Peddapalli District News
-
క్రికెట్ కిట్ కొన్నాను
సమ్మర్ హాలీడేస్ అంటే నాకు చాలా ఇష్టం. ఈసారి నేను క్రికెట్ బ్యాట్, బాల్, కిట్ కొన్నాను. మా ఫ్రెండ్స్తో ప్రతి రోజు ఆడుకుంటున్నాను. టీవీ, మొబైల్ కంటే గ్రౌండ్లో ఆడటం బాగుంటుంది. ఈవినింగ్ క్రికెట్లో కోచింగ్ కూడా తీసుకుంటున్నాను. – హర్ష నాకు బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం. ఈ సమ్మర్లో పేరెంట్స్ కొత్త రాకెట్ కొనిపెట్టారు. మా కాలనీలో ఫ్రెండ్స్తో కలిసి ఆడుతున్నాం. ఇలా ఆడడం ద్వారా చాలా యాక్టివ్గా ఉంటున్నాను. స్కూల్ మొదలయ్యాక కూడా ఈవినింగ్ ఆడుతాం. – ఆవంతిక -
గంజాయి రవాణా కేసులో ఐదుగురి అరెస్టు
జ్యోతినగర్: గంజాయిని రవాణా చేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు డీసీపీ రాంరెడ్డి తెలిపారు. శుక్రవారం ఎన్టీపీసీ పోలీస్స్టేషన్లో గోదావరిఖని ఏసీపీ రమేశ్, రామగుండం సీఐ కృష్ణకుమార్, ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్కిరణ్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తేన్నారనే సమాచారంతో ఎస్సై ఆధ్వర్వంలో ఎన్టీపీసీ ప్రాజెక్టు లేబర్ గేట్ రాజీవ్ రహదారిపై తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానస్పదంగా వస్తున్న కారును ఆపి తనిఖీ చేయగాఅం గంజాయి ప్యాకెట్లు లభించాయి. ఒడిశాలోని చిత్రగొండలో కొనుగోలు చేసి హైదరాబాద్లో విక్రయించేందుకు తీసుకెళ్తున్నారని విచారణలో తేలింది. ఈమేరకు మల్కాన్గిరి జిల్లాకు చెందిన రాజేశ్కుమార్ నాయక్, ఎస్.బషీర్, చైతన్య మాడి, గౌతమ్ రాయ్, సిద్ధార్థ రంజన్ దాస్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 12 కేజీల గంజాయితో పాటు కారు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాదారులను చాకచక్యంతో పట్టుకున్న పోలీసు సిబ్బందికి రివార్డులు అందజేయనున్నారు. గంజాయి పట్టివేత గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని కోదండరామాలయం సమీపంలో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఇద్దరిని పట్టుకున్నట్లు వన్టౌన్ ఎస్సై రమేశ్ తెలిపారు. స్థానిక కల్యాణ్నగర్కు చెందిన బండోజు సాయిసంతోష్, హనుమాన్నగర్కు చెందిన ఎస్కే అఖిల్ను పట్టుకుని వారినుంచి రూ.3వేల విలువైన 64గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఎస్సై ఫిర్యాదు మేరక సీఐ ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసుకున్నారు. 12 కేజీల గంజాయి, కారు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి -
చెరువులో స్నానానికి వెళ్లి వ్యక్తి మృతి
రాయికల్(జగిత్యాల): రా యికల్ ఇందిరానగర్కు చెందిన హమలీ కార్మికుడు సందెళ్ల శేఖర్ (27) చెరువులో స్నానం చేసేందుకు వెళ్లి ఊ పిరాడక మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. శేఖర్ తోటి హమాలీలతో కలిసి శుక్రవారం పెద్ద చెరువు వద్ద విందు ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం స్నానం చేసేందుకు శేఖర్ మద్యం మత్తులో చెరువులోకి వెళ్లగా ఈత వచ్చినప్పటికీ ఊపిరాడక మృతిచెందాడు. మృతుడికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై దేవేందర్నాయక్ తెలిపారు. -
నా విహార యాత్ర
నా పేరు సాత్విక్. నేను సచ్ దేవా పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ఇటీవల నేను వైజాగ్, అరకు లోయలను సందర్శించాను. ఈ యాత్ర నాకు ఎంతో ఆనందం, కొత్త అనుభవాలను ఇచ్చింది. మొదట మేము ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వెళ్లాం. అక్కడ సముద్రపు అలలు, కెరటాలు ఎంతో ఆకట్టుకున్నాయి. సముద్ర తీరంలో నీళ్లలో ఆడుతూ చాలా సరదాగా గడిపాను. అక్కడి ప్రకృతి అందాలు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. తర్వాత మేము అరకు లోయను సందర్శించాం. అరకు లోయలోని పచ్చని కొండలు, చల్లని వాతావరణం ఎంతో అద్భుతంగా అనిపించాయి. ముఖ్యంగా కొండలపైకి వెళ్లి కిందికి చూస్తే మేఘాలు ఆకాశం నుంచి కిందికి దిగివచ్చినట్టుగా కనిపించాయి. ఆ దృశ్యం నా మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అలాగే గిరిజన గ్రామదర్శిని ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. అక్కడి గిరిజనుల సంప్రదాయ వస్త్రధారణ చాలా ఆకట్టుకుంది. నేను కూడా వారిలా అలంకరించుకొని ఫొటోలు దిగాను. ఆ అనుభవం చాలా కొత్తగా, ఆనందంగా అనిపించింది. మేము ట్రైబల్ మ్యూజియం, చాపరాయి, చాక్లెట్ ఫ్యాక్టరీ, ఉడెన్ బ్రిడ్జ్, బొర్రా గుహలు వంటి అనేక పర్యాటక ప్రదేశాలను సందర్శించాం. ఈ పర్యటన ద్వారా నాకు ప్రకృతి అందాలు, గిరిజన సంస్కృతి, కొత్త ప్రాంతాల విశేషాలు తెలుసుకున్నాను. ఈ యాత్ర నాకు జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోతుంది. –పేరు: కె. సాత్విక్ పాఠశాల: సచిదేవా స్కూల్. ఊరు: గోదావరిఖని , జిల్లా: పెద్దపల్లి -
అమ్మకాలు పెరిగాయి
ఈ సమ్మర్లో స్పోర్ట్స్ సామగ్రి అమ్మకాలు పెరిగాయి. ముఖ్యంగా క్రికెట్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ కిట్స్కు డిమాండ్ ఉంది. చిన్నారులు ఎక్కువగా తక్కువ ధరలో ఉండే కిట్స్ కొంటున్నారు. ప్రతీ రోజు షాపులో రద్దీ కనిపిస్తోంది. గతేడాది కంటే ఈసారి వ్యాపారం బాగుంది. – నాగిరెడ్డి సిధారెడ్డి, స్పోర్ట్స్ సెంటర్ నిర్వాహకుడు సమ్మర్ క్యాంప్స్తో అమ్మకాలు పెరిగాయి. క్యాంప్కు వచ్చే పిల్ల లు కిట్ కొంటున్నారు. స్విమ్మింగ్, క్యారమ్, చెస్, కరాటే స్పోర్ట్స్ కిట్స్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. తల్లిదండ్రులు కూడా క్వాలిటీ వస్తువులే కొంటున్నారు. ఈ సీజన్ బిజినెస్ బిజీగా ఉంటుంది. – బుర్ర పవన్, స్పోర్ట్స్ సెంటర్ నిర్వాహకుడు -
చివరి ఉత్తరం
● రాజమహేంద్రవరం గోదావరి గట్టుమీద పాత పోస్టాఫీసు ఉంది. అక్కడ రామయ్య తాత 40 ఏళ్లు పోస్ట్మ్యాన్గా పనిచేశాడు. రిటైర్ అయ్యాక కూడా ప్రతీ రోజు ఉదయం ఆ పోస్టాఫీసు మెట్ల మీద కూర్చుని గోదావరి చూసేవాడు. ● ఒకరోజు ఉదయం తాత చేతిలో పసుపు పచ్చని పాత కవరు పడింది. చిరునామా మసకబారింది. ‘కమల, శారద నిలయం, రాజమహేంద్రవరం’ అని మాత్రమే కనిపించింది. పంపిన వాడి పేరు ‘మోహన్, ముంబాయి’. తేదీ 1987. ● తాతకు గుర్తు వచ్చింది. మోహన్, కమల కాలేజీ ప్రేమ. మోహన్ ముంబాయి ఉద్యోగానికి వెళ్లాడు. కమల తండ్రి పెళ్లి కుదిర్చేశాడు. ఆ తర్వాత వాళ్లు కనిపించలేదు. ● తాత వెంటనే శారద నిలయం వెతుక్కుంటూ వెళ్లాడు. అక్కడ 70 ఏళ్ల కమల అమ్మమ్మ ఒంటరిగా ఉంది. తాత ఆ కవరు చేతిలో పెట్టాడు. ఆమె చేతులు వణికాయి. ● ‘ఇది మోహన్ చివరి ఉత్తరం. నా పెళ్లి తర్వాత నేను తిరిగి రాయలేదు. వాడు ఇంకో పెళ్లి చేసుకోలేదట. రెండేళ్ల క్రితం పోయాడని తెలిసింది’ అని కళ్లు తుడుచుకుంది. ● కవరు తెరిచింది. లోపల చిన్న కాగితం. ‘కమల, నీకు కోపమొచ్చినా నేను వేచి ఉంటా. గోదావరి ఆగుతుందా? నా ప్రేమ కూడా ఆగదు. – మోహన్’ ● కమల అమ్మమ్మ ఆ ఉత్తరం గుండెలకు హత్తుకుంది. 37 ఏళ్ల తర్వాత చేరిన మాటలు, గోదావరి గాలి మోసుకొచ్చిన జ్ఞాపకం. ● ఆ రోజు తాత ఇంటికి నడుస్తూ అనుకున్నాడు, ‘ఒక ఉత్తరం ఆలస్యమైనా, ప్రేమ ఆలస్యం కాదు’. నీతి: మాటలు, భావాలు సమయానికి చేరకపోయినా వాటి విలువ తగ్గదు. నీతి కథఎన్. శ్రీకర్ గ్రామం: ఊటురు మండలం: మానకొండూర్ జిల్లా: కరీంనగర్ -
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో.. బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ.
● కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేస్తాం‘సాక్షి’ మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గం.ల నుంచి మధ్యాహ్నం 01గం.వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు: ఐబ్రోస్(త్రేడింగ్), వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచ్,స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఫేస్ప్యాక్స్, హెయిర్ కట్స్, హెయిర్స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్స్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్స్), హెయిర్ మసాజ్, హెయిర్ కట్స్, కమ్యూనికేషన్ అండ్ సెల్ఫ్ గ్రూమింగ్, శారీ డ్రాపింగ్. -
బన్నీ వేసవి యాత్ర–8
పాలు తాగాక తాతయ్య బయటకు వెళ్లి, ‘బన్నీ రారా’ అని పిలిచాడు. బన్నీ వెళ్లాడు. చుక్క, రామ్ కూడా వచ్చారు. పొలం గట్టు. కింద నీళ్లు. నీళ్లలో బురద. పచ్చగా వరి నాట్లు. తాతయ్య చెప్పాడు, ‘ఇదే మన పొలం. ఇక్కడే అన్నం పుడుతుంది.’ బన్నీకి ఆశ్చర్యం. ‘బియ్యం షాప్ నుండి తెస్తారు కదా తాతయ్యా?’ తాతయ్య నవ్వాడు. ‘లేదు రా. మొదట ఇక్కడే. ఈ బురదలో వంగి పని చేస్తేనే, మనం తలెత్తుకు తినగలం.’ బన్నీకి వివరంగా తాతయ్య చెప్పాడు. బన్నీ గట్టు మీద నడుస్తున్నాడు. అడుగు జారింది. ‘భళ్లున’ బురదలో పడ్డాడు. కాలు మోకాలు వరకు దిగింది. బన్నీకి భయం వేసింది . ‘అమ్మా !’ అని అరిచాడు. చుక్క పరిగెత్తుకు వచ్చింది. ‘భయం వద్దు బన్నీ’ అంది. చెయ్యి ఇచ్చింది. బన్నీ చుక్క చెయ్యి పట్టుకున్నాడు. చుక్క గట్టిగా లాగింది. రామ్ కూడా సాయం చేశాడు. బన్నీ బయటికి వచ్చాడు. కాలు అంతా బురద. కానీ మనసులో నవ్వు. చుక్క అంది, ‘చూశావా? ఆపదలో ఉన్నవాడికి చెయ్యి అందించడమే స్నేహం.’ తాతయ్య బన్నీ తల నిమిరాడు. ‘ఇప్పుడు తెలిసిందా? అన్నం విలువ.’ కష్టపడితేనే పంటలు పండుతాయి. ఆ పంట నుండే తిండి గింజలు వస్తాయి. పిల్లలకి మాట: కష్టం తెలిస్తేనే అన్నం విలువ తెలుస్తుంది. స్నేహం అంటే కష్టంలో చెయ్యి అందించడం. డాక్టర్ కోట లక్ష్మణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రాథమిక పాఠశాల,కాకర్లపల్లి, మండలం: మంథని, పెద్దపల్లి జిల్లా -
పొడుపు కథలు
01. వీరు అవిభక్త కవలలు గాలి ప్రాణస్నేహితురాలు స్నేహితురాలు దగ్గరగా వచ్చిందా ఉబ్బితబ్బిబ్బవుతారు కాస్త దూరంగా జరిగిందా చప్పగా చప్పబడిపోతారు కాసేపు కనిపించనేలేదనుకో ప్రాణాలే విడుస్తారు 02. చిక్కుడు గింజలాంటి ఆకారం చెట్టు మీద కాదు శరీరంలో వడపొయ్యటమే పని తేనీటిని కాదు.. రక్తాన్ని మలినాలను బయట పారేస్తుంది ఇంటి నుంచి కాదు వంటి నుంచి జవాబులు: 01. ఊపిరితిత్తులు 02. కిడ్ని 03. లివర్03. అత్యంత పెద్ద గ్రంథి ఆహార ధాన్యాల గిడ్డంగి రసాయన ప్రయోగశాల ఎవరో చెప్పుకోండి! డాక్టర్ కందేపి రాణీప్రసాద్, రచయిత్రి, సిరిసిల్ల -
వెడల్పు 50 ఫీట్లా.. 60 ఫీట్లా!
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లిలో ప్రధాన వ్యాపారకూడలిగా ఉన్న జెండాచౌరస్తా, మెయిన్రోడ్డు ఇరుగ్గా మారింది. పాదచారులు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులను దూరం చేసేందుకు రోడ్డు విస్తరణ చేపట్టే విషయమై వ్యాపారులు, మున్సిపల్ అధికారుల మధ్య ఇంకా స్పష్టత రాలేదు. మెయిన్ రోడ్డును 66 ఫీట్లుగా విస్తరించాలని అధికారులు నిర్ణయించగా, వ్యాపారుల నుంచి విముఖత వ్యక్తమైంది. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కమల్కిషోర్ శారడ, స్థానిక కౌన్సిలర్ మంథని నర్సింగ్ తదితరులతో కలసి వ్యాపారులంతా ఎమ్మెల్యే విజయరమణారావును కలిసి తమకు జరిగే నష్టంపై మొరపెట్టుకున్నారు. మున్సిపల్ అధికారులు, వ్యాపారులు సమావేశమై ఓ నిర్ణయానికి రావాలని ఎమ్మెల్యే సూచించారు. రోడ్డు విస్తరణపై రాని స్పష్టత పెద్దపల్లి మున్సిపల్ ఆఫీసులో గురువారం పట్టణంలోని మెయిన్రోడ్డు వ్యాపారులతో మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, కమిషనర్ వెంకటేశ్ సమావేశమయ్యారు. ప్రజల అవసరాల దృష్ట్యా చేపట్టిన రోడ్డు విస్తరణకు సహకరించాలని కోరారు. 66ఫీట్లు కాకుండా కనీసం 60ఫీట్లు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావాలని కోరారు. 60ఫీట్లు విస్తరించే తమకు చాలా నష్టం కలుగుతుందన్న వ్యాపారులు 50ఫీట్లు చేస్తే అభ్యంతరం లేదన్నారు. 60ఫీట్లు విస్తరిస్తేనే రాకపోకలకు, వాహనపార్కింగ్, డ్రైనేజీ నిర్మాణానికి అనువుగా ఉంటుందని మున్సిపల్ వర్గాలు పేర్కొంటున్నాయి. రద్దీకి అనుగుణంగా విస్తరించాలి పెద్దపల్లి జిల్లాకేంద్రం. ఆ హోదాకు తగ్గట్టుగా ప్రధాన వ్యాపారకూడలిగా ఉన్న మెయిన్రోడ్డును విస్తరిస్తేనే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏటా పెరుగుతున్న జనాభా, వాహన వినియోగంతో మెయిన్రోడ్డులో పాదచారులు నడవలేని, వాహనాలు నడపలేని పరిస్థితి నెలకొన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు చేపట్టే విస్తరణతో భవిష్యత్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకోవడమే మేలని పలువురు పేర్కొంటున్నారు. రోడ్డు విస్తరణలో ఎక్కువ మొత్తంలో నష్టపోయిన వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపేలా ప్రజాప్రతినిధులు, అధికారులు ఆలోచించాలని, ట్రాఫిక్ పరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని కోరుతున్నారు. -
ధాన్యం తరలింపులో జాప్యం వద్దు
మంథని/మంథనిరూరల్: ధాన్యం కొనుగోళ్లు, తరలింపులో జాప్యం లేకుండా చూడాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంథని మండలం పుట్టపాకలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం, మంథని మార్కెట్ యార్డును గురువారం సందర్శించారు. ప్రస్తుతం రోజుకు 70లారీలే అందుబాటులో ఉన్నాయని, మరో 30నుంచి 40లారీలను వెంటనే ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కేంద్రాలకు సమీపంలోనే రైస్మిల్లులు ఉంటే ట్రాక్టర్ల ద్వారా తరలించాలన్నారు. అనంతరం మంథని మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో జరుగుతున్న జనాభా లెక్కలను పరిశీలించారు. మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి వివిధశాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీని వాస్, వైస్ చైర్మన్ సహేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మనోహర్, పీఏసీఎస్ సీఈవో మామిడాల అశోక్ పాల్గొన్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి పెద్దపల్లి: జిల్లాలో రోడ్డు భవనాలశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయంలో ఆర్అండ్బీ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో రహదారులు, భవనాల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. టెండర్ దశలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సింగరేణి అవసరాలకు భూసేకరణ జరుగుతున్న గ్రామాల్లో అవసరం లేని రహదారి విస్తరణ పనులను ప్రోత్సహించవద్దని తెలిపారు. మెడికల్ కళాశాల పనులను పూర్తి చేయాలని, మంథని గెస్ట్ హౌస్ను 9నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. వ్యవసాయ అవసరాలకే చెరువు మట్టి చెరువుల్లోని సారవంతమైన మట్టిని వ్యవసాయ భూములకు తరలించేందుకు ఆసక్తి గల రైతులు రేపటి నుంచి సంబంధిత తహసీల్దార్కు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. నీరు లేని చెరువుల నుంచి మట్టిని వ్యవసాయ భూములకు తరలించుకోవడానికి అనుమతులు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. రైతులకు చెరువు మట్టిని ఉచితంగా అందజేస్తున్నామని అన్నారు. ఇతర అవసరాలకు మళ్లించినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
దవాఖానాలా.. బందీఖానాలా?
సాక్షి పెద్దపల్లి: రోగులను పట్టిపీడిస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ప్రాణాలు కాపాడండి అంటూ వెళ్లేవారికి రక్షణ చర్యలు లేకుండా పోయా యి. జిల్లాలో రోజురోజుకు ప్రైవేటు ఆస్పత్రుల సంఖ్య పెరుగుతుండగా, చాలా ఆస్పత్రుల్లో ఏదేని ప్రమాదం సంభవిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోగుల రక్షణకు కనీస భద్రత చర్యలు చేపట్టడంలో యాజమాన్యాలు నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తున్నాయి. కనీస సౌకర్యాలు కరువు జిల్లాకేంద్రంలో ఉన్న చిన్నాపెద్ద ఆస్పత్రుల్లో ఒకటి రెండు మినహా మిగతా వాటిల్లో కనీస సౌకర్యాలు కనిపించడం లేదు. చాలా ఆస్పత్రులకు వాహన పార్కింగ్ స్థలం కూడా లేకపోవడం గమనార్హం. ఇరుకు రోడ్లు, సందుల్లోనూ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వచ్చే దారి కూడా లేదు. ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు రోగులతోపాటు, వారి అటెండెంట్లు వేచి ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయకపోవడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జిల్లాలో నిబంధనల మేరకు ఆస్పత్రులు ఏర్పాటు చేయడం లేదు. కార్లు వెళ్లలేని గల్లీల్లో పదుల సంఖ్య లో ఆస్పత్రులు వెలిశాయి. ఇరుకు భవనాల్లో ఏర్పా టు చేయడంతో రోగుల గదులకు గాలి, వెలుతురు రాని పరిస్థితి నెలకొంది. అగ్నిమాపకశాఖ నిబంధనల ప్రకారం అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఫైర్ ఇంజిన్ భవనం చుట్టూ తిరిగి మంటలార్పేలా ఏర్పాట్లు ఉండాలి. ప్రమాద సమయంలో ఒకదారి మూసుకుపోతే మరోదారిన రోగులు బయటకు వచ్చే విధంగా మెట్లు ఏర్పాటు చేయాలి. జిల్లాలో ఏ ఆస్పత్రిలో చూసిన ఒకవైపు మెట్లే దర్శనమిస్తుండగా, ర్యాంపులు సైతం ఉండటం లేదు. నోటీసులతోనే సరి..? ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా ఆస్పత్రులు కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు నోటీసులతో సరిపెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగితే రోగుల ప్రాణాలకు ముప్పు తప్పదనే భయం నెలకొంది. పెద్దపల్లి, మంథని, గోదావరిఖనిలో చాలా ఆస్పత్రులు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. తగిన పార్కింగ్, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, విశాలమైన మెట్లు, వెంటిలేషన్ వంటి సదుపాయాలు లేకుండానే నడుస్తున్నాయి. కొన్నిచోట్ల ఓపీ గదులు, ఇన్పేషెంట్ వార్డులు, డాక్టర్ల కోసం ఏర్పాటు చేసిన హాళ్లు ఇరుకుగా ఉండటంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఆరు నెలల క్రితం పెద్దపల్లి పట్టణంలోని ఓ ఆస్పత్రి సెల్లార్లోనే వైద్య సేవలు నిర్వహిస్తున్న విషయం అప్పటి డీఎంహెచ్వో ఆకస్మిక తనిఖీలో బయటపడింది. అధికారులు నోటీసులు జారీ చేయడంతో నిర్వాహకులు కార్యకలాపాలు నిలిపివేశారు. జిల్లాలోని ఆస్పత్రుల్లో భద్రతా ప్రమాణాలపై జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ను వివరణ కోరగా నోటీసులు ఇచ్చామని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చిత్రంలో అలంకారప్రాయంగా కనిపిస్తున్న అగ్నిమాపక యంత్రం గోదావరిఖనిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోనిది. ఈ ఒక్కటే కాదు చాలా ఆస్పత్రుల్లో పరిస్థితి ఇలాగే ఉంది. యంత్రాలపై ఫిల్లింగ్ తేదీ, గడువు తేదీ, తదుపరి సర్వీస్ వివరాలు కనిపించవు. కొన్నింటిపై సర్వీస్ స్టిక్కర్లు లేకపోగా, మరికొన్నింటిపై ఎప్పుడు రీఫిల్ చేశారన్న సమాచారం శూన్యం. సంబంధిత అధికారులు తనిఖీలు చేయాల్సి ఉండగా.. అటువైపు చూసేవారే లేరు. -
ఎన్సీడీ స్క్రీనింగ్ వేగవంతం చేయాలి
కోల్సిటీ(రామగుండం): రామగుండం నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులు, వైద్య సిబ్బందికి గురువారం రామగుండం నగరపాలక సంస్థలోని సమావేశ మందిరంలో అసంక్రమిత వ్యాధుల కార్యక్రమం (ఎన్సీడీ)తోపాటు వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యతిథిగా హాజరైన డీఎంహెచ్వో కె.ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ ఎన్సీడీ స్క్రీనింగ్ రెండో దశ ఆన్లైన్ ఎంట్రీలను త్వరితగతిన నమోదు చేయాలని సూచించారు. 14 ఏళ్ల బాలికలకు గర్భాశయ ముఖద్వార కేన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయాలన్నారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో ఓపెన్ వైయల్ పాలసీని కచ్చితంగా పాటిస్తూ, ఈ–విన్ పోర్టల్లో రియల్ టైమ్ డేటా నమోదు చేయాలని సూచించారు. గర్భిణులకు నాలుగు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఐరన్ ఫోలిక్ యాసిడ్, కాల్షియం మాత్రలు అందించాలన్నారు. పట్టణ ప్రాంత గర్భిణీలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, రామగుండంలోనే ప్రసూతి సేవలు పొందేలా ప్రోత్సహించాలని, ఇందులో సూపర్వైజర్ల పాత్ర కీలకమన్నారు. వడదెబ్బ నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రోగ్రామ్ అధికారులు రాజమౌళి, బి.కిరణ్ కుమార్, డీడీఎం మహేందర్, ఎన్సీడీ కోఆర్డినేటర్ టి.రాజేశ్, పాల్గొన్నారు. బడిబాట విజయవంతంపెద్దపల్లి: జిల్లాలో బడిబాట విజయవంతమైందని డీఈవో శారద తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక– విద్యా వారోత్సవాల్లో భాగంగా జిల్లాలోని వివిధ మండలాల్లో మొత్తం 510 పాఠశాలలు, కళాశాలల్లో మెగా పీటీఎంలు నిర్వహించామని తెలిపారు. ఇందులో 4,395 మంది తల్లిదండ్రులు, 534 మంది పూర్వ విద్యార్థులు, 771మంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా జిల్లాలో 128 కెరీర్ గైడెన్స్, ఉన్నత విద్యా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. వీటిలో 2,122 మంది విద్యార్థులు పాల్గొని ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై అవగాహన పొందారని పేర్కొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆరోగ్యకర జీవనశైలిపై అవగాహన కల్పించేందుకు జిల్లాలో 68 వంటల పోటీలు నిర్వహించామన్నారు. పబ్లిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానంపెద్దపల్లి: 2026–27 విద్యా సంవత్సరానికి హైదరాబాద్లోని బేగంపేట్ పబ్లిక్ స్కూల్లో 1వ తరగతి ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశానికి జిల్లాలోని ఎస్సీ విద్యార్థులు ఈనెల 29లోగా దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు 2019 జూన్ 1 నుంచి 2020 మే 31 మధ్యలో జన్మించి ఉండాలని, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం అర్బన్ ప్రాంతంలో రూ.2లక్షలు, రూరల్ ప్రాంతంలో రూ.1.50లక్షల లోపు ఉండాలని, ఆదాయం, కులం, బర్త్, స్టడీ సర్టిఫికెట్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫొటో జత చేసి పూర్తి చేసిన దరఖాస్తులను గెజిటెడ్ అధికారితో అటెస్టడ్ చేసి ఈనెల 29 సాయంత్రం 5 గంటలలోగా కలెక్టరేట్లోని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని కోరారు. జూన్ 1న లాటరీ పద్ధతిలో సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. అంతర్జాతీయ వేదికపై రెస్క్యూ టీం సత్తాగోదావరిఖని: అంతర్జాతీయ వేదికపై సత్తా చాటి తెలుగు ఖ్యాతి ఖండాంతరాలకు తీసుకెళ్లిన ఘనత సింగరేణి రెస్క్యూకి దక్కిందని ఆర్జీ–1 జీఎం లలిత్కుమార్ పేర్కొన్నారు. జాంబియా దేశంలో జరిగిన అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ పోటీల్లో సత్తాచాటిన సింగరేణి బృందాన్ని గురువారం రెస్క్యూ జీఎం శ్రీనివాస్రెడ్డితో కలిసి, జీఎం అభినందించారు. గనుల రక్షణలో అత్యంత కీలకమైన అండర్గ్రౌండ్ విభాగంలో మొదటి స్థానాన్ని దక్కించుకోవడం సింగరేణి చరిత్రలో ఇదే మొదటిసారన్నారు. సింగరేణి నుండి ఇద్దరు అధికారులు అంతర్జాతీయ జడ్జిలుగా వ్యవహరించడం గొప్ప విషయం అన్నారు. రెస్క్యూ సూపరింటెండెంట్ రాజేందర్రెడ్డి, ఎస్వోటూ జీఎం చంద్రశేఖర్, ఏజీఎం రామమోహనరావు, డాక్టర్ రాజేశ్వర్ రావు, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి పాల్గొన్నారు. -
ముగ్గురు దొరికారు.. పరారీలో పది మంది!
