breaking news
Peddapalli District News
-
ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయిస్తా
ధర్మారం(ధర్మపురి): మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో గల శ్రీఅభయకృష్ణ ఆలయంలో శనివారం సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రిని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, డైరెక్టర్ బద్దం గంగారెడ్డి, సురకంటి శ్రీనివాస్రెడ్డి, బద్దం అజయ్పాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యూరియా కొరత సృష్టించేందుకు కేంద్రం కుట్రఫెర్టిలైజర్సిటీ(రామగుండం): రాష్ట్రంలో యూరి యా కొరత సృష్టించేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ ఆరోపించారు. శనివారం రామగుండం ఎరువుల కర్మగారాన్ని సందర్శించి అమ్మోనియా లీకై న హెచ్టీఆర్ కనెక్టర్ మరమ్మతు పనులు పరిశీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కర్మాగారం నిర్మాణంలో నాణ్యత లోపించడంతో అమ్మోనియా ప్లాంట్లో పైప్లైన్ లీకయి షట్డౌన్ చేయాల్సిన దుస్థితి వస్తుందన్నారు. మూడునెలల్లో కర్మాగారాన్ని మూడుసార్లు షట్డౌన్ చేశారని, అమ్మెనియా ప్లాంట్లో పైప్లైన్ నిర్మాణ పనులు చేపట్టిన కంపెనీపై సీబీఐకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుపుతున్న కర్మాగారంలో ఉత్పత్తి అయిన యూరియాలో 50 శాతం రాష్ట్రానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్లాంటుకు ఆనుకొని ఉన్న వీర్లపల్లి గ్రామాన్ని తరలించి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కల్పించాలని ఆర్ఎఫ్సీఎల్ సీఈవో అలోక్ సింఘాల్కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో మహంకాళి స్వామి, నెలకంటి రాము, చిట్టబోయిన రాజ్కుమార్, బూర్ల శ్రీనివాస్, కందుల సతీశ్, హరినాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలని సింగరేణి అధికారుల నిరసన గోదావరిఖని(రామగుండం): సింగరేణి యాజ మాన్యం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అధికారులు శనివారం ఆర్జీ–1 ఏరియా జీడీకే–5 ఓసీపీలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు. రిలే నిరాహార దీక్షలు, వర్క్టూ రూల్ వంటి ప్రతిపాదనలతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఎంఓఏఐ నాయకులు పొనుగోటి శ్రీనివాస్, పెరుమాళ్ల శ్రీనివాస్, ఆంజనేయులు, ప్రాజెక్ట్ ఆఫీసర్ డి.రమేశ్, అధికారులు పైడీశ్వర్, డి.రమేశ్బాబు, అనిల్గబాలే, పర్సనల్ మేనేజర్, ఎం.రవీందర్రెడ్డి, రాజన్న పాల్గొన్నారు. -
లోతట్టు ప్రాంతాలు జలమయం
జ్యోతినగర్(రామగుండం): రా మగుండం కార్పొరేషన్ మూడో డివిజన్ జంగాలపల్లెలో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. శని వారం ఉదయం కురిసిన భారీ వర్షానికి జంగాలపల్లెలోని లో తట్టు ప్రాంతాల్లోని పలు ఇళ్లలో కి వరద నీరు చేరింది. రోడ్డుపై మూడడుగల పైన వరద నీరు ప్రవహించింది. డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈదునూరి రవి డివిజన్లో పర్యటించి సమస్యను రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్కు తెలిపారు. దీంతో ఆయన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయగా వరద నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో జేసీబీతో కాలువలు తవ్వించారు. వరద నీరు ఇళ్లలో నుంచి బయటకు వెళ్లేందుకు సహాయ చర్యలు చేపట్టారు. జంగాలపల్లె గ్రామస్తులు ఎమ్మెల్యే మక్కాన్సింగ్కు, రవికి కృతజ్ఞతలు తెలిపారు. -
మోకాళ్లలోతు వరద
కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థ 49వ డివిజన్ పరిధి మార్కండేయకాలనీలోని బీసీ హాస్టల్ లైన్లో శనివారం కురిసిన వర్షానికి వరదనీరు చెరువును తలపించేలా నిలిచిపోయింది. సమీపంలోని నాలాలోకి వెళ్లే మార్గం లేక ఇళ్ల ముందు మోకాళ్లలోతు వరద నీటిలో సీపీఐ నగర కార్యదర్శి కె.కనకరాజ్ నిరసన తెలిపారు. రోడ్డుపై నిలిచిన వరదనీటిని మళ్లించే చర్యలు చేపట్టకపోతే, సమీపంలోని ఇళ్లల్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. నగరపాలక అధికారులకు ఎన్నిమార్లు విన్నవించుకున్నా, స్పందన లేదన్నారు. కొత్తగా నిర్మించిన నాలా సైడ్వాల్కు రంధ్రాలు ఏర్పాటు చేయకపోవడంతో వరద నీరు చెరువును తలపిస్తోందన్నారు. అధికారులు స్పందించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
రొడ్యాంపై వరద.. నిలిచిన రాకపోకలు
మంథనిరూరల్: రెండు రోజులతో పాటు శుక్రవారం రాత్రి నుంచి కురిసిన బారీ వర్షానికి జిల్లా మంథని మండలం విలోచవరం గ్రామసమీపంలోని రొడ్యాంపై వరద ప్రవహిస్తోంది. ఎగువన ఉన్న గుంజపడుగు, నాగారంతో పాటు కొత్త చెరువు అలుగు పడి రొడ్యాం మీదుగా వరద వెళ్తోంది. దీంతో మంథని నుంచి విలోచవరంకు రాకపోకలు నిలిచిపోయాయి. విలోచవరం వెళ్లాలంటే నాగారం మీదుగా పోతారం నుంచి రావాల్సి ఉంటుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. రాకపోకలు నిలిపివేసిన పోలీసులు విలోచవరం రొడ్యాంపై నుంచి వరదనీరు ప్రవహిస్తుండడంతో పోలీసులు రాకపోకలను నిలిపివేసి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఎస్సై డి.రమేశ్ ఆదేశాల మేరకు ఏఎస్సై మల్లయ్య, గ్రామ పోలీస్ ఆఫీసర్ రమేశ్రావు, హెడ్కానిస్టేబుల్ సురేశ్శర్మ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. పై నుంచి వరద నీరు వస్తోందని, ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అప్రమత్తమైన రైతులు భారీ వర్షాల కారణంగా గోదావరినదిలోకి వరద వచ్చే అవకాశాలు ఉండడంతో విలోచవరం, ఉప్పట్ల, గుంజపడుగు గ్రామాల రైతులు అప్రమత్తమయ్యారు. సాగునీటి కోసం గోదావరినదిలో ఏర్పాటు చేసిన బోరు మోటార్లను తీసుకు వస్తున్నారు. గతేడాది అకస్మాత్తుగా నదిలోకి భారీ వరద వచ్చి రైతుల మోటార్లు కొట్టుకుపోయాయి. ఈ క్రమంలో రైతులు ముందస్తు చర్యగా నదిలోని మోటార్లను తీసుకువస్తున్నారు. -
సైకిల్పై తిరిగొద్దాం
ఇంటి నుంచి అడుగు బయటపెట్టడమే ఆలస్యం.. వాహనం ఎక్కి దూసుకెళ్తున్నాం. ప్రమాదానికి ఆస్కారం ఉందని తెలిసినా రహదారి నిబంధనలు పట్టించుకోం. మనస్థాయికి తగ్గ వాహనాలు ఉన్నా.. వాటికి అప్పుడప్పుడు విరామమిద్దాం. వారంలో కనీసం ఒక్కరోజు ఆఫీసుకే కాదు... చిన్నచిన్న అవసరాలకు సైకిల్పై వెళ్లొద్దాం. ఆరోగ్యంగా ఉందాం. ఫిట్నెస్ కోసం ప్రత్యేకంగా జిమ్లకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. సైకిల్ తొక్కడంతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. సెలవు దొరికితే సినిమా లేదా ఎగ్జిబిషన్కు వెళ్దామా అని చాలామంది ఆలోచిస్తుంటారు. ఈ ఆదివారం పిల్లలతో కలిసి సమీపంలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లొద్దాం. రైతు పడుతున్న కష్టాన్ని తెలుసుకుందాం. పిల్లలకు సాగు పద్ధతులు తెలియచేద్దాం. చుట్టుపక్కల ఉన్న పచ్చదనంతో ఆహ్లాదంతో గడుపుదాం. ప్రకృతి విలువ అర్థమయ్యేలా వివరిద్దాం. ఇలా చేయడంతో గ్రూప్డిస్కషన్ జరుగుతుంది. పరిశీలించే గుణం పెరుగుతుంది. వాతావరణం, పంటలపై అవగాహన కలుగుతుంది. క్షేత్రస్థాయి అనుభవం వస్తుంది. -
కన్నయ్యా.. చల్లంగా చూడయ్య
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో శనివారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో చిన్నారుల వేషధారణ ఆకట్టుకుంది. ఉట్టిగొట్టేందుకు చిన్నారులు పోటీపడడాన్ని చూసిన వారంతా సంబరపడ్డారు. బీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ స్వరూప్కిరణ్, నాయకులు సత్యం, బొమ్మకంటి రవి, మురళి, తారాబాయి, కవిత, వేదశ్రీ, శ్రీవాణి తదితరులున్నారు. శాంతినగర్లోని యాదవ చారిటబుల్ ట్రస్టు ఆఫీసులో శ్రీకృష్ణుడికి పూజలు చేశారు. మారం తిరుపతి, మేకల మల్లేశం, పర్వతాలు, రాజేందర్, ఓదెలు, లక్ష్మణ్, పోచం తదితరులున్నారు. -
ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్దాం
పోటీ ప్రపంచంలో దొరికే కొద్దివిరామ సమయాన్ని పబ్బులు, రెస్టారెంట్లు, పార్కులకు కేటాయిస్తున్నారు. వీటితో కలిగే ప్రయోజనం కన్నా ఇబ్బందులే ఎక్కువ. అలా కాకుండా ఆధ్యాత్మికతను అందిపుచ్చుకుందాం. ఇష్టదైవారాధన కోసం ప్రార్థనా మందిరాలకు వెళ్దాం. అక్కడ ఓ పూట ఆనందంగా గడుపుదాం. పెద్దల సందేశాలను మన జీవితాలకు అన్వయించుకుందాం. తోటి భక్తుల్లోని మంచిని స్వీకరిద్దాం. ఒక అధ్యయనం ప్రకారం.. ప్రతీ ముగ్గురిలో ఇద్దరు అదే పనిగా ఫోన్ వినియోగిస్తుండగా వారిలో 11శాతం మంది సెల్కు బానిసలవుతున్నారు. ఇది అనేక సమస్యలకు కారణమవుతోంది. ఆదివారం ఫోన్ను పక్కన పెడదాం. పుస్తక పఠనం లేదా దినపత్రికను పూర్తిగా చదువుదాం. ఒక రోజులో 30 పేజీలకు తక్కువ కాకుండా చదివితే జ్ఞానంతోపాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. దినపత్రికలు చదవడంతో నిత్యనూతనంగా.. హుషారుగా పనిచేస్తాం. -
గ్రీన్ ఎనర్జీ దిశగా అడుగులు
జ్యోతినగర్(పెద్దపల్లి): గ్రీన్ ఎనర్జీ విస్తరణదిశగా ఎన్టీపీసీ వేగంగా అడుగులు ముందుకు వేస్తోందని రామగుండం – తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) చందన్ కుమార్ సామంత అన్నారు. స్థానిక మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో జరిగిన స్వాంతత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వాతంత్య్ర సాధన కోసం పోరాడిన వారి త్యాగాలు, ధైర్యం, సంకల్పం గురించి అందరం గుర్తుచేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా దేశభక్తి గీతాల ప్రతిధ్వనులు, త్రివర్ణ పతాక రెపరెపలు ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనభర్చిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను, బాలికలకు సైకిళ్లను అందించారు. దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత, జనరల్ మేనేజర్లు, సీనియర్ అధికారులు, ఉద్యోగ గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి ఆరెపల్లి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమం ఉధృతం
గోదావరిఖని: సింగరేణి అధికారుల సంఘం నాయకులు సమస్యల పరిష్కారం, హక్కుల సాధనకు ఉద్యమం ఉధృతం చేశారు. నాలుగు రోజులుగా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న సింగరేణి కోల్మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ (సీఎంవోఏఐ) ప్రతినిధులు.. త్వరలోనే వర్క్ టూ రూల్, ఒక రోజు సమ్మె చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తు న్నారు. ఈనెల 17న భూపాలపల్లిలో సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. పెర్ఫార్మెన్స్ రిలేటెడ్పే(పీఆర్పీ) కోసం పట్టుపడుతున్నారు. గత ఆ ర్థిక సంవత్సరంతోపాటు పదేళ్లనాటి పీఆర్పీ బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు. వీటితోపాటు వివిధ సమస్యలపై సింగరేణి సీఎండీ, డైరెక్టర్లతో ప లుదఫాలు సమావేశమైనా స్పష్టత రాలేదు. దీంతో నిరాశ, నిస్పృహలతో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంకా అందని బకాయిలు పీఆర్పీ బకాయిల కోసం రిటైర్డ్ అధికారులు ఎదురుచూస్తున్నారు. ఇవి చేతికి రాకుండానే చాలామంది ఉద్యోగ విరమణ చేశారు. వీరిలో కొందరు కో ర్టుకు వెళ్తే అనుకూల తీర్పు వచ్చినట్లు నాయకులు చెబుతున్నారు. అయినా.. బకాయిలు చెల్లించేందుకు సింగరేణి యాజమాన్యం ముందుకు రావడం లేదనే అసంతృప్తితో ఉన్నారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. -
బోర్డు ఒకటి.. దందా మరోటి
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని మినీట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న ఈ గుడిసెను చూసి కూరగాయలు విక్రయాలు చేస్తున్నారనుకుంటే తప్పులో కాలేసినట్టే.. లైసెన్స్ పొంది నిర్వహించే బార్ అండ్ రెస్టారెంట్ను తలపించేలా మద్యం, మాంసంతోపాటు బిర్యానీ ఇతర తినుబండారాలన్నీ ఈ గుడిసెలోనే లభిస్తాయన్నది నగ్నసత్యం. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో మద్యం దుకాణాలు మూసివేశారు. దీంతో ఇక్కడ మద్యం సీసాలకు రెక్కలొచ్చాయి. నిర్వాహకులు చెప్పినంత ఇస్తేనే.. మద్యం దొరుకుతుండడడంతో గత్యంతరంలేక కొనుగోలు చేస్తున్నామని మద్యం ప్రియులు వాపోతున్నారు. దీని నిర్వాహకులు ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు, వారిబంధుగణమే కావడం గమనార్హం. ప్రతినెలా అడిగినంత నజరానా ఇస్తుండడమే కారణమని పట్టణంలో చర్చించుకుంటున్నారు. వీరిని చూసి మినీట్యాంక్ బండ్ పరిసరాల్లో రోజుకో బెల్ట్షాపు పుట్టుకొస్తోందని, ఇప్పటికే చిన్నచిన్నవి ఏడెనిమిది మద్యం అమ్మకాలు సాగించే దుకాణాలు వెలిశాయంటున్నారు. ఎక్కడ మద్యం దొరక్క పోయినా.. ఏ సమయంలో వచ్చినా మినీట్యాంక్ బండ్ వద్ద మద్యం దొరుకుతుండడంతో ఈప్రాంతం నిత్యం మద్యం మత్తులో ఉన్నవాళ్లే కనిపిస్తుంటారు. ఏదైనా అవసరం నిమిత్తం రావాలంటే భయమేస్తోందని మహిళలు వాపోతున్నారు. ఇప్పటికై నా పోలీసు, ఎకై ్సజ్ తదితర శాఖల అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
లక్ష్య సాధనలో ముందుండాలి
గోదావరిఖని: వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో ప్రతీఉద్యోగి ముందుండి సింగరేణి సంస్థ అభివృద్ధిలో పాలుపంచుకోవా లని ఆర్జీ – వన్ జీఎం లలిత్కుమార్ సూచించారు. జీఎం కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించి దేశప్రగతిలో మనవంతు కర్తవ్యం చాటాలని అన్నారు. ఓసీపీలు లాభాల బాటలో కొనసాగుతుండగా, భూగర్భ గనులు నష్టాల్లో ఉన్నాయని తెలిపారు. అధికారులు భైద్యా, రమేశ్, రవీందర్రెడ్డి, రమేశ్, శ్రీనివాస్, జితేందర్సింగ్, కర్ణ, వీరారెడ్డి, సాంబశివరావు, రాజు, వసంత్కుమార్, వేణు, శ్రావణ్కుమార్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025
ఠాకూర్కు సీఎం శుభాకాంక్షలుగోదావరిఖని: రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్కు సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం పు ట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవ లో నిమగ్నమై, ప్రజాపాలనలో భాగస్వాము లు కావడానికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గంలోని పలుచోట్ల అన్నదానం, రక్తదానం తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు ఉపకారవేతనాలు గోదావరిఖనిటౌన్: జనగామ జెడ్పీ హైస్కూల్ లో కెనరా బ్యాంక్ తిరుమలనగర్ శాఖ విద్యార్థులకు బ్యాంకు ఖాతాలు ప్రారంభించింది. వి ఠల్నగర్, ఎలుకలపల్లి, జనగామ ప్రభుత్వ పా ఠశాలల్లో చదువుకుంటూ ప్రథమ స్థానంలో ని లిచిన 5, 6, 7వ తరతగతి బాలికలకు ప్రోత్సాహకంగా రూ.3 వేలు, 8, 9, 10 తరగతుల వి ద్యార్థినులకు రూ.5వేల చొప్పున స్కాలర్షిప్స్ డిపాజిట్ చేసి పాస్పుస్తకాలు అందజేశారు. బ్యాంక్ మేనేజర్ అజిత్, ప్రధానోపాధ్యాయురాలు జ్యోష్ణలత, ఉపాధ్యాయులు ఉన్నారు. ఒకే భవనం.. మూడు జెండాలు జూలపల్లి(పెద్దపల్లి): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్థానిక సహకార సంఘ భవనం ఎదుట మూడు జాతీయ జెండాలను ఒకేసారి ఆవిష్కరించారు. సహకార సంఘ భవనంలో వ్యవసాయ, శాఖ గ్రంథాలయం, ప్యాక్స్ కా ర్యాలయాలు ఉన్నాయి. దీంతో ఏటా ఒకేసారి మూడు జాతీయ జెండాలు ఎగురవేయడం ఆనవాయితీగా వస్తోంది. ఏవో ప్రత్యూష లైబ్రేరియన్ మౌళి, ప్యాక్స్ చైర్మన్ కొంజెర్ల వెంకటయ్య త్రివర్ణ పతాకాలు ఆవిష్కరించారు. అందుబాటులో యూరియా పెద్దపల్లిరూరల్: రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని, ఎరువుల కోసం ఆందోళన వద్దని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం యూరియా పంపిణీపై వ్యవసాయాధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అవసరాల కన్నా ఎక్కువ నిల్వ చే సుకోవద్దని సూచించారు. కొందరు డీలర్లు సై తం ఎరువుల విక్రయాల్లో అవకతవకలకు పా ల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, వాస్తవమమని తేలితే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. డీఏవో శ్రీనిఆవస్, ఏడీఏ కాంతారావు, అంజనీతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఎల్కలపల్లికి ఆర్టీసీ బస్సు ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): పాలకుర్తి మండ లం ఎల్కలపల్లికి పల్లెవెలుగు ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ శుక్రవారం ప్రా రంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరిఖని నుంచి ఎఫ్సీఐ ఎల్కలపల్లి గేట్ మీదు గా గుంటూరుపల్లి, ఎల్కలపల్లి గ్రామాలను క లుపుతూ సబ్బితం నుంచి పెద్దపల్లి వరకు బ స్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ప్రజలు స ద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మ నాలీ ఠాకూర్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న ఒబెదుల్లా కొత్వాల్ సాహెబ్ మహిళా పోలీసు బలగాల కవాతు సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంసాక్షి, పెద్దపల్లి: ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగిస్తున్నామని రాష్ట్ర మైనారిటీస్ ఫైనా న్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఒబెదుల్లా కొ త్వాల్ సాహెబ్ అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని పరేడ్ గ్రౌండ్స్లో శుక్రవారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవానికి ఒబెదుల్లా కోత్వాల్ సాహెబ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత ఆయన పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి మాట్లాడారు. మహిళలకు అండగా.. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లోఉచిత ప్రయాణ సౌకర్యం కల్పి స్తున్నామని, దీనిద్వారా జిల్లాలో ఇప్పటివరకు రూ.155.80 కోట్ల వరకు ఆదా అయిందని కొత్వాల్ సాహెబ్ అన్నారు. రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ను ప్రభుత్వం అందిస్తోందని, దీనిద్వారా ఇప్పటి వరకు 1,18,397 కుటుంబాలకు రాయితీగా వారి బ్యాంక్ ఖాతాల్లో రూ.14.3 కోట్లు జమచేశామ న్నారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తున్న వారికి రూ. 85.24 కోట్లు చెల్లించి 1,31,966 కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేశామని ఆయన తెలిపారు. సొంతింటి కల నెరవేరేలా.. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశ పెట్టిందని, జిల్లాలో తొలివిడతలో ఇప్పటివరకు 6244 ఇళ్లు మంజూరు చేసి రూ.19.52కోట్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని కొత్వాల్ సాహెబ్ అన్నారు. ఉగాది పండుగనాడు సన్నబియ్యం పంపిణీని ప్రారంభించించామని, కొత్తగా 12,168 కుటుంబాలకు రేషన్కార్డులు అందజేశామని ఆయన వివరించారు. రైతులకు పెట్టుబడి సహాయాన్ని రూ.12 వేలకు పెంచి వానాకాలం పంటల కోసం 1,51,507 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.161.2 కోట్ల భరోసా నిధులు జమచేస్తామని ఆయన వివరించారు. చివరి ఆయకట్టు రైతులకు భరోసా.. కాకతీయకాలువ కింద సుమారు 2.30 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 10 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు శ్రీలక్ష్మీనరసింహస్వామి పత్తిపాక రిజర్వాయర్ నీటి నిల్వ సా మర్థ్యాన్ని 3 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు పెంచామని, దీని డీపీఆర్ తయారీ కోసం రూ.1.10 కోట్లు మంజూరు చేశామని ఆయన తెలిపారు. దీంతోపాటు 13,396 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు రామగుండం ఎత్తిపోతల పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికను పూర్తిచేసి ఇటీవల ప్రారంభించామని ఆయన గుర్తుచేశారు. చిల్లపల్లి గ్రామానికి అవార్డు మంథని మండలం చిల్లపల్లి గ్రామ పంచాయతీకి ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ కేటగిరీలో దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారం లభించిందని ఒబెదుల్లా అన్నారు. పట్టణ ప్రాంతాల్లో రూ.173 కోట్లు ఖర్చు చేస్తూ సీసీ రోడ్లు, సీసీ డ్రెయినేజీలు, బీటీ రోడ్లు, శ్మశానవాటికలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, పురపాలక భవనం, డంప్యార్డ్ వంటి పనులు చేపట్టామని తెలిపారు. అమృత పథకం 2.0 కింద రూ.293.84కోట్లతో ఫీవర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మిస్తున్నామని అన్నారు. ప్రతిభావంతులకు పురస్కారాలు విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన 203 మంది ఉద్యోగులకు కొత్వాల్ సాహెబ్ ప్రశంసాపత్రాలు పంపిణీ చేశారు. పదో తరగతి, ఇంటర్లో టాపర్లుగా నిలిచిన నలుగురు విద్యార్థులకు రూ.10వేల చొప్పున ప్రోత్సాహకం అందించారు. మెప్మా కింద 148 స్వయం సహాయక సహాయ మహిళా సంఘాలకు రూ.17,36,98,000 బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, వేణు, డీసీపీ కరుణాకర్, ఆర్డీవో గంగయ్య, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జెండాకు వందనం చేస్తున్న ప్రతినిధులు -
చాలామంది రిటైర్ అయ్యారు
15 ఏళ్ల నాటి పీఆర్పీ ఇప్పటికీ చెల్లించలేదు. చాలామంది పీఆర్పీ తీసుకోకుండానే రిటైర్డ్ కాగా మరికొందరు చనిపోయారు. కోర్టు తీర్పు ఇచ్చినా అమలు కావడం లేదు. – పెద్ది నర్సింహులు, ప్రధాన కార్యదర్శి సీఎంవోఏఐ పరిష్కారమయ్యే వరకూ పోరు సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయి. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతలో అహర్నిశలు శ్రమిస్తున్న అధికారుల విషయంలో సింగరేణి ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. సీఎండీ, డైరెక్టర్ల దృష్టికి సమస్యలు తీసుకెళ్లి నా పరిష్కారం కాలేదు. ఆందోళనలు ఉధృతం చేసేందుకు ఈనెల 17న భూపాలపల్లి లో సమావేశమై కార్యాచరణ రచిస్తాం. – టి.లక్ష్మీపతిగౌడ్, అధ్యక్షుడు, సీఎంవోఏఐ -
క్రెడిట్ కార్డుల కమీషన్ పేరుతో డబ్బులు స్వాహా..
● నిందితుడి అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన ఇన్స్పెక్టర్ శివకుమార్ వరంగల్ క్రైం: క్రెడిట్ కార్డుల ద్వారా క మీషన్ తీసుకోకుండా డబ్బులు ఇస్తానంటూ బాధితుల నుంచి లక్షలు స్వాహా చే సిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు హనుకొండ ఇన్స్పెక్టర్ ఎం.శివకుమార్ తెలి పారు. గురువారం పీఎస్లో నిర్వహించి న విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లికి చెందిన నేరెళ్ల అరుణ్ 2023లో హనుమకొండ రాయపురలో ‘భద్రకాళి డిజిటల్ సేవ’ పేరుతో షాపు ఏర్పాటు చేశాడు. ఆన్లైన్ అప్లికేషన్స్తోపాటు కస్టమర్ల క్రెడిట్ కార్డు స్వైప్ చేసి వారికి డబ్బులు ఇచ్చేవాడు. రెగ్యులర్ కస్టమర్లను తన వాలెట్లో యాడ్ చేసుకుని వారి క్రెడిట్ కార్డుల్లో బ్యాలెన్స్ ఉంటే ఫోన్ చేసేవాడు. తాను వేరే పేమెంట్ చేసేది ఉందని చెప్పి వారి కార్డులు స్వైప్ చేసి వారికి ఎలాంటి చార్జీలు లేకుండా తానే క్రెడిట్ కా ర్డుల బిల్లులు చెల్లిస్తానని మోసం చేసేవాడు. కార్డులు స్వైప్ చేసిన తర్వాత వేరే కస్టమర్ల కార్డులు పేమెంట్ చేసి దానికి 4 శాతం వరకు చార్జీ తీసుకుని లాభం పొందేవాడు. ఎలాంటి కమీషన్ లేకుండా డబ్బులు డ్రా చేసి ఇస్తానని నమ్మించి డబ్బులు వాడుకున్న అనంతరం కొన్ని రోజుల తర్వాత ఇతరుల క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించేవాడు. ఏడాదిన్నరపాటు కస్టమర్లకు నమ్మకంగా ఉంటూ వారి క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లిస్తూ, క్రెడిట్ కార్డులు స్వైప్ చేస్తూ బాధితుల డబ్బుల నుంచి తన క్రాప్ లోన్, అప్పులు కట్టుకున్నాడు. ఇలా సుమారు రూ.28 లక్షలు వాడుకున్నాడు. కొద్ది రోజులుగా విజయవాడలో ఉంటున్న నిందితుడు బుధవారం షాపు ఖాళీ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించగా అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
ఆంజనేయరాజుకు అవార్డు
జ్యోతినగర్(రామగుండం): రామగుండంలోని ఎన్టీపీసీ సీ ఐఎస్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ ఎస్.ఆంజనేయరాజు కు ప్రతిష్టాత్మక రాష్ట్రపతి మె రిటోరియస్ సర్వీస్ పతకం లభించింది. ఆంజనేయరాజు సేవలను గుర్తించిన అధికారులు.. ఆయనను మెరిటోరియస్ సర్వీస్ మెడల్కు ఎంపిక చేశారు. ఆయనను సీఐఎస్ఎఫ్ సీనియర్ కమాండెంట్ అరవింద్ కుమార్, అధికారులు, జవాన్లు, ప్రాజెక్టు అధికారులు తదితరులు అభినందించారు. ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ పర్యటనఎలిగేడు(పెద్దపల్లి): స్వచ్చ సర్వేక్షణ్ గ్రామీణ్– 2025 కేంద్ర బృందం గురువారం ధూళికట్టలో పర్యటించింది. స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రా లు, ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించింది. సేవలపై ఆరా తీసింది. ఇంకుడుగుంతలు, మరుగు దొడ్ల వినియోగం, కిచెన్ గార్డెన్లు, డ్రైనేజీలు తదితర వాటి ఫొటోలు తీసుకుంది. సభ్యులు వి.మధు, డి.రజిత ఎంపీడీవో భాస్కర్రావు, ఎంపీవో కిరణ్, ఎస్బీఎం కో ఆర్డినేటర్ రాఘవులు, పంచాయతీ కార్యదర్శులు పున్నమ య్య, అంజలి, ఏపీవో సదానందం, ఏపీఎం గీత, సీసీ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. సింగరేణి అధికారుల నిరసన రామగిరి(మంథని): పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్పీ) కోసం సింగరేణి అధికారులు మూడురోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఆర్జీ–3 ఏరియా ఓసీపీ–1, 2, అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులోని వివిధ విభాగాల అధికారులు జీఎం కార్యాల యం ఎదుటట నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సీఎంవోఏఐ నాయకులు మాట్లాడుతూ 2022–23, 2023–24 ఆర్ధిక సంవత్సరాల పీఆర్పీ ఇప్పటివరకు చెల్లించలేదన్నారు. కోల్ ఇండియాలో ఏటా చెల్లిస్తోందన్నారు. డిప్యూటి సీఎం భట్టివిక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు, సింగరేణి సీఎండీ బలరాం నాయక్ చొరవ తీసుకుని సమస్యలు పరిష్కారించాలని కోరా రు. జీఎంలు సుధాకర్రావు, నాగేశ్వరరావు, అధికారుల సంఘం నేతలు వెంకటరమణ, శ్రీనివాస్రావు, సుదర్శనం పాల్గొన్నారు. బీజేపీ తిరంగా యాత్ర పెద్దపల్లిరూరల్: బీజేపీ ఆధ్వర్యంలో గురువా రం జిల్లా కేంద్రంలో తిరంగా యాత్ర నిర్వహించారు. కో ఆర్డినేటర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రగతినగర్ చౌరస్తా నుంచి కమాన్ వరకు యాత్ర కొనసాగింది. నాయకులు ఠాకూర్ రాంసింగ్, జంగ చక్రధర్రెడ్డి, నల్ల మనోహర్రెడ్డి, పల్లె సదానందం, ఫహీం, క్రాంతి, లక్ష్మీనారాయణ, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.పదవీకాలం పొడిగింపు సుల్తానాబాద్(పెద్దపల్లి): ప్రాథమిక వ్యవసా య సహకార సంఘాల పదవీకాలం మరో ఆ ర్నెల్లపాటు పొడిగించినట్లు ఉత్తర్వులు జారీ అ య్యాయని డీసీవో శ్రీమాల తెలిపారు. పీఏసీఎ స్ పదవీకాలం గురువారం ముగిసిందన్నారు. దీంతో పీఏసీఎస్ల పదవీకాలం పొడిగిస్తూ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చిందని వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రికి మహర్దశ మంథని: స్థానిక ప్రభుత్వ సామాజిక వైద్యశాలకు మహర్దశ పట్టనుంది. సౌకర్యాల కల్పన, డాక్టర్ల నియామకం, పలు అభివృద్ధి పనులకు రూ.20లక్షలు మంజూరు కావడంతో ఆస్పత్రి రూపురేఖలు మారుతాయని జిల్లా మెడికల్ సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు. ఇద్దరు డాక్టర్ల నియామకం, రూ.5లక్షలతో వెయిటింగ్హాల్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయన్నారు. మాతాశిశు ఆస్పత్రిలో గర్భిణుల కోసం రూ.12లక్షలతో అల్ట్రా సౌండ్ స్కానింగ్, శిశువు ల కోసం రూ.1.12లక్షలతో వార్నర్, ఫొటో థె రపీ, రూ.1.80లక్షలతో ఆర్వో ప్లాంట్ ఏర్పా టు చేస్తామన్నారు. మంత్రి శ్రీధర్బాబు ఆదేశాలతో కలెక్టర్ నిధులు మంజూరు చేశారన్నారు. రేపు ఎస్జీఎఫ్ క్రీడాపోటీలు జ్యోతినగర్(రామగుండం): జిల్లాస్థాయి ఎస్జీఎ ఫ్ క్రీడా ఎంపిక పోటీలు ఈనెల 16న నిర్వహించనున్నట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్ తెలిపారు. ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్లో అండర్–15లో వాలీబాల్, ఫుట్ బాల్ పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. -
ప్రజారోగ్యంతో చెలగాటం
కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు, బయో మెడికల్ వేస్ట్(జీవ వైద్య వ్యర్థాలు) నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. లక్ష్మీనగర్లో బల్దియా పారిశుధ్య విభాగం అధికారులు గురువారం చేసిన తనిఖీల్లో ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు బహిరంగ ప్రదేశాల్లో పడేసిన బయో మెడికల్ వేస్ట్ వెలుగు చూసింది. ప్రమాదకరమైన బయో మెడికల్ వేస్ట్ను బయట పడవేసిన శ్రీఅదితి హాస్పిటల్కు రూ.లక్ష, సత్యం హాస్పిటల్కు రూ.50వేలు, వెంకటసాయి క్లినికల్ ల్యాబ్కు రూ.10వేలు జరిమానా విధించారు. బయో మెడికల్ వేస్ట్ను బహిరంగ ప్రదేశాల్లో వేస్తే జరిమానా విధించడంతోపాటు మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. -
బీదబిడ్డల చదువంటే మంత్రికి చులకనే..
మంథని: అట్టడుగు వర్గాలకు చెందిన బిడ్డల ఉన్నత చదువులంటే మంత్రికి చులకనేనని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆరోపించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను గురువారం ఆయన సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉన్నత విద్యను ప్రోత్సహిస్తున్నామని చెబుతున్న మంత్రి.. జేఎన్టీయూలో స్థానికేతర విద్యార్థులు 118మంది ఉంటే 72మంది మంథనికి చెందిన వాళ్లుఉన్నారని, పాలిటెక్నిక్లో వంద మందికి కేవలం 16మంది మాత్రమే మంథని ప్రాంతవాసులు ఉన్నారని, తద్వారా ఇవి ఎవరికి ఉపయోగపడుతున్నాయో ఆలోచన చేయాలన్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టించడం తప్ప పేదవిద్యార్థుల భవిష్యత్ కోసం ఆలోచన లేదన్నారు. తనను కేసుల్లో ఇరికించాలని ఎన్నిప్రయత్నాలు చేసినా భయపడేది లేదని, శ్వాస ఉన్నంతవరకు ప్రజల కోసం పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. నాయకులు ఏగోళపు శంకర్గౌడ్, ఆరెపల్లి కుమార్, కనవేన శ్రీనివాస్, గోనే శ్రీనివాసరావు, మాచిడి రాజుగౌడ్, వేల్పుల గట్టయ్య, గొబ్బూరి వంశీ తదితరులు పాల్గొన్నారు. -
పొలిటికల్ బ్రాండ్.. మెట్పల్లి ఖాదీ ప్రతిష్టాన్
కోరుట్ల/మెట్పల్లి: ఇక్కడి నేతలకు ఖాదీ బట్టలే స్ఫూర్తి. చాలా మందికి ఖాదీ రాజకీయంగా ఊపిరి పోసిందంటే అతిశయోక్తి కాదు. స్వాతంత్య్ర పోరా టకాలంలో ఖాదీ ఉద్యమానికి వేదికగా నిలిచింది జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి. గాంధీ శిశ్యుడు అన్నాసాహెబ్ ఆధ్వర్యంలో మెట్పల్లిలో వెలిసిన ఖాదీ ప్రతిష్టాన్ ఖద్దరు ఆ కాలంలో ఖ్యాతి పొందింది. అప్పటి ఆనవాయితీని పుణికిపుచ్చుకుని మెట్పల్లి ప్రాంత రాజకీయ నాయకులు ఖాదీ వస్త్రాలు ధరించడం ఇప్పటికీ దూరం కాలేదు. కడక్ ఖాదీ బట్టలతో ఎవరైనా కనిపిస్తే చాలు ఈయన మెట్పల్లి లీడరని చెప్పొచ్చు. 1983లో ఎన్టీఆర్ ప్రభుత్వ హయంలో కార్మికశాఖ మంత్రిగా పనిచేసిన వర్ధినేని వెంకటేశ్వర్రావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్రావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ కేవీ.రాజేశ్వర్రావు, జనతా పార్టీ నుంచి ఏకై క ఎమ్మెల్యేగా ఎన్నికై న కొమొరెడ్డి రామ్లు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ ఖాదీ ప్రతిష్టాన్ వస్త్రాలు ధరించి రాజకీయాల్లో కీలకంగా ఎదిగినవారే. 2009 అసెంబ్లీ పునర్విభజనలో కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంగా మారినప్పటికీ.. మెట్పల్లి ఖాదీ కార్ఖానా స్ఫూర్తిగా రాజకీయాల్లోకి వచ్చిన నేతలు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, సంజయ్ ఇక్కడి ఎమ్మెల్యేలుగా కొనసాగడం గమనార్హం. -
సేవలకు దక్కిన గౌరవం
జగిత్యాలక్రైం/మల్యాల: విధి నిర్వహణలో వారు ఎప్పుడూ ముందున్నారు. తమ సర్వీసులో ఏనాడూ మచ్చ కూడా ఎరగరు. వారి సేవలను గుర్తించిన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనేక పతకాలు అందించింది. తాజాగా ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్కు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. జగిత్యాల స్పెషల్ బ్రాంచ్ ఏఎస్సై రాజేశుని శ్రీనివాస్, మల్యాల పోలీస్స్టేషన్ ఏఎస్సై రుద్ర కృష్ణకుమార్కు మెడల్ ప్రకటించింది. రాజేశుని శ్రీనివాస్ 1989లో కానిస్టేబుల్గా పోలీసుశాఖలో చేరారు. 2012లో హెడ్ కానిస్టేబుల్గా, 2019లో ఏఎస్సైగా పదోన్నతి పొందారు. 2012లో రాష్ట్ర పోలీసు సేవా పథకం, 2019లో ఉత్తమ సేవా పథకం అందుకున్నారు. 36ఏళ్లుగా పోలీస్ పోలీసు శాఖకు చేస్తున్న సేవలను గుర్తించి కేంద్రప్రభుత్వం ఇండియన్ పోలీస్ మెడల్కు ఎంపిక చేసింది. అలాగే రుద్ర కృష్ణ కుమార్ 1989లో కానిస్టేబుల్గా పోలీసుశాఖలో చేరారు. 2017లో హెడ్కానిస్టేబుల్గా.. 2021లో ఏఎస్సైగా పదోన్నతి పొందారు. 2022లో రాష్ట్ర పోలీసు సేవా పథకానికి ఎంపికయ్యారు. 36 ఏళ్లుగా చేస్తున్న సేవలను గుర్తించి ఇండియన్ పోలీస్ మెడల్కు ఎంపిక చేశారు. ఇద్దరిని జగిత్యాల ఎస్పీ అశోక్కుమార్ అభినందించారు. కష్టపడి పనిచేసే పోలీస్ అధికారులకు గుర్తింపు వస్తుందని తెలిపారు. గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజేశుని శ్రీనివాస్ రుద్ర కృష్ణకుమార్ ఇండియన్ పోలీస్ మెడల్కు ఇద్దరు ఏఎస్సైలు -
ప్రజలు ఏకతాటిపైకి రావాలి
● రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ గోదావరిఖని: న్యాయ సమ్మతమైన ఎన్నికల కోసం ప్రజలు ఏకం కా వాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ కోరారు. స్థాని క ప్రధాన చౌరస్తాలో గురువారం రాత్రి కొ వ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ‘ఓట్ల దొంగలు – గద్దె దిగండి’ అంటూ నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యంలో పవిత్రమైన ఓటును దోచుకునే వారికి రాజకీయాల్లో స్థానం ఉండవద్దని అన్నారు. నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేశ్, తిప్పారపు శ్రీనివాస్, ప్రకాశ్ పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యం పాలకుర్తి(రామగుండం): గ్రామాల అభివృద్ధే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. బసంత్నగర్, పాలకుర్తి, ఈసాలతక్కళ్లపల్లి, కొత్తపల్లి, రామారావుపల్లి, పుట్నూర్, జయ్యారం, కుక్కలగూడూర్, వేంనూర్ గ్రామాల్లో చేపట్టిన రోడ్లు, తదితర అభివృద్ధి పనులకు తన సతీమణి మనాలీ ఠాకూర్తో కలిసి గురువారం భూమిపూజ చేశారు. కొత్త రేషన్ కార్డులు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రతీ సంక్షేమ పథకం అర్హులైన ప్రతీఒక్కరికి అందిస్తామన్నారు. నాయకులు తిరుపతి, మనోహర్రెడ్డి, రమేశ్, శ్రీనివాస్, సూర సమ్మయ్య, పర్శవేని శ్రీనివాస్, తంగెడ అనిల్రావు, తలారీ శంకర్, శిలగాని రాజేశం, మల్లెత్తుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన రామగుండం: అంతర్గాం, రామగుండంలో ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కుందనపల్లి అర్బన్ పార్క్లోని అటవీశాఖ జిల్లా నివాసాన్ని ప్రారంభించారు. -
సూక్ష్మకళ.. భళా
ఓదెల(పెద్దపల్లి): మడక గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆడెపు రజనీకాంత్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పెన్సిల్ మొనపై 4 మి.మీ. పొడవు, 2 మి.మీ. వెడల్పుతో అతిచిన్న జాతీయ జెండా రూపొందించారు. ఇందుకోసం సుమారు గంట సమయం తీసుకున్నారు. చాక్పీస్పై 7 మి.మీ. పొడవు, 5 మి.మీ. వెడల్పుతో గంట పది నిమిషాలపాటు శ్రమించి చెక్కారు. చాక్పీస్పై హ్యాపీ ఇండిపెండెన్స్డే ఆంగ్ల అక్షరాలు చెక్కి శుభాకాంక్షలు చెక్కారు. వీటిని వివిధ బుక్ ఆఫ్ రికార్డులకు ప్రతిపాదించినట్లు రజనీకాంత్ తెలిపారు. -
లీడింగ్ ఫైర్ ఆఫీసర్ వహిదుల్లాఖాన్కు రాష్ట్రపతి పతకం
మెట్పల్లి: జగిత్యాల జిల్లా మెట్పల్లి ఫైర్ స్టేషన్లో లీడింగ్ ఫైర్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న వహిదుల్లాఖాన్ అత్యున్నత పురస్కారమైన రాష్ట్రపతి పతకానికి ఎంపికయ్యారు. 1986లో ఫైర్మెన్గా అగ్ని మాపక శాఖలో చేరిన ఆయన.. ఆసిఫాబాద్, ఇచ్చోడ, ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్లో పని చేసి.. రెండేళ్ల క్రితం మెట్పల్లికి బదిలీపై వచ్చారు. 2015లో లీడింగ్ ఫైర్మెన్గా పదోన్నతి పొందారు. మొదటి నుంచి అంకితభావంతో పనిచేసే ఆయన విపత్తుల సమయాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తారనే పేరు సంపాదించారు. అత ని సేవలకు గుర్తింపుగా ఇప్పటివరకు ఆరు ప్రశంసపత్రాలు, ఒక సేవాపతకం ప్రదానం చేశారు. ప్రస్తుతం రాష్ట్రపతి పతకానికి ఎంపిక కావడంపై ఆయనను ఉన్నతాధికారులు అభినందించారు. లీడింగ్ ఫైర్మెన్ గోపాల్రెడ్డికి రాష్ట్రపతి అవార్డు జమ్మికుంట: జమ్మికుంట పట్టణ అగ్నిమాపక కేంద్రంలో లీడింగ్ ఫైర్మెన్గా విధులు నిర్వహిస్తున్న బీరెడ్డి గోపాల్రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఫైర్మెన్గా విధుల్లో అత్యంత ఉత్తమ సేవలు అందించినందుకు రాష్ట్రపతి అవార్డుకు ఎంపికయ్యారు. ఫైర్ ఆఫీసర్గా విధుల్లో క్రమ శిక్షణ, నిబద్ధతతో పని చేసినందుకు అవార్డుకు ఎంపికై నట్లు గోపాల్రెడ్డి తెలిపారు. -
చిల్లపల్లి కార్యదర్శికి సన్మానం
పెద్దపల్లిరూరల్/మంథనిరూరల్: గతేడాది జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీ అవార్డు అందుకున్న మంథని మండ లం చిల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాంకిశోర్ను భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ, పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సన్మానించా రు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో చిల్లపల్లి సెక్రటరీతోపాటు రాష్ట్రంలోని వివిధ గ్రామ పంచాయతీలకు చెందిన మరో ఐదుగురు కార్యదర్శులను సత్కరించారు. వీరితోపాటు పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య ఆగస్టు 15న న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్య్ర వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు. సర్పంచులు లేకపోవడంతో వారి స్థానంలో పంచాయతీ కార్యదర్శులను ఆహ్వానించారు. నేడు ఎర్రకోటలో పంద్రాగస్టు వేడుకలకు హాజరు -
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
గోదావరిఖని: బాధితుల ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పందించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగం గురువారం గోదావరిఖని వన్టౌన్ పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్, కోర్టు, దర్యాప్తు కేసులపై ఆరా తీశారు. ప్రజల్లో విశ్వాసం పెంపొందించడానికి ప్రతీఒక్కరు క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు. అనంతరం ఠాణా ఆవరణలో మొక్కలు నాటారు. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరిఖని ఏసీపీ రమేశ్, వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, రవీందర్, ఎస్సైలు భూమేశ్, రమేశ్ పాల్గొన్నారు. -
రైళ్ల హాల్టింగ్ పునరుద్ధరణ
రామగుండం: పెద్దపల్లి, రామగుండం రైల్వేస్టేషన్లలో గతంలో రద్దు చేసిన పలు ఎక్స్ప్రెస్ రైళ్ల హాల్టింగ్ను ఈనెల 15న పునరుద్ధరించనున్నట్లు ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం అధ్యక్షుడు కంకటి ఫణి గురువారం తెలిపారు. ఐఆర్సీటీసీ రైల్వే పోర్టల్లోపై వాటి రాకపోకలు, హాల్టింగ్ మార్పును అప్డేట్ చేయనున్నట్లు వెల్లడించారు. హాల్టింగ్ పునరుద్ధరణ ఇలా.. రైలు నంబరు : 12656 : చైన్నె సెంట్రల్–అసర్వ జంక్షన్ (నవజీవన్ సూపర్ఫాస్ట్): పెద్దపల్లి జంక్షన్కు రాత్రి 8.59 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో(12655) సాయంత్రం 4.45గంటలకు చేరుకుంటుంది. రైలు నంబరు : 22737 : సికింద్రాబాద్–హిస్సార్ (హిస్సార్ సూపర్ఫాస్ట్): ప్రతీ మంగళ, బుధవారాల్లో పెద్దపల్లి జంక్షన్కు వేకువజామున 2.34గంటలకు చేరుకుంటుంది. దీనికి ఈనెల 19 నుంచి హాల్టింగ్ ఉంటుంది. రైలు నంబరు : 17005 : హైదరాబాద్–రక్సోల్ (రక్సోల్ సూపర్ఫాస్ట్): ప్రతీ గురువారం వేకువజామున 2.34గంటలకు పెద్దపల్లి జంక్షన్కు చేరుకుంటుంది. ఈనెల 21 నుంచి పెద్దపల్లి జంక్షన్లో హాల్టింగ్ ఉంటుంది. రైలు నంబరు : 17006 : రక్సోల్ –హైదరాబాద్ (రక్సోల్ సూపర్ఫాస్ట్): ప్రతీ ఆదివారం రాత్రి 11.59గంటలకు పెద్దపల్లి జంక్షన్కు చేరుకుంటుంది. ఈనెల 17 నుంచి హాల్టింగ్ ఉంటుంది. రైలు నంబరు : 12295 : బెంగళూరు–దాణాపూర్ (సంఘమిత్ర సూపర్ఫాస్ట్): ప్రతీరోజు వేకువజామున 2.09గంటలకు రామగుండం రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. శుక్రవారం నుంచి హాల్టింగ్ ఉంటుంది. -
పంద్రాగస్టుకు పోదువు.. లే కొడుకా
తిమ్మాపూర్: ఉదయం అందరితో కలిసి సంతోషంగా బడికి వెళ్లాడు. తెల్లవారితే పంద్రాగస్టు కావడంతో ఆ వేడుకల గురించే తోటి పిల్లలతో మాట్లాడుకుంటూ ఇంటికి ఆటోలో బయల్దేరా డు. కానీ, ఆ బాలుడి ఆనందం మార్గంమధ్యలోనే ఆవిరైంది. ఆటో ప్రమాదం అనంతలోకాలకు తీసుకెళ్లింది. ‘పంద్రాగస్టుకు పోతువు లే.. కొడుకా’ అంటూ తల్లిదండ్రులు రోదించిన తీ రు స్థానికులను కన్నీరు పెట్టించింది. ఈ విషాద ఘ టన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. తిమ్మాపూర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థులతో స్కూల్ నుంచి ఆటో మన్నెంపల్లికి బయల్దేరింది. గ్రామానికి 500మీటర్ల దూరంలో కుక్కలు ఆటో వెంట పరుగెత్తడంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. 15మంది చిన్నారుల్లో నలుగురుకి తీవ్రగాయాలు, మిగిలినవారికి స్వల్ప గాయాలయ్యాయి. మ న్నెంపల్లికి చెందిన 4వ తరగతి విద్యార్థి నాంపల్లి హ ర్షవర్ధన్ (9) తీవ్రంగా గాయపడ్డాడు. ఆటో ఎడమవై పు కూర్చున్న హర్షవర్ధన్న్పై ఆటో బరువుపడడంతో పాటు, పగిలిన ఆటో అద్దాలు అతని తలలో గుచ్చుకున్నాయి. ఎడమ చేయి కూడా దెబ్బతిని నుజ్జునుజ్జుగా మారింది. వెంటనే ఆస్పత్రికి తరలించినా గా యాల తీవ్రతతో హర్షవర్ధన్ మృతి చెందాడు. అదే ఆటోలో హర్షవర్ధన్ అక్క నాంపల్లి శ్రీసాహితి కూడా ఉంది. తమ్ముడు కళ్లముందే తీవ్రంగా గాయపడడం చూసి బోరున విలపించింది. హర్షవర్ధన్ తల్లిదండ్రులు నాంపల్లి శ్రీనివాస్, సమతలు వ్యవసాయం చేస్తూ, కష్టపడి పిల్లలను చదివిస్తున్నారు. ఈ దుర్ఘటన వారి కుటుంబాన్ని తీవ్ర శోకంలో ముంచెత్తింది. శ్రీనివాస్ ఫిర్యాదుతో ఆటో డ్రైవర్ అనిల్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. పాఠశాలకు వెళ్లొస్తుండగా అదుపుతప్పిన ఆటో నాలుగేళ్ల బాలుడి దుర్మరణం.. నలుగురికి తీవ్రగాయాలు రెండు నిమిషాల్లో ఇంటికి చేరే క్రమంలో ప్రమాదం కరీంనగర్ జిల్లా మన్నెంపల్లి శివారులో ఘటన -
శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025
మా భూమి.. మా దేశం.. మా ప్రాంతం.. మా సొత్తు.. మా మనుషులు నినాదంతో ఎందరో మహనీయుల పోరాటాలతో సాధించుకున్న స్వాతంత్య్ర భారతదేశం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఉద్యమ సమయం నాటి అనేక సంఘటనలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇంకా కళ్లముందు కదలాడుతున్నాయి. స్వాతంత్య్ర పోరాటానికి వేదికై న మెట్పల్లి ఖాదీప్రతిష్టాన్ విదేశీ వస్తు బహిష్కరణలో కీలక పాత్ర పోషించింది. తాజాగా పొలిటికల్ బ్రాండ్గా పేరొందుతోంది. ఉమ్మడి జిల్లానుంచి ఎందరో మహనీయులు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. అమరులైన వారి పేరిట శిలాఫలకాలు ఆయా ప్రాంతాల్లో దర్శనమిస్తున్నాయి. నాటికీ.. నేటికీ పరిస్థితులు మారాయి. 78 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది. అయినప్పటికీ విద్య, వైద్యం, చట్టాలపై మరింత చైతన్యం రావాల్సిన అవసరం ఉందని నేటి యువత అంటోంది. 2047 నాటికి వందేళ్ల భారతదేశాన్ని పునర్నిర్మిస్తామని సగర్వంగా చెబుతోంది. నేడు 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. -
పోరాటాల ‘గాలిపల్లి’
ఇల్లంతకుంట: పోరాటాల గ్రామంగా చరిత్రలో నిలిచిపోయింది రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. నిజాంపాలిత ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రానికి ఇంకా విముక్తి లభించలేదు. బద్ధం ఎల్లారెడ్డి ప్రాంతమైన గాలిపల్లి ప్రజలు నైజాం పాలనపై తిరగబడ్డారు. 1948 సెప్టెంబర్ మొదటి వారంలో రజాకార్లు గాలిపల్లికి వచ్చారు. తిరుగుబాటుదారులు వారిసైన్యంపై రాళ్లు విసిరారు. రజాకార్ల కాల్పుల్లో తిరుగుబాటుదారుల్లో ముందువరుసలో ఉన్న 11మంది చనిపోయారు. వీరిలో గాలిపల్లికి చెందిన వారు ఏడుగురు, బేగంపేట, సోమారంపేట, తాళ్లపల్లి, నర్సక్కపేట గ్రామాలకు చెందినవారు నలుగురు ఉన్నారు. రజాకార్ల పాలన నుంచి విముక్తి కలిగిన తరువాత గాలిపల్లిలో దాదాపు 20మందికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్రీడంఫైటర్ పింఛన్లు మంజూరు చేశాయి. -
ఇందిరమ్మ లబ్ధిదారులకు అప్పు ఇవ్వండి
● స్వశక్తి సంఘాలకు కలెక్టర్ శ్రీహర్ష సూచన పెద్దపల్లిరూరల్: ఇం దిరమ్మ ఇల్లు మంజూరైన స్వశక్తి సంఘాల మహిళలకు రూ.లక్ష అప్పు ఇ వ్వాలని కలెక్టర్ కో య శ్రీహర్ష స్వశక్తి సంఘాల ప్రతినిధులకు సూచించారు. కలెక్టరేట్లో గురువారం వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. సీ్త్రనిధి, బ్యాంక్ లింకేజీ రుణ లక్ష్యాలు పూర్తికావాలని సూచించారు. ఈనెల 26న విదేశాల్లో ఉపాధి అవకాశాలపై టామ్కామ్ ద్వారా అవగాహ న సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. పీఎంశ్రీ పాఠశాల, యంగ్ఇండియా గురుకులాలు, జూనియర్, డిగ్రీకాలేజీలు, గోదావరిఖని శాతవాహన యూనివర్సిటీ అడ్మిన్బ్లాక్, సుల్తానాబాద్ బాలసదనం తదితర పనుల పురోగతిపై ఆరా తీశారు. రూ.23.75 కోట్లతో చేపట్టిన గోదావరిఖని ఆస్పత్రి అభివృద్ధి, రూ.22కోట్లతో మంథనిలో చేపట్టిన ఆస్పత్రి నిర్మాణాలను వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ వేణు, డీఆర్డీవో కాళిందిని, అడిషనల్ డీఆర్డీవో రవీందర్, డీసీపీ కరుణాకర్, ఏసీపీ కృష్ణ, ఈఈ అశోక్కుమార్, ఏఈ నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మొదటి జెండా ఎగిరింది ధర్మపురిలోనే..
