breaking news
Peddapalli District News
-
పుణ్యక్షేత్రాలకు నడపాలి
పెద్దపల్లి నుంచి ధర్మపురి, వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం లాంటి పుణ్యక్షేత్రాలకు నేరుగా బస్సులు నడపాలి. కొంతకాలం ధర్మారం మీదుగా జగిత్యాలకు నడిపిన బస్సులు రద్దు చేశారు. వాటినే ధర్మపురి దాకా నడిపించాలి. – స్వప్న, అప్పన్నపేట ఆధునీకరించాలి జిల్లా కేంద్రం హోదాకు తగ్గట్టుగా పెద్దపల్లి బస్టాండ్ను ఆధునీకరించాలి. ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా ప్లాట్ఫాంలను విస్తరించాలి. డిపో ఏర్పాటు కావడంతో బస్సుల సంఖ్య పెరిగే అవకాశమున్నందును బస్టాండ్ను ఆధునిక వసతులతో అభివృద్ధి చేయాలి. – సోడాబాబు, పెద్దపల్లి ప్రతిపాదనలున్నాయి పెద్దపల్లి బస్టాండ్ను విస్తరించే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నారు. ఆర్టీసీకి ఆదాయం వచ్చేలా ప్రస్తుతం ఉన్న 16 గదులకు తోడుగా షాపింగ్ కాంప్లెక్సు విస్తరణ కూడా చేపట్టే అవకాశముంది. బస్డిపో ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రయాణికులకు మెరుగైన రవాణ సౌకర్యం కల్పిస్తాం. – రాంగోపాల్రెడ్డి, స్టేషన్మేనేజర్ -
అవయవదానంపై అపోహలు వద్దు
పెద్దపల్లిరూరల్: మనిషి మరణానంతరం అవయవదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచి వారికి బతుకునిచ్చిన వారమవుతామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. గురువారం ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా కోర్టు ఆవరణలో జిల్లా అడిషనల్ జడ్జి భవాని, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి మంజుల, జూనియర్ జడ్జి శ్రావణ్కుమార్ సదాశయ ఫౌండేషన్ వారితో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అవయవాలను దానం చేయడంపై ప్రజల్లో అపోహలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేసేందుకు స్వచ్ఛందసంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా అవయవదానం చేసేందుకు ముందుకొచ్చిన న్యాయవాద దంపతులు అశోక్, రమాదేవిని జిల్లా జడ్జి, డీసీపీ రాంరెడ్డి తదితరులు సత్కరించారు. ఫౌండేషన్ ఫౌండర్ భీష్మాచారి, బార్అసోసియేషన్ అధ్యక్షుడు మేకల మల్లేశం, మార కిషోర్, డొంకెన రవీందర్, శ్రీధర్ తదితరులున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలిపెద్దపల్లి: జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ శ్రీరాములు అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో వేడుకల ఏర్పాట్లను గురువారం డీసీపీ రామ్రెడ్డితో కలిసి పరిశీలించారు. ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. పెద్దపల్లి ఆర్డీవో బి.గంగయ్య, కలెక్టరేట్ పరిపాలన అధికారి బండి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పంద్రాగస్టు వేడుకలకు అతిథిగా విప్ విజయరమణారావుసాక్షి, పెద్దపల్లి: ఉమ్మడి జిల్లాలో జిల్లాలవారీగా జాతీయ జెండాను ఎగురవేసేందుకు మంత్రులతో పాటు కేబినెట్ ర్యాంక్ ప్రజాప్రతినిధులను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెద్దపల్లిలో విప్ చింతకుంట విజయరమణరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. నీట్ కోచింగ్కు దరఖాస్తులుపెద్దపల్లి: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల ఆధ్వర్యంలో నీట్–2027 ప్రవేశ పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉచిత లాంగ్టర్మ్ కోచింగ్ అందించనున్నట్లు డీసీవో, మంథని ప్రిన్సిపాల్ శ్రీనాథ్ తెలిపారు. బాలురకు హైదరాబాద్లోని సీఓఈ, బాలికలకు మహీంద్రాహిల్స్లోని సీఓఈ పాఠశాలలో కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. 100 మంది బాలురు, 100 మంది బాలికల చొప్పున కోచింగ్ అందించనున్నట్లు వివరించారు. 2026 విద్యా సంవత్సరంలో బైపీసీ ఉత్తీర్ణులై, నీట్–2026 ప్రవేశ పరీక్షకు హాజరైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు అర్హులని తెలిపారు. దరఖాస్తులకు ఈ నెల 28 గడువని, ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. tgswreis. telangana. gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అవసరమైన ధ్రువపత్రాలు జతచేసి సమీప డీసీవో కేంద్రంలో సమర్పించాలన్నారు. ఆకట్టుకున్న నాటిక ప్రదర్శన రామగిరి: ఆర్జీ–3, ఏపీఏ ఏరియాలోని సెంటినరికాలనీ రాణిరుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో గురువారం సింగరేణి, అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ, హైదరాబాద్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జీవిత చరిత్ర నాటిక ప్రదర్శన నిర్వహించారు. ఏపీఏ జీఎం కొలిపాక నాగేశ్వరరావు హాజరై అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సంఘాల ప్రతినిధులు ఎం.రామచంద్రారెడ్డి, కోట రవీందర్రెడ్డి, శ్రీకాంత్, పర్సనల్ విభాగాధిపతి బి.సుదర్శనం, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ సభ్యులు బత్తుల శంకర్, ఆకునూరి బాల అంకూస్, కిషన్నాయక్ పాల్గొన్నారు. -
మెరుగైన రవాణా సౌకర్యానికి ప్రాధాన్యం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. గురువారం మండలంలోని జాఫర్ఖాన్పేట నుంచి వయా పెద్దపల్లి, గోదావరిఖనికి ఆర్టీసీ బస్ సర్వీస్ను ప్రారంభించారు. మద్దెలవాగుపై రూ.5.43 కోట్లతో నిర్మించిన వంతెన, అప్రోచ్రోడ్డు, రూ.5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ల శిలాఫలకానేఇ్న సర్పంచ్ జ్యోత్స్న యాదగిరితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం విప్ మాట్లాడుతూ, మంగపేట, కూనారం టర్నింగ్ నుంచి ముత్తారం వరకు డబుల్ రోడ్డుకు రూ.32 కోట్లు, పెద్దపల్లి–ర్రెపెల్లి మేజర్ రోడ్డుకు రూ.100 కోట్లు, సుల్తానాబాద్– పెద్దాపూర్ రోడ్డుకు రూ.47 కోట్లు, కూనారం– పెద్దపల్లి రోడ్డుకు రూ.14 కోట్లు, జాఫర్ఖాన్పేట్ రింగ్ రోడ్డుకు రూ.7 కోట్లు, కాల్వశ్రీరాంపూర్లో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్కు రూ.5.30కోట్లు ప్రభుత్వం మంజూరు చేసినట్లు వివరించారు. ఈనెల 17న వీటంన్నిటికీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, ఈఈ రమణారెడ్డి, ఏఈ నాగరాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ మునీర్ తదితరులు పాల్గొన్నారు. శిలాఫలకం ధ్వంసంమండలంలోని జాఫర్ఖాన్పేట మద్దెలవాగు వంతెనపై శిలాఫలకం ధ్వంసం చేసిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. వాగుపై వంతెన నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. నిర్మాణం పూర్తయ్యేలోగా ప్రభుత్వం మారింది. గురువారం విప్ విజయరమణారావు అదే వంతెన ప్రారంభోత్సవం చేశారు. సదరు కాంట్రాక్టర్ అప్పటి శంకుస్థాపన శిలాఫలకం ఏర్పాటు చేసేందుకు అక్కడే గద్దె కట్టారు. ఆ గద్దెను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చి వేయడంతో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గద్దె కూల్చివేతను మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహార్రెడ్డి ఖండించారు. మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి తదితర నాయకులతో కలిసి మాట్లాడారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభిస్తున్న విప్ విజయరమణారావు ప్రభుత్వ విప్ విజయరమణారావు -
‘పెద్ద’పల్లి బస్టాండ్ విస్తరణపై ఆశలు
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రం పెద్దపల్లిలోని ఆర్టీసీ బస్టాండ్ విస్తరణ జరగక ప్రయాణికులు నానాపాట్లు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 12వ బస్డిపోను పెద్దపల్లిలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చి పనులు చేపట్టడంతో దానిని ఆనుకునే ఉన్న శ్రీపెద్దశ్రీపల్లి బస్టాండ్ను ఆధునీకరిస్తారనే ఆశ ఈ ప్రాంత ప్రయాణికుల్లో వ్యక్తమవుతోంది. రైల్వే స్టేషన్కు సమీపంలోనే ఈ బస్టాండ్ ఉండడంతో దూర, సుదూర ప్రాంతాలకు రైళ్లలో ప్రయాణించాలనుకునే వారు సైతం పెద్దపల్లి వరకు ఆర్టీసీ బస్సుల్లోనే చేరుకుంటుండడంతో రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. నిత్యం దాదాపు 500 పైగా ట్రిప్పులతో 12వేల నుంచి 15వేల మంది దాకా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని అంచనా. పలు డిపోల నుంచే 382 ట్రిప్పులు పెద్దపల్లి బస్టాండ్ మీదుగా నిత్యం జిల్లాలోని కరీంనగర్, గోదావరిఖని, మంచిర్యాల, హుస్నాబాద్, హుజురాబాద్, మంథని, ఆసిఫాబాద్ తదితర డిపోలకు చెందిన బస్సులే 382 ట్రిప్పులు నడుస్తుంటాయి. ఈ బస్సుల్లో కరీంనగర్, సిద్దిపేట, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. ఇవి కాకుండా మరో వంద ట్రిప్పుల వరకు పెద్దపల్లి, దాని చుట్టూ ఉన్న పరిసర మండలాలు, గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడుస్తుంటాయి. బస్టాండ్ నుంచి యైటింక్లయిన్కాలనీకి రోజూ 30 ట్రిప్పులు, దొంగతుర్తి, ధర్మారంకు 19 ట్రిప్పులు నడుస్తున్నాయి. బస్డిపో ఏర్పాటుతో పెరగనున్న బస్సులు పెద్దపల్లిలో ఆర్టీసీ బస్సుడిపో మంజూరు కావడంతో పనులు మొదలయ్యాయి. పనులు కాస్త నెమ్మదించినా మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, విప్ విజయరమణారావు పనులు పొందిన కాంట్రాక్టర్పై ఒత్తిడి పెంచడంతో చకచకా సాగుతున్నాయి. ఈ డిపో అందుబాటులోకి వస్తే 52 బస్సులను పెద్దపల్లి డిపోకు ఆర్టీసీ అధికారులు కేటాయించనున్నారు. ఫ్లాట్ఫాంల విస్తరణ అవసరం పెద్దపల్లి బస్టాండ్లో కేవలం ఆరు ఫ్లాట్ఫాంలే ఉన్నాయి. దీంతో బస్సులను బస్టాండ్లోని ఖాళీ ప్రదేశాల్లోనే నిలపాల్సి వస్తోంది. దీంతో బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని ఫ్లాట్ఫాంలు నిర్మించేలా బస్టాండ్ను విస్తరించాల్సిన అవసరముందని ప్రయాణికులు కోరుతున్నారు. మూత్రశాలలు శిథిలం బస్టాండ్ ఆవరణలో మూత్రశాలలు అధ్వానంగా మారాయి. తొట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తొ ట్లు లేకండానే మూత్రవిసర్జన చేయాల్సి వస్తోందని ప్రయాణికులు పేర్కొంటున్నారు. అయితే మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో వారు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఓ మరుగుదొడ్డిని నిర్మిస్తున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. రద్దీకి అనుగుణంగా అభివృద్ధికి నోచని వైనం మరిన్ని ఫ్లాట్ఫాంలు అవసరం నిత్యం 500 వరకు ట్రిప్పులు.. 15వేల మంది ప్రయాణం -
లక్ష్యానికి మించి హెచ్పీవీ టీకా
పెద్దపల్లి: కిశోర బాలికలను క్యాన్సర్ ముప్పు నుంచి రక్షించేందుకు ప్రభుత్వం చేపట్టిన హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకా కార్యక్రమం జిల్లాలో లక్ష్యానికి మించి కొనసాగుతోంది. డిసెంబర్ నాటికి జిల్లాలో 13–14 ఏళ్లు నిండిన విద్యార్థినులు 3,701 మంది ఉన్నట్లు గుర్తించి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఈనెల 13 నాటికి 3,992 మందికి టీకాలు వేసినట్లు జిల్లా ఇమ్యూనైజేషన్ అఽ దికారి డాక్టర్ కిరణ్కుమార్ తెలిపారు. దీంతో 108 శాతం టీకా పంపిణీ పూర్తయిందని పేర్కొన్నారు. కొత్తగా 291 మంది గుర్తింపు 13 ఏళ్లు దాటిన కిశోర బాలికలను గుర్తించి హెచ్పీవీ టీకా అందించడంలో భాగంగా ఈ నెలలో మరో 291 మందిని కొత్తగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. క్యాన్సర్కు కారణమయ్యే హెచ్పీవీ వైరస్ నుంచి ముందస్తు రక్షణ కల్పించేందుకు టీకాను అందిస్తున్నారు. గత మార్చి నుంచి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు 17 పీహెచ్సీలు, 4 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 8 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్సెంటర్లలో అర్హులైన విద్యార్థులకు టీకాలు వేస్తున్నారు. సిబ్బంది, అధికారుల సహకారంతో.. జిల్లాలో ఎప్పటికప్పుడు 14 ఏళ్లు నిండిన విద్యార్థులను గుర్తించి టీకాలు వేస్తున్నాం. క్యాన్సర్ రాకుండా ఈ టీకా దోహదపడుతుంది. సిబ్బంది, అధికారుల సహకారంతో లక్ష్యానికి మించి టీకాలు పంపిణీ చేశాం. – కిరణ్కుమార్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి జిల్లాలో 108 శాతం పూర్తి 3,701 మందికి గాను 3,992 మందికి వ్యాక్సిన్ -
అంబులెన్స్ సేవలు వినియోగించుకోవాలి
కోల్సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో కొత్త అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ (ఏఎల్ఎస్) అంబులెన్స్ సేవలు గురువారం ప్రారంభమయ్యాయి. ఎన్టీపీసీ సీఎస్ఆర్ నిధులతో మంజూరైన అంబులెన్స్ను ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, నగర మేయర్ మహంకాళి స్వామి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆస్పత్రి ఆవరణలో ఎమ్మెల్యే స్వయంగా అంబులెన్స్ నడిపి సేవలను ప్రారంభించారు. ఎన్టీపీసీ సీఎస్ఆర్ నిధుల నుంచి రెండు అంబులెన్స్ల కొనుగోలుకు రూ.45 లక్షలు మంజూరయ్యాయని, పెద్దపల్లికి, గోదావరిఖని జీజీహెచ్కు కేటాయించినట్లు చెప్పారు. ప్రజలు జీజీహెచ్లో అందుతున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. త్వరలోనే క్యాథ్ల్యాబ్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. అనంతరం వైద్యాధికారులతో సమావేశమై ఆస్పత్రి అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. కార్పొరేటర్లు సంతోష్రావు, ఎండీ ముస్తఫా, గట్ల రమేశ్, నాయకులు ధీటీ బాలరాజు, బొంతల రాజేశ్, డిప్యూటీ సూపరింటెండెంట్ అరుణ, ఆర్ఎంవోలు కృపాబాయి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ -
త్రివర్ణ శోభితం
జాతీయ జెండాలు రెపరెపలాడాయి. వేలాది మంది విద్యార్థుల దేశభక్తి నినాదాలతో పట్టణం మార్మోగింది. ‘హర్ ఘర్ తిరంగా’ సందేశాన్ని చాటుతూ బీజేపీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ర్యాలీ కన్నుల పండువగా సాగింది. దాదాపు 10 వేల మంది విద్యార్థులు చేతుల్లో త్రివర్ణ పతాకాలను పట్టుకుని కదం తొక్కగా ఆ దృశ్యం దేశభక్తికి ప్రతీకగా నిలిచింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణ పురవీధుల గుండా నిర్వహించి కమాన్ మీదుగా కళాశాలకు చేరింది. – పెద్దపల్లి -
వందేమాతరం
శుక్రవారం శ్రీ 14 శ్రీ ఆగస్టు శ్రీ 2026మన దేశం సుసంపన్నమైనదని ఎన్టీపీసీ రామగుండం–తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్కుమార్ సామంత అన్నారు. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా గురువారం పర్మినెంట్ టౌన్షిప్లోని సెయింట్ క్లేర్ హైస్కూల్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. సుమారు 1,500 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎన్టీపీసీ ఉద్యోగులు వందేమాతరం సామూహిక గానంతో పాటు రూపకల్పన చేయడం ఆనందంగా ఉందన్నారు. అందరిలో దేశభక్తి, ఐక్యత స్ఫూర్తి ప్రతిబింబించాలని ఆకాంక్షించారు. కార్పొరేటర్ కొలని కవితారెడ్డి, సంస్థ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. – జ్యోతినగర్(రామగుండం) -
తనిఖీలకే పరిమితం కావొద్దు
పెద్దపల్లి: అకడమిక్ ప్యానల్ సందర్శనలు కేవలం తనిఖీలకే పరిమితం కాకుండా ఉపాధ్యాయులకు అవసరమైన అకడమిక్ సహకారం అందిస్తూ, పాఠశాలల్లో నిరంతర విద్యాభివృద్ధికి దోహదపడేలా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. గురువారం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో రాష్ట్రంలోని అన్ని మండలాల విద్యాధికారులు, జిల్లా విద్యాధికారులు, ప్రాంతీయ సంయుక్త సంచాలకుల కోసం నిర్వహించిన ఒకరోజు శిక్షణ, అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న అకడమిక్ ప్యానల్ విధానంపై రాష్ట్రస్థాయి అధికారులకు ప్రజెంటేషన్ ఇచ్చారు. పాఠశాల స్థాయిలో బోధన, అభ్యసన ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ఉపాధ్యాయులకు ఫీడ్బ్యాక్ ఇచ్చే విధానం నిర్మాణాత్మకంగా ఉండాలన్నారు. అకడమిక్ ప్యానల్ సందర్శనల ద్వారా ఉపాధ్యాయుల్లో భయాన్ని కలిగించకుండా, వారి బోధన సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన సహకారం అందించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అకడమిక్ మానిటరింగ్ను మరింత సమగ్రంగా అమలు చేసేందుకు పెద్దపల్లి జిల్లాలోని ఈ విధానం ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష -
బొగ్గు రవాణాపై సింగరేణి నజర్
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి.. గోదావరిఖని: ఎల్నీనో నేపథ్యంలో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూసుకోవాలని ఆదేశించింది. వర్షాభావ పరిస్థితుల మూలంగా రై తులకు విద్యుత్ ఇబ్బంది లేకుండా నిరంతరం సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర థర్మల్ విద్యుత్ కేంద్రాలపై ఉత్పత్తి టార్గెట్ పె రిగింది. రోజూ 28 నుంచి 32 రేకుల నాణ్యమైన బొగ్గు సరఫరా చేయాలని సంస్థ సీఎండీ అన్ని ఏరియాల జీఎంలకు ఆదేశాలు జారీ చేశారు. ఓసీపీల్లో తగ్గిన ఉత్పత్తి వర్షాల కారణంగా ఓపెన్కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి తగ్గింది. అయినా ముందస్తు జాగ్రత్తలతో నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలను సాధించేలా చూడాలని అన్ని ఏరియాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి తగ్గినా భూగర్భ గనుల్లో ఉత్పత్తిని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూ థర్మల్ కేంద్రాలకు 75 నుంచి 80 శాతం బొగ్గును సింగరేణి అందిస్తోంది. ఉత్పత్తికి అనుగుణంగా అన్ని ఓసీపీల్లో ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ ఆర్థిక సంవత్సర లక్ష్యాలను పూర్తి చేయడంతో పాటు భవిష్యత్తులో 70 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని చేరుకోవాలని, 500 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగింపు లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళికతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. ఓసీపీల్లో 93శాతం ఉత్పత్తి సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఓసీపీల్లో ఈనెల 10 నాటికి 18.21మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి గాను 16.87మిలియన్ టన్నుల బొగ్గు సాధించి లక్ష్యాల్లో 93శాతం చేరుకున్నాయి. వర్షాకాలం తర్వాత లక్ష్యాలకు మించి బొగ్గు ఉత్పత్తి చేసేలా యాజమాన్యం ప్రణాళికలు రూపొందిస్తోంది. 80 శాతం బొగ్గు థర్మల్ విద్యుత్ కేంద్రాలకే -
లోకోపైలట్ల నిరసన
రామగుండం: కేంద్రం ప్రకటించిన వేతన కమీషన్లో లోకోపైలట్లకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆలిండియా లోకోరన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ కేంద్ర కమిటీ పిలుపు మేరకు గురువారం రామగుండం రైల్వేస్టేషన్ ప్లాట్ఫాంపై లోకో పైలట్లు ఆందోళన చేపట్టారు. 5,6,7వ పే కమీషన్లో లోకోరన్నింగ్ స్టాఫ్కు తీవ్ర అన్యాయం జరిగిందని, రైల్వేలోని రెండు ప్రధాన ట్రేడ్ యూనియన్లు దీనిపై స్పందించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సత్వరమే రన్నింగ్ స్టాఫ్ వేతన సవరణకు అనుకూలంగా కేంద్రానికి లేఖలు రాయాలన్నారు. 8వ పే కమీషన్ సభ్యులు బేసిక్ పే సవరించి లెవల్ సిక్స్ నుంచి మొదలుకొని 8 వరకు లోకోరన్నింగ్ స్టాఫ్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రకృతికి విరుద్ధంగా విధులు నిర్వహించే తమపై కేంద్రం ప్రత్యేక చొరవ చూపించాలన్నారు. రామగుండం బ్రాంచ్ సెక్రటరీ సీహెచ్రవి, సచిన్, పురుషోత్తం మీనా, పల్లికొండ శంతన్కుమార్, కిరణ్, ప్రేమ్, రఫీ పాల్గొన్నారు. -
గడువులోగా సీఎమ్మార్ పూర్తి చేయాలి
పెద్దపల్లి: 2024–25 యాసంగి సీజన్ సీఎమ్మార్ స రఫరాలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అద నపు కలెక్టర్ శ్రీరాములు కోరారు. కలెక్టరేట్లోని తన చాంబర్ సీఎమ్మార్ డెలివరీపై అధికారులు, రైస్మిల్లు సంఘాలతో బుధవారం సమీక్షించారు. జిల్లాలోని రైస్మిల్లుల్లో ఎఫ్సీఐ నిబంధనల ప్రకా రం రా రైస్, పాలిష్రైస్ నాణ్యత లోపం వంటి సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్, మేనేజర్ శ్రీకాంత్, రైస్ మి ల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, జయపాల్రెడ్డి, రాజన్న తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ శ్రీరాములు -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
ముత్తారం: గ్రామాల్లో ప్రబలుతున్న సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వై ద్యాధికారి పవిత్ర ఆదేశించారు. స్థానిక ప్రభు త్వ జూనియర్ కళాశాలలో సీజనల్ వ్యాధులపై బుధవారం విద్యార్థులకు అవగాహన కల్పించా రు. ఇంట్లో పరిసరాలను పరిశుభ్రత ఎంతోఅవసరమని అన్నారు. ఇన్చార్జి వైద్యుడు ప్రదీప్, సర్పంచ్ సుదాడి రవీందర్రావు, వైద్య సిబ్బంది, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 16న ఫుట్బాల్ జట్టు ఎంపికరామగుండం: ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి ఫుట్బాల్ జట్టు ఎంపిక పోటీలను ఈనెల 16న యైటింక్లయిన్కాలనీ ఏపీజే అబ్దుల్ కలాం స్టేడియంలో నిర్వహించనున్నట్లు ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గణపతి తెలిపారు. క్రీడాకారులు ఆధార్, వయసు ధ్రువీకరణపత్రం, నాలుగు పాస్పోర్ట్ సైజు ఫొటోలు, ఫుట్బాల్ కిట్తో హాజరుకావాలని కోరారు. వివరాలకు 73867 63273, 95509 03088, 99088 39896లో సంప్రదించాలని సూచించారు. బెల్ట్షాపులు బంద్ చేయాలని గ్రామ పంచాయతీ తీర్మానంసుల్తానాబాద్రూరల్: తొగర్రాయి గ్రామంలో బెల్ట్షాపుల బంద్కు పంచాయతీ పాలకవర్గం తీర్మా నం చేసి అమలు చేస్తున్న ట్లు సర్పంచ్ చిలుక స్రవంతి, పంచాయతీ కార్యదర్శి తెలిపారు. ఇందులో భాగంగా బెల్డ్షాపుల నిర్వాహకులకు బుధవారం పంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. బెల్ట్షాపులు నిర్వహిస్తే పంచాయతీరాజ్ – 2016 చట్టం ప్రకారం పోలీసుల సాయంతో క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నోటీసులో హెచ్చరించారు. ‘బ్లాక్హక్స్ టీం’లో చోటు జూలపల్లి: వాలీబాల్ ఇండి యా ప్రీమియం లీగ్ అండ ర్ –21 కేటగిరీలో హైదరాబాద్ బ్లాక్ హక్స్ టీంకు అ బ్బాపూర్ గ్రామానికి చెంది న టెక్కం సృనిక్ ఎంపిక య్యాడు. ఈనెల 14 – 16వ వరకు గోవాలో జ రిగే పోటీల్లో సృనిక్ పాల్గొంటాడు. వాలీబాల్ క్రీడాకారులు అమరగాని గంగాధర్, వెంకటేశ్, ఖాజమియా, బొమ్మెనవేని సతీశ్, ఆవుల రాజు, కొమ్మ సతీశ్, కోడూరి రాజశేఖర్, రాకేశ్, సాగర్, మహేశ్ తదితరులు అభినందించారు. పీఆర్సీ ప్రకటించాలి మంథనిరూరల్: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు పీఆర్సీ ప్రకటించాల ని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గండు కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. వివిధ పాఠశాలల్లో బుధవారం పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కా ర్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడు తూ, సెప్టెంబర్ 1న హైదరాబాద్లో నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలన్నా రు. పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కా నుగంటి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు ఎగడి సురేశ్, ప్రధాన కార్యదర్శి పచ్చిక స్వరూప, కొమురయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేడు బీజేపీ చీఫ్ రాక పెద్దపల్లిరూరల్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు గురువారం జిల్లా కేంద్రంలో పర్యటిస్తారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి తెలిపారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి ప్రారంభమయ్యే బీజేపీ తిరంగా యాత్రకు రాంచందర్రావు హాజరవుతారని, యువత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. హెచ్ఎం సస్పెన్షన్ పెద్దపల్లి : మద్యం మత్తులో విధులకు హాజర య్యారనే ఆరోపణలపై మంథని మండలం క న్నాల ఎంపీపీఎస్ హెడ్మాస్టర్ ఎం.మధునయ్యను బుధవారం సస్పెండ్ చేస్తూ డీఈవో శారద ఉత్తర్వులు జారీచేశారు. కలెక్టర్ శ్రీహర్ష సూచన మేరకు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ సీఐపై దాడికి యత్నం గోదావరిఖని: సర్వీస్ రోడ్డుకు అడ్డుగా పెట్టిన ద్విచక్రవాహనాన్ని ట్రాఫిక్ సీఐ గన్మెన్ పక్క కు తీస్తుండగా వాహనదారు దాడికి దిగిన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. స్థానిక బీ – గెస్ట్హౌస్ సమీపంలో మద్యం మత్తులో ఉన్నఇద్దరు యువకులు రోడ్డుకు అడ్డంగా ద్విచ క్రవాహనం నిలిపి మూత్రానికి వెళ్లారు. అటు గా వెళ్తున్న ట్రాఫిక్ సీఐ చూసి పక్కకు పెట్టా లని గన్మెన్కు సూచించారు. టూవీలర్ను ప క్కకు పెడుతుండగా.. తన వాహనం తీయడానికి మీరెవరంటూ యువకులు దౌర్జాన్యానికి దిగారు. అడ్డుకోబోయిన సీఐని సైతం నెట్టివేశా రు. ట్రాఫిక్ సీఐ ఫిర్యాదు మేరకు వన్టౌన్ పో లీసులు యువకులపై కేసు నమోదు చేశారు. -
నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు
గోదావరిఖని: విధుల్లో అలసత్వం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని రామగుండం పోలీ స్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా హెచ్చరించారు. తన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన నేర సమీక్షలో పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టు, ద ర్యాప్తు పురోగతి, నేర నియంత్రణ తదితర అంశాలపై సూచనలు చేశారు. ఆర్థిక నేరాల్లో నిబంధనల ప్రకారం ఆస్తుల జప్తు చేయాలని ఆదేశించారు. కొత్త చట్టాలపై ప్రతీపోలీస్ అధికారి పూర్తిఅవగాహన క లిగి ఉండాలని సూచించారు. సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలన్నారు. మంచిర్యా ల, పెద్దపల్లి డీసీపీలు భాస్కర్, రాంరెడ్డి, అద నపు డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, గోదావరిఖని, పెద్దపల్లి, మంచిర్యాల, జైపూర్, బెల్లంపల్లి, స్పెషల్ బ్రాంచ్, ట్రాఫిక్, సీసీఎస్, టాస్క్ఫోర్స్, సైబర్క్రైం, ఏఆర్ ఏసీపీలు రమే శ్, కృష్ణ, ప్రకాశ్, వెంకటేశ్వర్లు, కిరణ్కుమార్, నాగేంద్రగౌడ్, శ్రీనివాస్, రవీందర్, ప్రవీ ణ్ కుమార్, శ్రీనివాస్రావు, రంగారెడ్డి, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ వాహనాల తనిఖీ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పోలీస్స్టేషన్లకు చెందిన వాహనాల పనితీరు, నిర్వహణను సీపీ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పరిశీలించారు. నిర్ణీత వ్యవధిలో మరమ్మతు, ఇంజిన్ ఆయిల్ మార్పు, టైర్ల నిర్వహణ తదితర అంశాల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా -
షాపింగ్ కాంప్లెక్స్ షెట్టర్లు సీజ్
పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ క ళాశాల షాపింగ్ కాంప్లెక్స్లోని 25 షెట్టర్లను బుధవారం సీజ్ చేశారు. టెండర్ గడువు ముగిసినా ని ర్వాహకులు గదులు ఖాళీ చేయకపోవడంతో ఐదుసార్లు నోటీసులు జారీచేశామని, అయినా స్పందించకపోవడంతో ఈ చర్యలు చేపట్టామని ప్రిన్సిపాల్ రవీందర్రెడ్డి తెలిపారు. కాంప్లెక్స్లో 26 షట్టర్లు ఉండగా ఆరు నెలల క్రితం ఒకటి స్వాధీనం చేసుకు న్నామన్నారు. పోలీసు, మున్సిపల్, కళాశాల సి బ్బంది బందోబస్తు చర్యల్లో పాల్గొన్నారు. ఓపెన్ టెండర్కు సన్నాహాలు బహిరంగ మార్కెట్లో ఒక్కో షట్టర్ అద్దె రూ.13 వేలు పలుకుతోంది. ప్రస్తుతం రూ.8,000 చొప్పున చెల్లిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్కోషట్టర్కు రూ.5వేల చొప్పున ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నట్లు గుర్తించిన సంబంధిత శాఖ అధికారులు.. ఇకపై ఓపెన్ టెండర్ ద్వారా గదులు అద్దెకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టెండర్ గడువు ముగిసినా ఖాళీ చేయని నిర్వాహకులు పోలీసులు బందోబస్తు మధ్య 25 గదులు సీజ్ -
ఐటీఐ క్లస్టర్ ఏర్పాటు చేయాలి
రామగుండం: పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పీఎం సేతు ఐటీఐ క్లస్టర్ ఏర్పాటు చేయాలని ఎంపీ వంశీకృష్ణ కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామితో ఎంపీతోపాటు కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ సమావేశమై విన్నవించారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ పేర్కొన్నారు. కాంగ్రెస్ను బలోపేతం చేయాలి గోదావరిఖని: గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మ రింత బలోపేతం చేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ సూచించారు. బుధవారం ఎ మ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పా ర్టీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పలు మండలాల ఇన్చార్జిలను ప్రకటించారు. సర్ పక్రియ సాగిన తీరుపై సమీక్షించారు. జిల్లాలో ని నాయకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. యూరియా నిల్వచేస్తే చర్యలు కమాన్పూర్: అనుమతి లేకుండా యూరియా నిల్వచేస్తే చర్యలు తీసుకుంటామని డీసీపీ రాంరెడ్డి హె చ్చరించారు. ముల్కపల్లిలో అక్రమంగా నిల్వ చేసిన 127 యూరియ బస్తాలను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో బుధవారం విలేకరుల సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ, ఎస్ఆర్ ట్రేడర్స్లో అక్రమంగా యూరియా నిల్వ చేసినట్లు అందిన సమాచారం మేరకు రామగుండం టాస్క్ఫోర్ ఏసీపీ శ్రీనివాస్, ఎస్ఐలు లక్ష్మ ణ్, రమేశ్, లచ్చన్న, కమాన్పూర్ తనిఖీ చేయగా.. యూరియా లభించిందన్నారు. వ్యవసాయాధికారి శ్రీకాంత్కు సమాచారం అందించగా యూరియా పరిశీలించారు. ట్రాలీ డ్రైవర్ రాజ్కుమార్ను విచారించగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల గ్రామం నుంచి యూరియా తీసుకువచ్చినట్లు తెలి పినట్లు డీసీపీ వివరించారు. డ్రైవర్తోపాటు పలువురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు -
మొదటి అంతస్తులో డిగ్రీ తరగతులు
మంథని: విద్యార్థుల కోసం డిగ్రీ కళాశాల తరగతులను ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం మొద టి అంతస్తులో నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహ ర్ష ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను బుధవారం సందర్శించారు. మల్లేపల్లి డిగ్రీ క ళాశాలకు దూరం ఎక్కువగా ఉండడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా విద్యా ర్థులు గైర్హాజరవుతున్నారని, ఈ విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. మల్లేపల్లి డిగ్రీ కళాశాలను జూ నియర్ కళాశాలలోని ఖాళీ గదుల్లో నిర్వహించాలని సూచించారు. మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివా స్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్రెడ్డి, కమిషనర్ మనోహర్, తహసీల్దార్ అరీఫొద్దీన్ పాల్గొన్నారు. క్రీడలతో ఆరోగ్యం పెద్దపల్లి: డ్రగ్స్కు దూరంగా ఉంటూ క్రీడలు, వ్యా యామాలను జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యంగా ముందుకు సాగాలని కలెక్టర్ శ్రీహర్ష యువతకు సూచించారు. సెప్టెంబర్ 27న నిర్వహించనున్న నాలుగో కరీంనగర్ హాఫ్ మారథాన్ ప్రచార పోస్టర్ ను కలెక్టరేట్లో ఆవిష్కరించారు. డీఎంవో ప్రవీణ్రెడ్డి, కేఆర్సీఏ అధ్యక్షుడు మహేశ్ పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యారోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. వైద్యారో గ్య శాఖ పనితీరుపై కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో సూచనలు చేశారు. డీఎంహెచ్వో పవిత్ర, డీసీహెచ్ఎస్ శ్రీధర్, సుల్తానాబాద్ డీసీహెచ్ఎస్ రమాదేవి, ప్రోగ్రాం అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమస్యలకు పరిష్కారం చూపాలి పాలకుర్తి: ప్రజాప్రతినిధులు లెవనెత్తే సమస్యలకు పరిష్కారం చూపాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించా రు. పాలకుర్తి రైతువేదికలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ పలు సూచనలు చేశా రు. వివిధ విభాగాల ప్రగతి నివేదికలను శాఖలవారీగా సమీక్షించి సమస్యలను అడిగి తెలుసుకున్నా రు. ఎంపీడీవో రమేశ్, ఎంపీవో సుదర్శన్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు విజయ, సువర్ణ, వైద్యాధికారు లు సాయి సూర్య, సరళి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష -
డయాగ్నొస్టిక్ సెంటర్ నిర్వాహకులపై దాడికి యత్నం
పెద్దపల్లి: అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఆ రోపణలతో జిల్లా కేంద్రంలోని ఓ డయాగ్నొస్టిక్ సెంటర్ నిర్వాహకులపై స్థానికులు దాడికి య త్నించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ ల్యాబ్లు, డయాగ్నొస్టిక్ సెంటర్లను ఆశ్రయించే వారినుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని స్థానికులు, బాధితులు ఆరోపించా రు. ఈ క్రమంలో బుధవారం సదరు డయాగ్ని స్టిక్ సెంటర్ వద్ద వివాదం చోటుచేసుకుంది. ని ర్వాహకులపై స్థానికులు దాడిచేసినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘట నా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సెంటర్ను పోలీసులు మూసివేయించారు. ప్రైవేట్ ల్యాబ్లు, డయాగ్నొస్టిక్ సెంటర్లలో అధిక ధరల వ సూలుపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీ లు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. -
మెడికిల్ దందా
సాక్షి పెద్దపల్లి: మీకు తల నొప్పివస్తుందా? జ్వరం ఉందా? కడుపు, ఒళ్లు నొప్పులతో భరించలేకుండా ఉ న్నారా? నిద్ర పట్టడం లేదా? ఏం భయం లేదు.. అనారోగ్య సమస్యలపై డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే లేదు. సమస్యగ గురించి చెబితే చాలు మెడికల్ షాపుల్లో అన్నిరకాల మందులూ ఇస్తారు. ఎంత మొత్తంలో కావాలన్నా ఇస్తారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరమే లేదు. ఏ మందు వేసుకోవాలో, రోజుకు ఎన్ని వేసుకోవాలో, ఎన్ని రోజులు వాడాలో కూడా మెడికల్ షాపుల నిర్వాహకులే చెప్పేస్తారు. ఇలా జిల్లాలో మెడికల్ షాపుల నిర్వాహకులు అడ్డగోలు వ్యాపారం చేస్తున్నారు. అప్పుడప్పుడు తని ఖీలు చేయడం, నామమాత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోవడం సంబంధిత శాఖ అధికారులకు పరిపాటిగా మారింది. వైద్యుల చీటీ ఉంటేనే.. నిబంధనల ప్రకారం వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మెడికల్ షాపుల్లో మందులు ఇవ్వాలి. చాలామంది నిబంధనలు పాటించడం లేదు. జ్వరం, జలుబు, తలనొప్పి, కడుపునొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు, ఒంటినొప్పులు తదితర సమస్యలకు మెడికల్ షాపుల్లో అడగ్గానే మందలిస్తున్నారు. కార్డియాలజీ, సైక్రి యాట్రిక్, న్యూరాలజీ, యూరాలజీ, బ్రెయిన్ స్ట్రోక్, డయాబెటిక్, బీపీ, థైరాయిడ్, యూరిన్ ఇన్ఫెక్షన్ తదితర సమస్యలకు ప్రిస్క్రిప్షన్ లేకుండా మందు లు ఇవ్వకూడదు. ఈ వ్యాధుల ఔషధాల్లో హైడోస్, లోడోస్ అనే రకాలు ఉంటాయి. వ్యాధితీవ్రత, పే షెంట్ వయసు, శరీరతత్వం తదితరాలను బట్టి డాక్టర్లు మెడిసిన్ నిర్ణయిస్తారు. సాధారణంగా మెడికల్ షాపులకు వెళ్లి అడిగితే ఏ రోగానికై నా, ఎన్ని మందులు కావాలన్నా ఇచ్చేస్తున్నారు. ఆల్కహాల్, ఇతర మత్తు పదార్థాలకు బానిసైనవారు అవి దొర కని సమయాల్లో మెడికల్ సిరప్లు వాడుతున్నారు. ఎక్స్పైర్డ్ మందులూ అమ్ముతున్నారు డ్రగ్స్, కాలపరిమితి దాటిన, నకిలీ మందుల విక్రయాలూ జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. డాక్టర్ రాసిన కంపెనీవి లేకుంటే వేరే కంపెనీ మందులు అంటగడుతున్నారు. జిల్లాలో సుమారు 500 వరకు రిటైల్, హోల్సేల్ మెడికల్ షాపులున్నాయి. రోజూ చిన్న, పెద్దదుకాణాల్లో రూ.3వేల నుంచి రూ.లక్ష వ్యాపారం జరుగుతోంది. డ్రగ్ఇన్స్పెక్టర్ల అడ్రెస్సే లేదు. అర్హత, అనుభవం లేనివారు ఫార్మసిస్ట్ సర్టిఫికెట్లతో మెడికల్ షాపులను ఏర్పాటు చేస్తున్నారు. లైసెన్స్ ఒకరిది.. నిర్వహణ మరొకరిది జిల్లాల్లో మందుల షాపులు బినామీలే నిర్వహిస్తున్నారు. ప్రొఫెషనల్ ఫార్మసిస్టు ఆధ్వర్యంలో అవగాహన ఉన్నసిబ్బందితోనే షాప్లు నిర్వహించాలి. చాలా మంది తక్కువ వేతనంతో యువకులకు పనిలో పెట్టుకుంటున్నారు. మెడికల్పై పరిజ్ఞానం లేనివారు షాపులను నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మామూళ్ల మత్తులో.. డ్రగ్స్, కాస్మొటిక్స్ యాక్ట్ ప్రకారం ప్రతీ మెడికల్ షా పులో రిజిష్టర్డ్ ఫార్మసిస్టు ఉండాలి. బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ.. ఇలా ఏదోఒక ఫార్మసీ కోర్సు చేసినవారే షాపు నిర్వహించాలి. అనుమతిచ్చే సమయంలో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఫార్మాసిస్టు ఉన్నదీ లేనిదీ తనిఖీ చేయాలి. ఏరియా ఇన్స్పెక్టర్లు ఈ బాధ్యత నిర్వర్తించాలి. కానీ కొందరు ఏరియా ఇన్స్పెక్టర్లు మామూళ్ల మత్తులో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పర్సంటేజీలు మాట్లాడుకొని.. జనరిక్, నాన్ జనరిక్ అనే తేడా లేకుండా నిర్వాహకులు ఔషధ కంపెనీలతో పర్సంటేజీలు మాట్లాడుకొని వైద్యులతో కుమ్మకై ్క ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదే విషయమై డ్రగ్ ఇన్స్పెక్టర్ను సంప్రదించగా తనిఖీలు చేస్తున్నామన్నారు. నిబంధనలు పాటించని మెడిక్ షాపుల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఔషధాల విక్రయాలు ఫిజీషియన్ శాంపిళ్లు, కాలంచెల్లిన మందుల అమ్మకాలు జిల్లావ్యాప్తంగా డ్రగ్ఇన్స్పెక్టర్ల నామమాత్రపు తనిఖీలు షాపుల్లో బినామీల దందా కానరాని ఫార్మసిస్ట్లు -
అంజన్న సొమ్ము గోల్మాల్పై చర్యలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సుమారు రెండేళ్ల క్రితం.. కొండగట్టు ఆలయ నిధుల గోల్మాల్ వ్యవహారంలో దేవాదాయ శాఖ కొరఢా ఝుళిపించింది. సొమ్ము గల్లంతుకు బాధ్యులుగా చేస్తూ నలుగురు అధికారులను పేర్కొన్న దేవాదాయ శాఖ.. వారిలో ముగ్గురికి రెండు ఇంక్రిమెంట్లలో కోత విధించింది. మరో అధికారిని విధు ల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ సంచలన నిర్ణ యం తీసుకుంది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువరించింది. జగిత్యాల జిల్లా కొండగట్టులోని శ్రీఆంజనేయ స్వామి ఆలయంలో 2024లో దాదాపు రూ.52,90,000 సొమ్ము గల్లంతైంది. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ అంతర్గత ఆడిటింగ్లో గుర్తించి విచారణకు ఆదేశించింది. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ వినోద్ను విచారణాధికారిగా నియమించింది. ఆయన తన విచారణలో నిధుల గోల్మాల్ నిజమేనని నిర్ధారించారు. ఈ వ్యవహారానికి బాధ్యులుగా ప్రస్తుతం కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా పనిచేస్తున్న బి.శ్రీనివాస్, ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న అప్పటి సీనియర్ అసిస్టెంట్ కె.శ్రీనివాసాచారి, వేములవాడ రాజన్న ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాసశర్మ, కొండగట్టు ఆలయ సూపరింటెండెంట్ డి.సునీల్కుమార్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనికి ఈ నలుగురు అధికారులు ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని భావించిన ఉన్నతాధికారులు నలు గురిపైనా చర్యలకు ఉపక్రమించారు. నిధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు.. రికార్డులను సరిగా తనిఖీ చేయనందుకు వీరిపై చర్యలు తీసుకుంది. ప్రస్తుతం కొమురవెల్లి మల్లన్న ఆలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.శ్రీనివాస్, సూ పరింటెండెంట్లు శ్రీనివాసశర్మ (వేములవాడ), సునీల్కుమార్ (కొండగట్టు)కు రెండు ఇంక్రిమెంట్లలో కోత విధించింది. ఆ సమయంలో సీనియర్ అసిస్టెంట్గా ఉండి ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న శ్రీనివాసాచారిని సర్వీసు నుంచి డిస్మిస్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో ఇదే వ్యవహారంలో కొండగట్టు ఈవో (ఎండోమెంట్ ఆఫీసర్)గా ఉన్న టంకశాల వెంకటేశ్ సస్పెన్షన్కు గురైన విషయం తెలిసిందే. ముగ్గురు అధికారుల ఇంక్రిమెంట్లలో కోత ఒక అధికారి ఏకంగా విధుల నుంచి డిస్మిస్ దేవాదాయశాఖ సంచలన ఉత్తర్వులు జారీ రూ.52లక్షలు రికవరీ చేయాలని భక్తుల డిమాండ్సొమ్ము రికవరీ మాటేంటి? దేవాలయానికి వివిధ మార్గాల్లో వచ్చిన ఆదా యం అధికారుల నిర్లక్ష్యంతో గల్లంతయ్యా యి. ఈ విషయాన్ని గుర్తించిన దేవాదాయ శాఖ విచారణ చేసి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంది. ఇంతవరకూ బానే ఉ న్నా.. గల్లంతైన అంజన్న సొమ్ము రికవరీ బా ధ్యత ఎవరిది అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అసలే అంతంతమాత్రంగా ఆదాయం వ స్తున్న ఆలయానికి రూ.52.9 లక్షల రికవరీకి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 2023లో ఆలయంలో చోరీ చేసిన దొంగల నుంచి ఆభరణాలను రికవరీ చేసినట్లే ఇప్పుడు గల్లంతైన సొమ్మును వసూలు చే యాలని స్వామివారి భక్తులు కోరుతున్నారు. -
తగ్గుతున్న నీటిమట్టం
సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్ పెద్దపల్లి: మంథని మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ కేఎన్ జయ ప్రకాశ్పై వచ్చిన ఆర్థిక ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ కోయ శ్రీహ ర్ష మంగళవారం తెలిపారు. ఈనెల 7న అధికారులు, సర్పంచులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ఉద్యోగ విరమణ పొందినవారు జయప్రకాశ్పై పలు ఆర్థిక ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రాథమిక విచారణ అనంతరం జయప్రకాశ్ను సస్పెండ్ చేసినట్లు ఆయన వివరించారు. -
స్క్రబ్బర్ల పేరిట స్కాం!