సాక్షిప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ క్రైం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్ దోపిడీ కేసులో పోలీసులు ముగ్గురినే పట్టుకోగలిగారు. దోపిడీలో మొత్తం 13 మంది పాల్గొనగా.. మిగిలిన 10 మంది కోసం గాలిస్తున్నారు. బిహార్ జైలులో ఉన్న ‘ది గోల్డెన్ థీఫ్’గా పేరొందిన సుభోద్సింగ్ జైలు నుంచే ఈ ఆపరేషన్ను నడిపించినట్లు గుర్తించారు. కరీంనగర్ సీపీ గౌస్ ఆలం గురువారం కమిషనరేట్ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ కేసులో పశ్చిమ బెంగాల్కు చెందిన రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జారీరా సింగ్, బిహార్కు చెందిన రావిష్కుమార్ అలియాస్ ప్రద్యుమన్లు, వీరికి సిమ్కార్డులు సరఫరా చేసిన మెహతాబ్ఖాన్ అలియాస్ మహబూబ్ఖాన్ను అరెస్ట్ చేయగా, మరో 10 మంది పరారీలో ఉన్నారని తెలిపారు. టూ టౌన్ పోలీస్స్టేషన్లో నమోదైన ఈ కేసులో రూ.82.02 లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు దోచుకెళ్లినట్లు తెలిపా రు. ఆ సమయంలో జ్యువెలరీ స్ సిబ్బందిపై కాల్పులు జరపడంతో గాయపడిన విషయం తెలిసిందే. జైలు నుంచే మాస్టర్ప్లాన్ ఈ దోపిడీ వెనుక బిహార్లోని కరుడుగట్టిన నేరస్తు డు సుభోద్సింగ్ ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ‘ది గోల్డెన్ థీఫ్’గా పేరొందిన సుభోద్సింగ్ జైలులో నుంచే తన అనుచరులకు ఆదేశాలిస్తూ దేశవ్యాప్తంగా దోపిడీలు చేయిస్తున్నట్లు గుర్తించారు. బిహార్, పశ్చిమబెంగాల్, ఝార్ఖండ్, తెలంగాణ, మహారాష్ట్రల్లో ఈ ముఠా 20కి పైగా దోపిడీలకు పాల్పడినట్లు, 400 కిలోలకుపైగా బంగారాన్ని దోచుకెళ్లినట్లు సమాచారం. సుబోధ్ సింగ్ ఆదేశాలతో ప్రధాన నిందితులు రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జగీరాసింగ్, రావిష్కుమార్ అలియాస్ ప్రద్యుమన్, రాధే అలియాస్ అభయ్, సూర్యమణికుమార్ అలియాస్ సనోజ్ తదితరులు రెండు నెలల క్రితమే తెలంగాణకు వచ్చారు. ఖమ్మం, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్ ప్రాంతాల్లో జ్యువెలరీ షాపులు, బ్యాంకులపై రెక్కీ నిర్వహించారు. చివరికి కరీంనగర్లోని పీఎంజే జ్యువెల్లరీ షాప్ను ఎంచుకున్నట్లు సీపీ వెల్లడించారు. రెక్కీ సమయంలో ఎంట్రీ, ఎగ్జిట్ రూట్లను ముందుగానే డౌన్లోడ్ చేసుకుని, వాటి ఆధారంగానే పారిపోయారు. నకిలీ ఆధార్కార్డులు, తెలంగాణ, ఒడిషా ఫేక్ బైక్ నంబర్ ప్లేట్లు, తప్పుడు పేర్లతో లాడ్జీలలో బస చేస్తూ పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో సిద్దిపేట, పెద్దపల్లి, ధర్మపురి లాడ్జీల్లో బసచేశారు. వీరంతా ఒకరికితో మరొకరికి పరిచయం లేదు. అందరికీ ఇచ్చిన నకిలీ గుర్తింపుకార్డుల పేర్లతోనే పిలుచుకున్నారు. దోపిడీ చేసిన బంగారాన్ని ఇప్పటికే కరిగించి నేపాల్ చేర్చినట్లు అనుమానిస్తున్నారు. చంద్రాపూర్ అడవుల్లో తుపాకులు పోలీసుల విచారణలో నిందితుల నేరపద్ధతి సంచలనంగా మారింది. ఝార్ఖండ్–పశ్చిమ బెంగాల్ సరిహద్దులో ఒక్కో సిమ్కార్డును రూ.10వేల చొప్పున కొనుగోలు చేసినట్లు తేలింది. దోపిడీకి ముందు రఘునాథ్ కర్మాకర్ మంచిర్యాల నుంచి రైలులో చంద్రపూర్ సమీపానికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే ముఠాకు చెందిన వ్యక్తుల నుంచి ఆరు పిస్టల్స్, 60 బుల్లెట్లతో 12 మ్యాగ్జిన్లు తీసుకుని తిరిగి ధర్మపురికి చేరుకున్నట్లు వెల్లడించారు. ఈనెల 3న ధర్మపురి నుంచి వచ్చి జ్యువెల్లరీ షాపులో దోపిడీకి పాల్పడి, నలుగురు సిబ్బందిని కాల్చి మెయిన్ రోడ్డుపై కాకుండా గ్రామాల్లోని కాలువలు, చిన్న రోడ్ల ద్వారా ధర్మపురి చేసుకున్నారు. ధర్మపురి వద్ద పల్సర్ను వదిలేసి, ముగ్గురు దొంగలు కాలినడకన గోదావరినది దాటి మంచిర్యాల వద్ద రైలెక్కి పారిపోయారు. అపాచీ మీదున్న ఇద్దరు దొంగలు ఆభరణాలతో అడవి మార్గంలో వెళ్లి క్రెటా కారులో వచ్చిన వ్యక్తులకు నగల బ్యాగ్ అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు. గ్యాంగ్ లీడర్ సుభోద్సింగ్తోపాటు రాధేమిశ్రా అలియాస్ అభయ్, సూర్యమణికుమార్ అలియాస్ సనోజ్, మిశ్రా తదితరులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారిని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. జ్యువెల్లరీ షాపులు, బ్యాంకులు, లాడ్జీ యజమానులు అప్రమత్తంగా ఉండాలని, నాణ్యమైన పానిక్ బ టన్లు, అలారం వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, అ నుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.వికసించిన మే పుష్పం ఫెర్టిలైజర్సిటీ: రామగుండం కార్పొరేషన్ 23వ డివిజన్ గౌతమినగర్లో మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ నివాసంలో గురువారం మే పుష్పం వికసించింది. మే మాసంలో పూసే పువ్వు కావడంతో ప్రత్యేకత సంతరించుకుంది.కేసు వివరాలు దోపిడీ జరిగింది: మే 3, 2026దోపిడీకి పాల్పడింది: సుబోధ్ ముఠా, బిహార్ ఎత్తుకెళ్లిన నగల విలువ : రూ.82,02,000దోపిడీలో పాల్గొంది: 13 మందికిపైగా చిక్కిన నిందితులు: ముగ్గురు పరారీలో ఉన్నవారు: దాదాపు 10 మంది వాడిన ఆయుధాలు: 6 పిస్టళ్లు, 12 మేగ్జిన్లు, 60 బుల్లెట్లు రికవరీ అయిన సొత్తు : ఏమీ లేదు స్వాధీనం చేసుకున్నవి: రూ.51వేల నగదు, పల్సర్, హెల్మెట్, సెల్ఫోన్లు 2, సిమ్కార్డులు 2, నకిలీ ఆధార్కార్డు. గాలించిన రాష్ట్రాలు: బిహార్, పశ్చిమ బెంగాల్ పాల్గొన్న సిబ్బంది: 132 మంది కరీంనగర్ సిబ్బంది, 24 మంది ఎస్పీలు -
ఎండ.. ప్రచండం
జ్యోతినగర్: జిల్లాలో ఎండలు మండుతున్నాయి. నాలుగు రోజులుగా కొంత శాంతించిన సూరీడు గురువారం ఒక్కసారిగా వేడెక్కాడు. కమాన్పూర్లో అత్యధికంగా 44.3 డిగ్రీల సెల్సియస్ పగటి ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లా అంతటా 40 నుంచి 44.3 డిగ్రీల సెల్సీయస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న వారం రోజులు ఎండ తీవ్రత పెరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. గురువారం సాయంత్రం ఆరు గంటల వరకు నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు..మండలం ప్రాంతం కనిష్టం గరిష్టం కమాన్పూర్ కమాన్పూర్ 34.7 44.3 పెద్దపల్లి పెద్దపల్లి 32.8 44.2 పెద్దపల్లి భోజన్నపేట 32.8 44.1 అంతర్గాం ఆకెనపల్లి 36.7 43.9 ధర్మారం ధర్మారం 34.9 43.5 ముత్తారం ముత్తారం 32.4 43.3 రామగుండం రామగుండం 34.6 43.1 ఎలిగేడు ఎలిగేడు 33.0 43.1 పాలకుర్తి ఈసాల తక్కళ్లపల్లి 35.3 42.9 మంథని మంథని 32.2 42.6 శ్రీరాంపూర్ శ్రీరాంపూర్ 32.4 42.6 రామగిరి కల్వచర్ల 32.5 42.4 మంథని ఎక్లాస్పూర్ 32.8 42.3 ఓదెల ఓదెల 32.8 42.1 -
అభివృద్ధిలో భాగమే
ఎమ్మెల్యే విజ్జన్న హయాంలో పెద్దపల్లిలో ఎంతో అభివృద్ధి జరుగుతోంది. అందులో భాగంగానే చేపట్టిన మెయిన్ రోడ్డు విస్తరణలో కొంత మంది వ్యాపారులకు తీరని నష్టం జరిగే అవకాశముంది. ఈ కారణంగా ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా విస్తరణ పనులు జరగాలి. 50 ఫీట్ల విస్తరణకు వ్యాపారులు ముందుకొచ్చారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేతో చర్చిస్తాం. – మంథని నర్సింగ్, కౌన్సిలర్ రోడ్డు విస్తరణకు చర్యలు పెద్దపల్లి పట్టణంలోని జెండా కూడలి నుంచి మెయిన్రోడ్డులో విస్తరణ పనులు చేపట్టాం. రోడ్డుపక్కన డ్రైనేజీలపై ఉన్న టేలాలను తొలగిస్తున్నాం. రోడ్డు 60ఫీట్ల మేర విస్తరించాలని నిర్ణయించాం. ఈ రోడ్డులో ఉన్న వ్యాపారులతో సమావేశమయ్యాం. వారంతా 50 ఫీట్లకే విస్తరణ పరిమితం చేయాలని కోరుతున్నారు. మున్సిపల్ పాలకమండలి, ఎమ్మెల్యే సూచనలతో ముందుకు సాగుతాం.– ఆకుల వెంకటేశ్, మున్సిపల్ కమిషనర్ పెద్దపల్లి -
రైతులు ట్రెండ్ మార్చాలి
సుల్తానాబాద్రూరల్: రైతులు పంటల మార్పిడిలో ట్రెండ్ మార్చాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ మండలం మియ్యపూర్(పెర్కపల్లి)లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులు పంటల మార్పిడి చేయాలని, ఆయిల్పాం, కందులు, పెసర్లు, సన్నరకం వరి ధాన్యంతో ఇతర వాణిజ్య పంటలసాగుకు ముందుకు రావాలన్నారు. ఎరువులు ఎక్కువగా వాడటం ద్వారా భూమిలో సారవంతం తగ్గి పంటల దిగుబడి తగ్గుతుందని, సేంద్రీయ ఎరువులపై దృష్టి పెట్టాలని సూచించారు. సర్పంచ్లు పోచాలు, సాయికిరణ్, దేవేందర్, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్రావు, ఏవో పైడితల్లి పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ‘పాలిసెట్’
ప్రభుత్వ ప్రయివేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో వ్యవసాయ, వెటర్నరీ డిప్లొమా కోర్సులతో పాటు ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం బుధవారం పాలిసెట్ అర్హత పరీక్ష నిర్వహించారు. పరీక్ష పగటిపూట ఉండడంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు ఎండ ముందస్తు పరీక్ష పెట్టింది. మిట్ట మధ్యాహ్నం 11 గంటల నుంచి 1.30 వరకు పరీక్ష కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు నిలువ నీడలేక పరీక్ష ముగిసేవరకు చెట్ల కింద సేదతీరుతూ ఉక్కపోతతో విలవిల్లాడారు. ఎండలో అవస్థలు పడుతూ చల్లదనం కోసం చెట్ల కింద సేదతీరుతూ కనిపించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లిపెద్దపల్లిరూరల్: జిల్లాలో బుధవారం పాలిసెట్ ప్రశాంతంగా జరిగింది. పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన ఆరు పరీక్షా కేంద్రాల్లో 2,333 మందికి 2200 మంది పరీక్ష (94.29శాతం) రాశారని కో ఆర్డినేటర్ లక్ష్మినర్సయ్య తెలిపారు. 133 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షలు రాసేందుకు వచ్చిన వారికి అన్ని సౌకర్యాలు కల్పించారు. కొంత మంది విద్యార్థులు వెంట పెన్సిల్ తెచ్చుకోక హైరానా పడగా పరీక్షల కోఆర్డినేటర్ అందించారు. పరీక్షా కేంద్రాలను రాష్ట్ర ఆబ్జర్వర్ కిరణ్కుమార్ సందర్శించారు. కేంద్రంలోకి గంట ముందు నుంచే విద్యార్థులను లోపలికి అనుమతించారు. పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన ఓ విద్యార్థి తనకు కేటాయించిన ప్రభుత్వ జూనియర్ కాలేజీకి కాకుండా ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి వచ్చాడు. సెంటర్కు పొరపాటున వచ్చానని, ప్రభుత్వ జూనియర్ కాలేజీకి వెళ్లేదెలా.. అంటూ వేదనకు గురవుతుండడాన్ని పరీక్ష కేంద్రంలో విధులు నిర్వహించేందుకు వస్తున్న ఎన్టీపీసీ పోలీస్స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ నవీన్రావు గమనించాడు. విషయం తెలుసుకుని పరీక్షకు 8నిమిషాలే గడువు ఉండడంతో తన బైక్పై సెంటర్ వద్ద దింపడంతో కృతజ్ఞతలు తెలిపాడు. 94.29శాతం మంది హాజరు -
అక్రమాలకు కేంద్రాలు!
మంథని/మంథనిరూరల్: రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు అక్రమార్కులకు వరంగా మారుతున్నాయి. స్థా నిక రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని రైస్మిల్లులకు తరలించాల్సి ఉండగా.. కొందరు నిర్వాహకులు అక్రమాలకు తెరలేపుతున్నారు. మహారాష్ట్రలోని సిరొంచలో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి రైతులను బినామీలుగా చూపుతూ రైస్మిల్లుకు తరలించిన తతంగం ఇటీవల వెలుగు చూసింది. రైతులను బినామీగా చూపుతూ.. రైతులను బినామీలుగా చూపుతూ అక్రమార్కులు రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా సరిహద్దులో ఉన్న సిరోంచ ప్రాంతంలో టెండర్ ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తారు. క్వింటాల్కు రూ.1200 నుంచి రూ.1500 వరకు పలుకుతుంది. ఇటీవల అక్కడ కొనుగోలు చేసిన ధాన్యాన్ని సుల్తానాబాద్లోని ఓ రైస్ మిల్లుకు మంథని మండలం మల్లేపల్లి కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించిన రైతుల పేరిట ట్రక్షీట్ నమోదుచేసి తరలించిన ఘటన వెలుగు చూసింది. ఆ ధాన్యం నాసిరకంగా ఉందని రైస్మిల్లర్లు అన్లోడ్ చేయకుండా ఆపేశారు. స్థానికంగా కొనుగోలు కేంద్రాలకు లారీలు రాకుండా ఆగిపోయాయి. విషయం బయటపడటంతో అధికారులు రంగంలోకి దిగారు. మల్లేపల్లి కేంద్రంగా ఎనిమిది లారీల ధాన్యాన్ని తరలించినట్లు తేలడంతో, ఇతర కొనుగోలు కేంద్రాలపై సైతం దృష్టి సారించారు. మరో ఐదు సెంటర్లలో అక్రమాలు జరిగినట్లు సమాచారం. రూ.కోట్లలో వ్యాపారం మహారాష్ట్రలో టెండర్ ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం రైస్మిల్లుకు తరలించే వరకు క్వింటాల్కు సుమారు రూ.2000 పలుకుతుంది. రవాణా, ఇతర ఖర్చులు పోనూ క్వింటాల్కు రూ.400 చొప్పున సొమ్ము చేసుకుంటున్నారు. మల్లేపల్లి కేంద్రం నుంచి బినామీ రైతుల పేరిట ఎనిమిది లారీలను రైస్మిల్లుకు తరలించిన వ్యవహారంలో సుమారు రూ.10లక్షలు వెనకేసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్క మల్లేపల్లి కేంద్రంలోనే ఎనిమిది లారీల బాగోతం బయటపడితే జిల్లావ్యాప్తంగా రెండు వందలకు పైగా ఉన్న కొనుగోలు కేంద్రాల ద్వారా అక్రమార్కులు రూ.కోట్ల దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది. కొనసాగుతున్న విచారణ బినామీ రైతుల పేరిట ధాన్యాన్ని రైస్మిల్లులకు తరలించిన వ్యవహారంలో అధికారులు పురోగతి సాధించినట్లు సమాచారం. మల్లేపల్లి నుంచి ఎనిమిది లారీల ధాన్యాన్ని బినామీ రైతుల పేరిట రైస్మిల్లుకు తరలించినట్లు విచారణలో తేలినట్లు తెలిసింది. ఆ ఒక్క కేంద్రమే కాకుండా మరికొన్ని కేంద్రాల్లోనూ అక్రమాలు వెలుగుచూస్తుండటంతో అధికారులు మరిన్ని నిజాలు బయటపెట్టే దిశగా ముందుకు సాగుతున్నారు. కొన్ని కొనుగోలు కేంద్రాల్లో తాలు, తరుగు పేరిట ధాన్యం తూకంలో కోత విధిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై సైతం అధికారులు దృష్టి సారించినట్లు తెలిసింది. సిరోంచ నుంచి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రైతులను బినామీలుగా చూపుతూ మిల్లులకు తరలింపు వెలుగు చూస్తున్న కుంభకోణం.. ఆందోళనలో అన్నదాతలు కొనసాగుతున్న అధికారుల విచారణ -
బక్రీద్కు నిఘా పెంచాలి
గోదావరిఖని: బక్రీద్ నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని డీజీపీ సీవీ ఆనంద్ కోరారు. బుధవారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝాతో పాటు ముఖ్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. బక్రీద్ను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రార్థనా స్థలాలు, ఈద్గాలు, మసీదులు, ప్రధాన రహదారులు, జనసంచారం అధికంగా ఉండే ప్రదేశాలలో బందోబస్తు ఏర్పాటు చేయాలన్నా రు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించాలన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు, వదంతులు వ్యాప్తిచెందకుండా సైబ ర్ మానిటరింగ్ చేయాలన్నారు. డీసీపీలు రాంరెడ్డి, భాస్కర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ కె.శ్రీని వాస్, ఏసీపీ ప్రకాశ్, రమేశ్ పాల్గొన్నారు. ధాన్యం రవాణాకు సహకరించాలి గోదావరిఖని: రైతుల ధాన్యాన్ని సకాలంలో తరలించేందుకు లారీ యజమానులు సహకరించాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి కోరారు. బుధవారం స్థానిక గంగానగర్లో ఉన్న లారీ అసోసియేషన్ కార్యాలయాన్ని గోదావరిఖని ఏసీపీ ఎం.రమేశ్, గోదావరిఖని టూటౌన్ సీఐ ప్రసాద్రావుతో కలిసి సందర్శించారు. వ్యవసాయ అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియకు పూర్తి సహకారం అందించాలన్నారు. ధాన్యం రవా ణా సజావుగా జరిగేందుకు తగిన సంఖ్యలో లారీలు అందుబాటులో ఉంచాలన్నారు. రైతు ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వాహనాలు అందించి సహకరిస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి హామీ ఇచ్చారు. దరఖాస్తులు ఆహ్వానం పెద్దపల్లి: 2026–27 విద్యా సంవత్సరానికి జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో 1, 5వ తరగతుల్లో ప్రవేశానికి అర్హులైన షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. 1వ తరగతి నాన్ రెసిడెన్షియల్లో 70 సీట్లు, 5వ తరగతి రెసిడెన్షియల్లో 73 సీట్లు కేటాయించడం జరిగిందన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1,50,000 లోపు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2,00,000 లోపు ఉండాలని, 1వ తరగతి నాన్ రెసిడెన్షియల్ ప్రవేశానికి 01.06.2019 నుంచి 31.05.2020 మధ్య జన్మించి ఉండాలాని, ఒక కుటుంబం నుండి ఒకరికి మాత్రమే అర్హత ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల వారు దరఖాస్తు ఫారాలను ఈనెల 16 నుంచి జూన్ 05 వరకు జిల్లా కలెక్టర్ కాంప్లెక్స్లోని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయం నుంచి పొందవచ్చని, పూర్తి చేసిన దరఖాస్తులను తగిన ధృవీకరణ పత్రాలతో కులం, ఆదాయం, పుట్టిన తేదీ, ఆధార్ కార్డు జతపరిచి జూన్ 06వ తేదీ సాయంత్రం 5.00 గంటల లోపు అదే కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. జూన్ 10న లాటరీ పద్ధతి ద్వారా సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. వివరాలకు 9618844454, 9989354155 నంబర్లలో సంప్రదించవచ్చనిపేర్కొన్నారు. కొనసాగుతున్న పరీక్షలు పెద్దపల్లి: జిల్లావ్యాప్తంగా బుధవారం ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయ ని డీఐఈవో కల్పన తెలిపారు. 1,119 మంది విద్యార్థులకు 1,053 మంది హాజరయ్యారని, 66 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎన్టీపీసీ ఉనికికే ప్రమాదం జ్యోతినగర్: కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎన్టీపీసీ సంస్థ ఉనికికే ప్రమాదకరమని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్.భిక్షపతి అన్నారు. ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు లేబర్ గేట్ రోడ్లో సీఐటీయూ అనుబంధ రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, పారిశ్రామిక విధానాలతో ప్రభుత్వరంగ సంస్థల మనుగడ ప్రమాదంలో పడుతుందన్నారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 14న గోదావరిఖని శ్రామిక భవన్లో నిర్వహించనున్న సేవ్ పబ్లిక్ సెక్టార్ జిల్లా సదస్సులో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గీట్ల లక్ష్మారెడ్డి,రాజ్కుమార్, మల్లేశ్, దండ రాఘవరెడ్డి, హుస్సేన్ రెడ్డి పాల్గొన్నారు. -
మల్లన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం
ఓదెల/సుల్తానాబాద్ రూరల్: ఓదెల మల్లన్న ఆలయాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తానని ప్రభుత్వవిప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు పేర్కొన్నారు. ఓదెల మల్లన్న సన్నిధిలో బుధవారం రూ.కోటితో ఆలయం చుట్టూ రోడ్డు నిర్మాణం, రూ.15 లక్షలతో మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయం అభివృద్ధిని గురించి సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు దృష్టికి తీసుకెళ్తా అన్నారు. ఒగ్గు పూజారులకు గుర్తింపుతో పాటు ప్రత్యేక గది నిర్మాణం చేపట్టామన్నారు. అనంతరం గుండ్లపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ, సీసీరోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కనగర్తి, ఓదెల, గుండ్లపల్లి గ్రామాల్లో ఆలే టి రాజు, గొట్టం అంజన్న, వడ్డూరి సారయ్య, జాగిరి కిశోర్గౌడ్, ఎంబాడి లావణ్య, ఒల్లాల మహేశ్వరీ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లకు గృహ ప్రవేశం చేశారు. సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లెలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. నర్సయ్యపల్లెలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాలు చేశారు. సర్పంచులు పుప్పా ల స్వప్న, చొప్పరి సంధ్యారాణి, కనికిరెడ్డి సతీశ్, పల్లె కనుకయ్య, ఓదెల మల్లన్న ఆలయం చైర్మన్ చీకట్ల మొండయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూల ప్రేంసాగర్రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పిట్టల రవికుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు -
లారీలు రాకనే ఆలస్యం
ఈ నెల 7న కేంద్రానికి వడ్లు తెచ్చిన. మాయిశ్చర్ వచ్చింది. కాంటా పెట్టడం లేదు. నాలుగురోజుల కింద మహారాష్ట్ర నుంచి వడ్లు తీసుకువచ్చి మా ఊరి కేంద్రం నుంచి పంపించారట. వడ్లు తాలు ఉన్నయని రైస్మిల్లులో అన్లోడ్ చేయలేదు. దీంతో లారీలు సెంటర్కు రావడం లేదు. రోజూ రెండు లారీలు వచ్చేవి. ఇప్పుడు రెండు రోజుకో లారీ వస్తుంది. తొమ్మిది రోజుల నుంచి కాంటా పెడతారని ఎదురుచూస్తున్న. – బోసిక శంకర్, రైతు, మల్లేపల్లి, మంథని విచారణ జరుగుతోంది బినామీ రైతుల పేరుతో రైస్ మిల్లుకు ధాన్యం తరలించిన ఘటనపై విచారణ జరుగుతోంది. విజిలెన్స్ విచారణలో దోషులుగా తేలిన వారిపై చర్యలు ఉంటాయి. సొసైటీకి చెందిన వారు ఉన్నా చర్యలు తీసుకుంటాం. – శ్రీమాల, జిల్లా సహకార అధికారి, పెద్దపల్లి -
అక్రమ నిర్మాణాలు తొలగించండి
కోల్సిటీ(రామగుండం): కాలువలపై అక్రమ నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ కోరా రు. వార్డు సందర్శనలో భాగంగా బుధవారం మే యర్ మహంకాళి స్వామితో కలిసి 51వ డివిజన్లోని అశోక్నగర్, లక్ష్మీనగర్లో పర్యటించారు. కా లువలపై అక్రమ నిర్మాణాల వల్ల ప్రవాహ పరిమా ణం పెరిగినప్పుడు నీళ్లు ఇళ్లలోకి రావడం, నీరు నిలిచి దుర్గంధం వ్యాపించి ప్రజలు అనారోగ్యానికి గురికావడం జరుగుతుందన్నారు. లక్ష్మీనగర్ రోడ్ల ను విశాలంగా తీర్చిదిద్దే ప్రక్రియ సాగుతోందని, త్వరలో గణేశ్నగర్ వైపు రోడ్డు నిర్మాణం ప్రారంభం అవుతుందని తెలిపారు. కార్పొరేటర్ ఆకారపు రేఖ మహేశ్, నగరపాలక ఎస్ఈ గురువీర, టీపీఎస్ నవీన్, డీఈ ఆఫ్తాబ్, ఏఈ మీర్ పాల్గొన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం ప్రతి మహిళను కోటీశ్వరురాలు చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తున్నదని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని 46వ డివిజన్ ఇందిరానగర్లో బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వం తరహాలో కాకుండా తమ ప్రభుత్వం నాణ్యమైన, మన్నికై న చీరలు పంపిణీ చేస్తోందన్నారు. అనంతరం పలువురికి చీరలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ -
‘ఇందిరమ్మ’తో నెరవేరిన సొంతింటి కల
ధర్మారం: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ పథకం ద్వారా నిరుపేదల సొంతింటి కల నెరవేరుతోందని సంక్షేమశాఖ మంత్రి లక్ష్మణ్కుమార్ అన్నారు. ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన ఒడ్నాల రామక్క ఇందిరమ్మ పథకం ద్వారా నిర్మించుకున్న ఇంటికి బుధవారం గృహ ప్రవేశం చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సొంతిళ్లు ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇందిరమ్మ పథకం తీసుకొచ్చారన్నారు. ప్రతీ లబ్ధిదారుడికి రూ.5లక్షల నిధులు విడతల వారీగా మంజూరు చేశారన్నారు. రెండో విడత లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. లబ్ధిదారులు ఇంటి నిర్మాణంలో నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పూర్తిచేయాలని కోరారు. సర్పంచ్ దూడ ప్రియాంక, మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కొత్త నర్సింహం, చింతల ప్రదీప్రెడ్డి, మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ కొడరి అంజయ్య, ధర్మపురి నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు యశోద అజయ్ పాల్గొన్నారు. -
‘పీఎం సేతు’ సమర్థవంతంగా అమలు చేయాలి
పెద్దపల్లి: జిల్లాలో పీఎం సేతు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. పథకం అమలుపై ఐడీవోసీ కార్యాలయంలో బుధవారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ పథకం కింద 50శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం, 33శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం, 17 శాతం నిధులు పరిశ్రమలు భరించి ఐటీఐ క్లస్టర్లను ఆధునీకరించడం జరుగుతుందన్నారు. వచ్చే ఐదేళ్లలో పెద్దపల్లి క్లస్టర్ పరిధిలో ఐటీఐల అభివృద్ధికి కేంద్రం రూ.120 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.80 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. పారిశ్రామిక భాగస్వాములు సుమారు రూ.40 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు సింగరేణి, ఎన్టీపీసీ సంస్థలతో భాగస్వామ్యం కోసం చర్చలు జరుపుతున్నామన్నారు. ధాన్యం అన్లోడింగ్ పూర్తి చేయాలి జిల్లాలో ధాన్యం కొనుగోలు, దిగుమతి ప్రక్రియలో జాప్యం ఉండొద్దని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. సుల్తానాబాద్లోని పూసాల, సుగ్లాంపల్లి ప్రాంతాల్లోని పలు రైస్ మిల్లులను సందర్శించారు. ధాన్యం దిగుమతి, అన్లోడింగ్ ప్రక్రియను తనిఖీ చేశారు. కొనుగోళ్లలో ఎలాంటి కటింగ్లు, కోతలు అనుమతించబోమని స్పష్టం చేశారు. లారీ రైస్మిల్లుకు చేరిన 24గంటల్లోపు అన్లోడింగ్ పూర్తి చేయాలన్నారు. చేపల పెంపకం ద్వారా యువతకు ఉపాధి సింగరేణికాలనీలో చేపల పెంపకం ద్వారా యువతకు ఉపాధి కల్పించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఐడీవోసీలో మత్స్యశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ సింగరేణికాలనీలో బొగ్గు తవ్వకాలు పూర్తైన తర్వాత అక్కడ మిగిలిన చెరువును చేపల పెంపకానికి వినియోగించే అవకాశాలు ఉన్నాయన్నారు. చేపల పెంపకం ద్వారా కనీసం 50మందికి జీవనోపాధి కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. వచ్చే 20 రోజుల్లో ప్రాజెక్టును గ్రౌండింగ్ చేయాలన్నారు. నాణ్యమైన విద్యాఫలాలు చేరాలి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య 100శాతం ప్రజలకు చేరేలా కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, విద్యా వారోత్సవాల్లో భాగంగా సర్పంచులు, కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లతో కలెక్టరేట్లో సమావేశమయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని, పాఠశాలల అభివృద్ధి పనులను స్థానిక ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలని సూచించారు. తల్లిదండ్రులు– ఉపాధ్యాయుల సమావేశాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని, డ్రాప్ అవుట్ అవుతున్న విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. మెరుగైన వైద్యం అందించాలిజిల్లా ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ఐడీవోసీ కార్యాలయంలో వైద్యారోగ్యశాఖ అధికారులతో మాట్లాడారు. ఆసుపత్రిలో డెంటల్, ఓపీ సేవలను మెరుగు పరచాలని ఆదేశించారు. ఫిజియోథెరఫీ సేవల్లో నాణ్యత తగ్గకుండా చూడాలన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష -
మెడికిల్ భయోత్పాతం
కోల్సిటీ(రామగుండం): వ్యాధి నిర్ధారణ, చికిత్సలో పేషెంట్లకు వినియోగించిన బయో మెడికల్ వ్యర్థా లు ఎక్కడపడితే అక్కడ పడవేయడంతో రామగుండం నగర ప్రజలకు పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి. ప్రధానంగా ప్రైవేట్ ఆస్పత్రులు, డయోగ్నస్టిక్ ల్యాబ్ల నుంచి వెలువడే జీవవైద్య వ్యర్థాల ని ర్వహణ గాడితప్పడంలో రోడ్లపై, చెత్తకుప్పల్లోకి చే రుతున్నాయి. వీటిద్వారా అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజారోగ్యంతో చెలగాటం మనుషులు, జంతువుల వ్యాధి నిర్థారణ కోసం వినియోగించిన వేస్టేజీని రోజూ సేకరించడానికి కరీంనగర్లోని వెంకటరమణ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్కు బాధ్యతలు అప్పగించారు. ఆ వాహన సిబ్బందికే ఆస్పత్రుల నిర్వాహకులు జీవవైద్య వ్యర్థాలు అందజేయాల్సి ఉంది. కానీ నగరంలోని చాలా ఆస్పత్రులు, ల్యాబ్లు నిబంధలను ఉల్లంఘిస్తూ, చెత్త చెత్తకుప్పల్లో వేస్తున్నారు. చాపు ముప్పు హెచ్ఐవీ, టీబీ, హైపటైటీస్ తదితర బాధితులకు వాడిన సూదులు, బ్లేడులు ఇతర వైద్యవ్యర్థాలను బహిరంగంగా రోడ్లపై పడవేస్తున్నారు. ఇవి ఇతరులకు గుచ్చుకుంటే ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆస్పత్రి వ్యర్థాల్లోని బ్యాక్టీరియా, వైరస్ త్వరగా వ్యాపించి జీర్ణకోశ, శ్వాసకోశ, చర్మ సంబంధిత వ్యాధులు ప్రబలుతాయని వారు అంటున్నారు. బల్దియా సిబ్బందికీ ముప్పే.. చెత్తకుప్పల్లోని బయో వ్యర్థాలను వాహనాల్లో డంప్యార్డుకు తరలించడం పారిశుధ్య కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడటమే అని అంటున్నారు. రక్షణ పరికరాలు లేకుండా పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బంది.. చెత్తను ఎత్తే సమయంలో చేతులు, కాళ్లకు సూదులు గుచ్చుకునే ప్రమాదం ఉంది. ఆస్పత్రులు, ల్యాబ్ల నిర్లక్ష్యం వ్యర్థ నిర్వహణ చట్టం ప్రకారం.. ఆస్పత్రులు, ల్యాబ్ల్లో రోజూ వెలువడే వ్యర్థాలను పసుపు, ఎరుపు, నీలం, నలుపు తదితర రంగులు కలిగిన కేటగిరీ డబ్బాల్లో వేయాలి. ఇలా వేసిన తర్వాత కూడా 48 గంటలకు మించి ఆస్పత్రుల్లో నిల్వ ఉంచరాదు. శాసీ్త్రయ పద్ధతిలో రీసైక్లింగ్తోపాటు కాల్చేందుకు ప్రత్యేకంగా నెలకొల్పిన కరీంనగర్ లోని వెంకటరమణ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్కు పంపించాలి. ఇలా క్రమం తప్పకుండా పంపిస్తున్నారా? లేదా? అనేదానిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతోనే రోడ్లపై వ్యర్థాలు పడవేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు రోడ్లపై బయో మెడికల్ వ్యర్థాలు పడేస్తే చర్యలు తీసుకుంటాం. గతంలో కూడా జరిమానా విధించాం. డీఎంహెచ్వోతోపాటు బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్వాహకులతో ఆస్పత్రులు, ల్యాబ్ నిర్వాహకులకు నిబంధలు ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు ఉంటాయనేదానిపై కూడా ఇప్పటికే ప్రత్యేకంగా అవగాహన కల్పించాం. డాక్టర్స్ స్ట్రీట్పై ప్రత్యేక పర్యవేక్షణ చేపడతాం. నిబంధనలు ఉల్లంఘిస్తే డీఎంహెచ్వోకు నివేదిస్తాం. – అరుణశ్రీ, కమిషనర్, రామగుండం రహదారులపైనే సూదులు.. సిరంజీలు ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారిన మెడికల్ వ్యర్థాలు నగరంలో బయో మెడికల్ వేస్ట్ భయం డేంజర్ జోన్గా గోదావరిఖని డాక్టర్స్ స్ట్రీట్ రామగుండం బల్దియాకు సవాల్గా మారిన ఆస్పత్రులు, ల్యాబ్లు -
టూరిజం స్పాట్గా సబ్బితం
పెద్దపల్లిరూరల్: సబ్బితం(గట్టుసింగారం) జలపా తం పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేస్తామ ని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. గట్టుసింగారం జలపాతం వద్ద రూ.6కోట్లతో చేపట్టి అభివృద్ధి పనులకు టూరిజం డీఈఈ శ్రీశైలంతో కలిసి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. వానాకాలంలో జలపాతం సందర్శకులను ఆకట్టుకుంటోందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్నలో జలపాతం అభివృద్ధిని విస్మరించారని ఆయన విమర్శించారు. అనంతరం మున్సిపల్, పంచాయతీల నుంచి సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రాసెస్ చేసి ముడిసరుకులుగా తయారు చేసేయూనిట్ను గౌరెడ్డిపేటలో విప్ ప్రారంభించారు. యూనిట్ ఏర్పాటుతో కాలుష్యం తగ్గుతుందని అన్నారు. సర్పంచులు సుజాత, సరోజన, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, మార్కెట్ చైర్మన్ మల్లారెడ్డి, నాయకులు కొమ్ము శ్రీనివాస్, అభిలాష్, బండారి రామ్మూర్తి, మందల సత్యనారాయణరెడ్డి, కౌన్సిలర్ గుజ్జుల కుమార్ తదితరులు పాల్గొన్నారు. చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తాం సుల్తానాబాద్రూరల్: చివరి ఆయకట్టు వరకు సాగురు అందించేలా కృషి చేస్తానని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి పెద్దచెరువు నుంచి సాగునీరు వెళ్లే గర్రెపల్లి – బొంతకుంటపల్లి మధ్య గల ఎల్లమ్మ కాలువను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. కాలువను సర్వే చేసి, పూడికతీసి ఐదు గ్రామాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్పంచులు రమేశ్గౌడ్, శ్రీరంగారావు, తిరుమల్రావు, మాజీ ఎంపీటీసీ వెంకటేశం తదితరులు ఉన్నారు. సుల్తానాబాద్ను సుందరంగా తీర్చిదిద్దుతాం పెద్దపల్లి: సుల్తానాబాద్ను సుందరంగా తీర్చిదిద్దుతామని విప్ విజయరమణారావు అన్నారు. అంబేడ్కర్ చౌరస్తా – గట్టెపెల్లి రోడ్డు మధ్య చేపట్టిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను ప్రారంభించి మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్ రమేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినిపాల ప్రకాశ్రావు, మున్సిపల్ చైర్మన్ బిరుదు కృష్ణ, వైస్చైర్పర్సన్ అంతటి పుష్పలత ఉన్నారు. ప్రభుత్వ విప్ విజయరమణారావు -
కొనుగోలు చేసిన వెంటనే తరలించాలి
పెద్దపల్లిరూరల్/పాలకుర్తి: మక్కలను కొనుగోలు చేసిన వెంటనే గోదాములకు తరలించాలని, ఇందుకోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. రంగాపూర్లో మక్కలు నిల్వ చేసేందుకు 5వేల క్వింటాళ్ల సా మర్థ్యం గల గోదామును అదనంగా సిద్ధం చేశామన్నారు. బుధవారం రంగాపూర్తోపాటు పాలకుర్తి మండలంలోని గణపతి ఇండసీ్ట్రస్ గోదామును కలెక్టర్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మక్కలను వెంటవెంటనే గోదాములను తరలించేందుకు వాహనాలు, హ మాలీలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం అప్పన్నపేటలోని ఎస్సారార్ రైస్మి ల్లును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిల్వలపై ఆరా తీశారు. ఆయన వెంట జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్రెడ్డి, పాలకుర్తి తహసీల్దార సునీత్, డిప్యూటీ తహసీల్దార్ మహేశ్, రవీందర్ ఉన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి పెద్దపల్లి: జిల్లాలోని ప్రతీపట్టాదారు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష కోరారు. రైతులు వ్యవసాయ విస్తరణాధికారిని సంప్రదించి ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను ఆన్లైన్లో పూర్తి చేయించుకోవాలని ఆయన సూచించారు. మక్కల కొనుగోళ్లలో వేగం పెంచాలి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశం -
బాధ్యతలు స్వీకరణ
పెద్దపల్లి: జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవోగా ఓదెల మండలానికి చెందిన ఆకుల సంజీవ్ రావు నియమితులయ్యారు. మంగళవారం ఆ యన బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్ రూరల్ ఎంపీడీవోగా పనిచేసిన ఆయన ప దోన్నతిపై ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్షను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. నిస్వార్థ సేవలకు నిదర్శనం కోల్సిటీ: గోదావరిఖని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో మంగళవారం నర్సింగ్ డే ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సూపరింటెండెంట్ అరుణ, ఆర్ఎంవో కృపాబాయి కేక్కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. వారు మా ట్లాడుతూ.. వైద్య సేవల్లో డాక్టర్ల తర్వాత పే షెంట్లకు నిస్వార్థ సేవలు అందించడంలో న ర్సింగ్ అధికారుల పాత్ర కీలకమన్నారు. గ్రేడ్– 1 నర్సింగ్ సూపరింటెండెంట్ మర్దిలీనతోపా టు నర్సింగ్ సూపరింటెండెంట్లు, హెడ్ నర్సింగ్ ఆఫీసర్లు, నర్సింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఓపీ సేవలు ప్రారంభంధర్మారం: నందిమేడారంలోని 30 పడకల ప్ర భుత్వ ఆస్పత్రిలో ఓపీ సేవలను జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ మంగళవారం ప్రా రంభించారు. శ్రీధర్ మాట్లాడుతూ రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించిన 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను మంత్రి లక్ష్మణ్కుమార్, కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచనల మేరకు ప్రారంభించామన్నారు. త్వరలో పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రసవాల సంఖ్య పెంచాలి పెద్దపల్లి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల గణనీ యంగా సంఖ్య పెంచాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి ప్రమోద్కుమార్ సూచించారు. తన కార్యాలయంలో ఆశ కార్యకర్తలు, నోడల్ సూపర్వైజర్లతో మంగళవారం ఆయన సమీక్షించారు. గర్భిణుల వివరాలను ఎర్లీ రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. వేసవిలో వడదెబ్బ నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రోగ్రాం అధికారులు రాజమౌళి, శ్రీరాములు, వాణిశ్రీ , సుధాకర్రెడ్డి, కిరణ్కుమార్, జిల్లా ఆశ నోడల్ ఆఫీసర్ దయామణి పాల్గొన్నారు. నేటినుంచి ఇంటర్ సప్లిమెంటరీపెద్దపల్లి : జిల్లాలో బుధవారం నుంచి ఈనెల 21వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి కల్పన తెలిపారు. రోజూ ఉదయం 9.00 నుంచి మధ్కాహ్నం 12.00 వరకు, మ ధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఫస్ట్ ఇయర్లో 3,664, మంది, సెకండియర్లో 1,414 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందు కు దరఖాస్తు చేశారన్నారు. వీరికోసం 13 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. 17న చెస్ పోటీలు ఎలిగేడు: పెద్దపల్లి అమర్చంద్ కల్యాణమండపంలో ఈనెల 17న వేముల రమణయ్య స్మార క ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెస్ పోటీలు నిర్వహించనున్నట్లు చెస్ సమాఖ్య జిల్లా అధ్యక్ష, కా ర్యదర్శులు గడ్డాల శ్రీనివాస్, బజ్జూరి ప్రసాద్ తెలిపారు. ఆసక్తి గలవారు ఆదివారం రూ.200 ఎంట్రీ ఫీజుతో పేరు నమోదు చేసుకోవాలని కోరారు. వివరాల కోసం 95153 42207 నంబరులో సంప్రదించాలని వారు కోరారు. నెలరోజుల్లో మెడికల్ బోర్డు గోదావరిఖని: నెలరోజుల్లో మెడికల్ బోర్డు ఏ ర్పాటు చేసేందుకు సింగరేణి అంగీకరించినట్లు గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో మంగళవారం జరిగిన సమావేశంలో పలు అంశాలపై డైరెక్టర్ (పా) చర్చించారు. సొంతింటి పథకం తదితర సమస్యలపై వచ్చే స్ట్రక్చర్ మీటింగ్లో చర్చించి అమలు, విధానాలు ఖరారు చేస్తామని హామీ ఇచ్చారని సీతారామయ్య వివవరించారు. -
విద్యార్థుల్లో మేధాశక్తి
గోదావరిఖని/గోదావరిఖనిటౌన్/రామగుండం: ప్ర భుత్వ పాఠశాల విద్యార్థుల్లో అపార మేధోశక్తి ఉంటుందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూ ర్ అన్నారు. టెన్త్లో ప్రతిభ సాధించిన విద్యార్థుల ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవా రం సన్మానించారు. పాలకుర్తి మండలంలోని లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ప లు కాలేజీల్లో విద్యా ప్రణాళిక వారోత్సలు, రామ గుండంలోని పీఎంశ్రీహైస్కూల్లో ప్రయోగశాలను ఎమ్మెల్యే మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్యతో కలిసి ప్రారంభించా రు. నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు. -
పకడ్బందీగా జనగణన గృహ జాబితా
పెద్దపల్లిరూరల్/పెద్దపల్లి: జనగణన గృహ జాబితా ప్రక్రియను పకడ్బందీగా, సమగ్ర ప్రణాళికతో చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. పెద్దకల్వలలో చేపట్టిన జనగణన తీరు సోమవారం ఆ యన పరిశీలించి పలు సూచనలు చేశారు. జూన్ 9వ తేదీ వరకు ఈప్రక్రియ నిర్వహిస్తామన్నారు. నీటి కనెక్షన్, వ్యక్తిగత మరుగుదొడ్డి, ఫోన్, ఇంటర్నెట్, ఆహారపు అలవాట్లు లాంటి 33 ప్రశ్నల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారని అన్నారు. 300 ఇళ్లు.. 800 జనాభాకో ‘బ్లాక్’ జనగణన సర్వే నిర్వహణకు ఇంటింటికీ వెళ్లి ఎన్యు మరేటర్లు వివరాలను సేకరిస్తారని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. 300 ఇళ్లు, 800 జనాభాకో బ్లాక్గా ఏర్పాటు చేసినట్టు వివరించారు. జిల్లావ్యాప్తంగా 1,548 హౌసింగ్ లిస్ట్ బ్లాకులు గుర్తించినట్టు పేర్కొన్నారు. ఎన్యుమరేటర్లు క్యూఆర్కోడ్ ఉన్న ఐడీకార్డులు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లోని గోదామును కలెక్టర్ తనిఖీ చేశారు. తహసీల్దార్ రాజయ్య తదితరులు ఉన్నారు. వందశాతం రైతురిజిస్ట్రీ నమోదు పెద్దపల్లి: జిల్లా వ్యవసాయాధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ, రైతు రిజిస్ట్రీని 100 శాతం పూర్తిచేయాలన్నారు. ముఖ్యంగా కాల్వశ్రీరాంపూర్, పెద్దపల్లి మండలాల్లో 70 శాతానికి పరిమితమైందని తెలిపారు. పెండింగ్ రైతుబీమా దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని చెప్పారు. వచ్చే సీజన్లో యూరియా కొరత తలెత్తకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల వేగాన్ని వెంటనే పెంచాలని అన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బ్యాంకు లింకేజీలో రాష్ట్రంలోనే అగ్రస్థానం స్వశక్తి సంఘాల బ్యాంకు లింకేజిల్లో జిల్లా రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. 2025–26కిగాను 7,716 స్వయం సహాయక సంఘాలకు రూ.477. 86 కోట్ల నిర్దేశిత లక్ష్యానికి 6,851 స్వశక్తి సంఘాల కు రూ.454.66 కోట్లు సాధించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. డీఆర్డీవో కాళిందిని తదితరులను అభినందించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు -
మార్కెట్
ముంచుతున్నమంథని: అకాల వర్షాలు అన్నదాతను ఒకవైపు తరముతూ ఉంటే.. అస్తవ్యస్తమైన మంథని వ్యవసాయ మార్కెట్ వరదనీటితో నిండా ముంచుతోంది. యార్డులో సిమెంట్ ప్లాట్ఫారాలు, చుట్టూ ప్రహరీ ఉండడంతో ధాన్యానికి రక్షణ ఉంటుందనే భరోసాతో రైతులు యార్డులో ధాన్యం ఆరబోస్తున్నారు. కానీ, ప్రతీసారి అకాల వర్షాలు వారి కళ్ల ముందే పంటలను తన్నుకుపోతుంటే కన్నీరు పెట్టుకోవడం తప్ప చేసేదేమీ ఉండడంలేదు. రూ.6 కోట్లతో ఆధునికీకరించినా అవస్థలే వ్యవసాయ మార్కెట్ యార్డును రూ.6 కోట్లకుపైగా వెచ్చించి ఆధునికీకరించారు. 2012లో దాదాపు రూ.4 కోట్ల 56 లక్షలతో 600 మెట్రిక్ ట న్నుల గోదాం, కవర్షెడ్, అంతర్గత రోడ్లు, సిమెంట్ యార్డు, రైతు విశ్రాంతి భవనం, 60 వేల లీటర్ల నిల్వసామర్థ్యం గల వాటర్ ట్యాంకు, యార్డులో విద్యుదీకరణ పనులు చేపట్టారు. 2016లోనూ రూ.30 లక్షల వ్యయంతో డ్రైనేజీ నిర్మించారు. మార్కెట్ యార్డు చుట్టూ ప్రహరీ, ఎదుట రైతువిగ్రహం, కమాన్.. ఇలా సుమారు రూ.6కోట్లు వెచ్చించి అనేక సౌకర్యాలు కల్పించారు. మరో రూ.2 కోట్లతో ప్రతిపాదనలు గతంలో చేపట్టిన పనులు సక్రమంగా లేకపోవడంతో మరమ్మతులు, కొత్త నిర్మాణాల కోసం మరో రూ.2 కోట్లతో ఇటీవల ప్రతిపాదనలు రూ పొందించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు, ఒకగది, దాని ఎదుట షెటర్ల నిర్మాణం ఇందులో ఉన్నా.. ప్రతిపాదనలు పెండింగ్లో ఉండడం కలవరం రేపుతోంది. రూ.కోట్లు వెచ్చించి మార్కెట్ యార్డును ఆధునికీకరించినా.. వర్షపునీరు బయట వెళ్లే మార్గం సరిగ్గా లేదు. దీంతోనే ఏటా ప్రతీసీజన్లో అకాలవర్షంతో వచ్చే వరద ఎక్కడికక్కడే నిలుస్తోంది. ఆరబోసిన, నిల్వచేసిన, తూకం వేయడానికి సిద్ధంగా ఉంచిన ధాన్యం, ఇతర పంట ఉత్పత్తలను వరద తన్నుకుపోతోంది. అన్నదాతలకు అపార నష్టం తెచ్చిపెడుతోంది. కేవలం ప్రణాళిక బద్ధంగా నిర్మాణా చేపట్టకపోవడమే ఇందుకు కారణమని, తద్వారా రైతులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని విమర్శలు ఉన్నాయి. ఓ మోస్తారు వర్షానికే నీరుచేరి ధాన్యం తడిసి ముద్దకావడం, వదరలో కొట్టుకుపోవడం ద్వారా రైతులకు నష్టం వాటిల్లుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మొన్నటికి మొన్న కురిసిన అకాల వర్షానికి టన్నుల కొద్దీ ధాన్యం నీట మునిగింది. మరికొంత సమీపంలోని డ్రైనేజీలోకి కొట్టుకుపోయింది. మార్కెట్లో డ్రైనేజీ వ్యవస్థతోనే వడ్లు తడుస్తున్నాయి. మరమ్మతులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అభివృద్ధి పనులకు ప్రతిపాదించాం. మంత్రి శ్రీధర్బాబు సహకారంతో త్వరలోనే అనుమతులు వస్తాయి. – కుడుదుల వెంకన్న, చైర్మన్, ఏఎంసీ, మంథని -
లైఫ్ డోనర్స్
● వైద్యులకు దీటుగా రోగులకు సేవలు ● భరోసా కల్పించేలా తల్లికి మించి సపర్యలు ● నేడు ప్రపంచ నర్సుల దినోత్సవంనర్సులు.. అమ్మకు మించిన సేవా మూర్తులు. రోగి శరీరంలో చీము, నెత్తురు, గాయాలు, దుర్వాసనలను భరించి శుభ్రపరిచి, ఉపశమన పరచడంలో నర్సులు సేవానిరతికి నిలువెత్తు రూపాలు. కన్న తల్లి, కట్టుకున్న భార్య లేదా భర్త కూడా చేయలేని సేవలు అందిస్తున్న మానవరూపంలో కనిపించే దేవతలు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలను పణంగా పెట్టిన త్యాగశీలురు. ఆధునిక నర్సింగ్ వ్యవస్థాపకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని పురస్కరించుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా మే 12న ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. – కరీంనగర్/కోల్సిటీ(రామగుండం)రాష్ట్రాలను జల్లెడ పడుతున్నారు..!కరీంనగర్క్రైం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్లోని పీఎంజే జువెల్లరీస్ దోపిడీ కేసులో నిందితుల వేట పోలీసులకు ప్రతిష్టాత్మకంగా మారింది. పట్టపగలు కాల్పులు జరిపి రూ.కోట్ల విలువైన బంగారం దోచుకెళ్లిన ఆరుగురు నిందితులు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దొంగతనం జరిగిన రోజు నుంచి కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి పలు రాష్ట్రాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నా.. నిందితులు అడుగడుగునా ఏమరుస్తున్నట్లు తెలుస్తోంది. టవర్ లొకేషన్లతో నిందితుల జాడ దర్యాప్తులో కీలకంగా మారిన మొబైల్ టవర్ లొకేషన్ల ఆధారంగా పోలీసులు ఇప్పటివరకు పశ్చిమబెంగాల్, బిహార్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో గాలింపు చేపట్టినట్లు సమాచారం. నిందితులు తరచూ సిమ్ కార్డులు మార్చడం.. ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయడం, అవసరమైన సమయంలో మాత్రమే ఫోన్లు ఆన్ చేసి మళ్లీ ఆఫ్ చేస్తుండటంతో వారి కచ్చితమైన లొకేషన్ను ట్రాక్ చేయడం పోలీసులకు సవాల్గా మారినట్లు తెలుస్తుంది. ఒకే ప్రాంతంలో ఎక్కువసేపు ఉండకుండా గంటల వ్యవధిలో ప్రాంతాలు మారుస్తూ పోలీసు బృందాలను అయోమయానికి గురిచేస్తున్నట్లు తెలిసింది. బంగారాన్ని పంచుకుని విడిపోయారా..? దోపిడీ అనంతరం ముఠా సభ్యులు కలిసి ప్రయాణించకుండా ప్రణాళిక ప్రకారం విడిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దోచుకున్న బంగారాన్ని వాటాలుగా పంచుకుని వివిధ రాష్ట్రాలకు పారిపోయినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఓ రాష్ట్రంలో బంగారాన్ని విక్రయించే ప్రయత్నం చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ.. పోలీసు అధికారులు మాత్రం అధికారికంగా ఽధ్రువీకరించడంలేదు. అతడి నుంచి కీలక సమాచారం లభించినట్లు.. మరో ఇద్దరు నిందితుల జాడ కూడా పోలీసులు కనిపెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. కాల్స్తోనే క్లూస్.. నిందితులు ఫోన్లు పూర్తిగా వాడకపోయినా కుటుంబసభ్యులు, పరిచయస్తులతో అప్పుడప్పుడు మా ట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ కాల్స్ ఆధారంగానే టెక్నికల్ టీమ్లు వారి కదలికలను విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా రైల్వేస్టేషన్లు, బస్స్టాండ్లు, లాడ్జీలు, బంగారం కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం. అనుమానాస్పదంగా బంగారం విక్రయించే వ్యక్తుల వివరాలను అన్ని రాష్ట్రాలకు పంపినట్లు తెలిసింది. ప్రత్యేక బృందాల ముమ్మర వేట కేసు ఛేదన కోసం కరీంనగర్ కమిషనరేట్ గోప్యంగా పలు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. బృందాలకు రాష్ట్రాలవారీగా బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. స్థానిక పోలీసులు, వివిధ రాష్ట్రాల ఇంటెలిజెన్స్ అధికారుల సహకారంతో నిందితుల నేరచరిత్ర, ముఠా లింకులు, ప్రయాణ మార్గాలపై లోతుగా విచారణ కొనసాగుతోంది. ఇ ప్పటికే ఆరుగురిలో పలువురు నిందితుల జాడ కనిపెట్టగా.. మిగతా వారికోసం వివిధ కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలిసింది. నిందితులు ఎంతదూరం పారిపోయినా.. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
సమస్యల పరిష్కారమే లక్ష్యం
● కలెక్టర్ కోయ శ్రీహర్ష ● ప్రజావాణిలో అర్జీల స్వీకరణపెద్దపల్లి: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను స త్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆ దేశించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణిలో ఆయన జిల్లావాసుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వాటిని పరిశీలించి పరిష్కారం కో సం సంబంధిత శాఖల అధికారులకు పంపించారు. అర్జీలను పెండింగ్లో ఉంచొద్దని ఆయన సూచించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జీవో రద్దు చేయాలి జీవో నంబరు 13ను రద్దు చేయాలి. ఎస్సీ, బీసీ గురుకుల హాస్టల్లో జీవో తో విద్యార్థులు నష్టపోయే ప్రమా దం ఉంది. జీవోను సవరించాలి. ఓపెన్ టెండరు ద్వా రా సరుకులు, పౌష్టికాహారం విద్యార్థులకు అందించాలి. – దాసరి ఉష, బీసీ నేత పెద్దకల్వల భోజన్న చెరువుకు గండిపెట్టిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలి. చెరువులో నీరు ఉండడంతో పశువులకు తాగునీరు లభిస్తుంది. – గుండవేని స్వామి, సలేంద్ర రాములునారాయణరా వుపల్లి సర్వే నంబర్ 606లో 3.35 ఎకరాల ను ఆక్రమించి పండ్లతోటలు పెంచుతున్నరు. ప్రభుత్వ భూమి అయినా.. అందులో దారి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. – కాసర్ల మహేందర్, నారాయణరావుపల్లి -
చిగురిస్తున్న ఆశలు
గోదావరిఖని: సింగరేణిలో కొత్తగనుల ఏర్పాటుతో కార్మిక కుటుంబాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సంస్థ భవిష్యత్ కోసం మెడికల్ బోర్డును యథాతథంగా కొనసాగించాలనే డిమాండ్తో కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని సింగరేణి భవన్లో యా జమాన్యం శనివారం సమావేశమైంది. కొత్తగనుల తవ్వకంలో వేగం పెంచామని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కొనసాగిస్తామని ప్రకటించింది. అదనంగా ఉన్నారని.. సంస్థలో ఏడువేల మంది అదనంగా కార్మికులు ఉ న్నారని చెబుతూ మెడికల్ పూర్తిచేసుకున్న డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించడంలేదు. దీంతో భవిష్యత్లో కొత్త ఉద్యోగాలు కష్టమనే సంకేతాలు వెలువడ్డాయి. ఈక్రమంలోనే సమావేశమైన ఉన్నతాధికారులు.. సంస్థ భవిష్యత్పై పలు నిర్ణయాలు తీసుకున్నారు. తొమ్మిది కొత్త గనులు తవ్విస్తామని ప్రకటించారు. దీంతో కార్మికుల్లో ఉత్సాహం నెలకొంది. తద్వారా మెడికల్ టెస్ట్లు పూర్తిచేసుకొని నిరీక్షిస్తున్న సుమారు 700 మంది డిపెండెంట్ల ఉద్యోగాలకు భ రోసా ఏర్పడినట్లయ్యింది. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల కోసం వెళ్లిన సంస్థ డైరెక్టర్(పా) గౌతం పొట్రూ రాక తో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తోంది. పట్టుబిగిస్తున్న జేఏసీ సింగరేణిని ఆర్థికంగా బలోపేతం చేయాలని, రూ.54వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం నుంచి రాబట్టాలని కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేస్తోంది. ఈక్రమంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూ సీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, టీబీజీకేఎస్ ఉద్యమానికి నడుంబిగించాయి. మెడికల్ బోర్డు ప్రారంభంపై.. అనారోగ్యం బారిన పడిన కార్మికుల డిపెండెంట్లకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఈ ప్రక్రియ రెండేళ్ల క్రితమే నిలిచిపోయింది. చాలా కుటుంబాలు మెడికల్ బోర్డు కోసం ఎదురు చూస్తున్నాయి. నూతన గనుల ఏర్పాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, తద్వా రా సుమారు 20ఏళ్లపాటు సంస్థ భవిష్యత్కు ఎలాంటి ఢోకా ఉండదని సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో కారుణ్య నియమాకాలకు గ్రీన్సిగ్నల్ వస్తుందనే ఆశతో కార్మికులు, వారి వారసలు ఎదురుచూస్తున్నారు. -
ఆర్డీవో ఆఫీసుల్లో అంతంతే..