ధర్మపురి: నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి, స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తింపు పొందిన జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన కేవీ.కేశవులు, మాణిక్యశాస్త్రి ప్రాణస్నేహితులు. కేశవులు ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగల్రావు హయాంలో చేనేత జౌళిశాఖ మంత్రిగా కొనసాగారు. 1947లో ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు ధర్మపురిలోని గోదావరి ఒడ్డునున్న కర్నెఅక్కెపెల్లి భవనంపై తన మిత్రుడైన మాణిక్యశాస్త్రితో కలిసి మొట్టమొదటి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఎగురవేయడం నిషేధమని అప్పటి నిజాం ప్రభుత్వం కేశవులను బంధించడానికి ప్రయత్నించగా.. నిండుగా ప్రవహిస్తున్న గోదావరిలోంచి వెళ్లి తప్పించుకున్నారు. ఏడాదిపాటు ముంబయిలో తలదాచుకున్నారు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం రోజు తిరిగి ధర్మపురికి చేరుకున్నారు. 2019 జనవరి 30న అనారోగ్యంతో మృతి చెందారు. -
విశ్వగురుగా భారత్
‘ప్రపంచంలోనే మనదేశం తిరుగులేని శక్తిగా అ వతరిస్తోంది. 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సాధించినప్పటి నుంచి అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నా.. ప్రస్తుతం అన్నిరంగాల్లో దూసుకెళ్తోందని’ వక్తలు అన్నారు. స్థానిక ట్రినిటి ఇంజినీరింగ్ కాలేజీలో ‘స్వతంత్ర భారతం.. వందేళ్ల భవితవ్యం’ అంశంపై ‘సాక్షి’ టాక్ షో నిర్వహించింది. కాలేజీ అటానమస్ అకడమిక్ డైరెక్టర్ అశోక్కుమార్, ప్రిన్సిపాల్ మణిగణేశన్, కో ఆర్డినేటర్ అశోక్, హెచ్వోడీ ప్రభాకర్, విద్యార్థులు పాల్గొన్నారు. మనదేశం అంతరిక్ష ప్రయోగాల్లో నూ రాణిస్తోందని తెలిపారు. యువశక్తి సంకల్ప దీక్షతో దేశఔన్నతాన్ని పెంచేలా ముందుకు సాగా లని అభిప్రాయపడ్డారు. పర్యావరణ పరిరక్షణకు ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగం పెరుగుతోందన్నారు. సౌరశక్తిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పారిశ్రామిక, విద్య, వైద్య రంగాల్లో నూ సూపర్పవర్గా ఎదుగుతోందని అభిప్రాయపడ్డారు. స్వతంత్రం సిద్ధించి వందేళ్లు పూర్త య్యే నాటికి భారత్ ప్రపంచంలోనే రాజకీయ, ఆర్థిక, సాంకేతిక, సైనిక తదితర రంగాల్లో అగ్రగామిగా నిలిచి విశ్వగురుగా అవతరిస్తుందని ప్రతినిధులు ధీమా వ్యక్తం చేశారు. – పెద్దపల్లిరూరల్ ఉపాధి కల్పించాలి యువత శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎదగాలి. పోటీ యుగంలో నెగ్గేందుకు నైపుణ్యం పెంపొందించాలి. ఉపాధి పొందడం కోసం కాకుండా పలువురికి ఉపాధి కల్పించేలా ఎదగాలి. – బండారి రాహుల్, సీఎస్ఈ మన సంస్కృతి గొప్పది మనదేశ సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవి. పాశ్చాత్య దేశాలన్నీ మన సంస్కృతి పాటిస్తున్నాయి. మనం పరాయి పాలనలోని దురలవాట్లు పాటిస్తున్నాం. వాటినుంచి బయటపడి దేశ ఔన్నత్యాన్ని పెంచాలి. – ఆఖ్య, ఈసీఈ కుల, మతాలకు తావుండదు ఇప్పుడున్న కుల, మతాలు భవిష్యత్లో ఉండక పోవచ్చు. మనుషులంతా ఒక్కటే అనే భావన పెరిగి పరస్పర సహకారం, స్నేహభావంతో ముందుకు సాగే పరిస్థితులు వస్తాయి. ప్రస్తుతం చదువుకునే సమయంలోనే కులం అనే పదం వినిపిస్తోంది. – ఉస్మాన్, ఎంఐఈ సాంకేతికతతో అభివృద్ధి సాంకేతిక పరిజ్ఞానం గణనీయంగా వృద్ధి చెందుతోంది. డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డిజైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లాంటి కోర్సులను సద్వినియోగం చేసుకుంటూ యువత దేశ భవిష్యత్లో కీలకపాత్ర పోషించాలి. – హసీనా, ఏఎంఐఈ ఇంధన భద్రతపై దృష్టి ఇంధన భద్రత కోసం ప్రపంచంలోనే అతిముఖ్యమైన బయోఫ్యూయల్ ఉత్పత్తిపై మనదేశం దృష్టి సారించింది. సాంకేతిక పరిజ్ఞానం. స్టార్టప్ వ్యవస్థను ప్రోత్సహించడంలో అగ్రగామిగా నిలవాలి. ఇంధన మిశ్రమంలో గ్యాస్ వాటా పెంచాలి. – శివాని, ఏఎంఐఈ ఉచితాలు వద్దు మనదేశం ఆర్థికశక్తిగా ఎగబాకుతోంది. దీనికితోడు యువ త, ప్రజలకు అవసరమైన ఉపాధి కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేయాలి. ప్రజలకు ఉచితంగా లబ్ధి చేకూరే పథకాలను క్రమంగా తగ్గించాలి. యువత ఉత్పత్తి రంగంలో రాణించేలా ప్రోత్సహించాలి. – సయిఫ్, ఈసీఈ ఐటీ రంగంలో మేటి సాంకేతిక పరిజ్థానాన్ని యువ తకు అందిస్తూ ఐటీ రంగంలో మేటిగా ఉంది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది. ఆర్థిక, సాంకేతిక రంగాల్లో పురోగతి సాధించి మనదేశం ప్రపంచంలోనే గొప్పగా ఉంటుంది. – మణిగణేశన్, ప్రిన్సిపాల్ సాంకేతికతపై పట్టుసాధించాలి ప్రపంచ దేశాల మధ్య పోటీ పెరిగింది. అందులో మన దేశం అన్నిరంగాల్లో ముందు కు దూసుకుపోతోంది. సాంకేతికత, ఇంటర్నెట్ వినియోగంపై పట్టు సాధించేలా యువతకు శిక్షణ ఇవ్వాలి. ఏఐ టెక్నాలజీ రాజ్యమేలడం ఖాయం. – ప్రొఫెసర్ అశోక్, ఆర్ అండ్ డీ కో ఆర్డినేటర్ అన్నిరంగాల్లో ప్రగతి మనదేశం అన్నిరంగాల్లో ప్రగతి సాధించి ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుంది. సౌర, జల విద్యుత్శక్తి ఉత్పత్తి పెరుగుతోంది. యువశక్తికి కొదవలేదు. వారు దేశ ఔన్నత్యం కోసం పాటుపడేలా శిక్షణ ఇవ్వాలి. – ప్రభాకర్, ఈసీఈ హెచ్వోడీ ఆటోమేషన్పై ఫోకస్ స్వతంత్ర భారతానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆటోమేషన్, టెక్నాలజీ తదితర రంగాలపై ఫోకస్ పెడితే ఆర్థికవృద్ధి సా ధిస్తుంది. ఇంటర్నెట్ వినియోగం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ముందుంది.– అశోక్కుమార్, అకడమిక్ డైరెక్టర్ -
ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావొద్దు
● రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా గోదావరిఖని: రానున్న 72 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావొద్దని సీపీ అంబర్ కిశోర్ ఝా బుధవారం సూచించారు. కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచన నేపథ్యంలో పోలీసుయంత్రాంగం అప్రమత్తమైందని అన్నారు. ఆపదలో ఉంటే వెంటనే స్థానిక పో లీస్ అధికారులు లేదా డయల్ 100 నంబరుకు ఫోన్చేసి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం డ్రగ్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. తన కార్యాలయంలో బుధవారం నాషాముక్త్ భార త్ అభియాన్–2025లో భాగంగా మాదక ద్రవ్యాల కు వ్యతిరేకంగా ఉద్యోగులతో సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. సీపీ మాట్లాడుతూ, గంజాయి రవాణా చేసినా, సాగు చేసినా, విక్రయించినా కఠిన చ ర్యలు తప్పవన్నారు. స్పెషల్ బ్రాంచ్, ట్రాఫిక్ ఏసీపీలు మల్లారెడ్డి, శ్రీనివాస్, ఏవో శ్రీనివాస్, యాంటీ నార్కోటిక్, సీసీఆర్బీ, పీసీఆర్, సీసీఎస్, స్పెషల్ బ్రాంచ్ సీఐలు రాజ్కుమార్, సతీశ్, రవీందర్, బాబురావు, భీమేశ్, శ్రీనివాస్, ఆర్ఐలు శ్రీనివాస్, వామనమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
పంద్రాగస్టు వేడుకలకు ముఖ్య అతిథి అబ్దుల్లా
సుల్తానాబాద్(పెద్దపల్లి): ఈనెల 15న జిల్లాలో నిర్వహించే భారత స్వాతంత్య్ర వేడుకలకు తె లంగాణ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఎండీ అ బ్దుల్లా ముఖ్య అతిథిగా హాజరువుతారని బు ధవారం ఉత్తర్వులు జారీఅయ్యాయి. ఉద యం 10 గంటలకు కలెక్టరేట్లో ఆయన జా తీయ జెండా ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. రామునిగుండాలకు జలకళ రామగుండం: కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో రామునిగుండాల జలపాతం జాలువారుతూ కనువిందు చేస్తోంది. వాటర్ఫాల్స్ తి లకించేందుకు పర్యాటకులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. పచ్చనిచెట్ల అందం, పర్చుకున్న పచ్చదనం ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తున్నారు. శ్రావణమాసం కావడంతో రామునిగుండాలతోపా టు రామునిపాదాలు దర్శించేందుకు భక్తులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ‘ఎల్లంపల్లి’కి ఇన్ఫ్లో రామగుండం: ఎగువన కురుస్తున్న భారీవర్షాల తో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో వచ్చిచేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామ ర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 14.0 6 టీఎంసీలకు చేరింది. సుమారు 19,062 క్యూ సెక్కుల ఇన్ఫ్లో వస్తోందని అధికారులు బుధవారం తెలిపారు. ఇందులో అత్యధికంగా కడెం ప్రాజెక్టు నుంచి 11,478 క్యూసెక్కులు వచ్చి చే రుతోంది. మరోవైపు.. ప్రాజెక్టు నుంచి హైదరా బాద్కు 330 క్యూ సెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. జాతీయ జెండా ఐక్యతకు చిహ్నం జ్యోతినగర్(రామగుండం): మన జాతీయ జెండా చిహ్నం మాత్రమే కాదని, ఐక్యతకు గర్వకారణమని సీఐఎస్ఎఫ్ ఎన్టీపీసీ యూనిట్ సీనియర్ కమాండెంట్ అరవింద్కుమార్ అన్నారు. హర్ ఘర్ తిరంగా – 2025లో భాగంగా సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు లేబర్ గేట్ వద్ద బైక్ ర్యాలీని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రత్యేకంగా అలంకరించిన బైక్లతో త్రివర్ణ పతాకం మోసుకెళ్లి, దేశభక్తి నినాదాలు చేయడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ర్యాలీలో సుమారు 150 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొని 15 కి.మీ. మేరకు ర్యాలీ నిర్వహించారు. డిప్యూటీ కమాండెంట్ ఆంజనేయరాజు, ఓవీకే శాస్త్రి, అసిస్టెంట్ కమాండెంట్ తాళియన్ పాల్గొన్నారు. ఢిల్లీలో వేడుకలకు చిల్లపల్లి పంచాయతీ కార్యదర్శి మంథనిరూరల్: స్వచ్ఛ స ర్వేక్షణ్ భారత్ అమలులో చిల్లపల్లి గ్రామ పంచాయ తీకి జాతీయస్థాయి అవా ర్డు లభించిన విషయం వి దితమే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు ప్రత్యేక అతిథిగా హాజరు కావాలని పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి చిల్లపల్లి కా ర్యదర్శి రాంకిశోర్కు ఆహ్వానం అందింది. ఈ మేరకు బుధవారం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సంపూర్ణ పారిశుధ్యం నిర్వహణలో చి ల్లపల్లికి అవార్డు దక్కగా అప్పటి సర్పంచ్తోపా టు పంచాయతీ కార్యదర్శి రాష్ట్రపతి నుంచి పు రస్కారం అందుకున్నారు. కాగా, గురువారం ప్రభుత్వం రాంకిశోర్ను సన్మానించనుంది. శుక్రవారం ఢిల్లీ ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు ఆయన హాజరుకానున్నారు. చెక్డ్యాం పనులకు రూ.35.54 కోట్లు సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): నీరుకుల్ల మా నేరుపై నిర్మించిన చెక్డ్యాంకు రూ.35.54కోట్ల పరిపాలనా అనుమతి లభించిందని ఇరిగేషన్ డీఈఈ రాజేందర్ తెలిపారు. చెక్డ్యాం నిర్మాణానికి 2020లో రూ.21.02 కోట్లు సాంకేతికంగా మంజూరు కాగా, వాస్తవ పరిస్థితులైన కరకట్ట, రంగనాయకస్వామి ఆలయ ప్రహరీ పనికోసం ఇరిగేషన్ అధికారులు రూ.40.14కోట్లకు మంజూరు ఇవ్వాలని అభ్యర్థించారు. -
‘ఆటోమేటిక్’గా పట్టేస్తాయి
జిల్లాలో నమోదైన కేసులు, జరిమానాలు గోదావరిఖని: జిల్లాలో విస్తరించిన రహదారులపై నిత్యం ఏదోఒకచోట రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంటూనే ఉంది. ప్రధానంగా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి నుంచి గోదావరిఖనిలోని గంగానగర్ సమీప గోదావరి వంతెన వరకు, గోదావరిఖని నుంచి మంథని వరకు, పెద్దపల్లి నుంచి మంథని వరకు, పెద్దపల్లి నుంచి ధర్మారం వరకు గల రోడ్లు అత్యంత ప్రమాదకరంగా మారాయి. కొందరు ప్రాణాలు కోల్పోతే.. మరికొందరు శాశ్వతంగా అంగవైకల్యం పాలవుతున్నారు. అతివేగం, ట్రా ఫిక్ నిబంధనలు అతిక్రమించడంతో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు వివ రిస్తున్నారు. అయితే, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికే బ్లాక్స్పాట్లు గుర్తించారు. అక్కడ సైన్బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. వేగ నియంత్రణ కోసం స్పీడ్గన్లు ఏర్పాటు చేశారు. వీటిద్వారా సత్ఫలితాలు వస్తున్నా.. లక్ష్యం నెరవేరడం లేదు. ఈఏడాది జరిగినలో జరిగిన 79 సీరియస్ ప్రమాదాల్లో 88 మంది మృతి చెందారు. సమన్వయంతో ముందుకు.. ట్రాఫిక్ పోలీసులు, రోడ్డు భద్రతా అధికారులు సమన్వయంతో ప్రమాదాల నియంత్రణ లక్ష్యంగా అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థి దశనుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ఉంటే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందనే భావనతో ఈ నిర్ణయానికి వచ్చారు. బహుముఖ వ్యూహం రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ట్రాఫిక్ పోలీసు లు బహుముఖ వ్యూహం అవలంబిస్తున్నారు. ప్రధాన ప్రాంతాల్లో ఆటోమెటిక్గా జరిమానా విధించే 12 ఆటో క్యాప్చర్ కెమెరాలు అమర్చి 58,442 కేసులు నమోదు చేశారు. రూ.1.40 కోట్లు జరిమానా విధించారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల ద్వారా 6,413 కేసులు నమోదు చేసి, 4,562 మందిని కోర్టులో హాజరు పర్చారు. వాహనదారులకు రూ.61.50 లక్షల జరిమానా విధించారు. ఇందులో 17మందికి జైలుశిక్ష కూడా పడింది. నిబంధనలు పాటించినవారికి నజరానా.. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై కొరడా ఝుళిపిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. రూల్స్ను కచ్చితంగా పాటిస్తున్న వాహనదారులకు నజరానా అందిస్తున్నారు. ఈక్రమంలో వారం క్రితం స్పెషల్ డ్రైవ్ నిర్వహంచి మహిళా బైక్ రైడర్లకు చీరెలు బహుమతిగా అందజేశారు. ప్రధాన రహదారులపై స్పీడ్గన్లు రహస్య కెమెరాలతోనూ నిఘా నిత్యం డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు అధికారుల బహుముఖ వ్యూహం రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం ప్రధాన రోడ్లపై నిఘా జిల్లాలోని మెయిన్ రోడ్లన్నింటిపైనా నిఘా ఉంది. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నాం. పాటించే వారిని అభినందిస్తూనే, అతిక్రమిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా ట్రాఫిక్ విభాగం పనిచేస్తోంది. – సీహెచ్ శ్రీనివాస్, ఏసీపీ, ట్రాపిక్, రామగుండం డ్రంకెన్ డ్రైవ్ 6,413 కోర్టులో హాజరు పరిచినవి 4,562 విధించిన జరిమానా(రూ.లక్షల్లో) 61.50 జైలుశిక్ష పడిన వారిసంఖ్య 17 లేజర్ గన్ నమోదుచేసిన కేసులు 12,086 విధించిన జరిమానా(రూ.కోట్లలో) 1.25 ఆటోమేటిక్ కెమెరా కేసులు 58,442 విధించిన జరిమానా(రూ.కోట్లలో) 1.40 ఈ చలానా కేసులు 2,60,364 విధించిన జరిమానా(రూ.కోట్లలో) 8.06 ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు 226 గాయపడిన వారిసంఖ్య 335 ప్రమాదకరమైన యాక్సిడెంట్లు 79 మరణించిన వారిసంఖ్య 88 నిఘా కెమెరాలు స్పీడ్ లిమిట్ లేజర్ గన్లు 2 ఆటోమెటిక్ చలానా కెమెరాలు 12 సీసీ కెమెరాలు(సుమారు) 5,500 -
రాఖీ కట్నం
15.48● ఆర్టీసీకి కరీంనగర్ రీజియన్లో లాభాల పంట ● గోదావరిఖని డిపోకు మొదటిస్థానంవిద్యానగర్(కరీంనగర్): రాఖీ పండుగ కరీంనగర్ రీజియన్కు కాసుల పంట పండించింది. ఈనెల 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రూ.15.48 కోట్ల ఆదా యం సమకూరింది. పండుగ సందర్భంగా ఈనెల 7వ తేదీనుంచి 11వ తేదీ వరకు రీజియన్ పరిధి లోని 11డిపోల్లో ఉన్న బస్సులు 21.50 లక్షల కిలో మీటర్లు తిరగగా.. 29,10,435 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. వీరిలో 73శాతంపైగా (21,21,668) మహిళలు ఉండగా మహాలక్ష్మి పథ కం ద్వారా రూ.9.08 కోట్లు ఆదాయం వచ్చింది. రాఖీ పౌర్ణమి రోజున ఈనెల 9న రికార్డుస్థాయిలో 7.02 లక్షల మంది రాకపోకలు సాగించగా రూ.3.94 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా గోదావరిఖని డిపో నుంచి 4,28,432 మంది ప్రయాణించారు. వీరిలో 3,21,821మంది మహిళలు ఉన్నారు. మొత్తం రూ.223.79 లక్షల ఆదాయం రాగా.. మహాలక్ష్మీ స్కీంకింద రూ.130.09 లక్షల ఆదాయం వచ్చింది. జగిత్యాల డిపో 3,67,855 మందిని చేరవేసి రెండోస్థానంలో నిలిచింది. వీరిలో 2,71,103 మంది మహిళలున్నారు. మొత్తం ఆదాయం రూ.178.57 లక్షలు రాగా.. జీరో టికెట్లు ద్వారా 104.38లక్షల ఆదాయం వచ్చింది.కోట్లుఅందరి సహకారంతోనే కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోలకు చెందిన సిబ్బంది, డైవర్లు, కండక్టర్లులు, అధికారుల సహకారంతోనే ఇది సాధ్యమైంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా స్పేర్ బస్సులతో పాటు జేబీఎస్ నుంచి సిటీ బస్సులు నడిచేలా చూశాం. 29 లక్షలకు పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశాం. – బి.రాజు, కరీంనగర్ రీజినల్ మేనేజర్ -
స్థానిక పోరుకు సిద్ధం
● ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం ● గుజరాత్ నుంచి బ్యాలెట్ బాక్స్లు ● ఈసారి స్వల్పంగా తగ్గిన పంచాయతీలు ● ఇంకా స్పష్టతరాని రిజర్వేషన్ల ప్రక్రియ పెద్దపల్లిరూరల్: ఇదిగో.. అదిగో అంటూ ఊరిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి సర్కార్ ఎప్పు డు గ్రీన్సిగ్నల్ ఇచ్చినా తాము సర్వసన్నద్ధంగా ఉన్నామంటూ జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. స్థానిక సంస్థల పాలక వర్గాల గడువు ముగిసి సుమారు ఏడాదిన్నరకుపైగా అవుతోంది. అప్పట్నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగుతోంది. బ్యాలెట్ పేపర్.. బాక్స్లు సిద్ధం స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ ఉన్నతాధికారులు గతంలోనే ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా జిల్లా అధికారులు పోలింగ్ కేంద్రాల గుర్తింపు, బ్యాలెట్ పత్రాలు, బాక్స్లు సిద్ధం చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, ఉద్యోగులను ఎంపిక చేసి ఓ ధఫా శిక్షణ కూడా పూర్తిచేశారు. ఎన్నికల సామగ్రి ఇప్పటికే జిల్లాకు వచ్చి చేరింది. ఆ సామగ్రిని మండలాలకు తరలించేందుకు వీలుగా కసరత్తు చేస్తున్నట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. తగ్గిన వార్డులు.. పెరిగిన ఓటర్లు జిల్లాలోని 13 మండలాల్లో (రామగుండం మినహా) గత ఎన్నికల కన్నా 4 పంచాయతీలు, 35 వార్డులు తగ్గాయి. దాదాపు 50 వేల మంది వరకు ఓటర్ల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో 3,57,556 మంది ఓటర్లుండగా.. ఇప్పటివరకు 4 లక్షల మందికిపైగా ఓటర్లుగా జాబితాలో నమోదై నట్లు సమాచారం. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవ కాశం కూడా ఉంది. గతంలో 267 పంచాయతీలు, 2,467 వార్డులు ఉండగా.. ఈసారి 263 పంచాయతీలు, 2,432 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. రిజర్వేషన్ల సంగతేమిటో..? ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలని నిర్ణయించినా అందుకు కేంద్రప్రభుత్వం బిల్లును ఆమోదించలేదు. దీంతో రిజర్వేషన్లపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. అయితే కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం సెప్టెంబర్లోగా ఎన్నికలు నిర్వహిస్తుందా? లేక బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్తుందా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఏర్పాట్లు ముమ్మరం.. ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఎప్పుడొచ్చినా ఎన్నికలను నిర్వహించేందుకు సర్వసన్నద్ధంగా ఉండేలా జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పోలింగ్ అధికారులు, సిబ్బంది జాబితా సిద్ధం చేశారు. ఓటరు మ్యాపింగ్ ప్రక్రియలో బిజీగా ఉన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితానూ సిద్ధం చేస్తున్నారు. సిద్ధంగా ఉన్నాం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియ పూర్తిచేసే పనుల్లో అధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు. ఓటరు మ్యాపింగ్ పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రభుత్వం, ఉన్నఽతాధికారులు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. బ్యాలెట్ బాక్స్లు గుజరాత్ నుంచి తెప్పించి సిద్ధంగా ఉంచాం. – వీరబుచ్చయ్య, డీపీవో -
దంచికొట్టిన వాన
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): జిల్లాలోని కాల్వశ్రీ రాంపూర్, ఓదెల మండలాల్లో మంగళవారం రాత్రి భారీవర్షం కురిసింది. కాల్వశ్రీరాంపూర్ మండలం మల్యాల – పోచంపల్లి, తారుపల్లి – మీర్జంపేట మధ్య ఒర్రెలపై కల్వర్టులు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. మల్యాల–జమ్మికుంట ఆర్ అండ్ బీ రోడ్డుపై గూడెం విద్యత్ సబ్స్టేషన్ సమీపంలో ఒర్రెపొంగింది. రాకపోకలు నిలిచి పోయాయి. ఓదెల(పెద్దపల్లి): కొలనూర్లోని మెరుగు పోశాని ఇంట్లోకి వరదనీరు వచ్చి చేరింది. గూడెం నక్కలవాగు అలుగుపారుతోంది. గూడెం – కాల్వశ్రీరాంపూర్ మధ్య రోడ్డు తెగింది. కొలనూర్, కనగర్తి, ఓదెల, పొత్కపల్లి, గుంపుల చెరువులు వరదనీటితో నిండి నిండుకుండలా కనిపిస్తున్నాయి. 300 కుంటలకు కూడా జలకళ సంతరించుకుంది. -
మొక్కల సంరక్షణ బాధ్యత మహిళలకే
● వారికి అప్పగిస్తే అవినీతికి తావుండదు ● రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ కోల్సిటీ(రామగుండం): మొక్కల సంరక్షణ బా ధ్యతను మహిళా సంఘాలకు అప్పగిస్తే ప్లాంటేషన్కు కేటాయిస్తున్న రూ.కోట్లలో అవినీతికి తావుండ దని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా బుధవారం రామగుండం బల్దియాలో మొక్కలు పంపిణీ చేసి మాట్లాడారు. ఏటా లక్షల్లో మొక్కలు నాటితే ఛత్తీస్గఢ్ జంగల్ తరహాలో చెట్లు కనిపించాలని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. 10 వేల మొక్కలు నాటి లక్ష నాటినట్లు చూపిస్తే కాంట్రాక్టర్ను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. మహిళలు తమ కుటుంబసభ్యుల పేరిట మొక్కలు నాటి సంరక్షిస్తే పర్యావరణానికి మేలు జరుగుతుందని అన్నారు. స్వశక్తి మహిళా సంఘాలతో త్వరలో నే ఆర్టీసీ బస్సులు, సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, అధికారులు రామన్, షాభాజ్, తేజస్విని, సాయి, మౌనిక పాల్గొన్నారు. కాగా, మల్కాపూర్ శివారులోని డంపింగ్యార్డ్లో రూ.83 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన డ్రై రీసోర్స్ కలెక్షన్ సెంటర్, కౌపోస్ట్ షెడ్ పనులకు ఎమ్మెల్యే మక్కాన్సింగ్ శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): పాలకుర్తి మండలం గుంటూరుపల్లిలో ఎమ్మెల్యే మక్కాన్సింగ్ పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. కొత్త రేషన్కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గైర్హాజరై న తహసీల్దార్తోపాటు అధికారులపై రాజ్ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
బిల్లులు ఇస్తున్నారా?
● ‘ఇందిరమ్మ’ లబ్ధిదారులతో కలెక్టర్ ● ఇంటి నిర్మాణాలు ప్రారంభించాలి ● లేదంటే రద్దు చేసి ఇతరులకు ఇస్తాం ● కోయ శ్రీహర్ష ఆదేశాలు పెద్దపల్లిరూరల్: ‘అమ్మా.. మీకు ప్రభుత్వం ఇందిర మ్మ ఇల్లు ఇచ్చింది.. చేసిన పనులకు బిల్లులు ఇచ్చారా..’ అని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇందిరమ్మ ఇళ్ల ల బ్ధిదారులను ప్రశ్నించారు. లబ్ధిదారులు సందనవేన గంగమ్మ, లాస్య మాట్లాడుతూ.. బిల్లులు వెంటనే ఇచ్చారన్నారు. పనులు చివరిదశకు చేరాయని సంతోషంగా చెప్పారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి న నిమ్మనపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని హౌ సింగ్ పీడీ రాజేశ్వర్తో కలిసి బుధవారం కలెక్టర్ ప రిశీలించారు. గ్రామంలోని అర్హులైన పేదలందరికీ 140 ఇళ్లు మంజూరు చేస్తే కేవలం 45 ఇళ్ల పనులే చేపట్టడానికి గల కారణాలు ఏమిటని ప్రశ్నించారు. పనులు చేపట్టేలా చూడాలని ఎంపీడీవో శ్రీనివాస్ ను కలెక్టర్ ఆదేశించారు. లబ్ధిదారులు సానుకూలంగా స్పందించకుంటే రద్దు చేసి ఇతరులకు కేటాయించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. సులభంగా అర్థమయ్యేలా బోధించాలి నిమ్మనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన కలెక్టర్.. నాలుగో తరగతి విద్యార్థులతో ఇంగ్లిష్ పాఠాలు చదివించారు. సారాంశం అర్థమైందా? అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సు లభంగా అర్థమయ్యేలా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పీడీ, ఎంపీడీవోతపాటు హెచ్ఎం సతీశ్, ఏఈ నరేశ్ తదితరులు ఉన్నారు. వినోద రంగంలో నైపుణ్య కోర్సులు సుల్తానాబాద్(పెద్దపల్లి): వినోద రంగంలో స్వల్పకాలిక నైపుణ్య శిక్షణ కోర్సులు అందిస్తున్నామని, ఆస క్తి గలవారు జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాల యంలో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. సినిమాటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్, డబ్బింగ్, వాయిస్ ఓవర్, డిజిట ల్ డిజైన్, సోషల్ మీడియా మేనేజ్మెంట్ కోర్సుల్లో శిక్షణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ‘టాస్క్’పై అవగాహన కల్పించాలి టాస్క్ కోర్సులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. కలెక్టరేట్లో యువతకు ఉపాధి కల్పనపై డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్స్తో సమీక్షించారు. టాస్క్లో శిక్షణ పొందిన వారికి మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. జిల్లా ఉపాధి క ల్పనాధికారి తిరుపతిరావు, ముఖ్యప్రణా ళికాధికారి రవీందర్, కౌసల్య, గంగప్రసాద్ పాల్గొన్నారు. -
అక్షరాస్యత పెంపొందించాలి
పెద్దపల్లిరూరల్: ప్రతీఒక్కరికి కనీస అక్షర జ్ఞా నం అందించేందుకు చేపట్టిన ఉల్లాస్, నవభారత్ అక్షరాస్యత కార్యక్రమాలు సద్వినియోగ మయ్యేలా చూడాలని డీఈవో మాధవి సూచించారు. రిసోర్స్పర్సన్లతో జిల్లా కేంద్రంలో సో మవారం ఆమె సమావేశమయ్యారు. చదువు రాని వారనే చిన్నచూపుతో వయోజనులను కించపర్చవద్దన్నారు. కనీస అక్షరజ్ఞానాన్ని అందిస్తే కుటుంబంలో మార్పు కనిపిస్తుందని తెలి పారు. జిల్లా రిసోర్స్పర్సన్ జక్కం శ్రీనివాస్, ప్రతినిధులు స్వరూప్చంద్, అనిల్ప్రసాద్ తదితరులు పలు అంశాలపై అవగాహన కల్పించా రు. వయోజనవిద్య ఏపీవో శ్రీనివాస్, కోర్సు డైరెక్టర్ సురేందర్కుమార్ పాల్గొన్నారు. వ్యాధి నిరోధక శక్తి పెంచాలిపెద్దపల్లిరూరల్: టీనేజీ పిల్లల్లో రక్తహీనతను నియంత్రించడంతోపాటు వ్యాధినిరోధక శక్తిని పెంచేవి ఆల్బెండజోల్ మాత్రలని జిల్లా వైద్యాధికారి అన్న ప్రసన్నకుమారి అన్నారు. స్థానిక జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో సోమవారం నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చే శారు. అంగన్వాడీలు, ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రై వేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో మాత్ర లు పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రోగ్రాం ఆఫీసర్ కిరణ్కుమార్, హెచ్ఎం అరుణ, ఆర్బీఎస్కే వైద్యసిబ్బంది పాల్గొన్నారు. అంతర్గాం పీహెచ్సీ సందర్శనరామగుండం: అంతర్గాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మర్రిపల్లి ప్రభుత్వ పాఠశాలను జి ల్లా వైద్యాధికారి అన్న ప్రసన్నకుమారి ఆకస్మికంగా సందర్శించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ ఉదయ్కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి జ్యోతినగర్(రామగుండం): ఆర్యవైశ్యుల అ భ్యున్నతికి కృషి చేస్తానని ఆర్యవైశ్య సంఘం ప ట్టణ పొలిటికల్ అడ్వైయిజర్ రావికంటి వరప్రసాద్ అన్నారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికల సందర్భంగా సోమవారం ఆయన తన నా మినేషన్పత్రాన్ని ఎన్నికల అధికారులు వొల్లా ల సురేశ్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్కు అందజేసి మాట్లాడారు. సంఘం బలోపేతానికి పాటుపడతానన్నారు. పేద ఆర్యవైశ్యులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈనెల 17వ తేదీన నిర్వహించే ఎన్నికల్లో తనకు మద్దతు తెలియజేయాలని ఆయన కోరారు. అనంతరం వరప్రసాద్కు మద్దతుగా హిందూ ఐక్యవేదిక సభ్యు లు ర్యాలీ నిర్వహించారు. హిందూ ఐక్యవేదిక సభ్యులు, ఆర్యవైశ్య ప్రతినిధులుపాల్గొన్నారు. కొత్త స్వశక్తి సంఘాలు ఏర్పాటు చేయాలి పెద్దపల్లిరూరల్: జిల్లాలో కొత్త మహిళా స్వశక్తి సంఘాలతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, బాలికల సంఘాల ఏర్పాటును ఈనెలాఖరు వ రకు పూర్తిచేయాలని డీఆర్డీవో కాళిందిని సూ చించారు. ఏపీఎం, సీసీ, మండల సమాఖ్య ప్రతినిధులతో జిల్లా కేంద్రంలో సోమవారం ఆమె సమావేశమయ్యారు. కొత్తవారిని గుర్తించి స్వశక్తి సంఘంలో సభ్యత్వం పొందేలా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి వేణుగోపాల్రావు, అడిషనల్ డీఆర్డీవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ రీఫిల్లింగ్ షాపుల్లో తనిఖీగోదావరిఖని: గ్యాస్ రీఫి ల్లింగ్ సెంటర్లలో పోలీసులు సోమవారం తనిఖీ చేశారు. ఓ షాపులో గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీనిపై సోమవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన పోలీస్ అధికారుల ఆదేశాల మేర కు సీఐ ఇంద్రసేనారెడ్డి సిబ్బందితో లక్ష్మీనగర్లోని గ్యాస్స్టవ్, సిలెండర్ షాపుల్లో తనిఖీలు చేశారు. ప్రజాభద్రత, జీవనానికి భంగం కలిగించేలా వ్యవహరించిన 8 మందిని అదుపులోకి తీసుకుని బైండోవర్ చేశారు. -
యూరియా కష్టాలు
● సొసైటీల వద్ద రైతుల పడిగాపులు ● వ్యవసాయ పనులు వదులుకొని నిరీక్షణ ● గంటల తరబడి బారులు తీరుతున్న వైనం ● అయినా, ఒక్కో రైతుకు రెండు బస్తాలే పంపిణీ సాక్షి పెద్దపల్లి: వానాకాలం పంటలకు అవసరమయ్యే ఎరువుల కోసం అన్నదాతలకు తిప్పలు ప్రారంభమయ్యాయి. వరినాట్లు మొదలైన 20 రోజుల తర్వాత యూరియా అవసరమవుతుంది. విత్తనాలు విత్తిన నాటినుంచీ చినుకు జాడలేక పైరు ఎండే పరిస్థితి ఎదురైంది. ఈ సమయంలో వారంరోజులుగా కురుస్తున్న వర్షాలు జీవం పోసినట్లయ్యింది. ఇదేసమయంలో పంటలకు యూరియా అవసరం ఏర్పడింది. దీంతో తమ పనులన్నీ వదులుకొని సింగిల్విండోలు, ఇతర సెంటర్లలో రైతులు పడిగాపులు కాస్తున్నారు. అవసరం మేరకు యూరియా అందుబాటులో ఉందని అధికారులు చెబుతూనే.. ఒక్కో ఆధార్ కార్డుపై రెండు బస్తాల యూరియా పంపిణీ చేయడం కొరతకు ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తోంది. సోమవారం కాల్వశ్రీరాంపూర్, ఒదెల, పాలకుర్తి మండలాల్లో రైతులు యూరియా కోసం పీఏసీఎస్ల ఎదుట బారులు తీరడం సమస్య తీవ్రతకు అద్దంపడుతోంది. షరతులతో ఇబ్బందులు జిల్లాలో సుమారు 2.76 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయనుండగా, ఇప్పటివరకు వరి 1,42,153 ఎకరాలు, పత్తి 48,215 ఎకరాలు, కందులు 87 ఎకరాలు, మొక్కజొన్న 377 ఎకరాలు, మిగతా ఇతర పంటలు సాగు చేశారు. ఈసీజన్కు 32,447మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటివరకు 17,036 మెట్రిక్ టన్నులే సరఫరా అయ్యింది. గతేడాది ఇదేసమయానికి 28,868 మెట్రిక్ టన్నులు సరఫరా అయ్యింది. గతేడాదితో పోల్చితే.. సుమారు 12వేల మెట్రిక్ టన్నులు తగ్గినట్లు అధికారులే చెబుతున్నారు. ఆ లోటును పూడ్చేందుకు ఒక్కోరైతుకు రెండోబస్తా పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా యూరియా బ్యాగ్లతోపాటు నానో యూరియా, కాంప్లెక్స్ ఎరువులు, జింక్ కొనుగోలు చేయాల్సిందేనని కొందరు వ్యాపారులు షరతులు విధిస్తున్నారు. మరికొన్నిచోట్ల బక్కో బస్తాపై రూ.50 నుంచి రూ.100 వరకు పెంచి అమ్ముతున్నారు. రైతులకు తప్పని తిప్పలు జిల్లా సమాచారం రైతుల సంఖ్య 1,61,032 సాగు లక్ష్యం(ఎకరాల్లో) 2,76,076 సాగైన వరి(ఎకరాల్లో) 1,42,153 సాగైన పత్తి(ఎకరాల్లో) 48,215 అవసరమైన యూరియా(మెట్రిక్ టన్నుల్లో) 32,447 ఇప్పటివరకు వచ్చిన యూరియా(మెట్రిక్ టన్నుల్లో) 17,036 ఇంకా రావాల్సిన యూరియా(మెట్రిక్ టన్నుల్లో) 15,411 గతేడాది ఇదే సమయానికి సరఫరా అయ్యింది(మె.ట.) 28,868 కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): కూనారం సింగిల్విండో కార్యాలయం ఎదుట రైతులు ఉదయమే యూరియా కోసం బారుల తీరారు. ఆధార్, ప ట్టాదారు పాస్పుస్తకాలతో తరలివస్తే.. ఒక్కొక్క రికి ఒక యూరియా బస్తానే ఇచ్చారు. ఒకరం నుంచి పదెకరాల వరకు ఉన్న రైతులు.. ఒక్క యూరియా బస్తా ఎలా సరిపోతుందని సిబ్బందిపై ఆగ్రహం వ్య్తక్తం చేశారు. త్వరలోనే మరి కొంత వస్తుందని ఏవో నాగార్జున తెలిపారు. బ్లాక్మార్కెట్లో అధిక ధరలు.. ఓదెల(పెద్దపల్లి): మొత్తం 22 గ్రామాలకు ఏకై క సొసైటీ పొత్కపల్లి. ఇక్కడే యూరియా పంపిణీ చేస్తున్నారు. దీంతో వేలాదిమంది రైతులు ఉదయమే సొ సైటీ ఎదుట బారులు తీరా రు. తమకు యూరియా ఇవ్వాలని నిరసన తెలిపారు. ఆందోళన పరి స్థితులు ఏర్పడడంతో ఎస్సై రమేశ్ ఆధ్వర్యంలో సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దారు. మరోవైపు.. డీసీఎంఎస్లో యూరియాను బ్లాక్చేసి అధిక ధరలకు విక్రయించినట్లు రైతులు ఆరోపించారు. పొద్దంతా పడిగాపులు యూరియా కోసం పొ ద్దున్నే పొత్కపల్లి సొసైటీ వద్దకు వచ్చి న. యూరియా ఉందని తెలిసి చాలామంది రైతులు గుమికూడారు. ఈక్రమంలో తోచుకున్నారు. చివరకు పోలీసులు రా వడంతో అసంపూర్తిగా పంపిణీ చేశారు. – గుడి సుధాకర్రెడ్డి, గోపరపల్లె -
అనుబంధ రంగాల అభివృద్ధికి పెద్దపీట
మంథనిరూరల్: వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. గుంజపడుగు శివారులో మంథని పీఏసీఎస్ ఆధ్వర్యంలో పీఎం కుసుమ్ ద్వారా రూ.3.50కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్, చిల్లపల్లిలో రూ.7 కోట్ల వ్యయంతో ఐదెకరాల్లో చేపట్టిన రెండు గోదాముల నిర్మాణానికి కలెక్టర్ కోయ శ్రీహర్ష, కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్రావుతో కలిసి సోమవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ గ్రీన్ఎనర్జీ పాలసీలో భాగంగా నందిమేడారం, కాల్వశ్రీరాంపూర్, అప్పన్నపేట, మంథని ప్రాంతాల్లో ఒక్కో మెగావాట్ చొప్పున పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 4 నెలల్లో వీటిని పూర్తి చేయాలని మంత్రి సూచించారు. గుంజపడుగులో సహకార బ్యాంక్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణరావు, మంథని మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, ఆర్డీవో సురేశ్, డీసీవో శ్రీమాల, సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రైతు సంక్షేమానికి పాటుపడాలి కమాన్పూర్(మంథని): సహకార బ్యాంకులు, సొసైటీలు రైతుల సంక్షేమానికి కృషి చేసేలా ఆధునిక భవనాలు నిర్మిస్తున్నామని ఐటీమంత్రి శ్రీధర్బాబు అన్నారు. రూ.79 లక్షల వ్యయంతో నిర్మించిన కేడీసీసీ బ్యాంక్, రూ.65 లక్షలు వెచ్చించి నిర్మించిన పీఏసీఎస్ భవనాలను డీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వం రైతు సంక్షేమం కోసం రాజీపడకుండా ముందుకు సాగుతోందన్నారు. కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతియాదవ్, కమాన్పూర్, కన్నాల పీఏసీఎస్ చైర్మన్లు ఇనగంటి భాస్కర్రావు, బయ్యపు మనోహర్రెడ్డి, కమాన్పూర్ ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు, నాయకులు సయ్యద్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు. ● మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేషెంట్ల రద్దీ
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, మాతా శిశు ఆస్పత్రుల్లో సోమవారం పేషెంట్ల రద్దీ పెరిగింది. జ్వరం, దగ్గు, జలుబు లాంటి సీజనల్ వ్యాధుల బారినపడ్డ వేలాదిమంది ఆస్పత్రుల బాటపట్టారు. ఓపీ వద్ద, బ్లడ్శాంపిల్ సేకరణ కోసం వివరాలను నమోదు చేయించేందుకు నిరీక్షించారు. వైద్యులు పరీక్షించి రాసిన మందులను తీసుకునేందుకు ఫార్మసీ కౌంటర్ వద్ద కూడా బారులుతీరారు. జిల్లాలోని పలు ప్రాంతాలనుంచి వచ్చి న గర్భిణులు టిఫా స్కానింగ్ కోసం పెద్దసంఖ్యలో క్యూలైన్లో వేచిఉండడం కనిపించింది. జీజీహెచ్లోనూ.. కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. జ్వరపీడితులతో గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) కూడా రద్దీగా మారింది. దగ్గు, జలుబు, తలనొప్పి, వాంతులు, విరోచనాలు, కీళ్లనొప్పులు, జ్వరం తదితర సమస్యలతో పేషెంట్లు ఆస్పత్రికి భారీగా తరలివచ్చారు. వరుసగా రెండురోజులు సెలవులు రావడంతో బాధితుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కరోజే 1,270 మంది ఓపీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. -
రెండుసార్లు కాలిపోయింది
వరినాటు వేసినప్పటి నుంచి కరెంట్ మోటారు రెండుసార్లు కాలిపోయింది. అధికారులకు చెబితే.. లో వోల్టేజీ సమస్య ఉందంటున్నరు. కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టి కొత్త కనెక్షన్లు అనుమతి తీసుకునేలా అధికారులు చొరవ తీసుకోవాలి. – ఆడెపు వెంకటేశ్వర్లు, కాట్నపల్లి అనధికార కనెక్షన్లే సమస్య రైతులు అనుమతి లేకుండా కరెంట్ వాడడంతోనే లో వోల్టేజీ సమస్య వస్తోంది. తద్వారా విద్యుత్ మోటార్లు తరచూ కాలిపోతున్నాయి. బోరుబావుల వద్ద కెపాసిటర్లు ఏర్పాటు చేసుకోవాలి. కొత్తగా విద్యుత్ కనెక్షన్ల కోసం డీడీ చెల్లిస్తే వెంటనే మంజూరు చేస్తాం. – మాధవరావు, ఎస్ఈ, ట్రాన్స్కో -
ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యం
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చి తమ సమస్యలపై ప్రజావాణిలో ప్రజలు అందించే ఫిర్యాదులకు సంబంధిత శాఖ అధికారులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. నిశితంగా పరిశీలించిన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఆయన ప్రజ ల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆ యన మాట్లాడారు. పదేపదే ఒకేసమస్యపై ఫిర్యా దులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు తప్పని తిప్పలు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): కూనారం సింగిల్విండో కార్యాలయం ఎదుట రైతులు ఉదయమే యూరియా కోసం బారుల తీరారు. ఆధార్, ప ట్టాదారు పాస్పుస్తకాలతో తరలివస్తే.. ఒక్కొక్క రికి ఒక యూరియా బస్తానే ఇచ్చారు. ఒకరం నుంచి పదెకరాల వరకు ఉన్న రైతులు.. ఒక్క యూరియా బస్తా ఎలా సరిపోతుందని సిబ్బందిపై ఆగ్రహం వ్య్తక్తం చేశారు. త్వరలోనే మరి కొంత వస్తుందని ఏవో నాగార్జున తెలిపారు. బ్లాక్మార్కెట్లో అధిక ధరలు.. ఓదెల(పెద్దపల్లి): మొత్తం 22 గ్రామాలకు ఏకై క సొసైటీ పొత్కపల్లి. ఇక్కడే యూరియా పంపిణీ చేస్తున్నారు. దీంతో వేలాదిమంది రైతులు ఉదయమే సొ సైటీ ఎదుట బారులు తీరా రు. తమకు యూరియా ఇవ్వాలని నిరసన తెలిపారు. ఆందోళన పరి స్థితులు ఏర్పడడంతో ఎస్సై రమేశ్ ఆధ్వర్యంలో సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దారు. మరోవైపు.. డీసీఎంఎస్లో యూరియాను బ్లాక్చేసి అధిక ధరలకు విక్రయించినట్లు రైతులు ఆరోపించారు. -
బయట చెత్త వేస్తే జరిమానా
● బల్దియా కమిషనర్ అరుణశ్రీ ● అధికారులకు పలు సూచనలుకోల్సిటీ(రామగుండం): బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసినా, నిషేధిత ప్లాస్టిక్ వినియోగించినా జరిమానా విధించాలని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం పారిశుధ్య పర్యవేక్షకులు, నీటిసరఫరా, మెప్మా సిబ్బంది, వార్డు అధికారులతో వేర్వేరుగా వివిధ అంశాలపై సమీక్షించారు. రోడ్లు, కాలువలు, ఓపెన్ ప్లాట్లలో చెత్తవేస్తే జరిమానా వసూలు చేయాలన్నారు. ఇంటింటా తడి, పొడిచెత్త వేర్వేరుగా సేకరించాలని, మురుగునీటి కాలువల్లో పూడికతీత, స్ప్రే, ఫాగింగ్, ఆయిల్ బాల్స్ వేయాలని ఆదేశించారు. స్వచ్ఛ ఆటోలు పూర్తిసామర్థ్యంతో రెండుసార్లు డంపింగ్ యార్డ్ కు వెళ్లాలన్నారు. జ్వరాలు ప్రబలే ప్రాంతాల్లో పా రిశుధ్య పనులు మెరుగుపర్చాలని అన్నారు. ఒకేఇంటికి రెండు నల్లా కనెక్షన్లు ఉంటే ఒకటి తొలగించాలని ఆదేశించారు. పైప్లైన్ లీకేజీలను వెంటనే మరమ్మతు చేయించాలని ఆమె పేర్కొ న్నారు. ప్రతీ ఉపరితల ట్యాంక్ ఆవరణను పరి శుభ్రంగా ఉంచి మొక్కలు నాటాలని ఆదేశించా రు. 18ఏళ్ల వయసు నిండిన నిరుపేద మహిళల తో కొత్త స్వశక్తి సంఘాలు, సమాఖ్యలు ఏర్పాటు చేయాలని ఆమె చెప్పారు. వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. వీధివ్యాపారులను గుర్తించాలన్నారు. ఆస్తిపన్ను, లైసెన్స్ రుసుం వసూలయ్యేలా వినియోగదారులను చైతన్యపరచాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యం
● కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు పెద్దపల్లిరూరల్: జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చి తమ సమస్యలపై ప్రజావాణిలో ప్రజలు అందించే ఫిర్యాదులకు సంబంధిత శాఖ అధికారులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. నిశితంగా పరిశీలించిన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఆయన ప్రజ ల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆ యన మాట్లాడారు. పదేపదే ఒకేసమస్యపై ఫిర్యా దులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
రెండు బస్తాలే ఇచ్చారు
నాకు ఆరెకరాలు ఉంది. రెండు బస్తాలే ఇచ్చారు. ఇవి ఎన్నెకరాలకు సరిపోతయి? మిగతా యూరియా కోసం ఎన్నిసార్లు తిరగాలి. పంటకు యూరియా ఎప్పుడు వేయాలి? అదను దాటితే కర్ర పెరగది. సరిపడా ఇవ్వాలె. – గడికొప్పుల రాజయ్య, వెన్నంపల్లి కొరత లేదు యూరియా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదనంగా కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకోవద్దు. ప్రసుత్తం 2,270 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. ఆర్ఎఫ్సీఎల్ నుంచి మరో 3వేల మెట్రిక్ టన్నులు వస్తుంది. యూరియా కొరత ఏమీలేదు. – శ్రీనివాస్, డీఏవో -
రవాణా సౌకర్యంతోనే అభివృద్ధి
● ఎమ్మెల్యే విజయరమణారావు ● ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిపై సమీక్షసుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): రవాణా వ్యవస్థ మెరుగు పడితేనే గ్రామాలు సంపూర్ణంగా అభివృద్ధి చెందుతాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. కదంబపూర్ – కాల్వశ్రీరాంపూర్ గ్రామాల మధ్య రూ.1.50 కో ట్ల వ్యయంతో చేపట్టిన బీటీ రోడ్డు పనులకు ఎ మ్మెల్యే సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందన్నారు. కదంబపూర్ వివేకానంద వి గ్రహం నుంచి కనుకుల ఎక్స్ రోడ్డు వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదించామని తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు సతీశ్, పన్నాల రాములు, దామోదర్రావు, కొడెం అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం ఎలిగేడు(పెద్దపల్లి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని, అవినీతికి తావులేకుండా చర్య లు చేపట్టాలని ఎమ్మెల్యే విజయరమణారావు సూచించారు. శివపల్లిలోని తన నివాసంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై హౌసింగ్ అధికారులు, ఎంపీడీవోలతో సమీక్షించారు. ఇళ్ల పురోగతిని అధి కారులు తరచూ పర్యవేక్షించాలన్నారు. పనులు త్వరగా పూర్తిచేసేలా చూడాలని అన్నారు. హౌ సింగ్ పీడీ రాజేశ్వర్, డీఈలు, ఏఈలు, ఎంపీడీ వోలు దివ్యదర్శన్, శ్రీనివాస్, పద్మజ, పూర్ణచంద ర్, తిరుపతి, భాస్కర్రావు తదితరులు ఉన్నారు. -
కాలిపోతున్న కరెంట్ మోటార్లు
సుల్తానాబాద్(పెద్దపల్లి): ఈ వర్షాకాలంలో ఆశించినస్థాయిలో వర్షాలు కురువడంలేదు. దీంతోపా టు విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయంతో కరెంట్ మోటార్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కా లిపోతున్నాయి. ప్రస్తుతం నాట్లు వేసిన రైతులు.. సాగునీరు పారించే విద్యుత్ మోటార్లు మరమ్మతుకు వెళ్లడంతో నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పంపుసెట్ల ఆధారంగా.. ఈసారి ఇప్పటివరకు లోటు వర్షపాతమే నమో దు అయ్యింది. దీంతో ఎక్కువ మంది రైతులు వ్యవసాయ బావుల వద్ద పంపుసెట్ల ఆధారంగా వివిధ పంటలు వేస్తున్నారు. నీళ్లు అందక పంటలు ఎండిపోతుండడంతో వాటిని కాపాడుకునేందుకు అన్నదాతలు నానాపాట్లు పడుతున్నా రు. ప్రధానంగా అత్యధికంగా విద్యుత్ వినియోగించడంతో కరెంట్ మోటార్లు కాలిపోతున్నాయ ని అధికారులు చెబుతున్నారు. అయితే, లోవో ల్టేజీ సమస్యతోనే అవి కాలిపోతున్నాయని రైతు లు ఆరోపిస్తున్నారు. ఒకసారి కరెంట్ మోటారు కాలిపోతే మరమ్మతు కోసం సుమారు రూ.6000 – రూ.10,000 వరకు ఖర్చు అవుతోందని వ్యవసాయదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ కాలితే రైతులపైనే భారం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే దాని మరమ్మతుల ఖర్చును రైతులపైనే వేస్తున్నారని ఆరోపి స్తున్నారు. ట్రాక్టర్ తీసుకొని మరమ్మతు కేంద్రానికి తామే తరలించాల్సి వస్తోందంటున్నారు. మరమ్మతులకు గురైన మోటార్లు జూలై 258 ఆగస్టు 50 -
రెండుసార్లు కాలిపోయింది
వరినాటు వేసినప్పటి నుంచి కరెంట్ మోటారు రెండుసార్లు కాలిపోయింది. అధికారులకు చెబితే.. లో వోల్టేజీ సమస్య ఉందంటున్నరు. కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టి కొత్త కనెక్షన్లు అనుమతి తీసుకునేలా అధికారులు చొరవ తీసుకోవాలి. – ఆడెపు వెంకటేశ్వర్లు, కాట్నపల్లి అనధికార కనెక్షన్లే సమస్య రైతులు అనుమతి లేకుండా కరెంట్ వాడడంతోనే లో వోల్టేజీ సమస్య వస్తోంది. తద్వారా విద్యుత్ మోటార్లు తరచూ కాలిపోతున్నాయి. బోరుబావుల వద్ద కెపాసిటర్లు ఏర్పాటు చేసుకోవాలి. కొత్తగా విద్యుత్ కనెక్షన్ల కోసం డీడీ చెల్లిస్తే వెంటనే మంజూరు చేస్తాం. – మాధవరావు, ఎస్ఈ, ట్రాన్స్కో -
అన్నివర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం
● ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లిరూరల్: సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తోందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేట, బొంపల్లి, మేరపల్లి గ్రామాల్లో ఆదివారం రూ.కోటి 10లక్షల వ్యయ అంచనాలతో చేపట్టిన అభివృద్ది పనులను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రొసిడింగ్స్ అందించి నిర్మాణాలకు ముగ్గు పోశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు ధనార్జనే ధ్యేయంగా పనిచేశారే తప్ప ఏనాడు ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. కానీ అధికారంలోకి రాగానే అర్హులైన వారందరికీ రేషన్కార్డులు అందించి లబ్దిదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఘనత సీఎం రేవంత్రెడ్డిదేనని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి ఆశీర్వదించాలన్నారు. నాయకులు ఆరె సంతోష్, రాజేందర్, చింతపండు సంపత్, మహేందర్, నరేశ్, రాజు, వీరేశం, శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులున్నారు. పేదల సొంతింటి కల సాకారం చేస్తున్నాం జూలపల్లి: పేదల సంక్షేమమే ధ్యేయంగా అమలు చేస్తున్న పథకాల్లో భాగంగా సొంతింటి కల సాకారం చేస్తున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మండలంలోని కోనరావుపేటలో లబ్ధిదారుడు ఆవులమ్మ–ఐలయ్యకు మంజూరైన ఇందిరమ్మ గృహ ప్రవేశాన్ని ఆదివారం చేయించి లబ్ధిదారునికి శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు నర్సింహయాదవ్, నాయకులు రాంగోపాల్రెడ్డి, డైరెక్టర్ చుక్కయ్య లబ్దిదారులు పాల్గొన్నారు. -
బ‘స్టాప్’ షెల్టర్లు ఏవి..?
పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఆర్టీసీ బస్సులు నడిచే ప్రధానమార్గాలతో పాటు గ్రామాలకు వెళ్లే రూట్లలోనూ బస్షెల్టర్లు లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. తమ అవసరాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు రోడ్డుపై నిరీక్షించలేక ప్రైవేట్వాహనాలను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నా ఆర్టీసీ అధికారులు స్పందించడం లేదన్న విమర్శలున్నాయి. బస్షెల్టర్ లేని బాధలు పేద, మధ్యతరగతి ప్రజల ప్రయాణానికి ఆర్టీసీ బ స్సులే ఆధారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరిగిందని చెప్పుకోవచ్చు. కానీ, ప్రయాణికులు బస్సులకోసం నిరీక్షించేందుకు అవసరమైన షెల్టర్లు లేక ఎండకు ఎండుతూ, వానకు తడవాల్సిన పరిస్థితులున్నాయని వాపోతున్నారు. పలుచోట్ల నిరుపయోగంగా..జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్కు పలు ప్రాంతాల నుంచి ప్రజలు తమ అవసరాల నిమిత్తం వచ్చిపోతుంటారు. వారి సౌకర్యం కోసం కలెక్టరేట్ వద్ద ఆర్టీసీ బస్సులు నిలపాలని కలెక్టరేట్ అధికారులు పలు మార్లు ఆర్టీసీ అధికారులను కోరారు. ప్రయాణికుల కోసం బస్షెల్టర్ కూడా నిర్మించారు. అయినా ఇక్క డ ఆర్డీనరీ బస్సులు తప్ప ఎక్స్ప్రెస్, లగ్జరీ బస్సులు నిలపడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల వంతెన వద్ద కూడా బస్షెల్టర్ నిరుపయోగంగానే ఉంటోంది. ఇలా రాజీవ్రోడ్డు వెంట బస్సులు ఆగే ప్రాంతాల్లో కాకుండా దూరంగా నిర్మించిన షెల్టర్లను బస్సులు ఆగే చోట నిర్మిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ఏటా పెరుగుతున్న ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సాగించే వారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. అయినా సంబంధిత అధికారులు కనీస ఏర్పాట్లు కూడా చేయకపోవడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో లయన్స్, రోటరీక్లబ్, కేశోరాం, ఎన్టీపీసీ లాంటి సంస్థలు బస్షెల్టర్ల నిర్మాణాలకు ముందుకొచ్చేవి. కానీ, ఈ మధ్య అలాంటి కార్యక్రమాలను ఎవరూ చేపట్టకపోవడం కూడా సమస్య తీవ్రతకు కారణంగా చెప్పుకోవచ్చు. బస్సుల కోసం ప్రయాణికుల పాట్లు ఎండకు ఎండుడే.. వానకు తడుసుడే రోడ్లపై.. దుకాణాల ఎదుట నిరీక్షణ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ‘ఈ చిత్రం జిల్లాకేంద్రంలోని కమాన్ ఏరియా సమీపంలోనిది. ఇక్కడి నుంచి గోదావరిఖని, మంచిర్యాల, మంథని తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సుల కోసం ప్రయాణికులు రోడ్డుపై ఎండలో, వానలో నిలబడాల్సిందే. సమీపంలో ఉన్న దుకా ణాల ముందు నిలబడితే వారితో చీవా ట్లు తినాల్సి వస్తోందని వాపోతున్నారు.’‘ఇది పెద్దపల్లిలోని కమాన్ ప్రాంతంలో గల (కరీంనగర్వైపు) బస్టాప్. కరీంనగర్ వెళ్లే బస్సుల్లో ఎక్కేందుకు రోడ్డుపైనే నిరీక్షించే ప్రయాణికులకు ప్రైవేట్ వాహనదారులు నరకం చూపిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు వచ్చే సమయం దాకా వాటికి అడ్డుగా ప్రైవేట్ వాహనాలను నిలపడంతో అవి ఆగకుండా పోతున్నాయని ప్రయాణికుల ఆవేదన.’ ‘ఇది పెద్దపల్లి మండలం పెద్దకల్వల వద్ద హెచ్కేఆర్ వారు వేసిన బస్షెల్టర్. ఇరవైఏళ్లుగా ఈ షెల్టర్లో కనీసం ఒక్కప్రయాణికుడు కూడా కూర్చోలేదు. ఎందుకంటే ఇక్కడ బస్సులే ఆగవు. దీనికి సమీపంలోనే కలెక్టరేట్ వద్ద షెల్టర్ లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఈ షెల్టర్ను అక్కడికి మార్చాలని కోరుతున్నారు.’ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం ఆర్టీసీ బస్సులు ఆగే స్థలాల వద్ద బస్షెల్టర్లు అవసరమనే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. కమాన్ ప్రాంతంలో ప్రైవేట్ వాహనాలను నియంత్రించేందుకు కొంతకాలం ఆర్టీసీ అధికారిని నియమించింది. సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. – రాంగోపాల్రెడ్డి, బస్స్టేషన్ మేనేజర్, పెద్దపల్లి -
బస్షెల్టర్లు అవసరం
ఆర్టీసీ బస్సుల్లో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం బస్షెల్టర్లు అవసరం. బస్సుల కోసం చెట్ల కింద, దుకాణాల ముందు నిలబడాల్సి వస్తోంది. ఆర్టీసీ అధికారులు చొరవ చూపి బస్షెల్టర్లు ఏర్పాటు చేయాలి. – కొమ్ము కరుణాకర్, పెద్దపల్లి దాతలు ముందుకురావాలి ప్రయాణికుల సౌకర్యం కోసం అనువుగా ఉన్న ప్రాంతాల్లో బస్షెల్టర్లు నిర్మించేందుకు స్వచ్ఛందసంస్థలు, దాతలు ముందుకు రావాలి. ప్రజల ఇబ్బందులు దూరం చేసేందుకు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా దృష్టిసారించాలి. – సోడా బాబు, పెద్దపల్లి ప్రయాణికుల ఇబ్బందులు స్టేజీల వద్ద బస్సుల కోసం నిరీక్షించే ప్రయాణికులు చా లా ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు తోడు పెద్దపల్లిలోని బస్స్టాప్ల వద్ద ప్రైవేట్ వాహనదారులతో సమస్య ఏర్పడుతోంది. అధికారులు చొరవచూపి సమస్య పరిష్కరించాలి. – కల్వల రాజేశం, పెద్దకల్వల -
సింగరేణిపై కవిత నజర్
గోదావరిఖని: సింగరేణిలో పట్టుకోసం టీబీజీకేఎస్ గౌవాధ్యక్షురాలిగా ఉన్న కల్వకుంట్ల కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం హెచ్ఎంఎస్తో కలిసి చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం వెనక వ్యూహాత్మక ప్రణాళికలున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలకు ముందే 11ఏరియాలకు ఇన్చార్జీలుగా జాగృతి నాయకులను ప్రకటించారు. సంఘం నాయకులను సంప్రదించకుండానే ఏరియా ఇన్చార్జీలను నియమించడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశమై యూనియన్ ఇన్చార్జిగా కొప్పుల ఈశ్వర్ను ప్రకటించారు. త్వరలో శ్రీరాంపూర్ఏరియాలో భారీ సభ నిర్వహించాలని యోచిస్తున్నారు. హెచ్ఎంఎస్ నేత రియాజ్అహ్మద్తో సమావేశమైన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్ఎంఎస్, జాగృతి కలిసి సమష్టిగా ముందుకెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాద్లో ఆదివారం సమావేశం అయ్యారు. సింగరేణిలో పట్టుకోసం కవిత వ్యూహం టీబీజీకేఎస్ ఇన్చార్జిగా కొప్పుల ఈశ్వర్ను ప్రకటించిన క్రమంలో కవిత సింగరేణిలో పట్టు కోసం కార్మికుల వద్దకు వెళ్లాలని ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ కార్మిక సంఘమైన హెచ్ఎంఎస్తో కలిసి అన్ని ఏరియాల్లో పర్యటించి, కార్మికులకు దగ్గర కావాలని నిర్ణయించారు. దశాబ్ధకాలంగా టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవిత ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు దగ్గరయ్యారు. ఈ క్రమంలో హెచ్ఎంఎస్ యూనియన్తో కలిసి కార్మికుల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. యూనియన్ గౌరవాధ్యక్షురాలిగా ఉండి హెచ్ఎంఎస్తో ముందుకెళ్లాలని నిర్ణయించడంతో టీబీజీకేఎస్ వైఖరి ఏవిధంగా ఉంటుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు. వచ్చేనెలలో కార్మిక భరోసా యాత్ర కార్మికుల సమస్యలపై సింగరేణివ్యాప్తంగా పర్యటించేందుకు కల్వకుంట్ల కవిత నిర్ణయించారు. హెచ్ఎంఎస్ నాయకులతో కలిసి కార్మికుల్లో భరోస నింపడానికి ప్రణాళికలు రూపొందించారు. గతనెలలో మెడికల్ బోర్డులో కార్మికులకు జరిగిన అన్యాయం, ఇన్కంటాక్స్ రద్దు చేయాలని, అంతర్గత ఉద్యోగాలు భర్తీ చేయాలని, కార్మికుల సొంతింటి కల నిజం చేయడంతో పాటు పలు సమస్యల పరిష్కారం కోసం కార్మిక భరోసా యాత్రకు ప్రణాళికలు రూపొందించారు. ఈనెల రెండో వారంలో సంస్థ సీఅండ్ఎండీని కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. హెచ్ఎంఎస్తో ముందుకెళ్లేందుకు నిర్ణయం అన్ని ఏరియాల్లో పర్యటించేందుకు ప్రణాళికలు కోల్బెల్ట్లో మారుతున్న సమీకరణలు -
‘సర్కారు’ భూమి ‘హస్తగతం’
సాక్షిప్రతినిధి, కరీంనగర్: పరాధీనంలో ఉంటున్న రూ.కోట్లాది విలువైన భూమిని కలెక్టర్ చొరవతో అధికారులు తిరిగి హస్తగతం చేసుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాలు. జిల్లా కేంద్రం శివారులోని చంద్రగిరి సమీపంలో సర్వేనంబరు 25, 26లోని ప్రభుత్వ భూమిలో చాలా ఏళ్లు ఇటుకబట్టీలను తిప్పాపూర్కు చెందిన ఓ వ్యక్తి నడిపించాడు. జిల్లా కలెక్టర్గా సందీప్కుమార్ ఝా వచ్చినప్పటి నుంచి పరాధీనంలో ఉంటున్న ప్రభుత్వ భూములను రికవరీ చేస్తున్నారు. గతంలో కొంతమందిపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే చంద్రగిరి శివారులో ఉన్న భూమి ప్రస్తుతం రూ.60కోట్ల వరకు పలుకుతోంది. ఇటుక బట్టీలు నడిపించిన వ్యక్తి ఇతరుల వద్ద కొనుగోలు చేసినట్లు సమాచారం. కాగా ప్రభుత్వ భూమి కావడంతో సదరు భూమిలో ఇటుకబట్టీలు నడిచి పరాధీనంలో ఉంటున్నాయన్న విషయం కలెక్టర్ దృష్టికి రావడంతో రెవెన్యూ అధికారులతో విచారణ చేపట్టారు. ప్రభుత్వ భూములుగా తేలడంతో వెంటనే రికవరీకి ఆదేశించినట్లు సమాచారం. అధికారులు ఆదివారం సదరు భూమిలో ఉన్న కట్టడాలను జేసీబీ సహాయంతో కూల్చేశారు. రూ.60కోట్ల విలువైన భూమి ప్రభుత్వపరం కావడం స్థానికుల్లో చర్చనీయాంశమైంది. ● రూ.60కోట్ల విలువైన స్థలం రికవరీ -
ఆపరేషన్ కగార్ నిలిపేయాలి
ఓదెల:కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం ఓదెల మండలం కనగర్తిలో జరిగిన సీపీఐ మండల మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతిచర్చలు జరపాలన్నారు. ఇటీవల ఆపరేషన్ కగార్లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనాయకుల మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ మౌనం పాటించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో సీపీఐ నాయకులు, కార్యకర్తలు పోటీ చేసి విజేతలుగా నిలవాలన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర నాయకులు కలవేన శంకర్, తాళ్లపల్లి లక్ష్మణ్, స్వామి, జిల్లా నాయకులు తాండ్ర సదానందం తదితరులు పాల్గొన్నారు బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్లో చట్టం చేయాలిగోదావరిఖని: 42శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వై.యాకయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదివారం గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి 42శాతం బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రానికి ఆమోదం కోసం పంపిందన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీలను మోసం చేస్తూ మతం రంగు పులుముతోందని తెలిపారు. నాన్చుడు ధోరణిని ప్రదర్శిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజాపోరాటాల ద్వారా బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎ.ముత్యంరావు, వేల్పుల కుమారస్వామి, ఎ.మహేశ్వరి, మేదరి సారయ్య, మెండే శ్రీనివాస్, శైలజ, ఎన్.బిక్షపతి, నేర్వట్ల నర్సయ్య, తుమ్మల రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మల్లన్న సన్నిధిలో భక్తుల పూజలుఓదెల: ఓదెల మల్లికార్జునస్వామి దేవస్థానంలో భక్తులు ఆదివారం పూజలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి కోనేరులో స్నానాలు ఆచరించి మల్లికార్జునస్వామి, సీతారామచంద్రస్వామి, ఖండేలరాయుడు, నందీశ్వరులను దర్శనం చేసుకున్నారు. ఒగ్గు పూజారులతో స్వామివారికి పట్నాలతో పాటు బోనాలు సమర్పించుకున్నారు. అక్టోబర్ 3న దసరా సెలవుగా ప్రకటించాలిగోదావరిఖని: అక్టోబర్ 2న గాంధీ జయంతి, దసరా పండుగ ఒకేరోజు వచ్చినందున అక్టోబర్ 3న దసరా పండుగ జరుపుకునేందుకు సెలవు దినంగా సింగరేణి యాజమాన్యం ప్రకటించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి కోరారు. ఆదివారం గోదావరిఖనిలోని శ్రామికభవన్లో మాట్లాడుతూ తెలంగాణ సంప్రదాయంలో ఆడబిడ్డలు, అల్లుళ్లు, కొడుకులు, కూతుళ్లతో ఇంటిల్లిపాది జరుపుకునే అతిపెద్ద పండుగ దసరా అన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి వచ్చినందున ఆనందదాయంగా జరుపుకోవడం వీలుకాదని తెలిపారు. కార్మిక కుటుంబాలకు అక్టోబర్ 2న కాకుండా 3న దసరా సెలవు ప్రకటించాలని కోరారు. పోచమ్మకు బోనంగోదావరిఖనిటౌన్: శివాజీనగర్ కూరగాయల మార్కెట్లోని పోచమ్మ ఆలయంలో ఆదివారం రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి బోనం సమర్పించారు. బోనాలు మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, అమ్మవారిని ఆరాధించడం వల్ల ప్రజలుసుభిక్షంగా ఉంటారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. -
యథేచ్ఛగా గ్యాస్ రీఫిల్లింగ్ దందా
● నిబంధనలకు విరుద్ధంగా షాపుల్లోనే రీఫిల్లింగ్ ● తెలిసినా పట్టించుకోని అధికారులు గోదావరిఖని: గోదావరిఖని పట్టణంలోని పలు ప్రాంతాల్లో గ్యాస్ రీఫిల్లింగ్ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. దీనికి అన్ని రకాల అనుమతులు తీసుకున్న తర్వాత జనావాసాలకు దూరంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేయాల్సి ఉండగా.. అదేమి పట్టించుకోకుండా గ్యాస్ స్టవ్లు, సిలిండర్ల రిపేర్ల పేరుతో రీఫిల్లింగ్ దందా కొనసాగిస్తున్నారు. అలాగే వంట గ్యాస్ను కార్లలో ఫిల్లింగ్ చేసేందుకు కూడా కొన్ని సెంటర్లు కొనసాగుతున్నాయి. గ్యాస్సిలిండర్ను తీసుకెళ్తే ఎలక్ట్రిక్, డీసీ మోటార్ ద్వారా పైపులు బిగించి కార్లలో గ్యాస్ రీఫిల్లింగ్ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా చాలా షాపుల్లో పెద్ద సిలిండర్ల నుంచి పైపుల ద్వారా మూడు, ఐదుకిలోల గ్యాస్ సిలిండర్లను రీఫిల్లింగ్ చేస్తున్నారు. ఇదంతా బాహాటంగానే సాగుతున్నా అధికారులు ఏంచేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పలు సంఘటనలు జరుగుతున్నా.. గ్యాస్ రీఫిల్లింగ్ సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. శనివారం గోదావరిఖని లక్ష్మీనగర్ మేదర్బస్తీ వైపు వెళ్లే దారిలో ఓగ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ చేస్తున్న క్రమంలో పెద్ద ఎత్తున మంటలు లేచాయి. దీంతో సిలిండర్ను నడిరోడ్డుపై పడేశారు. మంటలను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించి తడిచిన తట్టుబొంతలు వేసి మంటలు ఆర్పివేశారు. లేకుంటే పెద్ద ప్రమాదం జరిగేదని అంటున్నారు. గ్యాస్ సిలిండర్ నుండి గ్యాస్ లీకై పెద్ద ఎత్తున మంటలు లేస్తున్న సిలిండర్ పక్కనే ద్విచక్రవాహనం ఉంది. టూవీలర్కు మంటలు అంటుకుంటే పెద్ద ప్రమాదమే సంభవించేదని అంటున్నారు. గతంలో ఇలా రీఫిల్లింగ్ చేస్తున్న క్రమంలో చాలా మంది గాయపడి సందర్భాలు, అగ్ని ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి నిబందనలకు విరుద్దంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రీఫిల్లింగ్ చేయడం చట్ట విరుద్ధం పెద్దసిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లలో రీఫిల్లింగ్ చేయడం చట్ట విరుద్దం. జనావాస ప్రాంతాల్లో గ్యాస్ రీఫిల్లింగ్ చేయడం ప్రమాదకరం. రీఫిల్లింగ్ అనుమతి పొంది జనావాసాలకు కనీసం వంద మీటర్ల దూరంలో రీఫిల్లింగ్ సెంటర్ ఉండాలి. అగ్నిప్రమాదాలు జరిగితే అత్యవసర పరిస్థితుల్లో 101నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలి. – డి.అనిల్కుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి -
నులి పురుగులను నలిపేద్దాం
● నేటి నుంచి నులిపురుగుల నివారణ కార్యక్రమం ● అందుబాటులో 2,41,450 అల్బెండజోల్ మాత్రలుసుల్తానాబాద్: నులి పురుగుల నిర్మూలనకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. జాతీయ బోధకాలు నియంత్రణ దినోత్సవం సందర్భంగా ఈనెల 11నుంచి కార్యక్రమం అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. బోధకాలు వ్యాధి, నులి పురుగుల నిర్మూలనకు సామూహికంగా డీఈసీ, అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేపట్టనున్నారు. జిల్లా వ్యాప్తంగా 2,27,250 మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి మాత్రలు వేసేందుకు 706 మందిని ఎంపిక చేశారు. ఒక్కో బృందంలో ఒక ఆశా కార్యకర్త, ఒక అంగన్వాడీ టీచర్ ఉంటారు. ఇప్పటికే యూపీహెచ్సీ, పీహెచ్సీలలో వైద్యాధికారులు సమావేశమై సూచనలు ఇచ్చారు. జిల్లావ్యాప్తంగా డాక్టర్లకు, సూపర్వైజర్లకు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అన్నప్రసన్నకుమారి శిక్షణ ఇప్పించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు మిగిలిన వారిని ఈనెల 18న మాఫ్ ఆఫ్ దినోత్సవం నిర్వహించనున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలతో పాటు గోదావరిఖని కార్పొరేషన్, 14 మండలాలు, 266 గ్రామపంచాయతీలు ఉన్నాయి. యూపీఎస్సీలు 8, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 16 ఉండగా.. ప్రభుత్వ పాఠశాలలు 534, ప్రైవేటు పాఠశాలలు 161, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 40, ప్రైవేట్ జూనియర్ కళాశాలలో 13 ఉన్నాయి. అందులో 2,27,250 మంది అర్హులను గుర్తించారు. 2,,41,450 మాత్రలు అందుబాటులో ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో ఈనెల 11న ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నారు. మాత్రలు వేసుకున్న వారు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వ ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెంటనే వెళ్లాల్సిన అవసరం ఉందని ఆరోగ్య సిబ్బంది తెలుపుతున్నారు. -
మూడు దశాబ్దాలకు సరిపడా నిల్వలు
● భారీగా బొగ్గు నిక్షేపాలు గుర్తించిన ఎక్స్ప్లోరేషన్ విభాగం ● రామగుండంలో కొనసాగుతున్న ఉద్యోగుల అన్వేషణ గోదావరిఖని: బొగ్గు నిల్వల గుర్తింపులో ఎక్స్ప్లోరేషన్(అన్వేషణ) విభాగంగా ముందుకు సాగుతోంది. కొన్ని గనుల్లో నిల్వలు అడుగంటిపోతుండడంతో అన్వేషణ వేగవంతం చేస్తోంది. ప్రధానంగా రామగుండం రీజియన్లోని ఆరు ప్రాంతాల్లో సర్వే చేస్తోంది. భూఉపరితలం నుంచి సుమారు 250 మీటర్ల లోతులో బొగ్గు పొరలు ఉన్నట్లు గుర్తించింది. ఇక్కడ 30 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నట్లు గుర్తించినా.. గనులకు అనుసంధానంగా వెలికితీసే విధానంపై సమాలోచనలు చేస్తోంది. జీడీకే–1 ద్వారా వెలికితీత.. కొత్త టన్నెల్ ఏర్పాటు చేసి గుర్తించిన బొగ్గు నిల్వలను జీడీకే–1గని ద్వారా వెలికి తీసేందుకు యాజమాన్యం ప్రయత్నాలు ప్రారంభించింది. 1961లో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కాగా, ప్రస్తుతంగా బొగ్గు వెలికితీత శరవేగంగా సాగుతోంది. భూగర్భగనుల్లో తట్టాచెమ్మస్ ద్వారా ప్రారంభమైన బొగ్గు ఉత్పత్తి.. ఇప్పుడు పూర్తిస్థాయి యాంత్రీకరణతో కొనసాగుతోంది. భూగర్భగనులతో పాటు ఓపెన్కాస్ట్ ప్రాజెక్టులు రావడంతో బొగ్గు వెలికితీతలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో ఏటా 25 మిలియన్ టన్నులు వెలియి తీయగా.. ప్రస్తుతం 72 మిలియన్ టన్నులకు చేరుకుంది. గోదావరి తీరంలో నిక్షేపాలు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం మండలం జనగామ గ్రామ శివారులో తొలిసారి బొగ్గు తవ్వకా లు 1959లో చేపట్టారు. రామగుండం రీజియన్లో తొలిసారి జీడికే–1వ గనిలో 24 మిలియన్ టన్నుల నిల్వలు గుర్తించారు. 1961 నుంచి 2025 ఏప్రిల్ వరకు 21 మిలియన్ బన్నుల బొగ్గు వెలికితీశారు. ఇంకా 12ఏళ్ల పాటు తవ్వేందుకు 3 మిలియన్ టన్నుల నిల్వలు ఉన్నాయి. చాలాభూగర్భ గనులు నిల్వలు అడుగంటి త్వరలోనే మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి. ఈక్రమంలో ప్రస్తుతం గోదావరి నది ఒడ్డున సమ్మక్క జాతర ప్రాంగణం, జీడీకే–5 ఓసీపీ, ఓసీపీ–2, అడ్రియాల ప్రాజెక్టు పోచమ్మ గుడికి వద్ద ఎక్స్ప్లోరేషన్ విభాగం ఆధ్వర్యంలో అన్వేషణ కొనసాగుతోంది. 250 మీటర్ల లోతులో నిక్షేపాలు.. గోదావరి నదీ తీరంలోని సమ్మక్క జాతర సమీపంలో సింగరేణి ఎక్స్ప్లోరేషన్ డ్రిల్లింగ్ ద్వారా బొగ్గు నిక్షేపాలు గుర్తిస్తోంది. 250 మీటర్ల లోతులో ఐదున్నర మీటర్ల, మూడు మీటర్ల వెడల్పుతో రెండు బొగ్గు పొరలను గుర్తించింది. సింగరేణిలోనే కీలకం రామగుండం ప్రస్తుతం రామగుండం రీజియన్లో ఆర్జీ–1,2,3, అడ్రియాల ప్రాజెక్టు ఏరియా కొనసాగుతున్నాయి. గోదావరిఖని, యైటింక్లయిన్కాలనీ, సెంటినరీకాలనీల్లో ప్రాంతాలు ఏర్పడ్డాయి. అంతే కాకుండా నాలుగు ఓసీపీలతో అత్యధిక బొగ్గు ఉత్పత్తి చేస్తూ సింగరేణిలోనే రామగుండం రీజియన్ ప్రత్యేకత చాటుతోంది. గనులకు అనుబంధంగానే.. జీడీకే–1వ గనికి అనుబంధంగా ఎక్స్ప్లోరేషన్ అన్వేషణ సాగుతోంది. గోదావరి నది పరీవాహక ప్రాంతంలో బొగ్గు నిల్వలకు ఢోకాలేదు. వాటిని ప్రస్తుత గనులకు అనుబంధంగా ఎలా వెలికితీయాలనే అంశంపై శోధన చేస్తున్నాం. హైవాల్ టెక్నాలజీ ద్వారా జీడీకే–1వ గనిలో బొగ్గు వెలికితీసే వీలుంది. – శివన్నారాయణ, డీజీఎం, ఎక్స్ప్లోరేషన్ -
రైతులను గోస పెడుతున్నరు
పెద్దపల్లిరూరల్: కేసీఆర్ పాలనలో వ్యవసా యం పండుగలా సాగితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు సాగునీరు, ఎరువులు, రైతుబంధు కోసం గోసపడుతున్నరని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో శనివారం మా జీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, కోరుకంటి చందర్, పుట్ట మధుకర్తో కలిసి ఆయన వి లేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలకులు కాళేశ్వరంపై కక్ష పెంచుకుని ఎస్సారెస్పీ ద్వారా సాగునీరు అందకుండా చేస్తున్నారని ఆరోపించారు. యూరియాను బ్లాక్లో ఎక్కువ ధరకు అమ్ముతున్నారని ధ్వజమెత్తారు. నాయకులు రఘువీర్సింగ్, గంట రాములు, ఉప్పు రాజ్కుమార్, శ్రీకాంత్, గోపు ఐలయ్య, మారుతి, ప్ర శాంత్, శ్రీనివాస్, సాగర్, వెంకన్న, రామరాజు, రమణ, నరేశ్, చంద్రమౌళి, ముత్తయ్య, కుమా ర్, సంపత్, భూమయ్య, గట్టయ్య, పెగడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.ఏఐటీయూసీతోనే హక్కులురామగిరి(మంథని): సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన గుర్తింపు కా ర్మిక సంఘంగా ఏఐటీయూసీతోనే సాధ్యమని ఆ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వైవీ రావు అన్నారు. ఆర్జీ–3 బ్రాంచ్ సెక్రటరీ రాంచంద్రారెడ్డి అధ్యక్షతన ఓసీపీ–2లో శనివారం నిర్వహించిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ప్రమోషన్ పాలసీలో భాగంగా గ్రేడ్ –డీ నుంచి సీ, సీ నుంచి బీకి మార్పు కోసం యాజమాన్యంతో చర్చించగా, త్వరలోనే ప్రమోషన్ ఉత్తర్వు వస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులుజూపాక రాంచందర్, శ్రీనివాస్, అమరగండ పోశం తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలి గోదావరిఖని: సింగరేణిలో పనిచేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల సమస్యలు పరిష్కరించా లని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశా రు. శనివారం ఆర్జీ–1 జీఎంకు వినతిపత్రం అందజేసి జీఎం ఆఫీస్ మెయిన్ గేట్ వద్ద నిరసన తెలిపారు. ప్రతీనెల ఒకటి నుంచి ఏడో తేదీలోపు వేతనాలు చెల్లించాలని, ఒక్కో గార్డు కు నెలకు 26 మస్టర్లు ఇచ్చేలా చూడాలని కో రారు. ఏడేళ్లుగా సీఎంపీఎఫ్ చిట్టీలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈఎస్ఐ ఆస్పత్రి సౌక ర్యం కల్పించి, రూ.40 లక్షల ప్రమాద బీమా వర్తింపజేయాలని అన్నారు. నాయకులు ఎల్లా గౌడ్, గౌస్, సయ్యద్ సోహెల్ పాల్గొన్నారు. రైతుబంధుకు దరఖాస్తు చేసుకోండి పెద్దపల్లిరూరల్: ఈఏడాది జూన్ 5వ తేదీలోగా కొత్తగా పట్టాదారు పాసుపుస్తకం పొందిన రై తులు ఈనెల13లోగా రైతుబీమా పథకం కో సం దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయాధికా రి అలివేణి సూచించారు. 14 ఆగస్టు 1966 నుంచి 14 ఆగస్టు 2007 మధ్యలో పుట్టిన (18 నుంచి 59ఏళ్ల మధ్య వయసు) రైతులు మా త్రమే బీమాకు అర్హులని ఆమె వివరించారు. పవర్ కట్ ప్రాంతాలు పెద్దపల్లిరూరల్: స్థానిక ఇండేన్ గ్యాస్ గోదాం, బీసీ హాస్టల్ ఏరియాతోపాటు పెద్దబొంకూర్, పెద్దకల్వల, నిట్టూరు, నిమ్మనపల్లిలో ఆదివా రం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏఈ శ్రీనివాస్ తెవిపారు. సబ్స్టేషన్తోపాటు విద్యుత్ స్తంభాల మరమ్మతుల నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఆయన వివరించారు. ‘శక్తిపుంజ్’ను పొడిగించాలి గోదావరిఖని: శక్తిపుంజ్ ఎక్స్ప్రెస్ రైలును సి కింద్రాబాద్ వరకు పొడిగించాలని బీఎంఎస్ జాతీయ నేత కొత్తకాపు లక్ష్మారెడ్డి కోరారు. ఈ మేరకు ఎంపీ ఈటెల రాజేందర్ ద్వారా కేంద్రరైల్వే శాఖ మంత్రి అశ్విన్వైష్ణవ్కు లేఖ పంపించారు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మ ధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోని కోల్ ఇండియాకు చెందిన 8 అనుబంధ సంస్థలు, తెలంగాణలోని సింగరేణిలో లక్షలాది మంది కార్మికులు పనిచేస్తున్నారన్నారు. ఉద్యోగుల బ దిలీలు, కుటుంబ సభ్యుల రాకపోకలు, పండుగలు, అత్యవసర పరిస్థితులు వంటి సందర్భా ల్లో ఈ రైలు సౌకర్యవంతంగా ఉంటుందన్నా రు. కోల్బెల్ట్వాసుల ఆకాంక్షలకు అనుగుణంగా రైలును పొడిగించేలా చూడాలన్నారు. -
ఆదివాసీలను అంతం చేసేందుకు కుట్ర
● ప్రజాసంఘాల నేతల నిరసన పెద్దపల్లిరూరల్: బహుళజాతి కంపెనీలు, కార్పొరేట్ సంస్థలకు ఖనిజ సంపదను దోచిపెట్టేందుకే కేంద్రప్రభుత్వం ఆదివాసీలపై ఉక్కుపాదం మోపి అంతం చేసేందుకు కుట్ర పన్నుతోందని పౌరహక్కుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్ష, ప్రధా నకార్యదర్శు లు బొంకూరి లక్ష్మణ్, బొడ్డుపల్లి రవి, మాదన కు మారస్వామి ఆరోపించారు. జిల్లాకేంద్రంలోని అమ రవీరుల స్తూపం వద్ద శనివారం ఆదివాసీల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ, అడవుల్లో ఆదివాసీలు లేకుండా చేసేందుకే బస్తర్లో 250 పోలీస్ క్యాంపులు ఏర్పాటు చే సిందన్నారు. 2005లో సల్వాజుడుం, 2009లో ఆపరేషన్ గ్రీన్హంట్, 2015లో ఆపరేషన్ సమాధాన్, 2024లో ఆపరేషణ్ కగార్ పేరిట నరమేధం సాగిస్తోందని పేర్కొన్నారు. నాయకులు నారా వినోద్, ఎరుకల రాజన్న, విశ్వనాథ్, రత్నకుమార్, రామిళ్ల బాపు, గాండ్ల మల్లేశ్, పర్వతాలు, రాజలింగయ్య, సత్యనారాయణ, శంకర్, స్వామి పాల్గొన్నారు. -
ఇంటిగ్రేటెడ్.. ఇక ‘ఇండోర్’
పెద్దపల్లిరూరల్: జిల్లాలో బ్యాడ్మింటన్ క్రీడాకారులకు ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇటీవల రూ.2.30కోట్లు మంజూరు చేసింది. దీంతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లయ్యింది. వ్యవసాయ మార్కెట్లో స్టేడియం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం కొన్నేళ్ల క్రితం నిర్మాణా లు చేపట్టారు. అవి ఇంకా పూర్తికాలేదు. పైగా ఏళ్లు గా అసంపూర్తిగా ఉంటున్నాయి. దీనికితోడు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటుపై స్థానికులు ఆసక్తి చూ పడం లేదు. దీంతో ఎమ్మెల్యే విజయరమణారావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష.. అసంపూర్తి నిర్మాణాలను బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం కోసం వినియోగించేందుకు వీలుగా ప్రభుత్వానికి ప్రతిపాదించారు. పారిశ్రామిక ప్రాంతాల్లోనే క్రీడలు.. బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఆడుకునేందుకు అనువైన కోర్టులు లేక అవస్థలు పడుతున్నారు. ఆసక్తి గలవారు బసంత్నగర్లోని అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, సింగరేణి స్టేడియంలోకి వెళ్లి ఆడుకునే పరిస్థితి ఉంది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఇండోర్ నిర్మాణం చేపట్టనుండడంతో క్రీడాకారులు తమ ప్రతిభకు పదును పెట్టే అవకావం ఏర్పడింది. రూ.2.30 కోట్లు మంజూరు.. బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం ఇటీవల రూ.2.30 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో వ్యవసాయ మార్కెట్లో అసంపూర్తిగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాలను సద్వినియోగం చేసుకుంటూనే ఇండోర్ స్టేడియంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదించారు. వీలైనంత త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయని అధికారవర్గాలు తెలిపాయి. ఇంటిగ్రేటెడ్ ఇంతే సంగతులు.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతీ నియోజవర్గ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు ప్రారంభించింది. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో స్థానిక ఎమ్మెల్యే.. ప్రజాభీష్టం మేరకు ప్రధాన కూరగాయల మార్కెట్ను యథాస్థానంలోనే కొనసాగిస్తాననే హామీ మేరకు మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, సీతక్క, శ్రీధర్బాబుతో సంప్రదించారు. ఈమేరకు కూరగాయల మార్కెట్ పనులకు యథాస్థానంలోనే శ్రీకారం చుట్టారు. దీంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం నిలిచిపోయినట్లయ్యింది. బ్మాడ్మింటన్ స్టేడియం నిర్మాణానికి నిధులు రూ.2.30 కోట్లతో పనులు బ్యాడ్మింటన్ క్రీడాకారులకు ప్రోత్సాహం -
రిక‘వర్రీ’
రాఖీ సంబురం ఆత్మీయత, ప్రేమానురాగాలకు ప్రతీక అయిన రాఖీ పండుగను జిల్లావ్యాప్తంగా శనివారం సంబురంగా జరుపుకొన్నారు. స్థానికంగా ఉన్నవారితోపాటు సుదూర ప్రాంతాలు, వివిధ జిల్లాలు, రాష్ట్రాల్లో స్థిరపడినవారు, విదేశాల నుంచి వచ్చిన అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీలు కట్టారు. నోరు తీపి చేశారు. సోదరులు కట్నకానుకలు ఇస్తూ సంబురాలు చేసుకున్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు తదితర ప్రముఖులకు పలువురు రాఖీలు కట్టి సోదరభావం పంచారు. – పెద్దపల్లిరూరల్ సీ్త్రనిధి రుణాలు పక్కదారి ● వీవోఏ, సీసీలు, బుక్ కీపర్లు, ఆర్పీల మాయాజాలం ● సోషల్ ఆడిట్లో గుర్తించిన అధికారులు ● రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలుకు సన్నద్ధం ● 100 శాతం రికవరీ లక్ష్యం● రామగిరి మండలానికి చెందిన వీవోఏ రూ.3.57లక్షలు అక్రమంగా రుణం తీసుకున్నారు. అంతేకాదు.. రూ.34.43 లక్షల రుణవాయిదాల సొమ్మునూ సొంతానికి వాడుకున్నారు. ఇలా మొత్తంగా రూ.38.01లక్షలను 26 మహిళా గ్రూపుల్లోని 172 మంది సభ్యుల డబ్బులు దుర్వినియోగం చేశారు. ● పాలకుర్తికి చెందిన వీవోఏ ఒకరు.. సభ్యులకు తెలియకుండా రూ.2.5 లక్షలు రుణం తీసుకున్నారు. సీ్త్రనిధికి చెల్లించాల్సిన రూ.10.25 లక్షలు రీపేమెంట్ చేయకుండా కాజేసినట్లు సోషల్ ఆడిట్లో తేలింది. ● ఇలా జిల్లావ్యాప్తంగా మెప్మా ద్వారా మంజూరు చేసిన సీ్త్రనిధి రుణాల్లో రూ.4.81కోట్లు దుర్వినియోగమయ్యాయి. ఇప్పటివరకు రూ.4.01 కోట్లు రికవరీ చేశారు. సెర్ప్ ద్వారా మంజూరు చేసిన సీ్త్రనిధి రుణాల్లో రూ.13.87 కోట్లు కూడా దుర్వినియోగం చేశారు. ఇందులోని రూ.6.24కోట్లు రికవరీ చేశారు. సాక్షి, పెద్దపల్లి: పేదరిక నిర్మూలన, మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం డ్వా క్రా సంఘాల ద్వారా సీ్త్రనిధి రుణాలు మంజూరు చేస్తోంది. అయితే, కొందరు ఉద్యోగుల తీరుతో రుణాలు, రుణవాయిదాల సొమ్ము పక్కదారి పడుతోంది. సెర్ప్, మెప్మా ద్వారా మహిళా సంఘాలకు అందాల్సిన బ్యాంకు రుణాలు దుర్వినియోగమవుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి, వడ్ల కొనుగోళ్లలో కీలకంగా వ్యవహరించే పొదుపు సంఘాల లెక్కలు సరిచేసే వీవోఏలు, ఆర్పీలు, సీసీలు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులైన మహిళల అవసరాన్ని ఆసరాగా తీసుకుంటూ అందినకాడికి దండుకుంటున్నారు. వాయిదాలు చెల్లించిన సందర్భంలో పాసుపుస్తకాల్లో సంతకాలు చేయడానికి కూడా ఆర్పీలు రూ.100 చొప్పున మహిళా సభ్యుల నుంచి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆర్థిక చేయూతకు సీ్త్రనిధి.. పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీ్త్రనిధి బ్యాంకు ఏర్పాటు చేసింది. దీనినుంచి రుణాలు మంజూరు చేస్తూ మైక్రోఫైనాన్స్ల నిర్వాహకుల అధికవడ్డీల బారీనుంచి కాపాడాలనేది దీనిలక్ష్యం. ఇందులో పేద మహిళలకు స్వయం సహాయక గ్రూపుల పేరిట సభ్యత్వం ఇస్తూ ప్రతినెలా కొంత పొదుపు చేయించేలా ప్రణాళిక రూపొందించింది. ఇలా ఒక్కో గ్రూపులో 10 మంది మహిళలను సభ్యులుగా చేర్చుకుంటారు. ఆర్నెల్లు నిండిన ప్రతీగ్రూపు రుణం పొందేందుకు అర్హత సాధిస్తుంది. రుణం తీసుకున్న సభ్యుల నెలసరి వడ్డీని బ్యాంకు ఖాతాలో జమచేయాల్సి ఉంటుంది. అయితే, రుణాలు మంజూరు చేయించే సమయంలోనే ఆర్పీలు ప్రతీసభ్యురాలి నుంచి చెల్లించే నగదుపై రూ.500 రూ.1000 వరకు కమీషన్ వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రుణం రికవరీ సమయంలో వసూలు చేసిన వాయిదా డబ్బులను సైతం కొందరు ఆర్పీలు బ్యాంకులో చెల్లించకుండా తమ సొంతానికి వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ కరువు క్షేత్రస్థాయిలో మహిళలు తీసుకున్న రుణాలు సద్వినియోగం చేసుకుంటున్నారా, అప్పులు తిరిగి చెల్లిస్తున్నారా, నిబంధనల మేరకు సంఘాలను నిర్వహిస్తున్నారా? తదితర అంశాలను పరిశీలించేందుకు కమ్యూనిటీ ఆర్గనైజర్లు(సీవో), వారిపై టీఎంసీ, ఏడీఎంసీ, డీఎంసీ, వారందరిపై ప్రాజెక్టు డైరెక్టర్ ఉన్నారు. వారందరికీ మహిళా సమాఖ్యలతోపాటు అదనపు సంక్షేమ పథకాల బాధ్యతలను కూడా అప్పగిస్తున్నారు. దీంతో సరైన పర్యవేక్షణ ఉండడం లేదు. పొదుపు సంఘాల్లో జరుగుతున్న గందరగోళంతో చాలామంది మహిళలు ఇబ్బందులు పడటమే కాకుండా కొందరు సంఘాల నుంచి వైదొలుగుతున్నారు. మరికొన్ని సంఘాలను రద్దు చేసుకుంటున్నారు. శిక్షణకు ఉపయోగం జిల్లా కేంద్రం పెద్దపల్లి లో బ్యాడ్మింటన్ ఇండో ర్ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం హర్షణీయం. దీనిద్వారా జిల్లాలోని ఆసక్తిగల క్రీడాకారులు నైపుణ్యం పెంచుకుంటారు. పోటీల్లో పాల్గొని పతకాలు సాధిస్తారు. – విజయ్, కోచ్, గోదావరిఖనిక్రీడలకు ప్రోత్సాహం బ్యాడ్మింటన్ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఆలోచనతో నే పెద్దపల్లిలో ఇండోర్ స్టేడి యం ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. పనులు త్వరలోనే మొదలవుతాయి. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం చేపట్టిన నిర్మాణాలను ఇండోర్స్టేడియం కోసం ఉపయోగిస్తాం. – విజయరమణారావు, ఎమ్మెల్యే, పెద్దపల్లి100శాతం రికవరీ చేస్తాం సీ్త్రనిధి రుణాల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. గతంలో అక్రమాలకు పాల్పడిన వారినుంచి 100శాతం సొమ్ము రికవరీ చేస్తాం. ఇప్పటికే కలెక్టర్ 15 రోజుల్లో చెల్లించని వారిపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించాం. బకాయిలు చెల్లిస్తేనే కొత్తగా రుణాలు పొందవచ్చు. ఈ రుణాలతో మహిళలు ఆర్థికంగా బలోపేతం కావొచ్చు. – కాళిందిని, డీఆర్డీవో -
ఆన్లైన్లోనే నల్లాబిల్లుల చెల్లింపు
● త్వరలోనే అందుబాటులోకి : కమిషనర్ అరుణశ్రీ కోల్సిటీ(రామగుండం): నగరంలోని వినియోగ దారులు నల్లాబిల్లులు ఇకనుంచి ఆన్లైన్లోనే చెల్లించేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు బల్దియా కమిషనర్ అరుణశ్రీ తెలిపారు. నగరంలోని 11,472 నల్లాకనెక్షన్లను ఆన్లైన్లో నమోదు చేయాలని లక్ష్యం నిర్దేశించగా శుక్రవారం వరకు 8,445 కనెక్షన్ల వివరాలు నమోదు చేసి రాష్ట్రంలో నే ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. యూఎల్ బీ ద్వారా 20,660, అమృత్ పథకం ద్వారా 21,500.. మొత్తంగా 42,160 నల్లా కనెక్షన్లు నగ రంలో ఉన్నాయని వివరించారు. ఆన్లైన్లో వివరాల నమోదు పూర్తయ్యాక ఆస్తిపన్ను వసూలు చేస్తున్న హాండ్ హెల్డ్ మిషన్లతోనే ఏకకాలంలో నల్లాబిల్లులు కూ డా వసూలు చే యడానికి అవకాశం ఉంటుంద ని వెల్లడించారు. వినియోగదారు కూడా తన స్మా ర్ట్ ఫోన్తో ఎక్క డి నుంచైనా బి ల్లు చెల్లించే సౌక ర్యం ఉంటుందని వివరించారు. నగరపాలక సంస్థపై కూడా ఆర్థిక భారం తగ్గుతుందని, త్వరలో అందుబాటులోకి రానున్న ఈ సౌకర్యాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకొని బల్దియాకు సహరించాలని కమిషనర్ అరుణశ్రీ కోరారు. -
నాకు నీడగా.. నీకు తోడుగా..
● ఆత్మీయతకు ప్రతీక రక్షాబంధన్ ● ఎక్కడున్నా రాఖీని మరువని రక్త సంబంధాలు ● మార్కెట్లో పండుగ సందడికలెక్టర్కు పోషణ బంధం రాఖీ63 ఏళ్లుగా పండుగ సంతోషం..సోదరి కోసం సౌదీ నుంచి..అన్నంటే ధైర్యం.. తమ్ముడంటే ప్రేమ.. అమ్మగర్భాన్ని పంచుకుని.. నాన్న చూపిన బాటలో నడుచుకుని.. ఏళ్లకాలం తోడునీడగా నిలిచేది సోదర, సోదరీమణుల బంధం. రక్తం పంచుకుని పుట్టి.. చివరి అంకం వరకు ప్రేమ, ఆప్యాయతలు పంచుకునే ప్రేమబంధం. ఇలాంటి బంధానికి ప్రతీకగా నిలుస్తోంది రాఖీ పండుగ. నేను నీకు రక్షా.. నీవు నాకు రక్షా అంటూ.. అన్నా.. తమ్ముళ్లకు అక్కాచెల్లెల్లు కట్టేది రక్షాబంధన్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురు విదేశాల్లో ఉన్న సోదరులకు రాఖీలు బట్వాడా చేస్తుండగా.. మరికొందరు పండక్కి స్వదేశానికి వచ్చేశారు. కొందరు వృద్ధులు శుక్రవారం నుంచే సోదరుల ఇళ్లకు పయనమయ్యారు. ఆర్టీసీ బస్సుల్లో పండుగ రద్దీ కనిపిస్తుండగా.. మార్కెట్లలో వివిధ డిజైన్లలతో రాఖీలు మెరుస్తున్నాయి. స్వీట్ల దుకాణాల్లో వివిధ రకాల ఘుమఘుమలు నోరూరిస్తున్నాయి. నేడు రాఖీ పండుగ సందర్భంగా కథనం..మరిన్ని కథనాలు 8లో..పెద్దపల్లిరూరల్: కలెక్టర్ కోయ శ్రీహర్షకు శుక్రవారం పెద్దపల్లి సీడీపీవో కవిత పోషణ బంధం రాఖీ కట్టారు. రాఖీపౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేకంగా పోషణ రాఖీలు తయారు చేయించి జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేశామని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. అంగన్వాడీ టీచర్లు విధిగా గర్భిణులు, బాలింతలు, పిల్లల ఇళ్లకు వెళ్లి రాఖీ కట్టి పోషకాహార ప్రాధాన్యత గురించి వివరించాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా 15 వేల ఇళ్లకు వెళ్లి ఇలా అవగాహన కల్పిస్తారని వివరించారు.ఇల్లంతకుంట: చిత్రంలో కనిపిస్తున్న వీరు సార మల్లేశం, అంతటి లక్ష్మి. అక్కా తమ్ముళ్లు. సొంతూరు ఇల్లంతకుంట మండలం ముస్కానిపేట. తల్లిదండ్రులకు ఇద్దరు ఆడపిల్లలు. ముగ్గురు మగపిల్లలు. అంతటి లక్ష్మి అన్న నర్సయ్య ఐదేళ్లక్రితం చనిపోయాడు. ప్రతీ రాఖీ పండక్కి అక్క లక్ష్మినర్సవ్వతో కలిసి అంతటి లక్ష్మి ముస్కానిపేటకు నడుచుకుంటూ వెళ్లి అన్నాతమ్ముళ్లకు రాఖీ కట్టేవారు. ప్రస్తుతం ముగ్గురూ ఇల్లంతకుంటలోనే వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. ‘మా తమ్ముడు మల్లేశానికి నేను మా అక్క ప్రతీ ఏటా రాఖీ కడతాం. తమ్ముడికి రాఖీ కడితే ఎంతో సంతోషంగా ఉంటుంది. 63ఏళ్లుగా రాఖీ కడుతున్నా. ఆరోజు మా ఇళ్లంతా పండుగ వాతావరణం ఉంటుంది. గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాం’ అని అంతటి లక్ష్మి తెలిపింది.16 ఏళ్లుగా స్పీడ్ పోస్ట్లో..జమ్మికుంట: చిన్నతనం నుంచి తన చేతులతో రాఖీ కట్టించుకున్న సోదరుడు ఇప్పుడు సప్తసముద్రాల అవతల ఉన్నా రాఖీ పంపించడం మరవడం లేదు ఆ సోదరి. అమెరికాలో స్థిరపడిన సోదరుడికి 16ఏళ్లుగా ఇంటర్నేషనల్ స్పీడ్పోస్టు ద్వారా రాఖీ పంపుతోంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం గ్రామానికి చెందిన సుజాతకు ఇద్దరు సోదరులు పొనగంటి సంపత్, రమేశ్ ఉన్నారు. సంపత్ స్థానికంగా నివాసం ఉంటున్నాడు. రమేశ్ అమెరికాలోని కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా జీవనం సాగిస్తున్నాడు. సుజాత ఏటా రాఖీ పండుగ సందర్భంగా 15రోజుల ముందుగానే రమేశ్కు ఇంటర్ నేషనల్ స్పీడ్పోస్ట్ ద్వారా రాఖీ పంపిస్తోంది. పండుగ రోజున రమేశ్ రాఖీ కట్టుకొని ఫోన్ ద్వారా సుజాతతో మాట్లాడి తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటారు.కథలాపూర్: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రానికి చెందిన బీమనాతి శ్రీధర్ ఉపాధి నిమిత్తం రెండేళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. రెండేళ్లుగా స్వదేశానికి రాలేదు. రాఖీ పండుగ సందర్భంగా తన సోదరి మౌనికతో రాఖీ కట్టించుకోవాలని అనిపించింది. గల్ఫ్ దేశంలో కంపెనీ యజమానితో విషయం చెప్పాడు. వారు ఒప్పుకోవడంతో బుధవారం స్వగ్రామానికి వచ్చాడు. సోదరితో రాఖీ కట్టించుకుంటే ఆ సంతోషం వర్ణించలేనిదని శ్రీధర్ అంటున్నాడు. -
పంద్రాగస్టుకు ఏర్పాట్లు
పెద్దపల్లిరూరల్: కలెక్టరేట్లో ఈనెల 15న ని ర్వహించే స్వాతంత్య్ర దినోత్సవం కార్యక్రమా నికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అడిషనల్ కలెక్టర్ వేణు ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం ఆయన పలువురు అధికారులతో సమావేశమయ్యారు. పోలీసు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనులు చేయాలని అన్నారు. డీసీపీ కరుణాకర్, ఏసీపీ కృష్ణ, ఆర్డీవో గంగ య్య, సూపరింటెండెంట్ ప్రకాశ్ పాల్గొన్నారు.గోమాతకు పూజలు జూలపల్లి(పెద్దపల్లి): స్థానిక శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. పూజారి నవీ న్ ఆధ్వర్యంలో గోమాతకు పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు పొట్టాల మల్లేశం, వెంకటరమణ, మహిళలు పాల్గొన్నారు. బల్దియాలో డ్రై డే.. ఫ్రైడే కోల్సిటీ(రామగుండం): వందరోజుల కార్యా చరణ ప్రణాళికలో భాగంగా శుక్రవారం నగరంలో డ్రైడే ఫ్రైడే నిర్వహించారు. స్థానిక పరశు రామ్నగర్లో ప్రజా మరుగుదొడ్లు శుభ్రం చేశా రు. ఫైవింక్లయిన్ ఏరియా, అశోక్నగర్లో డ్రైనేజీల్లో పూడిక తొలగించారు. నిల్వనీటిలో ఆయి ల్ బాల్స్ వేశారు. ఆర్వో ఆంజనేయులు, ఆర్ఐ శంకర్రావు, ఎస్సై నాగ భూషణం ఉన్నారు. ఇసుక తవ్వకంపై నిషేధం గోదావరిఖని/జ్యోతినగర్: ఇసుక అక్రమ ర వాణా నేపథ్యంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో విస్తరించిన గోదావరి నదిలోని రీ చ్ల నుంచి ఇసుక తీయడాన్ని నిషేధించామని రామగుండం తహసీల్దార్ ఈశ్వర్ తెలిపారు. క లెక్టర్ ఆదేశాల మేరకు ఈనిర్ణయం తీసుకున్న ట్లు పేర్కొన్నారు. ట్రాక్టర్లు, లారీ ద్వారా గోదా వరి నుంచి ఇసుక తరలించడం, రవాణా చేయడం, డంపులు చేయడాన్ని నిషేఽధించామని, ఉ ల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.జీడీకే–11గని సందర్శన గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–1 పరిధిలోని జీడీకే–11గనిని హైడ్రోలజిస్ట్ వేణు, హైడ్రో జియోలజిస్ట్ సుజాత శుక్రవారం సందర్శించారు. పెద్దంపేట షాఫ్ట్ వద్ద గ ల భూగర్భ జలాలను పరిశీలించారు. అంతకుముందు గని ఏజెంట్ కార్యాలయంలో సీమ్ లు, ప్యానెళ్లు, గనిప్లాన్ పరిశీలించారు. పర్యావరణ అధికారి ఆంజనేయప్రసాద్, గని ఏజెంట్ శ్రీనివాస్, పర్యావరణ అధికారి వసీంఅక్రం, పిట్ ఇంజినీర్ రాకేశ్ తదితరులు ఉన్నారు. జీజీహెచ్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్గా అరుణ కోల్సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహె చ్) డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్గా గై నిక్ హెచ్వోడీ, ప్రొఫెసర్ అరుణ నియమితులయ్యారు. శుక్రవారం జీజీహెచ్ను తనిఖీ చేసిన కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచలన మేరకు అరుణ ను డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్గా ని యమించినట్లు ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ దయాల్సింగ్ తెలిపారు. కదిలిన బల్దియా యంత్రాంగం కోల్సిటీ(రామగుండం): రా మగుండం నగరంలోని కేసీఆర్ కాలనీ, ప్రగతినగర్, సాయినగర్లో బల్దియా అధికార యంత్రాంగం శుక్రవారం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ‘ఫీవర్.. ఫియర్’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించిన విషయం విదితమే. ఈ కథనంతో బల్దియా క మిషనర్ అరుణశ్రీ స్పందించారు. నగరంలో యుద్ధప్రాతిపదికన తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఓపెన్ప్లాట్ల యజమానులకు నో టీసులు జారీచేయాలని ఆదేశించారు. ఇటీవల మృతి చెందిన దీపక్ నివాసం సమీపంతోపా టు కాలనీల్లో బ్లీచింగ్ పౌండర్ చల్లించారు. కాలువల్లో చెత్తాచెదారాన్ని తొలగించారు. హెల్త్ అసిస్టెంట్ సంపత్ పర్యవేక్షించారు. -
భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం
పెద్దపల్లిరూరల్/మంథని: జిల్లావ్యాప్తంగా శుక్రవారం వరలక్ష్మీవ్రతం అత్యంత వైభవంగా జరుపుకున్నారు. వేలాది మంది ముత్తయిదువలు తొలుత ఆలయాలకు చేరుకుని అమ్మవారికి పూజలు చేశారు. తమ కుటుంబాలను, పసుపు, కుంకుమలను చల్లంగా చూడాలని వేడుకున్నారు. పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. చీరెసారె సమర్పించారు. వాయినాలు ఇచ్చుకున్నారు. ఇళ్లలోనూ వ్రతాలు చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దపల్లి సంతోషిమాత, మంథని శ్రీమహాలక్ష్మీ, గోదావరిఖని, జ్యోతినగర్, రామగుండం తదితర ప్రాంతాల్లో అమ్మవారిని దర్శించుకున్నారు. -
క్రిప్టోకు రెక్కలు!
దేశం దాటుతున్న రూ.వందల కోట్లు ● మూడేళ్ల క్రితమే కేంద్రం హెచ్చరికలు ● పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ● తాజాగా నెక్ట్స్ బిట్ పేరుతో రూ.300 కోట్ల టోకరా? ● గతంలో రెక్సిట్, మెటా పేరుతో రూ.కోట్ల దందాలు ● ఉమ్మడి జిల్లాలో ఇంకా పెట్టుబడి పెడుతున్న అత్యాశపరులు ● క్రిప్టో వసూళ్లపై రాచకొండ పోలీసుల ఉక్కుపాదం ● కరీంనగర్లో రెవెన్యూ, పోలీసులవే అధిక పెట్టుబడులుసాక్షిప్రతినిధి,కరీంనగర్: ‘క్రిప్టోలో ఒక్కసారి పెట్టుబడి పెట్టండి. ప్రతీ రోజూ సాయంత్రానికి మీ ఖాతాల్లో రూ.వేలు చూసుకోండి. నెలకు రూ.లక్షల సంపాదన. రెండుమూడు నెలల్లో మీ జీవితం మారిపోతుంది, హోదా పెరుగుతుంది’ అంటూ కల్లిబొల్లి మాటలు చెప్పి.. అమాయకుల నుంచి రూ.లక్షలు పెట్టుబడులు పెట్టిస్తున్నారు. ఒకరిద్దరికి సరిగానే ఇచ్చి.. మిగిలిన వారికి టోకరా వేస్తున్నారు. అలా వసూలు చేసిన డబ్బులు రూ.వందల కోట్లు దేశం దాటుతున్నాయి. క్రిప్టో పేరిట తెలంగాణలో పలు నకిలీ యాప్లు పుట్టుకొస్తున్నాయని, అమాయకులు పెట్టుబడి పెట్టి డబ్బులు పోగొట్టుకుంటున్నారని మూడేళ్ల క్రితమే కేంద్ర నిఽఘా వర్గాలు రాష్ట్ర పోలీసులను హెచ్చరించాయి. ఈ తరహా యాప్లను రాష్ట్ర పోలీసులు నియంత్రించడంలో విఫలమయ్యారనే చెప్పాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే అత్యధిక క్రిప్టో మోసాలకు వేదికవుతున్నా.. పోలీసులు చర్యలు చేపట్టిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. జిల్లాలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ యాప్లలో పెట్టుబడులు పెట్టడం శోచనీయం.దేశం దాటుతున్న రూ.వందల కోట్లు భారీగా లాభాలు ఆశ చూపి, వసూలు చేసిన మొత్తాన్ని జగిత్యాల కేంద్రంగా కొంచెం హవాలా మార్గంలో, క్రిప్టోలోకి కొంచెం మార్చి దేశం దాటిస్తున్నారు. విదేశాల్లో ఆస్తులు కొని, వ్యాపారాలు ప్రారంభించి అక్కడే స్థిరపడేలా ‘లక్కీ భాస్కర్’సినిమాను తలపించేలా భారీ స్కెచ్ వేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో జీబీఆర్ క్రిప్టో కరెన్సీ పేరుతో రమేశ్గౌడ్ అనే వ్యక్తి ఒక్క కరీంనగర్ జిల్లాలోనే రూ.95 కోట్లు కొల్లగొట్టాడు. దీనిపై సీఐడీ విచారణ జరపుతోంది. ఇందులో లంచం తీసుకున్నాడన్న ఆరోపణలపై ఓ డీఎస్పీని అటాచ్ చేశారు. రమేశ్ గౌడ్ ఆ డబ్బును దుబాయ్లో పెట్టుబడులు పెట్టి, పదేళ్ల గోల్డెన్ వీసా సంపాదించినట్లు బాధితులు తెలిపారు. ఇటీవల మెటా ఫండ్ పేరిట రాష్ట్రవ్యాప్తంగా రూ.100 కోట్లకుపై వసూలు చేసిన లోకేశ్, కె.సతీశ్ ఆ డబ్బును దేశం దాటించారని, వీరికి ఓ బీజేపీ నాయకుడు సాయం చేశాడన్న ప్రచారం సాగుతోంది. వాస్తవానికి లోకేశ్ ఎప్పుడో థాయ్లాండ్ వెళ్లాడని బాధితులు చెబుతున్నారు. తాజాగా హిమాన్ష్ అనే యువకుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేయడం సంచలనం రేపుతోంది. ఇతను రాష్ట్రవ్యాప్తంగా 400 మంది వద్ద రూ.19 కోట్లు నెక్ట్స్బిట్ యాప్ పేరుతో వసూలు చేశాడని రాచకొండ పరిధిలోని మేడిపల్లి పీఎస్లో కేసు నమోదైంది. ఈ యాప్ బారిన పడ్డవారిలో అత్యధికులు ఉమ్మడి కరీంనగర్ జిల్లావారే. గతంలోనూ హిమాన్షు రిక్సో యాప్ను నిర్వహించి రూ.కోట్లలో వసూలు చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ముఠా దాదాపు రూ.300 కోట్ల వరకు వసూలు చేసిందని సమాచారం.పట్టించుకోని కరీంనగర్ పోలీసులు నెక్ట్స్బిట్ యాప్పై రహస్య సమాచారం మేరకు రాచకొండ పోలీసులు ఆగస్టు 1వ తేదీన హిమాన్షును అరెస్టు చేశారు. ఈ కేసులో రికీఫామ్ (ఫారిన్ ఆపరేటర్), అశోక్ శర్మ (థాయ్లాండ్ ఆపరేటర్), డీజే సొహైల్ (రీజనల్ రిక్రూటర్), మోహన్ (సహాయకుడు), అశోక్కుమార్ సింగ్ (హిమాన్షుకు సహాయకుడు)ను నిందితులుగా చూపించారు. వీరంతా నెక్ట్స్ బిట్యాప్లో పెట్టుబడి పెట్టించి ప్రజలను మోసగించారని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ పరిధిలో రామగుండం, కరీంనగర్ కమిషనరేట్లు, జగిత్యాల, సిరిసిల్ల ఎస్పీ కార్యాలయాలు ఉన్నాయి. రాచకొండ పోలీసుల తరహాలో వీరూ చర్యలకు దిగితే రూ.వందల కోట్ల దందా బయటికి వస్తుందని బాధితులు అంటున్నారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని పోలీసుస్టేషన్లలో ఈ విషయమై ఫిర్యాదులు ఇస్తే సెటిల్మెంట్ చేసుకోండని తిప్పి పంపుతున్నారని, కేసులు నమోదు చేయకుండా నిందితుల వైపు ఉంటున్నారన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. కేసులు ఎందుకు నమోదు చేయడం లేదంటే బాధితులు ముందుకు రావడం లేదని పోలీసులు సమాధానం ఇస్తున్నారు. -
పెద్దపల్లి
శనివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 20257సాక్షి ఆధ్వర్యంలో ‘సెల్ఫీ విత్ రాఖీ’సోదర, సోదరీమణుల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. ఈ పండుగను మరింత ఆనందమయం చేసేందుకు ‘సాక్షి’ ‘సెల్ఫీ విత్ రాఖీ’ని ఆహ్వానిస్తోంది. మీ సోదరి రాఖీ కడుతున్నప్పుడు ‘సెల్ఫీ’ దిగి, పేరు, ఊరు, జిల్లా రాసి శనివారం మాకు పంపండి. మీ ఫొటోను ప్రచురిస్తాం. పర్యావరణహితమైన రాఖీ ఫొటోలకు ప్రాధాన్యం ఇస్తాం.మీరు సెల్ఫీ పంపించాల్సిన ఫోన్ నంబర్ 85007 86474 -
ఇద్దరు అధికారుల సరెండర్
● విధి నిర్వహణలో నిర్లక్ష్యమే కారణం కోల్సిటీ(రామ గుండం): వి ధుల్లో నిర్లక్ష్యం వహించిన రా మగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎన్.హనుమంతరావు నాయక్, శానిటరీ ఇన్స్పెక్టర్ డి.కిరణ్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్లు కమిషనర్ జె.అరుణశ్రీ తెలిపారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన మొబైల్ అప్లికేషన్ లో వివరాలు సకాలంలో అప్డేట్ చేయించడంలో పర్యవేక్షణ లోపం, టీయూఎఫ్ఐడీసీ తదితర పథకాల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయించడంలో అలసత్వం వహించడంతో ఇద్దరు ఉద్యోగులను సరెండర్ చేశావని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వివరించారు. అలాగే, ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నగరంలో చేపట్టాల్సిన పారిశుధ్య పనులను అమలు చేయడంలో నిర్లక్ష్యంతోపాటు తనకు కేటాయించిన డివిజన్లలో సమస్యలు పరిష్కరించడంలో విఫలమైన శానిటరీ ఇన్స్పెక్టర్నూ సరెండర్ చేశామని ఆమె వివరించారు. -
15 లోగా భూ సమస్యలు పరిష్కరించాలి
● కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు పెద్దపల్లిరూరల్: రెవెన్యూ సదస్సులు, ప్రజావా ణి ద్వారా స్వీకరించిన భూ సమస్యలపై ఫిర్యా దులకు ఈనెల 15వ తేదీవరకు పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ వేణుతో కలిసి భూ సమస్యల పరిష్కారంపై శుక్రవారం కలెక్టరేట్లో సమీక్షించారు. సింగరేణి, ఎన్టీపీసీ, జాతీయ రహదారుల భూసేకరణ పూర్తిచేయాలన్నారు. అగ్నిపథ్, ఎస్ఎస్ జీడీ పరీక్ష ఉత్తీర్ణులైన వారికి ఉచితంగా గ్రౌండ్ శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. వివరాలకు 99497 25997, 83330 44460 నంబర్లలో సంప్రదించాలన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో టెన్త్ విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా కా ర్యాచరణ చేపట్టాలన్నారు. ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, డీఈవో మాధవి, తహసీల్దార్లు ఉన్నారు. గ్రీవెన్స్ సెల్పై దృష్టి పెట్టాలి కోల్సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ సెల్ నిర్వహించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. జీజీహెచ్ని కలెక్టర్ తని ఖీ చేశారు. మెడికల్ సూపరింటెండెంట్ దయాల్సింగ్, సిమ్స్ ప్రిన్సిపాల్ హిమబింద్ సింగ్, వైద్యాధికారులతో సమస్యపై సమీక్షించారు. టెక్నికల్ పోస్టులను భర్తీ చేసేందుకు కలెక్టర్ సానుకూ లంగా స్పందించారు. సీజనల్ వ్యాధులు, పిల్లల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. క్రిటికల్ కేర్ భవనం పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. వైద్యాధికారులు అరుణ, రాజు, డాక్టర్లు అతుల్య, శ్రీధర్ పాల్గొన్నారు. అనంతరం బల్ది యా కార్యాలయంలో కమిషనర్ అరుణశ్రీతో పా రిశుధ్యం నిర్వహణపై సమీక్షించారు. ఆస్తిపన్ను పెంపుపై చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలి రామగుండం: పీహెచ్సీలో వ్యాధి నిర్ధారణ పరీక్ష లు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. రక్తపోటు, మధుమేహం బాధితులకు మందుల కిట్ అందించాలన్నారు. స్థానిక పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
● డెంగీ ప్రబలకుండా పకడ్బందీ చర్యలు ● డ్రై డే.. ఫ్రై డే రోజు ఇంటింటా సర్వే ● పరిసరాల శుభ్రతపై అవగాహన ● ‘సాక్షి’తో జిల్లా వైద్యాధికారి అన్నప్రసన్నకుమారిపెద్దపల్లిరూరల్: వానాకాలమంటేనే వ్యాధుల కాలం.. వ్యర్థపు వస్తువుల్లో నీరు నిలిస్తే దోమలు, ఈగలు ఇతర క్రిములు వృద్ధి చెంది రోగాలు ప్రబలే అవకాశముంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్నప్రసన్నకుమారి పేర్కొన్నారు. ఇందుకోసం ఊరూరా ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని, వ్యాధులను కట్టడి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ ప్రత్యేక చర్యలు తీసుకునేలా ఆదేశాలిస్తున్నారని వివరించారు. ఈసందర్భంగా గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు.సాక్షి: సీజనల్ వ్యాధుల కట్టడికి తీసుకుంటున్న చర్యలు.?డీఎంహెచ్వో: వానాకాలంలో వ్యాధులబారిన పడకుండా అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పిస్తున్నాం. ఇళ్ల ఆవరణలోని వ్యర్థాలలో వర్షపు నీరు నిలిచి దోమలు వృద్ధి చెందకుండా తమ సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. సాక్షి: జిల్లాలో ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారా.?డీఎంహెచ్వో: జిల్లాలో రోజూ ఫీవర్ సర్వే జరుగుతోంది. సాయంత్రం వరకు సిబ్బంది వివరాలతో కూడిన నివేదిక ఇస్తున్నారు. సాక్షి : జ్వరపీడితులను గుర్తించి అందిస్తున్న సేవలు.?డీఎంహెచ్వో: ఇంటింటా సర్వేకు వెళ్లిన సమయంలో జ్వరంతో బాధపడుతున్నవారిని గుర్తిస్తే వారినుంచి రక్తనమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నాం. వ్యాధిని బట్టి వారికి సేవలందిస్తూనే ఆ ఇంటి పరిసరాల ప్రజలకు వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సాక్షి: ఫ్రై డే, డ్రై డే రోజున చేపట్టే కార్యక్రమాలు.?డీఎంహెచ్వో: ఆశావర్కర్లు ఫ్రై డే, డ్రై డే రోజు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య సమస్యలపై ఆరా తీస్తారు. ఆ రోజు కనీసం 30 ఇళ్లు సందర్శించి కుటుంబసభ్యుల ఆరోగ్యస్థితి తెలుసుకుని వారి నుంచి సంతకం తీసుకుంటారు.సాక్షి: డెంగీ, విషజ్వరాలబారిన పడ్డవారికి అందించే సేవలు.?డీఎంహెచ్వో: డెంగీ, విషజ్వరాల బాధితులకు పల్లె ప్రాంతాల్లోని పీహెచ్సీ, సబ్సెంటర్లు, పట్టణాల్లో ఆసుపత్రులు, బస్తీ దవాఖానాల్లో సిబ్బంది అందుబాటులో ఉండిి సేవలందిస్తున్నారు. అవసరమైన మందులన్నీ అందుబాటులో ఉన్నాయి. దోమలబారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలి. దోమతెరలు వాడడం మేలు. సాక్షి: ఇప్పటివరకు డెంగీ కేసులు గుర్తించారా.?డీఎంహెచ్వో: జిల్లాలో ఇప్పటివరకు 10 డెంగీ కేసులు గుర్తించాం. అందులో కొన్ని వలసవచ్చిన వారివే. రాఘవాపూర్, గుంపుల, కొలనూర్ ప్రాంతాల్లో గుర్తించి వైద్యమందించాం. వారి ఇంటి పరిసరాల్లో ఉండే వారికి ౖపరీక్షలు చేయించాం. సాక్షి: దోమల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు.?డీఎంహెచ్వో: పంచాయతీ అధికారుల సమన్వయంతో దోమలను నిర్మూలించేలా చూస్తున్నాం. నీరు నిలవకుండా గుంతలు పూడ్చడం, డ్రైనేజీల్లో ఆయిల్బాల్స్ వేయడం, అవసరమైన ప్రాంతాల్లో ఫాగింగ్ చేయిస్తున్నారు. సాక్షి: వైద్యసిబ్బందిని అప్రమత్తం చేసేందుకు అనుసరిస్తున్న పద్ధ్దతులేంటి.?డీఎంహెచ్వో: వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు తమ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాం. ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచాం. ఎప్పటికప్పుడు అందుతున్న సమాచారాన్ని బట్టి తమ సిబ్బంది సేవలందిస్తున్నారు. -
విద్యార్థులకు రోబోటిక్స్ శిక్షణ
పెద్దపల్లిరూరల్/రామగుండం/కమాన్పూర్: జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో 8,9వ తరగతుల విద్యార్థులకు గురువారం సోహం అకాడమీ ఆఫ్ హ్యుమన్ ఎక్సలెన్స్ సంస్థ ఆధ్వర్యంలో రోబోటిక్స్ శిక్షణ ప్రారంభించారు. పెద్దపల్లిలోని జిల్లా పరిషత్ (బాలుర)ఉన్నత పాఠశాల, రామగుండం పరిధిలోని లింగాపూర్ ఆదర్శ విద్యాలయం, కమాన్పూర్ జెడ్పీ స్కూల్లో ఆధునిక సాంకేతికతపై అవగాహన కల్పించారు. పాఠశాలకు రోబోటిక్ కిట్ అందించి విద్యార్థులు ఆధునిక సాంకేతికతపై ఆవిష్కరణలు చేసేలా ఆసక్తి పెంపొందిస్తున్నారని జెడ్పీహెచ్ఎస్ ఇన్చార్జి హెచ్ఎం సురేంద్రప్రసాద్, ఎంఈవో సురేందర్కుమార్ తెలిపారు. శిక్షణకు లింగాపూర్ ఆదర్శ విద్యాలయం నుంచి 35 మందిని ఎంపిక చేసినట్లు ప్రిన్సిపాల్ సదానందం వివరించారు. కమాన్పూర్ జెడ్పీ స్కూల్ నుంచి 21 మంది విద్యార్థులు ఎంపికై నట్లు ఎంఈవో విజయ్కుమార్ పేర్కొన్నారు. విమానాశ్రయం ఏర్పాటు చేయాలని వినతి గోదావరిఖని(రామగుండం): అంతర్గాం మండలంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ కోరారు. గురువారం పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడుకు వినతిపత్రం అందజేశారు. పెద్దపల్లి జిల్లా భౌగోళికం, పరిశ్రమలు, జనాభా వృద్ధి, రవాణా అవసరాలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని విమానశ్రయం ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. సాంకేతిక పరిశీలనల అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వివరించారు. శిక్షణను వినియోగించుకోవాలి సుల్తానాబాద్(పెద్దపల్లి): అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్షకు హాజరుకానున్న న్యాయవాదులు రెండునెలల ఉచిత ఆన్లైన్ శిక్షణను వినియోగించుకోవాలని లీగల్సెల్ కన్వీనర్ వరలక్ష్మి కోరారు. గురువారం మండలకేంద్రంలోని కోర్టు ఆవరణలో ఉచిత శిక్షణ పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఆసక్తిగలవారు ప్రోగ్రాం కో ఆర్డినేటర్ అభిలాష్ ఆశ్రిత్ (91330 35555)ను సంప్రదించాలన్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్ గుర్తింపు కార్డుతో ఈ నెల 10 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల తిరుపతిరెడ్డి, జనరల్ సెక్రటరీ బోయిని భూమయ్య న్యాయవాదులు పాల్గొన్నారు. చేనేతరంగాన్ని బలోపేతం చేద్దాం పెద్దపల్లిరూరల్: చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అదనపు కలెక్టర్ వేణు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో కొండ లక్ష్మణ్బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టరేట్ నుంచి ప్రధాన ద్వారం వరకు చేనేత కార్మికులతో కలిసి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ అవార్డు గ్రహీతలను సత్కరించారు. వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ప్రభుత్వ సంస్థల్లో వినియోగించే విద్యార్థుల యూనిఫాం, మహిళా సంఘాలకు అందించే చీరలు తయారీకి నేతన్నలకే ఆర్డర్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. జెడ్పీసీఈవో నరేందర్, హౌజింగ్ పీడీ రాజేశ్వర్, డీఎంవో ప్రవీణ్రెడ్డి తదితరులున్నారు. -
ఫీవర్.. ఫియర్
ఇళ్ల మధ్య పిచ్చిమొక్కలుగోదావరిఖని కేసీఆర్కాలనీలో ఎక్కడ చూసినా ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. ప్లాట్ యజమానులను రామగుండం బల్దియా అధికారులు గుర్తించి ఇప్పటి వరకు నోటీసులు కూడా జారీ చేయలేదని ఆరోపణలున్నాయి. ఖాళీ స్థలాల్లో నిత్యం పాములు సంచరిస్తుండడంతో కాలనీవాసులు భయందోళనలకు గురవుతున్నారు. పారిశుధ్య లోపంతో పందులు స్వైరవిహారం చేస్తున్నాయి.విషాదంలో మృతుడి కుటుంబంటెంటువేసిన ఇంటి ఎదుట విషాదంతో విలపిస్తున్న ఈ కుటుంబం గోదావరిఖని కేసీఆర్కాలనీకి చెందినది. చింతల దీపక్ అనే టెన్త్ స్టూడెంట్ ఈనెల 5న జ్వరం, జాండీస్ లక్షణాలతోపాటు గుండెపోటుతో మృతిచెందాడని వైద్య బృందం చెబుతోంది. ఐదేళ్ల క్రితం భర్తను కోల్పోయిన పుష్పలత అనే నిరుపేద మహిళ, ఇప్పుడు 15 ఏళ్ల కొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంతో రోదిస్తోంది. తాను నివాసం ఉంటున్న కాలనీలో లోపించిన పారిశుధ్య సమస్యలతోనా..? తీవ్ర అనారోగ్యంతో తన కొడుకు మృతి చెందాడా..? తేల్చుకోలేక ఆవేదన చెందుతోంది.పేరుకుపోయిన చెత్తాచెదారండివిజన్లలో పారిశుధ్యం మెరుగుపర్చడానికి వందరోజుల ప్రత్యేక కార్యాచరణతో రోజుకో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కానీ, కేసీఆర్కాలనీలో పర్యటిస్తే అందుకు భిన్నంగా పారిశుధ్యం లోపాలు దర్శనమిస్తున్నాయి. ప్రధాన కాలువలు చెత్తచెదారంతో నిండి కనిపిస్తున్నాయి. కేసీఆర్కాలనీ, ప్రగతినగర్, సాయినగర్లో దోమల బెడద కంటిమీద కునుకులేకుండా చేస్తోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఫాగింగ్ కూడా చేపట్టడం లేదని ఆరోపిస్తున్నారు. గతంలో ఈ కాలనీలో ఒకరికి డెంగీ పాజిటీవ్ వచ్చింది.దోమలతో నరకందోమలతో భరించలేకపోతున్నాం. సూదులతో పొడిచినట్లు కుడుతున్నాయి. పగలు, రాత్రి నిద్రలేకుండా చేస్తున్నాయి. అందరికీ జ్వరాలే వస్తున్నాయి. పాముల భయంతో రోడ్డుమీద అడుపెట్టలేకపోతున్నాం. చిత్తడిగా పెరిగిన పిచ్చిచెట్లను తొలగించాలి.– కత్తరమల్ల శంకరమ్మ, కేసీఆర్కాలనీ, గోదావరిఖనిస్పెషల్డ్రైవ్ చేపట్టాలికేసీఆర్కాలనీ, ప్రగతినగర్, సాయినగర్లో బల్దియా అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి. దోమలతో విషజ్వరాలు ప్రబలకముందే అప్రమత్తం కావాలి. ఇప్పటికే టెన్త్ స్టూడెంట్ చనిపోవడంతో స్థానికులు భయంతో వణుకుతున్నారు. పారిశుధ్యం మెరుగుకు వారం పాటు ప్రత్యేక చర్యలు చేపట్టాలి.– మిట్టపెల్లి మహేందర్, కేసీఆర్కాలనీ, గోదావరిఖని -
క్రమశిక్షణకు కానుక
గోదావరిఖని(రామగుండం): ‘బైక్ ఆపి పక్కన పెట్టమ్మా.. అనగానే ఆడపడుచు ముఖంలో ఆందో ళన.. ఎక్కడ ఫైన్ వేస్తారో.. పాత చలాన్లు కట్టమంటారోనని అనుమానంతో అక్కడే నిల్చుంది.. మీరు హెల్మెట్ పెట్టుకుని బైక్ నడుపుతున్నందుకు అభినందిస్తున్నాం.. మీకు చీర బహుమతిగా ఇస్తున్నాం’.. అని ట్రాఫిక్ ఏసీపీ చెప్పడంతో సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యారు మహిళా బైక్రైడర్లు. ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా పాటిస్తున్న మహిళలకు చీర బహూకరించి గౌరవించారు. పవిత్ర శ్రావణ మాసం కావడం.. ట్రాఫిక్ పోలీసుల నుంచి చీర అందుకోవడంతో వారి సంతోషానికి అవధులు లేవు. నిబంధనలపై చైతన్యం గోదావరిఖని ట్రాఫిక్ పోలీసులు వినూత్న శైలిలో బైక్ రైడర్లను ట్రాఫిక్ నిబంధనలపై చైతన్య పరుస్తున్నారు. ఫైన్వేయడం, చలాన్లు కట్టమనడం, డ్రంకెన్డ్రైవ్ చేపట్టడమే కాదు. నిబంధనల ప్రకారం డ్రైవ్ చేసే వారిని అభినందిస్తామని నిరూపించారు. గురువారం స్థానిక ట్రాఫిక్ జంక్షన్ వద్ద రామగుండం ఏసీపీ సీహెచ్.శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఐ రాజేశ్వర్రావు, ఎస్సై హరిశేఖర్ తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న పలువురు మహిళలను అభినందించడంతో పాటు చీర బహుమతిగా అందజేశారు. అతివల ఆనందం ట్రాఫిక్ పోలీసుల నుంచి చీర బహుమతిగా అందుకున్న మహిళలు సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. ‘మా క్రమశిక్షణకు ఈస్థాయిలో గుర్తింపు లభించడమనేది ఎంతో గౌరవంగా ఉందన్నారు. ఇది మరింత బాధ్యతతో ట్రాఫిక్ నియమాలు పాటించేలా చైతన్యం కలిగిస్తుంది’ అని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువతతో పాటు అన్ని వయస్సుల వారికి సురక్షిత ప్రయాణంపై అవగాహన పెంచుతుందని అంటున్నారు. బట్టలషాపు యజమానుల ప్రోత్సాహంతో.. ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకు కొంతమంది బట్టషాపుల యజమానులు ఉచితంగా చీరలు అందజేసేందుకు ముందుకు వచ్చారు. వేలకు వేలు పెట్టి ప్రచారం కన్నా ఓ మంచి పనికి తమకు సహకరించాలని కోరడంతో గోదావరిఖని లక్ష్మీనగర్లోని పలు షాపుల యజమానులు అంగీకరించారు. దీనిలో భాగంగా స్థానిక భువనేశ్వరి సిల్క్ నుంచి పది చీరలు తీసుకువచ్చి ట్రాఫిక్ నియమాలు పాటించిన ఆడపడుచులకు అందజేశారు. హెల్మెట్ పెట్టుకో.. గిఫ్ట్ పట్టుకో.. మహిళా బైక్రైడర్లకు శ్రావణం చీర ఆఫర్ గోదావరిఖని ట్రాఫిక్ పోలీసుల వినూత్న అవగాహనఇదే విధానం కొనసాగిస్తాం ట్రాఫిక్ నియమాలు పాటించే వారిని అభినందించాలని నిర్ణయించాం. గతంలో గులాబీ పువ్వు ఇచ్చే పద్ధతి కొనసాగేది. దీనివల్ల చాలామంది బాధపడిన సందర్భాలున్నాయి. శ్రావణమాసం కావడంతో ఆడపడుచులకు చీరలు అందించాలని ఆలోచించాం. ఈమేరకు బట్టల షాపు నుంచి స్పాన్సర్ తీసుకున్నాం. షాపు యజమాని ఇచ్చిన చీరలను షాప్ పేరుతో ఉన్న కవర్తో సహా అందజేశాం. ఇదే పద్ధతి రాబోయే రోజుల్లో కూడా కొనసాగిస్తాం. నిబంధనలు పాటించి ప్రతీఒక్కరు సురక్షితంగా గమ్యం చేరడమే మా లక్ష్యం. – సీహెచ్.శ్రీనివాస్, ఏసీపీ, ట్రాఫిక్ రామగుండం -
చిన్నారుల చదువుపై శ్రద్ధ చూపాలి
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లిలోని బాలసదనం కేంద్రాన్ని గురువారం కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా సందర్శించారు. చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. వారంతా బడికి వెళ్లేలా చూడాలని, చిన్నారుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. చందపల్లిలోని బస్తీ దవాఖానాలో ఒపీ సేవలపై ఆరా తీశారు. సఖి కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ సమస్యలతో కేంద్రాన్ని ఆశ్రయించే వారికి సంపూర్ణ సహకారం అందించాలన్నారు. ‘టాస్క్’ శిక్షణకు ప్రచారం కల్పించాలి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘టాస్క్’ శిక్షణ కేంద్రంపై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాబోయే 6నెలల్లో కనీసం వెయ్యిమందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. ఇతర పనులపై దృష్టిసారించాలి వ్యవసాయం, సినిమాటోగ్రఫీ రంగాల్లో ఉపాధి పొందేందుకు వీలుగా శిక్షణ ఇచ్చేందుకుగల అవకా శాలను పరిశీలించాలని కలెక్టర్ సంబంధిత అధి కారులకు సూచించారు. పంటల సాగులో వచ్చిన ఆధునిక సాంకేతికతపై శిక్షణ ఇవ్వాలన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు జిల్లాలోని ఇసుక రీచ్ల నుంచి అక్రమంగా ఇసుక తరలించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి శివారులో గురువారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను సీజ్ చేసినట్టు తెలిపారు. 15రోజుల్లోగా రికవరీ చేయాలి జిల్లాలోని సీ్త్రనిధిలో దుర్వినియోగం చేసిన నిధులను సంబంధిత వీఓఏ, ఓబీల నుంచి 15రోజుల్లోగా రికవరీ చేయాలని, లేదంటే చట్ట ప్రకారం ఆస్తులను జప్తు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ప్రతి గ్రామంలో స్వశక్తి సంఘాల సభ్యుల లావాదేవీల రికార్డులు స్పష్టంగా ఉండాలన్నారు. పీహెచ్సీ తనిఖీ ఓదెల(పెద్దపల్లి): ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నా రు. గురువారం మండలంలోని కొలనూర్ పీహెచ్సీని తనిఖీ చేశారు. సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, డాక్టర్ సంజనేశ్ పాల్గొన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష -
ఉచితం మాటున అక్రమం
● రహస్య ప్రాంతాల్లో నిల్వలు ● రాత్రిపూట రాజధానికి తరలింపు ● జోరుగా ఇసుక అక్రమ రవాణా గోదావరిఖని: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసా గు తోంది. స్థానికులకు ఉచితం మాటున అడ్డగోలుగా తరలిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. తొలుత గోదా వరి నది నుంచి ట్రాక్టర్ల ద్వారా తీసుకొచ్చి పలు రహస్య ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. ఇలా డంప్చేసిన ఇసుకను లారీల ద్వారా హైదరాబాద్కు తరలించి పెద్దఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా డంప్లే.. గోదావరిఖనిలోని పలు ప్రాంతాల్లో ఎక్కడ చూసి నా ఇసుక డంప్లే దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా నగర శివారు కేంద్రాలుగా ఈ వ్యవహారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. గృహావసరాల కోసమని చెప్పి తీసుకొస్తున్న ఇసుక ను కొందరు ఒకచోట కుప్పగా పోసి, పెద్దఎత్తున నిల్వ చేసి.. ఆ తర్వాత లారీల ద్వారా దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇలా తరలించి ఒక్కో ట్రిప్పును సుమారు రూ.50వేల వరకు విక్రయిస్తున్నారు. మంగళవారం పోలీసులు జరిపిన దాడిలో సప్తగిరికాలనీలో పెద్ద డంప్ లభించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అలాగే శాంతినగర్లో రెండు ఇసుక డంప్లను గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా మల్లుస్వరాజ్యం కాలనీ, ఐబీకాలనీ, వాగువెంట ఉన్న ఏరియాల్లో డంప్ చేసుకుని హైదరాబాద్ తరలిస్తున్నారని సమాచారం. స్థానిక అవసరాలు.. వాణిజ్యానికి తరలింపు స్థానిక అవసరాల పేరుతో ట్రాక్టర్ల ద్వారా గోదావరి నుంచి తీసుకొస్తున్న వ్యాపారులు.. అనేకచోట్ల డంప్లు ఏర్పాటు చేసి వాణిజ్య అవసరాల కోసం విక్రయిస్తున్నారు. ఇలా నిబంధనలు అతిక్రమిస్తూ ఆర్నెల్లుగా ఈవ్యవహారం జోరుగా సాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్కు తరలిస్తే పెద్దఎత్తున సొమ్ము చేసుకోవచ్చనే అత్యాశతో కొందరు ఈదందాకు తెరలేపారు. స్థానిక అవసరాలకు ఉచితంగా.. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజల అవసరాల కోసం ఉచితంగా ఇసుక ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. దీంతో చాలామంది ఇసుకను ఉచితంగా తెచ్చుకుంటున్నారు. ఇదేఅదనుగా భావించి అక్రమార్కులు తమదైన శైలిలో ముందుకు సాగుతూ డంప్లు ఏర్పాటు చేసి అందినంత దండుకుంటున్నారు. కఠిన చర్యలు తీసుకుంటాం గృహావసరాల కోసం తీసుకొచ్చిన ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. స్థానికులకు ఇసుక అందుబాటులో ఉండాలనే ఆలోచనతో కలెక్టర్, ఎమ్మెల్యే ఉచితంగా అందజేయాలని నిర్ణయించారు. కొందరు దుర్వినియోగం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇలా దుర్వినియోగం చేస్తే ఊరుకునేదిలేదు. – ఇంద్రసేనారెడ్డి, వన్టౌన్ సీఐ, గోదావరిఖని -
కాంగ్రెస్ ఢిల్లీ ధర్నా భూటకం
గోదావరిఖని: సీఎం రేవంత్రెడ్డి బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో చేస్తున్నదంతా నాటకమని, అది ఓ భూటకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు విమర్శించారు. స్థానిక గంగానగర్లోని బీ జేపీ నేత అమరేందర్రావు నివాసంలో బుధవారం రాంచందర్రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ డైరెక్టరైతే.. మిగతా వాళ్లు యాక్షన్ చేశారని ఆయన ఎద్దేవా చేశారు. బీసీలను బీజేపీకి దూరం చేయాలనేది వారి నటన అని దుయ్యబట్టారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు తమ పార్టీలోని ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మద్దతు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. విద్య, ఉద్యోగాల్లో మాత్రమే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారని, అందులో రాజకీయంగా ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మిస్తే కేంద్రప్రభుత్వం సహకరిస్తుందని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టును తామెప్పుడూ వ్యతిరేకించలేదని, అందులో జరిగిన అవినీతి, నాణ్యత లోపంపైనే ప్రశ్నించామని తెలిపారు. తమ పార్టీలోకి చాలామంది వచ్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశంలేదని వెల్లడించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, మాజీ ఎంపీ వెంకటేశ్ నేత, నాయకులు కాసిపేట లింగయ్య, ఎస్.కుమార్, కందుల సంధ్యారాణి, గోమాస శ్రీనివాస్, బల్మూరి అమరేందర్రావు, బల్మూరి వనిత, సోమారపు లావణ్య తదితరులు పాల్గొన్నారు. ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు -
విధులకు సకాలంలో హాజరు కావాలి
● ‘బయోమెట్రిక్’ను అందుబాటులోకి తేవాలి ● పేషెంట్లతో మర్యాదగా ప్రవర్తించాలి ● వైద్య సిబ్బందికి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు పెద్దపల్లిరూరల్: అది జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి.. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆస్పత్రికి చేరుకున్నారు.. ఆవరణ అంతా కలియతిరిగారు.. వైద్యులు, సిబ్బంది హాజరు రిజిష్టర్ తనిఖీ చేశారు. ఉదయం 9.30 గంటల తర్వాత ఆరుగురు వైద్యులు విధులకు రావడా న్ని గమనించారు.. ఇకముందు ఇలా ఆలస్యం కా కుండా సకాలంలో డ్యూటీకి వచ్చేందుకు వీలుగా బ యోమెట్రిక్ పద్ధతి పాటించేలా ఏర్పాట్లు చేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ను ఆదేశించారు. డ్యూటీ టైంలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తామంటే కుదరదని, ఇకనుంచి కచ్చితంగా సమయపాలన పాటించ ని వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. కొత్త ఆస్పత్రి భవన నిర్మాణంలో వేగం పెంచాలని ఆదేశించారు. ఇన్పేషెంట్లతో కాసేపు మాట్లాడారు. వైద్యసిబ్బంది అందిస్తున్న సేవలు, ప్రవర్తిస్తున్న తీరుపై ఆరా తీశారు. పేషెంట్లతో మర్యాదగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. ఇదే ఆవరణలోని ఆయుష్ ఆస్పత్రిలోని వైద్యుడు మారుతితోనూ కలెక్టర్ మాట్లాడారు. వైద్యసేవలు, మందులపై ఆరా తీశారు. నెలరోజులకు సరిపడా మందులు కొనుగోలు చేసి పేషెంట్లకు అందుబాటులో ఉంచామని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో సమీక్ష.. జిల్లాలో టీబీ ముక్త్భారత్, సీజనల్ వ్యాధులు, ఈనెల 11న చేపట్టే నులిపురుగుల నివారణ తదితర అంశాలపై కలెక్టర్ శ్రీహర్ష కలెక్టరేట్లో సమీక్షించారు. హెల్త్ సబ్ సెంటర్ల వారీగా లక్ష్యం ఎంచుకు ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదేశించా రు. జిల్లావ్యాప్తంగా ఫీవర్ సర్వే నిర్వహించాలని సూచించారు. గర్భిణులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ అన్నారు. ఆపరేషన్లు కాకుండా సాధారణ ప్రసవాలను పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో అన్న ప్రసన్నకుమారి, ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
తల్లిపాలకు మించిన పౌష్టికాహారం లేదు
● డీఎంహెచ్వో అన్న ప్రసన్నకుమారి ● మెడికో, నర్సింగ్ స్టూడెంట్లతో అవగాహన ర్యాలీ కోల్సిటీ(రామగుండం): తల్లిపాలు పిల్లలకు వరమని, తల్లిపాలకు మించిన పౌష్టికాహారం బిడ్డకు ప్రపంచంలో ఎక్కడా లభించదని డీఎంహెచ్వో అన్న ప్రసన్నకుమారి, సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్) ప్రిన్సిపాల్ హిమబింద్సింగ్ అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా బుధవారం సిమ్స్, నర్సింగ్ కాలేజీల విద్యార్థులకు నగరంలోని కాలేజీలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కాలేజీ నుంచి మున్సిపల్ టీ జంక్షన్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్వో, సిమ్స్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, ఆరు నెలల వయసు వచ్చేవరకూ బిడ్డకు కచ్చితంగా తల్లిపాలే తాగించాలని సూచించారు. కొందరు తల్లిదండ్రులు రసాయన మిశ్రమాలతో తయారు చేసిన కృత్రిమ పాలు తాగించి పిల్లల ఆరోగ్యాన్ని చేజేతుల్లా పాడుచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పుట్టిన గంటలోపు బిడ్డకు ముర్రుపాలు తాగించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు అరుణ, అశోక్, శిరీష తదితరులు పాల్గొన్నారు. -
నిందారోపణలు మానండి
● నిజాలు మాట్లాడండి ● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చందర్ పెద్దపల్లిరూరల్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు నిజాలను దాచి, తమ పార్టీ నేతలపై నిందారోపణలకు దిగుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, జెడ్పీ మాజీ చైర్మన్ పుట్ట మధుకర్ ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ సారథ్యంలో కన్నెపల్లి పంప్హౌస్ను సందర్శించి ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నిస్తే.. కాంగ్రెస్ నేతలకు ఉలుకెందుకని నిలదీశారు. ఈశ్వర్పై మంత్రి లక్ష్మణ్కుమార్ విమర్శలు చేయడం సరికాదన్నారు. రైతుల సంక్షేమానికి బీఆర్ఎస్ సర్కార్ అనేక పథకాలు చేపట్టిందని గుర్తుచేశారు. దివంగత సీఎం వైఎస్సార్ తర్వాత రైతుసంక్షేమం గురించి ఆలోచించే నాయకులే కాంగ్రెస్ పార్టీలో లేరని వారు స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు. అంతకుముందు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు గంట రాములు, గోపు ఐలయ్య, రఘువీర్సింగ్, ఉప్పు రాజ్కుమార్, నారాయణదాస్ మారుతి, శ్రీనివాస్, శ్రీధర్, చంద్రశేఖర్, వెన్న రవీందర్, పల్లె మధు, మనోజ్, శ్రీధర్, లక్ష్మణ్, కొమురయ్య, శ్రావణ్, రామరాజు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. -
డిజిటల్ అరెస్ట్పై అవగాహన
గోదావరిఖనిటౌన్: సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకట్రెడ్డి, సీఐ కృష్ణమూర్తి ఆదేశాల మేరకు స్థానిక అశోక్నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు డిజిటల్ అరెస్ట్పై బుధవారం అవగాహన కల్పించారు. కొందరు విద్యార్థులు సైబర్ క్రైమ్ పోలీసుల వేషధారణలో స్క్రిప్ట్ రూపొందించుకొని తోటి విద్యార్థులకు అర్థమయ్యేలా డిజిటల్ అరెస్ట్పై ప్రదర్శనలు ఇచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు అధికారుల పేరిట ఫోన్చేసి కేసులు ఉన్నాయని భయాందోళనకు గురిచేస్తారని తెలిపారు. ఆ వ్యక్తి అడిగినంత డబ్బులు ఇచ్చి ఆ తర్వాత మోసపోయానని గుర్తించడం తరచూ చోటుచేసుకుంటున్నాయని విద్యార్థులు తమ ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించారు. స్క్రిప్ట్లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు వెంకటేశ్, శ్రీనివాస్, సంతోష్కుమార్, మౌనిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రొఫె‘సార్’కు ఘననివాళి
పెద్దపల్లిరూరల్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని కలెక్టరేట్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి కలెక్టర్ కోయ శ్రీహర్ష పూలమాల వేసి ని వాళి అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సార్ పాత్ర మరువలేనిదని ఆయన అన్నారు. ఆయన ఆశయ సాధనకోసం అందరూ కృషి చేయాలని కలెక్టర్ కోరారు. పలువురు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. జాతిపితగా గుర్తించాలి మంథని: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ను తెలంగాణ జాతిపితగా గుర్తించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంథని విజయ్కుమార్ కోరారు. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా పట్టణంలోని ఆయన విగ్రహానికి బుధవారం పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం విజయ్కుమార్ మాట్లాడుతూ, సార్ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. నాయకులు గోగుల రాజిరెడ్డి, గుర్రం దేవేందర్గౌడ్, బెజ్జింకి డిగంబర్, జాడి జంపన్న తదితరులు పాల్గొన్నారు. అలాగే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు ఏగోళపు శంకర్గౌడ్, ఆరెపల్లి కుమార్, తగరం శంకర్లాల్, మాచిడి రాజుగౌడ్, ఆసిఫ్ఖాన్, పుప్పాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారత లక్ష్యం జ్యోతినగర్(రామగుండం): మహిళా సాధికార త లక్ష్యంగా అందరూ బాధ్యతతో పనిచేయా లని మహిళా సాధికారత జిల్లా కో ఆర్టినేటర్ దయా అరుణ కోరారు. ఎన్టీపీసీ కృష్ణానగర్లో బుధవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మహిళల హక్కు లు, అంగన్వాడీ కార్యకర్తల సేవలు, పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు, సఖి కేంద్రం సేవలు, టోల్ ఫ్రీ నంబర్లు, ఉన్నత విద్య, లింగ వివక్ష, బాలసదనం సేవలు తదితర అంశాలపై ఆమె అవగాహన కల్పించారు. విక్టరీ ఇన్స్టిట్యూట్ నిర్వాహకురాలు వరలక్ష్మీ, అధ్యాపకురాలు శ్రీజ, అనూష, శిక్షణ పొందుతున్న మహిళలు తదితరులు పాల్గొన్నారు. తల్లిపాలు అమృతంతో సమానం జ్యోతినగర్(రామగుండం): తల్లిపాలు శిశువుకు అమృతం లాంటివని రామగుండం ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవో అలేఖ్య అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఎన్టీపీసీ అన్న పూర్ణకాలనీ అంబేడ్కర్హాల్లో గర్భిణులకు బుధవారం సీమంతం జరిపించారు. అలేఖ్య మాట్లాడుతూ, ప్రస్తుత ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం తల్లిపాల కన్నా మెరుగైన ఆహా రం తయారు చేయలేకపోయిందని అన్నారు. అందుకే తల్లిపాల విష్ఠతను వివరిస్తూ ఏటా ఆగస్టు ఒకటినుంచి ఏడోతేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్ లక్ష్మి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మామిడిపల్లి శ్రీధర్, కార్యదర్శి కొల్లూరు విజేందర్, ప్రతినిధులు కొలిపాక సతీశ్, కజాంపురం రాజేందర్, నార్ల ప్రసాద్, గుంత వినోద్, రంగారావు గోపాలరావు, రమణారావు తదితరులు పాల్గొన్నారు. -
రూ.33 కోట్లతో అభివృద్ధి పనులు
● పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ ● బీటీ రోడ్డు పనుల పరిశీలన పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో చేపట్టిన రహదారులు, డ్రైనేజీల నిర్మాణాలకు రూ.33 కోట్లు వెచ్చిస్తున్నామని పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ అన్నారు. పట్టణంలోని మసీదు చౌరస్తా నుంచి అమర్నగర్ వరకు సాగుతున్న బీటీ రోడ్డు పనులను ఏఈ సతీశ్తో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ప్రజాసౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు. పట్టణంలో అభివృద్ధి పనులు దాదాపు చివరిదశలో ఉన్నాయని ఆయన వివరించారు. వర్క్ ఇన్స్పెక్టర్లు అనిల్కుమార్, వాణి, రాముడు ఇతర సిబ్బంది ఉన్నారు. -
జిల్లా అభివృద్ధికి కేంద్రం నిధులు
● రూ.20 కోట్లతో పనులు, ప్రజాసంక్షేమం ● హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలం ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు పెద్దపల్లిరూరల్/సుల్తానాబాద్/ధర్మారం: జిల్లాలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల కోసం కేంద్రప్రభుత్వం రూ.20 కోట్లు వెచ్చించిందని బీ జేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు తెలిపారు. జి ల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన బీజేపీ జిల్లాస్థాయి పార్టీ శ్రేణుల విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యారు. తొలుత సుల్తానాబాద్లో ఆయన కు ఘనస్వాగతం లభించింది. ఆ తర్వాత లక్సెట్టిపే టలో జరిగే సభకు వెళ్తూ ధర్మారంలో కాసేపు ఆగా రు. ఆయా ప్రాంతాల్లో పలువురు పార్టీ నేతలు రాంచందర్రావుకు ఘనస్వాగతం పలికారు. ఆయా కా ర్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్టుల పేరి ట బీఆర్ఎస్ నేతలు రూ.వేల కోట్లు దండుకుంటే.. కాంగ్రెస్ సర్కార్.. అవినీతి పేరిట అధికారులను జైళ్లకు పంపండం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాగా, బీఆర్ఎస్కు చెందిన నల్ల మనోహర్రెడ్డితోపాటు ఎర్రోళ్ల రాములు, వేల్పుల లక్ష్మీనారాయణ తదితరులు బీజేపీలో చేరారు. ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డి, నాయకులు కర్రె సంజీవరెడ్డి, గుజ్జుల రామకృష్ణారెడ్డి, దుగ్యాల ప్ర దీ ప్కుమార్, వెంకటేశ్నేత, మీస అర్జున్రావు, కడారి అశోక్రావు, సురేశ్రెడ్డి, కన్నం అంజయ్య, కామణి రాజేంద్రప్రసాద్, మహేందర్ యాదవ్, కందుల శ్రీ నివాస్, ప్రవీణ్ కుమార్, నాగరాజు యాదవ్, తిరుపతి, నారాయణస్వామి, రంజిత్రెడ్డి, రాజు, రాంబాబు, సతీశ్రెడ్డి, శ్రీనివాస్, తిరుపతిరెడ్డి ఉన్నారు. -
రైతులకు అందుబాటులో యూరియా
● ఆర్ఎఫ్సీఎల్ ద్వారా సరఫరా ● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిరూరల్: జిల్లాలో ప్రస్తుతం 2,270 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, బుధవారం (ఈనెల 6న) ఆర్ఎఫ్సీఎల్ నుంచి మరో 3వేల మెట్రిక్ టన్నులు జిల్లాకు చేరుతుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. అవసరం మేరకే కొనుగోలు చేయాలని, నిల్వ చేసి నష్టపోవద్దని ఆయన సూచించారు. బస్తీదవాఖానాలో షుగర్ నిర్ధారణ పరీక్షలకు అవసరమైన గ్లుకోమీటర్ పరికరాలను ఇప్పిస్తామన్నారు. పెద్దపల్లి శివారు రంగంపల్లిలోని బస్తీదవాఖానాను మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించి పలు సూచనలు చేశారు. ఎన్సీడీ బాధితులకు ప్రతినెలా అవసరమైన మందులు అందించాలని, సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. మెరుగైన వైద్యసేవలు అందించాలి సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గర్రెపల్లి పీహెచ్సీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీబీపీ మిషిన్ను వెంటనే మరమ్మతు చేయిచాలని సూచించారు. డాక్టర్లు రామకృష్ణ, స్వప్న, సింధూజ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 15 వరకు లక్ష్యం పూర్తిచేయాలి పెద్దపల్లిరూరల్: వన మహోత్సవం లక్ష్యాన్ని ఈనెల 15వ తేదీ వరకు పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని తరచూ పర్యవేక్షించాలని, ఉపాధి పనుల్లో వేగం పెంచాలన్నారు. డీఆర్డీవో కాళిందిని, హౌసిగ్ పీడీ రాజేశ్వర్, జెడ్పీ సీఈవో నరేందర్, డీపీవో వీరబుచ్చయ్య పాల్గొన్నారు. -
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి
పెద్దపల్లిరూరల్: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు శ్యాం డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట మంగళవారం జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలన్నారు. ప్రతీపాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా చూడాలని అన్నారు. సమ్మె కాలపు వేతనం చెల్లించాలని కోరారు. నాయకులు కుమారస్వా మి, పోచయ్య, రాంకిషన్రావు, లక్ష్మణ్, సంతోష్ రెడ్డి, పర్శరాములు, శంషొద్దీన్, కిరణ్, కొముర య్య, రాజు, ప్రకాశ్రావు, జనార్దన్, రాజ్కుమా ర్, వెంకటేశ్వర్రెడ్డి, వసుంధర, పద్మావతి, వాసవి, స్వప్న, ప్రతాప్చారి తదితరులు ఉన్నారు. -
కలహాల కమలం
● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పర్యటనలో భగ్గుమన్న విభేదాలు ● పదవులు, పెత్తనం కోసం బాహాబాహీ ● స్థానిక ఎన్నికల వేళ వర్గపోరుతో కార్యకర్తల్లో నైరాశ్యం గాడిన పడేదెలా? అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయినా గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి గణనీయంగా ఓట్లు వచ్చి రెండోస్థానంలో నిలిచారు. ఇటీవల జరిగిన టీచర్స్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో బీఆర్ఎస్కు ధీటుగా, కాంగ్రెస్ను గద్దె దించి, వచ్చే ఎన్ని కల్లో అధికారంలోకి వస్తామని రాష్ట్రస్థాయి నేతలు తరచూ చెబుతున్నారు. కానీ, జిల్లాలో గ్రూప్ రాజకీయాలతో పార్టీ బలహీనపడుతోంది. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్రావు, గొట్టెముక్కల సురేశ్రెడ్డి ఎవరికివారు కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, తాజాగా బీఆర్ఎస్ నుంచి నల్ల మనోహర్రెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే గ్రూప్లుగా మారిన పెద్దపల్లి నియోజకవర్గ బీజేపీ నేతలు.. పదవులు, పెత్తనం కోసం పోటీపడుతున్నారు తప్ప పార్టీ పటిష్టత కోసం శ్రమించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంథని, రామగుండంలో సైతం పాత, కొత్త నేతల మధ్య వర్గపోరు నడుస్తోంది. తాజాగా రాష్ట్ర అధ్యక్షుడి పర్యటనతోనైనా పార్టీ గాడినపడుతుందని ఆశించిన కార్యకర్తలకు.. ఇరువర్గాల మధ్య విభే దాలు మరింత రచ్చకెక్కడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికై రాష్ట్ర నాయకత్వం అందరినీ పిలిపించుకుని, గ్రూప్ రాజకీయాలకు తావులేకుండా పార్టీని గాడిన పెట్టేలా చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు కోరుతున్నారు. తద్వా రా వచ్చే స్థానిక సంస్థల్లో.. గత ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా సాధించిన విజయాన్ని కొనసాగించవచ్చని అంటున్నారు.సాక్షి పెద్దపల్లి: బీజేపీ అంటే క్రమశిక్షణకు మారుపేరు. కానీ జిల్లా కమలం పార్టీలో అందుకు భిన్న సంస్కృతి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎదుటే నేతల పోటాపోటీ నినాదాలు, నిరసనల తీరుతో అగ్రనాయకత్వం విస్తుపోయేలా గూపు రాజకీయం రచ్చ తారస్థాయికి చేరింది. సాధారణంగా ప్రతీఅంశాన్ని అంతర్గతంగా చర్చించుకునే కమల దళంలో నాయ కు లు బహిరంగంగానే విమర్శనాస్త్రాలు సంధిస్తుండడం పార్టీకి నష్టదాయకంగా మారుతున్నాయని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో పార్టీకి సానుకూల స్పందన ఉన్నా.. దానిని ఓట్లరూపంలో మార్చుకోవాల్సిన నేతలు.. బహిరంగంగా కామెంట్లు చేసుకోవడం.. అంతర్గతంగా ఫిర్యాదు చేసుకోవడం ఎక్కువై కమల శిబిరంలో ఏంజరుగుతుందో కేడర్కు అంతుచిక్కడం లేదు. వెరిసి జిల్లాలో పార్టీ బలహీనపడేందుకు దారితీస్తుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా లీడర్ బండెక్కనిదే ఇంచు కదలదు.. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకు జిల్లాకేంద్రంలో బీజేపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఇ టీవల నియమితులైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పె ద్దపల్లి కమాన్ వద్ద నిర్వహించిన ర్యాలీలో కాన్వా య్పై ఉన్న అధ్యక్షుడికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్రావు పూలదండ వేయగా, మా నేత, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డిని బండిపైకి ఆహ్వానించరా? అని గుజ్జుల వర్గీయులు ప్రచార రథానికి అడ్డుగా నిల్చొని ఘర్షణకు దిగారు. దుగ్యాల ప్రదీప్రావు దిగిపోవాలని గుజ్జుల వర్గీయులు ఆందోళన చేశారు. దీంతో ఇరువర్గాలు తోపులాడుకున్నాయి. పోలీసుల జోక్యం, నేతలు సర్థిచెప్పడంతో గొడవ సద్దుమనిగింది. జిల్లా అధ్యక్షుడు డౌన్ డౌన్ అంటూ.. తీరా వేదికపైకి వెళ్లాక ఇరువర్గాల నేతల అనుచరులు స్టేజీ ఎదుట ఇరువైపులా నిల్చొన్నారు. సభకు అంతరాయం కలిగించేలా ఎవరికి వారు నినాదాలు చేశారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. పార్టీ చీఫ్ రాంచందర్రావు వేదికపై ఉండగా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవ్రెడ్డి మాట్లాడుతుండగా వేదిక ఎదుట నిల్చున్న కార్యకర్తలు.. ‘జిల్లా అధ్యక్షుడు డౌన్ డౌన్’ అని పెద్దఎత్తున నినాదాలు చేయడం సంచలనంగా మారింది. వేదికపై ఉన్న మాజీ ఎమ్మెల్యే గుజ్జుల పరోక్షంగా దుగ్యాల వర్గంపై మాటలు సంధించారు. తర్వాత మాట్లాడిన దుగ్యాల ప్రదీప్రావు సైతం ‘చేసేది చెప్పాలి.. చెప్పేదే చేయాలని’ చురకలు అంటించారు. జిల్లా అధ్యక్షుడు కలుగజేసుకుని నియోజకవర్గంలో గ్రూప్లు లేవని కార్యకర్తలకు తెలియజేసేలా గుజ్జుల, దుగ్యాలను పరస్పరం చేతులు కలిపి సర్థిచెప్పాలని రాష్ట్ర అధ్యక్షుడిని వేదికపై నుంచి కోరడం జిల్లాలో గ్రూప్ రాజకీయాలు ఏస్థాయిలో ఉన్నా యో తెలియజేస్తోంది. మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య మాట్లాడుతూ క్రమశిక్షణ కలిగిన బీజేపీలో స్టేజీపైనే పోలీసులను పెట్టుకొని ప్రశాంతంగా సమావేశం నిర్వహించుకోవాల్సిన పరిస్థితి తలెత్త డం ఎంతవరకు సమంజసమని గ్రూప్ రాజకీయాలతో పార్టీకి జరుగుతున్న నష్టం గురించి తెలియజేశారు. పైకి నాయకులంతా కలిసి కట్టుగా ఉన్నట్లు కనిపిస్తున్నా.. వాళ్ల మధ్య పూడ్చలేనంత గ్యాప్ ఉందన్నది పార్టీలో వరుసుగా చోటుచేసుకుంటున్న ఘటనలతో తేటతెల్లమవుతోందని సామా న్య కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. -
డ్రామాలకు తెరతీస్తున్న బీఆర్ఎస్
గోదావరిఖని: ప్రాజెక్టుల పే రిట కమీషన్లు దండుకున్న బీఆర్ఎస్ నాయకులు.. పాత డ్రామాలకు తెరలేపుతున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ విమర్శించారు. ప్రాజెక్టుల పేరిట ఉమ్మడి జిల్లాలో ఒక్క ఎకరాకు సాగునీరు ఇచ్చిన పాపానపోలేదన్నారు. స్థానిక తిలక్నగర్లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డ్యాం సేఫ్టీ కమిటీ నిపుణులు ప్రాజెక్టును పరిశీలించి నివేదిక ఇచ్చారని, అందులో నీటిని నిల్వచేస్తే ప్రాజెక్టు కూలిపోతుందని తేల్చి చెప్పారన్నారు. సుందిళ్ల, అన్నారం, కన్నెపల్లి బరాజ్ల నుంచి పంటలకు చుక్కనీరు ఇవ్వలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయి గత ఎన్నికల్లో తిరస్కరించారని అన్నారు. కన్నెపల్లి వద్ద మాజీమంత్రులు చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవన్నారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం పేరిట జరిగిన అవినీతిని కాంగ్రెస్ ప్రభుత్వం బహిర్గతం చేస్తోందని అన్నారు. కన్నెపల్లి గేట్లు బద్ధలు కొడతామంటూ కమలహాసన్ డైలాగులు చెప్పడం దేనికి సూచిక అని విమర్శించారు. అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోళ్లలో గతంలో జరిగిన పొరపాట్లను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకులు కాల్వ లింగస్వామి, మహంకాళి స్వామి, పెద్దెల్లి ప్రకాశ్, తిప్పారపు శ్రీనివాస్, గట్ల రమేశ్, బొమ్మక రాజేశ్, కల్యాణి సింహాచలం, ధూళికట్ట సతీశ్ తదితరులు పాల్గొన్నారు. ఒక్క ఎకరాకూ సాగునీరు ఇవ్వలేదు అందుకే ఆ పార్టీని తిరస్కరించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ -
వైభవంగా ఆదివరాహస్వామి జయంతి వేడుకలు
కమాన్పూర్(మంథని): ప్రముఖ పుణ్యకేత్రం శ్రీఆదివరాహస్వామి జయంతి మంగళవారం ప్రారంభమైంది. అర్చకులు ఉదయం ప్రత్యేకపూజలు చేశారు. బుధవారం స్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో కాంతరెడ్డి, అర్చకుడు కలకుంట్ల వరప్రసాదచార్యులు తెలిపారు. ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించామని అన్నారు. తహసీల్దార్ వాసంతి, ప్రతినిధులు బొల్లపెల్లి శంకర్గౌడ్, ముస్త్యాల దామోదర్, పిన్రెడ్డి కిషన్రెడ్డి, భక్తులు పాల్గొన్నారు. పింఛన్ పెంచాలి కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ఆసరా పింఛన్లు పెంచాలని, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్తో ఈనెల 13న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టామని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అంబాల రాజేందర్ తెలిపారు. వికలాంగుల, వితంతువులు, వృద్ధులతో మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పింఛన్లు పెంచి చెల్లించాలని ఆయన కోరారు. నాయకులు ఏవూరి వెంకటేశ్వర్రావు, ఐరెడ్డి నారాయణరెడ్డి, బైరి రామ్మూర్తి, జయ, స్వరూప, మమత, శంకర్, రజాక్ తదితరులు పాల్గొన్నారు. రోబోటిక్స్పై అవగాహన గోదావరిఖనిటౌన్: జిల్లాలోని గోదావరిఖని, పెద్దపల్లి, మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు రోబోటిక్స్పై స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఒకరోజు శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. సోహం అకాడమీ సౌజన్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. గోదావరిఖని, పెద్దపల్లి ప్రిన్సిపాల్స్ జైకిషన్ ఓజ, ఎంఏ శుకూర్ మాట్లాడుతూ, పుస్తకాల్లోని జ్ఞానమేకాకుండా.. దాని వినియోగం, విశ్లేషణ, అ న్వయ సామర్థ్యాల గురించి తెలుసుకోవాలన్నారు. సోహం అకాడమీ శిక్షకుడు సంతోష్, టీఎస్కేసీ కో ఆర్డినేటర్ సుబ్బారావు, మెంటర్ ఉషారాణి, విద్యార్థులు పాల్గొన్నారు. గోదాముల్లో బ్యాలెట్ బాక్స్లు భద్రంపెద్దపల్లిరూరల్: స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సర్వసన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే బ్యాలెట్ పేపర్లు ముద్రించి భద్రపర్చారు. పోలింగ్కు అవసరమైన బ్యాలెట్ బాక్స్లను సైతం సిద్ధం చేశారు. ఈక్రమంలో జిల్లాకు 1,650 బ్యాలెట్ బాక్స్లు అవసరం కాగా.. గుజరాత్ నుంచి తెచ్చేందుకు ఎంపీవో సు దర్శన్ తదితరులు అక్కడకు వెళ్లారు. మంగళవారం 1,469 బ్యాలెట్ బాక్స్లను తీసుకొచ్చారు. వాటిని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాముల్లో భద్రపర్చినట్లు జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య తెలిపారు. 11న గెస్ట్ టీచర్ల ఇంటర్వ్యూలు పెద్దపల్లిరూరల్: జిల్లాలోని 11 మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు ఉపాధ్యాయులు, అధ్యాపకులకు డెమో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా కన్వీనర్ అంజలి మంగళవారం తెలిపారు. జువాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లిష్, పీజీటీ మ్యాథ్స్, పీజీటీ ఫిజికల్ సైన్స్, పీజీటీ ఇంగ్లిష్, టీజీటీ ఇంగ్లిష్ సబ్జెక్టులు బోధించే అధ్యాపకులు, ఉపాధ్యాయులు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ (ఎల్ఎండీ కాలనీ) జ్యోతిబా పూలే పాఠశాలలో ఈనెల 11న ఉదయం 10 గంట వరకు హాజరుకావాలని సూచించారు. -
బాల్యానికి భరోసా
● ముగిసిన ఆపరేషన్ ముస్కాన్ – 11 ● 193 మంది చిన్నారుల గుర్తింపు గోదావరిఖని: బడికి వెళ్లాల్సిన వయసులో బాలకార్మికులుగా పనులు చేయడాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇలాంటివారిని గుర్తించి, సంరక్షించేందుకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం చేపట్టింది. ఈక్రమంలోనే ఈసారి చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ –11తో సత్ఫలితాలు సాధించింది. జిల్లావ్యాప్తంగా నెలరోజుల పాటు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 193 మంది చిన్నారులను గుర్తించి బాలకార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించింది. రెండు జిల్లాలు.. 193 మంది చిన్నారులు.. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గుర్తించిన మొత్తం 193 మంది చిన్నారుల్లో 71 మంది మంచిర్యాల, 122 మంది పెద్దపల్లి జిల్లాకు చెందిన వారు ఉన్నారు. ఇందులో 21మంది బాలకార్మికులు ఉన్నారు. నిరాశ్రయులైన పిల్లలు, బాలకార్మికులు, భిక్షాటనలో చిక్కుకు పోయిన వారికోసం గత జూలై ఒకటి నుంచి 31వ తేదీ వరకు స్పెషల్డ్రైవ్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా నేతృత్వంలో ఓ ఏసీపీకి బాధ్యతలు అప్పగించారు. సబ్ డివిజన్కు ఒక ఎస్సై చొప్పున ఐదుగురిని నియమించారు. ఆధునిక సాంకేతికతతో.. ఆపరేషన్ ముస్కాన్ కోసం ఈసారి సరికొత్త సాంకేతికతను వినియోగించారు. దర్పన్ అనే ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా తప్పిపోయిన పిల్లలను గుర్తించారు. ఒడిశా, బిహార్ తదితర రాష్ట్రాల నుంచి వలస వచ్చి కూలీలుగా పనిచేస్తున్న వారి పిల్లలను గుర్తించి స్కూళ్లలో చేర్పించారు. తల్లిదండ్రుల చెంతకు చేర్చి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇటుకబట్టీలు, హోటళ్లు, షాపులు, మెకానిక్ షెడ్లు తదితర ప్రదేశాల్లో పనిచేస్తున్న బాలకార్మికులనూ గుర్తించి బడిలో చేర్పించారు. చైల్డ్వెల్ఫేర్ కమిటీ, లేబర్, ఎడ్యుకేషన్, చైల్డ్ప్రొటెక్షన్, హెల్త్డిపార్ట్మెంట్ల అధికారులు, సిబ్బందితో స్పెషల్ టీమ్లు ఏర్పాటు చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జిలు, షాపులు, మెకానిక్ షెడ్లు, ఇటుక బట్టీలు తదితర ప్రదేశాల్లో తనిఖీలు చేస్తూ చిన్నారులను గుర్తించి బాల్యానికి భరోసా కల్పించారు. 2017 నుంచి ఇప్పటిదాకా పోలీసులు గుర్తించిన చిన్నారులు ఏడాది బాలురు బాలికలు మొత్తం 2017 206 48 254 2018 88 04 92 2019 116 39 155 2020 66 05 71 2021 88 13 101 2022 21 11 32 2023 33 04 37 2024 56 14 70 2025 136 57 193 ‘ముస్కాన్ –11’లో గుర్తించిన పిల్లలు బాలురు 136 బాలికలు 57 విముక్తి పొందిన చిన్నారులు 193 నమోదైన కేసులు 180 ప్రణాళిక పక్కాగా అమలు చేశాం బాలకార్మిక వ్యవస్థ నుంచి చిన్నారులకు విముక్తి కల్పించేందుకు కమిషనరేట్ పరిధిలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్–11 విజయవంతమైంది. ఏసీపీ ఆధ్వర్యంలో ఒక్కో సబ్ డివిజన్కు ఒక ఎస్సైని నియమించి ప్రత్యేక బృందాలతో నిరంతరం తనిఖీలు చేశాం. బయట తిరుగుతున్న వారిని గుర్తించి స్కూళ్లలో చేర్పించాం. ఇందుకోసం పక్కా ప్రణాళిక అమలు చేశాం. – అంబర్ కిశోర్ ఝా, పోలీస్ కమిషనర్, రామగుండం -
కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్ర
● ప్రాజెక్టు నుంచి నీళ్లివ్వకనే పంటలు ఎండుతున్నయ్ ● వచ్చే ఎన్నికల్లో ఓటుతోనే గుణపాఠం చెప్పాలి ● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్పెద్దపల్లిరూరల్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, ఆ ప్రాజెక్టులోని నీరంతా వృథాగా పోతోందని, ఇక్కడేమో సాగునీరందక, వానలు కురవక పంటలు ఎండుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, జెడ్పీ మాజీ చైర్మన్ పుట్ట మధుకర్ ధ్వజమెత్తారు. మాజీమంత్రి హరీశ్రావు మంగళవారం చేపట్టిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ను బీఆర్ఎస్ జిల్లా భవన్లో ఎల్ఈడీ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేశారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆ కార్యక్రమాన్ని తిలకించారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలన్న దురాలోచనతోనే కాంగ్రెస్ నాయకులు సాగిస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ వాస్తవాలను ప్రజలకు వివరించాలని కోరుకంటి చందర్ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్పై కోపంతోనే రైతులు సాగుచేసే పంటలకు నీరు ఇవ్వకుండా గోదావరి జలాలను వృథా చేస్తున్నారని పుట్ట మధుకర్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలను మాజీమంత్రి హరీశ్రావు ఆధారాలతో సహా వివరిస్తున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. రెండు పిల్లర్లు కుంగితే వాటికి తాత్కాలిక మరమ్మతులు చేసి నీళ్లను ఆపాల్సిందిపోయి రైతులను అవస్థల పాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ పాలకులు కుమ్మకై ్క పాలన సాగిస్తున్నారని ఆయన విమర్శించారు. నాయకులు కౌశిక హరి, గంట రాములు, రఘువీర్సింగ్, ఉప్పు రాజ్ కుమార్, గోపు ఐలయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
వినతులు స్వీకరించి..పరిష్కార మార్గం చూపి..
● ప్రజావాణిలో అర్జీలు స్వీకరించిన అడిషనల్ కలెక్టర్ వేణు పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిశీలించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకునేందుకే ప్రతీ సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అడిషనల్ కలెక్టర్ వేణు తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన జిల్లావాసుల నుంచి ఆయన సోమవారం ప్రజావాణి ద్వారా అర్జీలను స్వీకరించారు. వాటిని పరిష్కరించాలని సంబంధిత శా ఖల అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా కొందరిని ‘సాక్షి’ పలుకరించగా తమ వేదనను ఇలా వెల్లడించారు.. -
మృత్యుంజయ హోమం
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ పీటీఎస్ ఆలయంలో సోమవారం మహా మృత్యుంజ య హోమం ఘనంగా నిర్వహించారు. అర్చకు లు వామనశర్మ, రుధ్రభట్ల శ్రీకాంత్ తదితరు లు ప్రత్యేక పూజలు చేశారు. ఎన్టీపీసీ రామగుండం – తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత, దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత హాజరయ్యారు. లోక కల్యాణం కోసం హోమం నిర్వహించారు. ఉన్నతాధికారులు, అధికారులు, అధికార సంఘం ప్రతినిధులతోపాటు ఉద్యోగ గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి ఆరెపల్లి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఇంటి వద్దే రీసైక్లింగ్తో అనేక ప్రయోజనాలు కోల్సిటీ/ఫెర్టిలైజర్సిటీ: ఇంటి వద్దే రీసైక్లింగ్తో డంప్ యార్డ్కు వెళ్లే చెత్తను తగ్గించడానికి అవకాశం ఉంటుందని రామగుండం బల్దియా డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి అన్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం నగరంలో పలు కార్యక్రమాలు చేపట్టగా, డిప్యూటీ కమిషనర్ పర్యవేక్షించారు. గౌతమినగర్లోని డీఆర్సీసీతోపాటు కంపోస్ట్యార్డ్, మల్కాపూర్ శివారులోని డంపింగ్యా ర్డ్లను వెంకటస్వామి సందర్శించారు. ఆయన మాట్లాడుతూ, చెత్తను ఇంటి వద్దనే తడి, పొడిచెత్తగా వేరుచేసి కంపోస్టింగ్ చేయాలన్నారు. అలాగే 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రెవెన్యూ విభాగం ఆధ్వర్యంలో ఆస్తిపన్ను మదిపు చేయడం, పునఃపరిశీలించడం చేపట్టారు. ఆయా కార్యక్రమాల్లో నగరపాలక సంస్థ ఆర్వో ఆంజనేయులు, ఆర్ఐలు శంకర్రావు, ఖాజా, శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు, ఆర్పీలు, స్వశక్తి సంఘాల మహిళలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్కే హక్కు ఉంది రామగుండం: బ్రాహ్మణపల్లి/ముర్మూర్ ఎత్తిపోతలను ప్రారంభించే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉందని ఆ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేశ్ అన్నారు. అంతర్గాంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఎ ల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించారని, దానికి అనుసంధానంగా ఎత్తిపోతల ఉందనే విషయాన్ని బీఆర్ఎస్ శ్రేణులు గుర్తించాలని సూచించారు. ఎత్తిపోతలను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రారంభించడాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ తప్పుపట్టడం శోచీనయమన్నా రు. కాంగ్రెస్ ప్రతినిధులు ఉరిమెట్ల రాజలింగం, గాదె సుధాకర్, గుంట లక్ష్మణ్, కనకయ్య, శ్రీనివాస్గౌడ్, అప్పాల రాజేందర్, ఇండిబిల్లి రవి, ఒల్లెపు స్వామి, బాణాల రాములు, జూల లింగయ్య, జలీల్, అక్షయ్ పాల్గొన్నారు.వార్షిక లాభాలు ప్రకటించాలి గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థ 2024–25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన వార్షిక లాభాలు ప్రకటించి, అందులో కార్మికులకు 30 శాతం వాటా చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్, ఎస్సీఈయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ప్రధాన చౌరస్తాలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. కంపెనీలో రాజకీయ జోక్యం పెరిగి నిధులు దుర్వినియోగమవుతున్నాయని ఆరోపించారు. ఈక్రమంలోనే సంస్థ ఆర్థిక పరిస్థితి గురించి కార్మికులకు తెలియజేయాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని అన్నారు. నాయకులు వైవీ రావు, ఎరవెల్లి ముత్యంరావు, ఆరేపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్, బానోతు వినయ్, కుంట ప్రవీణ్, కొమురయ్య, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యానికి మించి మొక్కలు నాటాలి
● రామగుండం బల్దియా కమిషనర్ అరుణశ్రీ ఆదేశాలు కోల్సిటీ(రామగుండం): వన మహోత్సవం ద్వారా రామగుండం నగరంలో లక్ష్యానికి మించి మొక్కలు నాటాలని నగరపాలక సంస్థ కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ సూచించారు. బల్దియా కార్యాలయంలో సోమవారం వన మహోత్సవం నిర్వహణపై వార్డు అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. కమిషనర్ మాట్లాడుతూ, డివిజన్లలో స్థలం లభ్యత ఆధారంగా వార్డు అధికారులకు మొక్కల సంఖ్య, లక్ష్యం నిర్దేశిచామన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో స్థానికులను భాగస్వాములను చేయాలని అన్నారు. పశువుల నుంచి పరిరక్షించడానికి అవసరమైనచోట ట్రీ గార్డులను ఏర్పాటు చేయించాలని అన్నారు. ప్రస్తుత వాతావరణ అనుకూలతలను దృష్టిలో ఉంచుకొని ఎక్కువసంఖ్యలో మొక్కలు నాటాలని ఆదేశించారు. మెప్మా ఆర్పీల సహకారం తీసుకొని ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేయాలని కమిషనర్ సూచించారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్, డీఈఈ షాబాజ్, ఏఈ తేజస్విని, మెప్మా టీఎంసీ మౌనిక, సీవోలు ఊర్మిళ, శ్వేత, ప్రియదర్శిని, శమంత తదితరులు పాల్గొన్నారు. -
సాగు అంతంతే..
● పది మండలాల్లో లోటువర్షపాతం ● జిల్లాలో సాధారణం కన్నా తక్కువ నమోదు ● ఎల్లంపల్లి ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో చేరని నీరు ● కుంటలు, చెరువులదీ అదేపరిస్థితి ● ఆందోళనలో అన్నదాతలు సాక్షి పెద్దపల్లి: ‘వానమ్మ.. వానమ్మ.. ఒక్కసారన్నా వచ్చిపోవే’ అంటూ జిల్లా రైతాంగం వర్షాల కోసం ఎంతోఆశతో ఎదురుచూస్తోంది. ఆరంభంలో మురిపించినా ఆ తర్వాత జాడలేకుండా పోయింది. జిల్లాలో ఇప్పటివరకు లోటు వర్షపాతమే నమోదైంది. ఫలితంగా జిల్లాలో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిత్యం సెంటీ మీటర్లలో కురవాల్సిన వర్షం.. మి.మీ.లలో కూడా నమోదు కావడంలేదు. సాగుకు అదను దాటుతోంది.. పంటలు పండించేందుకు అదను దాటుతోంది. ఈ వర్షాకాలం సీజన్లో జూన్, జూలైలో పెద్దగా వర్షా లు కురవలేదు. ఆగస్టు మొదటివారం గడుస్తున్నా వానజాడ లేదు. వర్షాలు లేక సాగుబాట పట్టకుండా చాలామంది రైతులు మిన్నకుండిపోయారు. చె రువులు, కుంటల్లో నీరున్న ప్రాంతాల్లో తప్ప ఎక్క డా పెద్దగా సాగులేదు. తొలకరిలో కురిసిన వర్షాలకు విత్తిన మెట్ట పంటలు కూడా ఎండిపోయాయి. ఇటీవల వారంపాటు ముసురు కురవడంతో మెట్ట పంటలు చిగురించాయి. ఆ వానలకు రైతులు కొంత ధైర్యం చేసి సాగుబాట పట్టారు. సాగు పుంజుకుంటున్న ఈ తరుణంలో వరుణుడు మళ్లీ ము ఖం చాటేయగా.. సాగు మళ్లీ డీలా పడిపోయింది. సగానికి పడిపోయింది.. జిల్లాలో ఈ ఏడాది వర్షాభావంతో అన్నిమండలాల్లో సా గు విస్తీర్ణం సగానికి పడిపోయింది. గతవారంలో కురిసిన వర్షాలకు చెరువు లు, కుంటల్లోకి నీరు వచ్చిన దాఖాలా లు కనిపించ డం లేదు. ఆ రుతడి పంటలకు మాత్రం జీవం పోసినట్లయ్యింది తప్పితే.. సా గు ఊపందుకో లేదు. ఈ సీజన్లో 2.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 1.91లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. ఈనెల 15వ తేదీ వరకు వరినాట్లు వేసుకోవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. 10 మండాల్లో లోటు వర్షపాతమే ఈ వానాకలం సీజన్లో ఇప్పటివరకు 479.9 మి.మీ. వర్షాపాతం నమోదుకావాల్సి ఉండగా, 31 మి.మీ. లోటు వర్షపాతంతో 329.9 మి.మీ.గా నమోదైంది. జిల్లాలో 14 మండలాలు ఉండగా.. కేవలం మంథని, కాల్వశ్రీరాంపూర్, ఓదెల, సుల్తానాబాద్లోనే సాధారణ వర్షపాతం నమోదైంది. మిగిలిన 10 మండలాల్లో లోటు వర్షపాతమే ఉంది. జూన్ 1 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు నమోదైన వర్షపాతం(మి.మీ.లలో) జిల్లాలోని చెరువుల్లో నీటినిల్వలు మొత్తం చెరువులు 1,018 0–25 శాతంలోపు 327 25–50 శాతంలోపు 199 50–75 శాతంలోపు 176 75–100శాతంలోపు 272 మత్తడి పడినవి 44 బోసిపోతున్న చెరువులు, ప్రాజెక్టులు జిల్లాలో 1,018 చెరువులు ఉండగా 44 చెరువులు మత్తడి పోయగా, 25శాతం కూడా నిండని చెరువులు 327 ఉన్నాయి. మరోపక్క.. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సైతం వచ్చిచేరే వరద తక్కువగానే ఉంది. ప్రాజెక్టు గరిష్ట ఎత్తు 148 మీటర్లు కాగా ప్రస్తుతం 144 మీటర్ల ఎత్తు వరకు నీరు ఉంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా 12.32 టీఎంసీలే ఉంది. గతేడాది ఇదేరోజు 15.75 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 435 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వచ్చి చేరుతోంది. అలాగే అవుట్ఫ్లో 435 క్యూసెక్కులుగా ఉంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ స్కీం కోసం 314 క్యూసెక్కులు తరలిస్తుండగా.. ఎన్టీపీసీ అవసరాల కోసం మరో 121 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 2024– 2025లో సాగు ఇలా.. (ఎకరాల్లో) పంట 2024 2025 వరి 2,10,027 1,43,153 మొక్కజొన్న 705 377 పత్తి 52,670 48,215 కందులు 169 87కురవాల్సింది 474.9 కురిసింది 329.9 వ్యత్యాసం(శాతంలో) 31 వర్షం కురిసిన రోజులు 24ఇంకా గడువుంది వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో ఈసారి సాగు అంతంతంగానే ఉంది. ఈనెల 15వ తేదీ వరకూ వరి సాగుచేయొచ్చు. రెండు, మూడు భారీవర్షాలు పడితే పంటలకు ఢోకా ఉండదు. – శ్రీనివాస్, డీఎవో -
సత్తాచాటిన సింబా నార్కోటిక్ డాగ్
● రాష్ట్రస్థాయి డ్యూటీ మీట్లో గోల్డ్మెడల్ గోదావరిఖని: సింబా నార్కోటిక్ డాగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తాచాటి బంగారు పతకం సాధించింది. వరంగల్ జిల్లా మామునూరు పీటీసీలో జరిగిన తెలంగాణ రాష్ట్రరెండో పోలీస్ డ్యూటీ మీట్లో కాళేశ్వరం జోన్ నుంచి నార్కోటిక్ డాగ్ విభాగంలో సింబా పాల్గొని గంజాయి, మత్తు పదార్థాలను గుర్తించడంలో సత్తా చాటింది. పోలీసు జాగిలం సింబా, డాగ్ హ్యాండ్లర్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎం.వేణుగోపాల్కృష్ణ గోల్డ్ మెడల్ సాధించారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ పోలీస్ డాగ్గా ‘సింబా’ ఎంపికై ంది. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సింబా, డాగ్ హ్యాండ్లర్ వేణుగోపాలకృష్ణను అభినందించారు. మంచిర్యాల, పెద్దపల్లి డీసీపీలు భాస్క ర్, కరుణాకర్, ట్రాఫిక్, ఏఆర్ ఏసీపీలు శ్రీనివాస్, ప్రతాప్, ఆర్ఐలు దామోదర్, శ్రీనివాస్, వామనమూర్తి, సంపత్, మల్లేశం పాల్గొన్నారు. -
చదవాలి.. రాయాలి
● మహిళా సంఘాల్లో నిరక్షరాస్యుల కోసం ‘ఉల్లాస్’ ● మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కార్యక్రమం ● జిల్లా విద్యాశాఖ, సెర్ప్ ఆధ్వర్యంలో నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక రామగిరి(రామగుండం): మహిళా సంఘాల్లో నిరక్ష రాస్యులైన మహిళలను సంపూర్ణ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు జిల్లా విద్యాశాఖ, సెర్ప్ అధికారులు సమన్వయంతో ‘ఉల్లాస్’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేలా కార్యాచరణ రూపొందించా రు. అందరికీ విద్య అందించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అండర్ స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ అన్ ఇన్ సొసైటీ(ఉల్లాస్) పథకాన్ని అమలులోకి తీసుకొచ్చాయి. దీనిని జిల్లావ్యాప్తంగా దశల వారీగా అమలు చేసేలా జిల్లా ఉన్నతాధికారులు ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. తొలుత మ హిళా సంఘాల్లో నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతారు. రెండోదశలో మధ్యలో బడిమానేసిన వారిని గుర్తించి ఓపెన్ స్కూల్ ద్వారా నేరుగా పదో తరగతి చదివిస్తారు. ఆసక్తినిబట్టి ఓపె న్ డిగ్రీ వరకూ చదివించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఉల్లాస్ కార్యక్రమం లక్ష్యం ఇదే.. సామాజిక సాధికారతలో భాగంగా ఉల్లాస్ కార్యక్రమం ద్వారా చదువురాని వారందరికీ చదవడం, రాయడం నేర్పించడమే ప్రధాన లక్ష్యం. మహిళా సంఘాల్లోని సభ్యుల్లో కేవలం 50 శాతం మందికే సంతకం చేయడం వచ్చని, మిగిలినవారు వేలిముద్ర వేస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈక్రమంలోనే మహిళలు అందరికీ చదవడం, రాయడం నేర్పించాలనే లక్ష్యంతో ఉల్లాస్ను అమలులోకి తీసుకొస్తున్నారు. ఓపెన్ టెన్త్, ఓపెన్ డిగ్రీ వరకు చదివించడమే కాదు.. ఆసక్తిని బట్టి స్కిల్డెవలప్మెంట్, టెక్నికల్ కోర్సుల్లోనూ చేర్పించి ఉపాధి, అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. బ్యాంకింగ్ రంగంలో ఆర్థిక క్రమశిక్షణ, పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలను సైతం ఈ సందర్భంగా నేర్పిస్తారు. కార్యక్రమ నిర్వహణకు జిల్లా, మండలస్థాయి కమిటీలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. కలెక్టర్ చైర్మన్గా, డీఈవో కన్వీనర్గా, డీపీవో, ఇతర శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా మండల కమిటీలో చైర్మన్గా ఎంపీడీవో, ఎంఈవో, హెచ్ఎం, సీఆర్సీలు సభ్యులుగా కొనసాగుతారు. తల్లి చదువుతో కుటుంబంలో వెలుగులు.. తల్లి చదవడం ద్వారా ఆ కుటుంబంలో వెలుగులు ప్రసరిస్తాయని, ఇలాంటి కుటుంబాల ద్వారా ఆ గ్రామం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని సర్కార్ భావిస్తోంది. బడికి వెళ్లే పిల్లల సంఖ్య పెరగడంతోపాటు డ్రాపౌట్స్ తగ్గితే బాల్య వివాహాలపై అవగాహన పెరుగుతుందని చెబుతోంది. అక్షరాస్యులుగా మారడం ద్వారా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలపై అవగాహన పెరిగి అర్హులంద రి కీ ప్రయోజనాలు చేకూరుతాయని పేర్కొంటోంది. వలంటీర్లుగా మహిళా సంఘాల్లోని అక్షరాస్యులైన సభ్యులు.. డీఆర్డీవో, సెర్ప్ ఆధ్వర్యంలో నిరక్షరాస్యులను గుర్తించే ప్రక్రియ జిల్లాలో ఇప్పటికే పూర్తిచేశారు. 15 మంది నుంచి 20 మందితో గ్రూపును ఏర్పాటు చేశారు. మహిళా సంఘాల్లోని అక్షరాస్యులైన వారిని వలంటీర్లుగా ఎంపిక చేసి గ్రూపులను కేటాయించి చదువు చెప్పిస్తారు. గ్రూపు సభ్యులు చదవడం, రాయడం వచ్చే వరకు చదువు చెప్పే బాధ్యత వలంటీర్లకే అప్పగించారు. ఇందుకోసం పారితోషికం, గౌరవ వేతనం లేకుండానే కేవలం స్వచ్ఛందంగానే చదువు చెప్పాల్సి ఉంటుంది. అవసరమైన పుస్తకాలను విద్యాశాఖ అందిస్తుంది. ఉపాధ్యాయుల ద్వారా వలంటీర్లకు సహకారం అందిస్తుంది. మహిళా సంఘాల్లో నిరక్షరాస్యులు జిల్లాలోని వివిధ మండలాల్లో గల మహిళా సంఘాల్లో ఇంకా చదవడం, రాయడం రాని మహిళలను అధికారులు ఇటీవల గుర్తించారు. అంతర్గాం మండలంలో 2,017 మంది, రామగుండం మండలంలో 1,711 మంది, పాలకుర్తి మండలంలో 2,609 మంది, మంథని మండలంలో 3,818 మంది, ముత్తారం మండలంలో 2,617 మంది, రామగిరి మండలంలో 2,317 మంది, కమాన్పూర్ మండలంలో 2,277 మంది, ధర్మారం మండలంలో 4,813 మంది, జూలపల్లి మండలంలో 2,349 మంది, ఎలిగేడు మండలంలో 2,642 మంది, సుల్తాన్బాద్ మండలంలో 3,727 మంది, ఓదెల మండలంలో 3,056 మంది, కాల్వశ్రీరాంపూర్ మండలంలో 2,192 మంది, పెద్దపల్లి మండలంలో 5,311 మంది ఉన్నారని అధికారులు సర్వేలో తేల్చారు. ఇలా జిల్లావ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాల్లో మొత్తం నిరక్షరాస్యులైన మహిళలు 41,456 మంది ఉన్నారని అధికారులు గుర్తించారు.లక్ష్యం 28వేల మంది.. తొలిదశలో సుమారు 28 వేల మంది నిరక్షరాస్యులైన మహిళా సంఘాల్లోని సభ్యులను అక్షరాస్యులు గా మార్చాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకోసం వచ్చే ఏడాది మార్చి వరకు గడువు విధించారు. ఇందులో భాగంగానే ఈనెల 7న నిర్వహించే సమావేశంలో వలంటీర్లకు శిక్షణ ఇవ్వాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటారు. శిక్షణ పూర్తయ్యాక మండలాల వారీగా బోధన తరగతులు ప్రారంభిస్తారు. -
నేడు బీజేపీ అధ్యక్షుడి రాక
పెద్దపల్లిరూరల్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు జిల్లా పర్యటనకు వస్తున్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగే ముఖ్యకార్యకర్తల స మావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ విషయాన్ని వెల్లడించేందుకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్కుమార్ వర్గీయులు చిలారపు పర్వతాలు, రాజగోపా ల్ తదితరులు సోమవారం వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమ వివరాలపై చర్చించుకుంటూనే పరస్పర దూషణలకు దిగినట్లు ప్రచారం సాగుతోంది. అయితే, కొత్త రథసారథితోనైనా అసంతృప్తులకు చెక్పెట్టి పార్టీని బలోపేతం చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాషాయజెండాలు.. ఫ్లెక్సీలు.. పట్టణంలోని ఏ రోడ్డులో చూసినా కాషాయ జెండా లు, నేతల ఫ్లెక్సీలతో నిండిపోయి కనిపిస్తున్నాయి. కాగా, మొన్నటివరకు బీఆర్ఎస్లో ఉన్న నల్ల మనో హర్రెడ్డి తన అనుచరులతో కలిసి బీజేపీ సభ్యత్వం పొందేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. -
‘కిసాన్’ సంబురం
● రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం ● ఒక్కో అన్నదాత అకౌంట్లో రూ.2వేల చొప్పున జమ సుల్తానాబాద్(పెద్దపల్లి): చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేందుకు కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈఏడాది తొలివిడతలో నిధులు మంజూరు చేసింది. జిల్లాలోని అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో శనివారం నుంచి రూ.2వేల చొప్పున జమచేస్తోంది. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఏటా మూడు విడతల్లో (నాలుగు నెలలకోసారి) రూ.2 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని కేంద్ర ప్రభు త్వం గతంలోనే ప్రకటించింది. అయితే, ఈసారి వచ్చిన తొలివిడత డబ్బులు వరినాట్లకు ఉపయోగపడతాయని రైతులు భావిస్తున్నారు. జిల్లాలో తగ్గిన రైతుల సంఖ్య.. జిల్లావ్యాప్తంగా 73,400 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో శనివారం నుంచి కిసాన్ సమ్మాన్ నిధు లు జమచేస్తున్నారు. మొత్తం 82,219 మంది రైతులు ఉంటే.. అందులో 73,400 మందిని అర్హులుగా గుర్తించారు. ఐదెకరాల్లోపు వ్యవసా య భూమి గల చిన్న, సన్నకారు రైతులు పథకానికి అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 82,219 మంది రైతులకు 73,400 మందిని అర్హులుగా గుర్తించగా, మిగిలినవారి బ్యాంకు ఖాతా లు, ఆధార్ వివరాల్లో పొరపాట్లు ఉండడంతో అ నర్హులుగా తేలారని అధికారులు చెబుతున్నారు. ఇలాంటివారి వివరాలు సక్రమంగా ఉంటే తమ కు అందజేయాలని, తద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామని వారు పేర్కొంటున్నారు. వివరాలు అందిస్తే అప్లోడ్ చేస్తాం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా తొలివిడత నిధులు మంజూరయ్యాయి. జిల్లాలోని 73,400 మంది బ్యాంకు ఖాతాల్లో శనివారం నుంచి జమచేస్తున్నారు. నిధులు జమకానివారు బ్యాంకు ఖాతా నంబర్లు, ఆధార్ వివరాలు మాకు సమర్పించండి. ఆన్లైన్లో నమోదు చేస్తాం. – శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి -
మెడికల్ బోర్డులో కార్మికులకు అన్యాయం
● టీబీజీకేఎస్ ఇన్చార్జి కొప్పుల ఈశ్వర్ గోదావరిఖని: గతనెలలో నిర్వహించిన మెడికల్బోర్డులో కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని, దీనికి నిరసనగా సింగరేణిలో ఉద్యమాలు చేస్తామని టీబీజీకేఎస్ ఇన్చార్జి కొప్పుల ఈశ్వర్ అన్నారు. స్థానిక ప్రెస్క్లబ్లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 9 నెలల తర్వాత.. జూలై 30, 31న చేపట్టిన మెడికల్ బోర్డుకు 55 మందిని పిలిస్తే.. అందులో ఐదుగురినే అన్ఫిట్ చేయడం అన్యాయమన్నారు. ఇది గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాల వైఫల్య మేనని ఆయన విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ వందశాతం మెడికల్ బోర్డులో ఉద్యోగాలివ్వాలని సూచించారని, ఇలా 19వేల మందికి ఉద్యోగాలిచ్చారని తెలిపారు. రాబోయే రోజుల్లో కారుణ్య నియామకాలు కనుమరుగైయ్యే పరిస్థితి కనబడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణిలో మంత్రులు, ఎమ్మెల్యేల ఆధిపత్యమే న డుస్తోందని విమర్శించారు. టీబీజీకేస్ నాయకులను ఇబ్బంది పెట్టే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ బదిలీ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మందమర్రిలో ఎస్డీఎల్ యాక్టింగ్ ఆపరేటర్ రాచపల్లి శ్రావణ్కుమార్ మరణించడం దురదృష్టకరమన్నారు. మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, పుట్ట మధూకర్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, నాయకులు మాదాసు రామమూర్తి, నూనె కొమురయ్య, వడ్డేపల్లి శంకర్, నాగెల్లి సాంబయ్య, వాసర్ల జోసఫ్, సురేందర్రెడ్డి, మేడిపల్లి సంపత్, చెల్పూరి సతీశ్, అన్వేష్రెడ్డి, చల్లా రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్టేడియం నిర్మాణానికి నిధులు
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం రూ. 2.30కోట్లు కేటాయించిందని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్థా నిక వ్యవసాయ మార్కెట్ యార్డులో స్టేడియం నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభించేలా చూస్తామని ఆయన అన్నారు. నాయకులు కొట్టె సదానందం, లకిడి భాస్కర్, నూగిల్ల మల్లయ్య, సరోత్తంరెడ్డి తదితరులు ఉన్నారు. అప్పుల్లో ఉన్నా పథకాలు అమలు సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): గత ప్రభుత్వం చేసిన అప్పులు చెల్లిస్తూనే ప్రజలపై భారం పడకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘ నత కాంగ్రెస్ సర్కారుకే దక్కిందని ఎమ్మెల్యే వి జయరమణారావు అన్నారు. రెబ్బల్దేవ్పల్లి, చిన్నబొంకూర్, మియ్యాపూర్ గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గుపోసి మాట్లాడారు. జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్రావు, ఎంపీడీవో దివ్యదర్శన్రావు, నా యకులు పన్నాల రాములు, సాగర్ ఉన్నారు. మొక్కలు నాటిన ‘హర్కర’ రామగుండం: అంతర్గాం మండల పరిషత్ కా ర్యాలయ ఆవరణలో ఆదివారం వనమహోత్స వం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదా రు హర్కర వేణుగోపాల్రావు, జిల్లా అటవీశా ఖ అధికారి శివయ్య, ఎంపీడీవో వేణుమాధవ్ తదితరులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో మండల పరి షత్ సూపరింటెండెంట్ కరుణాకర్, అధికారు లు కొమురయ్య, రమేశ్, ఇర్షద్బేగ్, రవంతి, లీల తదితరులు పాల్గొన్నారు. యూరియా ఉత్పత్తి ప్రారంభం ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): రామగుండం ఎ రువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తి ప్రా రంభమైంది. కర్మాగారం అమ్మోనియా పైప్లై న్ లీక్ కావడంతో జూలై 16న ప్లాంట్ షట్డౌన్ చేసిన విషయం విదితమే. మరమ్మతులు అనంతరం శుక్రవారం ప్లాంట్ ప్రారంభం కాగా ఆది వారం యూరియా ఉత్పత్తి పునరుద్ధరించారు. కర్మాగారం యూరియా ఉత్పత్తి సామర్థ్యం రోజూ 3,850 మెట్రిక్ టన్నులు. వార్షిక మరమ్మతులు, హెచ్టీఆర్ మార్పుతో సామర్థ్యానికి అనుగుణంగా ఉత్పత్తి చేయలేకపోతున్నారు. రేపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రాకసుల్తానాబాద్/ఎలిగేడు/కాల్వశ్రీరాంపూర్: బీ జేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు ఈనెల 5న జిల్లా కేంద్రంలో పర్యటిస్తారని ఆ పార్టీ నేతలు కర్రె సంజీవరెడ్డి, కంకణాల జ్యోతిబసు, ముక్కోజు వెంకటేశ్వర్లు, చాతరాజు రమేశ్ తెలిపారు. ఆదివారం ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. రా ష్ట్ర అధ్యక్షుడిగా నియామకమైన రామచంద్రారావు తొలిసారి జిల్లాకు వస్తున్నందున పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. నా యకులు గాదె రంజిత్రెడ్డి, అడ్డ గుంట తిరుపతిగౌడ్, గుజ్జుల మల్లారెడ్డి, గోపు సురేందర్రెడ్డి, రాయపాక మనోహర్, మల్లారపు అంజయ్య, గంగయ్య, చౌదరి తిరుపతి, బత్తిని శ్రీనివాస్, రవి, కోడూరి శ్రీనివాస్, రాజేందర్, సతీశ్రెడ్డి, భోగె కిరణ్, ఎడ్ల సతీశ్ పాల్గొన్నారు. పనుల్లో వేగం పెంచండి గోదావరిఖని: సింగరేణి చేపట్టిన ర్యాపిడ్ గ్రా విటీ నిర్మాణంలో వేగం పెంచి సకాలంలో పూ ర్తిచేయాలని సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. ఆర్జీ– వన్ ఏరియా లో జీడీకే–1వ గని ఫ్యాన్హౌస్ వద్ద చేపట్టిన ర్యాపిడ్ గ్రావిటీ పనులను ఆయన ఆదివారం పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. కార్మి క కుటుంబాలకు నాణ్యమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో తాము పోరాటం చేశామని, దీంతోనే సింగరేణి రూ.20కోట్లతో ర్యాపిడ్ గ్రావిటీ పనులు చేపట్టిందన్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని దీనిని త్వరగా అందుబాటులోకి తేవాలని ఆయన కోరారు. నాయకులు ఆరేపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్, ఆసరి మహేశ్, దాసరి సురేశ్, అనబోయిన శంకర్, సానం రవి, ఈద వెంకటేశ్వర్లు, పెరుమళ్ల శ్రీనివాస్, తిప్పారపు రాజు, జనార్దన్రెడ్డి, పెద్దపల్లి శశికుమార్, రాజ్కుమార్, శివరామకృష్ణ, శివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మల్లన్నకు బోనం మొక్కులు
ఓదెల: ఓదెల మల్లికార్జునస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఓదెల మల్లన్నను దర్శించుకున్నారు. స్వామివారికి పట్నాలు వేయించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆర్యవైశ్యుల వన భోజనాలు ఎలిగేడు: రాములపల్లి(ర్యాకల్దేవుపల్లి) నాగలింగేశ్వర ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా ఆదివారం సుల్తానాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వనభోజనాలతోపాటు స్నేహితుల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. తొలుత ప్రత్యేకపూజలు చేశారు. పూజారి అభిషేక్శర్మ తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు వెంకట్ నారాయణ, మంచాల జ్యోతి, కోలేటి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. బీజీడీకేఎస్ డివిజన్ కార్యవర్గం సుల్తానాబాద్(పెద్దపల్లి): భారతీయ గ్రామీణ డాక్ కర్మచారి సంఘ్ పెద్దపల్లి డివిజన్ అధ్యక్షుడిగా ఎన్.మల్లేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల కేంద్రంలో ఆదివారం సర్కిల్ కార్యదర్శి వినయ్ సుధీర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. బీ ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్గౌడ్ హాజరయ్యా రు. కార్యదర్శిగా ఎం.సమ్మయ్య, కోశాధికారిగా కె.శ్రావణ్ కుమార్, డిప్యూటీ కార్యదర్శిగా బి.హరిహరన్ ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా నీట్ పీజీ ప్రవేశ పరీక్ష రామగిరి(మంథని): సెంటినరీకాలనీలోని మంథని జేఎన్టీయూలో ఆదివారం నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొత్తం 99 మంది విద్యార్థులకు 87 మంది హాజరయ్యారని ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ తెలిపారు. రామగిరి ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. -
4 నెలలు.. 20 మిలియన్ టన్నులు
● సింగరేణిలో 97శాతం బొగ్గు ఉత్పత్తి ● అగ్రస్థానంలో ఆర్జీ–2 ఏరియాగోదావరిఖని: బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో సింగరేణి పకడ్బందీగా ముందుకు సాగుతోంది. గత నాలుగు నెలల్లో 20 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే, జూలై నాటికి 20.81 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాల్సి ఉండగా, 20.18మిలియన్ టన్నులు నమోదు చేసి నిర్దేశిత లక్ష్య సాధనలో 97 శాతం నమోదు చేసింది. జూలైలో వర్షాలు దంచి కొట్టినా.. అత్యధిక బొగ్గు ఉత్పత్తి సాధించే ఓసీపీల్లో రవాణాకు ఆటంకం లేకుండా చర్యలు చేపట్టింది. ముందుగా ఏర్పాటు చేసుకున్న స్టాక్కోల్ నుంచి రైల్వే మార్గం ద్వారా వినియోగదారుల డిమాండ్కు అనుగుణంగా బొగ్గు సరఫరా చేసింది. దీంతో ఉత్పత్తిలో లోటు పెద్దగా కనిపించడం లేదు. అయితే వర్షాలు అధికంగా కురవడంతో జూలైలో సంస్థవ్యాప్తంగా ఉన్న 11ఏరియాల్లో 87శాతం బొగ్గు ఉత్పత్తి మాత్రమే నమోదు చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. నంబర్ వన్గా ఆర్జీ–2 ఏరియా గత నాలుగు నెలల్లో సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో అత్యధిక బొగ్గు ఉత్పత్తి సాధించి ఆర్జీ–2 ఏరియా అగ్రస్థానంలో నిలిచింది. 19.87లక్షల టన్నుల లక్ష్యానికి 26.57లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించి 134 శాతం బొగ్గు ఉత్పత్తి నమోదు చేసింది. అలాగే 108 శాతంతో మణుగూరు ఏరియా రెండోస్థానంలో, 103 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించి కొత్తగూడెం మూడోస్థానంలో నిలిచింది. మిగతా ఎనిమిది ఏరియాలు నిర్దేశిత లక్ష్య సాధనకు వెనుకబడ్డాయి. కేవలం 20 శాతం బొగ్గు ఉత్పత్తితో ఏపీఏ ఏరియా చివరి స్థానంలో నిచిలింది. -
‘పత్తిపాక’కు అడుగులు
● డీపీఆర్ తయారీకి రూ.1.10కోట్లు ● 2.40 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు అవకాశం ● 10 వేల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి ● చివరి ఆయకట్టు రైతులకు తప్పనున్న సాగునీటి కష్టాలు సాక్షి పెద్దపల్లి: ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని జిల్లాకు అందించేందుకు ప్రతిపాదనలో ఉన్న పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సాగునీటి స్థిరీకరణ, కొత్త ఆయకట్టు కోసం ప్రతిపాదించిన పత్తిపాక రిజర్వాయర్ డీపీఆర్(డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్) తయారీకి ప్రభుత్వం రూ.1.10 కోట్లు మంజూరు చేసింది. 7.78 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించే ఈ ప్రాజెక్టులోకి ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని తరలిస్తారు. అక్కడినుంచి నేరుగా కాకతీయ కాలువలోకి పంపిస్తారు. రేవెల్లి సమీప హెడ్రెగ్యులేటర్ ద్వారా ఎస్సారెస్సీ డీ–83, డీ–86 కాలవలకు అందిస్తారు. తద్వారా ఉమ్మడి జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం, థర్మపురి, చొప్పదండి, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి లోని 2.40 లక్షల ఎకరా ల ఎస్సారెస్సీ ఆయ కట్టు స్థిరీకరణతో పాటు, కొత్తగా సుమారు 10 వేల ఎకరాలకు సాగు నీరు సమృద్ధిగా అందించే వీలుందని అధికారులు చెబుతున్నారు. గతంలో ప్రతిపాదనలకే పరిమితం ఎస్సారెస్సీ ద్వారా జిల్లాలో ప్రస్తుతం 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. వారబందీ పద్థతిలో నీటిని విడుదల చేస్తుండడంతో ఓదెల, కాల్వశ్రీరాంపూర్, ముత్తారం, రామగిరి, మంథని, రామగుండం మండలాల్లోని చివరి ఆయకట్టుకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీరు అందించి స్థిరీకరించేందుకు ధర్మారం మండలం పత్తిపాక వద్ద 1.56 టీఎంసీల సామర్థ్యంతో ఒకటి, 7 టీఎంసీల సామర్థ్యంతో మరో ప్రతిపాదనను నీటిపారుదల అధికారులు రూపొందించినా అక్కడికే పరిమితమయ్యాయి. దీనికి ప్రత్యామ్నాయంగా వరదకాలువ నుంచి ఎస్సారెస్పీ కాలువకు మధ్య 3 కి.మీ. వరకు కెనాల్ నిర్మించారు. దీంతో గాయత్రి పంప్హౌస్ నుంచి వరదకాలువ ద్వారా మిడ్మానేరుకు నీటిని తరలించినప్పుడు మాత్రమే లింక్కాలువ ద్వారా సాగునీరు అందతుంది. రైతులకు శాశ్వత పరిష్కారం లభించాలంటే పత్తిపాక రిజర్వాయర్ ని ర్మాణం తప్పనిసరిగా మారింది. దీంతో గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామని కాంగ్రెస్ నేతలు హామీలు ఇచ్చారు. ప్రస్తుతం డీపీఆర్ తయారీకి నిధులు మంజూరు కావడంతో ప్రాజెక్టు కార్యరూపం దాల్చుతుందని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చివరి ఆయకట్టు రైతుల సాగుకష్టాలు తొలగనున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక అంచనాలు సిద్ధం.. ప్రతిపాదిత పత్తిపాక ప్రాజెక్టును అధికారులతో కలిసి మంత్రులు శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ గతంలోనే పరిశీలించారు. సమీక్షలు సైతం నిర్వహించారు. రిజర్వాయర్ ఎంత సామర్థ్యంతో నిర్మించాలి, ఎన్ని ఎకరాలు ముంపునకు గురవుతాయి? ఇందు లో ప్రభుత్వ భూములు, పట్టా భూములు ఎన్ని? తదితర అంశాలపై ఇప్పటికే నీటి పారుదల శాఖాధికారులు ప్రాథమికంగా ప్రతిపాదనలు రూపొందించారు. 7.78 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తే, 1,700 ఎకరాలు ముంపునకు గురవుతాయని అంచనాకు వచ్చారు. ఇందులో 400 ఎకరాలు అటవీ, 1,300 ఎకరాలు పట్టా భూములు సేకరించాల్సి ఉంటుంది. -
మూడు పంటలకు సాగునీరు
రామగుండం/ధర్మారం: రామగుండం ఎత్తిపోతలు అందుబాటులోకి రావడంతో ఏటా మూడు పంటలకు సాగునీరు అందుతుందని నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. అంతర్గాం మండలం ముర్మూర్/బ్రాహ్మణపల్లి శి వారులో రూ.75 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతలను మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్తో కలిసి ఆదివారం రిమోట్ సా యంతో ప్రారంభించారు. ధర్మారంలో రూ. 45.15 కోట్లతో చేపట్టిన ఐటీఐ భవన సముదా యం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొత్త రే షన్కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జ రిగిన సభలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మా ట్లా డుతూ, మంథని నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు, బ్యారేజీ, పంపుహౌస్లను రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గాల్లో నిర్మించారని, అ యినా, ఒక్కఎకరాకూ నీటిని వినియోగించుకోలేదన్నారు. రామగుండం నియోజకవర్గంలో 67 వే ల రేషన్కార్డులు ఉంటే.. కొత్తగా 6,500 రేషన్కార్డులు జారీచేశామని మంత్రి తెలిపారు. పారిశ్రామిక కారిడార్గా అభివృద్ధి చేస్తాం.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ, అనేక పరిశ్రమలకు నిలయమైన రామగుండాన్ని పారిశ్రామిక కారిడార్గా గుర్తించి అభివృద్ధి చేస్తామన్నారు. ఇందిరా మహిళాశక్తి సభ్యులకు ఆర్టీసీ బ స్సు అప్పగించడం ద్వారా వారిని ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. సింగరేణిలో కార్మికుల మారుపేర్ల సమస్య ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్తో కలిసి గత ఎన్నికల సందర్భంగా ఇక్కడ బస్సుయాత్ర చేపట్టామన్నారు. ప్రతిపాదనలు పంపిస్తే అంతర్గాంలో గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం రామగుండం నియోజకవర్గంలో సంపూర్ణంగా అమలవుతోందన్నారు. ప్రయాణికుల అవసరం మేరకు మరో 16 బస్సులను కేటాయించాలని మక్కాన్సింగ్ కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. ఎయిర్పోర్ట్ రాకుంటే.. ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ మాట్లాడు తూ, అంతర్గాం భూముల్లో ఎయిర్పోర్ట్ రాకుంటే ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించారని, ఆయన అకాల మృతితో నిర్వాసిత గ్రామాలు, రామగుండం ఉమ్మడి మండలంలోని ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యం కార్యారూపం దాల్చలేదనే ఠాకూర్ గుర్తు చేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ, జిల్లాలో 2.40 లక్షల ఆయకట్టు ఉందని, దీనిని స్థిరీకరించేందుకు పత్తిపాక రిజర్వాయరే ఆధారమన్నారు. కాందీశీకుల సమస్యలు పరిష్కరించండి.. ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు మాట్లాడుతూ, బర్మా, శ్రీలంక, కాందీశీకుల భూ ములు, పరిహారం సమస్యలు పరిష్కరించాలని మంత్రులను కోరారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్ రవీందర్పటేల్, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. ధర్మారంలో ఏర్పాటు చేసిన మరో కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ, ధర్మపురి ని యోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పత్తిపాక శివారులో శ్రీలక్ష్మీనర్సింహస్వామి రిజర్వాయర్ నిర్మిస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినా అమలు చేయలేదని మండిపడ్డారు. ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి లక్ష్మణ్కుమార్ విన్నపం మేరకు తమ ప్రభుత్వం లక్ష్మీనర్సింహ రిజర్వాయర్ నిర్మాణం డీపీఆర్ తయా రీ కోసం రూ.1.10కోట్లు కేటాయించిందని మంత్రి స్పష్టం చేశారు. రైతుల కోసం బొమ్మారెడ్డిపల్లి – కొత్తపల్లి మైనర్ కాలువ పెండింగ్ పనుల కోసం రూ.5కోట్లు, మేడారం రిజర్వాయర్ నుంచి డీ – 83 బీ లింక్ కెనాల్ పనుల పూర్తికి రూ.3. 26 కోట్లు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్లు లావుడ్య రూప్లానాయక్, భీమ సంతోష్, బుర్ర రాములుగౌడ్, లక్ష్మణ్ లావణ్య, సివిల్ సప్లయ్ ఎండీ చౌహన్, అదనపు కలెక్టర్ వేణు, ఇన్చార్జి తహసీల్దార్ ఉదయ్కుమార్ పాల్గొన్నారు. రామగుండాన్ని పరిశ్రమల కారిడార్గా అభివృద్ధి చేస్తాం అంతర్గాంలో గోదాములు నిర్మిస్తాం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అభయం రామగుండం ఎత్తిపోతల ప్రారంభం ధర్మారంలో రేషన్కార్డులు పంపిణీ హాజరైన మంత్రులు తుమ్మల, దుద్దిళ్ల, పొన్నం, అడ్లూరి లక్ష్మణ్ -
బెస్ట్ ఫ్రెండ్ శివం ఉపాధ్యాయ
సిరిసిల్ల: నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పడం చాలా కష్టం. చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో, కెరీర్లో అనేక మంది ఫ్రెండ్స్ అయ్యారు. నా కంటే సీనియర్ ఆఫీసర్ అయిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఝా చాలా క్లోజ్గా ఉంటారు. నాకు మంచి ఫ్రెండే. ఇంకా బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే.. 2021 ఐపీఎస్ బ్యాచ్మెట్ శివం ఉపాధ్యాయ. అతను నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పవచ్చు. అతనితో ఐదేళ్లుగా ఫ్రెండ్షిప్ కొనసాగుతోంది. చాలా మంచి సలహాలు ఇస్తారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఏఎస్పీగా పని చేస్తున్నారు. – మహేశ్ బి గితే, ఎస్పీ, రాజన్న సిరిసిల్ల -
స్నేహితుడా..
● తోటి మిత్రులకు సాయంగా.. ● దూరమైనవారి జ్ఞాపకంగా.. ● సేవలు చేస్తూ.. అండగా నిలుస్తూ.. ● ఉమ్మడి జిల్లాలో ఆదర్శంగా పలువురు ● నేడు స్నేహితుల దినోత్సవం‘బృందావనంలో గోపాలురతో కన్నయ్య చేసిన దోస్తీ.. కుచేలుడితో కృష్ణుడి స్నేహం.. రామాయణంలో శ్రీరాముడు.. సుగ్రీవుల మైత్రి. అశోకవనంలో కాపలాగా ఉన్న త్రిజట సీతమ్మతల్లికి ఎన్నోవిధాలుగా ఊరడించి స్నేహానికి ప్రతీకగా నిలువగా.. దశరథుడితో ఉన్న మైత్రితో జటాయువు సీతమ్మ తల్లిని రక్షించేందుకు రావణుడితో ప్రాణాలొడ్డి పోరాడింది. కర్ణుడు, దుర్యోధనుడి స్నేహం మంచీ చెడు, విచక్షణ, కీర్తి, అపకీర్తికి తావులేదని మహాభారతం వివరించింది’. స్నేహం.. అనిర్వచనీయం.. అద్వితీయం.. అమ్మ అనే పదం తరువాత ఆత్మీయతను పంచే ఏకై క బంధం స్నేహం. కంటికి దూరమైనా మనసుకు దగ్గరగా ఉండేది స్నేహం. ఆపదలో ఉన్నప్పుడు ధైర్యం.. ఓదార్పునిచ్చేది నేస్తం.. విజయం సాధించినప్పుడు చప్పట్లు కొట్టేవారు.. విషాదంలో ఉన్నప్పుడు వెన్నుతట్టి ఓదార్చే నలుగురు స్నేహితులు లేని జీవితాన్ని ఎవరూ ఊహించరు. అందుకే మనిషికి తలా ఓ పేరున్నప్పటికీ.. అందరినీ దగ్గరకు చేర్చేది స్నేహబంధం మాత్రమే. స్నేహంకోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. కష్టమైనా.. నష్టమైనా.. మన ఫ్రెండ్ కోసమే కదా అనిపిస్తుంది. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేకమంది తమ స్నేహితుల కోసం ఎన్నోరకాల సేవలందిస్తున్నారు. జీవితాలను నిలబెడుతున్నారు. కష్టాల్లో తోడునీడగా నిలుస్తున్నారు. వారి నుంచి దూరమైన స్నేహితుల పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్నేహితుల పేరిట మరికొందరికి సాయంగా నిలుస్తున్నారు. నేడు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాలు..!! – విద్యానగర్/సప్తగిరికాలనీస్నేహితుల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 100మందిని పలుకరించగా.. అభిప్రాయాలు ఇలా..12స్నేహం అంటే..? అవసరాలు తీర్చేది కల్మషం లేనిది 88ఫ్రెండ్షిప్ కలుషితమైందా? అవును కాలేదు 3862నీకు ఎంతమంది నిజమైన ఫ్రెండ్స్ ఉన్నారు? ఒకరు ఇద్దరికి మించి 2872నీ ఫ్రెండ్కు ఇచ్చేస్థానం?అమ్మానాన్న తరువాత ఫ్రెండ్ ఫస్ట్ నాన్న తరువాత ఫ్రెండ్, అమ్మ ఫ్రెండ్ తరువాత అమ్మ,నాన్న 5814 -
బాల్య మిత్రుడి జ్ఞాపకాలతో స్కూల్కు శ్రీకారం
సిరిసిల్ల: ‘అరేయ్ మన మిత్రుడు దయానంద్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. వాడిని అందరూ గుర్తుంచుకునే విధంగా ఏదైనా చేద్దాం’ అంటూ.. బాల్య స్నేహితులు ఏకమయ్యారు. ఓ స్కూల్ను ఏర్పాటు చేశారు. 19 ఏళ్ల కిందటే రూ.30లక్షలు వెచ్చించి శాశ్వత భవనాన్ని నిర్మించారు. వందలాది మంది పిల్లలకు ఉచితంగా ఇంగ్లిష్ మీడియంలో విద్యను అందిస్తున్నారు. సిరిసిల్లలోని పద్మనగర్కు చెందిన గోసికొండ దయానంద్ 2002లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని స్నేహితుడు గాజుల శ్రీనివాస్ యూఎస్ఏ సాప్ట్వేర్ ఇంజినీరు. దయానంద్పై ఉన్న అభిమానంతో స్నేహితులతో కలిసి పట్టణ శివారులో 22 గుంటల భూమిని కొనుగోలు చేశారు. 19 ఏళ్ల కిందట సుమారు రూ. 30 లక్షలు వెచ్చించి స్కూల్ను 2006లో స్థాపించారు. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తున్నారు. రాజీవ్నగర్లోని పేదలందరూ తమ పిల్లలను దయానంద్ మెమోరియల్ స్కూల్కు పంపిస్తున్నారు. ప్రస్తుతం స్కూల్లో 65 మంది విద్యార్థులు ఉన్నారు. ఏటా 25 మంది జెడ్పీస్కూళ్లకు వెళ్తున్నారు. నిర్వహణకు ఏటా రూ.6 లక్షలు ఖర్చవుతోంది. ట్రస్ట్ అధ్యక్షుడిగా గాజుల శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ స్నేహితులు భీమేశ్వర్ అంకతి, రాంబాబు చేబ్రోలు, జి.రాజశేఖర్, ప్రసన్న పోల్సాని, విజయ్కృష్ణ భరాతం, మురళీకృష్ణ సింగారం, రవీందర్ నాగంకేరి, రవి వూరడి, గణేశ్ గోసికొండ భాగస్వాములుగా ఉన్నారు. -
స్నేహబంధమే శాశ్వతం
సాక్షి, పెద్దపల్లి: స్నేహబంధమే అన్నింటికన్నా శాశ్వతమైనది. నేను ఇప్పటికీ నా స్కూల్మేట్స్ను కలుస్తుంటా. చిన్నప్పుడు ఖమ్మం పాఠశాలలో పదో తరగతి వరకు కలిసి చదువుకున్నం. చదువులు పూర్తయ్యాక చిన్ననాటి మిత్రులందరూ వివిధ దేశాలు, పట్టణాల్లో డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ఉద్యోగులు, వ్యాపారులుగా స్థిరపడ్డారు. ఎవరెక్కడ ఉన్నా మేమంతా ఒకరికొకరు తోడుగా ఉన్నామన్న భరోసా ఇస్తూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటాం. 30 ఏళ్లుగా మా స్నేహం కొనసాగుతోంది. వాట్సప్ గ్రూప్ ద్వారా నిత్యం టచ్లో ఉంటాం. ఏడాదికోసారి ఒకచోట కలిసి యోగక్షేమాలు తెలుసుకుంటాం. – కోయ శ్రీహర్ష, కలెక్టర్, పెద్దపల్లి -
కమ్ముకుంటున్న కాలుష్యం
● పర్యావరణానికి పెనుముప్పు ● వాయు, జలకాలుష్యంతోనూ ఇబ్బంది ● ఈఎస్ఐ ఆస్పత్రిపై కార్మికుల ఆశలు ● నేడు మంత్రులు ఉత్తమ్, తుమ్మల, దుద్దిళ్ల శ్రీధర్బాబు పర్యటనగోదావరిఖని: రామగుండం పారిశ్రామిక ప్రాంతం అనేక సమస్యలతో సతమతమవుతోంది. ప్రధానంగా వాయు, జల, శబ్ద కాలుష్యం, నిరుగ్యోగంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవగాహన లేకచాలామంది రోడ్డు ప్రమాదాలకూ గురవుతున్నారు. వేలాదిమంది శాశ్వత అంగవైకల్యం పాలవుతున్నారు. నిరుద్యోగ యువత తప్పుదారి పడుతోంది. తక్కువ ధరకు వస్తున్న మత్తుతో విలువైన జీవితం నాశనం చేసుకుంటున్నారు. గంజాయిలాంటి మత్తుపదార్థాల బారినపడి కొందరు వ్యస నపరులుగా మారుతున్నారు. మరికొందరు నేరస్తులుగా, ఇంకొందరు మత్తుమందు సరఫరా చేస్తూ కేసుల్లో ఇరుక్కుని జైళ్లలో మగ్గిపోతున్నారు. ఆదివా రం రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమా ముర్మూరు ఎత్తిపోతల ప్రారంభానికి వస్తున్న సందర్భంగా సమస్యలు పరిష్కరించాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. జిల్లాలో కీలక పరిశ్రమలు ఇక్కడే.. సింగరేణి బొగ్గు గనులు, ఎన్టీపీసీ విద్యుత్ సంస్థ, ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్, కేశోరాం పరిశ్రమ లాంటి కీలక ఫ్యాక్టరీలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. వీటితోపాటే సమస్యలూ ఉన్నాయి. సింగరేణి బొగ్గు గనుల్లో నిల్వలు అడుగంటి పోవడం, భూగర్భ గను లు తగ్గిపోతుండడంతో కార్మికుల సంఖ్య శరవేగంగా పడిపోతోంది. ఇదే క్రమంలో కాంట్రాక్టు కార్మికు లు, ప్రైవేటీకరణ శరవేగంగా సాగుతోంది. విద్యుత్ ఉత్పత్తి చేస్తోన్న ఎన్టీపీసీలోనూ కాంట్రాక్టు కార్మికు ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఎరువులు ఉత్పత్తి చేసే ఆర్ఎఫ్సీఎల్లోనూ పర్మినెంట్ కార్మికులకు బ దులు కాంట్రాక్టు కార్మికులతో ఉత్పత్తి చేస్తున్నారు. ఆందోళన కలిగిస్తున్న పర్యావరణ కాలుష్యం ఎన్టీపీసీ, సింగరేణి, ఆర్ఎఫీసీఎల్ విస్తరించిన పారిశ్రామిక ప్రాంతంలో వాయు, నీటి కాలుష్యం తీవ్రంగా ఉంది. సింగరేణి ప్రాంతంలోని రహదారులపై బొగ్గు ధూళి(కోల్డస్ట్) అధికంగా పేరుకుపోతోంది. బ్లాస్టింగ్ సమయంలో ఓసీపీల నుంచి దుమ్ము విపరీతంగా లేచి కాలనీలను ముంచెత్తుతోంది. దీంతో స్థానికులు శ్వాసకోశ, కిడ్నీ సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నారు. నిరుద్యోగ సమస్యతో సతమతం.. కొత్తగా వచ్చిన ప్రాజెక్టులు, ప్రైవేట్ ఓబీల్లో స్థానికులకు ఉద్యోగావకాశాలు పెద్దగా లభిచడం లేదు. దీంతో స్థానిక యువత తీవ్ర నిరాశకు గురవుతోంది. కాంట్రాక్టు కార్మికులకు శ్రమకు తగిన జీతభత్యాలు అందడం లేదు. సౌకర్యాల కల్పనపై ఎవరూ దృష్టి సారించడంలేదు. ఈఎస్ఐ ఆస్పత్రిపై ఆశలు.. రామగుండం కార్మిక క్షేత్రంలో ఈఎస్ఐ వందపడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. దీనికి సంబంధించిన స్థలాన్ని కూడా ఖరారు చేసినా.. కేంద్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేయడంలో ఆలస్యం అవుతోంది. దీంతో కాంట్రాక్టు, భవన నిర్మాణ రంగ కార్మికులు, అల్పాదాయ వర్గాలకు ఈఎస్ఐ వైద్యసేవలు అందడం లేదు. చాలీచాలని వేతనాలు.. రామగుండంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు భద్రత సిబ్బంది చాలీచాలని వేతనాలతో ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అత్యధిక నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఎల్లంపల్లి ప్రాజెక్టులో దశాబ్దం క్రితం నియమించిన సుమారు 20 మంది భద్రతా సిబ్బందికి ఆశించిన వేతనాలు అందడం లేవు. ప్రతీనెలా రూ.10వేల వేతనం కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. ఈ సొమ్ము కూడా సకాలంలో చెల్లించడం లేదని బాధితులు వాపోతున్నారు. ఎత్తిపోతల ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యే మంత్రులు తమ సమస్యలను ఆలకించాలని కార్మికులు కోరుతున్నారు. ప్రధాన డిమాండ్లు.. ● ఎన్టీపీసీ, సింగరేణి నుంచి రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎస్ఆర్ నిధులు కేటాయించాలి. అభివృద్ది పనులు వేగవంతం చేయాలి ● పర్యావరణ నియంత్రణ బోర్డు (పీసీబీ) పర్యవేక్షణ మళ్లీ ప్రారంభించాలి. ● స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యత కల్పించాలి. ● ఈఎస్ఐ, ప్రభుత్వ ఆస్పత్రుల విస్తరణ శరవేగంగా చేపట్టాలి. మంత్రుల పర్యటనకు ఏర్పాట్లు రామగుండం: అంతర్గాం మండలం ముర్మూర్/బ్రాహ్మణపల్లి ఎత్తిపోతల పథకాన్ని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదివారం ప్రారంభిస్తారు. ఈమేరకు చేపట్టిన ఏర్పాట్లను ఎమ్మెల్యే మక్కాన్సింగ్ ఠాకూర్ శనివారం పర్యవేక్షించారు. అంతర్గాం జంక్షన్ కూడలిలో బహిరంగ సభ నిర్వహిస్తామని అన్నారు. ఏర్పాట్లపై అధికారులకు సూచనలు, సలహాలిచ్చారు. తహసీల్దార్ రవీందర్ పటేల్, అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు ఉన్నారు. -
అవయవదానం సామాజిక బాధ్యత
● అదనపు కలెక్టర్ అరుణశ్రీ కోల్సిటీ(రామగుండం): రక్త, నేత్ర, అవయవ, శ రీరదానాలు సామాజిక బాధ్యతని అదనపు కలెక్టర్ అరుణశ్రీ అన్నారు. వందరోజుల కార్యాచర ణలో బల్దియా కార్యాలయంలో మెప్మా ఆర్పీలకు అవయదాన దినోత్సవం సందర్భంగా రక్త, నేత్ర, అవయవ, శరీరదానాలపై శనివారం అవగాహన కల్పించారు. ఆర్పీలు ఎస్హెచ్జీ, ఎస్ఎల్ఎఫ్ స మావేశాల్లో రక్త, నేత్ర, అవయవ, శరీర దానాల పై అవగాహన కల్పించాలని, తల్లిపాల వారోత్స వాలను విజయవంతం చేయాలని కోరారు. డీ ఎంహెచ్వో అన్న ప్రసన్నకుమారి మాట్లాడుతూ, మరణానంతరం, జీవించి ఉండగా కొన్నిఅవయవాలు దానం చేయొచ్చన్నారు. బిడ్డ పుట్టిన అర్ధగంటలోపు ముర్రుపాలు పట్టిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ సార్వజనిక ఆస్పత్రి ఆర్ఎంవో రాజు, సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రచార కార్యదర్శి కేఎస్ వాసు మా ట్లాడారు. కాగా, భర్త అవయవదానంతో ఎనిమి ది మందికి పునర్జన్మ ఇచ్చిన మెప్మా సీవో శమతకమణి, తండ్రి నేత్ర దానం చేసి ఇద్దరికి చూపు ప్ర సాదించిన బల్దియా ఔట్ సోర్సింగ్ ఉద్యోగి విజయ్ కుమార్ను అదనపు కలెక్టర్, ఫౌండేషన్ ప్రతినిధులు సత్కరించారు. ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు రామకష్ణారెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, మెప్మా టీఎంసీ మౌనిక ఉన్నారు. -
పేదల జీవితాల్లో మార్పు తెస్తాం
● మంత్రి శ్రీధర్బాబు మంథని: నమ్మకంతో అధికారం కట్టబెట్టిన పేదలకు అండగా ఉండి వారిజీవితాల్లో మార్పు తీసుకొస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. మంథని, రామగిరి, కమాన్పూర్ మండలాల్లో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి శనివారం పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. స్థానిక ఆర్ఆర్ గార్డెన్స్లో కొత్త రేషన్కార్డులు పంపిణీ చేశారు. మహిళాశక్తి సంబురాల్లో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చినమాట ప్రకారం అర్హులకు కొత్త రే షన్కార్డులతోపాటు సన్నబియ్యం సరఫరా చేస్తున్నామన్నారు. మహిళలు వ్యాపారంలో రాణించేందుకు ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నైపుణ్యం పెంచేందుకు పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన వీ – హబ్ ఉప కేంద్రం ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. ఇందిరా మహిళాశక్తి ద్వారా డెయిరీ, పౌల్ట్రీఫారమ్స్ ఏర్పాటుకు ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. చివరి లబ్ధిదారు వరకూ ఇల్లు చేరేలా ఇందిరమ్మ ఇంటి పథకం కొనసాగుతుందని స్పష్టం చేశారు. లక్షల మొక్కలు నాటామని గత పాలకులు చెబుతున్నారని, ఇలాగైతే పచ్చని తెలంగాణగా ఆవిర్భవించాలని, ఇప్పుడా పరిస్థితి లేదని మంత్రి అన్నారు. వన మహోత్సవం పేరిట నాటే మొక్కలపై ట్రీ ఆడిట్ జరుగాలని అన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, 20 నెలల్లోనే ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధా న్యం కల్పిస్తోందన్నారు. కొత్త రేషన్ కార్డుల ద్వారా జిల్లాలో 25వేల మందికిపైగా పేదలు లబ్ధి పొందుతారని తెలిపారు. అనంతరం రామగిరి, మంథని, ముత్తారం, కమాన్పూర్ మండలాలకు చెందిన 2,389 స్వశక్తి మహిళా సంఘాలకు రూ.2.37 కోట్ల విలువైన వడ్డీ రాయితీ చెక్కులతోపాటు పలు పథకాలు, ప్రయోజనాలకు సంబంధించిన చెక్కులు, రుణాలు, ఆర్థికసాయాన్ని మంత్రి పంపిణీ చేశారు. అటవీ – మున్సిపల్ శాఖలు చేపట్టిన వనమహోత్సవంలో మొక్కలు నాటారు. అదనపు కలెక్టర్ వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, ఆర్డీవో సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు
పెద్దపల్లిరూరల్: రైతు సంక్షేమానికి కేంద్ర, రాష్ట్రర ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తూ అండగా నిలుస్తున్నాయని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్ అన్నారు. బ్రాహ్మణపల్లి రైతువేదికలో శనివారం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత నిధులను ప్రధాని నరేంద్రమోదీ విడుదల చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు. జిల్లాలోని 73,400 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.14.68కోట్లను కేంద్ర ప్రభుత్వం జమచేసిందని ఆయన అన్నారు. కేవీకే శాస్త్రవేత్తలు శ్రీనివాస్, వెంకన్న, నవ్య, ఏవో అలివేణి, ఏఈవోలు వినయ్, సువర్చల, పూర్ణచందర్, రచన, కల్పన, ప్రశాంత్ తదితరులు ఉన్నారు. -
ఆప్తమిత్రుడి స్ఫూర్తితో..
జగిత్యాల: స్నేహబంధం గొప్పది. ఆ బాండింగే వేరు. స్నేహితులు మంచి కోరుతుంటారు. సూచనలు ఇస్తుంటారు. నాకు కడలి జయకృష్ణ మంచి స్నేహితుడు. బీటెక్ పూర్తయ్యాక అమెరికా వెళ్లి స్థిరపడదామని అనుకున్న. జయకృష్ణ వాళ్ల అక్కయ్య ఢిల్లీలో సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నారు. ఆ సమయంలో జయకృష్ణ ఐఏఎస్కు ప్రిపేర్ కావాలని సలహాలు, సూచనలు ఇచ్చాడు. అమెరికాకు వెళ్లకుండా ఢిల్లీ వెళ్లి జయకృష్ణ వాళ్ల అక్కయ్య ప్రోత్సాహంతో సివిల్స్కు ప్రిపేర్ అయ్యాను. ఐఏఎస్ రావడంలో ఒకింత జయకృష్ణ పాత్ర ఉంది. ఐఏఎస్ అయిన తర్వాత ఎంతో మంది స్నేహితుల్లాగా కొలీగ్స్గా ఉంటారు. కానీ చిన్నతనంలో ఉన్న స్నేహితులను ఎప్పటికీ మరిచిపోం. – సత్యప్రసాద్, కలెక్టర్, జగిత్యాల -
గొర్రెల స్కాంపై విజిలెన్స్ విచారణ
పెద్దపల్లిరూరల్: బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలపై రాష్ట్రంలో విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు.. శనివారం జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పశు సంవర్ధక శాఖ కా ర్యాలయంలో విస్తృతంగా తనిఖీలు చేశారు. ల బ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేయడం, దాని రికార్డులు పరిశీలించారు. కొన్నింటిని జిరాక్స్ తీసుకుని వెంట తీసుకెళ్లినట్లు సమాచారం.మేడిపల్లి ఓసీపీ సందర్శన గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–1 పరిధిలోని మూసివేసిన మేడిపల్లి ఓసీపీని టీజీ ఎన్డీపీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి శనివారం సందర్శించారు. ఓసీపీలో చేపట్టిన పంపుడ్ స్టోరేజ్ హైడ్రో పవర్ప్రాజెక్ట్ గురించి వివరాలను సింగరేణి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్జీ –వన్ జీఎం లలిత్కుమార్ ప్రాజెక్టు వ్యూపాయింట్ వద్ద మ్యాప్ చూపించారు. పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ తరలింపు, ఖర్చు, గ్రిడ్ కనెక్టివిటీపై అధికారులతో చర్చించారు. అధికారులు ఆంజనేయప్రసాద్, జితేందర్సింగ్, రమేశ్, వీరారెడ్డి, మల్లికార్జున్ యాదవ్, గంగాధర్, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. రోడ్డుపైనే ఇసుక లారీలు ముత్తారం(మంథని): ఖమ్మంపల్లి – తాడిచెర్ల మానేరు క్వారీ నుంచి ఇసుక తరలించే లారీలు శనివారం రోడ్డుపైనే నిలిచాయి. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తి ప్రయాణికులు ఇబ్బంది ప డ్డారు. దుమ్ము, ధూళితో స్థానికులు అనారో గ్యం బారినపడుతున్నారు. రోడ్డుపై లారీలు ఎందుకు నిలుపుతున్నరని స్థానికులు ప్రశ్నిస్తే.. క్వారీ నిర్వాహకులు లారీల్లో ఇసుక నింపడం లేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ పేరిట అక్రమంగా వస్తున్న లారీల్లో ఇసుక నింపుతూ, రోజుల తరబడి వేచిఉన్న తమ లారీల్లో ఇసుక నింపడం లేదని డ్రైవర్లు ఆందోళన వ్య క్తం చేశారు. క్వారీ బాధ్యులు అదనంగా డబ్బు లు తీసుకుంటూ అక్రమంగా ఇసుక అమ్ముకుంటున్నారని డ్రైవర్లు ఆరోపించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. సక్సెస్ సాధించాలి మంథనిరూరల్: విద్యార్ధి దశలో విజయం సా ధించాలంటే ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకుసాగాలని జిల్లా విద్యాధికారి మాధవి సూ చించారు. ఎగ్లాస్పూర్ జెడ్పీ హైస్కూల్ను శనివారం ఆమె సందర్శించారు. తొలుత విద్యార్థులతో కలిసి ప్రార్థన చేశారు. అనంతరం మాట్లాడుతూ, విద్యార్థుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. పదోతరగతి పరీక్షల్లో వందశాతం మార్కులు సాధించేలా కష్టపడాలని డీఈవో సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం జి.జ్యోతి, ఉపాధ్యాయులు దొమ్మటి రవి, సంతోష్కుమార్, సుచిత్ర, శ్రీనివాస్, రాజశేఖర్, మంజుల పాల్గొన్నారు. తప్పుడు డీఎస్ఆర్ పంపించొద్దుధర్మారం(ధర్మపురి): గ్రా మ పంచాయతీ కార్యదర్శు లు డైలీ శానిటేషన్ రిపోర్టు(డీఎస్ఆర్) పంపిస్తే కఠిన చ ర్యలు తీసుకుంటామని జి ల్లా పంచాయతీ అధికారి వీ రబుచ్చయ్య హెచ్చరించా రు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 263 మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారని, ఇందులో ఆరుగురు తప్పుడు డీఎస్ఆర్ అప్లోడ్ చేశారని ప్రాథమి కంగా తేలిందని తెలిపారు. వీరికి షోకాజ్ నోటీసులు జారీచేశామన్నారు. గ్రామాల్లో చేపట్టే అ భివృద్ధి పనులపై 4 ఫొటోలు తీసుకుని ఆన్లైన్లో పారదర్శకంగా అప్లోడ్ చేయాలని సూ చించారు. జిల్లాలో పనిచేసే 1,485 మంది పా రిశుధ్య కార్మికులు ఉదయం 6 గంటలకే విధు లకు హాజరు కావాలని ఆదేశించారు. ట్రేడ్లైసెన్స్ లేని దుకాణాలను సీజ్ చేస్తామని హె చ్చరించారు. ఎంపీడీవో ప్రవీణ్కుమార్, మండల పంచాయతీ అధికారి రమేశ్ పాల్గొన్నారు. -
యువతలోనే నిర్లక్ష్యం
● సింగరేణిలో పెరుగుతున్న గైర్హాజరు ● భూగర్బ గనుల్లో చేసేందుకు విముఖత ● ఏడాదిలో వందమస్టర్లు చేయని ఉద్యోగులపై యాజమాన్యం దృష్టి ● కుటుంబ సభ్యులకు అధికారుల కౌన్సెలింగ్గోదావరిఖని: ఉద్యోగుల గైర్హాజర్పై సింగరేణి సీరియస్గా ఉంది. ఉద్యోగం లభించడమే కష్టమైన ప్రస్తుత పరిస్థితుల్లో విధులకు గైర్హాజర్ అవుతూ కొందరు ఉన్న ఉద్యోగానికి ఎసరుతెచ్చుకుంటున్నారు. ఇటీవల మహిళా ఉద్యోగులు కూడా భూగర్భగనుల్లోకి వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ, కొందరు యువ ఉద్యోగులు విధులకు గైర్హాజర్ కావడం ఆందోళన కలిగిస్తోంది. పెరిగిన యువత.. సింగరేణిలో యువ ఉద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది. గైర్హాజర్ కూడా అదే స్థాయిలో నమోదు అవుతోంది. యువతతో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగి సంస్థ మరింత వృద్ధి చెందుతుందని యాజమాన్యం భావించినా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంటోంది. రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు.. గతేడాది వంద మస్టర్లు నిండని, ఈఏడాది జూన్ వరకు 50 మస్టర్లు పూర్తిచేయని ఉద్యోగులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. కారుణ్య నియామకాలతో.. కారుణ్య నియామకాలతో యువ ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. మెడికల్ ఇన్వాలిడియేషన్ ద్వారా రైటర్ అయిన కార్మికుల స్థానంలో వారి వారసులకు ఉద్యోగలు వస్తున్నాయి. ఈక్రమంలో వీరి సంఖ్య ఇప్పటివరకు 16 వేలకుపైగా చేరింది. పాత తరం కార్మికులు బాగానే పనిచేస్తున్నా.. యువతఆశించిన మేరకు విధులకు హాజరు కావడం లేదని అధికారులు అంటున్నారు. ఉన్నత చదువులు చదివి భూ గర్భగనుల్లో పనిచేసేందు కొందరు నామోషీగా ఫీలవుతున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో ఏసీల కింద కూర్చుని అత్యధిక ప్యాకేజీలతో ఉల్లాసంగా బతికిన యువత.. బొగ్గు గనుల్లో పనులు చేసేందుకు ఉక్కి రిబిక్కిరవుతున్నారని అంటున్నారు. కష్టమైన పనులకు పురమాయిస్తే గైర్హాజరవుతున్నారు. పర్మినెంట్ పోస్టులకు ఎసరు.. సింగరేణిలో పర్మినెంట్ పోస్టుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. భూగర్భగనుల్లో సపోర్టింగ్, రూఫ్బోల్టింగ్, గనులపై క్యాంటీన్లలో పనిచేసే ఉద్యోగులు, కొన్నిచోట్ల క్యాంటీన్ల నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. పర్మినెంట్ కార్మికులు ఈ పనులు చేసేందుకు ఇష్టపడటం లేదు. మరోవైపు కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణ వేగంగా సాగుతోంది. కన్వేయన్స్ వాహనాలు, ఓబీ వెలికితీత, సివిల్, సివిక్ విభాగాల్లో ప్రైవేటీకరణ ఊపందుకుంది. మూడేళ్లలో వందలోపు మస్లర్లుంటే డిస్మిస్ గైర్హాజర్ కార్మికుల గురించి సింగరేణి మానవీ య కోణంలోనే వ్యవహరిస్తోంది. డ్యూటీలు తక్కువగా చేసే కార్మికుల కోసం ఏరియాల వారీగా కౌన్సెలింగ్ ఇస్తోంది. కుటుంబ సభ్యులతో సహా కౌన్సెలింగ్ ఇచ్చి.. సంతృప్తికరమైన సమాధానాలు చెప్పిన వారికి కొన్ని సడలింపులు ఇస్తోంది. అయితే, చాలామంది చిన్న కారణాలతోనే విధులకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఏరియా గైర్హాజర్ ఆర్జీ–1 118 ఆర్జీ–2 66 ఆర్జీ–3 14 ఏపీఏ 67 -
మా భూములు తీసుకుంటే బతికేదెట్లా?
● రత్నాపూర్ గ్రామస్తుల ఆగ్రహం ● ఇండస్ట్రియల్ పార్క్ వద్దని నిరసన రామగిరి(మంథని): ‘ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పా టు మా గ్రామంలోనే ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు..? మా జీవనధారమైన పార్క్ ఏర్పాటు చేయొద్దు’ అని పలువురు రైతులు పేర్కొన్నారు. రత్నాపూర్ గ్రామంలోని మేడిపల్లి శివారులో ఇండ స్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం 203.31 ఎకరాల భూ సేకరణ కోసం శుక్రవారం రత్నాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజాభిప్రా య సేకరణ చేపట్టారు. అభివృద్ధి పేరిట సింగరే ణి సుమారు 400 ఎకరాలు, కృషి విజ్ఞాన కేంద్రం పేరిట 170 ఎకరాలు ఇప్పటికే సేకరించారని, అభివృద్ధి పేరిట ఇప్పుడు మళ్లీ తమ భూములు లాక్కోవడం సమంజసం కాదని అన్నారు. విలు వైన భూములను తాము వదుకోలేమని పేర్కొ న్నారు. వ్యవసాయాన్ని నమ్ముకున్న తాము భూ ములు కోల్పోతే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. అయితే, కొందరు రైతు లు భూములు ఇచ్చేందుకు అంగీకరించి, కుటుంబసభ్యులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. మరోవైపు.. తమ భూములు ఇచ్చే ప్రస క్తే లేదని, మళ్లీ తమ ఊరికి రావొద్దని మహిళా రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో సభలో కాస్త గందరగోళం ఏర్పడింది. అయి తే, నివేదికను కలెక్టర్ అందజేస్తామని మంథని ఆర్డీవో సురేశ్ తెలిపారు. సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాద్రావు, ఎస్సైలు శ్రీనివాస్, దివ్య, ప్రసాద్, నరేశ్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. కరీంనగర్ టీజీ ఐఐసీ జనరల్ మేనేజర్ మహేశ్వర్, తహసీల్దార్ సుమన్, ఇండస్ట్రియల్ మేనేజర్ సురేశ్, గ్రామప్రత్యేకాధికారి శ్రీకాంత్, పంచాయతీ కార్యదర్శి సంతోష్ పాల్గొన్నారు. -
మంథనికి ఎల్ఈడీ వెలుగులు
మంథని: మున్సిపల్ పరిధిలోని పట్టణ ప్రవేశ ప్రధాన రహదారుల్లో ఇకనుంచిఎల్ఈడీ వెలుగులు విరజిమ్మనున్నాయి. పెద్దపల్లి – కాటారం మెయిన్ రోడ్డుతోపాటు గోదావరిఖని ప్రధాన రహదారికి ఇరువైపులా రూ.6 కోట్ల 70లక్షల వ్యయంతో సెంట్రల్ లైంటింగ్ సిస్టమ్, పాతపెట్రోల్ బంక్ కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. పెద్దపల్లి రోడ్డులో శ్రీరాంనగర్ నుంచి, కాటారం రోడ్డులో మతాశిశు ఆరోగ్య కేంద్రం నుంచి, గోదావరిఖని రోడ్డులో పోచమ్మవాడకు వెళ్లే పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి ఇలా.. పట్టణానికి ఇరువైపులా ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. అలాగే పోచమ్మవాడకు వెళ్లే ప్రధాన కూడలి, గంగాపురి, ఆర్టీసీ బస్డిపో సమీపంలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. పట్టణంలోకి ప్రవేశించే ప్రధానదారిలో రాత్రి వేళ చీకటి ఉండేది. నూతనంగా అమర్చిన ఎల్ఈడీ లైట్లతో ఆ సమస్య పరిష్కారం కానుంది. ట్రాఫిక్ సిగ్నల్స్తో సమస్యలకు చెక్.. పట్టణంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంది. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని పట్టణవాసులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పాతపెట్రోల్ బంక్ కూడలిలో రెండుచోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. బస్సుడిపో సమీపంలో, అంబేడ్కర్ కూడలి, శ్రీపాదచౌక్ ఏరియాలో సైతం ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. పైగా వాహనదారులు ఇష్టారీతిన వెళ్లడం, వాహనాలను ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేయడంతో పట్టణ ప్రజలకు తీవ్రఅసౌకర్యం కలుగుతోంది. ట్రాఫిక్ సమస్య ఉన్నప్రాంతాల్లో సిగ్నల్స్తోపాటు ట్రాఫిక్ కానిస్టేబుళ్లను నియమించాలని చేయాలని పట్టణ ప్రజలు కోరురుతున్నారు. కాగా మున్సిపల్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, ట్రాఫిక్ సిగ్నల్స్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు శనివారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రూ.6.70 కోట్లతో సెంట్రల్ లైటింగ్ .. ట్రాఫిక్ సిగ్నల్స్ నేడు ప్రారంభించనున్న మంత్రి శ్రీధర్బాబు -
వార్డు ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
కోల్సిటీ(రామగుండం): పౌరులకు మెరుగైన సే వలు అందేలా క్షేత్రస్థాయిలో పర్యటించాలని రా మగుండం నగరపాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఏ) అరుణశ్రీ వార్డు అధికారులకు సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం వార్డు అధికారులతో నిర్వహించిన సమీక్షలో కమిషనర్ మాట్లాడారు. పౌర సేవలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ వసూళ్లను లక్ష్యానికి అనుగుణంగా పెంచాలని కమిషనర్ ఆదేశించారు. మొండిబకాయల వసూళ్లకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందులో మంచి పనితీరు కనబరిస్తే 15వ ఆర్థిక సంఘం పెర్ఫార్మెన్స్ గ్రాంట్స్ కూడా నగరపాలక సంస్థకు మంజూరయ్యే అవకాశం ఉందని తెలిపారు. సమావేశంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఆర్వో ఆంజనేయులు, ఆర్ఐలు శంకర్రావు, ఖాజా, వార్డు అధికారులు పాల్గొన్నారు. పౌరులకు సేవలు అందించండి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ ఆదేశాలు -
చెత్త సేకరణలో నిర్లక్ష్యంపై నిరసన
● వినూత్న రీతిలో నిరసన తెలిపిన మహిళా మాజీ కార్పొరేటర్ ● అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆగ్రహంకోల్సిటీ(రామగుండం): తన డివిజన్లో చెత్త సే కరణలో నిర్లక్ష్యం వహిస్తున్న రామగుండం బల్ది యా అధికారుల తీరుపై మాజీ కార్పొరేటర్ నగు నూరి సుమలత శుక్రవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కొత్తగా 48వ డివిజన్గా మారిన ఆర్టీసీ కాలనీలో తానే స్వయంగా ద్విచక్ర వాహ నం నడుపుతూ ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించా రు. వాహనానికి ఇరువైపులా ప్లాస్టిక్ డబ్బాలు క ట్టి తడి, పొడి చెత్తను వేర్వేరుగా పోగుచేశారు. కా లనీకి దూరంగా తరలించి నిరసన వ్యక్తం చేశా రు. సుమలత మాట్లాడుతూ.. నెల రోజులుగా చెత్త సేకరించే ఆటోట్రాలీలు రావడం లేదన్నారు. డివిజన్కు కేటాయించిన రెండు ఆటోట్రాలీలను ఇతర ప్రాంతాలకు కేటాయించారని ఆరోపించా రు. ఇళ్లలో చెత్త పేరుకుపో దుర్వాసన వస్తోందని, దోమలు వృద్ధి చెంది అనారోగ్య సమస్యలు తలె త్తే ప్రమాదం ఆమె తెలిపారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లతోపాటు కమిషనర్, డిప్యూటీ కమిషనర్కు ఫిర్యాదు చేశామని, కలెక్టర్ ఫిర్యాదు చేసి నా స్పందన లేదని పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకుల డివిజన్లకు క్రమం తప్పకుండా ఆటోట్రాలీలను తరలిస్తున్న అధికారులు.. తన డివిజన్పై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని నిలదీశారు. ఫాగింగ్ కూడా చేపట్టడం లేదని, డ్రెయినేజీలు కంపుకొడుతున్నాయన్నారు. శానిటేషన్ సిబ్బంది స్పందించకుంటే రోజుకోతీరున నిరస న తెలుపుతానని ఆమె హెచ్చరించారు. కాగా, చెత్త సేకరణలో తలెత్తిన సమస్యలపై బల్దియా కమిషనర్ అరుణశ్రీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. బాధ్యులను సస్పెండ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం. -
ఏఐ టూల్స్ వినియోగంపై శ్రద్ధ
● కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచన పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తూనే.. ఏఐ టూల్స్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉపాధ్యాయులకు సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం రామగుండం మండల ఉపాధ్యాయులతో సమావేశమై పలు సూచనలు చేశారు. విద్యార్థులకు మరింత మెరుగైన విద్య అందించేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై ఉపాధ్యాయుల నుంచి సలహాలు, సూచలు అడిగి తెలుసుకున్నారు. ప్రైమరీ పాఠశాల విద్యార్థులు రోజూ 20 నిమిషాలపాటు హాజరయ్యేలా షెడ్యూల్ రూపొందించుకోవాలన్నారు. వచ్చే ఐదేళ్లలో అమల్లో ఉండేలా చూడాలన్నారు. తరగదిలో విద్యా బోధనలో విద్యార్థులను భాగస్వాములను చేయాలని అన్నారు. ఎఫ్ఆర్ఎస్ విధానంలో తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. సంపూర్ణ వివరాలను యూఐడైస్ పోర్టల్లో నమోదు చేయాలని, విద్యార్థులు వర్క్ బుక్ వినియోగించేలా చూడాలని ఆయన సూచించారు. డీఈవో మాధవితోపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మెరుగైన సేవలు అందించాలి సుల్తానాబాద్(పెద్దపల్లి): పేషెంట్లకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్, తహసీల్దార్ కార్యాలయాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూ చించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. భూభారతి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎంపీడీవో దివ్యదర్శన్రావు, తహసీల్దార్ బషీరొద్దీన్, పంచాయతీ అధికారి సమ్మిరెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ రమాదేవి, మున్సిపల్ కమిషనర్ రమేశ్, ఏఈ సచిన్, ఎంఈవో రాజయ్య, వ్యవసాయాధికారి నాగార్జున తదితరులు పాల్గొన్నారు. -
ఆహ్లాదం.. అధ్వానం
పెద్దపల్లి జిల్లాగా మారి సుమారు పదేళ్లు గడించింది. అయినా, పట్టణ రూపురేఖలు మారడం లేదు. ప్రధానంగా సుందరీ కరణకు ఆమడ దూరంలో ఉండిపోయింది. కొత్త ఉద్యానవనాల మాట దేవుడెరుగు.. ఉన్న పార్క్లు నిర్వహణ, పర్యవేక్షణ లోపంతో శిథిలావస్థకు చేరాయి. ఆటవిడుపు కోసం జిల్లా కేంద్రంలో అనేక ఉద్యానవనాలు ఉన్నాయని మున్సిపల్ సిబ్బంది, అధికారులు నిర్వహణ కోసం నిధులు వెచ్చిస్తున్నామని ఖర్చులు చూపుతున్నారని, పార్క్ల్లో ఆహ్లాదం ఎక్కడా కనిపించడం లేదని కొందరు మాజీ కౌన్సిలర్లు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని చంద్రకాకనగర్ తదితర ప్రాంతాల్లోని పిల్లల పార్క్ల దుస్థితి ఇది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
పర్యావరణ పరిరక్షణకు కృషి
రామగిరి(మంథని): గనుల విస్తరణ సందర్భంగా తలెత్తే సమస్యల నుంచి బయట పడేందుకు పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వ పర్యావరణ సలహాదారు, హైద రాబాద్ రీజియన్ శాస్త్రవేత్త కె.తరుణ్ కుమార్ సూచించారు. శుక్రవారం ఆర్జీ–3, ఏపీఏ ఏరియా లో పర్యటించారు. జీఎం కార్యాలయంలో ఎన్విరాన్మెంట్ జీఎంలు సుధాకర్రావు, నాగేశ్వరరా వు, సైదులుతో కలిసి సమీక్షించారు. జీడీకే–10 ఇంక్లయిన్, ఏపీఏ, ఓసీపీ–2 గనుల విస్తరణ సందర్భంగా తలెత్తే పర్యావరణ సమస్యలను పరిష్కరించాలన్నారు. ఎస్వోటూ జీఎం రామ్మోహన్, పీవోలు వెంకటరమణ, రాజశేఖర్ ఉన్నారు. -
భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమపూజలు
మంథని: పట్టణంలోని శ్రీకన్యకాపరమేశ్వరీ అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా 108 కిలోల కుంకుమతో అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 300 మంది ఆర్యవైశ్య మహిళలు పూజలకు హాజరయ్యారు. అదేవిధంగా మహాలక్ష్మీ, లలితాదేవీ తదితర దేవతామూర్తుల ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు ఎల్లంకి వంశీకృష్ణ, జిల్లా అధ్యక్షుడు నలమూసు ప్రభాకర్, ఆలయ కమిటీ అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్, మహిళా విభాగం అధ్యక్షురాలు రాచర్ల తిరుమల, రావికంటి మనోహర్, జయన్న, కిశోర్, నాగరాజు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. 5 నుంచి ఆదివరాహస్వామి జయంతి ఉత్సవాలు కమాన్పూర్(మంథని ): ప్రసిద్ధ శ్రీఆదివరా హస్వామి జయంతి ఉ త్సవాలు ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆ లయ ఈవో కాంతరెడ్డి, ప్రధాన అర్చకుడు కల కుంట్ల వరప్రసాద్ తెలిపారు. ఈనెల 5న ఆదివరాహ హవనం, 6న శ్రీభూఆదివరాహస్వామి కల్యాణం, 7న అష్టోత్తర శతఘటాభిషేకం, 108 కలశాలతో అభిషేకం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ముగిసిన రెస్క్యూ శిక్షణ గోదావరిఖని: మహిళా రెస్క్యూ రెండోబ్యాచ్ శిక్షణ శుక్రవారం ముగిసింది. ఆర్జీ–2 ఏరియా మెయిన్ రెస్క్యూ స్టేషన్లో 61రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తిచేసుకున్న అండర్ మేనేజర్లకు రెస్క్యూ జీఎం శ్రీనివాస్రెడ్డి సర్టిఫికెట్లు, డ్రెస్స్కోడ్ అందజేశారు. మై నింగ్ థియరీ, గ్యాస్, గ్యాస్ డిటెక్టర్స్, ఫస్ట్ ఎ యిడ్, రెస్క్యూ రికవరీ, ఫైర్ ఫైటింగ్, ఫైర్ ఎ గ్జిస్టర్, స్పెషలిజెడ్ ఎక్విప్మెంట్స్ తదితర అంశాలపై ప్రతినిధులకు శిక్షణ ఇచ్చారు. రెస్క్యూ సూపరిండెంట్ రాజేందర్రెడ్డి, ఇన్స్ట్రక్టర్లు కిషన్రావు, శ్రవణ్, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీలకు ‘మోడల్’ విద్యార్థుల ఎంపిక ధర్మారం(ధర్మపురి): స్థానిక మోడల్ స్కూల్(ఆదర్శ పాఠశాల) విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ ఈర వేని రాజ్కుమార్ తెలిపారు. గోదావరిఖనిలో ఇటీవల జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ఇంటర్ ఫస్టియర్కు చెందిన అఖిల 200 మీటర్లు, శ్రీజ 100 మీటర్లు, పందెం శ్రీవాణి 400 మీటర్లు, శరణ్య 200 మీటర్ల పరుగు పందంలో ప్రతిభ చూపారని పేర్కొన్నారు. అదేవిధంగా పదోతరగతి విద్యార్థి మనోజ్ఞ లాంగ్ జంప్, తొమ్మిదో తరగతి విద్యార్థి సౌజ్ఞశ్రీ 600 మీటర్లు, ఎనిమిదో తరగతి విద్యార్థి 100 మీటర్ల పరుగు పందెంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు వివరించారు. విద్యార్థులను ప్రిన్సిపాల్తోపాటు పీఈటీలు బైకని కొమురయ్య, మేకల సంజీవరావు తదితరులు అభినందించారు. ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్లో మరమ్మతులు పూర్తిఫెర్టిలైజర్సిటీ(రామగుండం): రామగుండం ఎరువుల కర్మాగారాన్ని(ఆర్ఎఫ్సీఎల్) శుక్రవా రం పునరుద్ధరించారు. జూలై 16న అమ్మో నియా పైప్లైన్ లీక్ కావడంతో ప్లాంట్ను షట్డౌన్ చేశారు. కర్మాగారంలో మరమ్మతులు పూర్తిచేయడంతో ప్లాంట్ను పునరుద్ధరించారు. మరోరెండు రోజుల్లో యూరియా ఉత్పత్తి ప్రారంభం అవుతుందని ఆర్ఎఫ్సీఎల్ అధికారులు తెలిపారు. ప్లాంట్ షట్డౌన్ కావడంతో సుమారు 69,300 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సుమారు రూ.600 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అధికారులు వివరించారు. -
అమ్మపాలు అమృతం
● నేటి నుంచి 7వరకు తల్లిపాల వారోత్సవాలు సుల్తానాబాద్(పెద్దపల్లి): అమ్మపాలు అమృతంతో సమానం. నవజాత శిశువులకు వెలకట్టలేని సంపద. పిల్లల ఆరోగ్యం, మనుగడ, పోషణ, అభివృద్ధితో పాటు తల్లి ఆరోగ్యానికీ తల్లిపాలే కీలకం. ఈ విషయాన్ని తల్లుల గుర్తిస్తేనే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. ఉరుకులు పరుగుల జీవితంతో కొందరు తల్లులకు పాలుపట్టే సమయం దొరకడంలేదు. తల్లిపాల విశిష్ఠత, ప్రాధాన్యం గురించి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు ఏటా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచి 7 వరకు వారోత్సవాలు నిర్వహించనున్నారు. జిల్లాలో.. జిల్లావ్యాప్తంగా 3 ఐసీడీఎస్ ప్రాజెక్టులు, 706 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయాకేంద్రాల పరిధిలో 3,902 మంది గర్భిణులు, 2,588 మంది బాలింతలు ఉన్నారు. వీరందరికీ మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నారు. కాగా, ముర్రుపాలు తాగిస్తేనే పిల్లల్లో రోగనిరోధకశక్తి పెరిగేందుకు వీలుంటుందని వైద్య ఆరోగ్యశాఖ, సీ్త్ర, శిశు సంక్షేమాధికారులు అవగాహన కల్పిస్తున్నా కొందరిలో మార్పు రావడంలేదు. అవగాహన కార్యక్రమాలు ఇలా.. ● బిడ్డపుట్టిన వెంటనే ముర్రుపాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడం. పిల్లల ఎదుగుదలకు పోషణ ప్రాధాన్యతను వివరించడం. ● గర్భిణుల ఇంటికి వెళ్లి ఆరోగ్య జాగ్రత్తలు సూచించడం. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందేలా చూడడం. 7–24 నెలల పిల్లలకు తల్లిపాలతో అదనంగా ఆహారం అందించాలని కుటుంబ సభ్యులకు వివరించడం. ● బాలింతలు, గర్భిణులకు కౌన్సెలింగ్ ఇవ్వడం. వారి వివరాలు పుస్తకంలో నమోదు చేయడం. ● ఆరునెలలలోపు చిన్నారులకు తల్లిపాలు అందుతున్నాయో లేదో తెలుసుకోవడం. తల్లిపాలె ఉత్తమమని సూచించడం. -
విద్యార్థుల్లో విద్యాప్రమాణాలు పెంచాలి
పెద్దపల్లిరూరల్: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లిలోని శాంతినగర్లో గల అంగన్వాడీ కేంద్రం, ప్రైమరీస్కూల్ను గురువారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యాప్రమాణాలు పెంచేలా ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలన్నారు. హైదరాబాద్ పబ్లిక్స్కూల్ ప్రవేశానికి.. హైదరాబాద్లోని బేగంపేట, రామంతపూర్ పబ్లిక్స్కూల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఈనెల 8లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. 1వ తరగతిలో చేరేందుకు ఎస్సీలకు రెండు సీట్లు కేటాయించారని, ఈనెల10న లాటరీ పద్ధతిన సీట్ల కేటాయి స్తారన్నారు. వివరాలకు కలెక్టరేట్లోని ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. లక్ష్యాలను పూర్తి చేయాలి పాలకుర్తి(రామగుండం): జిల్లావ్యాప్తంగా నవంబర్ చివరివరకు టీబీ పరీక్ష నిర్వహణ లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గురువారం పాలకుర్తి మండల పరిధిలోని బసంత్నగర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేశారు. ఓపీ రిజిస్టర్, రోజువారీ పేషెంట్ల వివరాలు పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్ సరళి, డాక్టర్ లక్ష్మీభవాని, సిబ్బంది ఉన్నారు. -
కుటుంబం కోసం శ్రమించినవారిని గౌరవించాలి
కోల్సిటీ(రామగుండం): ఉద్యోగ విరమణ ప్రయోజనాలను ఉద్యోగి ఆఖరి పని దినం రోజే అందజేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె.అరుణశ్రీ తెలిపారు. పబ్లిక్ హెల్త్ వర్కర్లుగా పని చేసి గురువారం ఉద్యోగ విరమణ పొందిన ఆవునూరి మల్ల య్య, రేణికుంట్ల పోచయ్య, కుమ్మరి రాయపోషమ్మను సన్మానించి మాట్లాడారు. ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఈఎల్(లీవ్ ఎన్క్యాష్మెంట్) ప్రయోజనం ప్రొసీడింగ్స్ అందిస్తున్నట్లు తెలిపారు. ఇంతకాలం కుటుంబం కోసం శ్రమించిన వారిని కుటుంబ సభ్యులు గౌరవంగా చూసుకోవాలన్నారు. కాగా, కమిషనర్ ఆదేశాల మేరకు సదరు ఉద్యోగులను తొలిసారి బల్దియాకు చెందిన కార్లలో వారి ఇంటికి గౌరవంగా సాగనంపిన తీరుపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్, ఏసీపీ శ్రీహరి, డీఈ జమీల్, ఏఈ మీర్, ఆర్ఓ ఆంజనేయులు, అకౌంట్స్ ఆఫీసర్ రాజు, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ తదితరులున్నారు. -
కొత్త కోర్సులు.. కాలేజీలు.. హాస్టళ్లు
● శాతవాహన యూనివర్సిటీ పరిధిలో అభివృద్ధి పనులు షురూ ● హుస్నాబాద్లో ఇంజినీరింగ్, క్యాంపస్లో లా కళాశాల ● ఎల్ఎండీ, క్యాంపస్లో ఎంసీఏ కోర్సు మంజూరు ● మూడు ఆడిటోరియంల ఆధునీకరణ ● ఫార్మసీ కాలేజీ, గోదావరిఖని క్యాంపస్ భూముల రక్షణకు ప్రహరీ ● మరో రెండు హాస్టళ్ల నిర్మాణానికి ఈ నెల 4న శంకుస్థాపనసాక్షిప్రతినిధి,కరీంనగర్: గత వైస్ చాన్స్లర్ హయాంలో అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన శాతవాహన యూనివర్సిటీ.. ఇప్పుడు అభివృద్ధి పథంలో అడుగులు వేస్తోంది. కొత్త కళాశాలలు, కోర్సులతో మరింత విస్తరిస్తోంది. శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్లర్గా ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన 9 నెలల్లోనే కొత్త కళాశాలలు, కోర్సులకు అనుమతులు పొందడంతోపాటు అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. జిల్లాకు చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో హుస్నాబాద్లో ఇంజినీరింగ్ కాలేజీ, క్యాంపస్లో లా కాలేజీతోపాటు ఫార్మసీ కాలేజీలో ఎంఫార్మసీ కోర్సు, క్యాంపస్లో ఎంసీఏ కోర్సు, అకడమిక్ బ్లాక్, రెండు కొత్త హాస్టళ్లు మంజూరయ్యాయి. ఇంజినీరింగ్, లా కాలేజీ నిర్వహణకు 120 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ‘బండి’ సహకారంతో లా కాలేజీకి గుర్తింపు ఎస్యూ క్యాంపస్లో మూడేళ్ల ఎల్ఎల్బీ, రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సులతో లా కాలేజీ ప్రారంభం కాబోతోంది. మూడేళ్ల లా కోర్సులో ఒక్కో సెక్షన్లో 60 అడ్మిషన్ల చొప్పున 120 సీట్లు(2 సెక్షన్లు), ఎల్ఎల్ఎం(ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లా)లో 20 సీట్లు మంజూరు చేశారు. లా కాలేజీలో బోధనకు 14 టీచింగ్, 19 నాన్ టీచింగ్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. లా కాలేజీకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) గుర్తింపు తప్పనిసరి కావడంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సహకారంతో అతి తక్కువ కాలంలో అనుమతులు లభించాయి. ఫార్మసీ కళాశాలకు మహర్దశ ఎల్ఎండీ సమీపంలోని ఫార్మసీ కళాశాలలో ఇ న్నాళ్లు బీఫార్మసీ కోర్సు మాత్రమే ఉండేది. తాజాగా ఎంఫార్మసీ ప్రారంభించేందుకు ఫార్మసీ కౌన్సిల్ ఆ ఫ్ ఇండియా అనుమతిచ్చింది. ఫార్మసీ కళాశాలలో పీఎం ఉష నిధులు రూ.7.28 కోట్లతో చేపట్టిన అకడమిక్ బ్లాక్ నిర్మాణ పనులకు గత నెల 22న మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావు శంకుస్థాపన చేశారు. ఫార్మసీ కళాశాల భూములు ఆక్రమణకు గురికాకుండా రూ.2.85 కోట్ల వర్సిటీ నిధులతో ప్రహరీ పనులు ప్రారంభించారు. సదుపాయాలకు పెద్దపీట వర్సిటీలో సదుపాయాలకు పెద్దపీట వేస్తున్నాం. కొత్తకాలేజీలు, హాస్టళ్లు, ఆడిటోరియాలు నిర్మిస్తున్నాం. క్యాంపస్లో శాతవాహన విగ్రహం ప్రతిష్టించనున్నాం. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు యూనివర్సిటీ విషయంలో సానుకూలంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. త్వరలో వర్సిటీకి న్యాక్ గుర్తింపు కోసం దరఖాస్తు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. – ఉమేశ్ కుమార్, వీసీ, శాతవాహన యూనివర్సిటీహుస్నాబాద్లో ఇంజినీరింగ్ కాలేజీ శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఈ విద్యాసంవత్సరంలో హుస్నాబాద్లో ఇంజినీరింగ్ కళాశాల ప్రారంభం కాబోతోంది. ఇందులో సీఎస్ఈ, ఈసీఈ, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు మంజూరు చేశారు. ఇందుకోసం 54 టీచింగ్ పోస్టులు, 33 నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు చేశారు. బీటెక్లో ఒక్కోబ్రాంచ్లో 60అడ్మిషన్ల చొప్పున 240 సీట్లకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఎప్సెట్ కౌన్సెలింగ్లో ఇప్పటికే 110మంది విద్యార్థులు రిపోర్ట్ చేశారు.మరెన్నో పనులు గోదావరిఖని పీజీ కాలేజీలో అకడమిక్ బ్లాక్, ప్రహరీ, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నుంచి ఎంబీఏ బ్లాక్ వరకు అప్రోచ్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ కళాశాలలో గతంలో ఉన్న పాత సెమినార్ హాల్ను సరికొత్త సీటింగ్, సౌండ్ సిస్టంతో ఆధునీకరించి మంత్రి పొన్నం చేతుల మీదుగా ప్రారంభించారు. కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజీ, ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ కాలేజీలో కొత్త కంప్యూటర్ ల్యాబ్, అన్ని డిపార్ట్మెంట్లు, ఫార్మసీ కాలేజీ, గోదావరిఖని పీజీ కాలేజీలో డిజిటల్ స్మార్ట్ క్లాస్రూమ్స్ ఏర్పాటు చేశారు.మరో రెండు కొత్త హాస్టళ్లు శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులకు మరో రెండు కొత్త హాస్టళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. యూనివర్సిటీలో అడ్మిషన్లు పెరుగుతున్న నేపథ్యంలో క్యాంపస్లో ఒకటి, ఫార్మసీ కాలేజీలో మరొకటి గర్ల్స్ హాస్టల్ నిర్మించాలని నిర్ణయించారు. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మంజూరు చేసిన రూ.20 కోట్ల నిధులతో ఈ హాస్టళ్ల పనులకు ఈ నెల 4న శంకుస్థాపన చేసేందుకు జిల్లా ఇన్చార్జీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను ఆహ్వానించినట్లు వీసీ ఉమేశ్ కుమార్ వెల్లడించారు. త్వరలో రూ.18 కోట్లతో లా కాలేజీతో పాటు, సెంట్రల్ లైబ్రరీలో సెమినార్ హాల్ ఆధునీకరణ, పరిపాలన భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న నూతన సెమినార్ హాల్ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. -
రోగనిరోధక శక్తి..
తల్లిపాలు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. శిశువును అనేకరకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. వారి మెదడు అభివృద్ధికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు తల్లిపాలలో పుష్కలంగా ఉంటాయి. – డా.అన్నప్రసన్నకుమారి, జిల్లా వైద్యాధికారిచైతన్యవంతం చేస్తున్నాం పిల్లలకు ముర్రుపాలు పట్టించేలా బాలింతలను చైతన్యవంతం చేస్తున్నాం. గర్భిణి మొదలు ప్రసవం అయ్యేవరకు ప్రభుత్వ ఆస్పత్రిలోనే సేవలు అందించి, తల్లీబిడ్డ క్షేమంపై ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధను వివరిస్తున్నం. – కొండూరి కవితగౌడ్, ఏఎన్ఎం, కాట్నపల్లి -
సివిల్ సెటిల్మెంట్
సాక్షి, పెద్దపల్లి: ‘ఇక్కడ భూపంచాయితీలు, సివిల్ కేసులు నమోదు చేసుకోం.. వివాదాలు పరిష్కరించబడవు.. అనే బోర్డులు ప్రతీ పోలీస్స్టేషన్లో కనిపిస్తుంటాయి. కాగా, సివిల్ కేసులు నమోదు చేసుకోరు.. కానీ, సెటిల్మెంట్ చేస్తారు’ అనే విధంగా జిల్లాలోని పలు ఠాణాల పోలీసులు వచ్చిన ప్రతీ సివిల్ కేసును అనధికారికంగా సెటిల్ చేస్తున్నారు. ఇరువర్గాల్లో ఏవరో ఒకరికి వంతపాడుతూ మిగితావారిని సెటిల్ చేసుకునేలా ఒప్పిస్తున్నారు. కొందరు పోలీసుల తీరు మొత్తం ఆ వ్యవస్థకే మచ్చతెస్తోంది. సామాన్యులు న్యాయం కోసం వెళ్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం మాని స్టేషన్లోనే పంచాయితీలు చేస్తున్నారు. విచారణ చేయకుండా ముడుపులు తీసుకుని పెదరాయుడి తీర్పులిస్తున్నారు.నిబంధనల ప్రకారంఒక స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తే అది సివిల్ కేసు అవుతుంది. దీన్ని కోర్టులో తేల్చుకోవాలి. అదే వ్యక్తి స్థలాన్ని ఆక్రమించే క్రమంలో కూల్చివేతలు, బెదిరింపులు, దాడులకు దిగితే అది క్రిమినల్ కేసు పరిధిలోకి వస్తుంది. సివిల్, క్రిమినల్ కేసుల మధ్య ఉన్న ఈ చిన్న విభజన రేఖ ఆధారంగా పోలీసులు భూపంచాయితీల్లో ఎంటర్ అవుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2009లో ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు సివిల్ వ్యవహారాల పర్యవేక్షణకు మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ 2010 నవంబర్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైనా ఆరోపణ, ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో 15రోజుల్లో విచారణ పూర్తి చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వులో స్పష్టం చేసింది. కానీ, కాలక్రమేణ ఇవన్నీ అటకెక్కిపోవడంతో ఠాణాల్లో సెటిల్మెంట్లు యథేచ్ఛగా కొనసాగతున్నాయి.సివిల్ కేసులంటేనే మక్కువఇటీవలి కాలంలో రియల్ఎస్టేట్ రంగం ఊపందుకుని ప్లాట్ల ధరలు పెరిగాయి. దీంతో ఎక్కువ మంది వ్యవసాయ భూములపైన పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ భూముల ధరలూ విపరీతంగా పెరుగుతున్నాయి. ధరలు పెరుగుతుంటే వాటికి సంబంధించిన వివాదాలు కూడా గతంలో కంటే రెట్టింపయ్యాయి. సాధారణంగా భూ లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో పోలీసులు కలుగజేసుకోకూడదు. కానీ, మెజారిటీ పోలీస్స్టేషన్లలో సివిల్ పంచాయితీల సెటిల్మెంట్లకు పోలీసులు ప్రాధాన్యం ఇస్తున్నారు. అర్ధ, అంగబలం ఉన్నవారితో మిలాఖత్ అవుతూ.. పేదలకు అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీస్స్టేషన్ పరిధిలో వచ్చే క్రైం, శాంతిభద్రత కేసుల కంటే భూపంచాయితీల కేసులపైనే ఖాకీలు మక్కువ చూపిస్తున్నారు. తమ పోస్టింగ్ కోసం రూ.లక్షలు వెచ్చిస్తుండడంతో, వాటిని భర్తీ చేసుకునేందుకు సివిల్ పంచాయితీల్లో తలదూరుస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.కఠిన చర్యలు తప్పవుభూతగాదాల్లో తలదూరిస్తే సదరు పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తప్పవు. ఈ విషయంలో ఇప్పటికే కచ్చితమైన ఆదేశాలు ఇచ్చాం. ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు బాధితులు ఫిర్యాదు చేస్తే విచారణ చేసి బాధ్యులైన అధికారులపై తప్పక చర్యలు తీసుకుంటాం.– కరుణాకర్, డీసీపీ, పెద్దపల్లి -
ఆయిల్పామ్ సాగుకు ముందుకు రావాలి
ధర్మారం(ధర్మపురి): లాభాసాటి దిగుబడి వస్తున్న ఆయిల్పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి జగన్మోహన్రెడ్డి కోరారు. గురువారం ధర్మారం మండలం పత్తిపాక, చామనపల్లి గ్రామాల్లోని రైతులు గంగం రాజేశ్వర్రెడ్డి, వేల్పుల కొమురయ్యకు చెందిన 7 ఎకరాల్లో ఆయిల్పామ్ మొక్కలు నాటారు. . మోతాదుకు మించి మందులు వాడరాదన్నారు. దేశంలో ఆయిల్పామ్ పంటకు ఉన్న డిమాండ్ మరే పంటలకు లేదని రైతులు ముందుకు వచ్చి సాగుచేయాలని సూచించారు. ఆయిల్ కంపెనీ సీఈవో కేశు కళ్యాణ్కర్, ఫీల్డ్ అధికారి మహేశ్ పాల్గొన్నారు. వినికిడి పరికరాలు అందజేతపెద్దపల్లిరూరల్: ఆర్బీఎస్కే వారి వైద్యపరీక్షల్లో వినికిడి లోపం ఉన్నట్టు గుర్తించిన 10మంది విద్యార్థులకు గురువారం డీఎంహెచ్వో అన్నప్రసన్నకుమారి వినికియంత్రాలను అందజేశారు. కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో అలీంకో ట్రస్ట్వారు పరికరాలు అందించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ముందుగానే తేదీలను ఖ రారు చేసి ఆ షెడ్యూల్ ప్రకారం ఆర్బీఎస్కే వై ద్యాధికారులు, సిబ్బంది వెళ్లి వారి ఆరోగ్యస్థితిగతులు తెలుసుకుని అవసరమైన సేవలందేలా చూడాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణలో కచ్చితంగా మునగ, కరివేపాకు చెట్లు పెంచా లని, వాటి ఆకులను వండే కూరలలో వేయాలన్నారు. సదరు ఆకులతో పోషకాలు మెండుగా అందుతాయన్నారు. ఆర్బీఎస్కే ప్రోగ్రాం అధికారి కిరణ్కుమార్ తదితరులున్నారు. మల్లన్న ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి ఎలిగేడు/ఓదెల: ఓదెల మల్లన్న ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే విజయరమణారావు పేర్కొన్నారు. మల్లన్న ఆలయ నూతన పాలకవర్గాన్ని ఎలిగేడు మండలం శివపల్లిలోని తన నివాసంలో సన్మానించి మాట్లాడారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య, సభ్యులు జంగం కొమురయ్య, కోదాటి మనోహర్రావు, జీలుక రవీందర్, కట్కూరి సమ్మిరెడ్డి, కొండ శ్రీనివాస్గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్, నాగపురి రవిగౌడ్, చీకట్ల మొండయ్య, తీర్థాల రాజారాం, వీరనేని రవి, ఉప్పుల శ్రావణ్కుమార్, గంటా రమేశ్, సామల యమునను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పాలక వర్గసభ్యులు సేవాభావంతో పనిచేస్తూ ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు, ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. బిల్లుల గోల్మాల్పై ఆందోళనముత్తారం(మంథని): మండలంలోని అడవిశ్రీరాంవూర్ జెడ్పీ పాఠశాలలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోవడం, సదరు బిల్లులు గోల్మాల్ అయ్యాయని గురువారం స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వివరాలు.. ముత్తారానికి చెందిన చేరాలు గతంలో జెడ్పీ పాఠశాలలో పని చేయగా, రూ.40వేలకు పైగా బిల్లులు ఇవ్వాలని పంచాయతీరాజ్ అధికారులు లిఖితపూర్వకంగా ఇచ్చినా, బిల్లులు చెల్లించడంలో హెచ్ఎం నిర్లక్ష్యం చేయడంపై స్థానికులు ఆందోళనకు దిగారు. పాఠశాలలో ఇప్పటికే అమ్మ ఆదర్శ కమిటీ కింద రూ.12లక్షల వరకు నిధులు డ్రా చేశారని ఆరోపించారు. అమ్మ ఆదర్శ కమిటీలో జరిగిన పనులు, నిధుల డ్రా పై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై హెచ్ఎం ఓదెలును వివరణ కోరగా, గతంలో పని చేసిన చేరాలుకు బిల్లు ఇవ్వాలని పీఆర్ అధికారులు రాసిచ్చిన విషయం వాస్తవమేనని, ప్రస్తుత అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ తన హయాంలో పనులు జరగలేదని, ఒప్పుకోవడం లేదన్నారు. చివరి బిల్లు రాగానే ఇస్తామని పేర్కొన్నారు. ఆందోళన చేసినవారిలో చేరాలు, పింగిలి దేవేందర్రెడ్డి, బిరుదు గట్టయ్య, భూపెల్లి మొగిళి, రవి, సది, మధుకర్, స్వామి తదితరులు ఉన్నారు. -
అవస్థల ప్రయాణం
పెద్దపల్లిరూరల్: నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీ గా ఉండే పెద్దపల్లి – కూనారం మ ధ్యలోని రైల్వే లె వల్ క్రాసింగ్ గేట్ కష్టాలు ప్రయాణికులకు నరకం చూపుతున్నాయి. దాదాపు మూడేళ్లుగా సా..గుతు న్న రైల్వే వంతెన పనుల్లో మరింత వేగం పెంచితేనే అవస్థల ప్రయాణానికి ముగింపు ఉంటుందని జిల్లావాసులు అభి ప్రాయపడుతున్నారు. జిల్లా కేంద్రమైన పెద్దపల్లి నుంచి కూనారం, కాల్వశ్రీరాంపూర్, పెగడపల్లి మీ దుగా హుజూరాబాద్, హన్మకొండ, మంథని ప్రాంతాలకు వెళ్లే ప్రజలు, వాహనదారులకు ఈ మార్గం ఎంతో ప్రయోజనకరంగా ఉండేలా ప్రభుత్వం రైల్వే వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రూ.119.50 కోట్లతో పనులు పెద్దపల్లి – కూనారం మార్గంలోని 39వ నంబరు రై ల్వే క్రాసింగ్ట్ వద్ద వంతెన పనులను రూ.119.50 కోట్ల అంచనా వ్యయంతో 10 అక్టోబర్ 2022 న ప్రారంభించారు. నిర్మాణం ప్రారంభించి దాదాపు మూడేళ్లు కావస్తున్నా.. ఇంక అసంపూర్తిగానే ఉంది. దీంతో ఈ ప్రాంత ప్రజలు, ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పనుల్లో మరింత వేగం పెంచి వీలైనంత త్వరగా పూర్తిచేసి వంతెనను అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. అప్రోచ్ రోడ్డుపై గుంతలు.. రైల్వేవంతెన పనులు చేపట్టిన ప్రాంతంలో వాహనాల రాకపోకల కోసం తాత్కాలికంగా మట్టితో నిర్మించిన రోడ్డు గుంతలమయమైంది. ప్రస్తుతం వానలు కురుస్తుండడంతో నీళ్లుచేరి కుంటలను తలపిస్తున్నాయి. బురదమయమైన గుంతల రోడ్డుపై అవస్థల ప్రయాణం సాగించాల్సి వస్తోందని వాహనదారులు, ప్రయాణికులు వాపోతున్నారు. గుంతలను గుర్తించక ప్రమాదాల బారిన పడిన సందర్భాలు కూడా లేకపోలేదు. అధికారులు స్పందించి కనీసం అప్రోచ్ రోడ్డుపై గుంతలు పూడ్పి వేయించాలని కోరుతున్నారు. ఎక్స్ప్రెస్, గూడ్స్ రైళ్ల రద్దీ ఖాజీపేట – బల్హార్ష సెక్షన్లోని ప్రధాన రైలు మా ర్గం కావడంతో ఎక్స్ప్రెస్, గూడ్స్ రైళ్ల రాకపోకలు అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతీ అరగంటకో రైలు వచ్చి పోతుండడం, ఒక్కోసారి వరుసగా రైళ్లు వస్తూ, పోతుండడంతో గంటల తరబడి గేట్ వేస్తున్నారు. దీంతో ట్రాక్కు ఇరువైపులా వాహనదారులు, ప్రయాణికులు నిరీక్షించాల్సి వ స్తోంది. దాదాపు చివరిదశకు చేరిన రైలు వంతెన పను లను వీలైనంత త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తేవా లని జిల్లావాసులు కోరుతున్నారు. రైల్వే వంతెన సమాచారం నిర్మాణం స్థలం 39వ నంబరు రైల్వేగేట్ మార్గం : పెద్దపల్లి – కూనారం మధ్య మంజూరైన నిధులు రూ.119.50 కోట్లు పనులు ప్రారంభమైన తేదీ 10 అక్టోబర్ 2022 రైల్వేగేట్ దాటేదెలా? సా.. గుతున్న వంతెన పనులు గుంతలమయమైన అప్రోచ్ రోడ్డు నరకం చూపుతున్న రాకపోకలు -
నగరంలో స్ట్రీట్బోర్డులు
● తొలిసారి ఏర్పాటుకు బల్దియా శ్రీకారం ● తొలగనున్న చిరునామా సమస్యలు ● రూ.50 లక్షలతో టెండర్ల ఆహ్వానం ● తొలివిడతలో 380 బోర్డులకు ఆర్డర్ ● స్టెయిన్లెస్ స్టీల్తో తయారీకోల్సిటీ(రామగుండం): రామగుండం నగరంలో చిరునామా తెలుసుకోవడం అంతసులువేమీకాదు. ఒకచోట నుంచి ఇంకోచోటకు వెళ్లాలన్నా.. కొత్తవారు పలానా ప్రదేశానికి పోవాలన్నా ప్రయాసే.. ఇట్లాంటి ఈ ఇబ్బందులను శాశ్వతంగా తొలగించేందుకు రామగుండం బల్దియా అధికారులు తొలి సారి స్ట్రీట్ సైన్ బోర్డుల(వీధి సూచిక బోర్డు) ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని మొత్తం 60 డివిజన్లలో కొత్తగా స్ట్రీట్సైన్ బోర్డులు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూందించారు. ఇటీవల నగరంలో 50 డివిజన్ల నుంచి 60 డివిజన్ల కు పెంచుతూ పునర్విభజన చేసిన విషయం విదిత మే. ఈనేపథ్యంలో కొత్త ప్రాంతాలు, ప్రదేశాలు, కూడళ్లను తెలుసుకోవడం కష్టతరంగా మారింది. డివిజన్ల వారీగా ప్రజలు సులభంగా చిరునామా తెలుసుకునేలా స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్తో స్ట్రీట్సైన్ బోర్డులు ఏర్పాటు చేయిస్తున్నారు. రూ.50లక్షలతో టెండర్.. రామగుండం నగరంలో స్ట్రీట్సైన్ బోర్డుల ఏర్పాటుకు 20 రోజుల క్రితం రూ.50లక్షల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచిన అధికారులు.. ఓ కాంట్రాక్టర్కు పనులు కూడా అప్పగించారు. తొలివిడతలో మొత్తం 380 స్ట్రీట్ సైన్బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వీటిని హైదరాబాద్లో తయారు చేయిస్తున్నారు. తొలగనున్న సమస్యలు.. రామగుండం బల్దియాలోని 60 డివిజన్లలో తొలిసారి ఏర్పాటు చేయనున్న స్ట్రీట్సైన్ బోర్డులతో కూడళ్లు, ముఖ్యమైన ప్రదేశాలు, దిశలను తెలుసుకోవడం అందరికీ సులభతరం కానుంది. వేములవాడ మున్సిపాలిటీలో ఇప్పటికే ఏర్పాటు చేసిన రెండు రకాల స్ట్రీట్సైన్ బోర్డుల తరహాలోనే రామగుండంలోనూ ఏర్పాటు చేయడానికి డిజైన్లను ఎంపిక చేశారు. ఈస్ట్రీట్సైన్ బోర్డులతో ఏ డివిజన్ ఎక్కడుంటుంది? ఆ డివిజన్లో ఏ ప్రాంతం ఉందనే సమాచారం సులభంగా తెలుసుకోవచ్చు. జంక్షన్లలో సైన్బోర్డులు.. ఒకటో డివిజన్ నుంచి 60వ డివిజన్ వరకు ఆయా డివిజన్ల పరిధిలోని వీధుల పేర్లు, కాలనీలు, ఇంటినంబర్లు, రోడ్డు నంబర్లు, కూడళ్లు, ముఖ్యమైన ప్రాంతాలు.. తదితర వివరాలను ఇప్పటికే బిల్కలెక్టర్ల ద్వారా బల్దియా టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్ విభా గం అధికారులు సేకరించారు. ఒక్కోడివిజన్ లో ఎక్కడెక్కడ సైన్ బోర్డులు పెట్టాలి? వాటి పై డివిజన్ల నంబర్లు, కాలనీల పేర్లతోపాటు ఎటువైపు ఏ ప్రాంతం ఉంటుందో తెలుసుకునేలా సూచికలు పొందుపర్చడానికి నివేదికలను సైతం తయారు చేసినట్లు తెలిసింది. దీనిఆధారంగా స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్తో స్ట్రీట్సైన్ బోర్డులను సిద్ధం చేస్తున్నారు. చిరునామా తెలుసుకోవడం సులభం కొత్తగా 60 డివిజన్లుగా ఏర్పడిన రామగుండం నగరంలో ప్రజలకు అడ్రస్ తెలుసుకోవడంలో ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో స్ట్రీట్ సైన్బోర్డులను ఏర్పాటు చేయిస్తున్నాం. కూడళ్లు, రోడ్లు, ముఖ్యమైన ప్రాంతాలు, ఇంటి నంబ ర్లను సైన్బోర్డులపై పొందుపరుస్తాం. 15రోజుల్లో సైన్బోర్డుల తయారీ పనులు పూర్తవుతాయి. వాటి ఏర్పాటులో సమస్యలు తలెత్తకుండా టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – అరుణశ్రీ, బల్దియా కమిషనర్, రామగుండం -
పనులు పూర్తిచేయాలి
రైల్వే వంతెన పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసి ప్రజల ఇబ్బందులను దూరం చేయాలి. ఈ వంతె న వినియోగంలోకి వస్తేనే అందరికీ మేలు కలుగుతుంది. పనులను పూర్తిచేయడంపై దృష్టి సారించాలి. – కనుకుంట్ల సదానందం, స్థానికుడు జాప్యం ఎందుకో? కేంద్ర ప్రభుత్వం ప్రజావసరాలను గుర్తించి రైల్వేవంతెన పనులకు నిధులు కేటాయించింది. మూడేళ్ల క్రితం మొదలైన పనులు పూర్తికావడం లేదు. అధికారులు పనుల్లో వేగం పెంచేలా చూసి రైల్వేగేట్ కష్టాలు తీర్చాలి. – జంగ చక్రధర్రెడ్డి, బీజేపీ నేత వినియోగంలోకి తేవాలి పెద్దపల్లి – కూనారం మధ్య చేపట్టిన రైల్వే వంతెన పనులు పూర్తయితేనే వాహనదారులు, ప్రజలకు మేలు కలుగుతుంది. పనులు దాదాపు చివరిదశకు వచ్చాయి. మిగిలిన పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసి వినియోగంలోకి తేవాలి. – బొడ్డుపల్లి శ్రీనివాస్, పెద్దపల్లి -
పరిహారం చెల్లించే వరకూ పనులు సాగనివ్వం
మంథనిరూరల్: సింగరేణి ఓసీపీ– 3 విస్తరణ కోస సర్వం కోల్పోతున్న తమకు పూర్తిస్థాయిలో పరిహా రం చెల్లించే వరకు పనులు సాగనివ్వమని అక్కెపల్లి గ్రామస్తులు హెచ్చరించారు. బుధవారం ఎల్ – 6 కాలువ కోసం సిద్దపల్లిలో సింగరేణి ఇళ్ల కూల్చివేత చేపట్టగా గ్రామస్తులు అడ్డుకున్నారు. 2015లో తమ గ్రామాన్ని స్వాధీనం చేసుకునేందుకు నిర్ణయిందని, పరిహారం చెల్లించడంలో జాప్యం చేస్తోందన్నారు. తొలిసారి చేపట్టిన సర్వే ఆధారంగా పరిహారం చె ల్లించకుండా ప్రైవేటుగా సర్వే చేయించి సగం పరిహారమే ఇచ్చిందన్నారు. తాము కోర్టుకు వెళ్తే.. తొమ్మిదేళ్ల తర్వాత తమకు అనుకూలంగానే తీర్పు వచ్చిందని, ఏడాది గడిచినా సింగరేణి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పూర్తిపరిహారం చెల్లించే వరకు పనులను అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. ఉన్నతాధికారులకు సమాచారం చేరవేసిన స్థానిక అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. పోలీసులు ఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. స్థానిక నాయకులు, నిర్వాసితులు పాల్గొన్నారు. -
‘గృహజ్యోతి’కి ఎడిట్ కష్టాలు
● ఆన్లైన్లో తప్పిదాలు ● యథేచ్ఛగా కరెంట్ బిల్లులు ● అయోమయంలో లబ్ధిదారులు రామగిరి(రామగుండం): ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం(జీరో కరెంట్ బిల్) కొందరు అర్హులకు అందడం లేదు. ప్రజాపాలన దరఖాస్తులను ఆన్లైన్ చేసే సమయంలో చోటుచేసుకున్న పొరపాట్లతో ఈ సమస్య తలెత్తింది. మరికొందరు వివిధ కారణాలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రజల నుంచి అధికారులు స్వీకరించిన దరఖాస్తులను ప్రజాపాలన పోర్టల్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేశారు. ఇలా నమోదు చేసే ప్రక్రియలో మీటర్ నంబర్లు తప్పు గా వేయడం, పథకానికి దరఖాస్తు చేసుకోలేదు(నాట్ ఆప్లైడ్) అని నమోదు చేయడంతో అర్హులైన పేదలు ఈ పథకానికి దూరమవుతున్నారు. చేతులెత్తేస్తున్న అధికారులు దరఖాస్తుదారులు మండల ప్రజాపరిషత్ కా ర్యాలయాలకు వెళ్లి ఎంపీడీవోల దృష్టికి సమస్య తీసుకెళ్లగా తమ చేతిలో ఏమీలేదంటున్నారు. ప్రజాపాలన ఆన్లైన్ పోర్టల్లో తమకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదని వారు చెబుతున్నారు. కొత్తగా కరెంట్ మీటర్ తీసుకున్న పేదలకు కూడా ఈ పథకం వర్తించడం లేదు. అమలుకు నోచుకోని హామీ దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. అది క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. అర్హులైన పేదలు కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారడం తప్ప పరిష్కారం లభించడం లేదు. అధికారులు స్పందించి ప్రజాపాలన పోర్టల్లో ఎడిట్ ఆప్షన్ ఇస్తేనే అర్హులైన పేదలకు ప్రభుత్వం అందించే పథకం వర్తిస్తుందని లబ్దిదారులు కొరుతున్నారు. -
మధ్యవర్తిత్వంతో సమస్యల పరిష్కారం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత పెద్దపల్లిరూరల్: చిన్నసమస్యలతో పంతాలు, పట్టింపులకు వెళ్లి వివాదాన్ని జటిలం చేసుకుని కోర్టుల వరకూ వెళ్లడం కన్నా మధ్యవర్తి సాయంతో అక్కడికక్కడే పరిష్కరించుకోవడం మేలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత సూ చించారు. జిల్లా కోర్టు ఆవరణలో బుధవారం మ ధ్యవర్తిత్వంపై నిర్వహించిన అవగాహన సదస్సు లో జడ్జి మాట్లాడారు. ఈ సందర్భంగా జడ్జి సునీ త, న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి స్వరూపరాణి, పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లకిడి భాస్కర్ తదితరులు ‘మధ్యవర్తిత్వం’ అంశానికి అనుకూలంగా సంతకాలు చేశారు. భార్యాభర్తలు చిన్న విషయాలకే పెద్దగొడవలు చేసుకుని విడిపోతున్నారని, అలాంటి సమస్యలను మధ్యవర్తి సమక్షంలో పరిష్కరించుకోవాలని జడ్జి సునీత సూచించారు. గతంలో తాను హైదరాబాద్లో పనిచేసినప్పుడు 32 జంటలకు ఇద్దరి అంగీకారంతో విడాకులు మంజూరు చేశానని జడ్జి సునీత గుర్తుచేశారు. విడిపోయిన భార్యాభర్తలు వేర్వేరుగా బాగానే ఉంటారని, కానీ వారిపిల్లల భవిష్యత్ను ఊహించడమే కష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్తి పంపకాల్లోనూ గజం స్థలం కోసం కూడా కోర్టుమెట్లెక్కిన వారుఉన్నారని, ఇలా చేయడంతో ఆర్థికంగా నష్టపోవడం, సమయం వృథా చేసుకోవడం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదని తెలిపారు. న్యాయవాదులు కూడా మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారాన్ని ప్రోత్సహించాలని జడ్జి సూచించారు. పెద్దపల్లి బార్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి శ్రీనివాస్, గవర్నమెంట్ ప్లీడర్ కిశోర్తోపాటు శ్రీధర్, రవీందర్, న్యాయవాదులు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు. -
డాబాపై కూరగాయల సాగు
జగిత్యాలఅగ్రికల్చర్: రసాయనాల నుంచి తప్పించుకునేందుకు చాలామంది పట్టణవాసులు ఇంటిపై.. ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశాల్లో కూరగాయలు పండించుకుంటున్నారు. తద్వారా ఆరోగ్యమైన ఆహారం పొందడంతోపాటు మనస్సుకు ఆనందం, ఆహ్లాదం అందించుకుంటున్నారు. గృహిణులు ఒకప్పుడు ఖాళీ ప్రదేశాల్లో పువ్వులు, అలంకరణ మొక్కలకు ప్రాధాన్యమిస్తే.. ఇప్పుడు రోజువారీ ఆహారంలో ఉపయోగించే ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. ● ఆహ్లాదకర వాతావరణంలో.. కూరగాయలు పండిస్తున్న రైతులు ఎక్కువగా క్రిమిసంహారక మందులు వినియోగిస్తుండటంతో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. కొందరు వ్యాధుల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. ఈ క్రమంలో ఎలాంటి రసాయనాలు లేకుండా.. ఇంటికి అవసరమైన కూరగాయలను ఇంటి డాబాపై, ఖాళీ ప్రదేశాల్లో పండించుకునేందుకు గృహిణులు ముందుకొస్తున్నారు. ఇంటి వాతావరణం మారిపోవడంతోపాటు చల్లని గాలి, పచ్చని మొక్కల మధ్య సేద తీరుతున్నారు. ● తేలికపాటి కుండీల ఎంపిక డాబాపై కూరగాయల పెంపకానికి తేలికపాటి కుండీలను ఎంపిక చేసుకుంటున్నారు. ప్లాస్టిక్ కుండీలు, పైబర్తో తయారు చేసిన గ్రోబ్యాగ్స్ ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ బకెట్లు, వాటర్ క్యాన్లు, సింక్ తొట్టీలు, పాత టైర్లు.. ఇలా అన్నింటిని కూరగాయల పెంపకానికి ఎంపిక చేసుకుంటున్నారు. నిటారుగా ఉండే అంతస్తుల కుండీలు, వేలాడేదీసే కుండీలను కూడా వాడుకోవచ్చు. ఇనుపకుండీలైతే మొక్క వేరు వ్యవస్థ దెబ్బతింటుంది. లోతు వేరు వ్యవస్థ గల మొక్కలకు ఎక్కువ లోతు కుండీలు.. తక్కువ వేరు వ్యవస్థ గల మొక్కలకు తక్కువ లోతు కుండీలను ఎంచుకోవాలి. బొప్పాయి, అరటి వంటి పెద్ద మొక్కలకు పెద్ద పరిమాణం గల ప్లాస్టిక్ డ్రమ్ములను ఉపయోగించవచ్చు. ● గ్రోబ్యాగ్స్ అనుకూలం గ్రో బ్యాగ్స్.. తక్కువ బరువు ఉండి, డాబాపై కూరగాయల పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. ఎంచుకున్న మొక్కలకు అనుగుణంగా గ్రోబ్యాగ్స్ వినియోగించాలి. మార్కెట్లో వివిధ పరిమాణాలు, ఆకారాల్లో దొరుకుతాయి. వీటిలో మట్టి పరిమాణం తక్కువ బరువు ఉండేలా చూసుకోవాలి. మట్టి మిశ్రమం అధికంగా ఉంటే డాబాపై బరువు పెరుగుతుంది. ఎర్రమట్టి, కోకోపీట్, పశువుల ఎరువు లేదా వర్మి కంపోస్టు వంటి తేలికపాటి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుని కుండీల్లో నింపాలి. మార్కెట్లో రెడీమేడ్ కుండీ మిశ్రమం కూడా దొరకుతోంది. మట్టి మిశ్రమాన్ని నింపేటప్పుడు పైభాగంలో కొంత ఖాళీ వదలాలి, ● మొక్కల ఎంపిక ప్రధానం డాబాపై మొక్కల పెంపకానికి కూరగాయల ఎంపిక ప్రధానం. కాలానుగుణంగా పండే కూరగాయలను ఎంపిక చేసుకోవాలి. శీతాకాలంలో దాదాపుగా అన్ని రకాల కూరగాయలను పండించవచ్చు. వేసవిలో క్యాబేజీ, కాలీప్లవర్, క్యారెట్, ఆలుగడ్డ మినహాయించి మిగతా కూరగాయలు పండించవచ్చు. తీగజాతి వాటికి పందిరి వేసుకోవాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి షేడ్నెట్ వేసుకోవాలి. ఈ పద్ధతిలో కుటుంబ అవసరాలకు అనుగుణంగా నాలుగు రకాల కూరగాయలు, రెండు లేదా మూడు రకాల ఆకుకూరలు పండించవచ్చు. ● నీటి యాజమాన్యం కీలకం దాబా తోటల్లో నీటిని క్యాన్ ద్వారా అందించవచ్చు. స్వయంగా మొక్క వయస్సు, ఎదుగుదలను బట్టి ఎంత నీరు అవసరముంటే అంత నీరు ఇవ్వవచ్చు. ఇంట్లోని వ్యర్థాల నుంచి కంపోస్టు తయారు చేసి మొక్కలకు పోషకాలు అందించవచ్చు. మొక్కల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి చీడపీడలు వస్తే చేతి ద్వారా తీసివేయవచ్చు. తీగజాతి కూరగాయల్లో పండు ఈగ వస్తే లింగాకర్షక బుట్టలు వాడి నివారించవచ్చు. ఎక్కువ చీడపీడలు వస్తే వేప నూనెను లీటర్ నీటికి 5 మి.లీ పిచికారీ చేస్తే సరిపోతుంది. రసాయనాలు లేని ఆకుకూరలు, కూరగాయలు అవగాహనతో ఆరోగ్యం కాపాడుకుంటున్న జనం కొన్నేళ్లుగా సాగు చేస్తున్న కొన్నేళ్లుగా ఇంటి పరిసరాలతోపాటు డాబాపై కూరగాయలు సాగు చేస్తున్నాను. మార్కెట్కు వెళ్లే అవసరం లేకుండాపోయింది. పూత నుంచి పిందె, కాత వరకు జరిగే చర్యలు కూడా ఆసక్తికరంగా ఉంటుండటంతో ప్రతిరోజు ప్రతి మొక్కనూ పరిశీలిస్తాను. – సముద్రాల జ్యోతి, గృహిణి, జగిత్యాల చాలా కూరగాయలు పెంచొచ్చు ఇంటి ఖాళీ ప్రదేశాలు, డాబాలపై కూరగాయలు పెంచుకోవచ్చు. ఆసక్తి గల గృహిణులు గ్రూపుగా ముందుకొస్తే ఉద్యానశాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తాం. కొత్తిమీర, పాలకూర వంటి ఆకుకూరలతోపాటు చిన్నపాటి సంచుల్లో టమాట, మిర్చి వంటి కూరగాయలు సాగు చేయవచ్చు. మా శాఖ తరఫున అవగాహన కల్పిస్తున్నాం. – స్వాతి, ఉద్యానశాఖాధికారి, జగిత్యాల -
ఏసీబీకి చిక్కిన పీఆర్ ఏఈ
జగిత్యాలక్రైం: ప్రభుత్వ పనులు చేపట్టిన సివిల్ కాంట్రాక్టర్కు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేసిన జగిత్యాల పంచాయతీ రాజ్ శాఖలో విజిలెన్స్ క్వాలిటీకంట్రోల్ విభాగం ఏఈ అనిల్ బుధవారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. కోరుట్ల మండలం చిన్నమెట్పల్లికి చెందిన పంచరి వెంకటేశ్ సవిల్ కాంట్రాక్టర్. ఐదేళ్ల క్రితం కోరుట్లలో రూ.13.80 లక్షలతో ఎల్లమ్మ (గౌడ) కమ్యునిటీ హాల్ నిర్మించాడు. ఎంబీ రికార్డు కూడా పూర్తయింది. అలాగే రెండేళ్ల క్రితం రూ.4.50 లక్షలతో చిన్నమెట్పల్లిలో హనుమాన్ కమ్యునిటీ హాల్ నిర్మించాడు. కోరుట్లలోని ఆర్డీవో కార్యాలయం ప్రహరీని రూ.5లక్షలతో పూర్తి చేసి ఎంబీ రికార్డు పూర్తి చేయించాడు. మొత్తం మూడు పనులను రూ.23.30లక్షలతో పూర్తి చేశాడు. వాటికి సంబంధించిన బిల్లుల కోసం ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని ఏఈ అనిల్కుమార్ను కొన్నాళ్లుగా కోరుతున్నాడు. రేపుమాపు అంటూ కాలం వెళ్లదీస్తూ వచ్చిన అనిల్.. గత శనివారం రూ.18 వేలు డిమాండ్ చేశాడు. దీనికి వెంకటేశ్ రూ.10 వేలు ఇచ్చేందుకు ఒప్పుకుని అదేరోజు రూ.3వేలు అడ్వాన్స్గా ఇచ్చాడు. అనంతరం ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారులు బుధవారం సాయంత్రం కరీంనగర్రోడ్లో ఉన్న పంచాయతీరాజ్ శాఖ విజిలెన్స్ క్వాలిటీ కంట్రోల్ కార్యాలయం వద్ద కాపుకాశారు. వెంకటేశ్ నుంచి అనిల్ రూ.7వేలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్ రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం అతడిపై కేసు నమోదు చేశారు. అనిల్ను కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలించారు. ప్రభుత్వ ఉద్యోగులెవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ఫ్రీ నంబరు 1064లో సంప్రదించాలని డీఎస్పీ వివరించారు. దాడుల్లో ఏసీబీ సీఐలు పున్నం చందర్, కృష్ణకుమార్, తిరుపతి, సిబ్బంది శ్రీకాంత్, విష్ణు, బాలు, మొగిలయ్య పాల్గొన్నారు. రూ.7వేలు లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టివేత క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్తో డబ్బుల డిమాండ్ ఏసీడీ డీఎస్పీ విజయ్కుమార్ వెల్లడి -
మతోన్మాదం రేపడమే బీజేపీ లక్ష్యం
సిరిసిల్లటౌన్: దేశంలో మతోన్మాదం రేపుతూ, ఓట్లు దండుకోవడమే బీజేపీ లక్ష్యమని కాంగ్రెస్ ఓబీసీ జాతీయ కన్వీనర్ వి.హన్మంతరావు అన్నారు. బీసీల కులగణన చేయాలని ఉద్యమిస్తున్న రాహుల్గాంధీ ఆకాంక్షను హర్షిస్తూ బుధవారం సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన అనంతరం మాట్లాడారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు కులగణన జరగలేదని, బీసీలకు అనేక బాధలు ఉన్నాయని, ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని తాము ప్రధాని మోదీని కోరినా పట్టించుకోలేదన్నారు. అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే బీసీ కులగణన జరగాలని రాహుల్గాంధీ ప్రగాఢంగా నమ్మి ఆ దిశగా ఉద్యమిస్తున్నారని, ఇందుకు అన్నివర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. దేశంలో యాభైశాతం రిజర్వేషన్ల సీలింగ్ ఎత్తివేస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తారని ఇది కేవలం కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. రాహుల్గాంధీ ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్రెడ్డి బీసీ డిక్లరేషన్కు తగ్గట్టుగా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలు ముస్లిం రిజర్వేషన్ను వ్యతిరేకిస్తూ హిందూదేశంగా మార్చాలని కుట్రపూరితంగా ఉన్నాయన్నారు. బీసీ కులగణన కోసం ఆగస్టులో జంతర్మంతర్ వద్ద జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, పీసీసీ కార్యవర్గ సభ్యుడు సంగీతం శ్రీనివాస్, గడ్డం నరసయ్య, ఆకునూరి బాలరాజు, సూర్య దేవరాజు, వెలుముల స్వరూపరెడ్డి, బొప్ప దేవయ్య, రాపల్లి కళ్యాణ్, గుండ్లపెళ్లి గౌతమ్, ఆడెపు చంద్రకళ, మడుపు శ్రీదేవి, కల్లూరి చందన తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఓబీసీ జాతీయ కన్వీనర్ హనుమంతరావు -
కాంట్రాక్టు కార్మికులపై పట్టింపేది?
● ఈఎస్ఐ సేవలకు దూరం ● పట్టించుకోని యాజమాన్యం, కార్మిక సంఘాలు గోదావరిఖని: సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీం ఆఫ్ ఇండియా(ఈఎస్ఐసీ) సౌకర్యం అందని ద్రాక్షే అవుతోంది. సంస్థలో సుమారు 35 వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. రామగుండం ప్రాంతంలోనే దాదా పు 10వేల మందికిపైగా పనిచేస్తున్నారు. వీరిలో కేవలం 600 మందికే ఈఎస్ఐ సౌకర్యం ఉంది. సింగరేణి యాజమాన్యం చొరవ చూపితేనే వీరు ఈఎస్ఐ సౌకర్యం పొందే వీలుంది. ఇలాంటి వారికే ఉచితంగా వైద్య సౌకర్యం అందుబాటులోకి వస్తాయి. ఏదైనా కారణంతో శాశ్వత అంగవైకల్యానికి గురైనా, మృతి చెందినా అనేక ప్రయోజనాలు వర్తిస్తాయి. అనేక విభాగాల్లో.. సింగరేణిలోని స్వీపింగ్, హౌస్కీపింగ్, తోటమాలి, సివిల్, సివిక్, సేల్ పిక్కింగ్, బెల్ట్ క్లీనింగ్, షాంప్లింగ్, కన్వేయన్స్ వాహనాలు.. ఇలా పలు విభాగాల్లో కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ప్రతినెలా ఒక్కోకార్మికుడికి రూ.21 వేల వేతనం ఉంటుంది. అయినా, వీరిని ఈఎస్ఐ సౌకర్యం వరించడంలేదు. ఈఎస్ఐసీ వ్యవీస్థీకృత రంగంలోని ఉద్యోగులకు సామాజిక, ఆర్థిక రక్షణ అందించే సామాజిక భద్రత పథకం. ఉద్యోగులకు అనారోగ్యం, ప్రసూతి, వైకల్యం, పని సమయంలో ప్రమాదాలతో ఏర్పడే గాయాలు, మృతి వంటివి సంభవిస్తే ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. ఉద్యోగులతోపాటు వారి కుటుంబ సభ్యులకూ ఉచిత వైద్యం అందిస్తుంది. వీరే అర్హులు.. పది లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు, కర్మాగారాలు, దుకాణాలు, కార్యాలయాల్లో ఆఫీసుల్లో పనిచేస్తూ నెలకు రూ.21 వేలు అంతకన్నా తక్కువ వేతనం ఉన్న వారు ఈఎస్ఐసీకి అర్హులు. ఇలాంటి వారిని ఈఎస్ఐసీ కింద నమోదు చేయడం సంస్థ యజమాని బాధ్యత. ఈపథకంలో చేరే ఉద్యోగి వేతనంలో 3.25శాతం యజమాని, 0.75శాతం ఉద్యోగి సమానమైన మొత్తాన్ని చందాగా జమచేస్తారు. మెటర్నిటీ బెనిఫిట్: ● 26 వారాల పాటు మెటర్నీటీ బెనిఫిట్ లభిస్తుంది. వైద్యుడి సలహాపై మరో నెల పొడిగించుకోవచ్చు. పూర్తి వేతనం వస్తుంది. తాత్కాలిక వైకల్యం: ● ఉద్యోగంలో ఉన్నప్పుడు గాయపడితే కాంట్రిబ్యూషన్తో సంబంధం లేకండా అంగవైకల్యం కొనసాగినంతకాలం వేతనంలో 90శాతం చెల్లిస్తారు. శాశ్వత అంగవైక్యం: మెడికల్ బోర్డు ధ్రువీకరణపై ప్రమాదంతో సంపాదన సామర్థ్యా ుఽన్ని కోల్పోయిన స్థాయిని బట్టి వేతనంలో 90శాతం ప్రయోజనం చెల్లిస్తారు. డిపెండెంట్ బెనిఫిట్: ఉద్యోగంలో గాయం లేదా వృత్తిపరంగా ప్రమాదంతో మరణం సంభవిస్తే ఉద్యోగిపై ఆధారపడిన వారికి జీతంలో 90శాతం డిపెండెంట్కి చెల్లిస్తారు. ఇతర ప్రయోజనాలు: ● ఉద్యోగి మరణిస్తే ఖర్మల కోసం రూ.15వేలు చెల్లిస్తారు ● ఈఎస్ఐ ఉన్న మహిళ లేదా సభ్యుడి భార్య.. ఈఎస్ఐ కింద తగిన వైద్య సేవలు అందుబాటులో లేనిప్రదేశంలో ఉంటే కన్ఫైన్మెంట్ ప్రయోజనాన్ని అందజేస్తారు. కమాన్పూర్ మండలం పిల్లిపల్లెకు చెందిన పిట్టల రమేశ్ సింగరేణి కాంట్రాక్టు కార్మికుడు. ఇటీవల ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచిపడి మృతి చెందాడు. దీంతో మృతుడి భార్యకు కార్మిక రాజ్యబీమా(ఈఎస్ఐ) సంస్థ ద్వారా ప్రతినెలా రూ.7,400 పింఛన్ మంజూరవుతోంది. కమాన్పూర్ ప్రాంతానికి చెందిన బండ అర్జయ్య సింగరేణి ఓసీపీ–1 జరిగిన పేలుడులో చనిపోయాడు. ఈఎస్ఐ సభ్యత్వం ఉండడంతో అతడి కుటుంబానికి ప్రతినెలా రూ.13,681 పింఛన్ వస్తోంది. వైద్య ప్రయోజనాలు.. కుటుంబసభ్యులకు కార్పొరేట్స్థాయి వైద్యం కాంట్రిబ్యూషన్తో సంబంధం లేకుండా అందరికీ ఒకేరకమైన వైద్యం చికిత్సకు అయ్యే ఖర్చుపై గరిష్ట పరిమితి లేదు రిటైర్డ్, శాశ్వత వికలాంగులు, జీవిత భాగస్వామ్యులకు టోకెన్ ప్రీమియం రూ.120 చెల్లింపుపై వైద్య సంరక్షణ వర్తిస్తుంది. అనారోగ్య ప్రయోజనాలు.. ధ్రువీకరించిన కొన్ని వ్యాధులకు సిక్లీవ్ తీసుకోవచ్చు ఏడాదిలో 91రోజుల పాటు ఈ సెలవులు తీసుకునే అవకాశం ఉంది అనారోగ్యకాలంలో సిక్ బెనిఫిట్ కింద నగదురూపంలో పరిహారం ఇస్తారు కార్మికుడి వేతనంలో 70శాతం చొప్పున పరిహారం ఉంటుంది ఈ ప్రయోజనం కోసం ఆర్నెల్లలో కనీసం 78రోజులు కాంట్రిబ్యూట్ చేయాలి రామగుండం ఈఎస్ఐ డిస్పెన్సనరీ పరిధిలో కాంట్రాక్టు కార్మికులు ఎన్టీపీసీ 9,600 రామగుండం బల్దియా 800 కేశోరాం 1,200 ఆర్ఎఫ్సీఎల్ 1,900 సింగరేణి 600 -
ట్రాక్టర్ యజమానుల బైండోవర్
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం నగునూరు వాగునుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న మహేశ్, అశోక్ను బుధవారం తహసీల్దార్ రాజేశ్ ఎదుట బైండోవర్ చేసినట్లు కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. మరోసారి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినట్లయితే రూ.లక్ష జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధించేలా సొంత పూచీకత్తుపై బైండోవర్ చేసినట్లు వివరించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. సెల్ఫోన్ అప్పగింత కరీంనగర్ గోదాంగడ్డకు చెందిన బోయిని రాజేశ్ పోగోట్టుకున్న సెల్ఫోన్ను సీఈఐఆర్ టెక్నాలజీ ద్వారా పట్టుకుని బుధవారం బాధితుడికి అప్పగించినట్లు సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. జనవరి 6న మొగ్ధుంపూర్లో రాజేశ్ సెల్ఫోన్ పోగొట్టుకోగా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీఈఐఆర్ టెక్నాలజీతో నిజామాబాద్లో గుర్తించి పట్టుకున్నట్లు వివరించారు. -
కొడుకు, కోడలు మధ్య మనస్పర్థలు
జూలపల్లి(పెద్దపల్లి): తన కొ డుకు, కోడలు మధ్య మనస్పర్థలు తలెత్తాయనే మనస్తాప ంతో జెన్కో ఉద్యోగి మేడుదుల రాజన్న (49) బుధవారం తను పనిచేస్తున్న జలవిద్యుత్ కేంద్ర ం లోనే ఉరివేసుకుని ఆత్మ హ త్య చేసుకున్నాడు. ఎస్సై సనత్కుమార్ కథనం ప్రకారం.. పెద్దపల్లికి చెందిన రా జన్న జూలపల్లి మండలం కాచాపూర్ 14వ మైలురా యి వద్ద గల జెన్కో జలవిద్యుత్ కేంద్రంలో జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఆయనకు కుమారుడు సాయికుమార్, ఒక కూతురు ఉన్నారు. సాయికుమార్ 2020లో మేకల కావ్యను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వారికి కుమారుడు(3) ఉన్నాడు. అయితే, ఎంబీఏ చదువుకునేందు కు సాయికుమార్ 2022లో యూకేకు వెళ్లాడు. ఆ త ర్వాత ఆయన భార్య కావ్య తనతల్లిదండ్రుల వద్దకు వెళ్లి అక్కడే ఉంటోంది. 2024లో ఇండియాకు తిరిగి వచ్చిన సాయికుమార్.. తన భార్యను కాపురానికి రమ్మని అనేకసార్లు కోరినా ఆమె తిరస్కరించింది. దీంతో వారి మధ్య మనస్పర్థలు ఏర్పడి పంచాయితీలు జరుగుతున్నాయి. ఈక్రమంలోనే తన కుమారుడి సంసారం సాఫీగా సాగడం లేదనే మనస్తాపానికి గురైన తండ్రి రాజన్న.. తను పనిచేస్తున్న జలవిద్యుత్ కేంద్రంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేశారు. మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య జలవిద్యుత్ కేంద్రంలో బలవన్మరణం -
3న ఎత్తిపోతల ప్రారంభం
రామగుండం: అంతర్గాం మండలం ముర్మూర్/బ్రహ్మణపల్లి శివారులో నిర్మించిన ఎత్తిపోతలను ప్రారంభించే విషయంపై ఎమ్మెల్యే మక్కాన్సింగ్ ఠాకూర్ బుధవారం కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలి సి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎత్తిపోతల ద్వా రా పాలకుర్తి, అంతర్గాం మండలాల పరిధిలోని సుమారు 20వేల ఎకరాల ఆయకట్టులో రెండు పంటలకు సాగు నీరు అందుతుందని ఠాకూర్ తెలిపారు. ఆగస్టు 3న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆర్డీవో గంగయ్య, అంతర్గాం తహసీల్దార్ రవీందర్పటేల్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, అంతర్గాం ఎస్సై వెంకటస్వామి పాల్గొన్నారు. విద్యార్థులు ఇష్టంతో చదవాలి జ్యోతినగర్/ఫెర్టిలైజర్సిటీ/పాలకుర్తి: విద్యార్థు లు ఇష్టంతో చదవాలని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ సూచించారు. సింగరేణి సీఎస్సార్ ద్వారా క్యూ ఆర్ కోడ్ ముద్రించిన బుక్స్ను టెన్త్క్లాస్ విద్యార్థులకు అందించి మాట్లాడారు. ఆర్జీ–1 జీఎం లలిత్ కుమార్, ఏసీపీ రమేశ్, ఎంఈవో మల్లేశం, హెచ్ఎం జయరాజ్ పాల్గొన్నారు. కాగా, గౌతమినగర్లోని ఓ స్కూల్ను ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ ప్రా రంభిచారు. పాలకుర్తి మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం బసంత్నగర్లోని అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ వర్కర్స్ క్లబ్లో నిర్వహించగా, ఎమ్మెల్యే మక్కాన్సింగ్ హాజరయ్యారు.● ఎమ్మెల్యే మక్కాన్సింగ్ -
సౌదీలో భూషణరావుపేట యువకుడు ఆత్మహత్య
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలం భూ షణరావుపేటకు చెందిన స ంగెం వినోద్ (30) సౌదీ అరేబియా దేశంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రా మస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన సంగెం గంగరా జం– సరోజన దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. వినోద్ పెద్ద కుమారుడు. ఆయన కొంతకాలంగా గల్ఫ్ దేశం వెళ్లి వస్తున్నా డు. ఏడాదిన్నర క్రితం సౌదీ వెళ్లాడు. ఈనెల 22న వినోద్ తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడి వారు కుటుంబసభ్యులకు బుధవారం ఫోన్లో సమాచారం ఇచ్చారు. వినోద్కు ఇంకా పెళ్లి కాలేదు. అతడి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని బంధువులు పేర్కొన్నారు. మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి పంపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని మృతుడి బంధువులు కోరుతున్నారు. భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదుజగిత్యాలక్రైం: భార్యను హత్య చేసిన భర్తకు జీ విత ఖైదుతోపాటు, రూ.2 వేల జరిమానా విధి స్తూ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి నారా యణ బుధవారం తీర్పునిచ్చారు. కోరుట్ల మండలం యెకిన్పూర్కు చెందిన ఎర్ర చంద్రయ్య, భార్య గంగరాజు కూలీలు. చంద్రయ్య మద్యాని కి బానిసై గంగరాజుతోపాటు కొడుకును వేధించేవాడు. 2022 అక్టోబర్ 29న ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం మత్తులో భార్యతో ఘర్షణ పడి ఆమెను హత్య చేసి.. ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకుని మృతదేహాన్ని మూ టకట్టి యెకిన్పూర్ శివారులో పడేశాడు. మృతురాలి కుమారుడు సుధీర్ ఫిర్యాదు మేరకు కోరుట్ల పోలీసులు కేసు నమోదు చేసి చంద్రయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు కోర్టులో సాక్షులను హాజరుపర్చారు. దీంతో చంద్రయ్యకు జడ్జి శిక్ష ఖరారు చేశారు. హాస్టల్ నుంచి పారిపోయిన విద్యార్థులు● స్థానికులు పట్టుకుని తిరిగి అప్పగింత మల్యాల: మండలకేంద్రం శివారులోని జగిత్యా ల అర్బన్ గురుకులం విద్యార్థులు హాస్టల్ గోడ దూకి పారిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురుకులాన్ని గతేడాది జగిత్యాల నుంచి మండలకేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్కు తరలించారు. ప్రస్తుతం ఇక్కడ 6, 7, 8 తరగతుల విద్యార్థులు 40మంది ఉన్నారు. ఈ ఏడా ది అడ్మిషన్ తీసుకున్న ఇద్దరు ఆరు, ఎనిమిదో తరగతి విద్యార్థులు సోమవారం రాత్రి హాస్టల్ గోడ దూకి పారిపోయారు. వారిని మండలకేంద్రంలో గుర్తించి తిరిగి వార్డెన్కు అప్పగించారు. హాస్టల్ వార్డెన్ విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి బుధవారం తల్లిదండ్రులకు అప్పగించారు. ఇరువర్గాలపై కేసు సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): భూ సమస్యపై గొడవపడగా ఇరువర్గాలపై కేసు నమోదు చే సిన ట్లు ఎస్సై శ్రావణ్కుమార్ తెలిపారు. ఎస్సై కథ నం ప్రకారం.. సుల్తానాబాద్ మండలం అల్లిపూ ర్ గ్రామానికి చెందిన ఏరుకొండ సరోజన, భర్త తిరుపతి, కరీంనగర్ జిల్లా చర్లబూత్కూర్కు చెందిన బుర్ర రేణుక, భర్త రాములు, అల్లిపూర్కు చెందిన బండ రాణి, భర్త భూమయ్య, రేగడిమద్దికుంటకు చెందిన ముంజాల అశోక్, ఏరుకొండ వినోద్తోపాటు మరోవర్గం ముంజల శ్యామల, భర్త సతీశ్ భూసమస్యపై మంగళవారం గొడవ పడ్డారు. ఇదేసమయంలో పెట్రోలింగ్కు వెళ్లిన బ్లూకోల్ట్స్ సిబ్బంది వారిని సముదాయించినా వినకుండా పోలీస్స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. బుధవారం ఇరువర్గాలను సీఐ సు బ్బారెడ్డి ఠాణాకు పిలిపించి నోటీసులు అందించారు. గొడవ పడొద్దని కౌన్సెలింగ్ ఇస్తుండగా, ఏరుకొండ వినోద్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించి, అసభ్యపదజాలంతో దూషించాడు. దీంతో వినోద్పై కేసు నమోదు చేశారు. ఈ విషయ మై సీఐని సంప్రదించగా భూసమస్యపై ఇరువర్గాల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. -
నమ్మించి.. గొంతుకోసి
● వృద్ధురాలిపై మహిళ హత్యాయత్నం ● బంగారం, నగదు కోసం ఘాతుకం సైదాపూర్: ‘నా భర్తతో గొడవ జరిగింది. ఈ రాత్రికి మీ ఇంట్లో పడుకుంటాను’ అంటూ ఓ వృద్ధురాలిని నమ్మించింది. వృద్ధురాలు నిద్రపోయాక, హత్యాయత్నం చేసింది. ఆపై బంగారం, నగదుతో ఉడాయించిందో మహిళ. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూర్లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధితురాలి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రావుల ప్రమీల(70) ఒంటరిగా ఉంటోంది. పెద్ద కొడుకు రావుల రాజిరెడ్డి కరీంనగర్లో, చిన్న కొడుకు దేవేందర్రెడ్డి సిద్దిపేటలో నివాసం ఉంటున్నారు. ఇదే గ్రామానికి చెందిన మిట్టపల్లి స్వరూప(50) మంగళవారం మధ్యాహ్నం నుంచి ప్రమీల ఇంటికి తరుచూ వచ్చి మాట్లాడుతోంది. రాత్రి పూట కూడా వచ్చింది. భర్తతో గొడవ జరిగిందని, రాత్రికి మీ ఇంట్లోనే పడుకుంటానని నమ్మబలికింది. ప్రమీల నిద్రపోయిన తర్వాత దిండుతో ముఖంపై అదిమిపట్టింది. కత్తితో గొంతు, శరీరభాగాలపై గాయపరిచింది. చనిపోయిందని అనుకుని వృద్ధురాలిపై ఉన్న బంగారం, నగదుతో పారిపోయింది. బుధవారం వేకువజామున స్పృహ వచ్చిన ప్రమీల చిన్న కొడుకు దేవేందర్రెడ్డికి ఫోన్చేసి విషయం చెప్పింది. వెంటనే ఇంటికి వచ్చిన కొడుకులిద్దరూ వృద్ధురాలిని ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితురాలు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
వాసవీమాతకు అభిషేకాలు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): స్థానిక శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరీ అమ్మవారి ఆలయంలో ఆ ర్యవైశ్య సంఘం నేతృత్వంలో శ్రావణమాసం సందర్భంగా బుధవారం ప్రత్యేకపూజలు చేశా రు. పంచామృతాలతో అభిషేకాలు, పసుపుకొమ్ములతో కుంకుమ పూజలు చేశారు. సింగరేణి ఆస్పత్రికి వైద్యనిపుణుల రాకగోదావరిఖని: హైదరాబాద్లోని కేర్ ఆస్పత్రికి చెందిన సూపర్ స్పెషాలిటీ వైద్యులు వచ్చే నెల 3న గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రికి రానున్నట్లు ఆర్జీ –1 అధికార ప్రతినిధి రవీందర్రెడ్డి తెలిపారు. కార్డియాలజీ, న్యూరాలజీ, మెడికల్ గ్యాస్ట్రోలజిస్ట్, యూరోలజీ నిపుణులు ఇందులో ఉంటారని పేర్కొన్నారు. సింగరేణి ఉద్యోగులు, వారికుటుంబ సభ్యులు ఈనెల 31 నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు సింగరేణి ఏరియా ఆస్పత్రిలో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు. రైతు సంక్షేమమే లక్ష్యం మంథని: రైతుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని మంథని మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న అన్నారు. బుధవారం స్థానిక ఏ ఎంసీ కార్యాలయంలో చైర్మన్ కుడుదుల వెంక న్న, వైస్ చైర్మన్ ముస్కుల ప్రశాంత్రెడ్డితోపా టు పాలకవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభు త్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నా రు. అనంతరం పదవీ బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకు లు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు శా లువాలు, పూలమాలలతో సన్మానించారు. స్కూల్ బస్సుల్లో సీసీ కెమెరాలు బిగించాలిగోదావరిఖనిటౌన్: పాఠశాల, కళాశాల బస్సు ల్లో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ సూచించారు. నగరంలోని అ డ్డగుంటపల్లిలో బుధవారం సబ్ డివిజన్లోని పాఠశాలు, కళాశాలల యజమానులు, బస్సు డ్రైవర్లతో సదస్సు నిర్వహించారు. డ్రైవర్లు పొ రపాటు చేసినా స్కూల్ యాజమాన్యమే బా ధ్యత వహించాలన్నారు. నైపుణ్యం కలిగిన డ్రై వర్లనే నియమించుకోవాలని యాజమాన్యాలకుసూచించారు. సీట్లకు సరిపడా విద్యార్థులనే తరలించాలని పేర్కొన్నారు. ఏసీపీ రమేశ్, సీఐ లు ఇంద్రసేనారెడ్డి, ప్రసాదరావు, రాజు, రాజేశ్వరరావు, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ మధు, ఎస్సైలు రమేశ్, భూమేశ్, అనూ ష, ఉదయ్కిరణ్, సంధ్యారాణి, వెంకటేశ్, ప్రసాద్, శ్రీనివాస్, రమేశ్, నరేశ్ పాల్గొన్నారు. నిరంతరం విషయ పరిజ్ఞానం నేర్చుకోవాలి రామగిరి(మంథని): లక్ష్యం, విజయం సాధించేందుకు విషయపరిజ్ఞానాన్ని నిరంతరం నే ర్చుకుంటూనే ఉండాలని గ్లోబల్ స్పీకర్, కార్పొరేట్ ట్రెయినర్ వేముకంటి రమేశ్ అన్నారు. మంథని జేఎన్టీయూలో బీ టెక్ ఎ రివార్డింగ్ క్యారియర్ అంశంపై బుధవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్, సమయపాలన, మోటివేషన్ లాంటి అంశాలపై ఆయన సుదీర్ఘంగా వివరించారు. సబ్జెక్టుల పరిజ్ఞానం, జనరల్ స్టడీస్, ప్రొడక్ట్, మార్కెట్, మారుతున్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్పై అవగాహన పెంచుకోవాలని ఆ యన సూచించారు. నిత్యం ఏదోఒక ఆట కనీ సం గంటసేపైనా ఆడాలని, తద్వారానే శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం లభిస్తుందన్నారు. ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్, వైస్ ప్రిన్సిపాల్ ఉదయకుమార్ తదితరులు పాల్గొన్నారు.