ప్యాకింగ్ కవర్లుప్యాకింగ్ మెషీన్సాక్షిప్రతినిధి, కరీంనగర్: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉన్న చందంగా ఉంది ఆన్లైన్ మోసగాళ్ల పరిస్థితి. కోవిడ్ కాలంలో ‘దీపాల వత్తులు చేసిస్తే నెలనెలా డబ్బులిస్తాం.. కుంకుడుకాయలు దంచిస్తే.. పైసలిస్తాం..’ అంటూ ఆన్లైన్ ద్వారా మోసాలు చేసిన ఘనులు తిరిగి విజృంభిస్తున్నారు. అమాయక గృహిణులే లక్ష్యంగా తిరిగి తమ మోసాలు కొనసాగిస్తున్నారు. పాత్రలు తోముకునే స్క్రబ్బర్ల పేరిట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన భారీ స్కాం వెలుగుచూసింది. మూడు నెలలపాటు సాఫీగా సాగిన ఈ కుంభకోణం ఇటీవల బోర్డు తిప్పడంతో లోకమంతా తెలిసింది. తొలుత ఆన్లైన్లో మొదలైన ఈ స్కాం.. క్రమక్రమంగా మల్టీ చైన్ మార్కెటింగ్గా రూపాంతరం చెందింది. అసలేం జరిగింది? జగిత్యాలకు చెందిన ఓ మహిళ.. ఇన్స్ట్రాగాంలో పార్ట్టైం జాబులు, ఎంఎక్స్వో కంపెనీ పేరిట వర్క్ ఫ్రం హోం అంటూ ప్రకటన చూసింది. విజయవాడలోని కొందరు నిర్వాహకులు తాము స్క్రబ్బర్లకు సంబంధించిన ప్యాకింగ్ చేయిస్తామని, మెటీరియల్ ఇస్తామని, ఇంటి వద్ద ఉండి పనిచేసుకుంటే నెలకు రూ.24వేలు ఇస్తామని చెప్పారు. ప్యాకింగ్ మెటీరియల్ కోసం రూ.1.50 లక్షలు చెల్లించింది. తనకు నెలనెలా ఠంఛనుగా రూ.24వేలు రావడంతో కరీంనగర్, గోదావరిఖనిలలో ఉండే తన బంధువులు, స్నేహితులకు చెప్పడంతో వారూ చేరారు. ఇలా వందలాది మంది స్కీంలో చేరారు. ఈ స్కీములో చేరిన వారికి ఒక ప్యాకింగ్ మెషీన్, కొన్ని స్క్రబ్బర్ల షీట్లు, ప్యాకింగ్ కవర్లు ఇచ్చారు. వీటిని ప్యాకింగ్ చేసిన తరువాత స్థానికంగా సదరు కంపెనీ నియమించుకున్న డిస్ట్రిబ్యూటర్లు వచ్చి సామగ్రిని కలెక్ట్చేసి తీసుకెళ్లేవారు. ఈ క్రమంలో పెద్దపల్లి నుంచి 30 మంది, కరీంనగర్ నుంచి 57 మంది, జగిత్యాలలో 52 మంది మహిళలు ఈ స్కీములో చేరారు. బోర్డు తిప్పేయడంతో లబోదిబో ఏప్రిల్ నుంచి జూన్ వరకు బాగానే తన కస్టమర్లకు నెలనెలా డబ్బులు పంపిన సంస్థ అకస్మాత్తుగా జూలై నుంచి చెల్లింపులు నిలిపివేసింది. రేపు మాపూ అంటూ వాయిదాలు వేస్తూ వచ్చారు. ఈ వారంలో విజయవాడకు చెందిన ఎంఎక్స్వో కంపెనీ ప్రతినిధులందరి ఫోన్లు మూగబోవడంతో మోసపోయామని గ్రహించారు. కొందరు విజయవాడకు వెళ్లి కంపెనీ ప్రతినిధులను కలిసే ప్రయత్నం చేసినా అవేమీ సఫలం కాలేదు. దీంతో మెటీరియల్ కొనుగోలు చేసిన వారంతా డిస్ట్రిబ్యూటర్ల వెంట పడుతుంటే.. వారంతా ముఖం చాటేసి తప్పించుకు తిరుగుతున్నారు. మోసపోయిన వారిలో చాలామంది గత నెలలో మెటీరియల్ కొనుగోలు వారు కూడా ఉండటం గమనార్హం. తమకు కనీసం ఒక నెల చెల్లింపులు కూడా దక్కలేదని వారు వాపోతున్నారు. -
కుటుంబ వివరాలకు అధికారిక రికార్డు
జ్యోతినగర్: కుటుంబ సభ్యుల వివరాలను అధికారికంగా నమోదు చేసేందుకు ఫ్యామిలీ రిజిష్టర్ (కుటుంబ రిజిష్టర్) రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు అభివృద్ధి, సంక్షేమపథకాలు, ఇతర అధికారిక అవసరాల కోసం కుటుంబ సభ్యుల వివరాలను ధ్రువీకరించేందుకు సమగ్ర అధికారిక రికార్డు లేదు. పలు సందర్భాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం చూపే లక్ష్యంతో కుటుంబాల వివరాలను ఒకేచోట నమోదు చేసే విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. రేషన్కార్డు డేటా ఆధారంగా.. ప్రస్తుతం అందుబాటులో ఉన్నరేషన్ కార్డుల్లోని కుటుంబసభ్యుల వివరాల ఆధారంగా ఫ్యామిలీ రిజిష్టర్ సిద్ధం చేసినట్లు ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్లో ప్రజలకు అవసరమైనప్పుడు మీ సేవ కేంద్రాల ద్వారా ఫ్యామిలీ రిజిష్టర్ సర్టిఫికెట్ పొందే అవకాశం కల్పించింది. దీంతో కుటుంబంలో ఎవరు సభ్యులు, వారిప్రాథమిక వివరాలు ఏమిటనే అంశాల అధికారిక ధ్రువీకరణ పత్రం అందుబాటులో ఉంటుంది. సంక్షేమ పథకాలకు కీలకంగా మారే అవకాశం పథకాల అమలులో లబ్ధిదారులను గుర్తించడం, కు టుంబ సభ్యుల వివరాలను ధ్రువీకరించడం, ప్ర భుత్వ సేవలను పారదర్శకంగా అందించడం వంటి అంశాల్లో ఫ్యామిలీ రిజిష్టర్ కీలకంగా మారే అ వకాశం ఉంది. కుటుంబ వివరాల ఆధారంగా పథకాలు, సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ఈ డేటాబేస్ ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆస్తిహక్కులకు సంబంధం లేదు సర్టిఫికెట్ కేవలం కుటుంబ సభ్యుల వివరాల ధ్రువీకరణ కోసం మాత్రమే ఉపయోగపడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సర్టిఫికెట్ ఆధారంగా ఆస్తిపై ఎలాంటి హక్కులు ఉండవని, అలాగే ఇది లీగల్ హెయిర్(చట్టబద్ధ వారసుల) నిర్ధారణకు ప్రామాణిక పత్రంగా పరిగణించరని పేర్కొంది. -
మెలకువలు నేర్పిస్తున్నా
క్రికెట్పై ఆసక్తిని ఉన్న విద్యార్థులను సరైన మార్గంలో మలచడమే మా లక్ష్యం. క్రీడలు శారీరక దారుఢ్యంతోపాటు క్రమశిక్షణ, జట్టు భావన, పట్టుదలను నేర్పిస్తాయి. సెల్ఫోన్ వినియోగాన్ని తగ్గించి మైదానానికి వచ్చేలా ప్రోత్సహిస్తున్నాం. ప్రతిభ ఉన్నవారికి మెరుగైన శిక్షణ అందిస్తున్నాం. – సుధీశ్, క్రికెట్ కోచ్క్రమశిక్షణ వస్తుంది పిల్లలు ఎక్కువ సమయం సెల్ఫోన్లలో గడపకుండా క్రీడలు ఆడడం సంతోషంగా ఉంది. క్రికెట్ శిక్షణతో మా పిల్లల్లో శారీరక చురుకుదనం, క్రమశిక్షణ పెరుగుతున్నాయి. చదువుతోపాటు ఆటలూ సమాన ప్రాధాన్యం ఇవ్వడంతో వారి వ్యక్తిత్వ వికాసానికి ఎంతో ఉపయోగపడుతుంది. – సింఽఽఽధు, పేరెంట్ క్రికెట్ అంటే ఇష్టం మొదట్లో ఖాళీ సమయం దొరికితే సెల్ఫోన్లో గేమ్స్ ఆడేవాళ్లం. ఇప్పుడు క్రికెట్ ప్రాక్టీస్ కోసం మైదానానికి రావడం ఆనందంగా ఉంది. కోచ్ చెప్పే సూచనలతో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. భవిష్యత్లో మంచి క్రికెటర్గా ఎదగాలనుకుంటున్నాం. – కోడెం అశ్విత్, ఎన్టీపీసీ -
‘ఎల్లంపల్లి’ నీటి వినియోగానికి దశాబ్దం
రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా 2016 నుంచి ఇప్పటివరకు నీటి తరలింపుతో రాష్ట్ర ప్రభుత్వ ఖాజానాకు రూ.వందల కోట్ల ఆదాయం సమకూరింది. ఈ విషయాన్ని ప్రాజెక్టును ఇటీవల సందర్శించిన మంత్రులకు ఇరిగేషన్ ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ముఖ్యంగా ఎన్టీపీసీ, హైదరాబాద్ – సికింద్రాబాద్ జంటనగరాలు, వివిధ పరిశ్రమలు, సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించుకున్న నీటికి చెల్లించిన రుసుంతో సుమారు రూ.648 కోట్లు సమకూరినట్లు వారు వివరించారు. భారీ పరిశ్రమలు, విద్యుత్ ఉత్పాదక కేంద్రాలకు ప్రతీ టీఎంసీ నీటి వినియోగానికి రూ.7.16 కోట్లు రుసుం వసూలు చేస్తున్నారు. పరిశ్రమలు, తాగునీటి రంగం, మత్స్య సంపద, మైనింగ్ డీసిల్టేషన్ ద్వారా వచ్చే ఆదాయాలు వేర్వేరుగా ఉంటాయి. ‘ఖని’లో ఫ్లెక్సీల యుద్ధం గోదావరిఖని: సింగరేణి స్థలాల్లోని కట్టడాల పై ఫ్లెక్సీల యుద్ధం సాగుతోంది. కాంగ్రెస్ వర్సెస్ సీపీఐగా వివాదం కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఎల్బీనగర్లో నిర్మించిన క ట్టడాల వద్ద లబ్ధిదారుల పేర్లను రాయాలని కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సీపీఐ నాయకులు మంగళవారం తిలక్నగర్లో సింగరేణి స్థలంలో కొనసాగుతున్న నిర్మాణం వద్ద లబ్ధిదారుల పేర్లను ప్రకటించాలని ఫ్లెక్సీ కట్టి సవాల్ చేశారు. ప్రతిస్పందించిన కాంగ్రెస్ నాయకులు.. లబ్ధిదారుల పేర్లను ఆ ఫ్లెక్సీపై రాసి తాము క్లియర్గా ఉంటామని స్పష్టం చేశారు. సింగరేణి స్థలాల్లో కొనసాగుతున్న కట్టడాలపై రాజకీయ దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఎంఎస్ఎంఈడీలకు ప్రయోజనం పెద్దపల్లి: వ్యాపార వివాదాలను వేగంగా పరిష్కరించడం, పరిశ్రమల అభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఎంఎస్ఎంఈడీ సవరణ బిల్లు–2026 ప్రవేశపెట్టిందని జిల్లా పరిశ్రమల మేనేజర్ కీర్తికాంత్ తెలిపారు. దీనిద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రయోజనాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు కొనుగోలుదారుల నుంచి చెల్లింపులు ఆలస్యమైతే పరిష్కారం కోసం సూక్ష్మ, చిన్న పరిశ్రమల సదుపాయ మండలి, కరీంనగర్ను ఆశ్రయించాలని సూచించారు. -
జీజీహెచ్లో పుస్తెలతాడు మాయం!
కోల్సిటీ: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలి మెడలోని సుమారు మూడు తులాల బంగారు పుస్తెలతాడు మాయమైంది. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోలీసులు, ఆస్పత్రి అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. కుందనపల్లి సమీప బద్రిపల్లి గ్రామానికి చెందిన రాజమ్మ షుగర్ లెవల్స్ తగ్గడంతో సోమవారం జీజీహెచ్చే చేరింది. వైద్యుల సూచన మేరకు తొలుత సీటీ స్కాన్ చేయించారు. ఈ సమయంలో పేషెంట్ మెడలోని పుస్తెలతాడును కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈఎండీ విభాగంలో ఆభరణాలు కనిపించలేదని.. సీటీస్కాన్ అనంతరం ఈసీజీ కోసం ఈఎండీ విభాగానికి తరలించారు. ఈసీజీ కోసం వృద్ధురాలికిని బెడ్పై పడుకోబెట్టారు. ఆమె కూతురును బయటకు పంపించారు. ఈ క్రమంలోనే పుస్తెలతాడు కనిపించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం ఈసీజీ విభాగాన్ని పరిశీలించినట్లు తెలిసింది. పేషెంట్ కుటుంబ సభ్యులతోపాటు ఆస్పత్రి సిబ్బందిని కూడా విచారించినట్లు సమాచారం. పుస్తెలతాడు మాయంపై భిన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేషెంట్ వెంట ఉన్న వారెవరైనా తీసుకున్నారా? లేక ఆస్పత్రిలోనే ఎవరి చేతికై నా చిక్కాయా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. శ్రీఇంటి దొంగల పనే అయి ఉంటుందా?శ్రీ అనే అనుమానాలను కూడా కొందరు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మరో చైన్ మాయం? ఈఎండీలో ఇటీవల ఓ పేషెంట్ చైన్ మాయమైనట్లు సమాచారం. అయితే అది ఒకేగ్రామ్ గోల్డ్ కావడంతో బాధితులు పెద్దగా పట్టించుకోకపోవడంతో విషయం బయటకు రాలేదని తెలుస్తోంది. -
రోడ్డు ప్రమాదంలో కార్మికుడికి గాయాలు
యైటింక్లయిన్కాలనీ: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్కాలనీ పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భూమయ్య అనే సింగరేణి కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. సింగరేణి ఓసీపీ–3 క్వాంటీన్లో కుక్గా పనిచేసే భూమయ్య పనులు ముగించుకుని కాలనీ నుంచి పోతనకాలనీకి వెళ్తున్నాడు. ఈక్రమంలో కాలనీపెట్రోల్ బంక్ సమీపంలో బైక్ అదుపు తప్పి కింద పడిపోయాడు. తలకు తీవ్రంగా గాయాలు కాగా గమనించిన స్థానికులు గోదావరి సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి
రామగిరి: విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని గోదావరిఖని ఏసీపీ రమేశ్ సూచించారు. పన్నూర్ మంథని జేఎన్టీయూలో ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ఓరియేంటేషన్ డేలో సింగరేణి ఆర్జీ–3, ఏపీఏ జీఎంలు మధుసూదన్, నాగేశ్వరరావుతో కలిసి పాల్గొన్నారు. ఏసీపీ మాట్లాడుతూ, విద్యార్థులు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలన్నారు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఉత్సాహంతో ఉండాలని సూచించారు. లక్ష్యం కోసం పట్టుదలతో శ్రమించాలని, పరిజ్ఞానాన్ని సమాజం కోసం వినియోగించాలని, సమయపాలన కచ్చితంగా పాటించాలని చెప్పారు. వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆయన అన్నారు. కళాశాల పరిసరాల్లో పోలీసు ప్రత్యేక నిఘా ఉంటుందని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎం.ఉదయ్కుమార్, మంథని సీఐ స్వామి, రామగిరి ఎస్సై శ్రీనివాస్, విద్యార్థులు, తల్తిదండ్రులు పాల్గొన్నారు. -
సెల్ఫోన్లకు దూరం.. క్రికెట్ వైపు పరుగులు
జ్యోతినగర్: చేతిలో సెల్ఫోన్.. గంటల తరబడి గేమ్స్ ఆడడం.. నిత్యం సోషల్ మీడియాపై దృష్టి సారించడం విద్యార్థుల దైనందిన జీవితంలో భాగమవుతున్నాయి. ఇలాంటి వారిని డిజిటల్ ప్రపంచం నుంచి బయటకు తీసుకొచ్చి మైదానం వైపు నడిపించేందుకు క్రికెట్ కోచింగ్ ఇస్తున్నారు సీనియర్ క్రీడాకారులు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఫిజికల్ డైరెక్టర్ సుధీష్ ఆధ్వర్యంలో క్రికెట్ శిక్షణ కొనసాగుతోంది. ఆసక్తి ఉన్నవారికి.. క్రికెట్పై ఆసక్తి ఉన్న చిన్నారులు, విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన శిక్షణ అందిస్తున్నారు. ప్రధానంగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, క్యాచ్లు, ఫిట్నెస్ వంటి అంశాల్లో మెలకువలు నేర్పిస్తున్నారు. కేవలం ఆటలో నైపుణ్యం సాధించడమే కాకుండా సమయపాలన, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, ఓటమిని స్వీకరించే మనస్తత్వం వంటి జీవిత విలువలూ పెంపొందిస్తున్నారు.మైదానమే మంచి మార్గం విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం, సెల్ఫోన్ వ్యసనానికి దూరంగా ఉంచడం తల్లిదండ్రు లు, విద్యాసంస్థలు, సమాజం ఉమ్మడి బా ధ్యత. ఈ నేపథ్యంలో ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లో కొనసాగుతున్న క్రికెట్ కోచింగ్ విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. మరింత మంది మైదానం వైపు అడుగులు వేస్తే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి బాటలు పడతాయని పలువురు క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు. -
10వేల మందితో తిరంగా యాత్ర
పెద్దపల్లి: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 13న జిల్లా కేంద్రంలో 10వేల మందితో తిరంగా యాత్ర నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంథని, రామగుండం నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీ ఉంటుందని తెలిపారు. యాత్రకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు, ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, మాజీ ఎంపీ వెంకటేశ్ నేత తదిరతులు హాజరుకానున్నారని చెప్పారు. ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో నాయకులు గొట్టిముక్కల సురేశ్రెడ్డి, ఉషణ అన్వేష్, కావేటి రాజగోపాల్, మధుకరన్, పెంజర్ల రాకేశ్ యాదవ్, శివంగారి సతీశ్, రాజం మహంతకృష్ణ, రామగిరి అఖిల్, పూదరి హరీశ్, రజనీకర్రెడ్డి, గాదాసి సతీశ్, షిండే శివసాయి తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగులకు లైబ్రరీలు
● పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ● పలువురికి సర్కారు కొలువులు ● నేడు నేషనల్ లైబ్రేరియన్స్ డేబోయినపల్లి(చొప్పదండి): నిరుద్యోగులకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గ్రంధాలయం పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడంలో సహకారం అందిస్తోంది. డబ్బులు వెచ్చించి కోచింగ్ లేకుండా లైబ్రరీలో ఉచితంగా పుస్తకాలు చదివి పోటీ పరీక్షల్లో పలువురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఏటా ఆగస్టు 12న నేషనల్ లైబ్రేరియన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సిరిసిల్లలో ఆధునిక లైబ్రరీ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆధునిక హంగులతో గ్రంధాలయ భవనం నిర్మించారు. రోజుకు 150 మంది పాఠకులు హాజరు అవుతారు. పోటీ పరీక్షల పుస్తకాలు, తెలుగు అకాడమీ తదితర సుమారు 32 వేలకు పైగా అందుబాటులో ఉన్నాయి. అలాగే జిల్లాలో 9 గ్రంధాలయాలు ఉన్నాయి. బోయినపల్లి, చందుర్తి, సిరిసిల్ల, ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేటలో, వేములవాడ తదితర స్వంత భవనాలు 8 ఉన్నాయి. ముస్తాబాద్లో అద్దె లేకుండా ఓ భవనంలో విధులు నిర్వహిస్తున్నారు. లైబ్రరీ పోస్టులన్నీ ఖాళీలే జిల్లాలో 9 లైబ్రేరియన్ పోస్టులు ఉండాల్సి ఉండగా అన్ని ఖాళీలే ఉన్నాయి. కేవలం గ్రేడ్–2 లైబ్రరీయన్ ఒకరు, గ్రేడ్–3 లైబ్రేరియన్ ఒకరు మాత్రమే ఉన్నారు. ముగ్గురు ఔట్సోర్సింగ్ లైబ్రేరియన్స్, ఒక అటెండర్లు, ఇద్దరు పార్ట్టైం స్వీపర్లు ఆయా చోట్ల విధులు నిర్వహిస్తున్నారు. సిరిసిల్లలోని లైబ్రరీలో పోటీ పరిక్షల పుస్తకాలు ఉన్నాయి. నిరుద్యోగులు పైసా ఖర్చు లేకుండా పలు ఉద్యోగాలకు సంబందించిన స్టడీ మెటేరియల్ చదివే అవకాశాన్ని కల్పించాం. సద్వినియోగం చేసుకోవాలి. – శంకరయ్య, జిల్లా గ్రంధాయల సంస్థ, కార్యదర్శి, సిరిసిల్ల -
కేంద్రప్రభుత్వం తీరు శోచనీయం
పెద్దపల్లి: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను విరమించుకోవాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.కృష్ణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు డిమాండ్ చేశారు. స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డు నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి రాజీవ్ రహదారిపై బైఠాయించారు. వారు మాట్లాడుతూ, నాలుగు లేబర్కోడ్లు రద్దు చేయాలని, ఉపాధిహామీ చట్టాన్ని మార్చడం సరికాదని, విద్యుత్ సంస్కరణలను రద్దు చేయాలని, విదేశాల నుంచి ధాన్యం దిగుమతి వద్దని, గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు నాయకులను అరెస్టు చేస్తున్న క్రమంలో కాస్త ఉద్రిక్తత నెలకోంది. ఆయా పార్టీలు, యూనియన్ల నాయకులు మంద రాజేందర్, శ్రీనివాస్రెడ్డి సీపెల్లి రవీందర్, తాండ్ర అంజయ్య, ఎండీ ఖాజా, రామలక్ష్మి, లచ్చయ్య, మాంతగి రాజమల్లు, జి.జ్యోతి, భారతి, శ్రీనివాస్, నాగయ్య, దొడ్ల రాజబాబు, నరేశ్, రమేశ్, రామస్వామి, అంబాల లక్ష్మణ్, అశోక్, రాజేశం, తిరుపతి, లింగమూర్తి, బాలకష్ణ, సజన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్జీఎఫ్ పోటీలకు ప్రణాళిక
జ్యోతినగర్: పాఠశాల స్థా యిలోనే క్రీడా ప్రతిభను గుర్తించేందుకు జిల్లావ్యాప్తంగా అండర్–14, 17 బాలురు, బాలికల క్రీడా పోటీలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించామని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) జిల్లా కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్ తెలిపారు. మండల, జోనల్స్థాయి పోటీలను ఈనెల 31లోగా, జిల్లాస్థాయి పోటీలను సెప్టెంబర్ 15లోపు, రాష్ట్రస్థాయి పోటీలను అక్టోబర్ 10వ తేదీలోగా నిర్వహించేలా కార్యాచరణ రూపొందించామన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి అనుమతితో ఈనెల 14లోగా సిద్ధం చేసి 17న హైదరాబాద్లో నిర్వహించనున్న సమావేశంలో నివేదిస్తామని ఆయన వివరించారు. బాధ్యతతో పనిచేయాలి ఎలిగేడు: పోలీసులు, అధికారులు విధి ని ర్వహణలో బాధ్యతగా వహరిస్తూ పోలీసు శాఖకు మంచిగుర్తింపు తీసుకురావాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి సూచించారు. స్థానిక పోలీసుస్టేషన్ను సోమవారం ఆయన ఆకసస్మికంగా తనిఖీ చేశారు. క్రైం రికార్డులను పరిశీలించారు. సీసీటీఎన్ఎస్, ఈ సాక్ష్య, స్టేషన్హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ తదితర సాంకేతిక విభాగాల పనితీరు సమీక్షించారు. పోలీసు సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు. బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వేగంగా పరిష్కరించాలని సూచించారు. ఈకార్యక్రమంలో సు ల్తానాబాద్ సీఐ రంజిత్రావు, ఎలిగేడు ఎస్సై మధుకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరపాలి గోదావరిఖని: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సింగరేణి చేపట్టే వేడుకలను ఘనంగా నిర్వహించేలా చూడాలని పలువురు అధికారులు కోరారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై సోమవారం నగరంలోని కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశభక్తి భావాలను విద్యార్థుల్లో మరింత పెంపొందించేలా కార్యక్రమాలు ఉండాలని సూచించారు. విద్యార్థులతో దేశభక్తి గీతాలు, జాతీయ గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలు క్రమబద్ధంగా కొనసాగేలా చూడాలని అన్నారు. సమావేశంలో సింగరేని పర్సనల్ మేనేజర్ తిరుపతి, సీనియర్ పీవో హన్మంతరావు, సేవా కార్యదర్శి బీనాసింగ్, జాయింట్ సెక్రటరీ పెరుమాళ్ల రజిత తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు గోదావరిఖని: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సింగరేణి ఆర్జీ–2 జీఎం లక్ష్మీపతిగౌడ్ సూచించారు. తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాన వేడుకలను కమ్యూనిటీహాల్లో నిర్వహించనున్నామని తెలిపారు. జాతీయ జెండా ఆవిష్కరణ, సెక్యూరిటీ సిబ్బంది నుంచి గౌరవ వందనం తర్వాత ఉత్తమ ఉద్యోగులకు సన్మానం, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. అధికారులు ఎన్.వేణుగోపాల్, రాముడు, చంద్రశేఖర్, వెంకటరామచంద్ర, చంద్రశేఖర్, ఉజ్వల్ బందోపాధ్యాయ, నెహ్రూ, ఉదయ్హరిజన్, రాంరెడ్డి, రాజేందర్రెడ్డి, జీవీ మహిపాల్ పాల్గొన్నారు. ఆకట్టుకున్న నాటిక ప్రదర్శన గోదావరిఖని: అంబేడ్కర్ జీవిత చరిత్రపై నాటికను సోమవారం స్థానిక ఆర్సీవోఏ క్లబ్లో ప్రదర్శించారు. ఈకార్యక్రమాన్ని ఆర్జీ–వన్ జీఎం లలిత్కుమార్ ప్రారంభించారు. అంబేడ్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నాటిక వంటి కళారూపాలు ప్రభావవంతమైన మాధ్యమాలుగా నిలుస్తాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో సింగరేణి అధికారులు పాల్గొన్నారు. -
12వ వేజ్బోర్డు ప్రక్రియ ప్రారంభించాలి
గోదావరిఖని: సింగరేణి కార్మికుల 12వ వేజ్బోర్డు ప్రక్రియ ప్రారంభించాలని జాతీయ కార్మిక సంఘా లు డిమాండ్ చేశాయి. సోమవారం ఆర్జీ–వన్ జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బొగ్గుగని కార్మికుల వేతనాలు పెంచాలని, నాలుగు లే బర్ కోడ్లను బొగ్గు పరిశ్రమల్లో అమలు చేయవ ద్దని కోరారు. వేజ్బో ర్డు కాలపరిమితి గత జూన్ 30తో ముగిసిందని, జూలై 1 నుంచి వేజ్బోర్డు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉందని, కోలిండియా ఇంతవరకు ప్రారంభించలేదని విమర్శించారు. 51 శాతం ఓట్లు వచ్చిన కార్మిక సంఘంతో వేతన సవరణ జరుపుతామంటామే కేంద్ర కార్మిక సంఘాలు వ్యతిరేకించాయని గుర్తుచేశారు. కొరిమి రాజ్కుమా ర్, ధర్మపురి, ఎస్.వీరయ్య, తుమ్మల రాజారెడ్డి, సతీశ్, శ్రీను, ఎల్లాగౌడ్, సదానందం పాల్గొన్నారు. -
దశల వారీగా కాలనీల అభివృద్ధి
కోల్సిటీ: రామగుండం నగరంలోని 35వ డివిజన్ సప్తగిరికాలనీ, రాజ్యలక్ష్మీ కాలనీల్లో అభివృద్ధి పనులన్నీ దశల వారీగా పూర్తిచేస్తామని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. రాజ్యలక్ష్మీకాలనీలో రూ.7 కోట్ల ప్రత్యేక నిధుల ప్యాకేజీలో భాగంగా రూ.8 లక్షల అంచనా వ్యయంతో చేఏపట్టిన సీసీ రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ జంగపల్లి రమాదేవితో కలిసి మేయర్ సోమవారం ప్రారంభించారు. మేయర్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ ఇచ్చిన హామీ మేరకు రాజ్యలక్ష్మీ, సప్తగిరికాలనీలు వర్షాకాలంలో ముంపునకు గురికాకుండా వరద నీటికాలువ నిర్మించామన్నారు. కొత్తకాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగు రోడ్లపై వస్తోందని, ప్రస్తుతం డ్రైనేజీ నిర్మాణం పూర్తయిందని, ఇక ఆ సమస్య ఉండదని తెలిపారు. ఇటీవల వార్డు సందర్శన నిర్వహించి ప్రజల సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. గుర్తించిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ డివిజన్ను అభివృద్ధి చేస్తామని మేయర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు దాసరి సాంబమూర్తి, డేవిడ్ రాజు, నాయకులు గడ్డం శ్రీనివాస్, పీచర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
మంథనిలో జైల్భరో
మంథని: బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో జైల్భరో నిర్వహించారు. పట్టణంలో భారీనిరసన ర్యాలీ చేపట్టారు. అంబేడ్కర్ ప్రధాన చౌరస్తాలో రాస్తారోకో చేశారు. రాస్తారోకో చేస్తున్న సమయంలో నాయకులు బూడిద గణేశ్, ఆర్ల సందీప్, వనజారాణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాయకులు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలకు నష్టం కలిగించే విధానాలను అమలు చేస్తోందన్నారు. భారత స్వాతంత్య్ర సమరంలోని క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. విద్యుత్ సవరణ బిల్లుతో రైతులపై భారం మోపాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. స్మార్ట్ మీటర్ల పేరుతో ఉచిత విద్యుత్ పథకాన్ని రద్దు చేసే యత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. విత్తన చట్టం ద్వారా వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు. నాయకులు కొమురయ్య, వేల్పుల సురేశ్, బాబు రవి, ఉప్పు రమేశ్, కుమార్, పాషా, సులోచన, శ్యామల, సుగుణ, శోభ, హరిత, మున్సిపల్ కార్మికులు తదితరులు ఉన్నారు. -
పోరుబాట వీడని వీబీజీ.. రాంజీ ఉద్యోగులు
మంథనిరూరల్: సుమారు ఇరవై ఏళ్లుగా ఉపాధిహా మీ పథకం(వీబీజీ రాంజీ)లో పనిచేస్తున్నా తమ సమస్యలు పరిష్కరించడం లేదని ఉద్యోగులు పోరుబాట పట్టారు. గతనెల 27వ తేదీ నుంచి పెన్డౌన్, కంప్యూటర్ షెట్డౌన్ చేపట్టి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సుమారు రెండు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నా పేస్కేల్ అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం చేస్తామంటూ చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా 64మంది జిల్లాలోని 14 మండలాల్లో వీబీజీ రాంజీ పథకంలో 69 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇందులో 11మంది ఏపీవోలు, 9 మంది ఈసీలు, 24 మంది టీఏలు, 17మంది సీలోలతోపాటు జిల్లాకేంద్రంలో మరో 8మంది విధులు నిర్వహిస్తున్నారు. 2006లో జిల్లా సెలక్షన్ కమిటీ రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా విఽవిధ హోదాల్లో వీరంతా ఎంపికయ్యారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలోని డీఆర్డీఏలో హ్యూమన్ రిసోర్స్ పాలసీ కింద విధులు నిర్వహిస్తున్నారు. పే స్కేల్ అమలు చేయాలని.. వీబీజీ రాంజీ పథకంలో పనిచేసే ఉద్యోగులకు పేస్కేల్ అమలు చేయాలనేది ప్రధాన డిమాండ్గా చెబుతున్నారు. దీనితోపాటు వేతనాలు ప్రతీనెల ఒకటో తేదీన చెల్లించాలని, బదిలీలు, పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎఫ్టీలుగా గుర్తించాలని గత పది రోజులుగా ఆయా మండల కేంద్రాల్లో పెన్డౌన్.. కంప్యూటర్ షట్డౌన్తో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఐకేపీ ఉద్యోగులకు గత ప్రభుత్వం పేస్కేల్ అమలు చేయగా ఉపాధిహామీ ఉద్యోగులకు ఇప్పటివరకు పేస్కేల్ వర్తింప జేయకపోవడంతో పోరుబాటకు శ్రీకారం చుట్టారు.పే స్కేల్ కోసం పోరు పేస్కేల్ ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. ఇది అమలైతే మా ఆకాంక్ష నెరవేరుతుంది. వేతనాల చెల్లింపు, బదిలీలు, ప్రమోషన్ ప్రక్రియ అమలు చేయాలి. అనేక సమస్యలు ఉన్నా గ్రామాల్లో ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ అనేక సేవలు అందించాం. ఇప్పటికై నా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మా డిమాండ్లను పరిష్కరించాలి. – సదానందం, ఏపీవో, మంథని ఆగిన అభివృద్ధి పనులు వీబీజీ రాంజీ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకు విధులకు హాజరైనా.. పెన్డౌన్, కంప్యూటర్ షట్డౌన్ చేయడంతో జిల్లాలోని అనేక ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే వనమహోత్సవ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభించాల్సి ఉండగా ఉద్యోగుల పోరుబాటతో ఆలస్యం అవుతోంది. జలసిరి, ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలు సైతం ఆగిపోయాయని అధికారులు చెబుతున్నారు. -
వైకల్యాన్ని అధిగమించి.. పిడికిలి బిగించి..
ఇతడి పేరు ఆకుల నరేశ్. పెద్దపల్లి జిల్లా ఓదెల స్వస్థలం. సుమారు 30ఏళ్లుగా గ్రామపంచాయతీ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. 2011లో విధి నిర్వహణలో ఉండగా విద్యుదాఘాతానికి గురై రెండు చేతులు కోల్పోయాడు. అయినా, వెరవడంలేదు. కార్మికులు, రైతులు, ఇతర శ్రామికుల హక్కుల కోసం వామపక్షాలు సోమవారం జిల్లా కేంద్రంలో జైల్భరో కార్యక్రమం చేపట్టాయి. నరేశ్ కూడా ఇందులో పాల్గొని అందరినీ ఆకర్షించాడు. మోతుల వరకు చేతులు కోల్పోయినా.. వాటితోనే తన చొక్కా జేబులోంచి సెల్ఫోన్ బయటకు తీసుకుని చెవికి ఆనించి మాట్లాడి, ఆ తర్వాత మళ్లీ తన జేబులో వేసుకున్నాడు. వామపక్ష నేతలతో కలిసి పెద్ద ఎత్తున నినాదాలూ చేశాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
సర్ ముగిసింది
సాక్షి పెద్దపల్లి: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్–సర్) ప్రక్రియలో కీలకమైన ఎన్యూమరేషన్ ఫామ్స్ స్వీకరణ గడువు ముగిసింది. బూత్స్థాయి అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల నుంచి ఫామ్స్ సేకరించే ప్రక్రియ సోమవారంతో పూర్తయింది. సేకరించిన వాటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే డిజిటలైజేషన్ ప్రక్రియకు అర్ధరాత్రి వరకూ గడువు ఉండటంతో.. చివరిరోజు అందిన ఫామ్స్ను నమోదు చేసేందుకు బీఎల్వోలు రాత్రివరకూ బిజీగా గడిపారు. జిల్లాలో మొత్తం 7,12,157 మంది ఓటర్లు ఉండగా, అందులో వందశాతం ఎన్యూమరేషన్ ఫామ్స్ను ఓటర్లకు పంపిణీ చేశారు. 6,30,876 మంది ఓటర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తియింది. ఇది మొత్తం ఓటర్లల్లో 88.59 శాతంగా నమోదైంది. మిగిలిన దాదాపు 1,35,675 మంది ఓటర్లు తప్పుగా నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో తమ ఓటుహక్కు కోల్పోయే అవకాశం ఉందన్న ఆందోళనతో పలువురు ఓటర్లు ముందుగానే ఎన్యూమరేషన్ ఫామ్స్ను అన్నివివరాలతో పూర్తిచేసి బీఎల్వోలకు అందజేశారు. ముఖ్యంగా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర కారణాలతో నివాసం ఉంటున్నవారు బోనాల పండుగ సందర్భంగా స్వస్థలాలకు రావడంతో తమఓటు వివరాలను నమోదు చేసుకున్నారు. దీంతో చివరిరోజు కూడా బీఎల్వోలకు పెద్దసంఖ్యలో ఎన్యూమరేషన్ ఫామ్స్ అందాయి. ఒకవైపు ఫామ్స్ సేకరణ.. మరోవైపు వాటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి రావడంతో బీఎల్వోలు ఒత్తిడికి గురయ్యారు. గడువు ముగిసే సమయం సమీపిస్తుండడంతో చివరిరోజు రాత్రివరకూ డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగించారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియను తొలుత జూన్ 25 నుంచి జూలై 24వ తేదీ వరకు నిర్వహించాలని ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈకాలంలో బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫామ్స్ స్వీకరించి, వాటివివరాలను డిజిటలైజ్ చేయాల్సి ఉంది. అయితే ప్రక్రియలో ఓటర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం, పలు ప్రాంతాల్లో ప్రక్రియ నెమ్మదిగా సాగడంతో తొలుత గడువును ఆగస్టు 3 వరకు పొడిగించారు. అయినా ప్రక్రియ ఆశించిన వేగంతో ముందుకు సాగకపోవడంతో ఎన్నికల సంఘం మరోసారి గడువును పొడిగించింది. చివరగా ఆగస్టు 10 అర్ధరాత్రి 12 గంటల వరకు తుది గడువు విధించింది. దీంతో మొత్తం 46 రోజుల పాటు కొనసాగిన ఎన్యూమరేషన్ ప్రక్రియకు సోమవారం తెరపడింది. ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం అధికారులు తదుపరిదశపై దృష్టి సారించనున్నారు. ఈనెల 17న డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రకటించనుండగా, ఓటర్లు ఈ జాబితాలో తమపేరు ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోయినా.. పేరు, చిరునామాలో లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉన్నా ఈనెల 17 నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు సమర్పించేందుకు అవకాశం ఉంటుంది. అందిన ఫిర్యాదుల ఆధారంగా నోటీసులు జారీచేసి అక్టోబర్ 15వ తేదీ వరకు అధికారులు పరిశీలించి, అవసరమైన విచారణను పూర్తిచేసిన అనంతరం అక్టోబర్ 19న తుదిఓటరు జాబితా ప్రకటించనున్నారు. ఇక ఓటర్లంతా డ్రాఫ్ట్ జాబితా విడుదలయ్యే రోజును దృష్టిలో పెట్టుకుని తమపేరు, వివరాలను మరోసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. -
వేగంగా ‘ఆటో సిగ్నల్స్’
ఓదెల: దక్షిణ మధ్య రైల్వేలోని కాజీపేట – బల్హార్ష సెక్షన్ల మధ్య సమయానకూలంగా రైళ్లు రాకపోకలు సాగించేందుకు వీలుగా రైల్వే శాఖ చేపట్టిన ఆటో సిగ్నల్స్ వ్యవస్థ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందుకోసం ఉద్దేశించిన రైల్వేస్టేషన్ల సమీపంలో ఏబీఎస్ హట్ల నిర్మాణంలో వేగం పెంచింది. మూడో రైల్వేలైను పనులు పూర్తయ్యాక రైళ్లను మరింత వేగవంతంతోపాటు సకాలంలో గమ్యం చేరుకునేలా ఆటో సిగ్నల్స్ సిస్టమ్ను రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. కిలోమీటరుకో ఆటో సిగ్నల్స్ సిస్టమ్ ప్రతీ కిలోమీటర్కు ఆటో సిగ్నల్స్ సిస్టం, ప్రతీ రెండు కిలోమీటర్ల నిడివితో ఒకటితర్వాత మరోరైలు పరుగులు పెట్టేలా చూడడమే ఆటోసిగ్నల్స్ సిస్టం లక్ష్యం. దీనికోసం కాజీపేట నుంచి బల్హార్షా మధ్య కొలనూర్, కొత్తపల్లి, ఓదెల, చీకురాయి, జమ్మికుంట, హసన్పర్తి, రామగుండం, రాఘవపూర్ నుంచి ప్రతీ నాలుగు కిలోమీటర్ల దూరంతో ఏబీఎస్ హట్ల నిర్మాణం చేపట్టింది. రెడీమేడ్గా రూపొందించిన హట్లో కంప్యూటర్ సిస్టం అమర్చారు. మందమర్రి– రామగుండం, హసన్పర్తి – జమ్మికుంట.. ప్రస్తుతం ఆటో సిగ్నల్స్ సిస్టం ఆధారంగా మందమర్రి – రామగుండం, హసన్పర్తి – జమ్మికుంట మధ్య రైళ్లు పరుగెత్తుతున్నాయి. మిగతా రైల్వేస్టేషన్లను అనుసంధానం చేస్తూ రైలుపట్టాలకు ఇరువైపులా ఆటోసిగ్నల్స్ కోసం గుంతలు తవ్వుతున్నారు. కేబుల్ పనులనూ శరవంగా చేస్తోంది. వాగులపై వంతెనలు, మానేరు, గోదావరి బ్రిడ్జిపై కూడా ఆటోసిగ్నల్ సిస్టంతో పాటు ఏబీఎస్ హట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. పెరుగుతున్న రైళ్ల రద్దీకి అనుగుణంగా సమయపాలన పాటించడం కోసం అమలు చేస్తున్న సిగ్నల్స్ సిస్టం సత్ఫలితాలు ఇస్తోందనిఫ రైల్వేసిబ్బంది తెలిపారు. కాజీపేట – బల్హార్షాతోపాటు సికింద్రాబాద్ – వరంగల్ – రాజమండి మధ్య కూడా కొత్త విధానం అమలు చేస్తున్నారు. -
కల్యాణం.. కమనీయం
గోదావరిఖనిటౌన్: సత్యసాయిబాబా జయంతి సందర్భంగా లోక కల్యాణార్థం స్థానిక శ్రీసత్యసాయి మందిరంలో మూడు రో జులుగా నిర్వహిస్తున్న దేవతామూ ర్తుల కల్యాణ మ హోత్సవం ఆదివారం పార్వతీపరమేశ్వరుల కల్యాణంతో వైభవంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో శ్రీసత్యసాయి సేవా సంస్థల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరావు, ఆధ్యాత్మిక సమన్వయకర్త మహేశ్, జిల్లా ఇన్చార్జి వెంకటనర్సింహారెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి, పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మడేలేశ్వరస్వామికి పూజలు జ్యోతినగర్: ఎన్టీపీసీ పట్టణ రజక సేవా సంఘం అధ్యక్షుడు పూసాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోచమ్మ, మడేలేశ్వరస్వామి బోనాల ఉత్సవాలను ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. రామగుండం ఒకటి, 33వ డివిజన్ల కార్పొరేటర్లు మడిపెల్లి విజయ, మెరుగు భూలక్ష్మి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. సంఘం అధ్యక్షుడు పూసాల శ్రీనివాస్ మాట్లాడు తూ.. రజకుల కులదైవమైన మడేలేశ్వరస్వామి ఆశీస్సులతో రజక కుటుంబాలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. నాయకులు నస్పూరి శ్రీనివాస్, భూమయ్య, లక్ష్మణ్, వెంకటేశ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. వేజ్బోర్డు కోసం నేడు ధర్నా యైటింక్లయిన్కాలనీ: సింగరేణి కార్మికుల 12వ వేజ్బోర్డు కమిటీ ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు వైవీ రావు, కొత్త సత్యనారాయణరెడ్డి, కుంట ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఆర్జీ–2 ఏరియా యైటింక్లయిన్కాలనీ ఏఐటీయూసీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. 11వ వేజ్బోర్డు కాలపరిమితి ముగిసి రెండు నెలలు కావస్తున్నా కొత్త వేజ్బోర్డు కోసం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. దీనికి నిరసనగా ఈనెల 10న అన్ని జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా చేస్తామని తెలిపారు. జేఏసీ నాయకులు అన్నారావు, శాంసన్, రవికుమార్, మహేందర్, వెంకన్న, నారాయణ, కుమారాస్వామి, ఆంజనేయులు, వినయ్, లక్ష్మయ్య, అనిల్ కుమార్, సురేశ్ పాల్గొన్నారు. ఏబీఏపీ సమావేశం ఫెర్టిలైజర్సిటీ: అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ(ఏబీఏపీ) రాష్ట్రస్థాయి సమా వేశం ఖాజీపల్లి శ్రీమయి కన్వెన్షన్ హాల్లో ఆదివారం నిర్వహించారు. ఏబీఏపీ రాష్ట్ర వలంటీర్ కమాండెంట్ జనగామ తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షు డు పుల్లంరాజు, కార్యదర్శి దూశెట్టి భాస్కర్, కోశాధికారి పోతరాజుల రమేశ్, జాతీయ స భ్యుడు పోతుగంటి గంగాధర్ అతిథులుగా హా జరయ్యారు. రాంపల్లి వామనశర్మ జ్యోతి ప్రజ్వలన, అయ్యప్పస్వామికి పూజలతో కార్యక్ర మం ప్రారంభమైంది. అయ్యప్ప తత్వం, దీక్షనియమాల విశిష్టత, సనాతన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతోపాటు సంస్థ భవి ష్యత్ కార్యాచరణపై చర్చించి కీలక తీర్మానాలు చేశారు. అనంతరం ఏబీఏపీ జిల్లా కమిటీని ఎ న్నుకున్నారు. అధ్యక్షుడిగా అందె సదానందం, కార్యదర్శిగా వేదాంతం శేషుకుమార్, కోశాధికారిగా పల్లెర్ల జగన్, కమాండెంట్గా కనకమేడ ప్రణీత్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఏబీఏపీ ప్రతినిధులు, అర్చకులు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. ప్రతిభకు ప్రశంసలు ధర్మారం: స్థానిక ఆ దర్శ పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం(సీఈసీ) చ దువుతున్న తుమ్మల మనోజ్ఞ రాష్ట్రస్థాయి యూత్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ కమాండ్ ఈవెంట్లో ద్వితీయస్థానం సాధించినట్లు ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్కుమార్ తెలిపారు. వెండి పతకం సాధించిన విద్యార్థిని మనోజ్ఞను ప్రిన్సిపాల్ రాజ్కుమార్, పీఈటీ బైకనీ కొంరయ్య, ప్రతినిధి మేకల సంజీవరావు, ఉపాధ్యాయులు అభినందించారు. -
పొదుపు చేస్తూ.. పేదలకు పంచుతూ..
జ్యోతినగర్: ఆపదలో ఉన్నవారు, అభాగ్యులు, పేద కుటుంబాల దయనీయ పరిస్థితులను చూసి చలించిన మహిళలు, యువజనులు సంస్థలుగా ఏర్పడి ప్రజాసేవకు అంకితమవుతన్నారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని డిజిటల్ ఫార్మాట్లో బాధితులకు ఆర్థిక సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రధానంగా ఎన్టీపీసీలోని అన్నపూర్ణకాలనీకి చెందిన శ్రీసీతారామ సేవా సమితి, కృష్ణానగర్కు చెందిన శ్రీభగవతీ యూత్ సభ్యులు.. ఎవరికి ఆదప వచ్చినా, పేదలు ఎక్కడ కనిపించినా అక్కడకు చేరుకుని సాయం చేస్తున్నా రు. గోలివాడ చంద్రకళ మహిళా మండలి శ్రీసీతారామ సేవాసమతి పేరిట వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసింది. ఇందులోని సభ్యులు ప్రతినెలా రూ.100 చొప్పున పొదుపు చేస్తూ అన్నార్థులకు సాయం చేస్తున్నారు. 2023 ఫిబ్రవరి 19న ఆవిర్భవించిన ఈ సంస్థలో ప్రస్తుతం 120 మంది సభ్యులు ఉండగా, మహిళలే అత్యధిక సంఖ్యలో ఉండడం గమనార్హం. పేదలకు నిత్యావసరాలు, పేదింటి యువతుల వివాహానికి ఆర్థిక సాయం, గూడులేనివారికి ఇళ్లు నిర్మించి ఇవ్వడం, విద్యార్థులకు స్కూల్బ్యాగులు, స్టడీ మెటీరియల్ అందించడం ఈ సంస్థ లక్ష్యంగా ముందుకు సాగుతోంది. మానవతే మతం.. సమాజ అభివృద్ధే లక్ష్యంగా 2008లో 20మంది యువకులతో శ్రీభగవతీ యూత్ ఏర్పాటు చేసుకున్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడిగా కంకటి రవిగౌడ్ అధ్యక్షుడు, 85 మంది సభ్యులు ఉన్న ఈ సంస్థ.. మానవతే మతం.. సమాజ అభివృద్ధే లక్ష్యంగా సేవా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. 2025లో అన్నపూర్ణకాలనీకి చెందిన పేద క్రికెటర్ స్ఫూర్తి శిక్షణకోసం రూ.30 వేలు, కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విరాట్కు రూ.15 వేలు, పేద కుటుంబానికి చెందిన చదువుల తల్లి సిరి అనారోగ్యంతో బాధపడుతుండగా రూ.25 వేలు, రామగుండానికి చెందిన శివానికి రూ.పది వేలు, గుండెపోటుతో మృతి చెందిన దేవరకొండ శ్రీనివాస్ కుటుంబానికి రూ.1,25,116 అందజేశారు. మహిళలు, యువతులు, యువకులు.. ఇలా సామాజిక స్పృహ ఉన్నవారు సామాజిక సేవే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరిని పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు.సాయం అందిస్తున్న సీతారామ సేవా సమితి సభ్యులుక్రికెటర్కు ఆర్థికసాయం అందిస్తున్న యువకులు సామాజిక సేవలో మహిళలు అదేబాటలో పయనిస్తున్న యువకులు ఆదర్శంగా నిలుస్తున్న సీతారామ సేవా సమితి, శ్రీభగవతీ యూత్కొందరు మహిళలు సంఘటితమయ్యారు. ప్రతినెలా కొంత సొమ్ము జమచేస్తున్నారు.. ఆ సొమ్మును పేదలు, అభాగ్యులు, అన్నార్థులకు అందజేస్తున్నారు. మరి కొందరు యువకులు కూడా తామేమీ తక్కువ కాదంటూ సామాజిక సేవే లక్ష్యంగా తలాకొంత పోగుచేస్తున్నారు. ఎవరికి ఆదపద వచ్చినా, పేద విద్యార్థుల ఉన్నత విద్యకూ సాయం చేస్తున్నారు. ఇలాంటి వారిలో కొందరిపై కథనం.. -
కాంగ్రెస్కు యువతే బలం
పెద్దపల్లి: యువతే కాంగ్రెస్ పార్టీకి బలమని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బొంకూరు అవినాష్ అ న్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాఆ విష్కరించారు. అనంతరం అవినాష్ మాట్లాడు తూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ ప థకాల ఫలాలు ఇంటింటా చేరవేయాలన్నారు. యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు శ్రావణ్, ఓదెల, జూలపల్లి మండలాల అధ్యక్షులు రాహుల్, దేవేందర్, నాయకులు ఫిరంగి రాజు, ఆయుబ్ మహమ్మద్, గుమ్మడి ప్రసాద్, తిరుమలేశ్ పాల్గొన్నారు. -
24న ఆటోల బంద్
పాలకుర్తి: తమ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఈనెల 24న ఆ టోల బంద్ పాటిస్తామని ఆటోడ్రైవర్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ తెలిపారు. బసంత్నగర్లో ఆదివారం నిర్వహించిన ఆటో అసోసియేష న్ల జేఏసీ సమావేశంలో రవికుమార్ మాట్లాడారు. ఆటోడ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, ఏడాదికి రూ.12 వేలు సాయం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్.. మూడేళ్లు కావస్తున్నా అమలు చేయలేదన్నారు. ఈనేపథ్యంలో అన్ని పార్టీల ఆటో యూనియన్లతో కలిసి ఆ టోల బంద్కు పిలుపునిచ్చాయని, బంద్ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఆటో జేఏసీ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జి మడిపెద్ది రమే శ్ అధ్యక్షతన జరిగిన ఈసమావేశంలో రాష్ట్ర కార్య దర్శి ఎస్కే జబ్బార్, నాయకులు బాణాల భాస్కర్, బరిగెల కమలాకర్, బెక్కం రవి, కుమార్, చంద్రయ్య, దేవయ్య, సంతోష్ పాల్గొన్నారు. -
కార్మికులకు న్యాయం చేయరా?
గోదావరిఖని: సింగరేణి కార్మికుల డిపెండెంట్ల మా రుపేర్ల సమస్య పరిష్కరించాలని బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జి కందుల సంధ్యారాణి కోరారు. జీఎం కార్యాలయం ఎదుట డిపెండెంట్లు చేపట్టిన నిరాహార దీక్ష శిబిరాన్ని ఆదివారం సందర్శించి మద్దతు తెలిపారు. అనంతరం మాట్లాడు తూ, కార్మికులు ఎదుర్కొంటున్న విజిలెన్స్ పెండింగ్ కేసులు పరిష్కరించడంలో యాజమాన్యం చొరవ చూపాలన్నారు. మారుపేర్ల సవరణకు అన్నిశాఖల్లో నిర్దిష్టమైన విధానాలు ఉన్నాయని, కార్మికుల విషయంలోనే ఎందుకు ఇంత నిర్లక్ష్యమని ప్రశ్నించారు. నాయకులు గుండబోయిన భూమయ్య, అపర్ణ, స త్యనారాయణ, నరసన్న, భరత్, నరసింహారెడ్డి, మ హేందర్, అందే రాజ్కుమార్చారి పాల్గొన్నారు. -
పేదలకు వరం సన్నబియ్యం
పెద్దపల్లి: ప్రభుత్వం అందించే సన్నబియ్యం పేదల ఇంట్లో పండుగ నింపుతోందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేర కు జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో కొత్త రేషన్షాపును స్థానిక నాయకులతో కలిసి ఆయన ఆదివా రం ప్రారంభించారు. అనంతరం విప్ విజయరమణారావు మాట్లాడుతూ, అర్హులైన పేదలందరికీ నూ తన రేషన్ కార్డులు మంజూరు చేసి సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. అనంతరం జెండా చౌరస్తా ప్రధాన రోడ్డులోని ఓ షాపింగ్ మాల్ నిర్వహించిన ఆషాడమాసం బోనాల మహోత్సవంలో విజయరమణా రావు పాల్గొన్నారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. పండుగను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సన్నబియ్యంతో పండుగ చేసుకుంటున్న లబ్ధిదారులు ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు -
పేదలకు అందిస్తున్నాం
గ్రూప్ సభ్యులు ప్రతీనెల పొదుపుచేసే సొమ్మును పేద కుటుంబాలకు అందిస్తున్నాం. ఇందుకోసం అందరం కలిసి వాట్సాప్ వేదికగా సమావేశమై చర్చించుకుంటాం. ఒక్కోనెలలో రెండు కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం చేస్తున్నాం. – వనజ, కోశాధికారి, శ్రీసీతారామ సేవా సమితి సమాజ సేవే లక్ష్యం సమాజ సేవే లక్ష్యంగా మా వంతుగా సామాజిక సేవలో భాగస్వాములవుతున్నాం. ప్రతీనెల కొంత జమచేసి పేద విద్యార్థుల ఉన్నత చదువులతోపాటు నిరుపేద కుటుంబాలకు సాయం చేస్తున్నాం. రక్తదాన శిబిరాలూ ఏర్పాటు చేస్తున్నాం. – కంకటి రవిగౌడ్, అధ్యక్షుడు, శ్రీభగవతీ యూత్ -
ఎన్నికల ఊసేది?
ఐదేళ్లు దాటినా పెద్దపల్లి: జిల్లాలో గీతపారిశ్రామిక సహకార సంఘాల పరిస్థితి దయనీయంగా మారింది. 97 సంఘాలు ఉండగా, అందులో రెండింటికే పాలకవ ర్గాలు ఉన్నట్లు చెబుతున్నారు. మిగిలిన 95 సంఘాల పాలకవర్గాల పదవీకాలం ఐదేళ్ల క్రితమే ముగిసినా ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించలేదు. సంఘాలు ఉన్నా పట్టించుకునే వారెవరు? గీతకార్మికుల సంక్షేమం కోసం గత ప్రభుత్వం అనేకపన్నులు పూర్తిగా రద్దు చేసింది. దీంతో వారివృత్తిలో స్వేచ్ఛ లభించిందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ పరిణామంతో గీత పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులు, పాలకవర్గాల మాట వినే పరిస్థితి తగ్గిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంఘాలు క్రియాశీలకంగా లేకపోవడంతో గీతకార్మికుల సమస్యలను పట్టించుకునే వ్యవస్థ కూడా బలహీనపడిందని అంటున్నారు. ఎన్నికలకు నోటీసులు.. జిల్లాలోని 97 సొసైటీలు ఉండగా.. మంథని, రత్నా పూర్ సంఘాలకు ఇటీవల ఎన్నికలు నిర్వహించా రు. మిగతా సొసైటీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వీటికోసం నోటీసులిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగానే ఎన్నికల అధికారిని నియామకం చేసి ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికల తేదీతోపాటు నామినేషన్, విత్డ్రాలు ఉంటాయి. గీతకార్మికుల్లో ఆశలు.. జిల్లా కో ఆపరేటివ్ ఇన్స్పెక్టర్ ద్వారా గీత పారిశ్రామిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించుకోవాలని ఇ టీవల ఆదేశాలు జారీ అయ్యాయి. స్థానిక ఎక్సైజ్ అధికారులు ఉత్తర్వులను సంబంధిత సంఘాలకు అందజేశారు. తద్వారా ఏళ్లుగా పెండింగ్లో ఉన్నఎన్నికలపై గీతకార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గీత పారిశ్రామిక సహకార సంఘాలకు కార్యవర్గాల్లేవ్ -
మద్యంపై సమరం
పండుగలు, వేడుకలు, శుభ, అశుభ కార్యక్రమాలు ఏవైనా సరే ఆ ఊళ్లో మద్యం సీసాలే కనిపించే వి.. ‘నాలుగు బెల్ట్షాప్లు.. ఆరు గొడవలు’ అన్న చందంగా ఉండేది ఆ పల్లెల పరిస్థితి. ఇప్పుడాపరిస్థితి మారుతోంది. ‘మద్యం వద్దు.. మా కుటుంబాలు బాగుండాలి’ అని గ్రామస్తులే ముందుకొచ్చి తీర్మానాలు చేసుకుంటున్నారు.. వెరసి కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, రోడ్డు ప్రమాదాల బారిన పడడంలేదు. గ్రామసభ వేదికగా మద్యపాన నిషేధానికి నిర్ణయం తీసుకుంటున్నాయి. సుల్తానాబాద్ మండలం మంచిరామి, మంథని మండలం దుబ్బపల్లి, గాజులపల్లి, మల్లేపల్లి, ఎక్లాస్పూర్ సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. సాక్షి పెద్దపల్లి: మద్యం అనేది వ్యసనమే కాదు.. అనేక కుటుంబాల కన్నీటి కథ. పచ్చని బతుకులను ఛిన్నాభిన్నం చేస్తున్న మృత్యువు. ఈ చీకటిని చీల్చుకుంటూ కొన్ని గ్రామాలు ధైర్యంగా ముందడుగు వేస్తున్నాయి. ‘మా ఊళ్లో మద్యం వద్దు’ అంటూ ఏకగ్రీవంగా తీర్మానించి భవిష్యత్కు బాటలు వేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. మంథని మండలం దుబ్బపల్లి, గాజులపల్లి, మల్లేపల్లి, ఎక్లాస్పూ ర్, సుల్తానాబాద్ మండలం మంచిరామి గ్రామాలు మద్యపానం నిషేధిస్తూ ఏకతాటిపైకి వచ్చాయి. పచ్చని కాపురాల్లో ‘మత్తు’చిచ్చు జిల్లాలో ఎక్కడ చూసినా మద్యం మత్తులో జరుగుతున్న అనర్థాలు కోకొల్లలు. మద్యానికి బానిసైన కొడుకు పింఛన్ డబ్బుల కోసం ఇటీవల కన్నతండ్రినే హత్యచేశాడు. మద్యం తాగి వాహనాలు నడపడం, కుటుంబ సభ్యులపై దాడులు చేయడం, చిన్నపాటి గొడవలు ఘర్షణలకు దారితీయడం, చివరకు ప్రాణాలు పోవడం వంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. ఇవి అనేక కుటుంబాలను విషాదంలోకి నెడుతున్నాయి. భర్త సంపాదన మద్యానికి వెచ్చించడంతో మహిళలు, పిల్లలు పూటగడవని దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులను చూసిన మహిళా సర్పంచులు.. తమ ఊళ్లో బెల్ట్షాప్లకు చోటులేదంటూ నిర్ణయించుకున్నారు. గ్రామసభలోనే నిర్ణయం.. ఊరంతా ఒకేమాట మద్యం విక్రయంతో వచ్చే ఆదాయం కన్నా దాని వల్ల కుటుంబాలు కోల్పోతున్న ప్రశాంతత, ఆరోగ్యం, ఆర్థిక భద్రతే ఎక్కువని గుర్తించిన గ్రామాలు ఒక్కొక్కటిగా మేల్కొంటున్నాయి. ‘మా గ్రామంలో మద్యం అమ్మకాలు వద్దు.. బెల్ట్షాపులు ఉండకూడదు’ అని తీర్మానిస్తున్నాయి. ఉల్లంఘించిన వారికి భారీజరిమానా, సామాజిక బహిష్కరణ వంటి హెచ్చరికలు జారీచేస్తున్నాయి. యువత పెడదోవ పట్టకుండా, భవిష్యత్ అంధకారం కాకుండా కాపాడుకోవడమే దీని ఉద్దేశమని చాటిచెబుతున్నాయి. అధికారులు మద్దతు ఇస్తేనే.. మద్యం రహిత గ్రామాలను తీర్చిదిద్దడంలో ప్రజలదే ప్రథమ పాత్ర అయినా.. పోలీస్, ఎకై ్సజ్ అధికారుల మద్దతు ఉంటేనే ఈ ఉద్యమం విజయవంతం అవుతుంది. నిషేధాన్ని ఉల్లంఘించేవారిపై తక్ష ణమే కఠిన చర్యలు తీసుకోవాలి. చైతన్యం చూపుతున్న పల్లెవాసులను అభినందించి ప్రభుత్వపరంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలి. గ్రామస్తులకు ఫిర్యా దు చేసేందుకు సులభమైన మార్గాలు కల్పించాలి. ఇలా చేస్తే మరిన్ని పల్లెలకు స్ఫూర్తిగా మారుతాయి. బెల్ట్షాపులే అసలు సమస్య! ఇంటి చెంత, వీధిచివరన, చిన్నషాపుల మాటున మద్యం లభిస్తోంది. దీంతో మద్యానికి అలవాటు పడుతున్న వారిసంఖ్య పెరుగుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎకై ్సజ్ అధికారులు లిక్కర్ సేల్స్పైనే దృష్టి పెట్టకుండా, బెల్ట్షాపులపై ఉక్కుపాదం మోపితేనే మార్పు శాశ్వతంగా నిలుస్తుంది. ఆ ఊళ్లో మద్యపానంపై సంపూర్ణ నిషేధం గ్రామపంచాయతీల ఏకగ్రీవ తీర్మానాలు మంచిరామి, దుబ్బపల్లి, గాజులపల్లి, మల్ల్లేపల్లి, ఎక్లాస్పూర్ ఆదర్శం -
సంఘటితం కావాలి
ప్రభుత్వం, అధికారులు తీసుకున్న నిర్ణయంతో గీతకార్మికులు సంఘటితమై ఎన్నికలు జరుపుకునే అవకాశం ఉంది. గ్రామాల్లో గౌడ సంఘం చైర్మన్కు ఒకప్పుడు ప్రజల నుంచి సానుభూతిఉండేది. క్రమంగా అదితగ్గుతూ వస్తోంది. పూర్వ వైభవం తీసుకురావడానికి కమిటీలు దోహదపడతాయి. – వీరగోని రమేశ్గౌడ్, గర్రెపల్లి క్రియాశీలకమవుతాయి గీత పారిశ్రామిక సహకార సంఘాలకు ఐదేళ్ల క్రితం ఎన్నికలు నిర్వహించారు. పాలకవర్గాలు లేవక గీతకార్మికులు సంఘటితం కావడం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణకు నోటీసులు జారీచేస్తున్నాం. ఎన్నికలు నిర్వహించి క్రియాశీలకంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. – శ్రీనివాసమూర్తి, సూపరింటెండెంట్, ఎకై ్సజ్ -
మహిళపై లైంగికదాడిలో రౌడీషీటర్లు!
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి శివారులో ఈనెల 3న నిజామాబాద్కు చెందిన మహిళపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటనలో రౌడీషీటర్లు ఉన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో ఇద్దరు రౌడీషీటర్లు ఉండగా.. వీరికి మరో ఇద్దరు సహకరించారు. రౌడీషీటర్లలో ఒకరు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరుడిగా చెప్పుకుంటూ పలు భూ సెటిల్మెంట్లు, పలు పంచాయితీలు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు స్థానికులు వెల్లడించారు. ఏ–1 నిందితుడు, రాజారం గ్రామానికి చెందిన శివరాత్రి నరేశ్పై మల్యాల పోలీస్స్టేషన్లో 13 కేసులు, మరోచోట మరో కేసు నమోదైంది. రాజారం గ్రామానికి చెందిన గుర్రం శ్రీకాంత్పై ఇప్పటికే 9 కేసులున్నాయి. అలాగే గుర్రం అంజయ్యపై ఇప్పటికే ఒక కేసు నమోదైంది. ఇది రెండో కేసు. అలాగే ఏ–3, ధరూర్ గ్రామానికి చెందిన మర్రవేని మల్లేశ్పై గతంలో రెండు కేసులు నమోదు కాగా, మరో కేసు నమోదైంది. మహిళను రౌడీషీటర్ నరేశ్ పథకం ప్రకారమే రప్పించి శ్రీకాంత్కు సమాచారం అందించి.. లైంగికదాడికి పాల్పడి.. వీడియో చిత్రీకరణ చేసినట్లు గుర్తించారు. రౌడీషీటర్ల హంగామా.. కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఇద్దరు రౌడీషీటర్లలో ఒకరు ఎమ్మెల్యే అనుచరుడిగా మండలంలో చలామణి అవుతున్నాడు. పలువురు యువకులను వెంటేసుకుని నిత్యం రాజారం, టీఆర్నగర్, నూకపల్లి, మల్యాల, ముత్యంపేట, కొండగట్టు తదితర ప్రాంతాల్లో భూ సెటిల్మెంట్లు, పంచాయితీలు చేసి సొమ్ము చేసుకుంటున్నాడు. ఏదైనా గొడవలు జరిగితే తన వద్దనున్న గ్యాంగ్ను తెప్పించి దాడులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొద్దికాలంగా కొండగట్టు పుణ్యక్షేత్రానికి వచ్చే ప్రేమికులు, స్నేహితులు, కొంతమంది మహిళలను వీడియోలు చిత్రీకరించి భయబ్రాంతులకు గురిచేసి నగదుతోపాటు, బంగారు ఆభరణాలు కూడా బలవంతంగా లాక్కున్నాడనే ఆరోపణలు వెలువడుతున్నాయి. వీరి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని చూసినా.. అధికార పార్టీ ఎమ్మెల్యే అండ ఉండటంతో పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరించినట్లు మండలంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేసులో ఉన్న ఇద్దరు రౌడీషీటర్లపై పీడీ యాక్ట్ ఓపెన్ చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. మహిళపై అత్యాచార కేసులో ఉన్న రౌడీషీటర్లపై పూర్తిస్థాయిలో దర్యాఫ్తు చేపట్టి పీడీయాక్ట్ ఓపెన్ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా.. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా పోలీసు శాఖ కఠిన చర్యలు చేపడుతుంది. నేర చరిత్ర ఉన్న వారిపై కూడా పోలీసు శాఖ వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెడుతోంది. – అశోక్కుమార్, జగిత్యాల ఎస్పీ పథకం ప్రకారమే వీడియో చిత్రీకరణ నిందితుల్లో ఒకరు అధికారి పార్టీ ఎమ్మెల్యే అనుచరుడు -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
జ్యోతినగర్: పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ లేబర్గే ట్ వద్ద రాజీవ్ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. కరీంనగర్ నుంచి గోదావరిఖని వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రయాణికులను దించేందుకు ఎన్టీపీసీ లేబర్గేట్ వద్ద రహదారి పక్కన ఆగింది. అదేసమయంలో పెద్దపల్లి నుంచి గోదావరిఖని వైపు వేగంగా వస్తున్న ఆటో ఆగిఉన్న బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోడ్రైవర్ ఎండీ షబ్బీర్తోపాటు అందులో ప్రయాణిస్తున్న మహానందు, చందు, మల్లవ్వ, గట్టమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108లో గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ప్రమాద వివరాలను సేకరించి, కేసు నమోదు చేసుకున్నారు. విద్యుత్ తీగలు చోరీ కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామ పంచాయ తీకి చెందిన నల్లాలబావి విద్యుత్ తీగలు చో రీకి గురైనట్లు సర్పంచ్ రేకుల జ్యోతి తెలిపా రు. శనివారం తెల్లవారు జామున గుర్తించిన పంపు డ్రైవర్.. చోరీ విషయాన్ని సర్పంచ్కు చేరవేశారు. దీంతో పోలీస్టేషన్లో ఫిర్యాదు చే సినట్లు సర్పంచ్ పేర్కొన్నారు. కరెంట్ తీగలు చోరీకి గురికావడంతో గ్రామంలో తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయ కలిగిందని, వెంటనే కొత్తవైర్లు బిగించి సరఫరా పురుద్ధరించామని ఆమె వివరించారు. పోలీసులు దొంగలను పట్టుకుని ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా చూడాలని కోరారు. పోలీస్స్టేషన్ తనిఖీ మంథని: స్థానిక పోలీస్స్టేషన్ను గోదావరిఖ ని ఏసీపీ రమేశ్ శనివారం తనిఖీ చేశారు. స్టే షన్ పరిసరాలు, రికార్డులు, ఫైళ్లు పరిశీలించా రు. పెండింగ్లోని ఫిర్యాదులు, కేసులను స కాలంలో పరిష్కరించాలని అధికారులను ఆ దేశించించారు. నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, కోర్టులతో సమన్వయంతో పనిచేస్తూ నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజాఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ బాధితులకు రక్షణ కల్పించడం పోలీసుల ప్రధాన బాధ్యత అని ఏసీపీ గుర్తుచేశారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన.. క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ స్వామి, ఎస్ఐ సందీప్ కుమార్ పాల్గొన్నారు. వ్యక్తి ఆత్మహత్యపెగడపల్లి: రాములపల్లికి చెందిన రాచర్ల మాణిక్యం (46) శనివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. కూలి పని చేసుకుంటూ ఒంటరిగా నివాసముంటున్న మాణిక్యం కొంతకాలంగా తాగుడుకు బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది ఇంట్లోనే ఉరేసుకున్నాడు. -
చికిత్స పొందుతూ విజ్ఞత మృతి
యైటింక్లయిన్కాలనీ: వంటగ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన యావనవేని విజ్ఞత(27) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధి మహాకవి పోతనకాలనీలోని నివాసం ఉంటున్న సింగరేణి కార్మికుడు యాదనవేని వసంత్ – విజ్ఞత దంపతులు ఈనెల 2న గ్యాస్స్టౌవ్ పేలి తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. 80శాతం కాలిన గాయలతో విజ్ఞత, 60 శాతం కాలిన గాయాలతో వసంత్ను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విజ్ఞత చనిపోయింది. వసంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, దంపతుల ఇద్దరు పిల్లలు బంధువుల వద్ద ఆశ్రయం పొందుతున్నారు. దీంతో పోతనకాలనీలో విషాదచాయలు నెలకొన్నాయి. మృతదేహాన్ని గోదావరిఖని ఏరియా ఆస్పత్రికి తీసుకురానున్నట్లు స్థానికులు తెలిపారు. విజ్ఞత తల్లిగారి గ్రామమైన బెల్లంపల్లిలోని బుచ్చంపల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం
● స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు పాలకుర్తి: ధర్మారం క్రాస్రోడ్డు వద్ద కన్నాల గ్రామ రెవెన్యూ శివారులోని సర్వే నంబర్ 425లో గల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందు కు యత్నించగా రెవెన్యూ అధికారులు శనివా రం అడ్డుకున్నారు. ఆ భూమిని గతంలో జిల్లా కోర్టు నిర్మాణం కోసం సేకరించారు. అప్పటి జిల్లా జడ్జికి భూమిపత్రాలను అందజేశారు. జిల్లా కోర్టు నిర్మాణానికి పెద్దపల్లి సమీపంలో ని రాఘవాపూర్ శివారులో భూమి కేటాయించారు. బీడుగా ఉన్న కోర్టు భూమిపై కొందరు రియల్టర్ల కన్నుపడింది. రెండు, మూడు రోజులుగా ట్రాక్టర్తో చదును చేస్తున్నారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ రాజేశ్వరరావు, ఆర్ఐ సంతోష్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. అందులో ప్రభుత్వ భూమి అని సూచించేలా సైన్ బోర్డును ఏర్పాటు చేశారు. ఈభూమిని ఆక్రమిస్తే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
ధర్మారం: రామయ్యపల్లి గ్రామంలో దీర్ఘకాలికంగా ఎదురవుతున్న లో వోల్టేజీ సమస్య పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన 25 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను సర్పంచ్ మూల మంగతో కలిసి ఏడీఈ వెంకటరమణారెడ్డి శనివారం ప్రారంభించారు. కొద్దిరోజులుగా లోవోల్టేజీ సమస్య ఉండడంతో మంత్రి లక్ష్మణ్కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి.. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పా టు చేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా చేసినట్లు సర్పంచ్ మంగ తెలిపా రు. ఈ కార్యక్రమంలో ఖిలావనపర్తి ఏఈ మహేందర్రెడ్డి, ఉపసర్పంచ్ భూతగడ్డ గట్టమ్మ, లైన్మెన్ హైమద్పాషా, వార్డు సభ్యులు తదతరులు పాల్గొన్నారు. -
టాస్క్‘ఫోర్స్’ దూకుడు
గోదావరిఖని: అసాంఘిక కార్యకలాపాలు, ఆహార కల్తీ, నిషేదిత క్రిమిసంహారక మందులు, అక్రమాలపై నార్కోటిక్, టాస్క్ఫోర్స్ దాడులు ఉధృతం చేసింది. ప్రధానంగా గంజాయి, మత్తు పదార్థాల విక్రయం, పేకాట స్థావరాలపై మెరుపు దాడులు చేస్తోంది. ఏడాది క్రితం రామగుండం కమిషనరేట్లో టాస్క్ఫోర్స్ను ఎత్తివేశారు. అయితే, నెలరోజులుగా నార్కోటిక్, టాస్క్ఫోర్స్ను పునరుద్ధరించడంతో మంచిర్యాల, పెద్దపల్లిజిల్లాల్లో దూకుడు పెంచాయి. పోలీస్ కమిషనర్ నేతృత్వంలో టాస్క్ఫోర్స్లో ఏసీపీ, ముగ్గురు ఎస్సైలు, పదిమంది కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి పక్కా సమాచారంతో ఆకస్మిక దాడులు చేసేలా ప్రణాళిక రూపొందించారు. దాడుల్లో స్వాధీనం చేసుకుంటున్న సొత్తు, ఇతర పదార్థాలు, అదుపులోకి తీసుకుంటున్న నిందితులను పోలీస్స్టేషన్లలో అప్పగించి కేసులు నమోదు చేసేలా చర్యల చేపడుతున్నారు. మత్తు పర్థాలపై డేగకన్ను గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాల విక్రయాలపై నార్కోటిక్, టాస్క్ఫోర్స్ డేగకన్నువేశాయి. గంజాయి విక్రయాలను మూలాలతో సహా పెకిలించివేస్తున్నాయి. విక్రయదారులతోపాటు వినియోగదారులనూ వదిలిపెట్టడంలేదు. విక్రయదారులపై కేసులు నమోదు చేస్తూ, వినియోగదారులను ప్రత్యేక కేంద్రాలకు తరలించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇలా ఈఏడాదిలోనే 31 కేసులు నమోదు చేసి 5.86కిలోల రూ.2.93 లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకుని 47 మందిపై కేసు నమోదు చేశారు. ఆరు వాహనాలను సీజ్ చేశారు. పీడీఎస్ రైస్ స్వాధీనం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రెండు జిల్లాల్లో టాస్క్ఫోర్స్ బృందాలు పీడీఎస్ రైస్పై కూడా దృష్టి పెట్టాయి. గత 8 నెలల్లో 117 క్వింటాళ్ల రూ.15.16 లక్షల విలువైన బియ్యం స్వాధీనం చేసుకుని ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఒక వాహనం స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు నకిలీ ఆహారపదార్థాలు, నిషేధిత గడ్డిమందు విక్రయాలు, నకిలీ విత్తనాలు తదితర వాటిపై టాస్క్ఫోర్స్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈఏడాదిలో టాస్క్ఫోర్స్ దాడులు వివరాలు కేసులు కేజీ/లీటర్ విలువ(రూ.లక్షలు) నిందితులు వాహనాల స్వాధీనం గంజాయి 31 5.863 2.93 47 06 రేషన్బియ్యం 06 117.85 15.16 06 01 గేమింగ్ 05 3.09 22 08 – ఫెస్టిసైడ్స్ 03 315 1.57 05 03 పచ్చళ్లు 03 600 0.90 03 – కల్తీ, పేకాట, ఫెస్టిసైడ్ షాప్లపై ఫోకస్ గంజాయి, మత్తుపదార్థాలపై ప్రత్యేక దృష్టి కేసులు నమోదు చేస్తూ.. జరిమానా విధిస్తూ ముందుకు ప్రత్యేక దృష్టి పెట్టాం గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాల విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాం. అసాంఘిక కార్యకలాపాలనూ కట్టడి చేస్తున్నాం. పేకాట, పీడీఎస్ రైస్, నకిలీ పురుగుల మందు విక్రయాలపై కేసులు నమోదు చేస్తున్నాం. ఇందులో టాస్క్ఫోర్స్ బృందాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ప్రజలు ఏలాంటి ఇబ్బందులున్నా డయల్ 100 నంబర్ ద్వారా పోలీసులను సంప్రదించాలి. – అంబర్ కిశోర్ ఝా, సీపీ, రామగుండం -
12వ వేతన కమిటీ ఏర్పాటు చేయాలి
గోదావరిఖని: దేశంలోని ప్రభుత్వ రంగ బొగ్గు పరిశ్రమల్లో పనిచేస్తున్న బొగ్గు గని కార్మికులు, ఉద్యోగు ల వేతనాలు, అలవెన్సుల పెంపుకోసం 12వ వేజ్బోర్డు కమిటీని వెంటనే నియమించాలని జేఏసీ నా యకులు వాసిరెడ్డి సీతారామయ్య, తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. నాలుగు లేబర్ కోడ్లను బొగ్గు పరిశ్రమల్లో అ మలు చేయొద్దన్నారు. నూతన వేజ్బోర్డు ఏర్పాటు కోసం ఈనెల 10న జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ యూనియన్ల నాయకులు గడ్డం కృష్ణ, మడ్డి ఎల్లాగౌడ్, కవ్వంపల్లి స్వామి, గౌతం గోవర్ధన్, దాసరి శ్రీనివాస్, బిట్టి వెంకటేశ్వర్లు, ఏవీఎస్ ప్రకాశ్, రాజేశ్వర్రావు, దేవయ్య, తొడుపునూరి రమేశ్ కుమార్, శివరాంరెడ్డి, రాజమౌళి, నరహరిరావు, ప్రవీణ్, వెంకటేశ్వర్లు, రమేశ్ పాల్గొన్నారు. రేపు జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా సింగరేణి జేఏసీ నాయకుల వెల్లడి -
కోహెడలో రోడ్డు ప్రమాదం – తారుపల్లిలో విషాదం
కాల్వశ్రీరాంపూర్: కోహెడ సమీపంలోని రాజీవ్ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లి గ్రామానికి చెందిన జక్కుల సాయికృష్ణ(25) మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. కారు అద్దెకు నడుపుతూ జీవనోపాధి పొందుతున్న యువకుడు .. గ్రామానికి చెందిన క్యాన్సర్ పేషెంట్ను హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించి తిరుగు ప్రయాణంలో కోహెడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో తారుపల్లిలో విషాదం అలుముకుంది. మృతుడికి తల్లిదండ్రులు రమాదేవి– మల్లయ్య ఉన్నారు. సాయికృష్ణ అందరితో కలిమిడితో ఉండేవాడని గ్రామస్తులు పేర్కొన్నారు. తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. -
విద్యార్థులకు ప్రోత్సాహకాలు
మంథనిరూరల్: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేలా సర్కారు అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. హాజరుశాతం పెంచేలా హెచ్ఎం వినూత్న ఆలోచన అమలు చేస్తున్నారు. మంథని మండలం ఆరెంద జెడ్పీ హైస్కూల్లో వందశాతం విద్యార్థులు హాజరయ్యేలా హెచ్ఎం, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం ఈదులపల్లి నర్సింహారావు సరికొత్తగా ఆలోచనచేశారు. వందశాతం హాజరు నమోదు చేసే విద్యార్ధులకు బహుమతులు అందజేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోగత నెలలో వందశాతం హాజరైనవారికి శనివారం బహుమతులు అందజేశారు. ప్రతీరోజు ప్రతీ విద్యార్థి హాజరు కావాలనే లక్ష్యంతోనే ప్రోత్సాహకాలు ప్రకటించినట్లు హెచ్ఎం తెలిపారు. పాఠశాల అభివృద్ధితోపాటు విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని, ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఉపాధ్యాయు లు, గ్రామస్తుల సహకారంతో పాఠశాలను మరింత అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. ఆరెంద బడిలోనే చదువుకున్న నర్సింహారావు అదే స్కూల్లో హెచ్ఎంగా పనిచేస్తూ పాఠశాల అభివృద్ధికి చేస్తున్న కృషిని గ్రామస్తులు అభినందిస్తున్నారు. హాజరు శాతం పెంపు లక్ష్యం ఆరెంద హైస్కూల్ హెచ్ఎం వినూత్న ఆలోచన -
కరుడుగట్టిన ‘థార్ గ్యాంగ్’ పట్టివేత
కొత్తపల్లి(కరీంనగర్): కరుడుగట్టిన అంతరాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ఇద్దరిని శనివారం కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేశారు. సీఐ బిల్ల కోటేశ్వర్ వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్లోని థార్ జిల్లా తాండా తాలూకాకు చెందిన కరుడుగట్టిన నలుగురు సభ్యుల ముఠా (థార్ గ్యాంగ్) ఇటీవల కరీంనగర్కు చేరుకుంది. కొత్తపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని రేకుర్తి, మల్కాపూర్ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తూ అనుమానాస్పదంగా సంచరిస్తుండగా.. రేకుర్తి కంటి ఆసుపత్రి కమాన్ సమీపంలో సర్దు(25), సర్దార్(29)ను అదుపులోకి తీసుకున్నారు. దొంగతనానికి ఉపయోగించే సుత్తె, పానను స్వాధీనం చేసుకున్నారు. గతేడాడాది సంక్రాంతి సమయంలో చింతకుంట ప్రాంతంలో జరిగిన పలు దొంగతనాల్లో ప్రమేయం ఉన్నట్లు అంగీకరించారు. మళ్లీ దొంగతనాలకు పాల్పడేందుకు కరీంనగర్కు వచ్చినట్లు విచారణలో తేలింది. నలుగురు సభ్యుల ముఠాలో ఇద్దరు పరారైనట్లు, అరెస్ట్ చేసిన ఇద్దరిని రిమాండ్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. -
రెక్కీ.. ఆ తర్వాతే చోరీ
మంథని: తాళం వేసిన ఇళ్లు లక్ష్యంగా వరుస చోరీలు చేస్తున్న కేసులో నిందితుడిని పెద్దపల్లి జిల్లా మంథ ని సీఐ స్వామి ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం, రా మగిరి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. కేసు వివరాలను గోదావరిఖని ఏసీపీ రమేశ్ శనివా రం మంథని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తాళంవేసిన ఇళ్లను పగలు గమనించి రాత్రి తాళాలు పగులగొట్టి ఆభరణాలు, నగదు చోరీ చేస్తున్నాడు. రామగిరి ఎస్సై శ్రీనివాస్ శనివారం గస్తీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి చూసి పారిపోవడానికి యత్నించాడు. పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. అతడిని తనిఖీ చేయగా బటన్ కత్తి లభించింది. తన పేరు వనం రాము అని, జగిత్యాల జిల్లా తారకరామనగర్ స్వస్థలమని వెల్లడించాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తనభార్య కవితతోపాటు దాసరి రవి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన వనం పాపయ్య, అశ్వరావుపేటకు చెందిన వనం నగేశ్తో కలిసి ముఠాగా ఏర్పడి చోరీలు చేస్తున్నాడు. గతంలో రాయికల్, జగిత్యాల ప్రాంతాల్లో కూడా చోరీలు చేసి జైలుకు వెళ్లి వచ్చాడు. రామగిరి మండలం కల్వచర్ల, ముత్తారం, ధర్మారం, రత్నాపురం, జూలపల్లిలో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్గా చేసుకుని చోరీలు చేశారు. చోరీచేసిన ఆభరణాల తాకట్టు, విక్రయం పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడులో దొంగిలించిన నల్లపూసల గొలుసు, కల్వచర్లలో చోరీచేసి ఆభరణాలను జగిత్యాలలో తాకట్టు పెట్టినట్లు నిందితుడు తెలిపాడు. వాటి ద్వారా వచ్చిన నగదును ఎన్నికల సమయంలో ఖర్చు చేసినట్లు వెల్లడించాడు. మరికొన్ని ఆభరణాలను జగిత్యాల టవర్ సర్కిల్లోని నగల దుకాణాదారుకు విక్రయించినట్లు, ఆ వ్యక్తి కొన్ని నెలల క్రితం మృతి చెందినట్లు వివరించాడు. ఆభరణాల విక్రయం ద్వారా వచ్చిన నగదులో కొంతమొత్తాన్ని రవి, పాపయ్య, నగేశ్కు ఇచ్చి మిగిలిన సొమ్మును తన భార్య ఖర్చులు, జల్సాలకు వినియోగించినట్లు వెల్లడించాడు. అలాగే ఓడేడులో దొంగిలించిన రూ.లక్షతోపాటు గతంలో దొంగిలించిన నగదును ఆంధ్రప్రదేశ్లోని జంగారెడ్డిగూడేనికి చెందిన జగన్నాథం లక్ష్మణరావు వద్ద సెప్టిక్ ట్యాంకర్ కొనుగోలు కోసం రూ.2 లక్షలు చెల్లించినట్లు తెలిపాడు. నిందితుడి నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని, దొంగతనాలకు సంబంధించిన ఆస్తి రికవరీతోపాటు ఇతర నిందితుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని ఏసీపీ రమేశ్ వివరించారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన మంథని సీఐ స్వామి, రామగిరి ఎస్సై శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ భార్గవ్, పోలీస్ కానిస్టేబుళ్లు రమేశ్, అభిషేక్, రాజ్కుమార్ను ఏసీపీ ఈ సందర్భంగా అభినందించారు. -
గుడిలో నిద్రకు వెళ్లి అనంతలోకాలకు..
గోదావరిఖని: బంధువు చనిపోతే దశదినకర్మ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి గుడిలో నిద్రకు వెళ్లాడు. రాత్రి నిద్రలోనే అనంత లోకాలకు చేరుకోవడం విషాదం నింపింది. వివరాలు.. పెద్దపల్లి జిల్లా గో దావరిఖని కృష్ణానగర్ చెందిన దాసరి స దానందం(45) ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రై వర్గా పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం సమీప బంధువు మృతి చెందింది. దశదినకర్మ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి గుడిలో నిద్రించేందుకు ఈనెల 7న రాత్రి గోదావరిఖనిలోని కోదండరామా లయం వెళ్లాడు. రాత్రి నిద్ర తర్వాత శనివారం తెల్లవారుజామున గుడి నుంచి ఇంటికి వెళ్లేందుకు సదానందం నిద్రలేపేందుకు యత్నించారు. ఎంతపిలిచినా చలనం లేకుండా పోయింది. దీంతో కుమారుడికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని 108అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య దాసరి శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మనోహర్ తెలిపారు. పోతారంలో విషాదం మంథనిరూరల్: బంధువు చనిపోతే దశదిన కర్మ అనంతరం గుడిలో నిద్ర చేసేందుకు వెళ్లి శాశ్వత నిద్రలోకి వెళ్లిన ఘటనతో స్వగ్రామం మంథని మండలం పోతారంలో విషాదం నెలకొంది. పోతారం గ్రామానికి చెందిన దాసరి నదానందం గోదావరిఖనిలోని కృష్ణానగర్లో నివసిస్తున్నాడు. ఓ ప్రైవేట్ పాఠశాల వాహనానికి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడు మృతి చెందిన విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటి పోయాయి. బంధువు చనిపోతే గుడికి నిద్రకు పోయి శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడంటూ కన్నీటి పర్వంతమయ్యారు. స్వగ్రామమైన పోతారంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. -
రేపే ఆఖరు సర్
సాక్షి పెద్దపల్లి: జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్ – సర్) గడువు ఈనెల 10వ తేదీతో ముగియనుంది. సర్ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైలైజేషన్ ప్రక్రియ జిల్లాలో శరవేగంగా కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా మొత్తం 7,12,157 మంది ఓటర్లు ఉండగా, వారికోసం 844 మంది బీఎల్వోలు వందశాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ పూర్తిచేశారు. ఇప్పటివరకు 6,30,576 ఫారాలు డిజిటలైజేషన్ చేయగా, ఇదిమొత్తం ఓటర్లలో 88.54 శాతంగా నమోదైంది. 80 వేల మందికిపైగా ఇంకా మిగిలి.. జిల్లాలో ఇంకా 80,449 మంది ఓటర్లకు సంబంధించిన ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. ఇది మొత్తం ఓటర్లలో 11.30 శాతంగా ఉంది. దీంతో మిగిలిన ఓటర్లకు సంబంధించిన ఫారాల సేకరణ, డిజిటలైజేషన్, వెరిఫికేషన్ ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇదేసమయంలో జిల్లాలో 5,713 మంది ఓటర్లకు డబుల్, తొలగింపు, ఓగస్ ఓట్లుగా నమోదయ్యాయి. అలాగే 4,573 ఫారాలు ఓటర్ల నుంచి సేకరించాల్సి ఉంది. మొత్తంగా సర్ ప్రక్రియ 88 శాతానికిపైగా పూర్తయినా.. ఇంకా 80వేల మందికిపైగా ఓటర్ల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. దీంతో మిగిలిన ప్రక్రియను పూర్తిచేయడానికి జిల్లా అధికారులకు రెండురోజుల గడువు మాత్రమే ఉంది. ఈమేరకు ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈనెల 10తో ముగియనున్న ఎస్ఐఆర్ ప్రక్రియ జిల్లాలో 88.54శాతం ఈఎఫ్ల డిజిటలైజేషన్ మంథని నియోజకవర్గంలో 100 శాతం నమోదు జిల్లాలో సర్ ఇలా.. బీఎల్వోలు 844 ఓటర్లు 7,12,157 ఫారాల పంపిణీ(శాతం) 100 బీఎల్వోలకు చేరినవి 6,30,478 డిజిటలైజేషన్ చేసింది 6,30,576 డిజిటలైజేషన్ శాతం 88.54 డబుల్, తొలగించినవి 5,713 వ్యత్యాసం ఉన్నవి 1,35,675 -
మద్యం మత్తులో కొడుకుపై దాడి
కోనరావుపేట(వేములవాడ): తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం ముదిరి.. గొడ్డలితో దాడికి దారితీసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటకు చెందిన గుడిపేట రాఘవులు, రాజేందర్(36) తండ్రీకొడుకులు. గల్ఫ్కు వెళ్లిన రాజేందర్ ఏడాది క్రితం ఇంటికొచ్చాడు. ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. కొన్ని నెలల క్రితం రాజేందర్ దాడి చేయడంతో తండ్రి రాఘవులు చేయి విరిగింది. ఇటీవల కొడుకును హత్య చేసేందుకు తండ్రి బండరాయితో ప్రయత్నించగా రాజేందర్కు గాయాలయ్యాయి. శనివారం కూడా ఎప్పటిలాగే ఇద్దరి మధ్య ఇంట్లోనే వాగ్వాదం చోటుచేసుకుంది. మద్యం సేవించిన రాఘవులు ఇంట్లోనే మంచంపై పడుకుని ఉన్న రాజేందర్పై గొడ్డలితో దాడి చేశాడు. ఈ సంఘటనలో రాజేందర్ మెడపై, చెవిబాగంలో గాయాలయ్యాయి. వెంటనే గమనించిన గ్రామస్తులు సిరిసిల్లలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. రాజేందర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కోనరావుపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రికి తరలింపు.. పరిస్థితి విషమం -
రైల్వేబోర్డు దృష్టికి సమస్యలు
రామగుండం: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ శని వారం రైల్వేబోర్డు చైర్మన్ సతీశ్కుమార్ను కలి శారు. రామగుండం కాలనీలో మూతపడిన రైల్వేస్కూల్ను పునరుద్ధరించాలని, బద్రిపల్లి, మల్యాలపల్లి, రామగుండం రైల్వే గేట్ల స్థానంలో సబ్ వే వంతెన, పెద్దంపేట, కుందనపల్లిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి, భూగర్భ వంతెన నిర్మించాలని ఆయనకు విన్నతించారు. రామగుండంలో ఫిరోజ్పూర్ కాంటోన్మెంట్ – హంసఫర్, నవజీవన్, గరీభ్రథ్, స్వర్ణజయంతి రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని ఎంపీ కోరా రు. ఇందుకు రైల్వే బోర్డు చైర్మన్ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ పేర్కొన్నారు. అథ్లెటిక్స్లో ‘బంగారం’ కమాన్పూర్: మండల కేంద్రానికి చెందిన నల్లవెలి ఆనంది అథ్లెటిక్స్ పోటీల్లో బంగారు పతకం సాధించి జాతీయస్థాయికి ఎంపికై ంది. హన్మకొండలో శుక్రవారం నిర్వహించిన బాలికల విభాగం– 400 మీటర్ల పరుగు పందెంలో 56 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని ప్రతిభ చూపింది. ఆనంది కమాన్పూర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ద్వితీయ చదువుతోంది. ప్రతిభ చూపిన అథ్లెట్స్ జ్యోతినగర్: హన్మకొండలో జరిగిన రాష్ట్రస్థా యి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లానుంచి 70 మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనభర్చినట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము గట్టయ్య తెలిపారు. బాలికల అండర్–18, 400, 200 మీటర్ల పరుగు పందెంలో నల్లవెల్లి ఆనంది జట్టు ప్రథమ స్థానం సాధించిందని, బాలుర అండర్–6 స్టాండింగ్ బోర్డు జంప్లో మోహాంశ్రావు తృతీయ స్థానం సా ధించారని పేర్కొన్నారు. విజేతలను పీఈటీ స త్యనారాయణ, కోచ్ సుబ్బారావు, అథ్లెటిక్స్ అ సోసియేషన్ సభ్యులు అభినందించారు. 23 నుంచి ఆదివరాహ స్వామి ఉత్సవాలు కమాన్పూర్: ప్రసిద్ధ శ్రీఆదివరాహస్వామి జయంతిని ఈనెల 23 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కమిటీ ముస్త్యాల దామోదర్, అర్చకుడు వరప్రసాదాచార్యులు, ఈవో కాంతారెడ్డి తెలిపా రు. ఉత్సవాల ప్రచార పోస్టర్ను దేవస్థానం ఆవరణలో శనివారం ఆవిష్కరించి మాట్లాడా రు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వేడుకలను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సత్యనారాయణ, డైరెక్టర్లు రాజయ్య, రాజు, మల్లేశ్, సతీశ్, శంకర్, శ్రీనివాస్, శ్యామల పాల్గొన్నారు. కట్టడాలు తొలగించాలి గోదావరిఖని: ఎల్బీనగర్లోని సింగరేణి స్థలంలో అక్రమ కట్టడాలను తొలగించాలని ఆర్జీ –1 జీఎం పేరిట ఫిల్లర్లకు నోటీసులు అంటించింది. ఈకట్టడాలకు అనుమతి లేదని స్పష్టం చే సింది. సంస్థకు చెందిన స్థలంలో అనుమతి లే కుండా కట్టడాలను సహించబోమని పేర్కొంది. నాలుగు రోజుల్లోగా తొలగించకపోతే తా మే తొలగిస్తామని నోటీసులో పేర్కొంది. స్వ చ్ఛందంగా తొలగించపోతే బాధ్యులపైనా చ ర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా లబ్ధిదారులకు అన్యాయం జరిగిందని సీపీఐ కార్పొరేటర్ మార్కపురం సూర్య ఆరోపించా రు. ఈవిషయంలో బాధితులకు న్యాయం చే యాలని డిమాండ్ చేశారు. ఈవిషయంలో ఎ మ్మెల్యేను బద్నాం చేస్తే ఊరుకోబోమని కాంగ్రె స్ నాయకుడు ఉదయ్రాజ్ హెచ్చరించారు. -
భూసేకరణ వెంటే పునరావాసం
సాక్షిప్రతినిధి, కరీంనగర్: సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అడ్డుగా నిలు స్తున్న భూసేకరణ, పునరావాసం, అటవీ, పర్యావరణ అనుమతుల సమస్య పరిష్కరించేందుకు ప్ర భుత్వం కీలక నిర్ణయం తీసుకుందని మంత్రులు స్పష్టం చేశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వివిధ అంశాలపై శనివా రం హైదరాబాద్లో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అదన పు కలెక్టర్లతో సమీక్షించారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ, ఆర్అండ్ఆర్, అటవీ, పర్యావరణ అనుమతులను అ త్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలుగా పరిగణించాలని ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. సుమారు నాలుగున్నరేళ్లుగా నిలిచిపోయిన మిడ్మానేరు ఎడ మ కాలువ మిగులు పనులను వెంటనే పునఃప్రారంభించాలని ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ప్రతిపాదించిన శ్రీలక్ష్మీనరసింహస్వామి పత్తిపాక రిజర్వాయర్ పనులను వేగవంతం చే యాలన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కొత్తగా 10వేల ఎ కరాలకు సాగునీరు అందించడంతో పాటు కాకతీ య ప్రధాన కాలువలో డీ–83 నుంచి డీ–94 వరకు ఉన్న 2.40 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించా లన్నది ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. పత్తిపాక వద్ద 3 టీఎంసీలు లేదా 5 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి రెండు ప్రత్యామ్నాయాల ను అధికారులు పరిశీలిస్తున్నారని తెలిపారు. ఈ నె లాఖరులోగా డీపీఆర్ సిద్ధం చేసి పంపాలని ఆదేశించారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని రో ళ్లవాగు ప్రాజెక్టు పనులు ఇప్పటికే 96 శాతం పూర్తయ్యాయని అన్నారు. మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 0.250 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని 0.949 టీఎంసీలకు పెంచడం ద్వారా స్థానిక పరీవాహక ప్రాంతం నుంచి లభించే నీటిని సమర్థంగా వినియోగించుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. చివరి ఆయకట్టులోని దాదాపు 15 వేల ఎకరాలకు సాగునీటి భరోసా లభించనుందని అన్నారు. ఆటంకాలు లేకుండా చూడాలి: మంత్రి దుద్దిళ్ల నీటి పారుదల ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణానికి భూ సేకరణ అడ్డంకిగా మారకుండా చూడాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. నీటి పారుదల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించాలని అధికారులకు సూచించారు. భూసేకరణ ఆలస్యం అవడం, అటవీ భూముల బదలాయింపు వివిధాలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని కోరారు. నూతన రోడ్ల నిర్మాణం, దెబ్బతిన్న రహదారుల మరమ్మతు పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని అన్నారు. జిల్లాల్లోని మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇంజనీర్ల కొరత ఉందన్న ఫిర్యాదులు వస్తున్నాయని, డిప్యుటేషన్పై వాటిని సాధ్యమైనంత త్వరలో భర్తీ చేయాలని ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జలమైన నివాస ప్రాంతాల ప్రజలకు మరొక చోట ఇళ్ల స్థలాలను కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించారు. రామగుండం అభివృద్ధికి నిధుల్విండికోల్సిటీ: రామగుండం నగర అభివృద్ధికి నిధులు మంజూరు చేసి, సమస్యలు పరిష్కరించాలని మేయర్ మహంకాళి స్వామి కోరారు. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్తో కలిసి మేయర్ కీలక సమస్యలను మేయర్.. మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన అంశాలు -
ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి సిరిసిల్ల జిల్లా కేంద్రానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చేరుకోగానే డ్రైవర్ చక్రపాణికి ఫిట్స్ వచ్చాయి. ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును రోడ్డు పక్కన నిలిపారు. బస్సులో ఉన్న ప్రయాణికులను కిందకి దింపిన తర్వాత అతను అక్కడే నేలపైన కొంత సేపు సేదతీరారు. గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సిరిసిల్ల ఆస్పత్రికి తీసుకెళ్లారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతోనే పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. డ్రైవర్కు ఫిట్స్ బస్సును రోడ్డు పక్కన నిలిపిన డ్రైవర్ ప్రయాణికులు సురక్షితం -
జలుబు.. దగ్గు.. జ్వరం
పెద్దపల్లి: ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు పేషెంట్లతో రద్దీగా మారుతున్నాయి. కొద్దిరోజులుగా కురుస్తు న్న చిరుజల్లులతో వాతావరణంలో మార్పులు రావడంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. అస్వస్థతకు గురవుతున్న జిల్లావాసులు ఆస్పత్రుల బాటపడుతున్నారు. ప్రధానంగా విషజ్వరం, జలుబు, దగ్గు, విరేచనాలతో బాధపడుతున్నవారు దవాఖానాలను ఆశ్రయిస్తున్నారు. వీరిరాకతో ముఖ్యంగా జిల్లాకేంద్ర ఆస్పత్రిలో ఓపీ భాగా పెరుగుతోంది. వేగంగా వైద్యసేవలు జిల్లాలో 17 ప్రాథమిక, 6 అర్బన్ పీహెచ్సీలు, 3 క మ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. వీటితోపాటు జిల్లా కేంద్ర ఆస్పత్రి, రామగుండం, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్, ధర్మారం ఆస్పత్రుల్లోనూ వైద్య సేవలు అందిస్తున్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రికి రో జూ 900 మంది నుంచి 1,100 మంది పేషెంట్లు వస్తున్నారు. అందులో జ్వరంతో 300 మంది వరకు బాధపడుతున్న వారు ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అవుట్ పేషెంట్ల సంఖ్య అధికంగా నమోదవుతుండగా.. ఇన్పేషెంట్ల సంఖ్య తక్కువగా నమోదవుతోందని పేర్కొంటున్నారు. మరోవైపు.. గ్రామాల్లో ఇంటింటా జ్వరసర్వే కొనసాగుతోంది. పెరుగుతున్న సీజనల్ వ్యాధులు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న బాధితులు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పేషెంట్ల రద్దీ -
బంగారం చోరీ.. నిందితుడి అరెస్టు
కరీంనగర్క్రైం/కరీంనగర్: ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి బంగారం ఎత్తుకెళ్లిన కిసాన్నగర్కు చెందిన మునుగొండ మధుకర్ అలియాస్ మధు(42)ను కరీంనగర్ త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వివరాల ప్రకారం.. శివాజీనగర్లో నివాసముండే జంగం రాజమ్మ ఒంటరిగా ఉండడం గమనించి ఇంట్లోకి 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో మధుకర్ ముఖానికి మాస్క్ ధరించి ప్రవేశించాడు. మెడలోని బంగారు గొలుసు, ఎడమ చెవి కమ్మను బలవంతంగా లాక్కున్నాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో తలను గోడకేసి కొట్టడంతో గాయపడింది. నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. దోచుకున్న బంగారాన్ని బజాజ్ ఫైనాన్స్లో గోల్డ్లోన్ కింద తాకట్టు పెట్టి రూ.2.25 లక్షలు తన బ్యాంకు ఖాతాలో జమ చేసుకున్నాడు. కేసు నమోదైన వెంటనే పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాల ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు, బ్యాంకు లావాదేవీలు విశ్లేషించారు. శనివారం నిందితుడిని అరెస్టు చేసి ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. వృద్ధురాలిని పరామర్శించిన డిప్యూటీ మేయర్ దోపిడి దొంగ దాడిలో గాయపడి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జంగం రాజమ్మను డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావు పరామర్శించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి డాక్టర్లకు సూచించారు. బాధితురాలికి తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు. 27వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల శ్యామల–కిరణ్ పాల్గొన్నారు. -
భర్తపై మొదటి భార్య బంధువుల దాడి
వేములవాడ: భార్య, పిల్లలను కాదని రెండో భార్యతో కాపురం చేస్తున్నాడని మొదటి భార్య బంధువులు దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. వేములవాడలోని న్యూఅర్బన్కాలనీలో ఉంటున్న వావిలాల శంకర్ ఆటో డ్రైవర్. శంకర్కు భార్య, పిల్లలు ఉన్నారు. మరో మహిళను రెండో పెళ్లి చేసుకొని వేరు కాపురం పెట్టాడు. దీంతో మొదటి భార్య పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా శనివారం మొదటి భార్య బంధువులు శంకర్ ఇంటికి వెళ్లారు. ఈక్రమంలో మాటమాట పెరిగి దాడి చేయడంతో తలకు తీవ్రంగా గాయమైంది. వెంటనే పోలీసుల అక్కడికి చేరుకుని శంకర్ను ఏరియా ఆసుపత్రికి తరలించారు. శంకర్ మాట్లాడుతూ తాను ఇంట్లో ఉండగా కత్తులు, కర్రలతో వచ్చి దాడి చేశారన్నారు. మొదటి భార్య బంధువులు మాత్రం తాము ఏమీ అనకుండానే గోడకు ఉన్న గ్లాస్ అద్దానికి తలబాదుకుని తనకుతానే తల పగులగొట్టుకున్నాడని వెల్లడిస్తున్నారు. ఇరుపక్షాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. -
రైల్వేకు కాసుల వర్షం
● నైనీబ్లాక్ బొగ్గు తెలంగాణకు రవాణా ● జైపూర్ ఎస్టీపీపీ, ఎన్టీపీసీకి తరలింపు ● ప్రతీరోజు 12వేల టన్నులు దిగుమతి లక్ష్యంగా ముందుకు.. రామగుండం: ఒడిశాలోని నైనీబ్లాక్(ఎన్సీబీ) నుంచి మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఎస్టీపీపీ) నుంచి తెలంగాణకు బొగ్గు రవాణా చేయడం ద్వారా రైల్వే శాఖకు కాసుల వర్షం కురుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్టీపీసీ)తో సింగరేణికి కుదిరిన కొనుగోలు ఒప్పందం నేపథ్యంలో ఎన్టీపీసీకి 4 వేల టన్నుల బొగ్గు 59 వ్యాగన్ల(రేక్) ద్వారా నైనీబ్లాక్ నుంచి రవాణా ప్రారంభమైంది. అక్కడి నుంచి రోజూ కనీసం 12వేల టన్నుల బొగ్గును రైలు ద్వారా ఇక్కడకు తరలించాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించారు. నైనీ గని వార్షిక బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం కోటి టన్నులు అని అధికారులు పేర్కొంటున్నారు. బొగ్గు రవాణా ఇటీవల ప్రారంభం కావడంతో వార్షికాదాయంపై రైల్వేఉన్నతాధికారులు ఇంకా అంచనాకు రాలేకపోతున్నారని సమాచారం. తొలిసారి నైనీ బొగ్గు.. ఒడిశాలోని నైనీకోల్ బ్లాక్ నుంచి హిందోల్ రైల్వేసైడింగ్ ద్వారా తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జైపూర్ ఎస్టీపీపీకి బొగ్గు చేరుకోవడానికి 1,131 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇంత సుదీర్ఘ దూరానికి(లాంగ్ లీడ్ ఫ్రైట్) రోజూ వేలాది టన్నుల బొగ్గును వివిధ కేంద్రాలకు రవాణా చేయడం ద్వారా రైల్వేకు సంతృప్తికరమైన ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. రవాణా చార్జీలు ఇలా.. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం దేశీయంగా రవాణా యుపు బొగ్గుకు క్లాస్ – 145ఏ మేరకు చార్జీ లు వర్తింపజేస్తారు. రైల్వేలో బొగ్గు ఫ్రైట్ చార్జీలు స్థిరంగా ఉండవు. ప్రయాణించే దూరం, లోడింగ్ రకం ఆధారంగా ధరల్లో మార్పులు ఉంటాయి. చార్జీల అంచనాలు తొలిసారిగా ఎన్టీపీసీకి చేరిన నైనీబ్లాక్లోని బొగ్గు(ఫైల్), కోల్మైన్ ఈసీవోఆర్, దక్షిణమధ్య రైల్వేలకూ ఆదాయంఒడిశాలోని అంగుల్ జిల్లాలోగల నైనీ బొగ్గు బ్లాక్ నుంచి బొగ్గు రవాణాతో ఈస్ కోస్ట్ రైల్వే(ఈసీవోఆర్)తోపాటు దక్షిణ మధ్య రైల్వేకు ఫ్రైట్ చార్జీలతో కాసుల వర్షం కురుస్తుందని భావిస్తున్నారు. దక్షిణ మధ్యరైల్వే జోన్ పరిధిలో మంచిర్యాల, రామగుండం ఎన్టీపీసీ సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి రానుండడంతో డివిజన్కు సమకూరే ఆదాయంతో రైల్వేస్టేషన్ల అభివృద్ధికి దోహదపడే అవకాశం ఉంటుంది. వీటితోపాటు ఒడిశా నుంచి తెలంగాణకు చేరుకునే క్రమంలో మధ్యలో సౌత్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే (ఎస్ఈసీఆర్), ఈస్ట్ కోస్ట్ రైల్వే (ఈఎస్ఆర్) పరిధిలోని ఆదాయంగా కూడా సదరు జోన్లకు ఫ్రైట్ చార్జీల రూపంలో వెళ్తుంది. మొత్తంగా భారతీయ రైల్వే ఖజానాకు ఏటా రూ.వందల కోట్ల ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. -
చేనేతకు చేయూత ఇవ్వాలి
● మేయర్ మహంకాళి స్వామి కోల్సిటీ: చేనేతకు చేయూత ఇవ్వాలని మేయర్ మహంకాళి స్వామి కోరారు. మున్సిపల్ కార్పొరేషన్ పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో మార్కండేయకాలనీలోని తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి మేయర్ శుక్రవారం పూలమాల వేసి నివాళి అర్పించారు. చేనేత కార్మికులు బండి రాజన్న, మొగ్గం రూపకల్పన, తాటికొండ రాజమౌళి, సీనియర్ ఉపాధ్యాయుడు గడ్డం జానకిరాములును శాలువాలతో సత్కరించి మాట్లాడారు. కార్పొరేటర్లు దాసరి సాంబమూర్తి, వెంగల బాపు, పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు బండారి రాజమల్లు, ప్రధాన కార్యదర్శి బూర్ల దామోదర్, గౌరవ అధ్యక్షుడు సిరిమల్ల జయరాములు, ముఖ్య సలహాదారులు సుంక లింగమూర్తి, సిరిపురం నరసయ్య, ముడతనపల్లి సారయ్య పాల్గొన్నారు. నాలాలను ఆక్రమిస్తే ఊరుకునేది లేదు నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ఊరుకునేది లేదని మేయర్ మహంకాళి స్వామి హెచ్చరించారు. 3వ డివిజన్లోని ప్రశాంత్నగర్, వినాయక్నగర్లో కార్పొరేటర్ వడ్లూరి రవితో కలిసి మేయ ర్ డివిజన్ సందర్శన చేపట్టారు. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్, కాలువల్లో పూడికతీత, చెట్లకొమ్మలు, పిచ్చిచెట్లు, పొదలతొలగింపు పనులు పరిశీలించి పలు సూచనలు చేశారు. అసిస్టెంట్ కమిషనర్ సంపత్కుమార్, ఏఈలు తేజస్విని, మనోజ్, శానిటరీ ఇన్స్పెక్టర్ నాగభూషణం, జూనియర్ అసిస్టెంట్ చంద్రారెడ్డి, ఎన్విరాన్ మెంటల్ ఇంజినీర్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు. తల్లిపాలు అమృతంతో సమానం ఫెర్టిలైజర్సిటీ: తల్లిపాలు అమృతంతో సమానమని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. గౌతమినగర్లో 21, 22, 23 46వ డివిజన్ అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మేయర్ మాట్లాడారు. అనంతరం గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన చేశారు. కార్పొరేటర్లు కన్నూరి భాగ్యలక్ష్మి, బెంద్రం సునీత, ఐసీడీఎస్ సూపర్వైజర్ మమత, మెడికల్ ఆఫిసర్ అలేఖ్య తదితరులు పాల్గొన్నారు. -
రైలు రాకపాయె!
పదేళ్లు అయిపాయెగోపాల్రావుపల్లి.. అనుపురం మధ్య ప్రారంభమైన రైల్వే వంతెన పనులుసాక్షిప్రతినిధి, కరీంనగర్ ●: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు హైదరాబాద్కు రైల్వే ద్వారా రాకపోకలు సాగించేందుకు కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వే ప్రాజెక్టు పనులు ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయ్యాయి. 2016 ఆగస్టు 7న అప్పటి సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయించారు. హైదరాబాద్– మనోహరాబాద్– సిద్దిపేట– సిరిసిల్ల– వేములవాడల మీదుగా కరీంనగర్ చేరుకునేలా రూటు డిజైన్ చేశారు. భూసేకరణ, పరిహారం, బడ్జెట్ కేటాయింపుల్లో సమస్యలతో ప్రాజెక్టు రోజురోజుకు జాప్యమవుతోంది. రాజధాని హైదరాబాద్– పాత కరీంనగర్ జిల్లాకు కనెక్టివిటీ పెంచాలన్న ఉద్దేశంతో అప్పటి సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు పెద్దపీట వేశారు. తొలి ఐదేళ్లు వచ్చే నష్టాలను భరించేందుకు కేంద్రాన్ని ఒప్పించి మరీ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లా ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. 17 స్టేషన్లతో 151 కిలోమీటర్ల దూరం మేర విస్తరించిన ఈ ప్రాజెక్టుకు ఆరంభ వ్యయం రూ.1,167 కోట్లు కావడం గమనార్హం.కొత్తపల్లిలో 3 గుంటలు సేకరణకొత్తపల్లి రైల్వేస్టేషన్ వద్ద ఇటీవల ఓ ఆశ్చర్యమైన ఘటన చోటు చేసుకుంది. స్టేషన్ సమీపంలో నిర్మించిన సీసీ రోడ్డు కోసం రైల్వేకు అప్పగించేందుకు కరీంనగర్ రెవెన్యూ అధికారులు భూసేకరణ జరిపి భూమి అప్పగించారు. ఇటీవల తాము అప్పగించిన భూమి కన్నా మూడు గుంటల భూమి అధికంగా రైల్వే కోసం వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారికి పరిహారం ఇవ్వాలని పాత ఆర్డీవో మహేశ్వర్ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆ మూడు గుంటల భూమి కోసం నిబంధనల ప్రకారం.. ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చారు. త్వరలోనే మొత్తం 3 గుంటల భూమికి మార్కెట్ రేటు ప్రకారం.. పరిహారం చెల్లించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.పెరగనున్న కనెక్టివిటీఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి జిల్లావాసులకు రాజధానితో కనెక్టివిటీ పెరగడంతోపాటు వేములవాడ, కొమురవెల్లి, కొండగట్టు, ధర్మపురి వంటి పుణ్యక్షేత్రాలకు రాజధాని నుంచి భక్తులు పెరుగుతారు. కొత్తపల్లి– మనోహరాబాద్ హైదరాబాద్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. భవిష్యత్తులో ఉత్తరతెలంగాణలో హైదరాబాద్ సికింద్రాబాద్ డివిజన్లకు కీలకమైన రూట్గా మరింత ప్రాధాన్యం దక్కించుకోనుంది. సిరిసిల్ల, సిద్ధిపేట, జగిత్యాల జిల్లాలకు పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులను ఇటు హైదరాబాద్ అటు, మహరాష్ట్ర వైపు తరలింపు సులభతరంగా మారుతుంది. కొండగట్టు పరిసరాల్లోని రేర్ ఎర్త్ మెటల్స్ గనుల తవ్వకం మొదలై, ఎగుమతులనాటికి రైల్వే లైన్ అందుబాటులోకి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపిక
ధర్మారం: దొంగతుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికై నట్లు పీఈటీ నక్క శ్రీనివాస్ తెలిపారు. ప్రతిష్టాత్మక 65వ సుబ్రోతో కప్ ఇంట ర్నేషనల్ అండర్– 17లో జిల్లా నుంచి వీరు ఎంపికైనట్లు వివరించారు. భారత వైమానిక దళం ఏటా నిర్వహించే ఈ టోర్నమెంట్ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా వివరించారు. పోటీలకు వేల్పుల హరిణి, జంజీరాల రవళి, మోతే సాత్విక, మోతే హారతి, వడ్నాల వైష్ణవి, ముత్యాల శ్రీనిధి, గండికోట అంజలీ, ముత్యాల నందిని, ముల్కల హరిణి, కాంపెల్లి గౌతమి, భూపెల్లి భవ్యశ్రీ, బొంగాని హర్షి ణి, కలవేని శ్రీనిధి, పెరుక అక్షయ, ఎలిగేటి మధుప్రియ, పాలకుర్తి అనుప్రియ, మోతే అక్ష య, సామంతుల మానలు ఎంపికైనట్లు వివరించారు. వీరిని ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్రావు, ఉపాధ్యాలు అభినందించారు. జేఎంఈటీల నిరసన గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థ లో 2016, 2017 నుంచి పనిచేస్తున్న మైనింగ్ డిప్లొమా హోల్డర్లకు ప్రమోషన్ పాలసీ వెంట నే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఓసీపీ–1 సైటాఫీస్ వద్ద శుక్రవారం జేఎంఈటీలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కొ త్తగూడెంలో నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ ఇంజినీర్ మైనింగ్ ట్రైనీలు (జేఎంఈటీలు)ల కు మద్దతుగా ఈ ఆందోళన చేపట్టారు. అర్హత ఉన్నప్పటికీ సంవత్సరాల తరబడి తమకు ప్ర మోషన్లు నిలిచిపోయాయన్నారు. యాజమా న్యం చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హెడ్ ఓవర్ మెన్లు మాడుగు ల ప్రభాకర్రెడ్డి, మామిడి సాంబయ్య, కల్వల రమేశ్, వేముల రాజేశం, ఎలిగేటి ఆనందం, ఎం.సత్యనారాయణ, ఎ.రాజేశ్, నారాయణ, సమ్మయ్య, డీటీరావు పాల్గొన్నారు. మహిళా సాధికారత లక్ష్యం జ్యోతినగర్: మహిళా సాధికారత ఎన్టీపీసీ ల క్ష్యమని దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రా ఖీ సామంత అన్నారు. మేడిపల్లి సెంటర్లోని వృత్తి విద్యాశిక్షణ కేంద్రంలో మహిళలకు మూ డు నెలల ఉచిత బ్యూటిషియన్ కోర్సును ఆ మె శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. ఎ న్టీపీసీ ప్రభావిత, పునరావాస గ్రామాల అభివృద్ధికి సీఎస్సార్ ద్వారా ప్రత్యేక నిధులు విడుదల చేస్తోందన్నారు. మహిళలకు ప్రాథమిక బ్యూటిషియన్ నైపుణ్యాలను అందించడంపై దృష్టి పెడుతున్నామని తెలిపారు. తద్వారా స్వయం ఉపాధి అవకాశాలను అన్వేషించి, మరింత ఆర్థిక స్వాతంత్య్రం సాధించేలా ప్రోత్సాహం అందిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో దీప్తి మహిళా సమితి స భ్యులు, సీఎస్సార్ ప్రతినిధులు పాల్గొన్నారు. ‘మా గ్రామంలో మద్యం బంద్’ మంథని: గ్రామీణ సమాజంలో మద్యంతో ఏ ర్పడుతున్న అనేక సమస్యలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఽజిల్లాలో అనేక గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా మద్యం నిషేధానికి ఏకగ్రీవ తీ ర్మానాలు చేస్తున్నారు. ఇప్పటికే డివిజన్లో ప లు గ్రామాలు తీర్మానాలు చేసి అధికారులకు తమ నిర్ణయాలను తెలియజేశారు. మద్య ని షేధం సదరు గ్రామాల్లో అమలు అవుతోంది. తాజాగా శుక్రవారం మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో మద్య నిషేధానికి పంచా యతీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చే సింది. గ్రామసభలో మహిళలు, యువత పెద్దఎత్తున పాల్గొని మద్యంతో ఎదురవుతున్న ఇ బ్బందులను వివరించగా, గ్రామపెద్దలు, ప్ర జాప్రతినిధులు కలిసి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆర్డీవో సురేశ్ను కలిసి మద్యం నిషేధానికి సంబంధించిన వినతిపత్రాన్ని సమర్పించారు. గ్రామంలో మద్యం వి నియోగంతో కుటుంబాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని, గృహహింస ఘటనలు పెరుగుతున్నాయని, యువత చెడు అలవాట్లకు గురవుతోందని వినతిపత్రంలో పేర్కొన్నారు. పంచాయతీ పాలకవర్గం తీర్మానం ప్రకారం గ్రా మ పరిధిలో ఈనెల 15 నుంచి మద్యం అ మ్మకాలు పూర్తిగా నిషేధించాలని నిర్ణయించారు. అక్రమంగా మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకోవాలని, జరిమానా విధించాలని కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు గ్రామంలో ప్రత్యేక పర్యవేక్షణ కమి టీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
కొత్త పింఛన్లు15 నుంచి..
● పంపిణీకి అధికారుల కసరత్తు ● దరఖాస్తుదారుల్లో ఆశలు పెద్దపల్లి: కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న దరకాస్తుదారులకు త్వరలోనే లబ్ధిచేకూరనుంది. ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక కార్చారణ రూపొందించింది. ఈనెల 15 నుంచి కొత్త పింఛన్దారులకు డబ్బులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి సీతక్క ఇటీవల ప్రకటించడంతో అర్హుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. చిగురిస్తున్న ఆశలు జిల్లాలో వేలాది మంది దరఖాస్తుదారులు పింఛన్ల కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. అర్హత ఉన్నకొత్త లబ్ధిదారులతోపాటు కుటుంబ పరిస్థితుల్లో మార్పులు వచ్చిన వారికి కూడా పింఛన్లు మంజూరు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ముఖ్యంగా పింఛన్ పొందుతున్న వ్యక్తి మరణించినా అర్హత ఉన్నభార్యకు వెంటనే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించింది. సర్కారు నిర్ణయంతో హర్షం మృతుల కుటుంబాలకు పింఛన్ మంజూరు చేయాలనే నిర్ణయం క్షేత్రస్థాయిలో ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదనే విమర్శలున్నాయి. పింఛన్ మార్పిడి కోసం దరఖాస్తు చేసి చాలామంది ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ధ్రువపత్రాలు సమర్పించినా మంజూరు ప్రక్రియ ఆలస్యమవుతోందని దరఖాస్తుదా రులు వాపోతున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇలాంటి వేలాది మందికి ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. మన జిల్లాలోనే సుమారు 10 వేల మంది కొత్త లబ్ధిదారులు లేదా మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారని, వారికి లబ్ధిచేకూరుతుంని అధికార వర్గాల అంచనా. ఇతరులపై ఆధారపడకుండా.. వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు ఆర్థిక అవసరాల కోసం ఇతరులపై ఆధారపడకుండా ప్రభుత్వం ప్రతినెలా చేయూత పేరిట పింఛన్లు అందిస్తోంది. అయితే, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, గీత, చేనేత, బీడీ కార్మికులు, బోదకాలు, డయాలసిస్ పేషెంట్లు, ఒంటరి మహిళలు మూడేళ్లుగా కొత్త పింఛన్ల కోసం ఏళ్లకింద దరఖాస్తు చేసుకున్నారు. వీరు జిల్లా, మండల, గ్రామ పంచాయతీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఇప్పటికీ పింఛన్లు మంజూరు కాక తీవ్ర నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో వీరందరూ సంతోషంతో ఎదురు చూస్తున్నారు. జిల్లాలో పింఛన్దారులు -
విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకోవాలి
పెద్దపల్లి: విద్యార్థులు నిర్దేశిత లక్ష్యం సాధించాలని ప్రభుత్వ విప్ విజయరమణారావు సూచించారు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథ మ సంవత్సరం విద్యార్థులకు శుక్రవారం స్వాగతం పలుకుతూ ‘ఆరంభ్–2026’ పేరిట ఫ్రెషర్స్ డే ఘ నంగా నిర్వహించారు. విప్తోపాటు పలువురు అతిథులు మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణ, కృషి, పట్టుదలతో ముందుకు సాగాలన్నారు. విద్యా సౌకర్యాలు, స్కాలర్షిప్లు, మధ్యాహ్న భోజనం, ఉపా ధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సుల్తానాబాద్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు విప్ విజయరమణారావు చెప్పారు. అనంతరం శ్రీవెంకటేశ్వర చేనేత సొసైటీ వద్ద పద్మశాలీ సంఘం నిర్వహించిన కార్యక్రమంలో భక్త మార్కండేయ, తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటాలకు విప్ పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్పర్సన్ పుష్పలత, ప్రిన్సిపాల్ నల్ల రాంచంద్రారెడ్డి, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు వేముల రామ్మూర్తి, ప్రధాన కార్యదర్శి ఐల రమేశ్, ఉపాధ్యక్షుడు సాయిరి మహేందర్, ఓదెల దేవస్థానం చై ర్మన్ చీకట్ల మొండయ్య, చేనేత సొసైటీ అధ్యక్షురా లు గోలి పద్మ, కౌన్సిలర్ గాదాసు మంజుల, పద్మ శాలీ యువజన సంఘం అధ్యక్షుడు మేరుగు యా దగిరి, మండల అధ్యక్షుడు గుండ మురళి, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
అభ్యసన సామర్థ్యం పెంపు లక్ష్యం
● పక్కాగా ఎఫ్ఎల్ఎన్ అమలు ● కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలుపెద్దపల్లి: ఎఫ్ఎల్ఎన్ను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారానే విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యం పెంపు సాధ్యమని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. జిల్లాలోని 180 ఎఫ్ఎల్ఎన్ కాంపిటెంట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యాచరణపై సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. చదవడం, రాయడం, గణితంలో ప్రాథమిక నైపుణ్యాలను ప్రతీవిద్యార్థి తప్పనిసరిగా సాధించేలా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. ఎంఈవోలు, కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు తరచూ పాఠశాలలను సందర్శించి ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాల అమలు తీరు పరిశీలించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి శారద, ఏఎంవో పీఎం షేక్, డీఆర్పీలు, ఎంఈవోలు, కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు, 180 ఎఫ్ఎల్ఎన్ కాంపిటెంట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి గ్రామాల్లో భూగర్భ జలాలను పెంపొందించేందుకు జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ, వీబీజీ రామ్ జీ పథకం ద్వారా నీటి సంరక్షణ నిర్మాణాలను పెద్దఎత్తున చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో జలసిరిపై కలెక్టర్ సమీక్షించారు. గ్రామాల్లో ప్రతిపాదించిన వ్యక్తిగత ఇంకుడుగుంతలు, సామూహిక ఇంకుడుగుంతలు, పంట కుంటల నిర్మాణాలను నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో కాళిందిని, ఎంపీడీవోలు తదితరులు తదితరులు పాల్గొన్నారు. -
నవోదయ కావాలి
సాక్షి పెద్దపల్లి: పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జిల్లాగా, తలసరి ఆదాయంలో రాష్ట్రంలో అగ్రస్థానాల్లో నిలిచిన పెద్దపల్లి జిల్లాకు ఇప్పటికీ జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటుకు నోచుకోలేదు. జిల్లా ఏర్పడి ఏళ్లు గడిచినా గ్రామీణ ప్రాంతాల పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందించే నవోదయ విద్యాలయం కోసం ప్రజలు, విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు నిరంతరం డిమాండ్ చేస్తున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తమవుతోంది. ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, కేశోరాం, జెన్కో, సింగరేణి వంటి జాతీయ స్థాయి పరిశ్రమలకు నిలయమైన జిల్లా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నా, నవోదయ విద్యాలయానికి నోచుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. స్థానిక ప్రజల చిరకాల వాంఛ అయిన నవోదయ సాధనలో స్థానిక ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక చొరవ తీసుకోవాలని విద్యావేత్తలు, ప్రజలు కోరుతున్నారు. జిల్లాకు నవోదయ విద్యాలయం సాధించడంలో స్థానిక ఎంపీ గడ్డం వంశీకృష్ణ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. లోక్సభలో ఈ అంశాన్ని ప్రస్తావించడం, కేంద్ర విద్యాశాఖ మంత్రి, నవోదయ విద్యాలయ సమితి అధికారులతో సమావేశమై జిల్లా అవసరాన్ని వివరించడం, రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసి భూ కేటాయింపును వేగవంతం చేయించడం, జిల్లా యంత్రాంగంతో కలిసి మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం ద్వారా జిల్లాకు నవోదయ మంజూరయ్యే అవకాశాలు మెరుగుపడతాయని వారు సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 9 నవోదయ విద్యాలయాలు ఉండగా, మరో 7 పాఠశాలలకు అనుమతి ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. తెలంగాణలో ఇప్పటికే చాలా జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు విజయవంతంగా కొనసాగుతున్నా, పెద్దపల్లి జిల్లా మాత్రం ఇప్పటికీ ఆ అవకాశానికి దూరంగా ఉండడం విద్యార్థులు, తల్లిదండ్రులను నిరాశకు గురిచేస్తోంది. ప్రైవేట్, కార్పొరేట్ విద్యను భరించే ఆర్థిక స్థోమత లేని కుటుంబాలకు నవోదయ విద్యాలయం ఒక గొప్ప అవకాశమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. -
పంటలు ఎండిపోకుండా ఎస్సారెస్పీ నీరు
ఓదెల(పెద్దపల్లి): రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోకుండా సీఎం దృష్టికి తీసుకెళ్లి ఎస్సారెస్పీ నీరందిస్తానని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. గురువారం ఓదెల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో అనిల్రెడ్డి అధ్యక్షతన జరిగిన మండల సభలో మాట్లాడారు. ప్రస్తుతం కురిసిన వర్షాలు పంటల సాగుకు సరిపోతాయని, మున్ముందు పంటలు ఎండిపోకుండా చివరి భూములకు నీరందిస్తానన్నారు. వచ్చే సమావేశాలకు వ్యవసాయ అధికారులు పూర్తి సమాచారంతో రావాలన్నారు. కుంటలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల అన్యాక్రాంతంపై సర్పంచులు తీర్మానం చేసి సంబంధిత అధికారులకు ఇవ్వాలని సూచించారు. రూపునారాయణపేటకు విద్యుత్ సబ్స్టేషన్ మంజూరయినట్లు పేర్కొన్నారు. స్థలాన్ని గుర్తించి వేగంగా ప్రతిపాదనలు పంపాలని తహసీల్దార్ను ఆదేశించారు. అనంతరం హరిపురం సర్పంచ్ గ్యారవేని విజయనాగరాజు మాట్లాడుతూ, కొలనూర్ నుంచి హరిపురం దారిలో నాగులకుంట వద్ద కల్వర్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. జీలకుంట, గోపరపల్లె సర్పంచులు రాగిడి మంగ, మద్దెవెని రవిలు మాట్లాడుతూ, గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ఆయా శాఖల అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి రంగారెడ్డి, డీఎల్పీవో దేవకిదేవి, తహసీల్దార్ వనజానాయక్, ట్రాన్స్కో ఏడీఏ రవీందర్, డీఈఈ పద్మ పాల్గొన్నారు. -
ఆశల ‘పోతలు’
ఇటీవల కురిసిన వర్షాలు రైతుల్లో గంపెడాశలు నింపాయి. ఎండిపోతున్న ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారగా, మిడ్మానేరు, లోయర్ మానేరు డ్యాంలను ఎత్తిపోతలతో నింపుతున్నారు. ఎల్లంపల్లి నంది పంప్హౌజ్ నుంచి రోజూ 4 మోటార్లతో 12,600 క్యూసెక్కుల నీటిని నంది మేడారం రిజర్వాయర్లోకి నీరు ఎత్తిపోస్తున్నారు. ఇక్కడి నుంచి ఎగువ, దిగువ మానేరుతో పాటు కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, సిద్దిపేట జిల్లాలకు తాగు, సాగు నీటికి కాస్త ఉపశమనం కలిగిందంటున్నారు సంబంధిత అధికారులు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
పనైపోయిందా.. పట్టింపు గోవిందా
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోళ్ల సమయంలో వినియోగించే ఎలక్ట్రానిక్ తూకం మిషన్లను భద్రపరచాల్సిన అధికారులు, సిబ్బంది ఇలా కార్యాలయంలో నిర్లక్ష్యంగా పడేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షల విలువైన మిషన్లను పనిలేని సమయంలో భద్రపరచకుండా పనికిరాని వస్తువుల్లా పడేయడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. వర్షాలు, దుమ్ము, తేమ కారణంగా మిషన్లు దెబ్బతినే అవకాశం ఉందని, బాధ్యులపై చర్యలు తీసుకొని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. – పెద్దపల్లి -
నవోదయ లేకపోవడం సిగ్గుచేటు
ఎన్టీపీసీ, సింగరేణి, ఆర్ఎఫ్సీఎల్ వంటి భారీ పరిశ్రమలతో కోట్లాది రూపాయల ఆదాయం ఇస్తున్న జిల్లాలో నవోదయ పాఠశాల లేకపోవడం సిగ్గుచేటు. అలాగే రామగుండంలో మరో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసేలా స్థానిక ఎంపీ, ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు చేయాలి. – చిలుక శంకర్, ఐఎఫ్టీ అనుబంధ సంఘం నాయకుడు జిల్లాకు నవోదయ విద్యాలయాన్ని సాధించడం ప్రజాప్రతినిధుల బాధ్యత. స్థానిక ఎంపీ పూర్తిగా విఫలమయ్యారు. నవోదయ అంశంపై స్థానిక ఎంపీ కేంద్ర ప్రభుత్వంతో సమర్థవంతంగా చర్చించి జిల్లాకు మంజూరు చేయించడంలో చొరవ చూపాలి. – బండి రాజశేఖర్, ఏబీవీపీ జిల్లా కన్వీనర్ -
మొక్కుబడిగా ‘వార్డు బాట’
రామగుండం బల్దియా 7వ డివిజన్లో గురువారం నిర్వహించిన ‘వార్డు బాట’ కార్యక్రమం అధికారుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. మేయర్ స్వామి, కమిషనర్, అధికారులు పర్యటించిన రోడ్డుపైనే ఒకవైపు బురద, మరోవైపు ప్రమాదకర మ్యాన్హోల్ కనిపించింది. అదే మార్గంలో నడుచుకుంటూ వెళ్లిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ మ్యాన్హోల్ను దాటుకుని వెళ్లారే తప్ప.. వెంటనే మూత ఏర్పాటు చేయాలని, ప్రమాద సూచికలు పెట్టాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధికారుల తనిఖీలు కేవలం మొక్కుబడిగానే సాగుతున్నాయనడానికి ఈ దృశ్యమే నిదర్శనమని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. -
విద్యుత్ తీగలు సరి చేయండి
కోల్సిటీ(రామగుండం): నగరంలో వేలాడుతున్న విద్యుత్ తీగలను వెంటనే సరి చేయాలని ఎన్పీడీసీఎల్ అధికారులను రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి ఆదేశించారు. గురువారం 7వ డివిజన్ జీఎంకా లనీలో మున్సిపల్ కమిషనర్ జె.అరుణ్శ్రీ, కార్పొరేటర్ వెగోలపు రమాదేవి––శ్రీనివాస్తో కలిసి పర్యటించారు. చేతికి అందేంత ఎత్తులోనే విద్యుత్ తీగలు ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కార్పొరేటర్, కాలనీవాసులు మేయర్ దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే ట్రాన్స్కో ఏఈకి ఫోన్ చేసి సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారం కావాలని ఆదేశించారు. వర్షాకాలానికి కంటే ముందే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేసినా సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ పట్టించుకోకపోవడంతో వాటిని ఆనుకొని ఉన్న 2ఏ మోరీ, వీర్లపల్లి, రామగుండం ప్రాంతాలు జలమయమయ్యాయన్నారు. అసిస్టెంట్ కమిషనర్ సంపత్కుమార్, ఈఈ శాంతిస్వరూప్, టీపీఎస్ నవీన్, ఏఈలు అన్వేశ్, మనోజ్, నరేశ్, శానిటరీ ఇన్స్పెపక్టర్ నాగభూషణం పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులకు అనుమతివ్వండి
గోదావరిఖని: రామగుండం నియోజకవర్గం అభివృద్ధి పనులకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ కోరారు. గురువారం హైదరాబాద్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. నియోజకవర్గంలో ప్రతిపాదిత 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మాణం, ఈఎస్ఐ హాస్పిటల్, రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణంతో పాటు ఇతర పనులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి అవసరమైన అనుమతులు త్వరగా మంజూరై పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై సానుకూలంగా పరిశీలించి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లుపెద్దపల్లి: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ శ్రీరాములు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వేడుకలు కలెక్టరేట్లో జరుగుతాయని, పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలన్నారు. ప్రొటోకాల్ ప్రకారం సీటింగ్, వైద్య శిబిరాలు, అంబులెన్స్ తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి.గంగయ్య, కలెక్టరేట్ పరిపాలన అధికారి బండి ప్రకాష్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఐటీఐల్లో రెండో దశ ప్రవేశాలకు దరఖాస్తులు పెద్దపల్లి: ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యంలోని ఐటీఐలు, ప్రైవేట్ పాలిటెక్నిక్ సంస్థలు, ఏటీసీల్లో 2026–27 విద్యాసంవత్సరానికి రెండో దశ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎస్సెస్సీ మెమో తదితర ధ్రువపత్రాలతో iti.telangana.gov.inలో రూ.100 రుసుముతో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ఐటీఐ పెద్దపల్లి ప్రిన్సిపాల్ వెంకట్రెడ్డి తెలిపారు. దరఖాస్తు అనంతరం విద్యార్థులు తమ సమీపంలోని హెల్ప్లైన్ కేంద్రానికి వెళ్లి ఈ–మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ను ధ్రువీకరించుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ, జిల్లా పరిశ్రమల అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి పెద్దపల్లి: రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కుండె గణేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మంచిర్యాల వెళ్తున్న సందర్భంగా పెద్దపల్లి కమాన్ చౌరస్తా వద్ద ఆయనకు బీజేవైఎం నాయకులు స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా గణేశ్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని సుమారు 40 లక్షల మంది విద్యార్థులకు అందాల్సిన రూ.15 వేల కోట్ల రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలన్నారు. తమ హక్కులను కోరుతున్న విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్‘గా అభివర్ణించడం సీఎం రేవంత్రెడ్డి అహంకారానికి, విద్యార్థులపై నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని విమర్శించారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యార్థులకు అన్యాయం చేశాయని ఆరోపించారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించకుంటే బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా కన్వీనర్ రామగిరి అఖిల్కుమార్, ఉప్పు కిరణ్, శివంగారి రాజేశ్, అన్వేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సోలార్ పనులు పూర్తి చేయండి
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మండలకేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో పీఎం కుసుము పథకంలో చేపట్టిన సోలార్ పవర్ ప్లాంట్లో ఈనెల 10 వరకు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేలా పనులు పూర్తి చేియాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మండలకేంద్రంలోని పాండవుల గుట్టపై నిర్మిస్తున్న సోలార్ ప్లాంట్ను గురువారం కలెక్టర్ సందర్శించారు. పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని ప్రక్రియలు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. తహసీల్దార్ రాపెల్లి రాముడు, పీఏసీఎస్ చైర్మన్ చదువు రాంచంద్రారెడ్డి, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, సీఈవో కోలేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల అంచనాలు సిద్ధం చేయాలి ముత్తారం(మంథని): గ్రామాల్లో అభివృద్ధి పనులు గుర్తించి అంచనాలు త్వరగా సిద్ధం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. గురువారం ముత్తారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. అధికారులు క్షేత్రస్థాయిలో పని చేస్తూ ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలన్నారు. వీబీజీరామ్జీ పథకంలో అభివృద్ధి పనులు నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయం, విద్య, వైద్యం, తాగునీరు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. సమావేశంలో పలువురు సర్పంచులు విన్నవించిన సమస్యలు విని, పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్పెషల్ ఆఫీసర్ రవీందర్, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, తహసీల్దార్ మధుసూదన్రెడ్డి, ఎంఈవో హరిప్రసాద్, మండల సర్పంచుల కన్వీనర్ బియ్యని శివకుమార్, సర్పంచులు పాల్గొన్నారు. -
ఎక్కువ మంది మహిళలు ఉండడం సంతోషకరం
కరీంనగర్అర్బన్: కలెక్టర్ చిత్రామిశ్రా పాలనలో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఒక మహిళ అధికారిగా ఆమె దిశానిర్ధేశం బాగుంది. ఎక్కువ సంఖ్యలో మహిళలే అధికారులుగా ఉండటం సంతోషకర పరిణామం. ప్రజలకు మరింత సేవ చేయాలనే కాన్ఫిడెన్స్ పెరిగింది. సహచరుల సహకారం, ఉన్నతాధికారుల మార్గదర్శకత్వం నాకు ప్రేరణగా నిలుస్తాయి. – షర్మిళ, కరీంనగర్ ఆర్డీవో కరీంనగర్అర్బన్: మహిళా అధికారిగా పనిచేయడం.. సమాజంలో మార్పు తీసుకురావడానికి లభించిన గొప్ప అవకాశం. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వద్ధులు, ట్రాన్స్జెండర్స్ సంక్షేమం కోసం పనిచేయడం ఎంతో ఆత్మసంతృప్తినిస్తుంది. ప్రతీ సవాలును ధైర్యంగా ఎదుర్కొంటూ.. అర్హులైన ప్రతీ లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేయడమే నా ప్రధాన లక్ష్యం. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం, వారి సమస్యలకు పరిష్కారం చూపడం నా ఉద్యోగంలో అత్యంత విలువైన అంశం. – సరస్వతి, జిల్లా సంక్షేమాధికారి, కరీంనగర్ పరిపాలనలో లభిస్తున్న అవకాశాలు, బాధ్యతలు మాపై మరింత జవాబుదారీతనాన్ని పెంచుతున్నాయి. ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించడమే మా ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం ప్రతీ రంగంలో మహిళలు రాణిస్తున్నారు. కుటుంబ, పరిపాలన బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలమని నిరూపిస్తున్నారు. ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, అంకితభావం ఉంటే ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చు. మహిళా సాధికారత అంటే సమాజంలో సానుకూల మార్పునకు నాయకత్వం వహించడం. ఆ దిశగా ప్రతి మహిళ ముందుకురావాలి. – అరుణశ్రీ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, పెద్దపల్లి -
స్కూల్ యూనిఫామ్ ధరించి విధులకు హాజరైన ఉపాధ్యాయుడు
కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి జెడ్పీహైస్కూల్ ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు కూరపాటి సత్యప్రకాశ్రావు బుధవారం స్కూల్ యూనిఫామ్ ధరించి విధులకు హాజరయ్యారు. విద్యార్థులతో మమేకమై పాఠాలు వింటూ, మొక్కలు నాటారు. తాను చదువుకునే సమయంలో కాళ్లకు కనీసం చెప్పులు, మంచిబట్టలు కూడా లేవని, చిరిగిన దుస్తులు ధరించి బడికి వెళ్లాలనని గుర్తు చేసుకున్నారు. బలపాలు ఉండేవి కావన్నారు. చెక్కపలకపై బొగ్గు, ఆకుపసరుతో అక్షరాలు రాసి చదువుకున్నామని తెలిపారు. కరెంట్ లేదని, కిరోసిన్ దీపాల వెలుగులో చదువుకున్నామన్నారు. పెన్నులు, పుస్తకాలు ఉండేవి కావని ఆయన చెబుతూ ఉంటే విద్యార్థులు విస్తుపోయారు. తాము అనేక కష్టాలతో విద్యాభ్యాసం చేశామని, ప్రస్తుతం ప్రభుత్వం అన్నీ ఉచితంగా అందిస్తోందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రూ.వేలు వెచ్చించి ప్రైవేట్ పాఠశాలల్లో చేరవద్దని, సర్కారు బడిలో ఉచిత విద్య నేర్చుకోవాలని సందేశం ఇచ్చేందుకే తాను స్కూల్ విద్యార్థుల యూనిఫాం ధరించి విధులకు హాజరయ్యానని సత్యప్రకాశ్రావు అనంతరం విలేకరులకు వివరించారు. ఆయన ఇప్పటికే అనేకమంది పేదల విద్యార్థులకు ఫీజు చెల్లించారు. డిక్షనరీలు, నోటుపుస్తకాలు, విద్యాసామగ్రి ఉచితంగా అందజేశారు. అనేకసార్లు రక్తదానం చేశారు. తెలంగాణ ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. ఒకేపేజీలో 12 నెలల క్యాలెండర్ రూపొందించారు. అనేక ప్రత్యేకతలు ఉన్న ఆయనను పలువురు అభినందించారు. -
ఆమె సంతకం
● మహిళా అధికారులు.. పాలనలో ఆదర్శమూర్తులు ● ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 45 మంది అధికారిణులు ● అభివృద్ధి.. సంక్షేమం పరుగులు ● ఆదర్శంగా నిలుస్తున్న లేడీబాస్లు ఒక ఇంటిని చక్కదిద్దడమే కాదు, ఒక జిల్లాను, పరిపాలనా వ్యవస్థను ఎంత సమర్థంగా నడిపించగలరో మహిళా అధికారులు చేసి చూపుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పరిపాలన, సంక్షేమ పథకాల అమలు, న్యాయసేవలు, అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నారు. సేవాభావం, నాయకత్వపటిమతో కొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న మహిళా అధికారులు నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ‘కలలు కనండి... కష్టపడండి... నాయకత్వం వహించండి’ అనే నమ్మకాన్ని బలపరుస్తున్నారు. -
కాలువలోపడి సెక్యూరిటీ సూపర్వైజర్ మృతి
రామగుండం: స్థానిక ఇండియన్ ఆయిల్ కా ర్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్)లో సెక్యూరిటీ సూపర్వైజర్గా పనిచేస్తే నయీం(50) పెద్ద పల్లి జిల్లా రామగుండం అక్బర్నగర్లోని ఎన్టీపీసీ బూడిద కాలువలో బుధవారం ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడు. ఎస్సై సంధ్య కథ నం ప్రకారం.. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్కు చెందిన నయీం స్థానిక ఐవోసీ లో సెక్యూరిటీ సూపర్వైజర్గా పనిచేస్తున్నా డు. అక్కడి నుంచి రోజూ రైలులో వచ్చి వెళ్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం విధులు ము గించుకొని ద్విచక్ర వాహనంపై రైల్వేస్టేషన్కు వెళ్తుండగా అక్బర్నగర్లోని బూడిదకాలులో బైక్ అదుపు తప్పి పడి చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొన్నారు. ఆస్తికోసమే తండ్రి హత్య ● మద్యానికి డబ్బులు ఇవ్వడంలేదని ఆగ్రహం ● తండ్రిని చంపిన కుమారుడి అరెస్ట్ ఓదెల: మద్యం కోసం డబ్బులు ఇవ్వడంలేదని, హతమార్చితే ఆస్తి మొత్తం దక్కించుకోవచ్చుని భావించిన మేకల బాబురావు తన తండ్రి మేకల మాదయ్య(76)ను హత్య చేసినట్లు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సీఐ రంజిత్రావు, పొత్కపల్లి ఎస్సై సనత్కుమార్రెడ్డి తెలిపారు. సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఘటన వివరాలు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన బాబురావు ఉద్యోగం చేయకుండా మద్యం, గుట్కాకు బానిసయ్యాడు. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి అయిన తనతండ్రిని మంగళవారం పింఛన్ డబ్బులు ఇవ్వాలని అడుగగా.. తనవద్ద లేవని చెప్పాడు. ఆగ్రహంతో ఇంట్లోఉన్న పెద్దరాయిని తండ్రి చాతి, తల, కాళ్లపై తీవ్రంగా బాదాడు. దీంతో మాదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత నిందితుడు పారిపోయాడు. మడక బస్స్టాప్ వద్ద నిందితుడు ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడకు వెళ్లి అరెస్టు చేశారు. మృతుడి పెద్దకూతురు చందా సరోజన ఫిర్యాదు మేరకు బాబురావుపై కేసు నమోదు చేసి ఓదెల కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ, ఎస్సై వివరించారు. సరదా కోసం వచ్చి.. గోదావరిలో మునిగి.. రామగుండం: మిత్రులతో కలిసి సరదా కోసం గోదావరినదికి వచ్చి చేపలు వేటాడుతూనే, స్విమ్మింగ్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు గుంతలో పడి మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడ శివారు లో బుధవారం జరిగింది. ఎస్సై వెంకటస్వా మి కథనం ప్రకారం.. గోదావరిఖని వకీల్పల్లిగనిలో విధులు నిర్వహించే సింగరేణి ఉద్యోగి కూన రాజ్కుమార్(32) బుధవారం మిత్రుల తో కలిసి గోలివాడ శివారులోని గోదావరినది వద్దకు వచ్చాడు. మిత్రులతో కలిసి సరదాగా చేపలు పడుతూ నీటిలో స్విమ్మింగ్ చేస్తూ ఉన్నాడు. ఈక్రమంలో రాజ్కుమార్ నీటిలో మునిగి కనిపించకుండా పోయయాడు. మిత్రులు ఆందోళన చెంది పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై వెంటనే రెస్క్యూ టీంతో వచ్చిగాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. రాజ్కుమార్ ప్రస్తుతం మంచిర్యాల జిల్లా మందమర్రిలోని గణేశ్నగర్లో నివాసం ఉంటున్నాడు. స్వగ్రామం పెద్దపల్లి జిల్లా నందిమేడారం. మృతుడికి భార్య అఖిల, కుమారుడు హరీశ్ ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై పేర్కొన్నారు. జ్యోతినగర్: తెలంగాణ ఉద్యమకారులను రాష్ట్రప్రభుత్వం విస్మరించడం బాధాకరమని తెలంగాణ ఉద్యమకారుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి శంకర్గౌడ్ అన్నారు. ఎన్టీపీసీ ఆటోనగర్ ఐఎఫ్టీయూ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయం, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎన్టీపీసీ పట్టణ కమిటీ బలోపేతం, సభ్యత్వ నమోదు, ఉద్యమకారుల సమస్యలపై భవిష్యత్ కార్యాచరణ, రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సమితి జనరల్ సెక్రటరీ చిలుక శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈదునూరి పర్వతాలు, శంకర్, వంశీ, చందు, సురేశ్, వోల్లాల మల్లేశ్, వీరాలాల్, మామిడాల శంకరయ్య, గుండేటి కిశోర్, నారాయణ, మల్లేశ్, కుమార్, పొన్నం విజయ్గౌడ్, మేకల సరోజన, శాంత తదితరులు పాల్గొన్నారు. -
ఎవరూ ఖాళీగా ఉండద్దు
జిల్లాలో నిరుద్యోగ సమస్య చాలా ఉంది. ఉద్యోగాలు కావాలని ప్రజావాణికి వస్తున్నారు. ప్రభుత్వ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కావాలని ఆశిస్తున్నారు. కానీ ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని స్వయం ఉపాధి సాధించాలి. ఆ దిశగా యువకుల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేశాం. యువకులు ఎవరూ ఖాళీగా ఉండొద్దు. వారి కోసమే జాబ్మేళాలు నిర్వహిస్తూ.. ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పిస్తున్నాం. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఉద్యోగావకాశాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాం. – నిర్మల, జిల్లా ఉపాధి కల్పన అధికారి -
బొగ్గు లారీలపై చర్య తీసుకోవాలి
● రామగుండం సీపీ అంబర్ కిశోర్ఝా గోదావరిఖని: నిబంధనలు విస్మరించి రాకపోకలు సాగిస్తున్న బొగ్గు లారీలపై చర్య తీసుకోవాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశించారు. తన కార్యాలయంలో బుధవారం జరిగిన శాంతిభద్రతలు, ట్రాఫిక్, రవాణాశాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. రోడ్డు ప్రమాదాల నివారణతోపాటు ప్రజల సురక్షిత ప్రయాణమే ప్రధాన లక్ష్యంగా రోడ్డు భద్రతా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. ఇసుక, బొగ్గు(కోల్), యాష్ తదితర రవాణా వాహనాలు టార్పాలిన్ కవర్లతో కప్పి తరలించాలని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని వాహన యజమానులు, డ్రైవర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరిమితికి మించి విద్యార్థులను తరలించే ఆటోలు, వాహనాపైనా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో సహాయం అందించే రహ్–వీర్ పథకంపై అవగాహన కల్పించాలని సూచించారు. రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, మంచిర్యాల డీటీవో గోపీకృష్ణ, రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల ట్రాఫిక్ సీఐలు రాజేశ్వరరావు, శ్రీనివాస్, హనన్, మంచిర్యాల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. పెట్టుబడుల్లో మోసాలపై అప్రమత్తం ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్పై అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ జా సూచించారు. స్థానిక ఇల్లెందు క్లబ్లో ‘సింగరేణి హెచ్వోడీలు, అధికారులకు సురక్షా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ’పై అవగాహన కల్పించారు. తొలుత ప్రచార పోస్టర్ విడుదల చేశారు. సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి, సింగరేణి ఆర్జీ–1 జీఎం లలిత్కుమార్, సైబర్క్రైం, గోదావరిఖని ఏసీపీలు రంగారెడ్డి, రమేశ్, గోదావరిఖని వన్టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్జల్, రామగుండం సైబర్క్రైం సీఐ శ్రీనివాస్, రాణాప్రతాప్, ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
మధుర జ్ఞాపకాలు.. గురువులకు సన్మానాలు
గోదావరిఖని మార్కండేయకాలనీ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ 1997 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఎన్టీపీసీ సింధూర కళాశాల రోడ్డులోని శ్రీమయి హాల్లో బుధవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఒకేవేదికపై కలుసుకున్న పూర్వవిద్యార్థులు చిన్ననాటి మధుర జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు మల్లికార్జున్రెడ్డి, వెంకటరమణ, రమేశ్, నాగరాజును శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలతో ఆత్మీయంగా సన్మానించారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. క్రాంతిసుధ, చిందం స్వరూప, స్నేహలత, స్వప్న, పందిల్ల స్వరూప, కరుణాకర్, శ్రీనివాస్, చంద్రశేఖర్, ధర్మేందర్, శివ, కృష్ణ, రవి పాల్గొన్నారు. – జ్యోతినగర్ -
బీఆర్ఎస్ వైఫల్యంతోనే సమస్యలు
రామగిరి: బీఆర్ఎస్ వైఫల్యాలతోనే సింగరేణి అనేక సమస్యల్లో చిక్కుకుందని కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ప్రసాద్ విమర్శించారు. ఐఎన్టీయూసీ ఆర్జీ–3 ఏరియా ఉపాధ్యక్షుడు కోట రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో సెంటినరీకాలనీ శ్రీపాదభవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుందని ఆరోపించారు. కోయగూడెం, సత్తుపల్లి బ్లాకులను కేంద్ర ప్రభుత్వంతో కుమ్మకై ్క తమ అనుకూల సంస్థలకు అప్పగించిన విషయాన్ని కార్మికులు మరచిపోలేదన్నారు. ఏఐటీయూసీ గుర్తింపు కార్మిక సంఘంగా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. నాయకులు నర్సింహారెడ్డి, ధర్మపురి, సదానందం, సత్యనారాయణరెడ్డి, గడ్డం తిరుపతి, ఎల్లంకి రామారావు, మడ్డి రాజ్కుమార్, బిక్షనాయక్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎగబడుతున్న కోతులు.. కుక్కలు● నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి కమాన్పూర్: రోజురోజుకూ గ్రామాల్లో కుక్కలు, కోతుల దాడులతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏదో ఒక గ్రామంలో కుక్కలు, కోతుల దాడిలో గాయపడిన సంఘనలు రోజూ చోటు చేసుకుంటున్నాయి. బుధవారం మండల కేంద్రంలో నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి చేయడంతో బాలుడి ముఖంపై గాయాలయ్యాయి. నరేశ్ అనే వ్యక్తిపై కోతులు దాడి చేయడంతో గాయాలయ్యాయి. మరో ఘటనలో బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులకు కుక్కలు అడ్డురావడంతో వాహనం అదుపుతప్పి కిందపడిపోగా స్వల్పగాయాలయ్యాయి. కమాన్పూర్ సర్పంచ్ రంగు సత్యనారాయణ, ఎంపీడీవో ప్రియాంక దృష్టికి తీసుకెళ్లారు. సంబంధితశాఖ అధికారులతో సమస్య పరిష్కారానికి అవరమైన చర్యలు చేపడుతామని తెలిపారు. -
సేవా చేయడం సంతృప్తినిస్తుంది
జగిత్యాలజోన్: జిల్లా ప్రధాన న్యా యమూర్తి పోస్టు ఒక్క ఉద్యోగంగా కాకుండా, కక్షిదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామనే తృప్తి మిగులుతుంది. ఓ వైపు ఉ ద్యోగం.. మరో వైపు కుటుంబ బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుండటంతో హ్యాపీగా గడిచిపోతుంది. మహిళా అధి కారులుగా ఆఫీసు పనుల్లో ఎంత ఒత్తిడికి గురైనా.. ఆ భావం మన ముఖంపై కనిపించొద్దు. చిరునవ్వుతోనే చాలా సమస్యలు పరిష్కరించవచ్చనేది నా అభిప్రాయం – సి.రత్న పద్మావతి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జగిత్యాల కుటుంబ సహకారంతో ఉన్నత స్థానానికి ఎది గాను. మనం ఏ రంగంలో ఉన్నా అందులో ఉన్నత స్థానానికి ఎదగాలన్న కాంక్ష ఉండాలి. మహిళలు ఉద్యోగం.. కుటుంబ బాధ్యతలకు సమన్యాయం చేస్తున్నారు. కుటుంబంతోపాటు సమాజాన్ని అధ్యయనం చేస్తుండడంతో మరింత మెరుగ్గా బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంటుందనేది నా అభిప్రాయం. – జి.సునీత–రవీందర్రెడ్డి, జిల్లా మొదటి అదనపు జడ్జి, జగిత్యాల ఓ వైపు జడ్జీగా ఉద్యోగానికి, మరోవైపు కుటుంబానికి తగిన ప్రాధాన్యం ఇస్తాను. కోర్టులో జరిగిన విషయాలను ఇంట్లో, కుటుంబ విషయాలను కోర్టుల్లో మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. ఎక్కడి బాధ్యతలు అక్కడే నిర్వర్తించుకోవాలి. మహిళా అధికారులుగా అనుకున్న లక్ష్యాలను సాధించి శభాష్ అనిపించుకోవాలి. – ఆర్.లావణ్య, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, జగిత్యాల -
మేయర్తో కార్పొరేటర్ల పిక్నిక్!
● డీజే కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత ● ఖండించిన మహంకాళి స్వామి కోల్సిటీ: రామగుండం మేయర్ మహంకాళి స్వామి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన పిక్నిక్లో పలువురు కార్పొరేటర్లతోపాటు వారి కుటుంబ సభ్యులు భారీసంఖ్యలో హాజరయ్యారు. బసంత్నగర్ సమీపంలోని బుగ్గ రామస్వామి ఆలయ పరిసరాల్లోని పిక్నిక్ స్పాట్ను సందర్శించిన సందర్భంగా సుమారు 40 మందికిపైగా కార్పొరేటర్లు తమ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు హాజరై సందడి చేశారు. ప్రజాప్రతినిధుల్లో జోష్.. తమకు తగిన ప్రాధాన్యం కల్పించడం లేదని, ప్రొటోకాల్ పాటించడం లేదని ఆరోపిస్తూ పార్టీలకు అతీతంగా పలువురు కార్పొరేటర్లు కొద్దిరోజుల క్రితం బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన కార్పొరేటర్ల శిక్షణకు కూడా ముగ్గురే హాజరుకాగా, మిగిలినవారు గైర్హాజరై నిరసన తెలిపారు. అనంతరం పలువురు కార్పొరేటర్లు మేడారంలోని సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో మేయర్ ఆధ్వర్యంలో జరిగిన పిక్నిక్కు అసంతృప్తి కార్పొరేటర్లతో జతకట్టిన కొందరు కార్పొరేటర్లు కుటుంబ సభ్యులతో హాజరుకావడం ప్రాధాన్యం సంతరించుకుంది. వారిని బుజ్జగించడానికే పిక్నిక్ ఏర్పాటు చేశారని ప్రచారం జరిగింది. అయితే పిక్నిక్ జోష్ నింపిందని పలువురు ప్రజాప్రతినిధులు వెల్లడిస్తున్నారు. డీజే కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత పిక్నిక్లో విందు, వినోద కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా డీజే కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నట్లు ప్రచారం జరిగినా... అలాంటిదేమీలేదని మేయర్ మహంకాళి స్వామి స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీతోపాటు తమకు మద్దతు ఇచ్చిన ఇతర పార్టీల కార్పొరేటర్లు, తన విజయానికి కృషి చేసిన కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయంగా గడిపేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, ప్రశాంతంగా, ఆనందంగా కార్యక్రమం ముగిసిందని మేయర్ ‘సాక్షి’కి తెలిపారు. -
తప్పుల్లేకుండా ‘భూభారతి’
పెద్దపల్లి: తప్పిదాలకు తావులేకుండా భూభారతి సేవలు అందించాలని అదనపు కలెక్టర్ శ్రీరాములు ఆదేశించారు. జూనియర్ అసిస్టెంట్లకు బుధవారం భూభారతిపై శిక్షణ ఇచ్చారు. శ్రీరాములు మాట్లాడుతూ, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన భూసేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అందుకు అనుగుణంగా సేవలు అందించాలని సూచించారు. డీ విభాగం పర్యవేక్షకుడు ధీరజ్, ట్రైనర్లు సతీశ్, శ్రీనివాసరెడ్డి, సయ్యద్ తాజ్, తదితరులు పాల్గొన్నారు. నేతకానిగా మార్చాలి రామగుండం: నే తకాని పేరుకు న్యాయం జరిగేంతవరకు పోరాటం ఆగదని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఢిల్లీ లో కేంద్ర సామాజిక, న్యాయ మంత్రి వీరేంద్రకుమార్ను బుధవారం ఎంపి కలిసి ఈమేరకు వినతిపత్రం అందించారు. గెజిట్లో నేతకాని సామాజికవర్గం పేరు నేట్కాని అని తప్పుగా నమోదు చేశారనినే మంత్రికి వివరించారు. దానిని నేతకానిగా సవరించాలని కోరారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ ఎంపీ పేర్కొన్నారు. ఉద్యోగాలకు ఎంపికపెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని ఐటీఐలో బుధవారం నిర్వహించిన మెగా అప్రెంటిస్ షిప్, జాబ్మేళాలో 364 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ బుసిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. మొత్తం 528 మంది హాజరుకాగా, 364 మంది ఉద్యోగాలకు అభ్యర్థులు ఎంపికయ్యారని తెలిపారు. కళాశాల సిబ్బంది, పలు కంపెనీలో ప్రతినిధులు పాల్గొన్నారు. ముగిసిన ఐసెట్ వెరిఫికేషన్ గోదావరిఖనిటౌన్: స్థానిక యూనివర్సిటీ పీజీ కళాశాలలో చేపట్టిన తొలివిడత ఐసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ బుధవారం ముగిసిందని ప్రి న్సిపాల్ మనోహర్ తెలిపారు. ఈనెల 3 నుంచి ఇప్పటివరకు 250 మంది విద్యార్థులు వెరిఫికేషన్లో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు. తమకు కేటాయించిన ఆప్షన్ల ద్వారా విద్యార్థు లు లాగిన్ ఇవ్వాలని సూచించారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్లు పొందేందుకు ఎస్యూజీఏఎస్ను తొలిప్రాధాన్యతగా ఇవ్వా లని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వెరిఫికేషన్ అధికారులు ప్రసాద్, సుధ, అంబిక, శ్యా మ్ప్రసాద్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. డిగ్రీలో ప్రత్యేక ప్రవేశాలు పెద్దపల్లి: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా స్పెషల్ ఫే జ్ అడ్మిషన్లు ప్రారంభమైన ట్లు ప్రిన్సిపాల్ లక్ష్మీనరసయ్య తెలిపారు. ఖాళీగా ఉన్నసీట్ల భర్తీ కోసం ఈనెల 6 నుంచి 11వ తేదీ వరకు ఈప్రియ చేపట్టామ ని వెల్లడించారు. కళాశాలలో బీకాం(బీఎఫ్ఎస్ఐ), బీఎస్సీ (బీజెడ్సీ–లైఫ్ సైన్సెస్), బీఎస్సీ(ఎంపీసీఎస్), బీఏ కోర్సుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయని, డిగ్రీలో ప్రవేశాల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
సాగుకు ఏఐ సాయం
సాక్షి పెద్దపల్లి: పొలంలో పంటను పీడిస్తున్న తెగులు ఏదో తెలియక ఆందోళన చెందుతున్నారా? ఏ కాలంలో ఏ పంట వేస్తే లాభసాటిగా ఉంటుందో లెక్కలు వేసుకుని తలపట్టుకుంటున్నారా? దిగుబడిని ఎక్కడ విక్రయించాలో, ఈరోజు మార్కెట్ డిమాండ్ ఎంత ఉందనే సందిగ్ధంలో ఉన్నారా? ఇకపై అన్నదాతలు ఈ సమస్యలన్నింటికీ ఆందోళన చెందాల్సిన పన్లేదు. ఆధునిక సాంకేతికతను జోడించి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసింది. ఏఐ (కృత్రిమ మేధ) సాయంతో కూడిన ‘భారత్ విస్తా ర్’ అనే అత్యాధునిక డిజిటల్ టూల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. విత్తనం నుంచి విపణి(మార్కెట్) వరకు సమస్త సమాచారాన్ని అరచేతిలో ఉంచుతున్న స్మార్ట్ యాప్పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. రైతులకు ప్రధాన ప్రయోజనాలివే.. ఏఐ టూల్ విశేషాలు -
విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన
● ప్రభుత్వ విప్ విజయరమణారావు కాల్వశ్రీరాంపూర్: పేదవిద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయయరమణారావు అన్నారు. గంగారం గ్రామపంచాయతీ పరిధిలోని ఊశన్నపల్లెలో రూ.32 లక్షల వ్యయంతో చేపట్టిన ప్రభుత్వ పాఠశాల అదనపు తరగతిగదులు, కంప్యూటర్ ల్యాబ్, సోలార్ పవర్ సిస్టమ్, సీసీ రోడ్లు తదితర పనులను సర్పంచు రేకుల జ్యోతితో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడుతూ, విశాలమైన గదులు, కంప్యూటర్ సాంకేతికతతో డిజిటల్ పాఠాలు చెప్పేస్థాయికి ఊశన్నపల్లి బడి చేరుకుందన్నారు. పందిల్ల, లక్ష్మీపురం, గంగారం, ఊశన్నపల్లె గ్రామస్తుల విజ్ఞప్తి మేర కు డబుల్రోడ్డు, కాలువ నుంచి ఎస్సీకాలనీ ద్వారా ఊశన్నపల్లెకు తారురోడ్డు నిర్మాణానికి నిధుల మంజూరు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు విప్ వెల్లడించారు. తహసీల్దార్ రాముడు, ఎంపీడీవో సురేందర్కుమార్, ఎంఈవో మహేశ్కుమార్, ఈఈ రమణారెడ్డి, హెచ్ఎం సమ్మయ్య, నాయకులు రామిడి తిరుపతిరెడ్డి, సారయ్యగౌడ్, మేడి అశోక్గౌడ్, గాజనవేన సదయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం
● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిని బుధవారం ఆయన తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని కలెక్టర్ సూచించారు. హైరిస్క్ గర్భిణులను గుర్తించి నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. మందులు, పరీక్షలు సకాలంలో అందించాలని శ్రీహర్ష అన్నారు. రక్షణ కల్పించాలి జిల్లాలోని ప్రతీచిన్నారికి భద్రత, విద్య, సంరక్షణ సేవలు అందించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో బాలల సంరక్షణ పథకం అమలుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. అనాథలను గుర్తించాలని, దివ్యాంగులు, మానసిక వైకల్యం కలిగిన పిల్లలకు సదుపాయాలు కల్పించాలని చెప్పారు. ఆరునుంచి పదో తరగతి వరకు చదువు మానేసిన పిల్లలను గుర్తించి బడిలో చేర్పించాలని సూచించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారిని ఏటీసీల్లో చేర్పిస్తే ఉపాధి కల్పించే అవకాశం ఉందని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. లక్ష్య సాధనకు సమష్టిగా పనిచేయాలి ‘ప్రతీచుక్క నీటితో అధిక పంట’ లక్ష్య సాధనకు అన్నిశాఖలు సమష్టిగా పనిచేసి ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్లో నిర్వహించగా ఆయన మాట్లాడారు. డీఆర్డీవో కాళిందిని, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్, డీసీవో శ్రీమాల, ఆర్డీవో మంథని సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయిపై డేగకన్ను
గోదావరిఖని: గంజాయి విక్రయాలపై డేగకన్ను వేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో నమోదైన 81 ఎన్డీపీఎస్ కేసుల్లో నిందితుల నుంచి స్వా ధీనం చేసుకున్న రూ.17.09 లక్షల విలువైన 40.173 కిలోల గంజాయిని బుధవారం ధ్వంసం చేసినట్లు సీపీ తెలిపారు. ఎండు గంజాయితోపాటు 26 మొక్కలనూ న్యాయస్థానం అనుమతితో ధ్వంసం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి, అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, గోదావరిఖని, జైపూర్, స్పెషల్బ్రాంచ్ ఏసీపీలు రమేశ్, వెంకటేశ్వర్లు, నాగేంద్రగౌడ్, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ అనిల్, ఎస్ఐ వినీత తదితరులు పాల్గొన్నారు. అధికారుల తీరు మారాలి పెద్దపల్లి: పోలీస్, రెవెన్యూ అధికారు లు ఫోన్లకు స్పందించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర ఉ పాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి విమర్శించారు. బుధ వారం జిల్లా కేంద్రంలోని తన నివా సంలో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో మాట్లాడారు. ప్రజలు అత్యవసర సమస్యలతో ప్రభుత్వ కార్యాలయాలకు ఫోన్చేస్తే స్పందన లేకపోవడం శోచనీయమన్నారు. అధికారుల తీరు మారాలని కోరారు. పట్టణంలోని పురాతన శివాలయంలో మైక్లు తొ లగించాలని ఓ కౌన్సిలర్ పోలీసులకు ఫిర్యాదు చేశారని, సుప్రభాతం, భక్తిగీతాలు, శివనామస్మరణ వంటి కార్యక్రమాలు తరాలుగా కొనసాగుతున్నాయని, వీటిపై అభ్యంతరం వ్యక్తం చేయడం సరికాదన్నారు. నాయకులు పల్లె సదానందం, శిలావేరు ఓదెలు, భూషణ్, వేణి శ్రీనివాస్గౌడ్, జంగ చక్రధర్రెడ్డి, పర్శ సమయ్య, మీస అర్జున్రావు, రాంసింగ్, పర్వతాలు పాల్గొన్నారు. -
విద్య, వైద్యంపై ఫోకస్
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ విద్యా, వైద్యంపై దృష్టి పెడుతున్నారు. గురుకులాలు, హాస్టళ్లు తరచూ తనిఖీ చేస్తున్నారు. పిల్లలతో కలిసి భోజనం చేస్తున్నారు. వారితో కలిసి పాఠాలు వింటున్నారు.. బోధి స్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రోగులతో మాట్లాడుతూ వైద్య సేవలపై ఆరా తీస్తున్నారు. ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలని ఆమె ఆదేశిస్తున్నారు. కలెక్టర్ చొరవతో రాష్ట్రంలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జిల్లా అగ్రస్థానంలో ఉంది. – సిరిసిల్ల -
జలసిరి పనులు వేగవంతం
రామగిరి: జలసిరి పనుల్లో వేగం పెంచాలని, గ్రామాల్లో నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని జెడ్పీ డిప్యూటీ సీఈవో సంజీవరావు సూచించారు. స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. జలసిరి, జల సంచయ్, జన భాగీదారి, వీబీ జీ రామ్జీపై పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్అసిస్టెంట్లతో సమీక్షించారు. వివిధ పనుల పురోగతి, గ్రామ సభల నిర్వహణ, ప్రజల భాగస్వామ్యంపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్రతీ గ్రామంలో జల సంరక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. పనుల్లో నాణ్యతతోపాటు పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో బి.శైలజారాణి, సూపరింటెండెంట్ ఉమేశ్, ఏపీఎం పద్మ, జూనియర్ అసిస్టెంట్లు ఎండీ షరీఫ్, స్వరూప పాల్గొన్నారు. జెడ్పీ డిప్యూటీ సీఈవో సంజీవరావు -
ఎరువులన్నీ ఒకేయాప్లో..
మంథనిరూరల్: పంటలు పండించే రైతులకు ఎరువుల కష్టాలు తీర్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఏడాది నుంచి యాప్ విధానం ప్రవేశపెట్టింది. యాప్ ద్వారా ఒక్క యూరియా తీసుకునే రైతులు.. కాంప్లెక్స్ ఎరువుల కోసం మరో దుకాణానికి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఒకేయాప్ ద్వారా యూరియాతోపాటు కాంప్లెక్స్ ఎరువులు పంపిణీ చేసేందుకు జిల్లా వ్యవసాయశాఖ సిద్ధమైంది. ఎరువుల కొరత లేకుండా.. ఈవానాకాలం సీజన్లో ఈసారి జిల్లావ్యాప్తంగా వ రి, పత్తి పంటలే అత్యధికంగా సాగుచేస్తున్నారు. సు మారు 2.15లక్షల ఎకరాల్లో వరి, 52 వేల ఎకరాల్లో పత్తి సాగు చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నా రు. పంటలకు సరిపడా ఎరువులను అందుబాటు లో ఉంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 31 వేల మెట్రిక్ టన్నుల యూరియా.. జిల్లావ్యాప్తంగా సాగుచేసిన పంటలకు సుమారు 31 వేల మెట్రిక్ యూరియా అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 24 వేల మెట్రిక్ టన్నులు రాగా పంపిణీ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే 5 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ అవసరం ఉంటుందని, ప్రస్తుతం కొంత కొరత ఉన్నట్లు వివరిస్తున్నారు. రైతులపై భారం తగ్గించేలా.. యూరియాతోపాటు కాంప్లెక్స్ ఎరువుల భారం తగ్గించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే యాప్ ద్వారా యూరియా అందిస్తున్న సర్కారు.. అదే యాప్ ద్వారా కాంప్లెక్స్ ఎరువులు అందించే దిశగా అడుగులు వేస్తోంది. అయితే, డీఏపీలాంటి ఎరువులు రైతులకు అదనపు భారం అవుతున్నాయి. ఫెర్టిలైబర్ దుకాణాల్లో డీఏపీ కొనుగోలుకు యజమానులు కొర్రీలు పెడుతున్న క్రమంలో యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 20 నుంచి అమలు యాప్ ద్వారా అన్నిరకాల ఎరువులను రైతులకు అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈనెల 20 నుంచి జిల్లాలో యాప్ ద్వారా పంపిణీ చేస్తాం. కొరత లేకుండా, రైతులపై భారం పడకుండా ఈ చర్యలు తీసుకుంటున్నాం. రైతులు ఆందోళన చెందకుండా యాప్ ద్వారా ఎరువులు తీసుకోవాలి. – శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి పట్టా లేని రైతులకు కష్టాలేనా? జిల్లాలో అనేకమంది రైతులు తమ భూములను పట్టాలు లేకున్నా సాగు చేస్తున్నారు. నిన్నామొన్నటి వరకు యూరియా కోసం ఇబ్బందిపడ్డ అ న్నదాతలు.. ఇకముందు కాంప్లెక్స్ ఎరువుల కో సం కష్టాలు తప్పవా? అనే అభిప్రాయాలు వ్య క్తం అవుతున్నాయి. పట్టాదారు పాసుపుస్తకం ఉండి ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకున్నవారికే యాప్ ద్వారా యూరియా అందిస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో పట్టా లేనిరైతులు ఎరువులు ఎట్లా? అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
‘గుర్తింపు’ కోసం తహతహ
గోదావరిఖని: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల జోష్ మొదలైంది. ఈసారి ఎలా గెలవాలనే దానిపై వివిధ యూనియన్లు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాయి. చివరిసారిగా 2023 డిసెంబర్ 23న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించగా, ఏఐటీయూసీ గెలుపొందింది. తొమ్మిది నెలల అనంతరం యాజమాన్యం గుర్తింపుపత్రంత్రా అందజేసింది. అప్పట్నేంచే గుర్తింపు యూనియన్గా కొనసాగుతోంది. ఈ లెక్కన సెప్టెంబరు 8వ తేదీతో గుర్తింపు యూనియన్ గడువు రెండేళ్లు ముగుస్తుంది. ఆ వెంటనే ఎన్నికలు నిర్వహించాలని, లేనిపక్షంలో అన్నికార్మిక సంఘాలను చర్చలు, కార్యక్రమాలకు ఆహ్వానించాలనే డిమాండ్ మొదలైంది. గడువు నెలరోజులే మిగిలి ఉండటంతో ఆర్ఎల్సీ, సింగరేణి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే. హోరాహోరీ పోరులో.. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిన 2023 డిసెంబర్లో నిర్వహించిన ఎన్నికల్లో గుర్తింపు కార్మిక సంఘంగా ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘంగా ఐఎన్టీయూసీ గెలుపొందాయి. సింగరేణిలో సుమారు 40వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారి సమస్యల పరిష్కారంపై గుర్తింపు, ప్రాతినిధ్యం సంఘాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. 1998లో సింగరేణిలో మొదటి ఎన్నికలు సింగరేణిలో అసవసర సమ్మెలు తగ్గించేందుకు అప్పటి సీఎం తొలిసారి 1998 సంవత్సరంలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఏడుసార్లు ఎన్నికలు జరిగాయి. ఏఐటీయూసీ అత్యధిక సందర్భాల్లో గెలిచింది. బీఆర్ఎస్ హయాంలో దాని అనుబంధ టీబీజీకేఎస్ రెండుసార్లు గెలుపొంది సుమారు పదేళ్లపాటు గుర్తింపు హోదాతో అనేక ఒప్పందాలు చేసుకుంది. ఎన్నికలు వెంటనే నిర్వహించాలి సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించాలని ఏఐటీయూసీ మినహా మిగతా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకోసం తమ పట్టు నిరూపించుకునేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నాయి. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించిన ఆదిలో రెండుసార్లు రెండేళ్లు, తర్వాత నాలుగు సార్లు నాలుగేళ్ల కాలపరిమితి ఉంది. ప్రస్తుతం రెండేళ్ల గడువు ఉండగా.. దానిని నాలుగేళ్లకు పెంచాలని ఏఐటీయూసీ కోరుతోంది. 2017లో రెండేళ్ల కాలపరిమితితో గుర్తింపు పొందిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాలుగేళ్లు కావాలని డిమాండ్ చేసింది. వివిధ కారణాలతో ఐదేళ్లపాటు గుర్తింపు సంఘంగా కొనసాగింది. సింగరేణిలో కార్మిక సంఘం ఎన్నికలు? పోటీకి సిద్ధమవుతున్న వివిధ యూనియన్లు నాలుగేళ్ల కాలపరిమితికి ఏఐటీయూసీ డిమాండ్ సెప్టెంబరుతో ముగియనున్న ప్రస్తుత ‘గుర్తింపు’ గడువు -
కార్మికులకు అందని డ్రిల్బిట్లు
గోదావరిఖని: రామగుండం రీజియన్లోని జీడీకే–11గని కార్మికులు పనిముట్లు అందక ఇబ్బంది పడుతున్నారు. పనిముట్లు, రక్షణ పరికరాలు అందించడంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని అంటున్నారు. సింగరేణిలోనే అతిపెద్ద భూగర్భగని జీడీకే–11. బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో అగ్రగామిగా నిలుస్తోంది. ఐదు షిఫ్టుల ద్వారా విధులు నిర్వహిస్తున్న కార్మికులు సరైన పనిముట్లు లేక పనిస్థలాల్లో ఇబ్బందిపడాల్సి వస్తోంది. పైకప్పులకు హోల్వేసే డ్రిల్బిట్లు సకాలంలో అందడం లేదు. ఇది ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. అంతేకాకుండా కోల్కటింగ్ కార్మికులపై పనిభారం పెరుగుతోంది. డ్రిల్లింగ్ తర్వాత సపోర్టింగ్ కోసం ఉపయోగించే రెజిన్ క్యాప్సూల్స్ కూడా అందుబాటులో ఉండడంలేదని కార్మికులు పేర్కొంటున్నారు. హ్యాండ్ గ్లౌస్లు, డస్ట్మాస్కులు, నాణ్యమైన సేఫ్టీ బూట్లు సకాలంలో అందించడం లేదని వాపోతున్నారు. మొరాయిస్తున్న కంటిన్యూస్ మైనర్ జీడీకే–11గనిలో కంటిన్యూస్ మైనర్–1కు వార్షిక మరమ్మతు సకాలంలో చేయక తరచూ మొరాయిస్తోందని కార్మికులు చెబుతన్నారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. ఓవర్హాలింగ్ చేస్తే తరచూ నిలిచిపోయే అవకాశం ఉండదని అంటున్నారు. త్వరలోనే అందుబాటులోకి అమెరికా, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ముడిసరుకుల దిగుమతిలో ఆలస్యమైంది. ప్రస్తుతం అన్నీ సమకూర్చుకుంటున్నాం. డ్రిల్బిట్లు తెప్పిస్తున్నాం. రెజిన్ క్యాప్సూల్ ఈవారంలోగా అందే అవకాశం ఉంది. కంటిన్యూస్ మైనర్ యంత్రం మరమ్మతు చేయిస్తున్నాం. – శ్రీనివాస్, ఏజెంట్, జీడీకే–11 ఇబ్బందుల్లో ఉద్యోగులు -
మరణం తర్వాత మరోజీవితం కోసం..
ఫెర్టిలైజర్సిటీ: మరణానంతరం మరికొందరికి జీవం పోయాలనే సంకల్పంతో గోదావరిఖని శాంతినగర్కు చెందిన కాంట్రాక్టర్ కొమురవెల్లి సుధాకర్–అరుణ దంపతులు తమ నేత్ర, అవయవదానానికి ముందుకొచ్చారు. జాతీయ అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాత్రి తమ నివాసంలో వాసవీ లయన్స్ క్లబ్, సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దంపతులు అవయవదాన అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు. సదాశయ ఫౌండేషన్ ప్రచార కార్యదర్శి కేఎస్ వాసు మాట్లాడుతూ, సమాజంలో అవయవదానంపై అవగాహన పెంచేందుకు ఇలాంటి నిర్ణయాలు ఎంతో దోహదపడతాయన్నారు. గోదావరిఖని వాసవీ, స్ఫూర్తి లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. మరణానంతరం నేత్రాలు, అవయవాలు దానం చేయాలని దంపతులు ప్రకటించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంస్థల ప్రతినిధులు నార్ల ప్రసాద్, రమణరావు, కోదాటి ప్రవీణ్, కొమురవెల్లి రాహుల్, రెడ్డి రవీందర్రెడ్డి, దొంతుల గంగాధర్, కొమురవెల్లి రాజేశ్వరి, లింగమూర్తి, మల్లేశ్వరి, కాశెట్టి లక్ష్మయ్య, వరలక్ష్మి, మౌనిక, రవితేజ, రోహిత్, సునీత తదితరులు పాల్గొన్నారు. నేత్ర, అవయవదానానికి ముందుకొచ్చిన దంపతులు -
వచ్చేనెలలో నిర్వహించాలి
వచ్చేనెలలోనే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలి. రెండేళ్ల కాలపరిమితితో గతంలో మాదిరిగానే ఎన్నికలు నిర్వహించాలి. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తక్షణం ఎన్నికలు నిర్వహించాల్సిందే. – మిర్యాల రాజిరెడ్డి, అధ్యక్షుడు, టీబీజీకేఎస్ లేబర్కోడ్లు రద్దు చేయాలి నాలుగులేబర్ కోడ్లు రద్దు చేసిన తర్వాతే సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలి. లేబర్కోడ్లతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండేళ్ల కాలపరిమితి తర్వాతే ఎన్నికలు జరగాలి. – జనక్ప్రసాద్, సెక్రటరీ జనరల్, ఐఎన్టీయూసీ నాలుగేళ్లు ఉండాల్సిందే గత గుర్తింపు ఎన్నికలు నాలుగేళ్ల కు నిర్వహించారు. అదే పద్ధతిన మాకూ నాలుగేళ్ల కాలపరిమితితో గుర్తింపు ఇవ్వాలి. సింగరేణి ఇప్ప టికే కాలయాపన చేసింది. అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. – వాసిరెడ్డి సీతారామయ్య, అధ్యక్షుడు, ఏఐటీయూసీ -
రోగుల సేవకా..కాసుల వేటకా..?
మెట్పల్లి: మెట్పల్లిలో కొందరు ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు, వైద్యుల తీరు వివాదాస్పదమవుతోంది. ఏమాత్రం సేవాభావం లేకుండా వైద్యం పేరుతో కాసులవేట సాగిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తీవ్రమైన పోటీ పెరిగి వారి మధ్య గొడవలకు దారి తీస్తోంది. తాజాగా ఓ వైద్యుడిపై పోలీస్స్టేషన్లో కేసు నమోదు కావడం గమనార్హం. వైద్యం విషయంలో ఆరోగ్యకరమైన పోటీ ఉండడానికి బదులు వ్యక్తిగత విభేదాలు, ఆధిపత్య పోరు, రోగుల కోసం దిగజారుడు పనులు చేయడం వంటివి ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. దుష్ప్రచారం.. ఫిర్యాదులు రోగుల నిలువు దోపిడి.. ప్రమాణాలు పాటించాలివైద్యులు, ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు వైద్యసేవల విషయంలో తప్పనిసరిగా నైతిక ప్రమాణాలు పాటించాలి. ఆదాయమే లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదు. రోగులను రప్పించుకోవడానికి కమీషన్ల ఆశ చూపుతూ ఆర్ఎంపీలను ప్రోత్సహించడం మానుకోవాలి. ప్రతి ఆస్పత్రిలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు పాటించాలి. ఇటీవల మెట్పల్లిలో నిబంధనలు ఉల్లంఘించిన రెండింటికి నోటీసులు ఇచ్చాం. – జైపాల్రెడ్డి, ఉప వైద్యాధికారి పట్టణంలో ఆత్మకూర్ రమేశ్ సాయిలక్ష్మీనివాస్ పేరిట ఆస్పత్రి ఏర్పాటు చేశాడు. అందులో కొన్నేళ్లు అశోక్రెడ్డి వైద్యుడి పనిచేశాడు. ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో అశోక్రెడ్డి తప్పుకొని సాయిలక్ష్మీనివాస్ ఆస్పత్రి పక్కనే సొంతంగా మరొకటి నెలకొల్పాడు. అయితే.. తనపట్ల రమేశ్ దుష్ప్రచారం చేస్తున్నాడనే అనుమానంతో ఆదివారం వేకువజామున అశోక్రెడ్డి అతడి ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. దీనిపై రమేశ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు అశోక్రెడ్డిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది. -
మంచానికే పరిమితమైన భార్య.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య
యైటింక్లయిన్కాలనీ: కాలు విరిగి మంచానికే పరిమితమైన భార్య పరిస్థితి చూసి తట్టుకోలేక మానసికంగా కుంగిపోయిన భర్త వేముల ఎల్లయ్య(85) మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధి యైటింక్లయిన్కాలనీ సంతోష్నగర్లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లయ్య భార్య లక్ష్మికి రెండుసార్లు కాలు విరిగింది. కనీసం కదలలేని స్థితిలో ఉంది. నెలరోజులుగా మంచానికే పరిమితమైంది. అయితే, కొంతకాలంగా బీపీ, షుగర్, మోకాళ్లనొప్పులతో బాధపడుతున్న ఎల్లయ్య.. రోజూ భార్యకు సపర్యలు చేస్తున్నాడు. అప్పుడప్పుడు కూతురు అరుణ వచ్చి ఆలనాపాలనా చూస్తోంది. మంగళవారం ఉదయం కూడా కూతురు వీరి ఇంటికి వచ్చి వంటలు తయారు చేసి తన అత్తగారింటికి వెళ్తూ.. శ్రీఅమ్మకు మందులు వేయాలిశ్రీ అని తండ్రికి చేప్పి పెద్దపల్లికి వెళ్లింది. భార్య మంచానికే పరిమితం కావడం, తనూ బీపీ, షుగర్, మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ కుంగిపోయిన ఎల్లయ్య జీవితంపై విరక్తి చెంది తనఇంటి వరండాలో పైకప్పుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు పోలీసులు తెలిపారు. -
చెరువులకు జలకళ
పెద్దపల్లి: కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు జలకళ సంతరించుకుంటున్నాయి. వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు సాగునీరు సమృద్ధిగా అందుతోంది. జిల్లాలోని దాదాపు అన్నిచెరువులు, కుంట లు, జలవనరులు జలకళ సంతరించుకున్నట్లు ఇరిగేషన్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. వర్షాలు ఇలాగే కొనసాగితే జిల్లావ్యాప్తంగా అన్ని చెరువులు, కుంటలు కూడా పూర్తిస్థాయిలో వరదనీటితో నిండే అవకా శం ఉందని వివరించారు. చెరువులు నిండడంతో భూగర్భ జలాలు పెరిగే అవకాశాలు ఉంటాయని తెలిపారు. భారీవర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీవర్షాలతో చెరువులు, కుంటలు నిండి వాగులు, వంకలు పారుతుండడంతో సాగునీటికి ఢోకాలేని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జోరందుకున్న వ్యవసాయ పనులు వర్షాలు కురుస్తుండడం, మానేరు, హుస్సేమియావాగు జలకళ సంతరించుకోవడంతో జిల్లావ్యాప్తంగా వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటల సాగు వేగవంతంగా కొనసాగుతుంది. జిల్లాలో ఈసారి 2 లక్షల 78 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు అవుతాయని అంచనా వేయగా.. 2లక్షల 45 వేల 085 ఎకరాల్లో సాగు చేశారని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తెలిపారు. -
ఉపాధి కల్పించాలి
జ్యోతినగర్: రామగుండంలోని ఎన్టీపీసీ తెలంగాణ స్టేజ్–2లో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. న్యూఢిల్లీలో మంగళవారం ‘రామగుండం కార్మికుల హక్కులు – స్థానిక యువత ఉద్యోగాల కల్పన’పై ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్సింగ్తో జరిగిన భేటీలో ఎంపీ వినతిపత్రం అందజేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. రామగుండం మున్సిపల్ కార్మికులకు న్యాయమైన వేతనాలు వర్తింపజేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను అదనపు ఫిట్నెస్ సర్టిఫికెట్ పేరుతో ఇబ్బందులకు గురిచేయొద్దని ఆయన విన్నవించారు. కలెక్టర్ను కలిసిన డీటీపెద్దపల్లి: జిల్లా సహాయ ట్రెజరీ అధికారి(ఏటీవో)గా పనిచేస్తున్న రమేశ్కు ఇన్చార్జి డీటీవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈసందర్భంగా రమేశ్ కలెక్టరేట్లో కలెక్టర్ కోయ శ్రీహర్షను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. గడువులోగా పూర్తిచేయాలి ఎలిగేడు: ప్రభుత్వం నిర్దేశించిన పనులను నిర్ణీ త గడువులోగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ శ్రీరాములు ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేసి పలు సూచనలిచ్చారు. భూభారతి రీసర్వే, ఎస్ఐఆర్, సాదాబైనామా దరఖాస్తుల ప్రక్రియను గడువులోగా పూర్తిచేయాలని సూ చించారు. కార్యక్రమంలో తహసీల్దార్ యాక న్న, డెప్యూటీ తహసీల్దార్ రాజేంద్రప్రసాద్, ఆర్ఐలు చంధ్రశేఖర్, జయలక్ష్మీ ఉన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి పెద్దపల్లి: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి పవిత్ర సూచించారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఆశ డే కార్యక్రమంలో మాట్లాడారు. డాక్టర్లు లక్ష్మీభవాని, పర్హాత్, హెచ్ఈవో మురళీకృష్ణ, పీహెచ్ఎన్లు సౌంద ర్య, భారతి, రోజా, విజయలక్ష్మి పాల్గొన్నారు. సర్కారు బడిలో సర్పంచ్ పిల్లల చేరికరామగుండం: అంతర్గాం మండలం ఎగ్లాస్పూర్ గ్రామ సర్పంచ్ జూపాక మమత తన ఇద్దరు పిల్లలను మంగళవారం స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. తమ పిల్లలు అద్విత్ను ఒకటో తరగతి, హిమాన్ష్ను ప్రీ ప్రైమరీలో ప్రవేశం కల్పించారు. వీరిద్దరూ గత విద్యా సంవత్సరంలో ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ధ్యేయంగా తను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ మమత తెలిపారు. ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు ఆమెను అభినందించారు. -
‘ఎల్లంపల్లి’పై విద్యుత్ దీపాలు ఏవి?
రామగుండం: పవిత్రమైన గోదావరినదిపై ని ర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టుకు విద్యుత్ దీపాల అలంకరణ లేదు. వరద నీటితో జలకళ సంతరించుకుని, గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతున్న క్రమంలో ఉప్పొంగే వరద నీటి అందాలు విద్యుత్ వెలుగుల్లో కనిపించే దృశ్యాలు అంతాఇంతాకావు. హైందవ ధర్మం, గోదావ రి పవిత్రతను గుర్తించి పర్యాటకులను ఆకర్షించే రీతిలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు రంగురంగుల విద్యుత్ దీపాలను అలంకరించాలని ప ర్యాటకులు కోరుతున్నారు. ఈ విషయమై నీ టిపారుదల ఉన్నతాధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలంటున్నారు. అనుమానాస్పద స్థితిలో 500 కోళ్లు మృతి ఎలిగేడు: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామంలోని అరికిళ్ల చంద్రయ్యకు చెందిన సుమారు 500 నాటుకోళ్లు అనుమానాస్పదస్థితిలో మృత్యువాతపడ్డాయి. తన ఇంటి ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్డులో దాదాపు 1,000 నాటు కోళ్లు పెంచుతున్నాడు. మంగళవార ఉదయం నిద్రలేచి చూసేసరికి ఒక్కోటి కిలోవరకు బరువు పెరిగిన దాదాపు 500 కోళ్లు మృతిచెందాయి. విషప్రయోగంతోనే ఇలా జరిగి ఉంటుందని బాధితుడు చంద్రయ్య ఆవేదనవ్యక్తం చేస్తున్నాడు. వీటివిలువ సుమారు రూ.2 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నాడు. ఈమేరకు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. బొగ్గు బ్లాక్తో సింగరేణికి భవిష్యత్ గోదావరిఖని: పీకే ఓసీ–2 డీప్సైడ్ కోల్బ్లాక్ కేటాయించడం ద్వారా సింగరేణికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జి కందుల సంధ్యారాణి అన్నారు. ఆర్జీ – వన్ ఏరియా వర్క్షాప్లో కార్మికులకు మంగళవారం మిఠాయిలు పంచిపెట్టి మాట్లాడారు. బీఎంఎస్ నాయకులు నాయకులు గట్టయ్య, భాస్కర్, గుండబోయిన భూమయ్య, బోడకుంట సుభాష్, ఊరగొండ అపర్ణ, జక్కన బాలు, బూడిద హర్ష, జక్కుల పద్మ, ప్రవీణ్, తాళ్లపల్లి నరేశ్, నడిగట్టు రాజేందర్, హనుమాన్ల వెంకటేశ్, అనిల్, ఆకునూరు రమేశ్, కొల్లూరి శ్రీకాంత్, అనిల్నాయక్, మాడ ప్రభాకర్, మిస వికాస్ తదితరులు పాల్గొన్నారు. గంజాయి పట్టివేత గోదావరిఖని: విఠల్నగర్ వాటర్ ట్యాంక్ వ ద్ద ఒకవ్యక్తి గంజాయి కలిగి ఉన్నాడనే సమాచారం మేరకు అక్కడకు చేరుకుని పట్టుకున్న ట్లు వన్టౌన్ ఎస్ఐ అనూష తెలిపారు. అనుమానాస్పదంగా కనిపించగా తనిఖీ చేస్తే 250 గ్రాముల గంజాయి లభించిందన్నారు. ఈజీ గా డబ్బు సంపాదించాలని ఉద్దేశంతో రైలు లో మహారాష్ట్ర చంద్రాపూర్ వెళ్లి గుర్తుతెలియ ని వ్యక్తుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చే సి ఇక్కడకు తీసుకొచ్చి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నాడని వెల్లడించారు. నిందితుని నుంచి సెల్ఫోన్, గంజాయి స్వాధీనం చేసుకున్నామని, ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నామని సీఐ ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. -
పంటలను ముంచెత్తిన నీరు
ఫెర్టిలైజర్సిటీ: వీర్లపల్లిలోని వ్యవసాయ పొ లాలు పరిశ్రమల వ్యర్థాలు, మురుగునీటితో కలుషితమవుతున్నాయి. సింగరేణి, ఆర్ఎఫ్ సీఎల్ నుంచి వస్తున్న వర్షనీరు, వ్యర్థాలతో దాదాపు 20 ఎకరాలు నీటిలో ఉంటున్నాయి. ఇటీవల కురిసిన భారీవర్షాలకు ఆర్ఎఫ్సీఎల్ నుంచి వచ్చిన వరదనీరు పంటలను ముంచెత్తింది. ఎన్టీపీసీ రైల్వేబ్రిడ్జి వద్ద ఓపెన్కాస్ట్ మ ట్టి పేరుకుపోయి మురుగు, వరదనీరు పంటలను ముంచెత్తాయి. రూ.లక్షలు వెచ్చించి వ రినాట్లు వేసిన రైతులు.. పంటనీటిపాలు కా వడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటిసమస్య పరిష్కరించాలని సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. ప్రభుత్వం పరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వేలం గడువు పొడిగింపు పెద్దపల్లి : స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీయార్డులోని 13 వాణిజ్య దుకాణాలను బ హిరంగ వేలం ద్వారా అద్దెకు కేటాయించేందుకు దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ కూర మ ల్లారెడ్డి తెలిపారు. దరఖాస్తులను ఈనెల 13 వ తేదీ వరకు స్వీకరిస్తామని, ఆసక్తి గలవారు రూ.3,000 చెల్లించి దరఖాస్తు ఫారాలను పొందవచ్చని పేర్కొన్నారు. మిగతా వివరాల కోసం 73307 33468, 73307 33318 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
పల్లెపాలన బలోపేతం దిశగా..
మంథనిరూరల్: గ్రామీణ ప్రాంతాల పాలనను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పల్లెవాసుల సమస్యల పరిష్కారంతోపాటు, అభివృద్ధిపై అధికారుల పర్యవేక్షణ పెంచేలా మండల సర్వసభ్య సమావేశాల నిర్వహణకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. పంచాయతీలకు పాలకవర్గాలు కొలువుదీరినా ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో మండల సర్వసభ్య సమావేశాలు ఇప్పటి వరకు నిర్వహించలేదు. పల్లెలు ప్రగతి బాటలో పయనించేలా సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని 14 మండలాలు.. జిల్లాలో 14 మండలాలు ఉండగా.. 267 గ్రామపంచాయతీలు ఉన్నాయి. గత ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. దీంతో పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరాయి. అయితే, గ్రామస్థాయిలోనే సభలు నిర్వహిస్తుండగా సమస్యలు అధికారుల దృష్టికి వెళ్లడం లేదనే వాదనలు ఉన్నా యి. తాజాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల స్థాయిలో సర్వసభ్య సమావేశాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యలపై చర్చించేలా.. గ్రామాల్లో అనేక సమస్యలు అధికారుల దృష్టికి రాక పరిష్కారానికి నోచుకోవడంలేదు. వాటిని అధికారుల దృష్టికి తీసుకువచ్చేలా మూడు నెలలకోసారి మండల స్థాయిలో సర్వసభ్య సమావేశాలు నిర్వహించేవారు. వీటికి డివిజన్, మండల స్థాయి అధి కారులు హజరు కాగా సర్పంచులు, ఎంపీటీసీలు చెప్పిన సమస్యలపై చర్చించి పరిష్కారం చూపేవా రు. దాదాపు ఎనిమిది నెలలుగా సర్వసభ్య సమావేశాలు నిర్వహించకపోవడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదనే అభిప్రాయాలున్నాయి. ప్రత్యేక అధికారి అధ్యక్షతన.. సాధారణంగా సర్వసభ్య సమావేశాలు ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించేవారు. ఈసారి ఎంపీటీసీ ఎ న్నికలు లేక సమావేశాలు ఇంకా మొదలు కాలేదు. అధికారుల పర్యవేక్షణ లేక సమస్యలు అలాగే ఉండిపోవడం, అభివృద్ధి పనుల్లో జాప్యం కావడంతో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. మండల సమావేశాలకు సర్కార్ గ్రీన్సిగ్నల్ -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని వడ్డెరకాలనీకి చెందిన బత్తిని సంతోష్(18) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. గతనెల 30న ఇదే కాలనీకి చెందిన బత్తిని అజయ్, దేవరాజ్తోపాటు సంతోష్ కారులో కరీంనగర్ నుంచి ధర్మారం వస్తుండగా అదపు తప్పి ఎర్రగుంటపల్లి గ్రామ శివారులోని చెట్టును ఢీకొంది. ఈ సంఘటనలో సంతోష్ తీవ్రంగా గాయపడగా అజయ్, దేవరాజ్ సైతం గాయపడ్డారు. వీరిని కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించగా అజయ్, దేవరాజ్ కోలుకున్నారు. సంతోష్ చికిత్స పొందుతూ మరణించాడు. విషాదంలో కుటుంబం.. వడ్డెరకాలనీకి చెందిన బత్తిని మల్లయ్య– మల్లేశ్వరికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు సంతానం. కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో పెద్దకుమారుడు హరీశ్ వారం రోజుల క్రితమే ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. విదేశాల్లో స్థిరపడుతూ కుటుంబానికి అండగా నిలవాలనే పెద్దకుమారిడిపై ఆశలు పెట్టుకున్న ఆ కుటుంబానికి.. ఇక్కడ ఉన్న చిన్న కుమారుడు సంతోష్ ప్రమాదంలో మృతి చెందడం తీరని విషాదాన్ని మిగిల్చింది. ఒక కుమారుడు విదేశాల్లో ఉండగా, మరొక కుమారుడు శాశ్వతంగా దూరం కావడంతో మల్లయ్య, మల్లేశ్వరి దంపతులు కన్నీరుమున్నీరవున్నారు. తమ్ముడి మరణవార్త తెలియడంతో హరీశ్ దుబాయ్ నుంచి వచ్చే ప్రయత్నంచేస్తున్నట్లు సమాచారం. -
వరంగల్కు దారేది?
సాక్షిప్రతినిధి,కరీంనగర్: చత్తీస్ఘడ్– తెలంగాణ– మహారాష్ట్ర రాష్ట్రాలను కలుపుతూ వేస్తున్న జాతీయ రహదారి– 563 నిర్మాణంలో కరీంనగర్ రూరల్ మండల పరిధిలోని ఇరుకుల్ల జంక్షన్ వద్ద అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్హెచ్– 563 వరంగల్– కరీంనగర్ సెక్షన్ రోడ్డు, హైదరాబాద్– రామగుండం రాజీవ్ రహదారి ఒక్కచోట కలుస్తున్నాయి. ఎన్హెచ్ 563 ఎలివేటేఎడ్ హైవే కావడంతో కింద నుంచి రాజీవ్ రహదారి వెళ్తుంది. ఈ హైవే నిర్మాణంతో కరీంనగర్లోకి భారీ వాహనాలు రాకుండా ఇరుకుల్ల నుంచే వరంగల్వైపు వెళ్తాయనుకున్నారంతా. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. ఇక్కడ జగిత్యాల వైపుగా వెళ్లేందుకు అనుకూలంగా కనెక్టివిటీ ఉన్నా.. వరంగల్ వైపు వెళ్లేందుకు కనెక్టివిటీ లేదు. వాస్తవానికి ఎన్హెచ్ 563 రోడ్డు ఇంకా నిర్మాణంలోనే ఉంది. ప్రస్తుతం ఇరుకుల్ల వరకు అందుబాటులోకి వచ్చింది. వాహనాలు వరంగల్ వైపు వెళ్లేందుకు ఎలాంటి ర్యాంపు నిర్మించకపోవడంతో కరీంనగర్ వరకు ప్రయాణించి తీగల వంతెన, మానకొండూరు మీదుగా ఎన్హెచ్– 563 ఎక్కుతున్నాయి.పెద్దపల్లి పారిశ్రామిక ప్రాంతం నుంచి నిత్యం వేలాది లారీలు ఆంధ్రప్రదేశ్, చత్తీస్ఘఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా వైపు ప్రయాణిస్తుంటాయి. బసంత్నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ, సింగరేణి బొగ్గు, ఎన్టీపీసీ బూడిద, మంథని ఇసుక, వ్యవసాయ ఉత్పత్తులను తరలించే లారీలు నిత్యం కరీంనగర్– వరంగల్– విజయవాడ మధ్య తిరుగుతుంటాయి. పెద్దపల్లి నుంచి బయల్దేరిన వాహనాల్లో కొన్ని హైదరాబాద్ వైపు వెళ్లగా, మెజారిటీ వరంగల్ మీదుగా వెళ్తుంటాయి. మెడికల్ ఎమర్జెన్సీ కోసం ఎంజీఎం వెళ్లే వారు ఇదే దారిని ఎంచుకుంటారు. ఇరుకుల్ల వద్దకు రాగానే అందరికీ ఎన్హెచ్–563 హైవే శిఖరంలా దర్శనమిస్తోంది. కానీ, ఎలివేటెడ్ హైవేను ఎలా ఎక్కాలో అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు. కొంతదూరం సర్వీసు రోడ్డుమీద ప్రయాణించినా ఇరుకుల్ల వాగుతో రోడ్డు మూతపడుతోంది. -
చలాన్లు ఉన్నాయా?
ముళ్లపొదల వనం రామగుండం కార్పొరేషన్లోని మూడోడివిజన్ మేడిపల్లి పట్టణ ప్రకృతి వనం బోర్డులకే పరిమితమైంది. నిర్వహణ, పర్యవేక్షణ లోపంతో నామరూపాల్లేకుండాపోయింది. ముళ్లపొదలతో దర్శనమిస్తోంది. బల్దియా సిబ్బంది చొరవచూపి ప్రకృతి వనం రూపురేఖలు మార్చాలని నగరవాసులు కోరుతున్నారు. పెండింగ్ చలాన్లపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించాలరు. హెల్మెట్ ధరించాలని, లైసెన్స్ వెంట ఉంచుకోవాలని వాహనదారులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. మంగళవారం గోదావరిఖని మున్సిపల్ చౌరస్తాలోని రాజీవ్ రహదారిపై వాహనదారులను తనిఖీ చేస్తూ ‘సాక్షి’ కెమెరాకు ఇలా కనిపించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
ఫిర్యాదులపై తక్షణ స్పందన
గోదావరిఖని: ప్రజాసమస్యలకు సత్వర పరిష్కారం చూపడమే పోలీసుల లక్ష్యమని రామ గుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. పోలీస్ కమిషనరేట్లో సోమ వారం ప్రజాఫిర్యాదులు స్వీకరించారు. ప్రతీ ఫిర్యా దును నమోదు చేసి, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్యలు, ఇబ్బ ందులు ఎదుర్కొన్నా భయపడకుండా ప్రజలు పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.‘ఫీజు’ ఎత్తివేసేందుకు కుట్ర పెద్దపల్లిరూరల్: ఫీజురీయింబర్స్మెంట్ను ఎ త్తివేసేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ ఆరోపించారు. స్థానిక రాజీవ్రోడ్డుపై సోమవారం బైఠాయించారు. పేద విద్యార్థులు ఉన్నత చదు వులకోసం దివంగత సీఎం వైఎస్సార్ అమల్లో కి తీసుకొచ్చిన ఫీజురీయింబర్స్మెంట్ పథకా న్ని కొనసాగించడంలో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. ఫలితంగా వేలాది మంది విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయన్నారు. బకాయి ఫీజు లను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. నాయకులు సందీప్, ఓమేశ్, అరవింద్, విఘ్నేశ్, సిద్ధార్థ, శివ, దినేశ్, కార్తీక్, శైలజ, మౌనిక ఉన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన గోదావరిఖనిటౌన్: స్థానిక యూనివర్సిటీ పీజీ కళాశాలలో ఐసెట్ అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలిస్తున్నామని ప్రిన్సిపాల్ మనోహర్ సోమవా రం తెలిపారు. అభ్యర్థులు ఐసెట్ హాల్టికెట్, ర్యాంక్ కార్డు, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ మె మోలు, స్టడీ, కుల, ఆదాయం తదితర స ర్టిఫికె ట్లు, జిరాక్స్ తీసుకుని హాజరు కావాలని సూ చించారు. వెరిఫికేషన్ పూర్తయ్యాక తమకు కేటాయించిన లాగిన్ ద్వారా ఆప్షన్లు ఇవ్వాల న్నారు. వెరిఫికేషన్ అధికారులు ప్రసాద్, రవి, రఘుపతి, శ్యాంప్రసాద్, జ్యోతి పాల్గొన్నారు. నూతన కార్యవర్గం పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గా న్ని సోమవారం ఖరారు చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా అలుగువెల్లి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడిగా సమ్మయ్య, ప్రధాన కార్యదర్శిగా సుధాకర్, కోశాధికారిగా రాజిరెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా భూమయ్య, శ్రీనివాస్గౌడ్ నియమితులయ్యారు. సలహాదారుగా శంకర్, కార్యవర్గ సభ్యులుగా రాధయ్య, పిల్లి రాజు, గురువయ్య, అంజయ్య, స్రవంతిని నియమించారు. వారిని పలువురు అభినందించారు. -
తల్లిపాలే పట్టించాలి
పెద్దపల్లి/మంథనిరూరల్: బిడ్డకు తల్లిపాలు అమృతంలాంటివి. ఆధునిక నాగరికతతో కొందరు తల్లులు తమ పిల్లలకు డబ్బాపాలు పట్టిస్తున్నారు. తద్వారా శిశువులు అనేక వ్యాధులబారిన పడుతున్నారు. ఈనేపథ్యంలో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఏటా ఆగస్టు 01 నుంచి 07వ తేదీ వరకు ప్రతీఅంగన్వాడీ కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఈసారి కూడా జిల్లాలో తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రయోజనాల గురించి వివరిస్తూ.. తల్లిపాలతో బిడ్డకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. సిజేరియన్, నార్మల్ డెలివరీ అయినా తల్లిపాలు పట్టడం చాలాఅవసరమని సూచనలు చేస్తున్నారు. బిడ్డపుట్టాక తల్లికి వచ్చే తొలిపాలను కొలెస్ట్రమ్(ముర్రుపాలు) అంటారని, ఇందులో విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్, కార్బోహైడ్రేట్స్ వంటి అనేక పోషకాలు ఉంటాయని, వీటిని పట్టించడం ద్వారా నవజాత శిశువులో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని అవగాహన కల్పిస్తున్నారు. ముర్రుపాలే వాక్సిన్.. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఆరునెలల వరకు తల్లిపాలు టీకాలా పని చేస్తాయంటున్నారు. శిశువుకు సమతుల ఆహారం లభించడంతోపాటు కాల్షియం నిల్వలు పెరిగి రక్తహీనతను దూరం చేస్తుంది. ముఖ్యంగా డయేరియా, న్యూమోనియా, గుండెజబ్బులు, ఎలర్జీ, ఆస్తమా, డయాబెటిస్ వంటి వ్యాధుల నుంచి ముర్రుపాలు రక్షణ కల్పిస్తాయంటూ అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు తల్లులకు అవగాహన కల్పిస్తున్నారు. పాలిస్తే తల్లికి ప్రయోజనమే శిశువులకు పాలిచ్చే తల్లులకూ ప్రయోజనమే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. పాలు పట్టించ డం ద్వారా తల్లిఆరోగ్యం మెరుగవుతుందని, రోజూ 8 నుంచి 12సార్లు తల్లిపాలు పట్టించేలా తల్లి పోషకాహారం తీసుకోవడంతోపాటు ఎక్కువనీరు తాగు తూ తగిన విశ్రాంతి తీసుకోవాలని వివరిస్తున్నారు. కోల్సిటీ: తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సిమ్స్ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కళాశాల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ టీ జంక్షన్ వరకు ర్యాలీ సాగింది. ప్రిన్సిపాల్ దయాళ్ సింగ్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్ హిమబిందుసింగ్ మాట్లాడుతూ.. శిశువుకు తల్లిపాలే సంపూర్ణ ఆహారమన్నారు. పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టిస్తే శిశువులు ఆరోగ్యంగా ఎదుగుతారని తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు, వైద్యులు, మెడికోలు తదితరులు పాల్గొన్నారు. -
కలల కన్నీరు..!
మల్యాల: పిల్లలు బాగా చదువుకుని తమ కలలు నె రవేరుస్తారని భావించిన ఆ తల్లిదండ్రులకు పుత్రశోకమే మిగిలింది. ఊహ తెలియని వయసులో ఉన్న ఊరికి.. కన్నవాళ్లకు దూరంగా హాస్టల్ ఉంటూ చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థులను నీటిగుంత మింగింది. బహిర్భూమికని బయటకు వెళ్లి.. లోతు తెలియ ని గుంతలో దిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో నిత్యం సందడిగా ఉండే ఆ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. పాఠశాల విరామ సమయంలో.. మల్యాలలోని ఎస్సీ హాస్టల్లో ఉంటూ.. ఒడ్డెరకాలనీలోని ప్రాథమిక పాఠశాలలో జగిత్యాల రూరల్ మండలం టీఆర్నగర్కు చెందిన జగన్నాథం కృష్ణ, లక్ష్మి దంపతుల కుమారుడు సుశాంత్(10) నాలుగో తరగతి, నిజామాబాద్ జిల్లా మోర్తాడ్కు చెందిన వనం రాములు, రాధ దంపతుల కుమారుడు విష్ణు (11) ఐదో తరగతి చదువుతున్నారు. ఎప్పటిలాగే సోమవారం బడికి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సుశాంత్, విష్ణు బహిర్భూమకని బయటకు వెళ్లారు. పాఠశాల సమయం ముగిసినా రాకపోవడంతో మూడో తరగతి చదువుతున్న సుశాంత్ తమ్ముడు ఈశ్వర్ తన అన్న రాలేదని ఉపాధ్యాయుడికి తెలిపాడు. ఆయన వెంటనే సమీపంలో హాస్టల్కు వెళ్లి ఆరా తీయగా.. రాలేదని వార్డెన్ చెప్పాడు. స్కూల్కు సుమారు 500మీటర్ల దూరంలో ఉన్న కొత్తకుంట చెరువు వద్దకు వెళ్లగా.. అక్కడి నీటిగుంతల వద్ద పిల్లల దుస్తులు, బూట్లు కనిపించాయి. పోలీసులు, విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా.. సీఐ రాజ్కుమార్, ఎస్సై సందీప్, ఎంఈ వో జయసింహారావు సంఘటనా స్థలానికి చేరుకుని జాలర్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు విగతజీవులై జాలర్ల వలకు చిక్కారు. మూడు రోజులుగా నిలిచిన విద్యుత్.. పాఠశాలలో బాత్రూంలు, తాగునీటి వసతి, విద్యు త్ సౌకర్యం ఉంది. ఇటీవలి వర్షాలకు పాఠశాలకు మూడురోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో బాత్రూములకు నీటి సరఫరా నిలిచిపోయింది. రెండు రోజులుగా విద్యార్థులు బహిర్భూమికి ఆరుబయటకు వెళ్తున్నారు. అక్రమమట్టి తవ్వకాలతో గుంతలు.. భీమన్న గుట్ట సమీపంలో అక్రమంగా మట్టి తవ్వకా లు చేపట్టడడంతో గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవలి వ ర్షాలకు నీరు చేరింది. బహిర్భూమికని వెళ్లిన చి న్నారులు ఈత కొట్టేందుకు దిగిమునిగినట్లు ఎంఈవో జయసింహారావు అనుమానం వ్యక్తం చేశారు. -
ప్రజారోగ్యంపై పట్టింపేది?
మినరల్ వాటర్ పేరిట సాగుతున్న అక్రమ నీళ్లదందా ప్రజారోగ్యంపై ప్రభావం చూపే అవకాశముంది. అధికారులు తనిఖీ చేసి అనుమతులు లేనివాటిపై చర్యలు తీసుకోవాలి. నీళ్ల శాంపిళ్ల సేకరించి పరీక్షలు చేయించి శుద్ధజలమే ప్రజలకు అందించేలా చూడాలి. – జంగ చక్రధర్రెడ్డి, పెద్దపల్లిఅంతా వాళ్ల ఇష్టం బోరువాటర్లో లవణాలు (ఐరన్, క్లోరిన్ లాంటివి) ఏ మోతాదులో ఉన్నాయో పరిశీలించి ప్రమాణాల మేరకే ఫిల్టర్ చేసిన నీళ్లు విక్రయించాలి. ఇవేవీ పట్టని వ్యాపారులు ధనార్జనే ధ్యే యంగా ప్లాంట్లు నిర్వహిస్తున్నారు. మినరల్ నీళ్లు తాగి జనాలు రోగాల పాలవుతున్నారు. – కనుకుంట్ల సదానందం, సామాజిక కార్యకర్త దృష్టి సారిస్తాం మినరల్ వాటర్ ప్లాంట్ల నిర్వహణపై దృష్టి సా రిస్తాం. గతంలో ముమ్మరంగా తనిఖీలు చేసి నిబంధనలు పాటించని పలువురికి నోటీసులు జారీచేశాం. వాటర్ ప్లాంట్ల ఏర్పాటు, నీళ్ల సరఫరాలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్, మున్సిపల్ కమిషనర్, పెద్దపల్లి -
అప్పుడు చూసి.. ఇప్పుడు కూల్చివేసి..
గోదావరిఖని: సింగరేణి అధికారుల తీరు వివాదా స్పదంగా మారుతోంది. స్థానిక తిలక్నగర్ సెంటర్ సమీపంలో షాపింగ్ కాంప్లెక్స్ పేరిట నిర్మాణాలు కొనసాగుతున్నాయి. రోడ్డు విస్తరణ కోసం కొన్నింటిని యాజమాన్యం ఇటీవల తొలగించింది. నిర్వాసితులు వాటిస్థానంలో కొత్త దుకాణాలు నిర్మించుకుంటున్నారు. ఫిల్లర్ల కోసం గొయ్యిలు తవ్వడం, ఫిల్లర్లు నిర్మించడం, స్లాబ్ వేయడం.. ఇలా అనేక పనుల్లో వారు నిమగ్నమయ్యారు. ఈతంతు మూ డు నెలలుగా కొనసాగుతోంది. పనుల ప్రారంభంలో పట్టించుకోని సింగరేణి యాజమాన్యం.. ఇప్పు డు స్లాబ్స్థాయికి చేరుకోగానే కట్టడాలను కూల్చివేయడం వివాదాస్పదంగా మారింది. అప్పుడు కనిపించలేదా? తిలక్నగర్ సెంటర్లో చేపట్టిన నిర్మాణాలు బహి రంగంగానే కొన్నినెలలుగా జరుగుతున్నాయి. అ యినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించా రా? ఇప్పుడు ఎందుకు దృష్టి సారించారు? అనే చ ర్చ సాగుతోంది. సింగరేణి స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని గురువారం ఎస్టేట్ అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది కలిసి వచ్చి జేసీబీతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని పాక్షికంగా నేలమట్టం చేశారు. సమాచారం అందుకున్న బాధితులు, స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో కూల్చివేతలు నిలిపివేసి అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈవిషయంలో యాజమాన్యం కావాలనే నష్టపర్చిందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణం చేపట్టిన సమయంలో ముందుగా అడ్డుకుంటే తమకు ఇంతనష్టం అయ్యేది కాదని, ఈ విషయాన్ని తమ దృష్టికి తేవడంలో అధికారులు విఫలమయ్యారని అంటున్నారు. అక్రమ నిర్మాణాలైతే సమాచారం ఎందుకివ్వలేదు? సింగరేణి స్థలంలో నిర్మాణాల సమాచారం అధికారులకు ముందే తెలిసినా ఇప్పటివరకు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తున్నారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి జీఎం కూడా కొబ్బరికాయ కొట్టాడని స్థానికులు వాదిస్తున్నారు. పరిశీలించిన ఎమ్మెల్యే కూల్చివేసిన కట్టడాల ప్రాంతాన్ని రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ ఇటీవల సందర్శించారు. అక్కడి వాస్తవాలు తెలుసుకున్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. ఈసమస్యను అధిగమిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. ఈవిషయంలో యాజమాన్యంతో మాట్లాడుతామని అన్నారు. -
ద్విచక్ర వాహనాల దొంగల అరెస్టు
వరంగల్ క్రైం: వరుసగా ద్విచక్ర వాహనాల చోరీ లకు పాల్పడుతున్న దొంగలను సీసీఎస్, కేయూ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. సోమవారం సా యంత్రం కమిషనరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బైక్ల చోరీలు చేసిన తరువాత నిందితులు అనంతరం చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్నట్లు ఆమె తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో నమోదైన కేసుల్లో బైక్ల రికవరీ కోసం సెంట్రల్ జోన్ డీసీపీ కవిత ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకుని నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. మంచిర్యాల ఎన్టీపీసీ కాలనీకి చెందిన దొంతుల ప్ర శాంత్ కుమార్, మంచిర్యాల జిల్లా జైపూర్ గ్రామానికి చెందిన దుర్గం సాయి కార్తీక్ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు తెలిపారు. తనిఖీల సమయంలో నిందితులు ప్రయాణిస్తున్న బైక్ను స్వాధీనం చేసుకుని విచారించగా నిందితులు వివిధ ప్రాంతాల్లో దాచిపెట్టిన వాహనాల వివరాలు వెల్లడించినట్లు తెలిపారు. కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునిపల్లి, ఎల్కతుర్తి శివారులో 28 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వాహనాల చోరీలు ఇలా... నిందితులు వరంగల్ పోలీస్ కమిషనరేట్తోపాటు పలు జిల్లాలో వాహనాల చోరీలకు పాల్పడినట్లు సీపీ తెలిపారు. వరంగల్ కమిషనరేట్లో–8, కరీంనగర్ కమిషనరేట్లో –9, రామగుండం కమిషనరేట్ పెద్దపల్లిలో –3, సిద్దిపేట కమిషనరేట్లో –2 హైదరాబాద్ కమిషనరేట్లో–3, రాచకొండ కమిషనరేట్లో –1, భూపాలపల్లి జిల్లాలో –2 మొత్తం 28 బైక్లు చోరీ చేసినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో హనుమకొండ ఏసీపీ నరసింహరావు, సీసీఎస్ ఏసీపీ సదయ్య, కేయూ ఇన్స్పెక్టర్ సుంకరి రవికుమార్, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు రాఘవేందర్, హరికృష్ణ, రామకృష్ణ, సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు. -
నిబంధనలకు నీళ్లు
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంతోపాటు వివిధమండలాలు, గ్రామాల్లోనూ మినరల్ వాటర్ పేరిట నీళ్లదందా యథేచ్ఛగా సాగుతోంది. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల అనుమతి లేకుండానే పుట్టగొడుగుల్లా ప్లాంట్లు వెలుస్తున్నాయి. యజమానులు అక్రమార్జనే ధ్యేయంగా వ్యాపారం సాగిస్తున్నారు. పెద్దపల్లిలో మొన్నటివరకు 20లీటర్ల క్యాన్కు రూ.10 వసూలు చేసిన నిర్వాహకులు.. ఇప్పుడు రూ.15కు పెంచి విక్రయిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. బోరునీటినే శుద్ధి చేస్తూ.. ఇంటి ఆవరణలోని బోరుబావి నీటినే మినరల్ వాటర్ పేరిట క్యాన్లలో నింపి విక్రయిస్తున్నారు. కిరాణాలతోపాటు గల్లీకి కనీసం మూడు నుంచి నాలుగేసి ప్లాంట్లు ఏర్పాటు చేశారు. వీటికి మున్సిపల్, గ్రామ పంచాయతీ అనుమతి ఉండడంలేదు. ఒక్కపెద్దపల్లిలోనే దాదాపు 200 వరకు వాటర్ప్లాంట్లు ఉన్నాయి. ప్రతీ మండల కేంద్రంలో 10 నుచి 15 వరకు, పల్లెల్లో ఐదు నుంచి 10 వరకు వాటర్ప్లాంట్లు ఏర్పాటు చేశారు. క్యాన్లలో నింపి.. ఆటోల్లో సరఫరా బోరుబావి నీటిని క్యాన్లలో నింపిన యజమానులు.. అధికారుల నుంచి అనుమతి పొందిన కంపెనీ పేరిట ముద్రించిన క్యాన్లనే వినియోగించాలి. కానీ ఎక్క కూడా క్యాన్లపై ప్లాంటు పేరు, చిరునామా, సెల్ నంబర్ కనిపించడం లేదు. బోరుబావి, కనిపించేలా ప్లాంటు ఉంటేచాలు.. నీళ్ల దందా సాగిస్తూ కూర్చున్నచోటే అదనపు ఆదాయం సంపాదించుకోవచ్చనే భావనతోనే చాలామంది వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారనే విమర్శలున్నాయి.తనిఖీలు ఏవీ? అనుమతి లేకుండానే మినరల్ వాటర్ పేరిట నీళ్లదందా బహిరంగంగా సాగుతున్నా అఽధికారయంత్రాంగం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. వాటర్ క్యాన్లను సరఫరా చేసే ఆటోలు సైతం కాలం చెల్లినవేనని, ఆర్టీవో అధికారులు సైతం చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి. -
తిరస్కరణే అధికం
సాక్షి పెద్దపల్లి: ఏళ్లుగా అపరిషృతంగా ఉన్న సా దాబైనామా(తెల్లకాగితంపై ఒప్పందాలు) భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. నిబంధనల పేరిట ఎదురైన కో ర్టు, చట్టపరమైన చిక్కులను తొలగిస్తూ ప్రభు త్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం యజమానుల్లో ఆశలు రేకెత్తించింది. అయితే, కొనుగోలుదారు సమర్పించే అఫిడవిట్ ఆధారంగానే హక్కులు కల్పించాలని నిర్ణయించినా.. క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఎదురవుతుండడంతో అనేక దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. మార్గదర్శకాలు ఇవే భూభారతి చట్టంలోని నిబంధనలను సడలిస్తూ ప్ర భుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. 2014 జూన్ 2వ తేదీకి ముందు తెల్లకాగితంపై జరిగిన ఒప్పందాలనే పరిగణనలోకి తీసుకుంటారు. భూమి విక్రయించిన వ్యక్తి అప్పట్లో రెవెన్యూ రికార్డుల్లో పేరు కలిగి ఉండాలి. కొనుగోలుదారు తప్పనిసరి మోకామీద (భూమి వ ద్ద) ఉండి, అఫిడవిట్ సమర్పించాక నెలరోజుల వ్య వధిలో అభ్యంతరా లు రాకపోతే విచారణ అనంతరం భూభారతి పోర్టల్లో యాజమా న్య హక్కులు న మోదు చేస్తారు. త ప్పుడు పత్రాలు సమ ర్పించినట్లు తేలితే తిరస్కరిస్తారు. బాధ్యుతలపై చర్యలు తీసుకుంటారు. ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు భూప్రక్షాళన ద్వారా చాలావరకు వివాదాలు పరిష్కారమైనా.. దరఖాస్తుదారులకు తిప్పలు త ప్పడంలేదు. భూములు విక్రయించినవారు మరణించడం, వారి కుటుంబసభ్యులు అడ్డుచెప్పి కోర్టులను ఆశ్రయించడం, విక్రయదారులు స్థానికంగా లేకపోవడం వంటి కారణాలతో పట్టాల పంపిణీ క్లి ష్టంంగా మారుతోంది. దీంతో దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఇదే విషయమై పెద్దపల్లి ఆర్డీవో గంగయ్యను సంప్రదించగా.. కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు విచారణ చేస్తున్నారన్నారు. నివేదికల ఆధారంగా రైతులకు భూహక్కులు కల్పిస్తున్నామని తెలిపారు.దరఖాస్తులు 35,323 నోటీస్లిచ్చింది 35,311 తిరస్కరించినవి 14,817 పూర్తయినవి 8,411 సర్వే నంబర్లు 40,862 ఆమోదించినవి 05 దరఖాస్తులు ఎక్కువే.. తిరస్కరణలు అధికమే జిల్లాలో సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణకు 2020 అక్టోబర్, నవంబర్లో అధికారులకు దరఖాస్తులు అందాయి. భూభారతి చట్టంలో సవరణ చేసి సాదాబైనా ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించినా.. క్షేత్రస్థాయిలో సమస్యలు వేధిస్తున్నాయి. అర్హులైన రైతుల నిరీక్షణకు తెరదించేలా రెవెన్యూ డివిజన్ల వారీగా అధికారులు దృష్టి సారించినా.. సరైన పత్రాలు లేక, మరియు తప్పుడు రికార్డులు సమర్పించడంతో అత్యధికంగా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. క్రమబద్ధీకరణలో అధికారులు, రైతులకు అనేక ఇబ్బందులు ఎదురుకావడంతో ప్రక్రియలో జాప్యమవుతోంది. రికార్డుల లోపాలు: భూమి విక్రయించిన రైతుపేర్లు ప్రస్తుత రెవెన్యూ రికార్డుల్లో లేకపోవడం. చేతులు మారిన భూములు: ఒకరినుంచి మరొకరి చేతుల్లోకి మారిన భూములపై స్పష్టతలేదు. విస్తీర్ణంలో వ్యత్యాసం: కొనుగోలు చేసిన భూసర్వే నంబర్ల విస్తీర్ణంలో తేడాలు రావడం. స్థలాల మార్పు: కొనుగోలు చేసిన సర్వే నంబరు ఒకటైతే, మోకాపై వేరే సర్వే నంబరు ఉండటం. అర్హత లేనివి: ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ భూములకు కూడా దరఖాస్తు చేసుకోవడం. -
ఆటోడ్రైవర్ నిజాయతీ
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణంలో పెళ్లి కోసం కొనుగోలు చేసిన సామగ్రిని ఆటోలోనే మరచిపోయిన వారికి నిజాయతీగా అప్పగించిన ఆటోడ్రైవర్ సత్యం(పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంట)ను ఎస్సై నరేశ్ అభినందించారు. గోదావరిఖనికి చెందిన పద్మ కుటుంబీకులు పెళ్లికి అవసరమైన దుస్తులు తదితర సామగ్రిని కొనుగోలు చేశారు. తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఆటోలో బస్టాండ్ వరకు ప్రయాణించి ఆటోలోనే సామగ్రిసంచి మరచిపోయారు. కాసేపటికి ఆటోడ్రైవర్ గుర్తించి పోలీస్స్టేషన్లో అప్పగించారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. బాధితులను గుర్తించి సామగ్రి అందించారు. నిజాయతీ ప్రదర్వించిన సత్యంకు పద్మ కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఇంటికి చేరకముందే కబళించిన మృత్యువు
జ్యోతినగర్: పెద్దపల్లిలోని తమ బంధువుల ఇంట ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుడు కోండ్ర లింగమూర్తి(42) ఎఫ్సీఐ క్రాస్రోడ్డు రాజీవ్ రహ దారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో నివసిస్తున్న కోండ్ర లింగమూర్తి ఎన్టీపీసీలోని సీహెచ్పీ విభాగంలో హౌస్కీపింగ్ పనులు చేస్తున్నాడు. ఆదివారం పెద్దపల్లిలో తమ బంధువుల ఇంటిలో జరిగిన కార్యక్రమానికి హాజరై రాత్రి శ్రీరాంపూర్ బస్సులో వెళ్తున్నాడు. ఎఫ్సీఐ క్రాస్రోడ్డులోని తన స్నేహితుడు ముల్కల శ్రవణ్కుమార్ను కలుసుకునేందుకు అక్కడికి రాగానే బస్సు దిగాడు. ఇద్దరూ కలిసి రోడ్డు దాటుతుండగా గోదావరిఖని వైపు నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం అతివేగంతో లింగమూర్తిని ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతడిని శ్రవణ్కుమార్తోపాటు గోదావరిఖని గంగానగర్కు చెందిన కారుడ్రైవర్ కలవేని అనిల్ వెంటనే గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. మృతుడి సోదరుడు కోండ్ర నర్సయ్య ఫిర్యాదు మేరకు ఏఎస్సై బుచ్చిన్నాయుడు కేసు నమోదు చేశారు. కుటుంబసభ్యుల అంగీకారంతో సదాశయ ఫౌండేష్న్ ఆధ్వర్యంలో టెక్నీషియన్ ప్రదీప్ మృతుడి నేత్రాలను సేకరించి హైదరాబాద్కు పంపించారు. మృతుడికి భార్య స్వర్ణలత, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు భూమల్ల చందర్, కార్మికులు సంతాపం తెలిపారు. -
బావిలో పడ్డా బతికారు
ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొ లనూరు గ్రామ శివారు లోని వ్యవసాయ బావి లో సోమవారం ఓ బైక్ అదుపుతప్పి పడిపోయింది. ఆ శబ్దాదనికి సమీప పొలాల్లో పనిచేస్తున్న రైతులు వెంటనే వచ్చి దానిపై ప్రయాణిస్తున్న ఇద్ద రు విద్యార్థినులు, బైక్ నడిపించే వ్యక్తి ప్రాణాలు కా పాడారు. స్థానికుల కథనం ప్రకారం.. తొలిఏకాదశి సెలవులు ముగియడంతో సుల్తానాబాద్ మండలం కనుకులకు చెందిన అనవేని సతీశ్ తన కూతురు అరణ్య(ఎనిమిదో తరగతి), చెల్లెలి కూతురు ఆరాధ్య(తొమ్మిదో తరగతి) కాల్వశ్రీరాంపూర్లోని కేజీ బీవీకి తీసుకెళ్లేందుకు సోమవారం తన బైక్పై ఇద్దరి తీసుకుని బయలు దేరాడు. కొలనూర్ శివారులో ఎ దురుగా మరోబైక్ రావడంతో దానిని తప్పించబో యి అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న వ్యవసాయ బా విలోకి దూసుకెళ్లారు. ఇదేసమయంలో వ్యవసాయ పనులు ముగించుకొని ఇళ్లకు వస్తున్న రైతులు, కూలీలు ఆశబ్దాన్ని గుర్తించి వెంటనే అక్కడకు వచ్చి ముగ్గురినీ బయటకు తీశారు. గాయాలపాలైన ఆరాధ్య, అరణ్యను ఆస్పత్రికి తరలించారు. సతీశ్ సురక్షితంగా బయటపడ్డాడు. అయితే, గాయాలపాలైన విద్యార్థినులు రోదించడం కలచివేసింది. -
ఘనంగా సంకష్టహర చతుర్థి
యైటింక్లయిన్కాలనీ: స్థానిక శ్రీఅయ్యప్పస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా నిర్వహించారు. తొలుత గణపతికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకుడు దేవ్ ప్రకాశ్ పాండే ఆధ్వర్యంలో స్వామివారికి గరిక, ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి, సభ్యులు భక్తులు పాల్గొన్నారు. మూడోసారి మింగేసి మద్యం మత్తు పెద్దపల్లి: మద్యం మత్తులో ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించిన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామానికి చెందిన ముత్యాల రాజగోపాల్(36) మూడోసారీ యత్నించడంతో చనిపోయాడు. కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లి సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా చనిపోయి కనిపించడంతో బోరుమన్నారు. మద్యం తాగొద్దని కుటుంబ సభ్యులు వినక పోగా.. ఆ మత్తులో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులు వారించడంతో బతికిపోయాడు. కానీ, మద్యం మానేయలేదు. సోమవారం మద్యం తాగి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మత్తులో ఉరివేసుకుని చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి తండ్రి కుమారస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై చంద్రకుమార్ తెలిపారు. -
మూడు నెలల బియ్యం ఒకేసారి..
పెద్దపల్లి: జిల్లాలోని రేషన్కార్డుదారులకు మూడునెలల సన్నబియ్యం పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల అధికారులు సర్వం సిద్ధం చేశారు. భారీవర్షాలతో రవాణాకు ఆటంకం కలుగుతుందని భావించిన ప్రభుత్వం.. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల కోటాను ఈనెల నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం గోదాముల నుంచి దుకాణాలకు బియాన్ని వేగంగా తరలిస్తోంది. జిల్లాలో మొత్తం 410 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఈ పాస్ ధ్రువీకరణ తర్వాత.. లబ్ధిదారులు నిర్ణీత తేదీల్లో తమ ఈ–పాస్ ధ్రువీకరణ అనంతరం రేషన్ బియ్యాన్ని పొందవచ్చని అధికారులు సూచిస్తున్నారు. పంపిణీలో అవకతవకలకు చోటులేకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. బియ్యం కొరత, సాంకేతిక సమస్యలు తదితర ఇబ్బందులు ఎదురైతే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. జిల్లాలోని మూడు గోదాముల ద్వారా.. జిల్లాలోని సుల్తానాబాద్, పెద్దపల్లి, మంథని గోదాముల ద్వారా రేషన్ దుకాణాలకు సన్నబియ్యం సరఫరా కొనసాగుతోంది. మూడు నెలల బియ్యాన్ని నిల్వఉంచాల్సి రావడంతో కొందరు డీలర్లు స్థలాభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా పంపిణీలో అంతరాయం లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సుల్తానాబాద్ లో రేషన్ షాప్ల తనిఖీలు సుల్తానాబాద్ జవహర్నగర్, శాస్త్రినగర్ రేషన్ షాప్ లను డీఎస్వో శ్రీనాథ్ తనిఖీ చేశారు. గోదాముల నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం సక్రమంగా చేరుతున్నాయా, ఎంత మేరకు సరఫరా చేశారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే రేషన్ బియ్యం నిల్వలు, పంపిణీ ఏర్పాట్లను పరిశీలించి డీలర్లకు అవసరమైన సూచనలు చేశారు. -
ప్రమాదకరంగా ప్రయాణం
గోదావరిఖని: ఓవర్లోడ్తో వెళ్తున్న బొగ్గులారీలు ప్రజల పాలిట ప్రాణాంతకంగా మారుతున్నాయి. సీహెచ్పీలు, ఇతర ప్రాంతాల నుంచి నిత్యం వందలాది లారీలు బొగ్గు రవాణా చేస్తున్నాయి. కనీస నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్నాయి. నిబంధనలు అతిక్రమణ.. సింగరేణి బొగ్గును రవాణా చేస్తున్న లారీలు కనీస నిబంధనలు పాటించడం లేదు. పలు పరిశ్రమలు, ఇతర ప్రాంతాలకు నిత్యం వందలాది లారీలు రోడ్డు మార్గం ద్వారా బొగ్గు తరలిస్తున్నాయి. ఓసీపీ–1, 2, 3తోపాటు భూగర్భ గనుల నుంచి రాష్ట్ర రాజధాని, కంపెనీలకు బొగ్గు రవాణా చేస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్డువెంట వెళ్లే ద్విచక్రవాహనదారులు, ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా వ్యవహరించాల్సి ఉంది. కానీ, కొందరు డ్రైవర్లు నిబంధనలేవీ పాటించడంలేదు. నిర్లక్ష్యంలో అధికారులు.. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు, రోడ్డు ట్రాన్స్పోర్టు అథారిటీ అధికారులు(ఆర్టీఏ) నిబంధనల అమలు గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్దబొగ్గు పెళ్లలతో ఓవర్లోడ్తో ప్రమాదకరంగా రవాణా చేస్తున్నా.. డ్రైవర్లును నిలువరించలేకపోతున్నారు. స్పీడ్ బ్రేకర్ల వద్ద భారీగా బొగ్గు రోడ్డుపై పడిపోతోంది. ఇదేసమయంలో రోడ్డు పక్కన, వెనకాల వెళ్తున్న వాహనదారులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుంటున్నారు. ఓవర్లోడ్.. ఆపై పెద్దబొగ్గు పెళ్లలతో లారీ నంబర్ కూడా కనిపించకుండా డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తున్నారు. కనిపించని టార్పాలిన్లు బొగ్గు రవాణా చేస్తున్న సమయంలో రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బంది కలుగకుండా ఆర్టీఏ, పోలీసు అధికారులు తప్పనిసరిగా టార్పాలిన్ కప్పాలని నిబంధన విధించారు. చాలాలారీలు ఇలాంటి నిబంధనలు బేఖాతరు చేస్తున్నాయి. తద్వారా వెనకాల, రోడ్డువెంట వెళ్తున్నవారు ప్రమాదాలకు గురవుతున్నారు. -
నియామకం
సుల్తానాబాద్ రూరల్: వాలీబాల్ అసోసియేషన్ జిల్లా జాయింట్ సెక్రటరీగా కనుకుల గ్రా మానికి చెందిన సీనియర్ క్రీడాకారుడు పసెడ్ల రమేశ్ను నియమించినట్లు అసోసియేషన్ ప్రధానకార్యదర్శి కన్న రమేశ్ తెలిపారు. పసెడ్ల రమేశ్ను అభినందిస్తూ సోమవారం అసోసియేషన్ నేతృత్వంలో శాలువా కప్పి సన్మానించారు. అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు కస్తూరి లక్ష్మారెడ్డి, నాయకులు ఆసంపల్లి శ్రీనివాస్, తిరుమల్రావు, పడాల అజయ్గౌడ్, విజ్ఞాన్రావు, బుచ్చిరెడ్డి, మహ్మద్రషీద్ తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి చైతన్యయాత్ర గోదావరిఖని: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వచ్చేనెల 9 నుంచి సింగరే ణి వ్యాప్తంగా చైతన్యయాత్ర నిర్వహిస్తు న్నట్లు టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. స్థానిక ప్రెస్క్లబ్లో సోమవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బొగ్గు బ్లాక్ల కేటాయింపు, నిల్వ లు సింగరేణికే చెందాలని కోరారు. సంస్థకు రావాల్సిన సుమారు రూ.60వేల కోట్లు వెంటనే కేటాయించాలన్నారు. కాగితాల్లో లాభా లు కనిపిస్తున్నా.. ఆర్థిక వనరులు లేక ఉద్యోగులకు జీతాల చెల్లింపులకు కూడా ఇబ్బందు లు ఎదురవుతున్నాయన్నారు. కార్మిక వర్గంలో చైతన్యం నింపేందుకు, సింగరేణి పరిరక్షణకు విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నాయకులు మాదాసి రాంమూర్తి, నూ నె కొమరయ్య, చెల్పూరి సతీశ్, దూట శేషగిరి, వాసర్ల జోసెఫ్, రొడ్డ సంపత్, మాసాడి సాయిచరణ్ తదితరులు పాల్గొన్నారు. కాలువలో పడి యువకుడి మృతిమెట్పల్లి: ఎస్సారెస్పీ కాలువలో షేర గంగ(30)ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. దీన్దయాళ్నగర్కు చెందిన గంగ బట్టలు ఉతికేందుకు మెట్ల మార్గం ద్వారా కాలువలోకి దిగాడు. అక్కడ ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన స్థానికులు బయటకు తీయగా.. అప్పటికే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్ల ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. వ్యక్తి ఆత్మహత్యతిమ్మాపూర్: మన్నెంపల్లిలో ఓ వ్యక్తి ఆత్మహ త్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన మెరుగు వెంకన్న(60) గోదావరిఖనిలో మిర్చిబండి న డుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొన్నిరో జుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. అనా రోగ్యంతో బాధపడుతున్న వెంకన్న మానసికంగా ఇబ్బందిపడుతున్నాడు. సోమవారం ఉదయం ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే ‘ఇక సెలవు మీ వెంకన్న‘ అంటూ రాసిన చిన్నచిట్టి ఘటనా స్థలంలో దొరికింది. -
హద్దులు నిర్ధారించి.. డ్రైనేజీలు తొలగించి
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని మెయిన్రోడ్డును విస్తరించే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. కొద్దిరోజుల క్రితమే జెండా చౌరస్తావద్ద గల మున్సిపల్ కాంప్లెక్స్ గదిని చైర్మన్ మల్లయ్య, కమిషనర్ వెంకటేశ్ తమ సిబ్బందితోనే కూల్చివేయించిన విషయం తెలిసిందే. మెయిన్ రోడ్డు విస్తరణలో తమ ఆస్తులకు నష్టం కలుగుతోందన్న వ్యాపారుల మొరవిన్న ప్రజాప్రతినిధులు.. 55 అడుగుల మేర విస్తరణకే నిర్ణయించి హద్దులు నిర్ధారించారు. ఎవరి భవనాన్ని ఎంతమేర కూల్చాలో వారి గోడపై మార్కింగ్ చేశారు. యజమానులు స్వచ్ఛదంగా కూల్చివేసుకునేందుకు 15 రోజుల గడువు ఇచ్చినట్టు కమిషనర్ వెంకటేశ్ తెలిపారు. కొందరు ఇప్పటికే స్వచ్ఛందంగా కూల్చివేతలు సాగిస్తుంటే ఇంకా కొందరు పట్టించుకోవడం లేదని గ్రహించిన మున్సిపల్ అధికారులు.. ఇలాంటివారి దుకాణాల ఎదుట ఉన్న డ్రైనేజీలపై కాలినడకన వెళ్లే దారి మినహాయించి మిగతా డ్రైనేజీని ధ్వసం చేశారు. వ్యాపారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో జరిగిన ఒప్పందం మేరకు కూల్చివేత పనుల్లో వేగం పెంచాలని మున్సిపల్ అధికారులు సూచిస్తున్నారు. మెయిన్ రోడ్డు విస్తరణకు చర్యలు వేగవంతం -
బైక్ నంబరు మార్చేసుకున్నారు
పెద్దపల్లిరూరల్: రోడ్లపై తిరిగే బైక్ నంబర్లను టాంపరింగ్ చేసి ట్రాఫిక్ పోలీసులు విధించే చలాన్ల నుంచి తప్పించుకునేందుకు కొందరు యత్నిస్తుంటే.. ఇంకొందరు ఏకంగా వాహన నంబరునే మార్చేసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం పెద్దపల్లిలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖిల్లో నకిలీ నంబరు(టీఎస్ 19ఏ 9821)తో హెచ్ఎఫ్ డీలక్స్బైక్ తిరుగుతున్నట్టు గుర్తించి దానిని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో ఇదే నంబరుగల బైక్ హైదరాబాద్లో ఉన్నట్టు తేలింది. ఇక్కడి ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధిస్తే ఆ నంబరు యజమాని సెల్ఫోన్కు మెసేజ్లు వెళ్తున్నాయి. దీంతో నకిలీ నంబరు వినియోగిస్తున్న బైక్ యజమాని పెద్దపల్లి పట్టణంలోని కొంతంవాడకు చెందిన వీరేశంపై కేసు నమోదు చేశారు. ఈబైక్ యజమాని తన అవసరాల నిమిత్తం ఓ వ్యాపారి వద్ద కుదువపెట్టగా.. సదరు వ్యాపారి ఇలా బోగస్ నంబరుతో తిరిగాడని వీరేశం పోలీసులకు వివరించినట్టు తెలిసింది. వాహనదారులు రవాణశాఖ కేటాయించిన నంబరునే వాహనంపై రాయాలి. వాహనానికి అమర్చిన నంబరు ప్లేటును టాంపరింగ్ చేసినా, నకిలీ, బోగస్ నంబర్లు వినియోగిస్తున్నట్లు తేలినా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్, ట్రాఫిక్ సీఐ, పెద్దపల్లి నకిలీ నంబరుతో తిరిగి పట్టుబడ్డారు -
మంథనికి భారీ పరిశ్రమలు
మంథని: మంథని ప్రాంతంలో ప్రధానమైన పరిశ్రమలు ఏర్పాటు చేస్తూ ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుతామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ఇందులో భాగంగానే కోక్ కంపెనీ ప్రతినిధులను సంప్రదించినట్లు చెప్పారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోక్ సంస్థ ప్రతినిధులతో సోమవారం సమావేశమయ్యారు. అనంతరం రామగిరి మండలం రత్నాపూర్లో పరిశ్రమల ఏర్పాటుకు ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించారు. హిందుస్తాన్ కోకాకోలా బెవరేజ్ సంస్థ సీఎస్ఆర్ నిధులతో మంథని బొక్కలవాగు చెక్డ్యాం ఆధునికీకరణకు రూ.2కోట్లు వెచ్చించిందన్నారు. అభివృద్ధి, పెట్టుబడులకు ప్రోత్సాహం మంథని/రామగిరి: అభివృద్ధి పనులు నాణ్యతతో నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. మంథని, రామగిరి మండలాల్లో పలు అభివృద్ధి పనుల పరిశీలన, ప్రారంభోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ‘మన ఊరు–మన కోచింగ్ సెంటర్’ ప్రారంభిస్తూ మాట్లాడారు. కోచింగ్ సెంటర్లో ఉచితంగా శిక్షణ, పుస్తకాలు, వసతి, భోజన సౌకర్యాలు అందిస్తున్నామని తెలిపారు. పరిశ్రమలకు విద్యుత్, నీరు, రోడ్లు వంటి వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, కోక్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అవినాష్, ప్రతినిధులు ముకుంద్, హిమాన్ష్, ఆర్డీవో సురేశ్, తహసీల్దార్లు ఆరిఫ్ ఉద్దీన్, సుమన్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయేందర్రెడ్డి, కమిషనర్ మనోహర్, విద్యుత్ నియంత్రణ మండలి సలహా కమిటీ సభ్యుడు శశిభూషణ్ కాచే, రామగిరి ఎంపీడీవో శైలజారాణి, ఎంపీవో సమ్మిరెడ్డి, సర్పంచ్ పల్లె ప్రతిమ తదితరులు పాల్గొన్నారు. -
సోమవారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2026
పెద్దపల్లి: సుల్తానాబాద్లోని ప్రభుత్వ చిల్డ్రన్ హోమ్ నుంచి ఇద్దరు బాలికలు పారిపోవడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యార్థుల భద్రత, బాధ్యతలు నిర్వహించాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ ఘటన చోటుచేసుకుందనే చర్చ సాగుతోంది. గతనెల 28న రాత్రి ఇద్దరు బాలికలు చిల్డ్రన్ హోమ్ నుంచి పారిపోయిన విషయం విదితమే. నిర్వాహకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నాలుగు ప్రత్యేక బృందాలుగా విడిపోయారు. సీసీ ఫుటేజీలు పరిశీలించారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ప్రధాన కూడళ్లలో గాలింపు చేపట్టారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్లకు బాలికల ఫొటోలు పంపించి అప్రమత్తం చేశారు. దీంతో 24 గంటల్లోపే నల్గొండ జిల్లాలో బాలికలను గుర్తించి సురక్షితంగా చిల్డ్రన్ హోమ్కు తరలించారు. అప్రమత్తంగా లేక..వాచ్ఉమన్ లేకనేనా? చిల్డ్రన్ హోమ్లోని వాచ్ఉమెన్ తన సమీప బంధువు మృతి చెందడంతో ఆరోజు సెలవులో వెళ్లినట్లు సూపరింటెండెంట్ వనిత తెలిపారు. దీంతో ఇద్దరు ఉద్యోగులకు ఆ విధులు కేటాయించారు. రాత్రి వేళల్లో విద్యార్థినులు బయటకు వెళ్లకుండా పర్యవేక్షించాల్సిన వాచ్ఉమెన్, సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడంతోనే బాలికలు తప్పించుకునే అవకాశం లభించిందని ఉద్యోగుల మధ్య చర్చ సాగుతోంది. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా బాధ్యులపై ఇంకా చర్యలు తీసుకోకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. కాగా, చిల్డ్రన్ హోమ్లో 54 మంది విద్యార్థులు ఉండగా.. ఆదివారం నాటికి అందులో 24మంది ఉన్నారని సూపరింటెండెంట్ వనిత తెలిపారు. విచారణ కొనసాగుతోంది చిల్డ్రన్ హోమ్ నుంచి ఇద్దరు బాలికలు పారిపోయిన ఘటనపై విచారణ చేపట్టాం. సిబ్బంది అరుణ, మమత విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు ప్రాథమిక విచారణ తేలింది. పూర్తిస్థాయి విచారణ తర్వాత నివేదికను కలెక్టర్కు అందజేస్తాం. చిల్డ్రన్ హోమ్ను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. – జితేందర్, డీసీపీవో, పెద్దపల్లి చిల్డ్రన్ హోమ్ నుంచి బాలికల పరారీ.. సిబ్బంది నిర్లక్ష్యమే కారణమా? వాచ్ఉమెన్ బాధ్యతలపై అనేక అనుమానాలు విచారణ జరుపుతున్న అధికారులు -
ప్రాజెక్టుల గురించి తెలియని మంత్రి ‘ఉత్తమ్’
ధర్మారం: సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన లే కుండా మంత్రులు మాట్లాడుతున్నారని కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్కుమార్, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డికి పరిజ్ఞానం లేదని, ప్రాజెక్టుల గురించి ఏబీసీడీలు కూడా తెలియవన్నారు. నందిమేడారం నందిపంప్హౌస్ డెలివరీ సిస్టర్న్లను ఎమ్మెల్సీ ర మణ, మాజీమంత్రి జీవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి ఆదివారం పరిశీలించా రు. వినోద్కుమార్, ఈశ్వర్ మాట్లాడుతూ, కాళేశ్వరం, రిజర్వాయర్ల గురించి సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రులకూ పరిజ్ఞానం లేదన్నారు. దెబ్బ తిన్న ప్రాజెక్టును మరమ్మతు చేయాలని ఎన్డీఎస్ సమావేశంలో అధికారులను మందిలించినా పట్టింకోకుండా మాట్లాడుతున్నారని అన్నారు. సొరంగా ల ద్వారా ఎల్లంపల్లి నీటిని మిడ్మానేరుకు తరలి స్తుంటే.. గ్రావిటీ ద్వారా తరలిస్తున్నట్లు చెప్పడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. కేసీఆర్ నా యకత్వంలో నిర్మించిన కాళేశ్వరంతో సాగునీటి విస్తీ ర్ణం సుమారు 60 లక్షల ఎకరాల నుంచి కోటి 60 లక్షల ఎకరాలకు పెరిగిందని తెలిపారు. బీఆ ర్ఎస్ నాయకులు ముత్యాల బలరాంరెడ్డి, శ్రీకాంత్రెడ్డి, బుచ్చిరెడ్డి, రాసూరి శ్రీధర్, తులా ఉమ, దావ వసంత, కూరపాటి శ్రీనివాస్, రాంబాబు ఉన్నారు. మాజీ ఎంపీ వినోద్కుమార్, మాజీమంత్రి ఈశ్వర్ -
నేడు మంత్రి శ్రీధర్బాబు రాక
మంథని: ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సోమవారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మంథని శివ కిరణ్ గార్డెన్లో ‘మన ఊరు–మన కోచింగ్ సెంటర్’ ద్వారా ఉచిత కానిస్టేబుల్, ఎస్సై కోచింగ్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఎస్ఎల్బీ గార్డెన్లో టీ వర్క్స్ చేపట్టిన విద్యార్థుల ఆటలపోటీల్లో వి జేతలకు బహుమతులు అందజేయనున్నారు. క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్, కోకోకోలా ఫ్యాక్టరీ ప్రతినిధులు, ఇతర కంపెనీల అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించనున్నారు. సివిల్ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. రామగిరి మండలం రత్నాపూర్లో ఏర్పాటు చేయనున్న కోకోకోలా ఫ్యాక్టరీ స్థలాన్ని పరిశీలించనున్నారు. ‘ఎల్లంపల్లి’కి జలకళ రామగుండం: రెండ్రోజుల క్రితం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రస్తుతం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. ఆదివారం ప్రాజెక్టులో నీటిమట్టం 148 అడుగులు ఉండగా.. పూర్తిస్థాయి నీటిని ల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలకు చేరుకుంది. ఇంకా 16,048 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా అంతే మొత్తం ఔట్ఫ్లో ఉంది. వరినాట్లకు సిద్ధం కమాన్పూర్: మూడ్రోజులపాటు ఏకధాటిగా కురిసిన వర్షాలతో గుండారం రిజర్వాయర్లోకి భారీగా నీరువచ్చి చేరింది. ఇప్పటికే నారుమడులు దున్నించిన రైతులు.. విత్తనాలతో మండెపోశారు. కొందరు మొలకను నారుమడుల్లో అలికారు. ఇంకొందరు నాట్లు వేయడానికి వర్షాల కోసం ఎదురుచూస్తుండగా గుండారం రిజర్వాయర్, చెరువులు, కుంటల్లోకి నీరు రాలేదు. మొన్నటి వర్షాలతో గౌరీగుండాల జలపాతం నుంచి వచ్చిన భారీ వరదకు గుండారం రిజర్వాయర్ 12 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. చెరువులు, కుంటల్లోకి నీరు వచ్చి చేరడంతో రైతులు వరినాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మూడేళ్ల కష్టానికి ప్రతిఫలం ఎలిగేడు: శివపల్లికి చెందిన జూనేని శ్యాంసుందర్రావు తన రెండెకరాల్లో సాగుచేసిన ఆయిల్పామ్ మూడేళ్ల తర్వాత దిగుబడి ఇచ్చింది. ఆ యిల్పామ్ గెల టన్నుకు రూ.23,800 ధర ఉండగా వరుసగా మూడు నెలల్లో రూ.1,49,940 ఆదాయం సమకూరినట్లు అధికారి అభిలాష్ ఆదివారం తెలిపారు. ఆయిల్పామ్ మొక్కలు ఒకసారి నాటితే దాదాపు 30ఏళ్లపాటు నిరంతరాయంగా దిగుబడి ఇస్తూ ఆదాయం వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఘనంగా ఫ్రెండ్షిప్ డే కాల్వశ్రీరాంపూర్: స్థానిక జెడ్పీ హైస్కూల్లో చదువుకుని వివిధ రంగాల్లో పనిచేసిన బాల్య మిత్రులు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆది వారం అందరూ ఒకేచోట కలుసుకున్నారు. తొలుత వివిధ కారణాలతో మృతి చెందిన వారికి రెండు నిమిషాలపాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. తాము చదువుకున్న కాల్వశ్రీరాంపూర్ జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువకుని ప్రతిభ చాటిన విద్యార్థులకు ఈనెల 7న నగదు ప్రోత్సాహాకాలు అందించేందుకు తీర్మానించారు. రిటైర్డ్ ఉద్యోగులు హరిప్రసాద్, రాజమల్లయ్య, మాధవరెడ్డి, విజయపాల్రెడ్డి, అశోక్రెడ్డి, వెంకన్న, స్వరూప, సత్యనారాయణరెడ్డి, వ్యాపారులు జనార్దన్, ఆనందం, రంగారావు పాల్గొన్నారు. -
తిప్పలు పడుతున్నం
అవసరాల కోసం పెద్దపల్లికి వెళ్దామంటే కొత్తపల్లి అండర్ బ్రిడ్జి వద్ద తిప్పలు తప్పడం లేదు. రాత్రిచీకటిగా ఉండడంతో వాహనాల వెలుతురులోనే బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సివస్తోంది. ఎంపీ చొరవ చూపి మా అవస్థలు తీర్చాలె. – కారెంగుల శ్రీనివాస్, కొలనూర్ పట్టించుకోవడం లేదు పెద్దపల్లి నుంచి పెద్దకల్వల, పెద్దబొంకూర్ మీదుగా ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ వెళ్లేందుకు కొత్తపల్లి అండర్బ్రిడ్జి వద్ద నానాఇబ్బందులకు గురవుతున్నాం. ఈ విషయమై అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. – వంగల కనుకయ్య, దస్తగిరిపల్లి నీరు రాకుండా చూడాలి రైల్వే అండర్బ్రిడ్జిలోకి పైనుంచి వర్షపునీరు రాకుండా చర్యలు తీసుకోవాలి. అధికారుల అవగాహన లోపం మాకు శాపంగా మారింది. వర్షం కురిసిందంటే వరదనీరు చేరుతోంది. ఈ మార్గంలో రాకపోకలు ఆగిపోతున్నయ్. – పెర్క సంతోష్, కొత్తపల్లి -
అమ్మితే ఆదాయం!
గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థలోనే అత్యధిక ఖరీదైన అతిభారీ యంత్రాలు పృథ్వీభంజన్, భీమా ఏళ్లుగా నిరుపయోగంగా పడిఉంటున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో ఉన్న ఈ రెండు డ్రాగ్లైన్ల జీవితకాలం పూర్తి కావడంతో విశ్రాంతి తీసుకుంటున్నాయి. స్క్రాప్గా విడదీసి విక్రయిస్తే సంస్థకు రూ.కోట్లలో ఆదాయం వస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే, పర్చేజ్, మైనింగ్ తదితర విభాగాల మధ్య సమన్వయం లేక ఏళ్లుగా ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ తుప్పుపడుతున్నాయి. మరికొన్ని విడిభాగాలు దొంగల పాలవుతున్నాయి. 30 ఏళ్లపాటు సేవలు సింగరేణికి దాదాపు 30ఏళ్ల పాటు సేవలు అందించిన డ్రాగ్లైన్ యంత్రాలను కోల్ఇండియాకు లేదా ఆన్లైన్లో టెండరు ద్వారా విక్రయిస్తే సుమారు రూ.5కోట్లకుపైగా ఆదాయం సమకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతోనే యంత్రపరికరాలు, యంత్రాలు పాడైపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి. డ్రాగ్లైన్ల పేర్లు పృథ్వీభంజన్, భీమా.. సింగరేణి బొగ్గు గనుల సంస్థలో పృథ్వీభంజన్, భీమా డ్రాగ్లైన్లు అందుబాటులోకి రావడంతో ఓపెన్కాస్టు ప్రాజెక్టుల్లో ఓబీ(ఓవర్ బర్డెన్–మట్టి) తొలగింపు, బొగ్గు వెలికితీత ప్రక్రియలో విప్లవం వచ్చింది. 1986లో రూ.100కోట్లతో కొనుగోలు చేసిన పృథ్వీభంజన్లో ఓసీపీ–1లో ప్రవేశపెట్టారు. అప్పటి సీఎం ఎన్టీ రామారావు దానిని ప్రారంభించారు. 1994లో భీమా డ్రాగ్లైన్ను ప్రత్యేకంగా ఓబీ వెలికితీతకోసం కొనుగోలు చేసింది. ఆర్జీ–2 ఏరియాలోని ఓసీపీ–3లో దీనిని ప్రవేశపెట్టారు. సుమారు 30 ఏళ్లపాటు నిర్విరామంగా పనిచేసింది. ప్రస్తుతం ఈరెండు యంత్రాల జీవిత కాలం ముగిసింది. యంత్రాలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా యంత్రాల కదలికలకు అవసరమైన పనిస్థలాలు లేక మూలనపడ్డాయంటున్నారు. కోలిండియాలో 58 యంత్రాలు సింగరేణిలో డ్రాగ్లైన్లు రెండే ఉండగా.. జీవితకా లం ముగియడంతో పక్కనపెట్టారు. ఇలాంటి యంత్రాలు కోలిండియాలో 58కిపైగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. సింగరేణిలోని డ్రాగ్లైన్లను వి డిభాగాలు విభజించి విక్రయిస్తే రూ.కోట్ల ఆదా యం వచ్చే అవకాశం ఉందని, ఇందుకోసం సుమా రు రూ.20 లక్షలు వ్యయం చేస్తే సరిపోతుందని అధికారులు వివరిస్తున్నారు ఈదిశగా సీఎండీ చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. నిరుపయోగంగా భారీ యంత్రాలు చోరీకి గురవుతున్న విడిభాగాలు విశ్రాంతి తీసుకుంటున్న డ్రాగ్లైన్లు నిర్లక్ష్యం వహిస్తున్న సింగరేణి -
వానొస్తే గుండెల్లో ‘రైళ్లు’ పరుగెత్తాల్సిందే..
లెవల్క్రాసింగ్ గేట్ల ఇబ్బందులు తొలగించేందుకు రైల్వే శాఖ అండర్ బ్రిడ్జిలు నిర్మిస్తోంది. కానీ, సమస్య పరిష్కరించాల్సిన వంతెనలు అనేక ఇబ్బందుల్ని సృష్టిస్తున్నాయి. ఇందుకు నిదర్శనమే కొత్తపల్లిలోని రైల్వే అండర్ బ్రిడ్జి. ఇక్కడి ఓదెల, కాల్వశ్రీ రాంపూర్ మండలాలతోపాటు జమ్మికుంట, వరంగల్ జిల్లాకు వెళ్లేందుకూ ఇదికూడా ప్రత్యామ్నాయ మార్గం. కానీ, వర్షాకాలం వచ్చిందంటే అండర్ బ్రిడ్జిలోకి వరద చేరి రాకపోకలు స్తంభిస్తున్నాయి. జిల్లా కేంద్రానికి చేరుకోవడం తలకుమించిన భారమవుతోందని ఓదెల మండలం కొలనూర్, పెద్దపల్లి మండలం మూలసాల, కొత్తపల్లి, దస్తగిరిపల్లి, పెద్దబొంకూర్, పెద్దకల్వల తదితర గ్రామాల ప్రజలు వాపోతున్నారు. కొత్తపల్లి వాసుల్లో చెప్పలేని వేదన.. అండర్ బ్రిడ్జితో కొత్తపల్లివాసులకు సరికొత్త తిప్పలు ఎదురయ్యాయి. ఇప్పటికే ఉన్న లెవల్ క్రాసింగ్ గేటు మూసివేయొద్దని గ్రామస్తులు మొరపెట్టుకున్నా వినకుండా ఉన్నతాధికారులు అండర్బ్రిడ్జి నిర్మించారు. అప్పట్నుంచే సమస్య జటిలమైంది. కొద్దినెలల క్రితం కురిసిన వానలకు వంతెనలోకి వరదచేరి వ్యవసాయ పనులకోసం వెళ్తున్న ట్రాక్టర్ మునిగిపోయింది. రాకపోకలు నిలిచిపోయాయి. పెరిగిన దూరభారం కొత్తపల్లిలో రైల్వే గేటును శాశ్వతంగా మూసివేయడంతో ఎటూ వెళ్లాలన్నా కనీసం 50 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. అండర్బ్రిడ్జిపై సబ్వే నిర్మాణ లోపమే ఇందుకు కారణమంటున్నారు గ్రామస్తులు. పైన నిలిచిన వర్షపునీరు బయటకు వెళ్లకుండా నేరుగా అండర్బ్రిడ్జిలోకి చేరుతోందని, విద్యుత్ మోటార్లు బిగించి బయటకు పంపిస్తున్నారని వివరించారు. ఇందుకోసం ఓ ఉద్యోగిని నియమించిన అధికారులు.. అదే రైల్వేక్రాసింగ్ గేటు వద్ద ఉంచితే సమస్య తలెత్తేదికాదంటున్నారు. వరదనీటిని తోడేస్తున్న మోటార్లు అండర్ బ్రిడ్జిలోకి చేరిన వరదనీరు నరకం చూపుతున్న ‘కొత్త’పల్లి రైల్వే అండర్ బ్రిడ్జి రెండు జిల్లాల ప్రజలకు రాకపోకలు బంద్ అధికారులకు విన్నవించినా చర్యలు శూన్యంఅది మారుమూల పల్లెకాదు.. జిల్లా కేంద్రానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.. ఒకవైపు హుస్సేనిమియావాగు, మరోవైపు మూడుట్రాక్లు కలిగిన రైల్వేలైన్లు.. చిన్నపాటి వర్షానికే రాకపోకల్ని స్తంభింపజేసే రైల్వేఅండర్ బ్రిడ్జి.. ఎటు వెళ్లాలన్నా పల్లెవాసులకు ఇవి ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. – పెద్దపల్లిరూరల్ -
చిన్నారుల్లో చిరునవ్వు
గోదావరిఖని: ఏటా ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నా బాలకార్మిక వ్యవస్థ నియంత్రణలోకి రావ డంలేదు. ఆర్థిక పరిస్థితులు, ఆదుకోని సమాజం, పట్టించుకోని యంత్రాంగంతో చాలామంది చిన్నారులు బాల్యాన్ని బానిసలుగా, కార్మికులుగానే గడుపుతున్నారు. బడికి వెళ్లాల్సిన బాలబాలికలు.. ఇలా ఉండడాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ప నులు, బానిసత్వం నుంచి విముక్తి కల్పించేందుకు ఈసారి ఆపరేషన్ ముస్కాన్–12 చేపట్టింది. జూ లైలో నెలరోజుల పాటు పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో రామగుండం కమిషనరేట్ పరిధిలో 278 మంది చిన్నారులకు విముక్తి కలిగించి పాఠశాలల్లో చేర్పించింది. నిరాశ్రయులు.. బాలకార్మికులు.. రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో జూలైలో 278 మంది బాలకార్మికులను గుర్తించారు. అందులో 127 మంది మంచిర్యాల, 151మంది పెద్దపల్లి జిల్లాకు చెందినవారున్నారు. వీరిలో 21మంది బాలకార్మికులు. నిరాశ్ర యులు, బాలకార్మికులు, బిక్షాటన చేస్తున్నవారిని గుర్తించేందుకు జూలై 1 నుంచి 31వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టి సత్ఫలితాలు సాధించారు. ఇలా గుర్తించారు.. తప్పిపోయిన బాలబాలికలను ధర్పన్ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా గుర్తించారు. ఇందులో ఒడిశా, బిహార్ తదితర రాష్ట్రాలకు చెందిన వలస కూలీల పిల్లలు ఉన్నారు. వీరిని అధికారులు పాఠశాలల్లో చేర్పించారు. కొందరిని తల్లిదండ్రులకు అప్పగించి కౌన్సెలింగ్ చేశారు. సమన్వయంతో పనిచేస్తూ.. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్, ఎడ్యుకేషన్, చైల్డ్ప్రొటెక్షన్, హెల్త్ డిపార్ట్మెంట్ల అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన అధికార యంత్రాంగం.. ఆపరేషన్ ముస్కాన్ –12ను విజయవంతం చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జిలు, దుకాణాలు, మెకానిక్ షెడ్లు, ఇటుకబట్టీలు తదితర ప్రదేశాల్లో ప్రత్యేక తనిఖీలు చేసింది. వివిధ పనులు చేస్తున్న, బానిలుగా బతుకుతున్న వారిని గుర్తించింది. బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించి మంచిభవిష్యత్కు పునాదులు వేస్తోంది.కమిషనరేట్ పరిధిలో విముక్తి పొందిన చిన్నారులు ఏడాది బాలురు బాలికలు మొత్తం 2017 206 48 254 2018 88 04 92 2019 116 39 155 2020 66 05 71 2021 88 13 101 2022 21 11 32 2023 33 04 37 2024 56 14 70 2025 136 57 193 2026 130 21 151 బానిసత్వం నుంచి బడికి బాలబాలికల జీవితాల్లో వెలుగులు ముగిసిన ఆపరేషన్ ముస్కాన్–12 జిల్లావ్యాప్తంగా 151మందికి విముక్తి -
ఆత్మబంధువు!
స్నేహ బిందువు.. జగిత్యాల: స్నేహబంధం చాలా గొప్పది. ఓపెన్గా మాట్లాడుకోవడం, ఏ సమస్య ఉన్నా చెప్పుకోవడం ఒక స్నేహితులతోనే ఉంటుంది. నా బెస్ట్ ఫ్రెండ్ కడలి జయకృష్ణ. బీటెక్ పూర్తయ్యాక అమెరికాలో స్థిరపడదామని అనుకున్న. జయకృష్ణ వాళ్ల అక్కయ్య ఢిల్లీలో సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నారు. ఆ సమయంలో జయకృష్ణ నన్ను ఐఏఎస్కు ప్రిపేర్ కావాలని సూచనలు ఇచ్చాడు. అమెరికాకు వెళ్లకుండా ఢిల్లీ వెళ్లి జయకృష్ణ వాళ్ల అక్కయ్య ప్రోత్సాహంతో సివిల్స్కు ప్రిపేర్ అయ్యా. ఐఏఎస్ రావడంలో ఒకింత జయకృష్ణ పాత్ర కూడా ఉంది. జయకృష్ణ ఆంధ్రప్రదేశ్లోని పోలవరం డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం ఫోన్లో మాట్లాడుకుంటాం. – సత్యప్రసాద్, కలెక్టర్, జగిత్యాలసప్తగిరికాలనీ(కరీంనగర్): ఒకప్పుడు స్నేహమంటే ఒకే బెంచ్, ఒకే వీధి, ఒకే ఊరు. ఇప్పుడు స్నేహమంటే ఒకే స్క్రీన్, ఒకే గ్రూప్, ఒకే వీడియో కాల్. కాలంతో పాటు మనుషులు మారారు. స్నేహం కొత్త రూపం దాల్చింది. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్ట్రాగామ్, టెలిగ్రామ్ నేటితరం జీవితంలో నిజమైన దోస్త్గా మారాయి. చిన్ననాటి స్నేహితులను మళ్లీ కలిపే వేదికగా, కొత్త పరిచయాలకు పునాదులుగా మారుతున్నాయి. సోషల్ మీడియా ప్రపంచాన్ని అరచేతిలోకి తీసుకొచ్చింది. పుట్టినరోజు శుభాకాంక్షలు, జ్ఞాపకాల ఫొటోలు, రీయూనియన్లు.. ఇవన్నీ డిజిటల్ వేదికలతో సాధ్యమయ్యాయి. వాట్సాప్లో వచ్చిన ఒక మెసేజ్తో రక్తదానం చేసిన స్నేహితులు, క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.లక్షలు సేకరించి వైద్యం చేయించినవారు.. వరదలు, ప్రమాదాల సమయంలో తమ ప్రాణా లను సైతం ఫణంగా పెట్టి స్నేహితులను కాపాడిన ఘటనలు నిజమైన స్నేహానికి నిర్వచనాలు.బంధంగా పుట్టకపోయినా.. అనుబంధంగా రూపుదిద్దుకుని.. కలిసిన సమయం నుంచి.. కడదాకా నీడనిచ్చేదే స్నేహం..! అమ్మ జన్మనిస్తే.. నాన్న జీవితాన్ని ఇస్తాడు.. స్నేహితుడు బతుకుదారి చూపుతాడు..!! బుడిబుడి అడుగులతో మొదలయ్యే స్నేహం జీవిత చరమాంకం వరకు కొనసాగుతుంది. బడిబాటతో ముడిపడి.. జీవితంలో స్థిరపడే వరకు వెన్నంటే నడుస్తుంది. ఒకసారి ఫ్రెండ్ అనుకుంటే జీవితకాలం కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తారు. అందుకే స్నేహమంటే రెండక్షరాల పదమే కాదు.. రెండు హృదయాల బంధం.. ఈ ప్రపంచంలో స్నేహితులు లేని వ్యక్తి ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఫ్రెండ్షిప్కు మారుపేరుగా నిలుస్తున్నారు ఉమ్మడి జిల్లావాసులు.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు. ఒకేచోట చదువుకుని.. ఒకే వృత్తిలో కొనసాగుతున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. స్నేహితులూ ముఖ్యమంటున్నారు. పలువురు తమ స్నేహానికి గుర్తుకు నెలకోసారి కలుసుకుంటున్నారు. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా కథనం.సిరిసిల్ల: సిరిసిల్లకు చెందిన ప్రముఖ వైద్యులు పి.పెంచలయ్య, ఎన్.వి.రమణరావు, పి.చంద్రశేఖర్ 42ఏళ్ల కిందట మెడిసిన్ చదువుతున్న రోజుల్లో కర్నూల్ మెడికల్ కాలేజీలో స్నేహితులయ్యారు. ముగ్గురు పుట్టి పెరిగిన జిల్లాలు వేరైనా ప్రభుత్వ డాక్టర్లుగా సిరిసిల్లలో స్థిరపడ్డారు. కడపకు చెందిన పెంచలయ్య, నెల్లూరు జిల్లా సర్వేపల్లి మండలం నిడిగుంటపాలెం చెందిన రమణరావు, నెల్లూరు పట్టణానికి చెందిన చంద్రశేఖర్కు ఎంబీబీఎస్ కాలేజీ ఫంక్షన్లో స్నేహం కలిసింది. పెంచలయ్య, చంద్రశేఖర్ 1993లో, 1995లో రమణరావు సిరిసిల్లకు వచ్చారు. ఇప్పుడు సర్జన్గా పెంచలయ్య, ఆర్థోపెడిక్గా రమణరావు, డీఎంహెచ్వోగా చంద్రశేఖర్ మంచి గుర్తింపు పొంది ఉద్యోగ విమరణ చేశారు.ఇల్లంతకుంట: ఇల్లంతకుంట పాఠశాలలో ఒకే బెంచీపై కూర్చుని 10వ తరగతి వరకు చదువుకున్న ఇద్దరు మిత్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నారు. ఇల్లంతకుంట మండలం ముస్కానిపేట గ్రామానికి చెందిన గుర్రం సందీప్ రెడ్డి, మల్లారం గ్రామానికి చెందిన సింగిరెడ్డి రమణారెడ్డి పదోతరగతి వరకు కలిసి చదువుకున్నారు. గుర్రం సందీప్రెడ్డి 2002లో ఉపాధ్యాయుడిగా ఎంపికై , పెద్ద లింగాపూర్లో పనిచేస్తున్నాడు. సింగిరెడ్డి మనోహర్రెడ్డి 2005లో ఉపాధ్యాయుడిగా ఎంపికై స్కూల్ అసిస్టెంట్గా సిద్దిపేట జిల్లాలో పనిచేస్తున్నాడు. ఇప్పటికీ వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది. -
నీటిలోనే పొలాలు
జీజీహెచ్కు రాజు కోల్సిటీ: మంచిర్యాల ప్రభు త్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)కి డిప్యుటేషన్పై వెళ్లిన ఆర్థోపెడిక్స్ అసిస్టెంట్ ప్రొ ఫెసర్ డి.రాజును మళ్లీ గోదావరిఖని ప్రభుత్వ జనరల్ (జీజీహెచ్) ఆస్పత్రికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. జీజీహెచ్ ఇన్చార్జి ఆర్ఎంవో రాజును గతనెలలో మంచిర్యాలకు బదిలీ చేసి న విషయం విదితమే. ఆయన రెండురోజుల్లో బాధ్యతలు స్వీకరిస్తారని తెలిసింది. ఉపాధి ఉద్యోగుల పెన్డౌన్ పెద్దపల్లి: పేస్కేల్ కోసం జీరాంజీ(ఉపాధిహా మీ) ఉద్యోగులు శనివారం పెన్డౌన్, షట్డౌన్ నిరసన ప్రారంభించారు. జిల్లాలోని ఉద్యోగు లు విధులు బహిష్కరించారు. నాయకులు మా ట్లాడుతూ గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అ మలు, సంక్షేమ పథకాల నిర్వహణలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నా.. వేతన సవరణ లేక ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదుర వుతున్నాయన్నారు. తమ న్యాయమైన డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించి పే స్కేల్ మంజూరు చేయాలని కోరారు. సమస్య పరిష్కరించే వరకూ ఉద్యమాన్ని శాంతియుతంగా కొనసాగిస్తామని జేఏసీ జిల్లా చైర్మన్ బొంగాని వెంకటేశ్గౌడ్ అన్నారు. ప్రతినిధులు సదానందం, అయూబ్, తోడుపునూరి సుజాత ఉన్నారు. -
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యం
గోదావరిఖని: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నామని రామగుండం పో లీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. గతనెల 1 నుంచి 31 వరకు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్–12 ద్వారా జిల్లాలో 130 మంది బాలురు, 21 మంది బాలికలను గుర్తించి రక్షించామని, 11 కేసులు నమోదు చేసి 12 మందిని అరెస్టు చేశామని తెలిపారు. అత్యవసరమైన సేవల కోసం చైల్డ్ హెల్ప్లైన్–1098 లేదా డయల్–100 నంబరుకు సమాచారం అందించాల ని సీపీ కోరారు. ఈ సందర్భంగా ఆర్మ్డ్ హెడ్క్వార్టర్స్లోని క్వార్టర్ గార్డును సీపీ తనిఖీ చేశారు. -
నా బెస్ట్ ఫ్రెండ్ పృథ్వీరాజ్ చవాన్
సిరిసిల్ల: నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు.. బెస్ట్ ఫ్రెండ్ ఎవరని చెప్పడం కష్టమే. మహారాష్ట్రలో నా బెస్ట్ ఫ్రెండ్ పృథ్వీరాజ్ చవాన్ ఉన్నారు. మేం 14 ఏళ్లుగా స్నేహితులం. నా కాలేజీ రోజుల్లో రూమ్మేట్. అనుకోకుండా ఓ సారి అనారోగ్యం బారిన పడ్డారు. ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయిస్తే కేన్సర్గా తేలింది. ఆ సమయంలో నేను అతనికి, అతని కుటుంబానికి అండగా నిలబడ్డాను. అప్పుడు ఐపీఎస్ కాలేదు. కానీ రూ.6లక్షల వరకు ఆర్థిక సాయం అందించాను. పృఽథ్వీరాజ్ చవాన్ ఇప్పుడు కేన్సర్ నుంచి కోలుకున్నారు. సినీ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్నారు. ఇప్పటికీ మేం ఫోన్లో మాట్లాడుకుంటాం. – మహేశ్ బి గితే, ఎస్పీ, రాజన్న సిరిసిల్ల -
‘ఎల్లంపల్లి’ కాంగ్రెస్ ఘనతే
సాక్షి, పెద్దపల్లి: దశాబ్దాలు గడిచినా పటిష్టంగా ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మానం కాంగ్రెస్ ఘనతేనని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. గోదావరి వరద జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు తమ ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టులు ఇప్పటికీ దృఢంగా ఉన్నాయని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులు నిర్మాణ లోపాలతో సమస్యలు ఎదుర్కొంటున్నాయని మంత్రి విమర్శించారు. శనివారం ఎల్లంపల్లి ప్రాజెక్టు సందర్శన అనంతరం అధికారులతో ఎల్లంపల్లిపై సమీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులపై తమ ప్రభుత్వానికి దురుద్దేశం లేదని, జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ నివేదికల మేరకే ప్రస్తుతం నీటిని నిల్వచేయడం లేదని తెలిపారు. ప్రాజెక్టుల పునరుద్ధరణ కోసం తాము తీసుకుంటున్న చర్యలను కేంద్ర ప్రభుత్వానికి నివేదించామని చెప్పారు. ఎల్లంపల్లి పంపులను ప్రారంభించడంతో బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆ పార్టీ పాలనలోనే ఇరిగేషన్ రంగం దెబ్బతిందన్నారు. రాజకీయ దురుద్దేశం లేదు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయ దురుద్దేశం లేదని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు సాంకేతిక నిపుణులతో పరీక్షలు, పునరుద్ధరణ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఐఐటీ బాంబేతోపాటు ఇతర సాంకేతిక సంస్థలు పునరుద్ధరణ డిజైన్ రూపొందిస్తున్నాయని, రెండు నుంచి మూడు నెలల్లో నివేదిక అందిన అనంతరం మరమ్మతులు ప్రారంభించి వచ్చే వర్షాకాలానికి ముందే మూడు బ్యారేజీలను వినియోగంలోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. బ్యారేజీల్లో నిర్మాణ సమస్యలు ఉన్నందున ప్రస్తుతం నీటి ఎత్తిపోతలకు అవకాశం లేద ని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణ రైతుల ప్రయోజనాల దృష్ట్యా గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించేందుకు ప్రభు త్వం కట్టుబడి ఉందని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాగునీరు, తాగునీటి అవసరాలు తీర్చే దిశగా సమర్థవంతంగా పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ది తుగ్లక్ పాలన గోదావరిఖని/రామగుండం: మాజీ సీఎం కేసీఆర్ తుగ్లక్ ముఖ్యమంత్రి అని, కాళే శ్వరం నిర్మాణానికి డిజైనర్, ఇంజినీర్, రై తు.. ఇలా అన్నీఆయనే కావడంతోనే మూడే ళ్ల వ్యవధిలోనే బ్యారేజీలు పనికిరాకుండా పోయాయని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. మాజీమంత్రి కే టీఆర్కు ఇరిగేషన్పై అవగాహన లేదన్నారు. నాలుగు రోజుల క్రితం వరకు మోటార్లు ఆ న్ చేసి పంపింగ్ చేయాలని రైతులను మభ్యపెట్టేలా చేశారని, ఇప్పుడు రెండు రోజులపాటు కురిసిన భారీవర్షాలతో జలాశయాలు జలకళ సంతరించుకోవడంతో రూ.కోట్ల విద్యుత్ బిల్లులు మిగిలాయని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో అవగాహన రాహిత్యంతో ముందుగా బ్యారేజీలను నీటితో నింపడం, ఆ తర్వాత భారీ వర్షాలతో దిగువకు విడుదల చేయడం.. ఫలితంగా ఏటా రూ.4వేల కోట్ల విద్యుత్ బిల్లులు దుర్వినియోగం కావడం ఆ సర్కారు ఘనతేనని మంత్రి ఎద్దేవా చేశారు. వర్షంతో మంత్రుల పర్యటనలో మార్పు మంత్రులు తొలుత కడెం ప్రాజెక్టు సందర్శించాల్సి ఉంది. అక్కడినుంచి హెలిక్యాప్టర్ ద్వారా పార్వతీ పంపుహౌస్ వద్ద ల్యాండ్ కావాల్సి ఉంది. వర్షం కురవడంతో కడెం నుంచి లక్సెట్టిపేట, గుడిపేట ద్వారా రోడ్డు మార్గంలో ఎల్లంపల్లి చేరుకున్నారు. నీటిపారుదల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో ఐటీశాఖ మంత్రి శ్రీధర్బాబు, కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి, సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, ప్రభుత్వ విప్ విజయరమణారావు, ఎమ్మెల్యేలు మక్కాన్సింగ్ఠాకూర్, గడ్డం వినోద్, సంజయ్, వెడ్మ బొజ్జు, రామగుండం మేయర్ మహంకాళి స్వామితో కలిసి ఎల్లంపల్లి సందర్శించారు. ఈఎన్సీ రమేశ్బాబు, చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్గుప్తా తదితరులు నీటి పరిస్థితి, ఎత్తిపోతలపై మంత్రులకు వివరించారు. -
కలెక్టరేట్ వేదికగా స్నేహం చిగురించి..
కరీంనగర్ అర్బన్: కరీంనగర్లోని కలెక్టరేట్లో రెవెన్యూ విభాగంలో పనిచేసే నాయబ్ తహసీల్దార్ నేరేళ్ల కిషన్, భూపాలపల్లి జిల్లా మల్హర్రావు మండల తహసీల్దార్ కుంబాల రవికుమార్, మైన్స్లో నాయబ్ తహసీల్దార్(ఎపిక్) భూషణబోయిన రాకేశ్కుమార్, వెల్ది ప్రభుత్వ వైద్యశాలలో సీనియర్ అసిస్టెంట్ ఎడ్ల వసంత్, నిజామాబాద్ జిల్లా రూరల్ నాయబ్ తహసీల్దార్ వినయ్సాగర్ 2012లో కరీంనగర్ కలెక్టరేట్లో ఉద్యోగులే. జూనియర్ అసిస్టెంట్లుగా ఉన్నప్పుడే చిగురించిన వీరి స్నేహం కష్టసుఖాల్లోనూ తోడునీడగా నిలుస్తోంది. ఉద్యోగ రీత్యా మొదలైన స్నేహం ఆదర్శంగా నిలుస్తోంది. -
‘సకుటుంబ’ స్నేహితులు
ఆదివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2026కోరుట్లటౌన్: కోరుట్ల పట్టణానికి చెందిన గుర్రాల అమరేందర్, తడుక వెంకటరమణ, శ్రీపతి రమేశ్, జోగిన్పెల్లి కృష్ణమోహన్రావు, ఖాందేశి ఉత్తమ్కుమార్, తిరుమల శ్రీధర్, రాచకొండ వెంకటేశ్, జిల్లా ధనుంజయ్, మండలోజు నరేందర్, రుద్రంగికి చెందిన రానవేని శ్రీనివాస్, వెగ్యారపు చంద్రశేఖర్, ఆకుల గంగాధర్ చిన్నతనం నుంచి స్నేహితులు. వీరు వివిధ ప్రాంతాల్లో వృత్తి, ఉద్యోగరీత్యా కొనసాగుతున్నా ప్రతినెల 10వ తేదీన గత 26ఏళ్లుగా కలుసుకుంటున్నారు. ప్రతి స్నేహితుడి పెళ్లిరోజు ఆరు గ్రాముల బంగారం కానుకగా ఇస్తున్నారు. మూడేళ్లకోసారి సకుటుంబ సమేతంగా తీర్థయాత్రకు వెళ్లి తమ అనుబంధాలను కాపాడుకుంటున్నారు.