పెద్దపల్లిరూరల్: ఆర్డీవో కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన ప్రజావాణిలో ఒకేఒక్క ద రఖాస్తు అందింది. కాల్వశ్రీరాంపూర్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం.. ఆస్తి విషయంలో తలెత్తిన వివాదంపై ఫిర్యాదు చేసిందని అధికారులు తెలిపారు. ఈనెల 4న నిర్వహించిన తొ లి ప్రజావాణిలో రెండే అర్జీలు అందాయి. ప్రతీ సోమవారం ఆర్డీవో కార్యాలయంలోనూ ప్రజావాణి నిర్వహిస్తామని ప్రచారం చేయడంలో అధికారులు విఫలం కావడంతోనే ఈ దుస్థితి తలెత్తిందనే విమర్శలు ఉన్నాయి. సాగుకు సిద్ధం కావాలి కమాన్పూర్: వానాకాలం సాగుకు రైతులు సిద్ధ కావాలని జగిత్యాల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అర్చన సూచించారు. గుండారం రైతువేది కలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో అర్చన మాట్లాడారు. భూసార పరీక్ష తర్వాతే నివేదిక ఆధారంగా వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటలు వేయాలని సూచించారు. ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు, ఏవో రా మకృష్ణ, ఏఈవో అనుష, రైతులు పాల్గొన్నారు. అందుబాటులో మందులు పెద్దపల్లి: జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పితోపాటు వడదెబ్బ నివారణకు అవసరమైన మందులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో అందుబాటు లో ఉన్నాయి. ప్రధానంగా ప్రస్తుతం వేసవి కా వడంతో వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎ క్కువని, బాధితులకు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచి త వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా రైతులు, మహిళలెవరూ ఇళ్లనుంచి బయటకు వెళ్లరాదని జిల్లా వైద్యాధికారి ప్రమోద్కుమార్ సూచించారు. అత్యవసరమైన వారు ఒక వేళ బయటుకు వెళ్తే జాగ్రత్తలు తీసుకోవాలని, వడదెబ్బకు గురైతే వెంటనే ఆస్పత్రికి రావాల ని సూపరింటెండెంట్ శ్రీధర్ సూచించారు. వేసవి శిబిరాలతో మేలు ఓదెల: వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని డీఈవో శారద సూచించారు. స్థానిక కేజీబీవీలో సమ్మర్ క్యాంపుపై సోమవారం అవ గాహన కల్పించారు. శిబిరాల్లో చెస్, యోగా, చిత్ర లేఖనం, డ్యాన్స్, మ్యూజిక్, కంప్యూటర్, స్పీడ్ మ్యాథ్స్, స్పోకెన్ ఇంగ్లిష్ తదితర అంశాలపై తర్ఫీదు ఇస్తున్నామని చెప్పారు. ఎంఈవో రమేశ్, ఎస్వోలు జ్యోతి, శ్రీదేవి, మంజుల, కల్పన, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రేపటి నుంచి కౌన్సెలింగ్ పెద్దపల్లి: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ స్కూల్ కు ఎంపికైన విద్యార్థులకు ఈనెల 13, 14వ తే దీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారని జిల్లా యువజ న, క్రీడల శాఖ అధికారి సురేశ్ తెలిపారు. ఆధా ర్, ఎస్సెస్సీ మెమో, స్పోర్ట్స్, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు, 5 పాస్పోర్ట్ సైజ్ఫొటోలు వెంట తీసుకె ళ్లాలని పేర్కొన్నారు. స్పోర్ట్స్ స్కూల్కు ఎంపికై న వారిలో ఆరెల్లి హిమాన్ష్,(గోదావరిఖని), క థెరమల్ల శ్రేనిక్(అంతర్గాం), కుక్కల శివ కేశవ(అమర్నగర్, పెద్దపల్లి), పటిబండ్ల వికుల్(రామగుండం), గోపతి అనన్య(ఓదెల), తంగెళ్ల శ్రీహిత(సుల్తానాబాద్), చెర్ల ఆకాంక్ష(పెద్ద పల్లి) ఉన్నారని, వివరాలకు 99639 60063 నంబరులో సంప్రదించాలని సూచించారు. జనగణనపై ఆరా కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరంలో సోమవారం తొలిదశ జనగణన ప్రక్రియ ప్రారంభమైంది. 400 మంది ఎన్యుమరేటర్లు హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ చేపట్టారు. 60 మంది సూపర్వైజర్లు పర్యవేక్షిస్తున్నారు. పట్టణ ప్రణాళికా విభాగం జాయింట్ డైరెక్టర్ సుబ్బారావు నిర్వహణ తీరు పర్యవేక్షించారు. జనగణన జి ల్లా కో ఆర్డినేటర్ శ్రీకాంత్, ఏసీపీ శ్రీహరి, ఫీల్డ్ ట్రైనర్ అంజన్ కుమార్ తదితరులు ఉన్నారు. -
ఆహ్లాదం పంచేలా ఆధునికీకరణ
పెద్దపల్లిరూరల్: పట్టణవాసులకు ఆహ్లాదం పంచే లా బంధంచెరువు కట్టను రూ.3.14కోట్లతో మినీట్యాంకుబండ్గా సుందరీకరిస్తామని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. బంధంచెరువు అభి వృద్ధి పనులను మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, కౌన్సిలర్ పూరెళ్ల శైలజ – సుధాకర్, కమిషనర్ వెంకటేశ్ తో కలిసి సోమవారం ప్రారంభించారు. పలు కార్య క్రమాల్లోనూ పాల్గొన్నారు. ఐటీఐ వాకర్స్ కోసం రూ.10లక్షలతో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కౌన్సిలర్ కొమ్ము సుధాకర్, తిరుపతి, వెంకటరెడ్డి, ముడుసు సాంబిరెడ్డి తదితరులు ఉన్నారు. -
ఓదెల మల్లన్నకు పూజలు
ఓదెల: ఓదెల మల్లికార్జునస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిథ ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చారు. కోనేరులో స్నానాలు ఆచరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఒగ్గు పూజారులతో పట్నాలు వేయించారు. స్వామివారికి బోనాలతో నైవేద్యం స మర్పించారు. ఆలయ ఈవో సదయ్య ఆధ్వర్యంలో ఏర్పాట్లు పర్యవేక్షించారు. అర్హులకు మంచివేతనాలు ఫెర్టిలైజర్సిటీ: ఆర్ఎఫ్సీఎల్ కాంట్రాక్ట్ కార్మికు ల్లో అర్హులకు స్కిల్డ్ వేతనాలు చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. కర్మాగారంలో రెండు రోజులపాటు సమ్మె చేయగా.. రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాగూర్ మక్కాన్సింగ్, మంత్రి శ్రీధర్బాబు హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. ఈమేరకు ఆదివారం హైదరాబాద్లో ఆ ర్ఎఫ్సీఎల్ సీఈవో సంజీవ్ గులేటి, మంత్రి శ్రీ ధర్బాబు, ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మధ్య జరిగి న చర్చలు ఫలించాయి. సెమీస్కిల్డ్ కార్మికులకు స్కిల్డ్, అన్స్కిల్డ్వారికి సెమీస్కిల్డ్ వేతనాలు దశలవారీగా చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. ఇతర సమస్యల పరిష్కారానికీ అంగీకారం కుదిరిందని కార్మిక నేత నెలకంటి రాము తెలిపారు. సర్పంచ్ ఎరుకల అంజిబాబు, మాజీ సర్పంచ్ చిట్టబోయిన రాజ్కు మార్, నాయకులు కన్నూరి శంకర్, కందుల సతీశ్, మల్లేశ్, మహేందర్, సురేశ్ ఉన్నారు. నేడు అప్రెంటిషిప్ మేళా రామగుండం: స్థానిక ఐటీఐ, ఏటీసీలో సోమ వారం అప్రెంటిషిప్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ సురేందర్ తెలిపారు. బసంత్నగర్ అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ, బెంగళూరు ఆదర్శ ఆటోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్, ఎల్ అండ్ టీ కన్స్ట్రక్షన్ కంపెనీ, హైదరాబాద్ రాణే ఇంజిన్ వాల్వ్ లిమిటెడ్, స్కేనిదన్ ఎలక్ట్రికల్స్, తోషిబా మాన్యుఫాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఉషా ఇంటర్నేషనల్ లిమిటెడ్, రేడియల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్, వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్(కరీంనగర్), హైదరాబాద్ ఫాక్సన్ ప్రైవేట్ లి మిటెడ్, సంగారెడ్డి రాణే ప్రైవేట్ లిమిటెడ్ తదితర కంపెనీలు మేళాకు హాజరుకానున్నాయన్నారు. ఆసక్తి వారు ఉదయం 10 గంటలకు ఐ టీఐకి చేరుకోవాలని, టెన్త్, ఐటీఐ, ఆధార్కా ర్డు, పాస్పోర్టు సైజు ఫొటోలు, బ్యాంకు పాస్బుక్, కుల ధ్రువీకరణపత్రం, అప్రెంటిషిప్ రి జిస్ట్రేషన్ కాపీలతో హాజరు కావాలని కోరారు. 700 శ్లోకాలు కంఠస్థం కాల్వశ్రీరాంపూర్: స్థానిక ఆర్యవైశ్యులు కోలేటి రమాదేవి – రామన్న దంపతులు భగవద్గీత లోని 700 శ్లోకాలు కంఠస్థం చేశారు. దీంతో క ర్నాటక మైసూర్లోని శ్రీగణపతి సచ్చితానంద స్వామి ద్వారా ఆదివారం అంతర్జాతీయ మా తృ దినోత్సవం సందర్భంగా గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష కార్యదర్శులు రాఘవులు, అశోక్, ప్రతినిధులు జ్యోతి, వనజ, శోభ, శ్రీలత అభినందించారు. 26న స్పోర్ట్స్ కౌన్సిల్ ఎన్నికలు జ్యోతినగర్: ఎన్టీపీసీ స్పోర్ట్స్ కౌన్సిల్– 2026– 27 ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 26 న పోలింగ్ నిర్వహిస్తారు. జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ ఒక్కోటి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈనెల18 నుంచి 20 వరకు రో జూరాత్రి 7 నుంచి రాత్రి 8 గంటల వరకు మ హాత్మాగాంధీ క్రీడా మైదానం కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. 26న ఉదయం 6నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, అదేరోజు ఫలితాలు ప్రకటించనున్నారు. అభ్యర్థులు ఎన్టీపీసీ ఉద్యోగులై ఉండాలి. 2026 ఏప్రిల్ 30 నాటికి స్పోర్ట్స్ కౌన్సిల్ సభ్యత్వం కలిగి ఉండాలి. విద్యుత్ ఉత్పత్తి నిలిపివేతజ్యోతినగర్: ఎన్టీపీసీలో ఆదివారం నాలుగు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు. విద్యుత్ డిమాండ్ పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నాలుగు నెలలుగా ప్రతీనెల కొ న్నిరోజులపాటు యూనిట్లను షట్డౌన్ చేస్తున్నారు. ఆదివారం ఒకేసారి 4యూనిట్లలో వి ద్యుత్ నిలిపివేశారు. తద్వారా రామగుండం ప్రాజెక్టులో 1,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కి నిలిచిపోయింది. తెలంగాణ ప్రాజెక్ట్లోని రెండు యూనిట్లనూ సగం లోడ్తోనే నిర్వహిస్తున్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెరగడం, రా ష్ట్రాల నుంచి విద్యుత్ డిమాండ్ తగ్గడంతో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి తగ్గించారంటున్నారు. -
ప్రాణాలు పిండేస్తున్నారు..
ఇది కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని అంబులెన్స్. పేదల పార్థివదేహాలను ఇళ్లకు తరలిస్తున్నారు. ఆస్పత్రులకు పేషెంట్లనూ తీసుకొచ్చి, మళ్లీ తీసుకెళ్లేందుకూ వినియోగిస్తున్నారు. ఈ సేవలన్నీ ఉచితంగానే అందిస్తున్నారు. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు పార్థివదేహాలను తరలించేందుకు అందినకాడికి దోచుకుంటున్నారు. కోల్సిటీ(రామగుండం): ప్రాణాపాయంలో ఉన్నవారిని ఆస్పత్రికి తరలించేందుకు రవాణా చార్జీలు అధికంగా వసూలు చేస్తున్న ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు.. పార్థివ దేహాలను తీసుకెళ్లేందుకూ కుటుంబ సభ్యుల నుంచి ముక్కుపిండి మరీ వ సూళ్లకు తెగబడుతున్నారు. ముఖ్యంగా గోదావరిఖ ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) వద్ద కొంద రు డ్రైవర్లు సిండికేట్గా ఏర్పడ్డారు. బాధలో ఉన్నా రనే కనీస కనీకరం కూడా లేకుండా మృతుల కు టుంబ సభ్యుల జేబులు ఖాళీ చేస్తున్నారు. చికిత్స పొందుతూ మృతి చెందిన ఓ వద్ధురాలి మృతదేహాన్ని 2.6 కి.మీ.దూరంలోని గోదావరిఖనిలోని అశోక్నగర్ తరలించడానికి ఓ అంబులెన్స్ డ్రైవర్ ఏకంగా రూ.1,500 వరకు వసూలు చేయడం ఆర్థిక దోపిడీకి నిదర్శనంగా నిలుస్తోంది. తక్కువ దూ రమే ఉన్నా.. తమ పరిస్థితిని ఆసరాగా చేసుకుని అధిక మొత్తం డిమాండ్ చేశారని మృతురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్కు ప్రత్యామ్నాయం లేకపోవడం, మృతదేహాన్ని త్వరగా ఇంటికి తీసుకెళ్లాల్సి రావడంతో డ్రైవర్ అడిగిన మొత్తం చెల్లించక తప్పలేదని కన్నీటిపర్యంతమయ్యారు. ‘సిండికేట్’లో సిబ్బంది హస్తం? ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల దోపిడీ వ్యవహారంలో జీజీహెచ్లోని కొందరు సిబ్బంది హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. డ్రైవర్లతో కొందరు సిబ్బంది నేరుగా టచ్లో ఉంటున్నారు. పేషెంట్లను కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ తదితర దూరప్రాంతాల్లోని ఆస్పత్రులకు రెఫర్ చేయాల్సి వచ్చినా.. ఆస్పత్రి నుంచి మృతదేహాలను స్వస్థలాలకు తీసుకెళ్లాల్సి వచ్చినా.. ‘నాకు తెలిసిన అంబులెన్స్ డ్రైవర్లు ఉన్నారు.. తక్కువ చార్జీ తీసుకుంటారు’ అని బాధిత కుటుంబ సభ్యులకు చెబుతూనే, డ్రైవర్లకు సమాచారం అందిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న అంబులెన్స్ డ్రైవర్లు క్షణాల్లో ఆస్పత్రికి చేరుకుని రేట్లు నిర్ణయిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఇందుకు కమీషన్ల వ్యవహారమే కారణమంటున్నారు. ఆస్పత్రుల్లో ధరల పట్టిక లేకపోవడంతో డ్రైవర్లు అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం కూడా మరో కారణమని అంటున్నారు. పార్థివ దేహాలను తరలించేందుకు అధిక వసూళ్లు ‘ఖని’ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల ఇష్టారాజ్యం జీజీహెచ్లో ఉచిత సేవల వాహనం అందుబాటులో లేకపోవడమే కారణం -
‘బట్టీ’ బాబుల బరితెగింపు
పెద్దపల్లి, సాక్షి/పెద్దపల్లి: రైతులకు సాగునీరు అందించే, మత్స్యకారులకు ఉపాధి కల్పించే చెరువులను కొందరు ఇటుకబట్టీ యజమానులు చెరబడుతున్నారు. ఇటుకల తయారీకి బంకమట్టి వినియోగిస్తారు. జిల్లావ్యాప్తంగా పలు చెరువుల్లో బంకతోకూడిన నల్లరేగడి మట్టి లభిస్తోంది. ఈక్రమంలో రెండు చెరువుల్లో బంకమట్టి తవ్వకాల కోసం ఇటుకబట్టీ యజమానులు ఇటీవల దరఖాస్తు చేశారు. ఇందు లో పెద్దపల్లి, సుల్తానాబాద్ మండలాల మధ్యలోని కొదురుపాక గ్రామ శివారులోని సర్వే నంబర్ 805లో 76.19ఎకరాల్లో విస్తరించిన ఎల్లమ్మ చెరువు ఉంది. ఇందులో 28వేల క్యూబిక్ మీటర్ల మట్టితవ్వకాల కోసం అనుమతి ఇవ్వాలని విన్నవించారు. అ క్కడి వరకు సవ్యంగానే ఉన్నా, అనుమతులు పొందటానికి చెరువు నీటిని ఖాళీ చేసేందుకు తూముకు గండికొట్టారు. ఈ విషయంపై మత్య్సకారులు ఇప్పటికే కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అధికార యంత్రాంగంతోపాటు రాజకీయ నేతల అండదండలు ఉండడంతోనే ఇటుకబట్టీ యజమానులు ఇలా బరితెగించినట్లు కొదురపాక గ్రామస్తులు, మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. మట్టి కోసం రెండు దరఖాస్తులు.. ఇటుకబట్టీ యజమానులు ముత్తారం మండలంలో ఒకటి, సుల్తానాబాద్ మండలంలోని కొదురుపాక ఎల్లమ్మ చెరువులో బంకబట్టి తీసుకెళ్లేందుకు అధికారులకు ఇటీవల దరఖాస్తు చేశారు. అనుమతి కోసం కలెక్టర్కు సిఫారసు చేసినట్లు మైనింగ్ అధికారులు చెబుతున్నారు. సీనరేజీ చెల్లించి, గ్రామ పంచాయతీ తీర్మానం చేసి, రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ శాఖల అనుమతి తీసుకుని వాల్టా మేరకు తవ్వకాలు చేపట్టాలి. దీనిని ఆసరాగా చేసుకుని జిల్లాలో ఏటా వేసవిలో నామమాత్రపు అనుమతితో పలు చెరువుల్లో మట్టి లూటీ చేస్తున్నారు. ప్రస్తుతం నీళ్లు పుష్కలంగా ఉన్న చెరువుకే అక్రమార్కులు ఏకంగా గండికొట్టారు. ఇందుకు అధికార యంత్రాగం ఎలా సహకరిస్తోందో అర్థం చేసుకోవచ్చు.చేపలు పడుతున్న మత్స్యకారుడు చెరువు తూము ధ్వంసం చేసి.. నీళ్లు వదిలేసి.. మట్టి తవ్వకాల కోసం అక్రమార్కుల ఆగడాలు కొదురుపాక చెరువుకు ఇటుకబట్టీ నిర్వాహకుల టెండర్ ఉపాధి దెబ్బతీస్తున్నారంటున్న మత్స్యకారులు, గ్రామస్తులు చెరువుల్లో చేపల వేట రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాల భూముల్లో అక్రమంగా చేపల చెరువులు తవ్వారు. అందులో పెంచే చేపలకు కోళ్ల వ్యర్థాలను దాణాగా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అందులోని వరద ప్రాజెక్టులోకి చేరడంతో నీరు కలుషితమవుతందని అధికారులకు ఫిర్యాదు అందాయి. స్పందించిన ఉన్నతాధికారులు.. చెరువులను తొలగించాలని ఇటీవల ఆదేశాలు జారీచేశారు. పొట్యాల, సోమనపల్లి, ముర్మూరులో చేపల చెరువులు ఉన్నాయని, వాటిలోని చేపలు పట్టుకొని చెరువులు పూడ్చివేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో మత్స్యకారులు చేపలు పట్టుకుని వ్యాన్లో తరలించేందుకు సిద్ధమయ్యారు. సొంత స్థలంలో ఫిషరీష్ అధికారుల అనుమతులతో సోమనపల్లి, ముర్మూర్ గ్రామాల్లో చెరువులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. -
సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య
పెద్దపల్లిరూరల్: సర్కారు బడుల్లోనే నాణ్యమైన ఉచిత విద్య అందుతోదంని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నా రు. టెన్త్లో 500కుపైగా మార్కులు సాధించిన ప్ర భుత్వ పాఠశాలల విద్యార్థులను జిల్లా కేంద్రంలో ఆదివారం యూత్కాంగ్రెస్ ఆధ్వర్యంలో అభినందించారు. విప్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల ల్లో చదివే విద్యార్థులకు అన్ని వసతులు కల్పి స్తున్నామని తెలిపారు. ఎంఈవో సురేందర్, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, యువజన కాంగ్రెస్ జిల్లా అ ధ్యక్షుడు బొంకూరి అవినాష్, కౌన్సిలర్లు గుజ్జుల కు మార్, పూదరి మహేందర్, మంథని నర్సింగ్, న దీం, నాయకులు తూముల సుభాష్రావు ఉన్నారు. పంచాయతీ భవనం ప్రారంభం సుల్తానాబాద్రూరల్: దుబ్బపల్లి గ్రామ పంచాయతీ భవనాన్ని విప్ విజయరమణారావు ప్రారంభించారు. సర్పంచ్ శోభ, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్రావు, పంచాయతీ కార్యదర్శి ప్రత్యూష పాల్గొన్నారు. -
తీర్మానం చేయలేదు
ఇటుకబట్టీ యజమానులు చెరువు మట్టి తీసుకెళ్తున్నారనే విషయం నాకు తెలియదు. పంచాయతీ పాలకవర్గం కూడా తీర్మానం చేయలేదు. వనరులను దోచుకొని వెళ్తామంటే చూస్తూ ఊరుకునేదిలేదు. – సట్టు ఉత్తమ కుమారి, సర్పంచ్, కొదురుపాక నీరుండగానే టెండరా? ఎల్లమ్మ చెరువులో చేపపిల్లలు వేసుకుని రెండేళ్లవుతంది. వాటిని పట్టుకోకముందే కొందరు ఇటుకబట్టీ యజమానులు రాత్రివేళల్లో కాల్వతీసి నీటిని బయటకు పంపుతున్నారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశాం. – కొమురయ్య, రాకేశ్, మత్స్యకారులు చెరువే ఆధారం చెరువు వందలాది కుటుంబాలకు ఆధారం. మత్స్యకారులతోపాటు చెరువు కింద సాగుభూమి అధికంగా ఉంది. అలాంటి చెరువులోంచి మట్టి తరలించుకపోవాలని చూస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. – చాతరాజు రమేశ్, గ్రామస్తుడు, కొదురుపాక అనుమతి ఇవ్వలేదు ముత్తారం చెరువు, సుల్తానాబాద్ మండలం కొదురుపాక ఎల్లమ్మచెరువుల్లో 28 వేల క్యూబిక్ మీటర్ల వరకు మట్టి తీసుకునేందుకు రెండు దరఖాస్తులు వచ్చాయి. విచారణ చేసి అనుమతి కోసం ఉన్నతాధికారులకు నివేదించాం – శ్రీనివాస్, మైనింగ్ ఏడీ, పెద్దపల్లి -
మల్లయ్యతో ఐఏఎస్ అధికారి భేటీ
గోదావరిఖని: కేంద్ర ప్రభుత్వ రూరల్ డెవలప్మెంట్ జాయింట్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి ఆదివారం టీజీబీకేఎస్ వ్యవస్థాపక కన్వీనర్ కెంగర్ల మల్లయ్యతో భేటీ అ య్యా రు. గోదావరిఖనిలో మల్లయ్య నివాసానికి వెళ్లిన ఐఏఎస్ అధికారి నరహరి.. ఆయనతో కాసేపు మా ట్లాడారు. నరహరిని మల్లయ్య సాదరంగా ఆహ్వానించి ఆత్మీయ సన్మానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, సింగరేణిలో బీసీల ప్రాతినిధ్యం గురించి వారిద్దరూ చర్చించారు. సింగరేణిలో టీజీబీకేఎస్ ఏర్పాటుపై నరహరి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. నరహరిని సింగరేణి బీసీ సంఘం నాయకులు చిలుక శ్రీనివాస్, దీటి చంద్రమౌళి ఘనంగా సన్మానించారు. నాయకులు దొడ్ల సతీశ్, పైండ్ల మహేందర్, కాసిపేట రవి, నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు. -
అమ్మ జ్ఞాపకంగా నిత్యాన్నదానం
సప్తగిరికాలనీ(కరీంనగర్): చిన్నతనంలోనే అమ్మ దూరమవగా.. తన జ్ఞాపకార్థం వేల మంది కడుపు నింపుతున్నాడు రేకుర్తికి చెందిన చెందిన గోదరి జితేందర్. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లికి చెందిన ఆయన రేకుర్తిలో స్థిరపడ్డాడు. తన రెండేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయాడు. ఆమె జ్ఞాపకార్థం 2016 ఫిబ్రవరి 15న గోదరి కాంతలక్ష్మి సేవా సమితిని స్థాపించాడు. ‘అమ్మ ప్రేమ.. సమాజ సేవ’ నినాదంతో 2020 నవంబర్ 27 నుంచి ప్రారంభించిన నిత్యాన్నదానం నేటికి 1,987 రోజులుగా నిరంతరంగా కొనసాగుతోంది. భార్య శరణ్య, స్నేహితులు, బంధువుల సహకారంతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. తాను బతికున్నంతకాలం అమ్మ జ్ఞాపకార్థం నిత్యాన్నదానం కొనసాగుతుందని జితేందర్ చెబుతున్నాడు. -
నా వెంటే నా పిల్లలు..
ఇల్లంతకుంట: నేను, మా ఆయన వెంకటేశ్వరరెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయులం. మాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి చైత్ర 8వ తరగతి, చిన్నమ్మాయిని ఫ్రీ ప్రైమరీ స్కూల్లో చేర్పించా. పిల్లలిద్దరినీ నేను పని చేసే పాఠశాలలోనే చదివిస్తున్నా. విధులు నిర్వహిస్తూ కుటుంబ బాధ్యతలు, పిల్లలను చూసుకోవడం కష్టంగానే ఉన్నా ఇష్టంగానే చేస్తుంటా. ఉదయం 4 గంటలకు లేచి ఇంటి పని చేసుకుని పిల్లలను స్కూల్కు వెళ్తాం. ఇంటి పనుల్లో భర్త చేదోడు వాదోడుగా ఉంటారు. విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతో గడుపుతూ వారికి మంచి విలువలు, సంప్రదాయాలు నేర్పిస్తా. – సుప్రియ, ప్రభుత్వ టీచర్, ముస్కానిపేట -
ఎల్లంపల్లి ప్రాజెక్టు సందర్శన
రామగుండం: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ శని వారం ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించారు. వేసవి దృష్ట్యా జిల్లావాసులకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా తీసుకునే చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. నీటినిల్వలపైనా చర్చించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.22 టీఎంసీల నీరు ఉందని అధికారులు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుత నీటి నిల్వలతో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదని వివరించారు. రాగినేడులో ప్రత్యేక పూజలు పెద్దపల్లిరూరల్: రాగినేడులోని స్వయంభూ శ్రీనాగలింగేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈసందర్భంగా వేదపండితులు హోమయజ్ఞం, ప్రత్యేక పూజ లు నిర్వహించారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దామోదర్ హాజరయ్యారు. రాగినేడుతోపాటు పెద్దపల్లి, పరిసర గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. అనంత రం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ సోమకుమార్, గుమ్మడి విజయ్, కోలేటి రమేశ్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. స్పోర్ట్స్ స్కూల్కు ఎంపిక రామగుండం: అంతర్గాం మండలం ఎగ్లాస్పూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మూడో తరగతి విద్యార్థి కత్తెరమల్ల శ్రేణిక్ స్పోర్ట్స్ స్కూల్కు ఎంపికయ్యాడు. ఈమేరకు ఎంఈవో ముక్కెర సంగీత శనివారం శ్రేణిక్ను అభినందించారు. మారుమూల ప్రాంతం నుంచి స్పోర్ట్స్ స్కూల్కు ఎంపికయ్యేందుకు కృషి చేసిన పీఈటీ తిరుపతికి సంగీత కృతజ్ఞతలు తెలిపారు. ఘనంగా మాస కల్యాణం కమాన్పూర్: ప్రసిద్ధ శ్రీఆదివరాహస్వామి మా స కల్యాణమహోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన భ క్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్య క్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ముస్త్యాల దామోదర్, ఈవో కాంతారెడ్డి, డైరెక్టర్లు బొజ్జ సతీశ్, తీగల రాజయ్య, కొంతం శ్రీనివాస్, కుందారపు శంకర్ పాల్గొన్నారు. రైల్వేస్టేషన్లో తనిఖీలు రామగుండం: సివిల్, రైల్వే, ప్రభుత్వ రైల్వే పోలీసులు స్థానిక రైల్వేస్టేషన్లో శనివారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. గంటపాటు ప్రయాణికుల రాకపోకలు పరిశీలించారు. పొరుగు రాష్ట్రాలకు చెందిన ప్రయాణికుల ఆధార్కార్డులపై ఆరా తీశారు. అనుమానాస్పద ప్రయాణికుల లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మాదకద్రవ్యాలు, గంజాయి రవాణాకు రైళ్లను ఎంచుకుంటుండడంతో తనిఖీలు చేశామని రామగుండం సీఐ కృష్ణకుమార్ తెలిపారు. ఎప్సెట్ ప్రారంభం రామగిరి: మంథని జేఎన్టీయూలో శనివారం ఎప్సెట్ ప్రశాంతంగా ప్రారంభమైంది. మూ డు రోజుల పాటు పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు. తొలిరోజు ఉదయం 90మందికి 84 మంది, మధ్యాహ్నం 90 మందికి 83మంది పరీక్షకు హాజరయ్యారు. మెకానికల్ ప్రొఫెసర్ చెరుకు శ్రీధర్రెడ్డి పరిశీలకులుగా వ్యవహరించారు. ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. -
‘బంగారు’ తల్లి..
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్కాలనీకి చెందిన బంగారు లక్ష్మి–రాజయ్య దంపతులకు ఐదుగురు కూతుళ్లు. వారి చిన్నతనంలోనే 2000 సంవత్సరంలో అనారోగ్యంతో రాజయ్య మృతిచెందాడు. అప్పటి నుంచి లక్ష్మి కూరగాయలు విక్రయిస్తూ, కూలీ పనులు చేస్తూ కూతుళ్లను చదివించి అందరికీ పెళ్లి చేసింది. ప్రసుత్తం చిన్న కిరాణ షాపు నడుపుతోంది. పెద్ద కుమార్తె స్వరూప డిగ్రీ పూర్తి చేసి ఆశవర్కర్గా ఉద్యోగం చేస్తోంది. రెండో కూతురు మంజుల 10వ తరగతి చదివి ఇంట్లోనే కుట్టు మిషన్ వర్క్ చేసుకుంటోంది. మూడో కూతురు రమాదేవి ఎంబీఏ చదివి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. నాలుగో కుమార్తె పద్మిని పీజీ చేసింది. ఐదో కుమార్తె సంగీత పీజీ (ఎమ్మెస్సీ) పూర్తి చేసి కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తోంది. -
స్వీయ జనగణనలో పాలుపంచుకోవాలి
కోల్సిటీ(రామగుండం): స్వీయ జనగణనలో ప్రతీ కుటుంబం తమ వివరాలు నమోదు చేసుకోవాలని రామగుండం బల్దియా డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి సూచించారు. స్వీయ జనగణనపై అవగాహన కల్పించేందుకు శనివారం బల్దియా కార్యాల యం శనివారం 2కే రన్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎన్యుమరేటర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, మెప్మా సిబ్బంది, ఆర్పీలు పాల్గొన్నారు. చౌరస్తా వరకు సాగిన ఈ కార్యక్రమంలో తె లంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాటలు, ఆటలతో అవగాహన కల్పించారు. అసిస్టెంట్ సిటీ ప్లానర్(ఏసీపీ) శ్రీహరి పలు అంశాల గురించి వివరించారు. స్వీయ జనగణన ప్రక్రియ నీనెల 10వ తేదీతో ముగుస్తుందని తెలిపారు. https://se. census.gov.in/ వెబ్సైట్లో తమ వివరాలను సులభంగా వివరాలు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో బల్దియా కార్యదర్శి మహేశ్వర్రెడ్డి, సూపరింటెండెంట్లు ఆంజనేయులు, శ్రీనివాస్, అకౌంటెంట్ రవితేజ, ఎన్యుమరేటర్లు అంజన్కుమార్, స్వరూప్చంద్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ మధుకర్, మెప్మా టీఎంసీ మౌనిక, సీవోలు తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్, బీజేపీ బలనిరూపణకే అల్లర్లు
ముత్తారం: బీఆర్ఎస్, బీజేపీ నాయకులు బలనిరూపణ కోసం అల్లర్లు సృష్టిస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్లో శనివారం మంత్రి ఇందిరమ్మ గృహప్రవేశం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పరస్పరం దాడులు చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ జిల్లాను హింసాత్మకం చేస్తున్నారని విమర్శించారు. గూండాయిజం, రౌడీయిజంతో కొట్లాడుకుంటూ ప్రశాంతతను దెబ్బతీస్తున్నారని అరోపించా రు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, బీ జేపీ మిత్ర పక్షంగా ఉంటూ అధికారం లేకపోవడంతో అల్లర్లు సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. కేసీఆర్, కేటీఆర్ పేదలకు గూడు ఇవ్వలేక మొసలికన్నీరు కార్చుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, జిల్లా ఉపాధ్యక్షుడు చోప్పరి సదానందం, మాజీ జెడ్పీటీసీ నాగినేని జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్బాబు పర్యటన కమాన్పూర్/మంథనిరూరల్/రామగిరి/ముత్తారం: మంత్రి శ్రీధర్బాబు మంథని డివిజన్లో పర్యటించారు. తొలుత మంథని–పెద్దపల్లి మధ్య కమాన్పూర్ ఎక్స్రోడ్డు వద్ద నిర్మిస్తున్న బస్సు సెల్టర్ పరిశీలించారు. ఆయన వెంట సర్పంచ్ రంగు సత్యనారాయణగౌడ్, కమాన్పూర్, గుండారం వార్డు సభ్యులు గొడిసెల లింగస్వామి, పిడుగు సదయ్య, నాయకులు భూంపెల్లి రాజయ్య, లల్లూ ఉన్నారు. మంథని మండలం సూరయ్యపల్లిలో నిర్వహించిన భూలక్ష్మి, మహాలక్ష్మి సహిత బొడ్రాయి ప్రతిష్ఠాపన, పోచమ్మ కొలుపులో మంత్రి శ్రీధర్బాబు పూజలు చేశారు. సర్పంచ్ ఆర్ల నాగరాజు, ఉపసర్పంచ్ ఆరెల్లి సుచిత – వరుణ్గౌడ్ తదితరులు ఉన్నారు. రామగిరి మండలం బేగంపేట గ్రామస్తులు దాసరి శివ, కుంట బక్కయ్య, బొంతల రమేశ్, రుద్రవేణ మల్లేశ్, కట్టగోని పోచాలు, అంకితి కుమార్, అబ్రార్ గోగుల శంకర్, ఏట రమేశ్, జెట్టవేన రంజిత్, పోతరవేన శంకర్, బందారపు కుమార్ తదితరులు మంత్రిని శాలువాతో సన్మానించారు. అనంతరం ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్లో జరిగిన ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపనలో మంత్రి పాల్గొన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, మాజీ ఎంపీటీసీ గీతారాణి, గీత కార్మికులు దేశిని రాజేశం, గట్టు సదయ్య, వీరగోని అంజి, గట్టు మహేశ్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చోప్పరి సదానందం, మాజీ జెడ్పీటీసీ నాగినేని జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
బైసాస్ రోడ్డుతో మరింత అభివృద్ధి
పెద్దపల్లిరూరల్: బైపాస్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజల కల సాకారమవుతోందని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీకాలేజీ(పెద్దకల్వల) సమీపంలో రూ.82కోట్లతో చేపట్టిన బైపాస్ రోడ్డు పనులకు ప్రభుత్వ విప్ శనివారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. బైపాస్ ద్వారా రాజీవ్ రహదారిపై ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు. ఒట్టేసి చెబుతున్నా.. ‘ఒట్టేసి చెబుతున్నా.. నాకు ఎవరినో కష్ట, నష్టాలకు గురిచేయాలనే ఆలోచనే లేదు.. నా ఆరాటమంతా పెద్దపల్లిని అన్నివిధాలా అభివృద్ధి చేయడమే. రోడ్ల అభివృద్ధిలో ఒకరిద్దరికి కొంత కష్టం, నష్టం జరగొచ్చు.. కానీ ఈ ప్రాంతం ఎంతో ప్రగతి సాధిస్తుందనే విషయాన్ని అందరూ గమనించి రాజకీయాల కతీతంగా సహకరించాలి’ అని కోరారు. ఓదెల మండలం రూపునారాయణపేటలో తన సొంతభూమిలోంచి కూడా రోడ్డు వేశారని గుర్తుచేశారు. పెద్దపల్లిలో కోర్టు భవన సముదాయాల నిర్మాణానికి న్యాయవాదులు సహకరించాలని కోరారు. బైపాస్లో తమ స్థలం పోతోందని, న్యాయం చేయాలని పలువురు రైతులు విప్ను వేడుకున్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించిన క్రికెట్ ఫైనల్మ్యాచ్లో విజేతగా నిలిచిన సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి రూ.50వేల పారితోషికం, రన్నర్గా నిలిచిన 9వ వార్డు జట్టుకు రూ.25వేల పారితోషికం, ట్రోఫీ అందజేశారు. నాయకులు బొంకూరి అవినాష్, ముత్యాల నరేశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పెద్దకల్వలలో బుషణవేన సమ్మయ్య నిర్మించిన ఇందిరమ్మ ఇంటికి ప్రభుత్వ విప్ గృహప్రవేశం చేయించారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్డీవో గంగయ్య, ఆర్అండ్బీ ఈఈ భావ్సింగ్, సర్పంచ్ నర్ల కనకమ్మ, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, నాయకులు పెగడ రమేశ్, అర్కుటి సంతోష్, తిరుపతి, సంపత్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్తోనే సొంతింటి కల సాకారం కాల్వశ్రీరాంపూర్: కాంగ్రెస్ సర్కార్తోనే పేదల సొందింటికల సాకారమవుతోందని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో సిరిసేటి సుజాత – సతీశ్ దంపతుల ఇందిరమ్మ గృహప్రవేశంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, సర్పంచ్ ఆరెల్లి రమేశ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీపీసీ యువకుడికి ఐఎఫ్ఎస్లో 78వ ర్యాంకు
జ్యోతినగర్: ఎన్టీపీసీకి చెందిన దహగం శశాంక ప్రతిష్టాత్మక ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్)లో ఆల్ ఇండియా 78వ ర్యాంకు సాధించాడు. చిన్ననాటి నుంచే లక్ష్య సాధనపై దృష్టి పెట్టి క్రమశిక్షణతో చదువుకున్న శశాంక.. కఠోర శ్రమతో ఈ విజయాన్ని అందుకున్నాడని తండ్రి ఉమామహేశ్వరరావు, తల్లి నాగలక్ష్మీ తెలిపారు. నవంబర్ 2025లో యూపీఎస్సీ ఫలితాలు వెలువడగా, ఏప్రిల్ 6 నుంచి 15 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. తుదిఫలితాల్లో శశాంకకు ఆల్ ఇండియా 78వ ర్యాంకు లభించింది. ఆయన విజయంపై కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. అడవుల పరిరక్షణ, పర్యావరణ సంరక్షణలో సేవలు అందించే అవకాశం రావడం ఆనందంగా ఉందని శశాంక సంతోషం వ్యక్తం చేశాడు. -
వేగంగా ధాన్యం అన్లోడింగ్
● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి/సుల్తానాబాద్రూరల్: రైస్మిల్లుల్లో ధాన్యం అన్లోడింగ్ను రెట్టింపు వేగంతో పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్ సమీపంలోని అన్నపూర్ణ, పెద్దకల్వలలోని రాధాకృష్ణ, సుల్తానాబాద్, పూసాల కల్యాణి, పరమేశ్వర రైస్ మిల్లులను శనివారం ఆయన తనిఖీ చేశారు. ధాన్యం లోడింగ్, అన్లోడింగ్, నిల్వలు, ట్యాబ్లో ఎంట్రీ, ట్రక్షీట్ల జనరేషన్ తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ డీఎం శ్రీకాంత్రెడ్డి, అధికారి శ్రీనాథ్, డిప్యూటీ తహసీల్దార్ మహేశ్, రైస్ మిల్లు యజమాని పన్నాల రాములు పాల్గొన్నారు. -
అమ్మ ప్రోత్సాహంతోనే ఐపీఎస్గా..
గోదావరిఖని(రామగుండం): నా విజయంలో చిన్నప్పటి నుంచి అమ్మ ప్రోత్సాహం ఎంతో ఉంది. అమ్మ కిరణ్కుమారిఝా కెమిస్ట్రి రిటైర్డ్ ఫ్రొఫెసర్. బిహార్ రాష్ట్రం మధుబని సొంత స్థలం. తండ్రి నందికిషోర్ఝా ఎంబీబీఎస్ డాక్టర్. సోదరి పారుల్ప్రియా సుంప్రీకోర్టు న్యాయవాది. సోదరుడు క్లిసైకిషోర్ఝా మైరెన్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. అమ్మ చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో మా నిర్ణయానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. సొంత ప్రాంతమైన మదుబనిలో 12వ తరగతి వరకు చదివా. తిర్చి ఎన్ఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశా. చిన్ననాటి నుంచి పోలీస్శాఖలో చేరాలనే ఆకాంక్ష ఉండేది. సివిల్స్ రాసి ఐపీఎస్గా ఉద్యోగం సాధించా. అమ్మ అన్ని విషయాల్లో తోడుంటూ మమ్మల్ని ప్రోత్సహించింది. ఏనాడూ టార్గెట్ పెట్టి చదివించలేదు. కెమిస్ట్రి ప్రొఫెసర్గా చేస్తూనే ఉన్నత విద్యాభ్యాసానికి బాటలు వేసింది. ఎన్ని జన్మలు ఎత్తినా అమ్మ రుణం తీర్చుకోలేనిది. – అంబర్ కిశోర్ ఝా, సీపీ, రామగుండంతల్లీ.. నీకువందనం..‘పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా’.. ‘అమ్మపాడే జోలపాట అమృతానికన్నా తీయనంటా’.. అని కొందరు సినీ కవులు అన్నట్లు అమ్మ మాటల్లో తీయదనం ఉంటుంది. సృష్టికి మూలమైన రెండక్షరాల అమ్మ అనే పదం ప్రతీ గుండెను తాకుతుంది. తల్లి తమ పిల్లలకు ధైర్యం నింపుతుంది. నవమాసాలు కడుపున మోయడంతో మొదలయ్యే తల్లి బాధ్యత తన చివరి అంకం వరకు ఉంటుంది. నాన్న భవిష్యత్ను తీర్చిదిద్దితే.. తల్లి బతుకును అందిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో పలువురు తల్లులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కన్న బిడ్డలను కంటికి పాపలా కాపాడుకుంటున్నారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. అచేతన స్థితిలో ఉన్న బిడ్డలకు అన్నీతానై సేవలందిస్తున్నారు. పేదరికం వారిని పగబట్టినా బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు మాతృమూర్తులు. ఆదిలోనే మాంగళ్య బంధం తెగిపోయినా అధైర్య పడకుండా నేనున్నాను అంటూ అండగా ఉంటున్నారు. బిడ్డలను ఉన్నత శిఖరాలకు చేర్చి వారి కళ్లలో ఆనందాన్ని నింపుకుంటూ అమ్మతనాన్ని చాటుకుంటున్నారు. అనాథలైన చిన్నారులను చేరదీసి వారికి అమ్మలవుతున్నారు మరికొందరు. కొందరు తల్లి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. పలువురు ఉద్యోగులు.. ఇంట్లో తల్లిగా.. సమాజంలో అధికారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. భూదేవి అంత ఓపికతో.. కన్న బిడ్డలకు అండగా ఉంటున్న మాతృమూర్తి నీకు వందనం.. నేడు మదర్స్ డే సందర్భంగా...కొత్తపల్లి(కరీంనగర్): కుటుంబ సభ్యులు, ముఖ్యంగా భర్త శ్రీరాముల శ్రీనివాస్ సహకారంతో ఒత్తిడి తెలియకుండా ఉద్యోగంలో రాణిస్తున్నా. రెవెన్యూ శాఖలో పని ఒత్తిడి ఉన్నా ఇంట్లో అర్థం చేసుకునే భర్త, సహకరించే అత్త ఉండడం వల్లే ఉద్యోగం, ఇంటి బాధ్యతలను బ్యాలెన్స్ చేయగలుగుతున్నా. అమ్మ అనేది ఒక సంబంధం కాదు.. కుటుంబాన్ని, ఉద్యోగాన్ని సమానంగా నడిపించే శక్తి. మదర్స్ డే సందర్భంగా ప్రతీ తల్లికి గౌరవం, గుర్తింపు, సహకారం అందాలని కోరుకుంటున్నా. – రేవెల్లి వెంకటలక్ష్మి, తహసీల్దార్, కొత్తపల్లి -
కేన్స్ఫిల్మ్ ఫెస్టివల్కు రష్మీ
జ్యోతినగర్: ప్రతిష్టాత్మక కేన్స్ ఇండియా ఫిల్మ్ఫెస్టివల్కు ఎన్టీపీసీకి చెందిన రష్మీ ఠాకూర్ ఎంపికయ్యా రు. ఆమె చేనేత ఉత్పత్తుల బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తారు. ఈమేర కు కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్– 2026లో తెలంగాణ చేనేత, భౌగోళిక గుర్తింపు పొందిన పో చంపల్లి ఇక్కత్ వస్త్రాలు ప్రదర్శిస్తారు.బస్టాండ్ చౌరస్తా విస్తరణ పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బ స్టాండ్ అంబేడ్కర్ చౌరస్తా విస్తరణ పనులను మున్సిపల్ చైర్మన్ మల్లయ్య శుక్రవారం ప్రారంభించారు. దీనికి సమీపంలో త్వరలోనే బస్సుడి పో ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాకపోక లకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ విప్ విజయరమణారావు కలెక్టర్తో చర్చించి ప్రత్యేకంగా రూ.39లక్షలు కేటాయించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, ఏఈ సతీశ్, టీపీవో వినయ్, వార్డు ఆఫీసర్లు కుమార్, యశ్వంత్, సాగర్, అరవింద్, సురేశ్ తదితరులు ఉన్నారు. 12నుంచి పునశ్చరణ క్లాసులు పెద్దపల్లిరూరల్: టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు రెమిడీయల్ క్లాసెస్ (పునశ్చరణ తరగతులు) నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేసింది. అప్పన్నపేట, రామగుండంలో (పీఎంశ్రీ పాఠశాలలు) కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లావ్యాప్తంగా 178 మంది ఫెయిల్ అయ్యారు. ఆయా సబ్జెక్టులను బోధించేందుకు ఈనెల 12 నుంచి జూన్ 3వ తేదీ వరకు ప్రత్యేక పునశ్చరణ తరగతులను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.ఐటీఐలో ప్రవేశాలు పెద్దపల్లి: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలు, ఏటీసీల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైనట్లు పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్, కన్వీనర్ బుసిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 14 నుంచి జూన్ 8 వ తేదీ వరకు రూ.100 వెరిఫికేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నేడు పవర్ కట్ ప్రాంతాలుపెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని గుండంక ట్ట సబ్స్టేషన్ పరిధిలోని ఫీడర్ మరమ్మతుల నే పథ్యంలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ శ్రీనివాస్ తెలిపా రు. తిలక్నగర్, గుండమ్మకట్ట, కంచరబావి, శంకర్గంజ్, జెండాచౌరస్తా, కోటి కాంప్లెక్స్, సాగర్రోడ్డు, పైడబజార్ ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి ఉదయం 10గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. ఫెర్టిలైజర్సిటీ: కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో ఆర్ఎఫ్సీఎల్ అ ల్లాయిడ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు నెల కంటి రాము ఆధ్వర్యంలో రెండురోజులుగా కొ నసాగుతున్న సమ్మెలో శుక్రవారం విరమించా రు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మ క్కాన్సింగ్ మాట్లాడుతూ, మంత్రి శ్రీధర్బాబు తో చర్చించి కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్ఎఫ్సీఎల్ అధికారులతో నూ చర్చలు జరపడంతో యాజమాన్యం సా నుకూలంగా స్పందించింది. మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్ల య్య, నాయకులు కన్నూరి శంకర్, కందుల స తీశ్, బెంద్రం రాజిరెడ్డి, ఎరుకల అంజిబాబు, చిట్టబోయిన రాజ్కుమార్, మల్లేశ్ ఉన్నారు. చేపల ఉత్పత్తిపై అవగాహన పెద్దపల్లి: చెరువుల్లో కలుపు నివారణ పద్ధతు లు, చేపల ఉత్పత్తిపై జిల్లా మత్స్య శాఖాధికారి నరేశ్ కుమార్ నాయుడు అవగాహన కల్పించా రు. కలెక్టరేట్లో శుక్రవారం శ్రీచెరువుల్లో కలుపు నివారణ, వ్యాధుల నియంత్రణ, చేపల ఉత్ప త్తి పెంపుపై వివరించారు. మత్స్య కళాశాల (పెబ్బేరు) నుంచి జ్ఞానేశ్వర్, ఉపాధ్యాయులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 80 స్కూళ్లలో 100శాతం ఉత్తీర్ణతపెద్దపల్లి: టెన్త్ ఫలితాల్లో జిల్లాలోని 80 ప్రభు త్వ పాఠశాలలు 100శాతం ఉత్తీర్ణత సాధించా యి. ఇందులో జెడ్పీ హైస్కూల్స్ 55, కేజీబీవీ లు 8, మోడల్ స్కూల్స్ 7, ప్రభుత్వ హైస్కూ ల్స్ 4, బీసీ వెల్ఫేర్లు 6 ఉ న్నాయి. జిల్లాలో 10 కేజీబీవీలు ఉండగా అందులో 8వందశాతం ఫలితాలతో ప్రథమ స్థానంలో నిలిచాయి. -
లక్ష్యం మేరకు ధాన్యం కొనుగోలు
పెద్దపల్లి/ఓదెల/కాల్వశ్రీరాంపూర్/సుల్తానాబాద్రూరల్: నిర్దేశిత లక్ష్యం మేరకు జిల్లావ్యాప్తంగా రోజూ 14వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, రవాణా, వివరాల నమోదు, కొనుగోలు కేంద్రాల పనితీరుపై కలెక్టరేట్లో శుక్రవారం ఆయన అధికారులతో సమీక్షించారు. ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో మక్కలు, ధాన్యం కొనుగోళ్ల తీరుపై ఆరా తీశారు. సుల్తానాబాద్లోని పలు రైస్మిల్లుల్లో తనిఖీ చేశారు. ఆయా కార్యక్ర మాల్లో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇంకా 3 ల క్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం కొనుగోలు చే యాల్సి ఉందన్నారు. తక్షణమే కొనుగోళ్లలో వేగం పెంచాలని సూచించారు. రెండో శనివారం, ఆదివా రం కూడా ధాన్యం సేకరించి తూకం వేసి రైస్మిల్లు లకు తరలించాలని సూచించారు. మొక్కజొన్న కొ నుగోళ్లలో హమాలీల కొరత తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరారు. కొనుగోళ్లలో రైస్మిల్లర్లు కొర్రీలు పెడితే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. ధాన్యం డబ్బులను రైతుల బ్యాంకు ఖాతాల్లో తప్పకుండా జమచేయాలని అన్నారు. డీసీవో శ్రీమాల, డీసీఎస్వో శ్రీనాథ్, అదనపు డీఆర్డీవో రవీందర్, డీఏవో శ్రీనివాస్, పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్, సివిల్ సప్లయ్ డీఎం శ్రీకాంత్, డిప్యూటీ తహసీల్దార్ మహేశ్, రైస్మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షులు జైపాల్రెడ్డి, కాల్వశ్రీరాంపూర్ ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, సర్పంచ్ బంగారి రమేశ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, రమణారెడ్డి, రైస్ మిల్లర్లు, లారీ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష -
తాగునీటికి తండ్లాట
రామగుండం నగరంలో 13 వాటర్ ట్యాంకుల నిర్వహణపై పర్యవేక్షణ కరువైంది. ఎప్పుడు శుభ్రం చేశారో, మళ్లీ ఎప్పుడు చేయాలనే వివరాలే లేవు. కనీసం మూడునెలలకోసారైనా వాటిని శుభ్రం చే యించాలి. ఇది అమలుకు నోచుకోవడంలేదు. సమయానికి శుభ్రం చేయకపోతే నీరు కలుషితమై ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.గతేడాది వేసవిలో రూ.45 లక్షల వ్యయంతో గోదావరిఖని సాధన నగర్, రామగుండం హౌసింగ్ బోర్డు కాలనీలో అంతర్గత తాగునీటి పైపులైన్ల నిర్మాణం చేపట్టారు. వీటిని మెయిన్ పైపులైన్కు ఇంకా కనెక్ట్ చేయలేదు. ఏడాది గడిచినా అధికారులు పట్టించుకోవడంలేదు. వందలాది కుటుంబాలు తాగునీటి కోసం తపిస్తున్నాయి.రామగుండం కార్పొరేషన్లో పైప్లైన్ లీకేజీలను రోజుల తరబడి అరికట్టడంలేదు. లక్షల లీటర్ల తాగునీరు రోడ్లపై వృథాగా పోతోంది. లీకేజీలతో మురుగునీరు కలిసే ప్రమాదం ఉందని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. గతంలో మరమ్మతు చేసిన ప్రాంతాల్లోనే మళ్లీ లీకేజీలు ఏర్పడడం అధికారుల పనితీరును విమర్శల పాలుచేస్తోంది. -
సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు
రామగిరి: రామగుండం–3 ఏరియా ఓసీపీ–2 విస్తరణలో ఇళ్లు, భూములు కోల్పోతున్న రాజాపూర్వాసుల సమస్యలు పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, రాజాపూర్ సర్పంచ్ పుల్లెల భాగ్యలక్ష్మి గత నెల 28న కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈమేరకు తహసీల్దార్, ఆర్జీ–3 జీఎంకు ఆదేశాలు జారీచేశారు. కాగా, నాగెపల్లిలో చేపట్టిన కాలువ డైవర్షన్ బ్లాస్టింగ్ పనులతో ప్రమాదాలు జరగకుండా భద్రత చర్యలు చేపట్టాలని తొట్ల తిరుపతి యాదవ్, సర్పంచ్ కొండవవేన దివ్య సూచించారు. కెనాల్ డైవర్షన్ బ్లాస్టింగ్ పనులను ఓసీపీ–2 పీవో రాజశేఖర్తో కలిసి శుక్రవారం వారు పరిశీలించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రొడ్డ బాపు, మాజీ సర్పంచులు తీగల సమ్మయ్య, ఎరుకల బాబురావు, మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్, నాయకులు తీగల సదయ్య, వేగొలపు సంతోష్, భద్రపు శీను, మైలారపు అనిల్, పిట్టల అనిల్, మల్యాల సారయ్య తదితరులు పాల్గొన్నారు. -
లీకేజీలు.. కలుషిత నీళ్లు
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా తయారైంది. వేసవిలో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. పట్టణ ప్రజలకు తాగునీరు అందించేందుకు ఆరు ట్యాంకులు ఉండగా.. ఆర్డీవో కార్యాలయలో 8 లక్షల లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం గల ట్యాంకును కూల్చివేశారు. అక్కడ 14.50లక్షల లీటర్ల సామర్థ్యంతో కొత్త ట్యాంకు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఐదింటిద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. ట్యాప్ల ద్వారా ఇళ్లకు నీటిని అందించే మెయిన్ పైప్లైన్లు తరచూ పగుళ్లు చూపుతున్నాయి. కొన్నిప్రాంతాలకు కలుషితనీరు సరఫరా అవుతోంది. నీళ్లు రాక ఇబ్బందులు మేం అద్దె ఇంట్లో ఉంటున్నం. మూడ్రోజుల నుంచి నీళ్లు రావడంలేదు. బోరుబావి నీళ్లు మోసుకొస్తూ ఇబ్బంది పడుతున్నం. అధికారులు రోజూ నీళ్లు సరఫరా చేయాలె. – అయేషా, సుభాష్నగర్ వాసనొస్తున్నయ్ నల్లాల నుంచి రోజువిడిచి రోజు నీళ్లు వస్తున్నయి. ఎంతసేపు, ఎప్పుడు వస్తయో తెల్వదు. వచ్చిన కొద్దిపాటి నీళ్లు దుర్వాసనతో ఉంటున్నయ్. అధికారులు మంచినీళ్లు సరఫరా చేయాలె. – కంది కనకయ్య, మల్లమ్మ, సాగర్రోడ్డు -
సింగరేణిలో సమ్మె మేఘాలు
గోదావరిఖని: సింగరేణి కార్మికు సమస్యల పరిష్కారానికి యూనియన్ నేతలు సమ్మెబాట ఎంచుకున్నాయి. కారుణ్య నియామకాలు, మెడికల్ ఇన్వాలిడేషన్, మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసులు, సొంతింటి పథకం, పెర్క్స్పై ఇన్కంట్యాక్స్ మాఫీ తదితర సమస్యలపై ఆందోళనకు సమాయత్తమవుతున్నాయి. సింగరేణి బొగ్గు గనుల సంస్థలో సుమారు 40వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. సమస్యలు – కార్మికుల అసంతృప్తి సింగరేణిలో కారుణ్య నియామక ప్రక్రియ రెండేళ్ల క్రితమే నిలిచిపోయింది. 11వ వేజ్బోర్డు అమలులో ఆలస్యం అవుతోంది. మిగతా సమస్యల గురించి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది. అదనపు కార్మికుల పేరుతో ప్రచారం సింగరేణిలో ఇప్పటికే అదనంగా సుమారు 7వేల మంది కార్మికులు ఉన్నారని యాజమాన్యం ప్రచా రం చేస్తోంది. వారికే పనిలేకుంటే కొత్తవారిని ఎలా నియమించుకునేదని ప్రశ్నిస్తోంది. కార్మిక సంఘా లు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. శాశ్వత కార్మి కులతో పోలిస్తే కాంట్రాక్ట్ కార్మికులకు తక్కువ వేతనాలు, ఉద్యోగ భద్రత వంటి సమస్యలు వేధిస్తున్నాయని కార్మిక నేతలు మండిపడుతున్నారు. సమ్మైసెరన్ మోగిస్తాం.. సమస్యల విషయంలో సింగరేణి యాజమాన్యం స్పందించకపోతే సమ్మైసెరన్ మోగిస్తామని గుర్తింపు సంఘం ఇప్పటికే నోటీసులు జారీచేసింది. గుర్తింపు యూనియన్తోపాటు పలు కార్మిక సంఘాలు సింగరేణి తీరుపై గుర్రుగా ఉన్నాయి. ఈక్రమంలో సింగరేణిలో వాతావరణం వేడెక్కింది. ప్రభుత్వం, యాజమాన్యం స్పందిస్తాయా? తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో సింగరేణి బొగ్గు గనుల సంస్థది కీలకపాత్ర. సమ్మె జరిగితే బొగ్గు, విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశముంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం రంగంలోకి దిగాలని పలువురు కోరుతున్నారు. భవిష్యత్ కార్యాచరణపై జేఏసీ భేటీ.. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కార్మిక సంఘాలన్నీ ఏకమైయ్యాయి. నాలుగు రోజుల క్రితం గోదావరిఖనిలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో బీఎంఎస్ మినహా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, టీబీజీకేఎస్ సమావేశమయ్యాయి. ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించాయి. మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించాయి.డిమాండ్లు ఇవే.. సమస్యల పరిష్కారానికి పోరుబాట సన్నాహాల్లో వివిధ కార్మిక సంఘాలు -
శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం
గోదావరిఖని: శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయమని, నిబంధనలు ఉల్లంఘించే వారిని ఉపేక్షించేది లేదని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా హెచ్చరించారు. బక్రీద్ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, పశువుల అక్రమ రవాణా నియంత్రణ, నిబంధనల అమలుపై శుక్రవారం కమిషనరేట్లో స్లాటర్ హౌస్ నిర్వాహకులుతో సమావేశమయ్యారు. బక్రీద్ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అందరూ సహకరించాలన్నారు. రవాణా సమయంలో జంతువులకు సంరక్షణ కల్పిస్తూ మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. అనుమతి లేని ప్రదేశాల్లో జంతువుల వధ, మాంసం విక్రయాలు, ప్రజలకు అసౌకర్యం కలిగించేలా వ్యవహరించడం, సోషల్ మీడియాలో మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసే పోస్టులు, వీడియోలు, ఫొటోలు షేర్ చేయడం వంటి చర్యలు చట్టరీత్యా నేరమని అన్నారు. అడిషన ల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, స్పెషల్బ్రాంచ్ ఏసీపీ నాగేంద్రగౌడ్, బెల్లంపల్లి రూరల్, మంచిర్యాల పట్టణ, స్పెషల్ బ్రాంచ్ సీలు హనూక్, ప్రమోద్రావు, భీమేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం సీపీ అంబర్కి శోర్ ఝా -
సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె
ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): రామగుండం ఫర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారంలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆర్ఎఫ్సీఎల్ అలైడ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు నెలకంటి రాము ఆధ్వర్యంలో గురువారం ప్లాంట్ ప్రధాన గేటు ముందు ధర్నా చేశారు. కర్మాగారంలో పనిచేసే మొదటి, సెకండ్ షిఫ్ట్ కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా యూనియన్ అధ్యక్షుడు మాట్లాడుతూ, కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, అలవెన్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కార్మికులతో స్థానికంగా ఉండే నిరుద్యోగ యువత నష్టపోతున్నారని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆర్ఎఫ్సీఎల్ ప్రభావిత గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎల్కలపల్లి గ్రామ సర్పంచ్ ఎరుకల అంజిబాబు, మాజీ సర్పంచ్ చిట్టబోయిన రాజ్కుమార్, నాయకులు కన్నూరి శంకర్, బెంద్రం రాజిరెడ్డి, కందుల సతీశ్, దెబ్బట మల్లేశ్, ప్రభావిత గ్రామాల నాయకులు, ప్రజాప్రతినిధులు సమ్మెకు మద్దతుగా నిలిచారు. ఇంటిబాట పట్టిన వలస కార్మికులు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో స్థానికులకు ఉపాధి అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ పిలుపునిచ్చారు. కాగా, రామగుండం ఎరువుల కర్మాగారంలో బ్యాగింగ్ విభాగంలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికులు గురువారం చేపట్టిన సమ్మెతో ఇంటి బాట పట్టారు. కాగా, సమ్మె ప్రభావంతో కాంట్రాక్ట్ కార్మికులు కొంతమేర విధులు బహిష్కరించారు. కర్మాగారంలో యూరియా ఉత్పత్తి కొనసాగుతుందని ఆర్ఎఫ్సీఎల్ అధికారులు తెలిపారు. -
రూపాయికే దహన సంస్కారాలు చేపట్టాలి
కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థలో పేదలకు రూపాయికే దహన సంస్కారాలు నిర్వహించే పథకాన్ని అమలు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం బల్దియా ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసిపేట శివాజీ, బీజేపీ జిల్లా కార్యదర్శి సోమారపు లావణ్య మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో అమలైన రూపాయికే ఆఖరి దఫా పథకాన్ని మధ్యలోనే నిలిపివేయడతో పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. అలాగే ఈ పథకంపై ఆధారపడి జీవిస్తున్న సుమారు 120 కుటుంబాలు ఉపాధి కోల్పోయాయని, గతంలో ఈ పథకం కింద పనిచేసిన వారికి రూ.26 లక్షల బకాయిలు వెంటనే చెల్లించాలని కమిషనర్ అరుణశ్రీకి వినతిపత్రం సమర్పించారు. వారం రోజుల్లో బిల్లులు చెల్లించకుంటే కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. మాజీ కార్పొరేటర్ పిడుగు కృష్ణముదిరాజ్, జిల్లా మాజీ కార్యదర్శి జక్కుల నరహరి, కొండపర్తి సంజీవ్, కొమ్మ శ్రీనివాస్, ఐత పవన్, సిరిసేటి మల్లేశ్, అందె రాజ్కుమార్, బుంగ మహేశ్, బూడిద రమేశ్, పంగ రవి, కన్నూరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి ఘటనలు జరగకుండా వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తు చేపట్టారు. -
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు
ధర్మారం(ధర్మపురి)/పెద్దపల్లి: మండలంలోని బొమ్మారెడ్డిపల్లి గ్రామ శివారులో సర్వేనంబర్ 679లోని సుమారు 72.03 ఎకరాల ప్రభుత్వ భూముల వ్యవహారంలో రెవెన్యూ అధికారులు కీలక చర్యలు చేపట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ శ్రీనివాస్, సిబ్బంది గురువారం మోకాపై వెళ్లి ప్రభుత్వ భూముల్లోని పంటలను తొలగించారు. సదరు భూములను ఆక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, రెవెన్యూ రికార్డుల ప్రకారం గతంలో దేవి పెద్దలచ్చిగ పేరుతో సాగు అనుమతి మాత్రమే ఇచ్చామని, అధికారికంగా గుర్తించబడలేదన్నారు. ఈ భూమి ఎక్కువగా రాళ్లు, పొదలు, చిన్న గుట్టలతో ఉండడంతో సాగుకు అనుకూలంగా లేదని గత తహసీల్దార్ నివేదికల్లో పేర్కొన్నట్లు వెల్లడయిందన్నారు. తదుపరి విచారణలో సరైన పత్రాలు లేకుండానే రెవెన్యూ రికార్డుల్లో వారసుల పేర్లు నమోదయినట్లు గుర్తించామని, దీంతో పై అధికారుల సూచనల మేరకు అక్రమ పట్టాలను రద్దు చేసి సదరు భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ శివకోటేశ్వర్, వివిధ గ్రామాల జీపీవోలు, సిబ్బంది పాల్గొన్నారు. -
బ్యాంకు లింకేజీలో అగ్రస్థానం
పెద్దపల్లి: స్వశక్తి సంఘాలకు బ్యాంకు లింకేజీ, రుణ పంపిణీ, రికవరీ అంశాల్లో జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు దక్కింది. గురువారం హైదరాబాద్లో మంత్రి సీతక్క చేతుల మీదుగా డీఆర్డీవో కాళిందిని, రవీందర్ అవార్డు స్వీకరించారు. జిల్లాకు నిర్దేశించిన లక్ష్యంలో అధిక శాతం సాధించడంతో పెద్దపల్లి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి 7,716 స్వయం సహాయక సంఘాలకు లక్ష్యం నిర్దేశించగా, 6,851 సంఘాలకు అనుసంధానం చేసి రూ.454.66 కోట్లు లింకేజీ సాధించడం ఈ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. అవార్డుకు కారణాలు బ్యాంకుల నుంచి రుణ అనుసంధానం పెరగడం, సంఘాల రీ పేమెంట్ క్రమబద్ధంగా ఉండడం, ఎన్పీఏ కేవలం 0.85 శాతం స్థాయిలో ఉండడం జిల్లాను అగ్రస్థానంలో నిలిపాయి. మహిళా సాధికారతకు దన్ను స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందడం వల్ల గ్రామీణ మహిళలకు చిన్న వ్యాపారాలు, జీవనోపాధి మార్గాలు, ఆదాయ వనరులు పెరుగుతున్నాయి. బ్యాంకు లింకేజీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడంతో రుణాలు తీసుకునే సామర్థ్యం మాత్రమే కాదు, వాటిని తిరిగి చెల్లించే నమ్మకం కూడా పెరుగుతోంది. మంత్రి సీతక్క చేతుల మీదుగా అవార్డు స్వీకరిస్తున్న అధికారులుసీ్త్ర నిధి మహిళా బ్యాంకు ద్వారా కూడా రుణాల పంపిణీ, రికవరీలో జిల్లా మంచి పనితీరు కనబరిచింది. దీంతో రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందింది. ఈ విజయంలో ఫీల్డ్ స్థాయి సిబ్బంది, సమాఖ్య నాయకత్వం, జిల్లా యంత్రాంగం సమష్టి కృషి ప్రధానంగా నిలిచింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సైతం నాలుగు విభాగాల్లో రాష్ట్రస్థాయిలో సత్తాచాటి మన్ననలు పొందింది. సీ్త్ర నిధి పనితీరు -
శానిటేషన్ డ్రైవ్ నిరంతర ప్రక్రియ
జ్యోతినగర్/కోల్సిటీ: నిరంతర ప్రజా సేవే లక్ష్యంగా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు రామగుండం మేయర్ మహంకాళి స్వామి అన్నారు. గురువారం 34వ డివిజన్ కృష్ణానగర్లో వార్డు బాటలో కార్పొరేటర్ స్వప్నప్రియతో కలిసి పర్యటించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ, శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా మురుగుకాలువల్లోని పూడిక తొలగించడం జరిగిందన్నారు. నాలాలపై ఉన్న ఆక్రమణలు తొలగించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. డివిజన్లలో ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచనల మేరకు శానిటేషన్ డ్రైవ్ నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. రామగుండంను అద్భుత నగరంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్పొరేటర్లు వెంగల బాపు, కొలని కవితారెడ్డి, నాయకులు భరత్గౌడ్, రాంబాబు, సాగి శంకర్రావు, అధికారులు షాభాజ్, టీపీఎస్ నవీన్, వార్డు అధికారి బీచుపల్లి తిరుపతి, జవాన్ సూర్య తదితరులు పాల్గొన్నారు. పకడ్బందీగా ప్లాస్టిక్ నిషేధం నగరంలో ప్లాస్టిక్ నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని మేయర్ మహంకాళి స్వామి ఆదేశించారు. గురువారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నగరంలో పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యానికి తోడు ప్లాస్టిక్ కారణంగా స్థానికులు క్యాన్సర్ వంటి రోగాల బారినపడుతున్నారన్నారు. ప్రతీ వ్యాపార సంస్థ వద్ద ప్లాస్టిక్ నిషేధంపై బోర్డులు ప్రదర్శించాలని, ఉల్లంఘించినవారి నుంచి జరిమానా వసూలు చేయాలని ఆదేశించారు. ప్లాస్టిక్ నిషేధం అమలులో చురుగ్గా పని చేసినవారికి ప్రోత్సహకం ఉంటుందన్నారు. నగరపాలక సంస్థ ఏసీపీ శ్రీహరి, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలి
రామగిరి(మంథని): సమస్యలతో పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులకు సమస్య పరిష్కారం అవుతుందనే భరోసా కల్పించాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి అన్నారు. గురువారం రామగిరి పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి, సిబ్బంది వివరాలు, స్టేషన్ పరిధిలో నేరాలకు సంబంధించి కేసుల నమోదుపై ఆరా తీశారు. రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని, మత్తు పదార్థాలు, సైబర్ నేరాలపై ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. స్టేషన్కు వచ్చే వారితో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలన్నారు. బ్లూ కోల్ట్స్ సిబ్బంది డయల్ 100 కాల్స్కి వెంటనే స్పందించాలన్నారు. మంథని సీఐ రాజుగౌడ్, ఎస్సైలు శ్రీనివాస్, దివ్య, సిబ్బంది పాల్గొన్నారు. భూసార పరీక్షలు చేయించుకోవాలిసుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): రైతులు విధిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని దీంతో భూమి స్వభావం తెలిసి, ఏ పంట వేస్తే దిగుబడి వస్తుందో తెలుస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ అన్నారు. గురువారం సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో నిర్వహించిన రైతు వారం కార్యక్రమంలో మాట్లాడారు. వరి కోతలు కోసిన తర్వాత గడ్డిని తగలబెట్టడం ద్వారా భూసారం దెబ్బతింటుందన్నారు. సేంద్రియ ఎరువులు, వర్మీ కంపోస్టు ఎరువుల గు రించి అవగాహన కల్పించారు. వ్యవసాయ అ ధికారుల సూచనల మేరకు ఎరువులు వాడాల ని రైతులకు సూచించారు. సర్పంచ్ దేవేందర్, పూజ, ఏఓ పైడితల్లి తదితరులు పాల్గొన్నారు. హామీలను గాలికొదిలిన కాంగ్రెస్గోదావరిఖని(రామగుండం): ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలి డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తోందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆరోపించారు. గురువారం స్థానిక ప్రెస్క్లబ్లో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు హామీలను నెరవేర్చకుండా, ప్రశ్నించిన వారిపై దాడులు చేయిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పాలనపై బీజేపీ ఎంపీలు, నాయకులు మాట్లాడటం లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్న లోపాయికార ఒప్పందం ఏమిటో ప్రజలకు చెప్పాలన్నారు. రెండున్నరేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వయిరీ పేరిట కాలం గడిపిందని, ఇప్పుడు కొత్తగా విద్యుత్ ఒప్పందాల పేరుతో సీబీఐ విచారణ జరిపించాలని బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. కార్పొరేటర్ మేకల సమ్మయ్య, నాయకులు మురళీధర్రావు, మారుతి, కవితాసరోజిని, నీరటి శ్రీనివాస్, గుంపుల లక్ష్మి, గుర్రం పద్మ, తోకల రమేశ్, సట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాలను కప్పేసిన బూడిదరామగుండం: ఈదురుగాలులతో రామగుండం రైల్వేస్టేషన్ సమీపంలోని ఎన్టీపీసీ యాష్పాండ్ నుంచి భారీగా బూడిద లేచి రైల్వేకాలనీ, అక్బర్నగర్, కుందనపల్లి గ్రామాలను కప్పేసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అరగంట పాటు ఈదురుగాలుల అనంతరం వర్షం పడడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. బూడిద చెరువు కట్ట పునరుద్ధరణ పనుల నేపథ్యంలో ఎన్టీపీసీ యాజమాన్యం బూడిద లేవకుండా చర్యలు చేపట్టాల్సి ఉన్నా, ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఇలాంటి సమస్యలు పునరావృతమవుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు విమర్శిస్తున్నారు. -
తల్లిదండ్రులు నిఘా పెట్టాలి
‘రామగుండంకు చెందిన ఓ విద్యార్థి బాగా చదువుతాడని మంచి పేరుంది. క్రికెట్ మీద ఉన్న మోజుతో సోషల్మీడియాలో వచ్చే ప్రిడిక్షన్ యాడ్స్తో టెలిగ్రామ్ గ్రూప్లో చేరాడు. బెట్టింగ్లో రూ.వందకు వెయ్యి, రూ.వెయ్యికి రూ.10వేలు వస్తాయని ఆకర్షితుడయ్యాడు. ఒకట్రెండు సార్లు డబ్బులు రావడంతో ఇంకా ఉత్సాహంగా పెట్టాడు. క్రమంగా అప్పుల్లో మునిగిపోయి తీర్చలేనని తెలిసి ప్రాణం తీసుకున్నాడు. ఇలా జిల్లాలో రెండేళ్లలో ముగ్గురు ప్రాణాలు తీసుకున్నారు. మరెందరో తెలిసిన వారి దగ్గర అప్పు చేసి, తమ ఫోన్స్, ల్యాప్టాప్స్ కుదవబెట్టిన ఘటనలూ ఉన్నాయి. సాక్షి పెద్దపల్లి: బంతి బంతికి ఉత్కంఠ, క్షణాల్లో మారిపోయే ఫలితం, ఆద్యంతం ఉద్విగ్నత, కావాల్సినంత వినోదం పంచే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ మ్యాచ్లు జరుగుతుండటంతో క్రికెట్ ప్రియులు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఆటను వినోదంలా కాకుండా కొంతమంది యువకులు బెట్టింగ్లు కాస్తూ అప్పుల పాలై ప్రాణాలు తీసుకుంటున్నారు. పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్ దందా.. టెలిగ్రామ్, వాట్సప్ గ్రూప్లతో పల్లెల్లోకి విస్తరించింది. పట్టణాల్లోని కేఫ్లు, టీకొట్టుల వద్ద యువతకు బెట్టింగ్ ఏజెంట్లు గాలం వేస్తున్నారు. వీరిని నియంత్రించే వ్యక్తిని డాన్ అంటారని, వారు ఎవరు, ఎక్కడ ఉంటారు? వారి నేపథ్యం ఏజెంట్లకు కూడా తెలియదని సమాచారం. జిల్లాలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని మ్యాచ్కు గంట ముందు నుంచే గ్రూప్ల ద్వారా బెట్టింగ్లు ప్రారంభమవుతుంటాయి. అందుకోసం యువత కొత్త సిమ్ కార్డులను కొనుగోలు చేసుకుని ఆ నంబరు ద్వారా ఏజెంట్లను సంప్రదిస్తూ బెట్టింగ్ కాస్తుంటారు. టాస్ వేసినప్పటి నుంచి చివరి ఓవర్ వరకు ఈ ప్రక్రియ సాగుతుంది. ప్రిడిక్షన్ పేరుతో టెలిగ్రామ్ గ్రూప్స్ అసలే ఎండకాలం.. సెలవులకాలం కావడంతో యువత ఇంటి వద్ద ఉంటూ సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఇదే అదనుగా శ్రీఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్లో ఈరోజు జరిగే మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుంది? ఎన్ని పరుగులు చేస్తుంది? ఏ బ్యాట్స్మెన్ ఎన్ని పరుగులు చేస్తాడు? ఏ బౌలర్ ఎన్ని వికెట్లు తీస్తాడో ముందే చెబుతాం.. జస్ట్ మీరు మా టెలీగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే చాలుశ్రీ అంటూ లింక్స్తో ఎర వేస్తున్నారు. ఇప్పటికే క్రికెట్పై మోజుతో ఆయా లింక్స్ క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లలో జాయిన్ అయి తెలియకుండానే బెట్టింగ్ భూతం బారిన పడుతున్నారు. సరదాగా మొదలై చివరికి వ్యసనంగా మారి అప్పుల పాలై ఆత్యహత్య చేసుకుంటున్నారు. కేసులు నమోదైతే చిక్కులే గతంలో బెట్టింగ్లో పట్టుబడితే వారిపై సానుభూతి(పెట్టి) కేసులు నమోదు చేసేవారు. ప్రస్తుతం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. పోలీసుల రికార్డులో పేరు, చిరునామా, ఎలాంటి నేరానికి పాల్పడ్డారు పూర్తి వివరాలుంటాయి. ఒక్కసారి కేసు నమోదైతే ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన సమయంలో లేదా విదేశాలకు వెళ్లాల్సి వస్తే ఇబ్బందులు తప్పవు. అంతేగాకుండా ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగం చేద్దామని భావించినా నేరచరిత ఉందని భావించి తీసుకునేందుకు నిరాకరించే అవకాశం ఉంది. ఎఫ్ఐఆర్ను పోలీస్శాఖ ఆన్లైన్ చేయడంతో ఎక్కడ బెట్టింగ్ జరిగినా ఇప్పటికే దొరికినవారిపై నిఘా ఉంటుంది. ఇలా నాలుగుసార్లు బెట్టింగ్ ఆడుతూ లేదా నిర్వహిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు గమనించాల్సింది ఇవే..ఐపీఎల్ బెట్టింగ్పై నిఘా ఉంచాం. అన్ని స్టేషన్లలోనూ అప్రమత్తం చేశాం. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారు అనే విషయాలపై నిరంతరం నిఘా పెట్టాలి. బెట్టింగ్లతో జీవితాలు ఛిన్నాభిన్నం అవుతాయి. కేసులు నమోదైతే భవిష్యత్ ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరూ వాటి జోలికి వెళ్లకూడదు. మీకు ఏమైనా సమచారం తెలిస్తే మా దృష్టికి తీసుకురండి. చర్యలు తీసుకుంటాం. – అంబర్ కిషోర్ఝూ, సీపీ, రామగుండం -
రోగులకు మెరుగైన సేవలందించాలి
పెద్దపల్లి: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. గురువారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. ఆస్పత్రికి కొత్తగా వచ్చిన సుమారు రూ.39 లక్షల విలువైన వైద్య పరికరాల ఏర్పాటు పూర్తయినట్లు వివరించారు. చిన్నపాటి సాంకేతిక ప్రక్రియలు పూర్తయిన తర్వాత విప్ చింతకుంట విజయరమణారావు చేతుల మీదుగా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన పరికరాలను పూర్తిస్థాయిలో వినియోగించి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. రోజూ సుమారు 1,000 మంది ఓపీ రోగులు ఆస్పత్రికి వస్తున్నందున వారికి అవసరమైన అన్ని సేవలు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫార్మసీ విభాగాన్ని పరిశీలించి మందుల లభ్యతపై ఆరా తీశారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన స్లిట్ ల్యాంప్, 90డీ లెన్స్, సి–ఆర్మ్ మిషన్, యూరాలజీ తదితర పరికరాల వినియోగంపై అధికారులతో సమీక్షించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.శ్రీధర్, వైద్యులు పాల్గొన్నారు. -
నేడు ‘అల్ట్రాటెక్’ పర్మినెంట్ కార్మిక సంఘం ఎన్నికలు
పాలకుర్తి: బసంత్నగర్ అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ పర్మినెంట్ కార్మికసంఘం ఎన్నికలు గురువారం జరగనున్నాయి. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ప్రత్యక్ష బ్యాలెట్ పద్ధతిన ఎన్నుకుంటారు. అధ్యక్ష స్థానానికి ముగ్గురు బరిలో ఉన్నారు. అధికార కాంగ్రెస్ నుంచి అధ్యక్షుడిగా బయ్యపు మనోహర్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పోతుల ప్రసాద్, అధ్యక్ష స్థానానికి మరో అభ్యర్థి మల్క రామస్వామి, ప్రధా న కార్యదర్శిగా రమేశ్ మౌర్య పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి నల్ల మనోహర్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జేసీబీ శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి అభ్యర్థులెవరూ పోటీ చేయకపోవడం విశేషం. బయ్యపు మనోహర్రెడ్డి ప్యానెల్కు ఆటో, మల్క రామస్వామి ప్యానెల్కు చేతిలో చేయి, నల్ల మనోహర్రెడ్డి ప్యానెల్కు గులాబిపువ్వు గుర్తులు కేటాయించారు. కంపెనీలో 307 మంది పర్మినెంట్ కార్మికులు ఉన్నారు. నామినేటేడ్ ఎన్నికల అధికారి బద్దం డానియల్ ఆధ్వర్యంలో హెచ్ఆర్ అధికారులు ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటలకు పోలింగ్ నిర్వహిస్తారు. అర్ధగంట విరామం తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. 19లోగా ఫీజు చెల్లించాలి గోదావరిఖనిటౌన్: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ విద్యార్థులు ఈనెల 19వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని అధ్యయన కేంద్రం కో ఆర్డినేటర్ సుబ్బారావు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జైకిషన్ ఓజ తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ ప్రథమ సంవత్సరం 2వ, ద్వితీయ సంవత్సరం 4వ, తృతీయ సంవత్సరం విద్యార్థులు 6వ సెమిస్టర్ పరీక్ష ఫీజును ఆన్లైన్, మీసేవా కేంద్రాల్లో చెల్లించాలన్నారు. ఒక్కో సబ్జెక్టుకు రూ.150, బీఎస్సీ సైన్స్, బీకాం కంప్యూటర్స్కు అదనంగా ల్యాబ్ ఫీజు చెల్లించాలని కోరారు. జూన్ 14 నుంచి జూలై 06వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారని వివరించారు. అవసరం మేరకే ఎరువులు వాడాలి మంథనిరూరల్: అవసరానికి మించి పంటలకు ఎరువులు వాడితే దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందని జగిత్యాల వ్యవసాయ కళాశాల పొలాస శాస్త్రవేత్తలు అరుణ్కుమార్, శ్రావణ్ తెలిపారు. చిల్లపల్లిలో సర్పంచ్ గోపు సంతోష్కుమార్ అధ్యక్షతన బుధవారం రైతులకు అవగాహన కల్పించారు. రైతులు నీటిని ఆదా చేసుకోవడంతోపాటు యూరియా వినియోగం తగ్గించాలని సూచించారు. వరి మొక్కజొన్న, పత్తి కోసిన తర్వాత అవశేషాలను కాల్చవద్దని అన్నారు. కార్యక్రమంలో బెస్తపల్లి స ర్పంచ్ అరిపెల్లి శ్రీనివాస్, చిల్లపల్లి ఉపసర్పంచ్ రా ణి, ఏఈవో శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బిహార్ జైలు నుంచి
గురువారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2026● దేశవ్యాప్తంగా సుశిక్షితులైన 70 మందితో క్రిమినల్ నెట్వర్క్ ● బిహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్ ఇతర రాష్ట్రాల్లో కేసులు ● చోరీ చేసిన మొబైళ్లు, ఎన్క్రిప్టెడ్ యాప్స్ (ఫేస్టైంతోసహా)తో జైలు నుంచే వీడియో కాల్స్ ద్వారా రియల్ టైం మానిటరింగ్ ద్వారా ఆదేశాలు. ● గోల్డ్ లోన్ కంపెనీలు, నగల దుకాణాలు, జువెల్లరీ షోరూంలే టార్గెట్ ● అనుచరులకు వేతనాలు, నేరాల్లో ప్రతిభ కనబరిస్తే బోనస్లు ● పలు రాష్ట్రాల్లో తనిష్క్, మణప్పురం, ముత్తూట్ తదితర సంస్థల నుంచి 30కిలోలకు పైగా బంగారం తస్కరణ. ● పారిపోయేందుకు ప్రత్యామ్నాయాలు, దోపిడీకి ముందు రెక్కీ ఈ గ్యాంగ్ ప్రత్యేకత. ● ప్రస్తుతం బిహార్, వెస్ట్బెంగాల్లో కేసులు. దోపిడీకి స్కెచ్!దొంగలు బస చేసింది ఈ లాడ్జిలోనే..లాడ్జి నిర్వాహకులు ఇచ్చిన రిసిప్ట్సాక్షిప్రతినిధి,కరీంనగర్ : జులాయి సినిమాలో విలన్ ఒక దొంగ.. చోరీ చేసిన ప్రతిసారీ పోలీసులకు తప్పుడు క్లూ వదిలి.. తాను మాత్రం మరో మార్గంలో పరారవుతుంటాడు. దీనినే పోలీసు పరిభాషలో ‘అటెన్షన్ డైవర్షన్’ అంటారు. ఈ టెక్నిక్నే కరీంనగర్లోని పీఎంజే జువెల్లరీ దోపిడీలో దొంగలు వినియోగించినట్లు తెలుస్తోంది. దేశంలోని అనేక జువెల్లరీ షాపులను నిలువుదోపిడీ చేసిన బిహార్కు చెందిన ‘గోల్డ్ థీఫ్’ అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ గ్యాంగ్ ఉత్తర భారతంలో దోపిడీలు, కిడ్నాప్లు, అక్రమ వసూళ్లకు ప్రసిద్ధి. దేశవ్యాప్తంగా గోల్డ్ థీఫ్కి క్రిమినల్ నెట్వర్క్ ఉంది. ఇతను కన్నేశాడంటే.. ఇతని అనుచరులు పథకం పన్ని బంగారం మొత్తం ఊడ్చి పారేస్తుంటారు. సుశిక్షితులైన దొంగలు కావడంతో ఇప్పటివరకు అన్నీ భారీ చోరీలే నమోదయ్యాయి. ప్రస్తుతం గోల్డ్ థీఫ్ బిహార్ జైలులో ఉన్నాడు. అక్కడ నుంచే దోపిడీకి ప్రణాళిక రచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ధర్మపురికి వచ్చింది మొత్తం ఆరుగురు.. ఈనెల 3న.. కరీంనగర్ పీఎంజే జువెల్లరీస్లో దొంగతనం చేసింది ఐదుగురు కాదు.. ఆరుగురిగా పోలీసులు గుర్తించారు. ఈనెల ఒకటిన ఉదయం ధర్మపురిలోని విజయలక్ష్మి లాడ్జిలో తొలుత నలుగురు, తర్వాత మరొకరు వచ్చారు. ఇంకోవ్యక్తి సాయంత్రం వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అతడే ఈ ఽఐదుగురిని ధర్మపురి నుంచి ఛత్తీస్గఢ్ లేదా ఝార్ఖండ్ వైపు తప్పించి ఉంటాడని అనుమానిస్తున్నారు. జార్ఖండ్కు చెందిన సౌరభ్కుమార్మిశ్రా పేరుతో విజయలక్ష్మి లాడ్జిలో రూ.1200కు గది అద్దెకు తీసుకున్నారు. ధర్మపురిలో దైవదర్శనం కూడా చేసుకున్నట్లు ఆధారాలు లభించాయి. ఉత్తరభారతంలో దొంగలు చోరీకి ముందు పూజలు చేయడం ఆనవాయితీ. ఏప్రిల్ 27నుంచి 30వరకు దొంగలు పెద్దపల్లిలోని పరమేశ్వర లాడ్జిలో బస చేశారు. అక్కడ నుంచే దొంగతనానికి ప్లాన్ చేసినట్లు సమాచారం. అక్కడ కూడా జార్ఖండ్కు చెందిన చిరునామాతో గుర్తింపుకార్డులు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే వ్యక్తులు మార్చి నెలలోనూ ఇదే లాడ్జిలో బస చేసినట్లు కూడా దర్యాప్తులో తేలింది. చోరీకి ముందు సిద్దిపేట పరిసరాల్లోనూ ఈ ముఠా సంచరించినట్లు సమాచారం. ఘటనాస్థలంలో మహారాష్ట్రకు చెందిన బ్యాగు, గోదావరి తీరంలో బైక్ను అటెన్షన్ డైవర్షన్ కోసమే కావాలని వదిలేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పల్సర్ బైకు చాసీస్ను గుర్తించిన పోలీసులు అది ఢిల్లీదిగా తేల్చారు. బ్యాగు, బైకు విషయంలో పోలీసులను తప్పుదోవ పట్టించి దర్యాప్తు జాప్యానికి కారణమైనట్లు అనుమానిస్తున్నారు. అది అనుభవమున్న దొంగలకే సాధ్యం. చోరీలో పాల్గొన్న వారి ఆచూకీని ఇప్పటికే కనుగొన్న పోలీసులు బిహార్లోని నిందితుల ఇళ్లు, నిందితులు, స్నేహితుల ఇళ్ల వద్ద నిఘా పెట్టారు. ఎలాగైనా రెండు రోజుల్లో పట్టుకుంటామని ధీమాగా ఉన్నారు. -
పశువుల అక్రమ రవాణాపై డేగకన్ను
గోదావరిఖని: పశువుల అక్రమ రవాణాపై పోలీసు శాఖ డేగకన్ను వేసింది. చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేసింది. ఆవులు, దూడల అ క్రమ రవాణాను అడ్డుకునేక్రమంలో చట్టాన్ని చేతు ల్లోకి తీసుకునేవారిపైనా కఠిన చర్యలు తీసుకోవా లని నిర్ణయించింది. ఈమేరకు రామగుండం పోలీ స్ కమిషనరేట్ పరిధిలో పకడ్బందీ ఆదేశాలు జారీచేసింది. ఈనెల 27న బక్రీద్ నేపథ్యంలో 8 చెక్పోస్టులు ఏర్పాటు చేసింది. తనిఖీలు విస్తృతం చేసింది. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల్లో రాత్రింబవళ్లు వాహనాలు తనిఖీ చే స్తోంది. దండేపల్లి పరిధిలోని గూడెం, జన్నారం ప రిధిలోని ఇంద్రన్పల్లి, కోటపల్లి పరిధిలోని రాపన్పల్లి, జైపూ ర్ పరిధిలోని ఇంద్రారం, తాండూర్ పరిధిలోని రేపల్లెవాడ, పెద్దపల్లి జిల్లా బసంత్నగర్ టో ల్గేట్, సుల్తానాబాద్ పరిధిలోని దుబ్బపల్లి, సుల్తానాబాద్, గుంపుల చెక్పోస్టుల్లో సిబ్బంది నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. వీటితోపాటు ప్రతీ పోలీస్స్టేషన్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అక్రమ రవాణా నేరం పశువుల అక్రమ రవాణా నేరం. అక్రమ రవాణాదా రులపై కఠిన చర్యలు తీసుకుంటాం. గోరక్షకుల పే రిట చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులు చేసేవారిపైనా కఠినంగా వ్యవహరిస్తాం. వాహనాలను ధ్వంసం చేసినా సహించం. సోషల్ మీడియాలో తప్పు డు ప్రచారం నమ్మవద్దు. పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 87126 56597, డయల్ 100 లేదా సమీప పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలి. – అంబర్ కిశోర్ ఝా, సీపీ, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చెక్పోస్టులు -
యువతలో ఆత్మవిశ్వాసం
మంథని: యువత నైపుణ్యాభివృద్ధి సాధించడం ద్వారా మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమేనని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంథనిలో బుధవారం ఆయన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించి మాట్లాడారు. యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించి ఉపాధి అవకాశాలను పెంపొందించడం లక్ష్యంగా టాస్క్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్కు దాదాపు 220 కి.మీ.దూరంలో ఉన్న మంథని వంటి మారుమూల ప్రాంతాలకు పరిశ్రమలను తీసుకురావడం సవాలుతో కూడుకున్నదని, ఇక్కడి యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు టాస్క్ సెంటర్ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఎంపీ వంశీకృష్ణ, ఆర్డీవో సురేశ్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, మినిమమ్వేజ్ బోర్డు సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్, టాస్క్ చైర్మన్ నితిన్ కుమార్రెడ్డి, కంట్రోల్ ఎస్.డేటా సెంటర్ సంస్థ డైరెక్టర్ రాజీవ్ త్రివేది, ఏఎంసీ చైర్మన్ కె.వెంకన్న పాల్గొన్నారు. తడిసిన ధాన్యానికి మద్దతు ధర తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం మద్దతు ధర తో కొనుగోలు చేస్తుందని మంత్రి శ్రీధర్బాబు భరోసా ఇచ్చారు. కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి స్థానిక మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలతో రైతు లు పంటలు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి, వ్యవసాయ మంత్రి నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఈమేరుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. మారుమూల మంథనిలో టాస్క్ సెంటర్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు -
ఊరంతా కప్పేసిన బూడిద
చిన్న గాలిదుమారానికే ఇళ్లు, రహదారులు, వాడలు, ఊరంతా బూడిద నిండుతోందంటున్నారు పెద్దపల్లి మండలం రాఘవాపూర్ వాసులు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న రాఘవాపూర్లో రాహదారికి ఇరువైపులా ఇటుకబట్టీలు ఉన్నాయి. వాయుకాలుష్యం వెదజల్లుతున్నాయి. ప్రజావాణిలో పలుమార్లు కలెక్టర్కు ఫిర్యాదులు చేశామని గ్రామస్తులు చెబుతున్నారు. ఇటుకబట్టీలను గ్రామానికి దూరంగా తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బుధవారం సాయంకాలం ఒక్కసారిగా పెద్దఎత్తున గాలులు వీయడంతో రహదారి, ఊరు బూడిదపొగతో నిండిపోయి ‘సాక్షి’ కెమెరాకు కనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
మాది రైతుసంక్షేమ ప్రభుత్వం
పెద్దపల్లిరూరల్: రైతుల కష్టం గురించి తెలుసని, వారికి ఏం చేయాలో తెలిసిన సంక్షేమ ప్రభుత్వం త మదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్లో బుధవారం మార్కెట్ కమిటీ చైర్మన్ కూరమల్లారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రైతువారోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రజలు, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చిస్తోందని, ఇది చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీలు నిందారోపణలు చేస్తున్నాయని విప్ విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్కమొక్కజొన్న గింజ కూడా కొనలేదని దుయ్యబట్టారు. కేటీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటిస్తూ రైతులపై కపటప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. రైతులు లాభదాయకమైన ఆయిల్పాం, అపరాల సాగువైపు దృష్టి సారించాలని విజయరమణారావు అన్నారు. పంట మార్పిడి విధానాన్ని పాటిస్తే మంచిదిగుబడులను సైతం సాధించవచ్చని తెలిపారు. ఆయిల్పాం సాగుతో దీర్ఘకాలంగా ఆదాయం పొందే వీలుందని చెప్పారు. ఇందుకు ప్రభుత్వం రాయితీ కూడా అందించి ప్రోత్సహిస్తోందని తెలిపారు. డీఎంవో ప్రవీణ్రెడ్డి, డీసీవో శ్రీమా ల, మున్సిపల్ వైస్ చైర్మన్ ముస్కాన్నాజ్ నయ్యర్, కౌన్సిలర్లు, సీఈవోలు తదితరులు పాల్గొన్నారు. ఓర్వలేకనే దిగజారుడు విమర్శలు ప్రభుత్వ విప్ విజయరమణారావు -
నాలాలు కబ్జా చేస్తే చర్యలు
జ్యోతినగర్: స్వచ్ఛ రామగుండం నిర్మాణంలో ప్రజ లు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ కోరారు. 31వ డివిజన్లో బుధవారం ఆయన వార్డుబాట చేపట్టారు. మేయర్ మహంకాళి స్వామి, కార్పొరేటర్ షహేదా ఆసిఫ్పాషా హాజరయ్యారు. శిథిలమైన రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి స రఫరా తదితర సమస్యల గురంచి స్థానికులు ఎమ్మె ల్యే, మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే చర్య లు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. నాలాలు కబ్జా చేస్తే స్థానికులు అడ్డుకోవాలని కోరారు. మేయర్ మహంకాళి స్వామి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వెంగల బాపు, కొలని కవితారెడ్డి, భూలక్ష్మి, నాయకులు ముచ్చకుర్తి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ రామగుండంలో ప్రజలు భాగస్వాములు కావాలి ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ -
ఎల్లమ్మ ఆలయంలో పూజలు
ధర్మారం: స్థానిక రేణుకా ఎల్లమ్మ ఆలయంలో సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత నె ల 29న గంగస్నానం ఉత్సవాలతో ప్రారంభ మై వేడుకలు బుధవారం ముగిశాయి. ఆలయ కమిటీ చైర్మన్ పాలకుర్తి రాజేశంగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, వైస్ చై ర్మన్ అరిగే లింగయ్య, నాయకులు కొత్త నర్సింహం, దేవి లావణ్య, ఓరం చిరంజీవి, మందపెల్లి మల్లేశం, ఎల్లయ్య, కాంపెల్లి రాజేశం, జనగామ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఈఎస్ఐసీ మేనేజర్గా శ్రీకర్ జ్యోతినగర్: రామగుండం ఈఎస్ఐసీ బ్రాంచి మేనేజర్గా ఆర్.శ్రీకర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కృష్ణానగర్లోని ఈఎస్ఐసీ కా ర్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాకినాడకు చెందిన శ్రీకర్ బాధత్యలు చేపట్టారు. ప్రస్తుత బ్రాంచి మేనేజర్ ఖగేశ్వరరావు వరంగల్ ఈఎస్ఐసీ కేంద్ర కార్యాలయానికి బదిలీ అయ్యారు. శ్రీకర్కు పలువురు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కుదిరిన ఒప్పందం పెద్దపల్లిరూరల్: స్థానిక మదర్ థెరిసా ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యంతో ఇన్ఫోమాటిక్ రీ సెర్చ్ల్యాబ్ బుధవారం ఎంవోయూ కుదుర్చుకుంది. తద్వారా మదర్ థెరిసా విద్యార్థులకు ఇన్ఫోమాటిక్ రీసెర్చ్ ల్యాబ్లోని అన్నివనరు లు, వర్క్షాప్లను వినియోగించుకునేందకు అవకాశం లభించినట్లయ్యింది. డైరెక్టర్ ఎడవల్లి నవత, ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఇన్ఫోమాటిక్ రీజినల్ హెడ్ వంశీకృష్ణ ఒప్పందపై సంతకాలు చేశారు. ఏవో పవన్కుమార్, ప్లేస్మెంట్ అధి కారి వెంకటేశ్వర్లు, హెచ్వోడీలు పాల్గొన్నారు. సైకిల్ ఆరోగ్య సాధనం జ్యోతినగర్: సైకిల్ ఆరోగ్య సాధనమని సైక్లింగ్ అసోసియేషన్ రాష్ట్ర పరిశీలకుడు సురభి వేణుగోపాల్ అన్నారు. ఎన్టీపీసీ శ్రీమయు గ్రాండ్లో సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా జనరల్ బాడీ స మావేశం బుధవారం జరిగింది. ఆయన మా ట్లాడుతూ, సైక్లింగ్తో శరీరంలోని ప్రతీఅవయ వం ఉత్తేజంగా పనిచేస్తుందన్నారు. అనంతరం అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా అసంపెల్లి వా సు, ప్రధాన కార్యదర్శిగా టి.శంకర్ ఉపాధ్యక్షులుగా అంబంటి సంతోష్రావు, కొమురోజు శ్రీ నివాస్, టి.రాజ్కుమార్, జాయింట్ సెక్రటరీలుగా సహజ రాజేందర్, జూపల్లి తిరుమలరా వు, కొయ్యడ శ్రీనివాస్ యాదవ్, కోశాధికారిగా గడ్డం శ్యామ్ కుమార్గౌడ్ను ఎన్నుకున్నారు. 13 నుంచి ఇంటర్ సప్లిమెంటరీపెద్దపల్లి: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 13 నుంచి నిర్వహిస్తామని జిల్లా ఇంటర్ విద్య నోడల్ ఆఫీసర్ కల్పన తెలిపారు. అదనపు కలెక్టర్ వేణు, అధికారులతో కలిసి బుధవారం పరీ క్షల నిర్వహణపై సమీక్షించారు. ఈనెల 21వ తే దీవరకు రోజూ ఉదయం 9.00 – మధ్యాహ్నం 12.00 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల – సాయంత్రం 5.30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు ఉంటాయన్నారు. 5,078 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. యూరియా ఉత్పత్తిలో కీలకంఫెర్టిలైజర్సిటీ: ఆర్ఎఫ్సీఎల్ తెలుగు రాష్ట్రాల్లో యూరియా సరఫరా చేయడంలో కీలకపాత్ర పోషిస్తోంది. ప్లాంట్ సామర్థ్యం రోజూ 3,850 మెట్రిక్ టన్నుల యూరియా, 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా ఉత్పత్తి చేయాల్సి ఉంది. 2026–27లో వార్షిక లక్ష్యం 12.7 లక్షల మెట్రిక్ టన్నులు. ఏప్రిల్లో 98,307.18 మెట్రిక్ టన్ను ల యూరియా ఉత్పత్తి చేసింది. ఇందులో మనరాష్ట్రానికి 65 శాతం సరఫరా చేస్తోంది. -
పరిహారం.. పరిహాసం
మిట్ట మధ్యాహ్నం.. భగ్గుమంటున్న సూరీడు.. భూమిలో మట్టి పోయకుండా కాపలాకాస్తున్న సుందిళ్ల గ్రామస్తు లు వీరు. ఎస్.కాకయ్యకు 1987లో సర్వేనంబరు 387/7లో 1.20 ఎకరాలకు ప్రభుత్వం పట్టా ఇచ్చింది. అప్పట్నుంచి సాగులోనే ఉంటోంది. ఓసీపీ–5 విస్తరణ కోసం ఆయన భూమిని సింగరేణి సేకరించింది. అయితే, 1.20 ఎకరాలకు బదులు 9 గుంటలే ఉందని రూ.3,02,444 పరిహారం అందిస్తామని సింగరేణి చెప్పింది. మొత్తం భూమికి పరిహారం ఇచ్చాకే తమ భూమిలో మట్టిపోయాలని వేడుకుంటూనే మట్టి పోయకుండా కనకయ్య కుటుంబ సభ్యులు వంతుల వారీగా ఓపెన్కాస్ట్ ప్రాజెక్టు మట్టి కుప్పల వద్ద ఇలా కాపలా కాస్తున్నారు. -
ఆరబోసేందుకు అవస్థలు
పెద్దపల్లి: రైతులు పండించిన ఉత్పత్తులను ఆరబోసుకునేందుకు సౌకర్యం లేదు. దీంతో రహదారులనే ఆశ్రయిస్తున్నారు. ప్రధానంగా ధాన్యం, మొక్కజొన్నవంటి ఉత్పత్తులను రోడ్లపై పోసి ఎండ బెట్టుకుంటున్నారు. ఇరువైపులా కిలోమీటర్ల పొడవున ఆరబోయడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. వంద ఫీట్ల వెడల్పు ఉన్న రోడ్లు కూడా ఇరుకుగా మారుతున్నాయి. ఎదురుగా వాహనం వస్తే సైడ్ ఇవ్వలేని దుస్థితి నెలకొంది. కొన్నిచోట్ల వాహనాలను పూర్తిగా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వాహనదారులు పేర్కొంటున్నా రు. ఒక్కోసారి ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయని వాపోతున్నారు. జిల్లాలో పట్టాదారుపాస్ పుస్తకం ఉన్న రైతులు 81,206 ఉన్నారు. ప్రధానంగా వరి, మొక్కజొన్న సాగు చేస్తున్నారు. వ్యవసాయ జిల్లాగా పేరు ఉన్నా.. భూముల ధరలు విపరీతంగా పెరగడంతో క్రయ, విక్రయాలతో ఖాళీ స్థలాలు కరువయ్యాయి. ఫలితంగా రైతులు తాము పండించిన ధాన్యం, మక్కలను ఆరబోసేందుకు రోడ్లపైకి తీసుకొస్తున్నారు. యాసంగితోపాటు వానాకాలంలోనూ వారికి రహదారులే కల్లాలుగా మారుతున్నాయి. ఒక్కోసారి వేగంగా వచ్చే వాహనాలతో ధాన్యం రోడ్డు కిందికి కొట్టుకుపోతోందని, దీన్ని ఏరుకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము ఇలా రోడ్డుపైకి రావాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. తమ ఉత్పత్తులను విక్రయించాలంటే తేమశాతం అధికంగా ఉండకూడదనే నిబంధనలు ముప్పుతిప్పలు పెడుతున్నాయని అంటున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉందంటున్నారు. జాతీయ రహదారులు మినహా.. జిల్లాలో ఆర్ అండ్ బీ పరిధిలో రాష్ట్ర, జిల్లా తదితర రహదారులు ఉన్నాయి. వీటితోపాటు కొన్ని పంచాయతీరాజ్శాఖ పరిధిలోనూ ఉన్నాయి. దాదాపు ఈ రోడ్లపై ప్రతీ సీజన్లో వ్యవసాయ ఉత్పత్తులను ఆరబోస్తున్నారు. రహదారి ఆరంభం నుంచి చివరి వరకూ ధాన్యం, మక్కలు, కొన్నిచోట్ల కందులు, పెసలు లాంటి పప్పుదినుసులు ఆరబోస్తున్నారు. కల్లాల నిర్మాణమే పరిష్కారం నాలుగు సంవత్సరాల క్రితం ఉపాధి హామీ ద్వారా జిల్లాలో కల్లాలు నిర్మించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కల్లాల నిర్మాణం నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. నిధులూ మళ్లిపోయాయి. అప్పటినుంచి కల్లాల నిర్మాణానికి అనుమతి రావడంలేదు. రైతులు కల్లాలు నిర్మించుకోలేకపోయారు. ధాన్యం, మక్కలు, పప్పుదినుసుల లాంటి వ్యవసాయ ఉత్పత్తులు కనీస తేమశాతం వచ్చేందుకు పెద్దసంఖ్యలో కల్లాలు నిర్మించాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వమే రైతులను పోత్సహించడం మేలంటున్నారు. ఈఏడాది 102 ప్లాట్ఫారమ్స్ నిర్మాణం.. ప్రభుత్వం ఇప్పటికే ఉపాధిహామీ ద్వారా కల్లాల(డ్రై ప్లాట్ఫామ్స్) నిర్మాణం చేపట్టింది. ఈఏడాది 102 మంజూరు చేసింది. ఒక్కో యూనిట్పై రైతులకు రూ.56 వేల నుంచి రూ.85 వేల వరకు ఆర్థిక సాయం అందిస్తోంది. వీటిని అత్యధిక సంఖ్యలో నిర్మిస్తేనే రోడ్లపై వ్యవసాయ ఉత్పత్తులను ఆరబోయడం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోడ్లపైనే ధాన్యం కుప్పలు సౌకర్యం లేక ఎండబెడుతున్న రైతులు ఇబ్బందులు పడుతున్న వాహనదారులు -
మీ హయాంలో జరిగిన హత్యలకు మీదే బాధ్యత
కరీంనగర్ కార్పొరేషన్: బీఆర్ఎస్ హయాంలో జరి గిన న్యాయవాదుల జంట హత్యలు, దొంగతనా లు, ఇతర నేరాలకు కేసీఆర్, కేటీఆర్లే బాధ్యులో చెప్పాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ డిమాండ్ చేశారు. దొంగతనం జరిగిన జువెల్లరీ షాప్ను మంగళవారం సందర్శించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఆర్అండ్బీ అతిథిగృహంలో మాట్లాడుతూ అంతర్రాష్ట్ర దొంగలకు సీఎం రేవంత్రెడ్డికి ముడిపెట్టే నీచస్థితికి కేటీఆర్ దిగజారాడని ధ్వజమెత్తారు. డ్రగ్స్ ఎడిక్ట్ అయి, ఫామ్హౌజ్లో గడుపుతున్న విలాసవంతమైన కేటీఆర్ జీవితాన్ని ప్రజలకు తెలియచేసేందుకు డ్రోన్కెమెరాలతో చిత్రీకరిస్తే రేవంత్ను జైలుకు పంపించారన్నారు. అప్పుడు అక్రమంగా అరెస్ట్ చేసి, ఇప్పుడు దొంగలతో సంబంధాలు అంటగడుతున్నారన్నారు. 2014 నుంచి 2023 వరకు జరిగిన హత్యలు,దోపిడి, దొంగతనాలకు అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కారణమా చెప్పాలన్నారు. జువెల్లరీ దొంగతనం జరిగితే హుటాహుటిన వచ్చిన కేటీఆర్, తమ ప్రభుత్వ హయాంలో నేరెళ్ల, కొండగట్టు బాధితులను ఎందుకు పరామర్శించలేదన్నారు. దొంగలను పట్టుకొనేందుకు 15 ప్రత్యేక బందాలను ఏర్పాటు చేశామని, నేరస్తులను పట్టుకోవడానికి ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మొగోడైతే కాళేశ్వరం కేసులో కేసీఆర్కు సీబీఐ నోటీసులు ఇప్పించాలని లక్ష్మణ్కుమార్ సవాల్ విసిరారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు, పడిశెట్టి భూమయ్య, ఆకుల నర్సయ్య, ఆకుల ఉదయ్, మహమ్మద్ అమీర్, అబ్దుల్ రెహమాన్, మహమ్మద్ ఇమ్రాన్ పాల్గొన్నారు. కేటీఆర్కు మంత్రి ‘అడ్లూరి’ సూటి ప్రశ్న -
నేడు మెగా జాబ్మేళా
పెద్దపల్లి: స్థానిక వెంకటపద్మావతి ఏసీ కన్వెన్షన్హాల్లో బుధవారం జరిగే మెగా జాబ్మేళా కు అన్నిఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ కోయ శ్రీహ ర్ష తెలిపారు. 20 స్థానిక, 48 స్థానికేతర సంస్థలు సుమారు 3439 ఉద్యోగావకాశాలు క ల్పించేందుకు మేళాకు హాజరవుతాయన్నారు. ఎస్సె స్సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఫా ర్మసీ, ఇంజినీరింగ్, ఎంబీఏ కోర్సులు పూర్తిచేసి న వారు అర్హులన్నారు. ఆసక్తిగలవారు రెజ్యూమ్, ఆధార్, డీఈఈటీ పోర్టల్లో వివరాలు నమోదు చేసుకుని హాజరు కావాలన్నారు. ఆర్థికాభివృద్ధి సాధించాలి కోల్సిటి: మహిళలు తాము ఎంచుకున్న రంగంలో ఎదిగేందుకు మార్పులను ఎప్పటికప్పడు గ మనిస్తూ నైపుణ్యం పెంపొందించుకుని ఆర్థికాబివృద్ధి సాధించాలని అడిషనల్ కలెక్టర్ అరుణ శ్రీ సూచించారు. విద్యార్థుల యూనిఫామ్ కు ట్టడంలో నైపుణ్యం పెంపొందించడానికి జమ్మికుంట శిక్షణ కేంద్రంలో విజయవంతంగా శిక్ష ణ పూర్తిచేసుకున్న 50 మంది స్వశక్తి మహిళల కు రామగుండం బల్దియాలో మంగళవారం ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ, టైలరింగ్ వృత్తిలో ఉన్న మహిళలను గుర్తించి వృత్తి నైపుణ్యం మెరుగుపరచడానికి శిక్షణ అందించామన్నారు. బల్దియా కార్యదర్శి మహేశ్వర్రెడ్డి, మెప్మా టీఎంసీ మౌనిక, సీవోలతోపాటు ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్ కో ఆర్డినేటర్ శరత్ కుమార్ పాల్గొన్నారు. బాలికాసాధికారతకు కృషి జ్యోతినగర్: బాలికాసాధికారతకు ఎన్టీపీసీ ని రంతరం కృషి చేస్తుందని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత, దీప్తి మహి ళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత అన్నా రు. ఎన్టీపీసీ కాకతీయ ఆడిటోరియంలో మంగళవారం బాలికా సాధికారత మిషన్–2026 ని ర్వహించారు. ఈడీ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో ఐదో తరగతి చదివే బాలికలకు వేసవి సెలవుల్లో ప్రత్యేక శిక్షణ అందించడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఏజీఎం సాగర్ రంజన్ సాహూ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ పోస్టులకు ఇంటర్వ్యూలు పెద్దపల్లి: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఖాళీగా ఉ న్న డాక్టర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీ ధర్ తెలిపారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ రెండు, సివిల్ అసిస్టెంట్ సర్జన్(ఎంబీబీఎ స్) మూడు పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తామన్నారు. ఆసక్తి గలవారు బయోడేటా, విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒకసెట్ జిరాక్స్తో ఆస్పత్రిలో నేరుగా హాజరు కావాలన్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్(స్పెషలిస్టు)కు నెలకు రూ.లక్ష, సివిల్ అసిస్టెంట్ సర్జన్కు రూ.52,351 వేతనం చెల్లిస్తారన్నారు. వివరాలకు 94924 57809 మొబైల్ నంబరులో సంప్రదించాలని ఆయన కోరారు. రేపు అథ్లెటిక్స్ పోటీలుజ్యోతినగర్: ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్లో ఈనె ల 7న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తామని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కొమ్ము గట్టయ్య తెలిపారు. అండర్–08, 10, 12, 14,16,18, 20 విభాగాల్లో బాల, బా లికలు, మహిళలు, పురుషులకు పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తగిన ధ్రువీకరణపత్రాలతో క్రీడా మైదానంలో ఉద యం 6.30 గంటలకు హాజరుకావాలని సూ చించారు. వివరాలకు అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి ఎంసుధేశ్, 94404 24640 నంబరులో సంప్రదించాలని ఆయనపేర్కొన్నారు. రోడ్డు పనులు పూర్తిచేయాలి జ్యోతినగర్/గోదావరిఖని: రాజీవ్ రహదారి సర్వీస్ రోడ్డు పనులను పూర్తిచేయాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ సూచించారు. ఎన్టీపీసీ ఎఫ్సీఐ క్రాస్ రోడ్డు, మే డిపల్లి సెంటర్లలో మంగళవారం పర్యటించా రు. ఈ సందర్భంగా చల్లని పండ్లరసం తాగి సే దదీరారు. బాపూజీనగర్లో వంటగ్యాస్ సిలిండర్ పేలి ఆస్తి నష్టపోయిన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన సతీమ ణి మనాలిఠాకూర్ బాధితులకు ధైర్యం చెప్పా రు. అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ నేత తిప్పారపు శ్రీనివాస్ను పరామర్శించారు. -
అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుతా
పెద్దపల్లిరూరల్/ఎలిగేడు/ఓదెల: జిల్లా కేంద్ర హో దాకు తగినవిధంగా పెద్దపల్లిని అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. పెద్దకల్వల నుంచి చేపట్టే బైపాస్ రోడ్డుకు అవసరమైన స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. పెద్దపల్లిలోని ప్రస్తుత జిల్లాగ్రంథాలయ భవనం కూల్చి అక్కడే బహుళ అంతస్తులతో డిజిటల్ లై బ్రరీ నిర్మాణం చేపట్టేందుకు అధికారులతో చర్చించారు. బందంపల్లిలో రూరల్పోలీస్స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ పాఠశాల భవనాన్ని డీసీపీ రాంరెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఎలిగేడు లో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి రైతువారోత్సవంలో పాల్గొన్నారు. ఓదెల మల్లికార్జునస్వామి ఆలయ అభివృద్ధికి రూ.కోటి 35 లక్షలు మంజూరు చేయించినట్లు విప్ తెలిపారు. ఓదెల శ్రీమల్లికార్జున్వామి ఆలయ పాలకమండలి చైర్మన్ చీకట్ల మొండయ్య ఆధ్వర్యంలో ఆయనను శివుపల్లిలో సన్మానించగా ఈ విషయం వెల్లడించారు. అదేవిధంగా లాలపల్లి లో మంగళవారం రాత్రి జరిగిన పోచమ్మ, మహాలక్ష్మీ, భూలక్ష్మీ, బొడ్రాయి ఉత్సవాలకు విప్ హాజరయ్యారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అన్నయ్యగౌడ్, ప్రతినిధులు పెగడ రమేశ్ యాదవ్, అర్కుటి సంతోష్, శ్రీరాం, జగన్మోహన్రెడ్డి, శ్రీనివాస్, యాకన్న, గోపు విజయభాస్కర్రెడ్డి, ప్రవీణ్, బాపయ్య, కొమురయ్య, వెంకటేశ్గౌడ్, సదయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వవిప్ విజయరమణారావు -
దొంగల బస!
ధర్మపురిలో సాక్షిప్రతినిధి,కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జువెల్లరీస్లో భారీ దోపిడీ కేసులో పోలీసులు దర్యాప్తులో పురోగతి సాధించారు. ఈ నెల ఒకటిన జగిత్యాల జిల్లా ధర్మపురిలోని విజయ లక్ష్మి లాడ్జిలో బసచేసి, కరీంనగర్లో చోరీ అనంతరం 3వ తేదీన లాడ్జి ఖాళీచేశారు. అంతకన్నా ముందు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనూ బసచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది ఇలాఉంటే దొంగలు వినియోగించిన నల్లరంగు పల్సర్ (220 సీసీ), హెల్మెట్ను ధర్మపురి గోదావరి తీరంలోని ఇటుకబట్టీల సమీపంలో మంగళవారం ఉదయం కనుగొన్నారు. టీఎస్ 08 ఎఫ్జీ 6876 నంబరు ప్లేటుతో ఉన్న ఈ బండిని దుండగులు చోరీ కోసం వినియోగించిందేనని ధ్రువీకరించారు. కానీ.. ఈ బైకుది ఫేక్ నంబరు ప్లేటుగా పోలీసులు తేల్చారు. హైదరాబాద్లోని ముషీరాబాద్కు చెందిన రమేశ్ అనే వ్యక్తికి చెందిన కారుదిగా గుర్తించారు. బండి చాసీస్ నంబరు ఆధారంగా ప్రయత్నించినా.. దాన్ని కూడా ముందే ధ్వంసం చేయడంతో బైకులను సెకండ్ హ్యాండ్లో కొన్నారా? లేక ఎత్తుకొచ్చారా? అన్న విషయంపై ఇంకా స్పష్టత రా లేదు. చోరీ కోసం వినియోగించిన మరో బైకు అపాచీ(తెలుపు) ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దానికి పెట్టిన నంబరు ప్లేట్ కూడా ఫేక్గానే భావిస్తున్నారు. -
కల్లాలు నిర్మించాలి
సన్న, చిన్నకారు రైతుల కోసం ప్రభుత్వ కల్యాలలు నిర్మించాలి. రైతులు నిర్మించుకునేలా 100 శాతం సబ్సిడీ వర్తింపజేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన నిధులు కేటాయించాలి. – గెల్లు శ్రీనివాస్, రైతు, సుల్తానాబాద్ నిధులు కేటాయించాలి సన్న, చిన్నకారు రైతులు కల్లాలు నిర్మించుకునేలా నిధులు కేటాయించాలి. గతంలో పొలాలు, పెరట్లో కల్లాలు ఉండేవి. భూముల ధరలు పెరగడంతో ఖాళీస్థలాలు అమ్ముకున్నారు. భూముల కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం, మక్కలు, మిర్చి, పప్పుదినుసులు రోడ్లపై పోయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి. – రాజన్న పటేల్, రైతు, పెద్దపల్లి -
సమస్యలు వింటూ.. పరిష్కారానికి ఆదేశిస్తూ..
పెద్దపల్లి: ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అర్జీలను పెండింగ్లో ఉంచొద్దని సూచించారు. పెద్దపల్లి బండారికుంటకు చెందిన సుధాకర్, రవీందర్, శోభన్.. సర్వే నంబర్ 556లోని 1.22 ఎకరాలను కొందరు దొంగ పట్టా చేయించుకున్నారని, దానిని రద్దు చేయాలని విన్నించారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లికి చెందిన ఎం.రాఘవరెడ్డి.. తన పోషణ బాధ్యతలు విస్మరించిన ఇద్దరు కుమారులు, కోడ లిపై చర్య తీసుకోవాలని, పెద్దపల్లికి చెందిన జి.సుమలత.. తనకు ఉపాధి కల్పించాలని, సుల్తానాబాద్ మండలం కొదురుపాక చెరువుల నుంచి కొందరు నీటిని తొలగిస్తున్నారని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు మచ్చ కొమురయ్య, పెద్దపల్లి మండలం బొంపల్లిలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న క్వారీలపై చర్య తీసుకోవాలని ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు బండారి సునీల్, సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంటకు చెందిన ఈగ మోహన్రెడ్డి.. తన15 గుంటల భూమి కనిపించకుండా పోయిందని, ట్యూషన్ ఫీజు పేరుతో విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లెనిన్, నాయకులు ఆజాద్, రాజ్కుమార్, రాకేశ్ ఆదిత్య కలెక్టర్కు విన్నవించారు. వాటిని పరిశీలించిన కలెక్టర్ శ్రీహర్ష.. పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. -
ఇందిరమ్మ బిల్లు ఇవ్వాలి
మాకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైంది. ప్రభుత్వం ఇచ్చే రూ.ఐదు లక్షలతో ఇల్లు పూర్తికావడం లేదు. రేకులషెడ్డు నిర్మాణానికి అనుమతి ఇస్తూ రూ.5 లక్షల బిల్లు మంజూరు ఇవ్వాలి. – చంద్రయ్య, రమేశ్, కుమ్మరికుంట బువ్వ పెట్టడం లేదు నాకు ముగ్గురు కొడుకులు. సంపాదించిన భూమిని వాళ్లకు పంచిఇచ్చా. ఇప్పుడు బువ్వ పెట్టకుండా కొడుతున్నరు. మొన్నటివరకు జమ్మికుంట ఆస్పత్రిలోనేఉన్న. నాకు న్యాయం చేయాలి. – కొత్తూరు పోచయ్య, జీలకుంట చర్య తీసుకోవాలి జేసీబీతో హుస్సేనిమియా వాగులో ఇసుక, మట్టిని తీస్తూ కొందరు రూ.లక్షలు అక్రమంగా సంపాదిస్తున్నారు. వాటిని తీయొద్దని పాలకవర్గం తీర్మానం చేసినా.. అందులో కొందరు స భ్యులు రియల్టర్లలో కుమ్ముకై ్క ఇసుక, మట్టి తీస్తు న్నారు. అక్కడి గుంతలోపడి ఒకరు మరణించారు. వారిపై చర్య తీసుకోవాలి. – వెంగళ కనకయ్య, 9వ వార్డు సభ్యుడు, పెద్దబొంకూర్ -
వైద్యసేవలు మెరుగుపర్చాలి
పెద్దపల్లి: గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో వైద్య సేవలను మెరుగుపరచాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, పిల్లల విభాగంలో ఓపీ, ఐపీ సేవలను బలోపేతం చేయాలన్నారు. డాక్టర్లు కృపాబాయి, శిరీష, రాజు పాల్గొన్నారు. సృజనాత్మకత అవసరంగోదావరిఖనిటౌన్: వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ సృజనాత్మ కత పెంపొందించుకోవాలని అదనపు కలెక్టర్ అరుణశ్రీ సూచించారు. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్, టీ ఫైబర్, సూపర్ టీచర్ ఆధ్వర్యంలో గాంధీనగర్ గాంధీపార్క్ స్కూల్లో సోమవారం సూపర్ సమ్మర్ కంప్యూటర్, ఏఐ, రోబోటిక్స్ లర్నింగ్ ప్రోగ్రాంను అరుణశ్రీ ప్రా రంభించి మాట్లాడారు. ఎంఈవో మల్లేశం, డీ ఆర్పీ రవి, హెచ్ఎం రాంబాబు, స్వరూప్చంద్, రమేశ్, పీఆర్సీ శ్రీలత పాల్గొన్నారు. ప్రశాంతంగా ఎప్సెట్ రామగిరి: పన్నూర్లోని మంథని జేఎన్టీయూ లో సోమవారం ఎప్సెట్ ప్రశాంతంగా ప్రారంభమైంది. తొలిరోజు అగ్రికల్చర్, ఫార్మసీ వి ద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఉదయం 80 మందికి 73 మంది, మధ్యాహ్నం 80 మందికి 67 మంది హాజరయ్యారు. మెకానికల్ ప్రొ ఫెసర్ చెరుకు శ్రీధర్రెడ్డి పర్యవేక్షించారు. ఎస్సై శ్రీనివాస్ బందోబస్తు చేపట్టారు. తొలి ప్రజావాణికి స్పందనపెద్దపల్లిరూరల్: స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ప్రజావాణి ప్రారంభమైంది. తొలిరోజు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (డీఏవో)సువర్ణ రెండు దరఖాస్తులను స్వీకరించారు. ధర్మా రం మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన యశోద రాజనర్సు అనే రైతు తాను సాదాబైనామాతో కొనుగోలు చేసిన భూమిని వేరొకరి పే రిట అక్రమంగా పట్టాచేశారని, విచారణ జరిపి న్యాయం చేయాలని ఫిర్యాదు చేశాడు. పెద్దపల్లిలోని తన ఇంటి నంబరు వేరొకరి పేరిట ఉందని, దానిని సవరించాలని శ్యామల కోరారు. ‘నెఫీ’ ఆవిర్భావ దినోత్సవం జ్యోతినగర్: ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ ఫెఢరేషన్ ఆ ఫ్ ఇండియా(నెఫీ) ఆవిర్భావ దినోత్సవం సో మవారం ఘనంగా నిర్వహించారు. పర్మినెంట్ టౌన్షిప్లోని దిశా భవనంలో జరిగిన కార్యక్రమంలో నెఫీ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర జాట్, చైర్మన్ కుమార్ దేవాశిష్ పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలను ప్రాంరభించారు. ఎగ్జిక్యూటివ్ అ సోసియేషర్ అధ్యక్షుడు మహేంద్ర కుమార్, ప్రధాన కార్యదర్శి నితీశ్కుమార్ పాల్గొన్నారు. ప్రగతికి బలమైన అడుగులు జ్యోతినగర్/యైటింక్లయిన్కాలనీ: ప్రజాపాల న ప్రగతికి బలమైన అడుగులు అని రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ అన్నా రు. ఎన్టీపీసీలో సోమవారం జరిగిన 99 రోజు ల ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక నియోజకవర్గస్థాయి సమావేశంలో మేయర్ మహంకాళి స్వామి, అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు. యైటింక్లయిన్కాలనీ అల్లూరులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, పారదర్శకత, వేగం, సమర్థతను పెంపొందించేందుకు ప్రజాపాలన నిర్వహించామన్నారు. రైతుల నుంచి ప్రతీ ధా న్యపు గింజ కొనుగోలు చేస్తామని తెలిపారు. కార్పొరేటర్ మారెల్లి సుశిల– రాజిరెడ్డి, నాయకులు రాజేశ్, శంకర్ నాయక్, చక్రపాణి, రా ములు, సాగంటి శంకర్, రాజు పాల్గొన్నారు. రికార్డు అసిస్టెంట్ సస్పెన్షన్ పెద్దపల్లి: కమాన్పూర్ తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డు అసిస్టెంట్ కె.చిరంజీవిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. విధులకు గైర్హాజరు కావడంతోపాటు, ఫోన్కాల్స్కు స్పందించకపోవడం, మెమోలను స్వీకరించకపోవడంతో తహసీల్దార్ నివేదిక ఆధారంగా చిరంజీవిపై చర్యలు తీసుకున్నట్లు వివరించారు. -
పంట మార్పిడి పద్ధతి మంచిది
సుల్తానాబాద్రూరల్: పంట మార్పిడి ప ద్ధతితో అధిక దిగుబడి సాధ్యమని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. కనుకుల రైతువేది కలో సోమవారం ఏవో పైడితల్లి అధ్యక్షతన రైతువారోత్సవం నిర్వహించారు. విప్ మాట్లాడుతూ, వరితోపాటు వాణిజ్య, లాభసాటి, ఆయిల్పామ్ లాంటి పంటలు వేయాలని రైతులకు సూచించారు. వ్యవ సాయ శాస్త్రవేత్త వెంకన్న, సర్పంచులు కర్రె కవిత, ఉప్పు లక్ష్మి, స్రవంతి, సాయికిరణ్ పాల్గొన్నారు. హనుమాన్ భక్తులకు అన్నదానం ఎలిగేడు: ఎలిగేడు శ్రీకోదండరామాలయంలో హ నుమాన్ దీక్షపరులకు చేపట్టిన అన్నదానం కార్యక్రమానికి విప్ విజయరమణారావు హాజరయ్యారు. యూత్కాంగ్రెస్ నాయకుడు దుగ్యాల సంతోష్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అర్చకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. -
గంట ముందే స్పాట్కు!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: నగరంలోని పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఎలాంటి బెరుకూ లేకుండా ఉదయాన్నే భారీ దోపిడీ చేసి, యథేచ్ఛగా పారిపోయిన వైనాన్ని సవాలుగా తీసుకున్నారు. దొంగల సంచారం, కదలికలు, వారి చిరునామా, నేరచరితపై కీలక సమాచారం సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను మహారాష్ట్ర, బిహార్కు పంపినట్లు సమాచారం. మరికొంతమంది పోలీసులు సీసీ ఫుటేజీలను విశ్లేషిస్తున్నారు. వారి ఫొటోల ఆధారంగా క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఏ) సాయంతో నిందితులను ఇప్పటికే గుర్తించినట్లు తెలిసింది. నిందితుల్లో ఒకరు పుణే, మరొకరు నందూర్బర్ జిల్లాలతో పాటు బిహార్కు చెందిన వారిగా గుర్తించినట్లు సమాచారం. సీసీ ఫుటేజీని ‘రివర్స్ మేనర్’(ఎలా వచ్చారు? అన్న విజువల్స్)లో విశ్లేషించినప్పుడు దొంగలంతా దోపిడీకి కేవలం గంట ముందే కరీంనగర్కు వచ్చినట్లు రికార్డు అయ్యింది. అంటే ముందు రోజు ఎక్కడా బస చేసిన దాఖలాలు లేవు. కొంతకాలంగా రెక్కీ నిర్వహించి, పారిపోయేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కాబట్టే నింపాదిగా వచ్చారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్ర బ్యాగే పట్టిస్తోంది..? చోరీ సమయంలో నిందితుల్లో ఒకరి బ్యాగు కీలకంగా మారింది. ఆ బ్యాగుపై ‘ఐ లవ్ నందూర్బర్’ అని రాసి ఉంది. నందూర్బర్ ఉత్తర మహారాష్ట్రకు చెందిన జిల్లా. గుజరాత్ సరిహద్దులో ఉంటుంది. నిందితుల్లో మరొకరు పుణే జిల్లాలో నేరచరిత కలి గిన పఠాన్గా గుర్తించినట్లు తెలిసింది. మహారాష్ట్రకు పారిపోవాలంటే పెద్దపల్లి, మంథని మీదుగా వెళ్లవచ్చు. కానీ.. ఆ మార్గంలో ట్రాఫిక్, చెక్పోస్టులు ