలు చెల్లిస్తారు. ఈవిషయంపై అధికారులతో ఇప్పటికే చర్చలు జరిపాం. మరోసారి వారితో సమావేశమై సమీక్షిస్తాం. ఆస్తిపన్ను వసూలుపై కూడా ప్రత్యేక దృష్టి సారించాం. – మహంకాళి స్వామి, మేయర్, రామగుండం రెండురోజుల్లో చెల్లింపులు కార్మికులందరికీ రెండురోజుల్లోగా వారి బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆస్తిపన్ను 100 శాతం వసూలయ్యేలా ప్రతీరోజు సమీక్షిస్తున్నాం. ప్రాపర్టీ ట్యాక్స్, నల్లాబిల్లులు, ట్రేడ్లైసెన్స్ వసూళ్లపై ప్రతీరోజూ ప్రత్యేకంగా సమీక్షిస్తూనే ఉన్నాం. – అరుణశ్రీ, కమిషనర్, రామగుండం -
సమ్మె విరమించం
రెండు నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలి. జిల్లాలో ఇద్దరు ఆశ వర్కర్లు చనిపోయారు. వారికి వెంటనే బీమా సొమ్ము అందించాలి. వివిధ పథకాల సర్వేలకు సంబంధించిన ప్రత్యేక నిధులను తక్షణమే విడుదల చేయాలి. – మమత, ఆశ వర్కర్ల సంఘం నేత, నారాయణపూర్అధికారుల దృష్టికి తీసుకెళ్తా ఆశ వర్కర్ల సమ్మె సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేశాం. ప్రజలకు అసౌ కర్యం కలుగకుండా ఏఎన్ఎంల ద్వారా సేవలు అందిస్తున్నాం. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మందులు పంపిణీ చేశాం. వివిధ పథకాల సర్వేలు సైతం నిరంతరం కొనసాగుతున్నాయి. – దయామని, జిల్లా ఇన్చార్జి, ఆశ వర్కర్ల సంఘం, పెద్దపల్లి -
ఆర్థిక సంక్షోభం!
కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. అధికారుల ముందుచూపు లేకపోవడం ఇందుకు కారణమనే విమర్శలు వస్తున్నాయి. ఉగాది, రంజాన్ పండుగల వేళ వేతనాలు అందక బల్దియాలోని అవుట్ సోర్సింగ్ కార్మికులు, వారి కుటుంబాలు పస్తులు ఉండే దుస్థితి నెలకొనడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. సాధారణంగా ప్రతీనెల మొదటి వారంలోనే వేతనాలు చెల్లించే ఆనవాయితీ ఉంది. ఈనెల మూడోవారం గడుస్తున్నా చెల్లింపులు లేవు. దీంతో పండుగలు ఎలా జరుపుకోవాలని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. 600 మంది పడిగాపులు.. కార్పొరేషన్లోని శానిటేషన్ విభాగంలో 448 మంది, ఆఫీసులోని పలు విభాగాల్లో మరో 125 మందితోపాటు మరికొందరు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరు వేతనాల కోసం పడిగాపులు గాస్తున్నారు. వేతనాల కోసం సుమారు రూ.కోటి 30 లక్షల వరకు వెచ్చించాల్సి ఉంది. ఆదాయం తగ్గి.. నిర్వహణ కష్టాలు.. బల్దియాకు ప్రధాన ఆదాయం ఆస్తిపన్ను, నల్లాబిల్లులే. అవుట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ, విద్యుత్ చార్జీలు వంటి ఖర్చులు సా ధారణ నిధుల నుంచే చెల్లించాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆస్తిపన్ను 60శాతం కూడా వసూలు కాలేదు. ఇది పరిస్థితిని మరింత దిగజార్చింది. నల్లా బిల్లుల్లో సాంకేతిక సమస్యలు నల్లావివరాలు ఆన్లైన్లో అందుబాటులో లేవు. బకాయిలు వసూలు కావడంలేదు. తాజా బిల్లులు స్వీకరిస్తున్నారు. ఆఫ్లైన్ చెల్లింపులకు వచ్చిన వినియోగదారుల నుంచి కూడా డబ్బులు తీసుకోడంలేదు. దీంతో బల్దియా ఆదాయానికి బ్రేక్ పడింది. మొత్తంగా ఆస్తిపన్ను, నల్లాబిల్లులు దాదాపు రూ.10 కోట్ల వరకు వసూలు కావాల్సి ఉంది. పర్యవేక్షణ లోపం వసూళ్ల కోసం సిబ్బంది పెద్దసంఖ్యలోనే ఉన్నారు. పర్యవేక్షణ లేక ఫలితాలు కనిపించడం లేదు. లక్ష్యం ఉన్నా, అమలులోనే లోపం తలెత్తింది. మళ్లించిన నిధులు.. ఇప్పుడు భారంగా... ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఏడాది క్రితమే స్టాంప్ డ్యూటీ ద్వారా రూ.16 కోట్లు విడుదల చేసింది. అవుట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు, విద్యుత్ బిల్లుల వినియోగంతోపాటు వేతనాల కో సం ఆరు నెలలకు సరిపడా నిధులు నిల్వ చేయాల ని మార్గదర్శకాలు జారీచేసింది. ముందుచూపు లే కుండా అధికారులు ఇతర అవసరాలకు మళ్లించడంతోనే సంక్షోభం తలెత్తిందని ఆరోపణలు ఉన్నాయి. మార్చిలోనే సంక్షోభం సాధారణంగా మార్చి, ఏప్రిల్లో బల్దియా ఆదా యం పెరుగుతుండడంతో ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడూ ఎదురుకాలేదు. ఈసారి మార్చిలోనే సంక్షోభం రావడం విస్మయం కలిగిస్తోంది. మూడోవారం గడుస్తున్నా కార్మికులకు అందని వేతనాలు ఏడాది క్రితమే రామగుండానికి రూ.16 కోట్ల స్టాంప్ డ్యూటీ వేతనాలకు సరిపడా నిధులు నిల్వ ఉంచాలని ఉత్తర్వులు ఇవేమీ పట్టించుకోకుండా అధికారుల ఎడాపెడా ఖర్చులు బల్దియా కార్మిక కుటుంబాలకు పండుగపూట తప్పని పస్తులు -
రైలు పట్టాలపై మహారాష్ట్ర వ్యక్తి మృతదేహం
రామగుండం: పెద్దంపేట రైల్వే ప్లాట్ఫారంపై సోమవారం మహారాష్ట్రకు చెందిన వ్యక్తి మృతదేహాన్ని జీఆర్పీ పోలీసులు గుర్తించారు. జీఆర్పీ ఇన్చార్జి తిరుపతి తెలిపిన వివరాలు.. పెద్దంపేట రైల్వే ప్లాట్ఫారం సమీపంలోని రైల్వే ట్రాక్పై ఓ పురుషుడి మృతదేహం ఉన్నట్లు తమకు గుర్తుతెలియని వ్యక్తులు సమాచారం అందించారు. మృతుడి తలకు తీవ్రగాయాలవడంతోనే మృతిచెందినట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోగా, కుడి చేతిపై తన గ్రామ సర్పంచ్ సెల్ నంబర్ రాసి ఉండడంతో సదరు నంబర్కు కాల్ చేయడంతో మృతుడి వివరాలను గుర్తించగలిగామన్నారు. మృతుడు గడ్ఛందూర్రోడ్, పండరీపుర, చంద్రాపూర్ జిల్లా, మహారాష్ట్రకు చెందిన సందీప్ గజానన్ మహదేవ్(32)గా గుర్తించామన్నారు. మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వాసుపత్రి మార్చురీలో భద్రపరిచామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కెనాల్లో దొరికిన ఉద్యోగి మృతదేహంకొత్తపల్లి (కరీంనగర్): కొత్తపల్లి మండలం చింతకుంటకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి ప్రమాదవశాత్తు చింతకుంట కాకతీయ కెనాల్లో పడి గల్లంతుకాగా... ఆయన మృతదేహం సోమవారం దొరికింది. చింతకుంటకు చెందిన రాచకొండ లచ్చయ్య (52) ఆదివారం కెనాల్లో స్నానం చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కోటేశ్వర్ తెలిపారు. అవినీతి కేసులో అరెస్టుకరీంనగర్క్రైం: కాంట్రాక్టుర్లు, పలువురు ఉద్యోగుల వద్ద బీనామీ అకౌంట్ ద్వారా లంచం తీసుకున్న కేసులో తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీలో ఉన్న కరీంనగర్ వర్క్ అకౌంట్స్ జాయింట్ కార్యాలయ సూపరింటెండెంట్ ఈగల మధుసూదన్ను ఏసీబీ అధికారులు సోమవారం అరెస్టు చేశారు. మధుసూధన్ కొందరు కాంట్రాక్టర్లు, ఉద్యోగులకు చెందిన బిల్లులు చెల్లించేందుకు భద్రాద్రి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంకులో ఒక బీనామీ అకౌంట్ ద్వారా 15 సెప్టెంబర్, 2022 నుంచి 20 సెప్టెంబర్ 2023 వరకు యూపీఐ అకౌంట్ల ద్వారా రూ.14,77,003 లంచం తీసుకున్నాడు. ఈ విషయంపై వచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేసి అరెస్టు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిగన్నేరువరం: మండలంలోని గుండ్లపల్లి స్టేజీ వద్ద సోమవారం వేకువజూమున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. గుండ్లపల్లికి చెందిన కొమ్ము రాజ్కుమార్, మండే శ్రీకాంత్ ద్విచక్రవాహనంపై గుండ్లపల్లి స్టేజీ వద్ద గల రహదారిని క్రాస్ చేస్తుండగా, కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న టాటా పంచ్ కారు ఢీకొట్టింది. ద్విచక్రవాహనదారులకు తీవ్రగాయాలు కాగా కరీంనగర్ అసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొమ్ము రాజ్కుమార్(26) మృతి చెందాడు. శ్రీకాంత్ చికిత్స పొందుతున్నాడు. కాగా మృతుడి సోదరుడు వేల్పుల తిరుపతి ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ మల్లోజుల అన్వేశ్పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేందర్రెడ్డి తెలిపారు. -
ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లో చేరండి
రామగుండం: రైతులకు దళా రుల నుంచి విముక్తి కల్పించేందుకు సమూహంగా ఏర్పడి పంటలు సాగుచేయడం, గిట్టుబా టు ధరకు విక్రయించడం, పంటల మార్కెటింగ్, ఎగుమతులు వంటి పనులతో నేరుగా రైతులకే లబ్ధి చేకూరేందుకు కేంద్ర ప్రభుత్వం కంపెనీల చట్టం–2013 ప్రకారం రైతు ఉత్పత్తిదారుల సంస్థగా చట్టబద్ధత కల్పించింది. దీనిని ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ సంస్థగా ప్రకటించింది. ప్రతీ రైతు ఎఫ్పీవోలో సభ్యత్వం పొందితే సాగులో భరోసా కలుగుతుంది. ఈ సందర్భంగా ఎఫ్పీవోపై రామగుండం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ప్రత్యేకాధికారి, సహాయక రిజిస్ట్రార్ బొనగాని నరేశ్ పలు అంశాలను వెల్లడించారు. ఎఫ్పీవో ముఖ్య ఉద్దేశం చిన్న రైతుల ఆదాయాన్ని పెంచడం, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం, రైతుల ద్వారా, రైతుల కోసం, రైతుల సంస్థగా రూపుదిద్దడమే దీని ముఖ్య ఉద్దేశం. ఉత్పత్తులను సమూహంగా విక్రయించడంపై అన్నదాతలకు మెరుగైన ధర లభించే అవకాశం ఉంటుంది. ఫలితంగా రైతుల ఆదాయం రెండింతలు కావడానికి ఇదో మార్గం. ఇన్పుట్స్ ఖర్చు తగ్గించడం విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, యంత్రాలు తదితర వస్తువులను సమూహంగా కొనుగోలు చేయడంతో వ్యయభారం తగ్గుతుంది. ఫలితంగా ఉత్పాదకత పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానం ద్వారా సమర్థవంతంగా తక్కువ ఖర్చుతో సుస్థిర వనరుల వినియోగంతో దిగుబడి పెంచుకునే అవకాశం ఉంటుంది. మార్కెట్ లింకేజీల మెరుగు బల్క్ ఉత్పత్తులు సాధించడం, స్టోరేజీ, ప్రాసెసింగ్, ఎగుమతులు, నేరుగా వినియోగదారుడికి విక్రయించడం జరుగుతుంది. ఫలితంగా దళారుల బెడద తగ్గి లాభదాయకంగా ఉంటుంది. సామూహిక సాగు విధానంతో రైతులలో మెలకువలు పరస్పరం పంచుకునే వీలుంటుంది. తద్వారా నేర్పుతో సాగు విధానాలు అవలంబించడం పట్ల నాణ్యమైన దిగుబడిని పొందే వీలుంటుంది. ఎఫ్పీవోలో చేరడం రైతులు రూ.రెండు వేలు చెల్లించి ఎఫ్పీవోలో చేరవచ్చు. దీనికి ప్రభుత్వం కూడా మ్యాచింగ్ గ్రాంట్ కింద ఇరవై షేర్లు రూ.రెండు వేలు చెల్లించడంతో మొత్తంగా రైతు పేరు మీద 40 షేర్లు వస్తాయి. ఈ షేర్లపై రైతులు లాభాలు, డివిడెండ్లు పొందుతారు. ఫలితంగా రైతుల ఆదాయాన్ని పెంచడానికి దోహదపడుతుంది. ఎఫ్పీవో సభ్యులు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీలకు అర్హులు. ఈ విధానం వ్యవసాయ ఉత్పత్తి, మార్కెట్కు సహాయపడుతుంది. అవసరమైన పత్రాలు రైతు సర్టిఫికెట్, ఆధార్కార్డు, పాస్పోర్ట్ సైజు ఫొటో, ఫోన్నంబర్, ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలు ఉండాలి. ఉమ్మడి రామగుండం మండల పరిధిలో రైతులు ఎఫ్పీవోలో చేరేందుకు 94947 83280, 98499 26919, 79818 69290 నంబర్లలో సంప్రదించాలని సహాయక రిజిస్ట్రార్ కోరారు. సొసైటీ సహాయక రిజిస్ట్రార్ బొనగాని నరేశ్ -
వేంపేటలో దొంగల హల్చల్
మెట్పల్లిరూరల్: మండలంలోని వేంపేటలో దొంగలు హల్చల్ సృష్టించారు. గ్రామంలోని మూడు ఆలయాలు, ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. గంగమ్మ, రామాలయం, శివాలయంలో బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. కల్లెడ లత ఇంట్లో చోరీ చేశారు. ఎర్ధండిలోని తన తల్లిగారింటికి వెళ్లిన లత.. సోమవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి 8 గ్రాముల బంగారం, 9 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. హనుమాన్ ఆలయంలో చోరీకోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం రామన్నపేట హనుమాన్ ఆలయంలో సోమవారం చోరీ జరిగింది. గ్రామంలోని హనుమాన్ ఆలయంలోని హుండీని గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం తెల్లవారుజామున ఎత్తుకెళ్లారు. ఈమేరకు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశా రు. హుండీలో సుమారు రూ.15వేల వరకు ఉండవచ్చని గ్రామస్తులు తెలిపారు. హుండీని ప్రతీ శ్రీరామనవమికి తెరిచి లెక్కిస్తారు. గుర్తుతెలియని మహిళ మృతిసిరిసిల్ల ఎడ్యుకేషన్: సిరిసిల్ల పట్ట ణంలోని కార్గిల్లేక్లో సోమవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరా లు. మృతురాలి వయస్సు సుమారు 55 నుంచి 65 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. ఎత్తు సుమారు 4 అడుగులు 4 అంగుళాలు, గుండ్రటి ముఖం, చామనచాయ. లేత ఆకుపచ్చ రంగు చీర, ముదురు ఆకుపచ్చ రంగు జాకెట్ ధరించి ఉందని వివరించారు. మెడలో తెలు పు, గులాబీ రంగు దారం, నలుపు–బంగారు రంగు పూసల దండలు ఉన్నాయని పేర్కొన్నారు. మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. ఆచూకీ తెలిసి న వారు సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్లో, సీఐ ఎన్.శ్రీనివాస్ 87126 56366, ఎస్సై మురళీధర్గౌడ్ 99898 07854లో సంప్రదించాలని కోరారు. బస్సు ఢీకొని.. మల్యాల: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. మల్యాల ఎస్సై నరేశ్కుమార్ కథనం ప్రకారం..మల్యాల మండలం ముత్యంపేట శివారులోని జగిత్యాల–కరీంనగర్ జాతీయ రహదారిపై దిగువ కొండగట్టు బస్ స్టేజీ వద్ద సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ సంఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విశారదన్ మహారాజ్ అరెస్టుపై నిరసనజగిత్యాలటౌన్: విశారదన్ మహారాజ్ అక్రమ అరెస్టును నిరసిస్తూ సోమవారం జగిత్యాల తహసీల్ చౌరస్తాలో జేఏసీ నాయకులు నిరసన తెలిపారు. జాక్ జిల్లా అధ్యక్షుడు మానాల కిషన్, ముసిపట్ల లక్ష్మీనారాయణ, గొల్లపల్లి శ్రీకాంత్గౌడ్, దువ్వాక శివమహారాజ్ పాల్గొన్నారు. -
శాప్ ఇన్నోవేషన్లో జ్యోతిష్మతి విద్యార్థుల ప్రతిభ
తిమ్మాపూర్: హైదరాబాద్లోని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈనెల 13న ఎడునెట్ ఫౌండేషన్, టాస్క్, శాప్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన శాప్కోడ్ ఉన్నతి ఇన్నోవేషన్ మారథాన్ 2025–26 లో జ్యోతిష్మతి విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వివిధ విద్యాసంస్థల విద్యార్థుల్లో సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలు, సాంకేతిక ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా జరిగింది. కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు సాంకేతిక ఆవిష్కరణల దిశగా ముందుకు సాగాలని సూచించారు. ఈ మారథాన్కు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. తె లంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వివిధ విద్యాసంస్థల నుంచి మొత్తం 560 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా..109 టీంలు క్వార్టర్ ఫైనల్కు ఎంపికయ్యాయి. వాటిలో 64 టీంలు సెమీఫైనల్కు చేరుకున్నాయి. చివరగా 29 టీంలు ఫైనల్ రౌండ్కు ఎంపికయ్యాయి. తుది ఫలితాలలో జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ విద్యార్థులు షేక్ జోహైబ్ ఉర్ రహ్మాన్, పనుగంటి వర్షిణి విజేతలుగా నిలిచారు. ప్రాజెక్ట్ వినూత్నత , ఆచరణాత్మక ఉపయోగం కారణంగా ప్రత్యేకంగా నిలి చింది. ఈ సందర్భంగా జ్యోతిష్మతి చైర్మన్ జువ్వాడి సాగర్ రావు , సెక్రటరీ, కరస్పాండెంట్ జె. సుమిత్సాయి విద్యార్థులను అభినందించారు. ప్రిన్సిపాల్ టి. అనిల్ కుమార్, డీన్ (అకాడెమిక్స్) పీకే వైశాలీ, అధ్యాపకులు అభినందనలు తెలిపారు. -
రాంపల్లి పంచాయతీలో స్టీల్ బ్యాంకు
● ప్లాస్టిక్ భూతాన్ని తరిమేసిన గ్రామస్తులు పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలంలో ఏకగ్రీవంగా ఎన్నికై న రాంపల్లి పంచాయతీ సర్పంచ్ కనపర్తి సంపత్రావుతో పాలకమండలి సభ్యులు తీసుకున్న నిర్ణయాలకు దాతలు సహకారం అందిస్తూ అండగా నిలుస్తున్నారు. సోమవారం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో విత్తనసంస్థ ప్రతినిధులు 600 స్టీలు ప్లేట్లు, స్టీలు గ్లాసులను సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై మల్లేశ్, ఎంపీడీవో శ్రీనివాస్ సమక్షంలో అందజేశారు. ఏకగ్రీవ పంచాయతీ తొలి సమావేశంలోనే ప్లాస్టిక్ భూతాన్ని గ్రామంలో నుంచి తరిమేయడంతో పాటు మద్యనిషేధం అమలు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులను గ్రామంలో నిషేధించడంతో అందుకు ప్రత్యామ్నాయంగా పంచాయతీ ఆఫీసు ద్వారానే స్టీల్ ప్లేట్లు, గ్లాసులను అందుబాటులో ఉంచాలని సర్పంచ్ నిర్ణయించారు. ఇందుకు ఓ విత్తన సంస్థ ప్రతినిధులు స్టీల్సామగ్రిని విరాళంగా సమకూర్చారు. దీంతో పంచాయతీలో ‘స్టీల్బ్యాంకు’ ఏర్పాటు చేశామన్నారు. గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా పంచాయతీ ఆఫీసు నుంచి సామగ్రి తీసుకెళ్లి తిరిగి అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నట్టు సర్పంచ్ తెలిపారు. పంచాయతీ పాలకమండలి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. డొమెస్టిక్ సిలిండర్లు సీజ్జమ్మికుంట: పట్టణంలోని పలు హోటళ్లు, టీస్టాళ్లలో డీటీసీ ఎస్.వసంతరావు, ఎఫ్ఐ వినోద్కుమార్ ఆధ్వర్యంలో సోమవారం దాడులు నిర్వహించారు. హోటల్లో వాడుతున్న 18 డొమెస్టిక్ సిలిండర్లును సీజ్ చేశారు. నిర్వాహకులపై 6ఏ కేసు నమోదుకు కరీంనగర్ సివిల్ సప్లై ఉన్నతాధికారులు నివేదిస్తామన్నారు. -
రంజాన్ పండుగకు ప్రత్యేక ఏర్పాట్లు
పెద్దపల్లి: రంజాన్ పండుగ సందర్భంగా భారీ బందోబస్తు, ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్కిశోర్ ఝా అన్నారు. సోమవారం జిగ్నెకి రాత్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పలు మసీద్లను సందర్శించారు. ప్రశాంతంగా ప్రార్థనలు జరుపుకునేలా భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. మసీదు పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించి, రాత్రి సమయంలో ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించాలని పోలీసు అధికారులకు సూచించారు. పండుగల సందర్భంగా ప్రజలు పరస్పర సహకారంతో శాంతి, సామరస్య వాతావరణాన్ని కాపాడాలని సీపీ విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, సీఐ ప్రవీణ్కుమార్, ట్రాఫిక్ సీఐ అనిల్కుమార్, ఎస్సైలు లక్ష్మణ్రావు, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ గండం
పెద్దపల్లి: పశ్చిమాసియాలోని యుద్ధం మంటలు జిల్లాకు తాకాయి. నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమవుతోంది. గృహ సిలిండర్పై రూ.60, వాణిజ్య సిలిండర్పై రూ.115 పెరిగిన విషయం తెలిసిందే. గ్యాస్ సిలిండర్ల కొరతతో పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు ఒక్కొక్కటిగా మూతబడుతున్నాయి. పట్ట ణాలతో పాటు మండల కేంద్రాలు, మేజర్ గ్రామపంచాయతీల్లో ఈ సమస్య నెలకొంది. కొన్ని హోటళ్లు కట్టెల పొయ్యి వినియోగిస్తుండగా, పెరిగిన ధరల పట్టికలు కనిపిస్తున్నాయి. గ్యాస్ కొర త లేదని అధికారులు చెబుతున్నా, గ్యాస్ బుకింగ్ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే చమురు, గ్యాస్ ధరలు పెరగడంతో ట్రాన్స్పోర్టు చార్జీలు పెరిగి నిత్యావసరాల ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పెరిగిన ధరలతో సామాన్యులు అల్లాడుతున్నారు. టీస్టాల్స్, టిఫిన్ సెంటర్లపై తీవ్ర ప్రభావం ● జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలు 15 ఉండగా, సింగరేణి ఆధ్వర్యంలో 4 కొనసాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా డొమెస్టిక్, కమర్షియల్ కలిపి మొత్తం 251,012? ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ● గ్యాస్ సిలిండర్ల కొరతతో పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరిస్తున్నాయి. కట్టెల పొయ్యిల వాడకం పెరిగింది. ● దీంతో వంటలు తయారయ్యేందుకు పెరిగిన ఖర్చులను నిర్వాహకులు వినియోగదారులపై వడ్డిస్తున్నారు. ● యుద్ధం కారణంగా గ్యాస్ బుక్ చేసిన తర్వాత 20 రోజులకు సిలిండర్ డెలివరీ అవుతుందని మొదటిసారి ప్రకటించిన అధికారులు, రెండో విడత 45 రోజులు అని ప్రకటించడంతో డొమెస్టిక్ వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ● జిల్లాలో టీ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లు, వివిధ రకాల హోటళ్లు, రెస్టారెంట్లు దాదాపు 3,800, టీ స్టాళ్లు 5వేల వరకు ఉంటాయని అధికారుల అంచనా. ● వీటిపై ఆధారపడి దాదాపు 42,287 కుటుంబాలు జీవనం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ● హోటళ్లు మూతపడుతుండడంతో వంట మనుషులు, వర్కర్లు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. కట్టెల ధరలకు రెక్కలు వాణిజ్య సిలిండర్ల సరఫరా లేకపోవడంతో కొన్ని హోటళ్ల నిర్వాహకులు కట్టెలపై పొయ్యిపై వంటలు చేస్తున్నారు. సమయానికి కట్టెలు అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ కొరత నేపథ్యంలో కట్టెలు క్వింటాల్కు రూ.5,00 నుంచి రూ.700 ధర పలుకుతున్నట్లు హోటళ్ల యజమానులు చెబుతున్నారు.డొమెస్టిక్ సిలిండర్లు 2,24,000 కమర్షియల్ 27,012 మొత్తం 251,012? -
టిఫిన్ సెంటర్ మూసేసిన
గ్యాస్ లేకపోవడంతో టిఫిన్ సెంటర్ మూసేసిన. నాతో పాటు 8 మందికి ఉపాధి కల్పిస్తున్న. జీవనోపాధి దెబ్బ తీయకుండా చూడాలి. మావి పేద, మధ్య తరగతి బతుకులు. హోటళ్ల నిర్వాహకులు, పని చేసేవారు ఎక్కువ సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. అధికారులు చొరవ తీసుకొని గ్యాస్ కొరత లేకుండా చూడాలి. – కుమారస్వామి, టిఫిన్ సెంటర్ యజమాని జిల్లాలో గ్యాస్ కొరత లేదు. డొమెస్టిక్కు సంబంధించి అసలు ఇబ్బందులు లేవు. గ్యాస్ కొరత ఉందని అందరూ ఒకేసారి బుక్ చేయడంతో ఇబ్బంది పడ్డారు. ఏజెన్సీలకు నిత్యం గ్యాస్ వస్తుంది. వినియోగదారులు ఇబ్బందులకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీనాథ్, డీఎస్వో -
రామగుండం అభివృద్ధే ధ్యేయం
జ్యోతినగర్(రామగుండం): రామగుండం అభివృద్ధే ప్రధాన ఎజెండాగా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు మేయర్ మహంకాళి స్వామి పేర్కొన్నారు. 33వ డివిజన్లో బూడిద స్వప్నకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పత్రాన్ని సోమవారం స్థానిక కార్పొరేటర్ మేరుగు భూలక్ష్మీతో కలిసి అందజేసి, ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మార్గదర్శకత్వంలో పేదలకు ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేయడం జరిగిందన్నారు. కార్పొరేటర్లు వెంగల బాపు, కొలని కవితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్కు దీటుగా వసతుల కల్పన గోదావరిఖనిటౌన్: కార్పొరేట్కు దీటుగా రామగుండం కార్పొరేషన్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ సహకారంతో వసతులు కల్పిస్తామని మేయర్ స్వామి అన్నారు. 36వ డివిజన్ గాంధీనగర్లోని ప్రభుత్వ పాఠశాలలో సోమవారం బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు రూ.1.70 లక్షల విలువ చేసే ఐదు కంప్యూటర్లు, నాలుగు సీసీ కెమరాలను అందజేశారు. కార్పొరేటర్ కల్వల పద్మావతి, ఎంఈవో మల్లేశం, సంస్థ ప్రతినిధులు కోలేటి సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మ ఆలోచన.. దాతల ఆచరణ
పెద్దపల్లిరూరల్: అన్నం పరబ్రహ్మ స్వరూపం.. అన్ని దానాల్లోకెల్ల అన్నదానం మిన్న.. ఆకలి వేసినప్పుడు గుప్పెడన్నం కడుపులో పడితే చాలు అనుకునే వారికి సకాలంలో అన్నం అందితే.. మీరు చల్లగా ఉండాలి.. అన్నదాత సుఖీభవ.. అంటూ ఆశీర్వదిస్తారు.. ఈనేపథ్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో కేసుల నిమిత్తం పలు రకాల కోర్టులకు హాజరయ్యే కక్షిదారుల ఆహార్తిని తీర్చాలనే ఆలోచనకు వచ్చిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ఈ ఏడాది జనవరి నుంచి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతీ సోమవారం కక్షిదారులకు అన్నదానం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాతల సహకారంతో.. తమ పెళ్లిరోజు.. పిల్లల పుట్టినరోజున అన్నదానం చేయాలని ఉన్నా.. భోజనాలను సిద్ధం చేయించడం, వాటిని పేదలు, ఆకలితో ఉన్నవారికి అందించడం ఎలా.. అన్న ఒకే కారణంతో చాలామంది దూరంగా ఉంటున్నట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గమనించారు. అలాంటివారికి జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. కోర్టు ఆవరణలోని క్యాంటీన్ వారికి డబ్బు కడితే భోజనం సిద్ధం చేస్తారు. అయితే ప్రతి సోమవారం ఎక్కువ మంది వస్తారనే ఆలోచనతో ఆరోజే అన్నదానం నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు. దూరప్రాంత వాసులకు మేలు దూర ప్రాంతాలకు చెందిన వారు తమపై ఉన్న కేసుల నిమిత్తం పెద్దపల్లిలోని పలు రకాల కోర్టులకు హాజరవుతుంటారు. అలాంటి వారు తమ ఇళ్ల నుంచి ఉదయమే బయల్దేరి వచ్చి కోర్టులో తమ కేసు బెంచీపైకి ఎప్పుడు వస్తుందో తెలియక పొద్దంతా అక్కడే నిరీక్షించాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఉండీ లేక.. ఆకలి తీర్చుకోలేక ఇబ్బందులు పడే పేదలకు కోర్టు ఆవరణలో జిల్లా జడ్జి ఏర్పాటు చేయించిన ఈ అన్నదాన కార్యక్రమం ఎంతో ఊరటనిస్తోందనడంలో సందేహం లేదు. సామాజిక సేవ చేయాలనే తపన, స్పృహ ఉన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ఆలోచనలను అభినందిస్తూ అన్నదాత.. సుఖీభవ.. అంటూ కీర్తిస్తున్నారు. -
కేంద్ర ప్రభుత్వం లేబర్కోడ్స్ వెనక్కి తీసుకోవాలి
పెద్దపల్లి: నాలుగు లేబర్ కోడ్స్ను కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఏవో ప్రకాష్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ను 2019–20 మధ్యకాలంలో పార్లమెంట్ చేత ఆమోదింపజేసుకొని 2025 నవంబర్ 1న నోటీఫై చేసిందని, నోటీఫై చేసిన కోడ్స్ను 2026 ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి తెస్తామని ప్రకటించిందన్నారు. కార్మికవర్గ ప్రయోజనాలకు వ్యతిరేకమైన లేబర్ కోడ్స్ను పూర్తిస్థాయిలో వెనక్కి తీసుకోవాలన్నారు. జిల్లా అధ్యక్షుడు ఇ.నరేశ్, ప్రధాన కార్యదర్శి బి.అశోక్, ఉపాధ్యక్షులు చిలుక శంకర్, ఐ.రాజేశం, ఎం.దుర్గయ్య, ఎం.కొమరయ్య, అరుణోదయ రాష్ట్ర నాయకులు బతుకుల రాజన్న, డి.బుచ్చమ్మ, రాజేశం, ఎం.కాంతయ్య, కె.ఎల్లయ్య, పెరిక వెంకటస్వామి, ఆర్. రాయమల్లు, శోభన్బాబు, కె.మల్లేశ్, ప్రేమ్కుమార్ దితరులు పాల్గొన్నారు. -
ఎవరికో ఆప్షన్
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు.. రామగుండం కార్పొరేషన్లో కో– ఆప్షన్ పదవుల కోలాహలం మొదలైంది. పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలు, రామగుండం కార్పొరేషన్లో కో ఆప్షన్ ఎన్నికల నిర్వహణకు మున్సిపల్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తయి, కొత్తగా ఎన్నికై న పాలకవర్గం గతనెల 16న కొలువుదీరాయి. మున్సిపల్ చట్టం ప్రకారం మున్సిపాలకులు ప్రమాణస్వీకారం చేసిన రెండు నెలల్లోగా (ఏప్రిల్ 16లోగా) కో ఆప్షన్ ఎన్నిక పూర్తి చేయాల్సి ఉంది. దీంతో కోఆప్షన్ పదవులపై కన్నేసిన ఆశావహులు ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్కే అన్నీ.. మున్సిపాలిటీ, కార్పొరేషన్లో కోఆప్షన్ పదవులన్నీ అధికార కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. మున్సిపల్ చట్టం ప్రకారం నిర్వహించే ఎన్నికల్లో మున్సిపాలిటీల్లో నాలుగు, రామగుండం కార్పొరేషన్లో డివిజన్లు ఎన్ని ఉన్నా ఐదు స్థానాలకే పరిమితం చేశారు. కార్పొరేషన్లోని ఐదు స్థానాల్లో మూడు జనరల్ కేటగిరీ, రెండు పదవులు మైనార్టీలకు.. మున్సిపాలిటీలోని నాలుగు కోఆప్షన్ పదవుల్లో రెండు జనరల్, రెండు మైనార్టీలకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. పెరిగిన పోటీ ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉత్సాహం ఉన్నా.. పార్టీ టికెట్ రాక నిరాశకు గురయ్యారు. ఆ సమయంలో వారిని బుజ్జగించి కో ఆప్షన్గా అవకాశం కల్పిస్తామంటూ కొందరికీ హామీ ఇవ్వగా..ఆశతో ఉన్న ఇంకొందరు రాజకీయ ఒత్తిళ్లను పెంచి కో ఆప్షన్ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆ పదవులకు పోటీ పెరిగింది. అందుకోసం తమకు అనువుగా మంత్రులు, ఎమ్మెల్యేల ఆశీస్సుల కోసం యత్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు సైతం కొందరికి ముందే మాట ఇచ్చినట్టుగా పలువురు చెప్పుకుంటున్నారు. అయితే నాలుగు కోఆప్షన్ పదవులే ఉండడంతో అంతకు మించి ఆశావహులు ఉండడం కొంత ఇబ్బందిగా మారినట్టు తెలుస్తోంది. ఎన్నిక విధానం కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహణకు కమిషనర్ ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేస్తారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో మైనార్టీ కోటాలో పోటీ చేసేవారు కుల ధ్రువీకరణ పత్రం జతపర్చాల్సి ఉంటుంది. పదవుల సంఖ్యను మించి అభ్యర్థులు పోటీలో ఉంటే కౌన్సిల్ సభ్యులు వారిని ఎన్నుకుంటారు. కొత్తగా ఎన్నికై న కౌన్సిలర్లతో సమానంగా సమావేశాల్లో పాల్గొని చర్చించవచ్చు. కానీ తీర్మానాలు, ఎన్నిక సమయంలో ఓటు వేసే హక్కు ఉండదు. గౌరవ వేతనం, ఇతర ప్రోత్సాహకాలు అందుతాయి. వరుసగా మూడు సమావేశాలకు గైర్హాజరు అయితే సభ్యత్వం కోల్పోతారు. -
ఆకలితో ఇబ్బంది పడొద్దని..
కోర్టుల్లో ఉన్న కేసుల నిమిత్తం దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. వారంత తమ కేసు బెంచీకి వచ్చేదాకా.. ఒక్కోసారి కోర్టు సమయం ముగిసే వరకు ఆకలితోనే నిరీక్షించే పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితిని కొంతైనా మార్చాలనే ఆలోచనతో ప్రతీ సోమవారం అన్నదానం ఏర్పాటు చేయాలని నిర్ణయించా. నిజామాబాద్లో పనిచేసినపుడే ఈ ఆలోచన రాగా.. అక్కడి కోర్టులో నేనున్నంత కాలం అమలు చేశా. జడ్జిలు, న్యాయవాదులు ఇలా.. ఎందరో దాతలు ముందుకు రావడం సంతోషకరం. – సునీత కుంచాల, జిల్లా ప్రధానన్యాయమూర్తి -
కట్టుదిట్టంగా జనగణన
పెద్దపల్లి: జిల్లాలో జనగణన కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ జె.అరుణశ్రీ సూచించారు. జనగణన– 2027 కార్యక్రమ నిర్వహణలో భాగంగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించి మాట్లాడారు. జనగణన ప్రక్రియ పారదర్శకంగా, కచ్చితంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రతీ అధికారిపై ఉందన్నారు. శిక్షణలో భాగంగా డేటా సేకరణ విధానం, డిజిటల్ పరికరాల వినియోగం, ఫీల్డ్ స్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జనగణన కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళికకు అవసరమైన కచ్చితమైన గణాంకాలు సిద్ధమవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంబంధిత జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అర్జీలు సత్వరం పరిష్కరించాలి పెద్దపల్లి: ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి సత్వరం పరిష్కరించాలని పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి గంగయ్య అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా పాలనాధికారి బి.ప్రకాష్తో కలిసి కలెక్టరేట్లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సుల్తానాబాద్ పట్టణానికి చెందిన గెల్లు కేతమ్మ వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకోగా, అవసరమైన చర్యలు తీసుకోవాలని డీఆర్డీవో పీడీకి తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ క్రీడాకారులకు ఎన్టీపీసీ ప్రోత్సాహంజ్యోతినగర్(రామగుండం): క్రీడలతో మంచి ఆరోగ్యం లభిస్తుందని ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు జనరల్ మేనేజర్ ముకుల్రాయ్ అన్నారు. సోమవారం ఎన్టీపీసీ టెంపరరీ టౌన్షిప్ జిల్లా ప్రజా పరిషత్ క్రీడా మైదానంలో ఎన్టీపీసీ సీఎస్సార్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామీ క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ఎన్టీపీసీ ప్రోత్సహిస్తుందన్నారు. రామగుండం, అంతర్గాం, కమాన్పూర్, పాలకుర్తి మండలాల్లోని 21 ప్రభుత్వ పాఠశాలల క్రీడాకారులకు వాలీబాల్, ఖోఖో పోటీలు నిర్వహించారు. ఏజీఎం బిజయ్కుమార్ సిగ్దర్, అధికారులు ప్రవీణ్ కే చౌదరి తదితరులు పాల్గొన్నారు. నోటిఫికేషన్లు విడుదల చేయాలిపెద్దపల్లి: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నిరుద్యోగులకు ఏడాదికో సారి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్న మాదిరిగా నోటిఫికేషన్ విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సుల్తానాబాద్ పట్టణంలో స్థానిక నాయకులతో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ నిరుద్యోగులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన త ర్వాత నోటిఫికేషన్ల మాట ఎత్తడం లేదని ఆరో పించారు. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి ఏ ఒక్కటి అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కుల సురేశ్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్యాదవ్, ప్రదీప్కుమార్, నిర్మల, రాజేంద్రప్రసాద్, ప్రవీణ్కుమార్, నల్ల మనోహర్రెడ్డి, రమేశ్, మునీందర్, నాగేశ్వర్, సంతోష్కుమార్, రాజేందర్రెడ్డి, శశివర్ధన్, భాగ్యలక్ష్మి, అన్వేశ్, లత, దాసరి చందు, శ్రీనివాస్, ఐలవేణి శ్రీనివాస్, వెంకటేశ్, శంకర్, కిరణ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వనరుల సృష్టిపై సింగరేణి దృష్టి
ప్రణాళికలు గోదావరిఖని(రామగుండం): సంప్రదాయ విద్యుత్పై సింగరేణి దృష్టి సారించింది. సొంతంగా వనరులను రూపొందించుకుని దేశానికి విద్యుత్ సరఫ రా చేయాలని చూస్తోంది. ప్రస్తుతం సంస్థ వ్యాప్తంగా 2,400 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. అయితే రాబోయే రోజుల్లో దేశ అవసరాల దృష్ట్యా జీరో నెట్ ధ్యేయంగా సింగరేణి ప్రణాళికలు సి ద్ధం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో దేశానికి దన్నుగా నిలవాలనే యోచనతో సింగరేణి సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటికే సంస్థవ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి భారీగా పెంచింది. 245.5 మెగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. 2030 నాటికి జీరోనెట్ సంస్థగా మారాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. రాబోయే రోజుల్లో 2వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని చూస్తోంది. అలాగే మేడిపల్లి ఓసీపీలో జలవిద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు పూర్తి చేసింది. 500 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి చేసి సంప్రదాయ విద్యుత్ లక్ష్యంగా నిర్ణయించింది. అలాగే రాబోయే రోజుల్లో పవన విద్యుత్ కూడా ఉత్పత్తి చేయాలనే సంకల్పంతో సాగుతోంది. ఎత్తులో ఉన్న ఓసీపీ ఓబీ కుప్పలు, ఎత్తైన కొండలపై పవన విద్యుత్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దీంతో సంస్థకు అదనపు ఆదాయంతో పాటు ఎలాంటి కాలుష్యం ఉండబోదని అంటోంది. ఇలా జీరోనెట్ ధ్యేయంగా సోలార్, జల, పవన విద్యుత్ ఉత్పత్తిపై సింగరేణి ముందుకెళ్తూ రాబోయే తరాలకు సంప్రదాయ విద్యుత్ అందించాలని చూస్తోంది. -
ప్రమాదకర రోడ్డుకు మరమ్మతు చేయిస్తాం
● ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లి: సుల్తానాబాద్ పట్టణంలోని మార్కండేయకాలనీకి వెళ్లే బీటీ రోడ్డు మూలమలుపు వద్ద మరమ్మతు చేయిస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఆదివారం రోడ్డు మూలమలుపును పరిశీలించారు. ప్రజల ఇబ్బందులను తమ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామని చెప్పారు. ప్రమాదకరంగా ఉన్న రోడ్డును సరైన క్రమంలో నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అలాగే కాల్వశ్రీరాంపూర్ రోడ్డు నుంచి సుల్తానాబాద్లోని మార్కండేయకాలనీ వరకు రూ.1.20 కోట్లతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను పరిశీలించారు. కౌన్సిలర్ చింతల రాజు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్రావు, విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, ఊట్ల వరప్రసాద్, గాదాసు రవి, ఈర్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నివేదికను పరిగణనలోకి తీసుకోవద్దుపెద్దపల్లి: ఆకునూరి మురళి నివేదికను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవద్దని తపస్ జిల్లా అధ్యక్షుడు సునీల్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం తపస్ డివిజన్ ఇన్చార్జి లింగం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. టీచర్ల జీతాల గురించి మాట్లాడిన కమిటీ పీఆర్సీ, డీఏల గురించి ఎందుకు సిఫార్సు చేయలేదని, విద్యాకమిటీ నివేదిక తప్పులతడకగా ఉందన్నారు. నూతన విద్యావిధానం అమలు చేయాలని, పెండింగ్ బిల్లులు తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో షరతులు లేకుండా పూర్తి ఖర్చులు ప్రభుత్వమే భరించేలా ప్రతీ ఉపాధ్యాయుడికి హెల్త్ కార్డులు జారీ చేయాలన్నారు. మూల వేతనంలో పర్సంటేజీలు కట్ చేయొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర బాధ్యులు ఎలగం కనుకయ్య, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు వెంకట్రెడ్డి, జిలా ఉపాధ్యక్షులు పవన్, వెంకటేశ్వర్లు, కార్యదర్శులు సురేందర్, ఐలయ్య, కార్యవర్గ సభ్యులు అంజయ్య, సందీప్, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామేశ్వర్, రాజేందర్, సతీశ్రెడ్డి, గణేశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. స్వయం ఉపాధికి దరఖాస్తులు ఆహ్వానం పెద్దపల్లి: ఎస్సీ యువతకు స్వయం ఉపాధి అవకాశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. జిల్లాలో ఎలక్ట్రికల్ వెహికల్ టూవీలర్ 142 యూనిట్లు, ఒక్కొక్కటి రూ.లక్ష విలువ, సబ్సిడీ 90 శాతం, బ్యాంకు లోన్ 10 శాతం చెల్లించాలి. ఎలక్ట్రికల్ వెహికల్ త్రీ వీలర్, రూ.3లక్షల విలువ, 71 యూనిట్లు, 70 శాతం సబ్సిడీ, లోన్ 30 శాతం, వ్యవసాయ అనుబంధ సోలార్ యూనివర్సల్ పంపు మోటార్, రూ.7వేలు విలువ, యూనిట్లు 15, సబ్సిడీ 70 శాతం, బ్యాంకు లోన్ 30 శాతం చెల్లించాలి. దరఖాస్తు చేసుకునేవారు ఆధార్, రేషన్కార్డు, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు (గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1,50,000, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు) సమర్పించాలి. వయస్సు 21 నుంచి 50 ఏళ్ల లోపు, వ్యవసాయ పథకానికి 21 నుంచి 60 ఏళ్ల లోపువారు అర్హులని, డ్రైవింగ్ లైసెన్స్, పట్టాదార్ పాస్ పుస్తకం పత్రాలతో ఈనెల 17 నుంచి 27 లోపు http://tgobmms.cgg. gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. -
త్యాగం, సహనానికి ప్రతీక రంజాన్
గోదావరిఖని(రామగుండం): త్యాగం, కరుణ, సహనానికి రంజాన్ ప్రతీక అని ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా ఆదివారం పాత మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో దావత్–ఇ–ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సమాజంలో ఐక్యత మరింత బలపడాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో రంజాన్ మాసం శాంతి, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఫైవింక్లయిన్ కబరస్తాన్ కాంపౌండ్ వాల్ నిర్మించామని, రామగుండంలో రూ.కోటిన్నరతో షాధీఖానా నిర్మించేందుకు బడ్జెట్ మంజూరు అయ్యిందన్నారు. మైనార్టీ సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందన్నారు. కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య, ముస్తఫా, ఫజల్, బాబుమియా, ఆసిఫ్, ఫయాజ్, మైనార్టీ వెల్ఫేర్ అధికారి అఫ్సిన్, ఎండీ ఆసిన్ పాల్గొన్నారు. -
నగరంలో నిరంతర స్వచ్ఛ డ్రైవ్
కోల్సిటీ(రామగుండం): ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన స్వచ్ఛత డ్రైవ్ నిరంత రం కొనసాగిస్తామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ఆదివారం ‘సన్ డే– ఫన్ డే’ థీమ్తో గోదావరిఖని పుష్కర ఘాట్ వద్ద సోషల్ డ్రైవ్ నిర్వహించారు. మున్సిపల్ జాయింట్ డైరెక్టర్ వేణుగోపాల్రెడ్డి, డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, నగరపాలక కమిషనర్ జె.అరుణశ్రీ, పలువురు కార్పొరేటర్లు, సిబ్బంది గోదావరినదిలో చెత్తచెదారం తొలగించే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, సుమారు రూ.150 కోట్ల నిధులు మంజూరు చేయించి పుష్కర ఏర్పాట్లు చేయడానికి ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే బల్దియా వెనుక ఖాళీ స్థలంలో మేయర్ మొక్కలు నాటారు. నగరపాలక కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం సప్తగిరికాలనీలోని ఎస్సీ, బీసీ వెల్ఫేర్ స్కూళ్ల విద్యార్థులకు ప్లాస్టిక్ నిషేధం, తడిచెత్త, పొడిచెత్త వేరు చేయడంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. నెలకోసారి స్పెషల్ డ్రైవ్ రామగుండం నగరంలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక అమలు తీరుపై మున్సిపల్ జాయింట్ డైరెక్టర్ వేణుగోపాల్రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. గోదావరినది తీరంలో నెలకోసారి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సూచించారు. నదిలో వ్యర్థాలు వేయకుండా అవగాహన కల్పించాలని కోరారు. స్వచ్ఛందంగా 500 మంది.. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సుమారు 500 మంది స్వచ్ఛందంగా ‘సన్ డే ఫన్ డే’ కార్యక్రమంలో పాల్గొని నదిలో వ్యర్థాలను తొలగించారని కమిషనర్ అరుణశ్రీ వెల్లడించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆద్వర్యంలో ప్రతినిధులు రాజేందర్, సారయ్య నేతృత్వంలో అందరికీ అల్పాహారం వడ్డించారు. కార్యక్రమాల్లో డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎస్ఈ గురువీర, ఈఈ పీవీ రామన్, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఆర్వో ఆంజనేయులు, ఏసీపీ శ్రీహరి, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, అకౌంటెంట్లు రాజ్కుమార్, రవితేజ, మెప్మా టీఎంసీ మౌనిక తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వానికి చెడ్డపేరు
ప్రభుత్వం మంచి ఆలోచనతో పేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. అధికారుల నిర్లక్ష్యంతో సన్నబియ్యంలో ఎక్కువ శాతం నూకలే వస్తున్నాయి. వాటిని వండితే ముద్దగా మారుతుంది. అధికారులు ఇప్పటికై న నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలి. – మూడ రాజమ్మ, రామగుండం నూకలే ఎక్కువ వస్తున్నాయి రేషన్ షాపులో ఇచ్చే సన్న బియ్యంలో 75 శాతానికి పైగా నూకలు, తుట్టేలు వస్తున్నాయి. అధికారులు పర్యవేక్షణ, నిర్లక్ష్యంతోనే ప్రతి నెలా సన్నబియ్యంలో నూకలు వస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి నూకలు రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. – బానోతు శివశంకర్, రామగుండం -
నూకలు.. తుట్టెలు
సాక్షి పెద్దపల్లి: పేదోడు కూడా ఉన్నోడిలా సన్న బియ్యం బువ్వ తినాలని ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యానికి బదులు సన్న బియ్యం సరఫరా చేస్తుంది. అంతే కాకుండా అర్హులైన వారందరికి కొత్తరేషన్ రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభించింది. అప్పటి నుంచి పేదలతో పాటు అందరూ రేషన్ బియ్యం తినడం అలవాటు చేసుకున్నారు. కానీ, రేషన్ బియ్యంలో ఇప్పుడు నూకలు, దొడ్డు బియ్యం కనిపిస్తున్నాయి. జిల్లాలోని ఆయా రేషన్ షాపులకు సరఫరా చేస్తున్న సన్న బియ్యంలో నూకలు ఎక్కువగా వస్తున్నాయని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. నాణ్యతతో కూడిన సన్న బియ్యం సరఫరా చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రేషన్ దుకాణాల్లో 25 శాతానికి మించి నూకలు, 5 శాతం వరకు దొడ్డు బియ్యం ఉంటున్నాయని, వండితే అన్నం ముద్దగా అవుతుందని మహిళలు వాపోతున్నారు. రేషన్ డీలర్లను ఇదే విషయం అడిగితే తమకు గోదాముల నుంచి వచ్చినవే ఇస్తున్నామని చెబుతున్నారు. గత నెలలోనూ ఇలాగే వచ్చినా పట్టించుకోలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. చాలా మంది దొడ్డు రేషన్ బియ్యం తినలేక, ఎక్కువ ధరకు బయటి మార్కెట్లలో తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. మిల్లులోనే కల్తీ జరుగుతుందా? జిల్లాలో 2,23,553 రేషన్ కార్డులుండగా, ప్రతినెలా 4,000మెట్రిక్ టన్నుల బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. సీఎంఆర్ ధాన్యం తీసుకున్న రైస్ మిల్లర్లు ధాన్యం మరాడించేటప్పుడు 20శాతం నూకలు కటింగ్ బియ్యం వస్తాయనేది బహిరంగ రహస్యమే. వాటికి బహిరంగ మార్కెట్లో తక్కువ ధర ఉన్నందున మిల్లు యజమానులు ప్రభుత్వానికి సరఫరా చేస్తుంటారని, వాటిని పరీక్షించాల్సిన అధికారులు మిల్లర్లు ఇచ్చే మాముళ్లను తీసుకొని ఎలాంటి పరీక్షలు చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అదే సమయంలో సన్న బియ్యంలో నూకలు, దొడ్డు బియ్యం కలుపుతున్నరానే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై డీఎస్వో శ్రీనా థ్ను వివరణ కోరగా.. ‘రేషన్ బియ్యంలో నూకలు వచ్చినట్లు నా దృష్టికి రాలేదు. దుకాణాలను పరిశీలించి నూకలు ఉన్నట్లయితే చర్యలు తీసుకుంటాం. దుకాణాల్లో పరిశీలించి నూకలుంటే ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకొని బాధ్యులపై చర్యలకు ముందుకెళ్తాం. మరోసారి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం’ అని తెలిపారు.జిల్లాలోలబ్ధిదారులు6,66,912ప్రతినెలా బియ్యం సరఫరా 4,000 మెట్రిక్ టన్నులురేషన్ దుకాణాలు413రేషన్కార్డులు2,23,553


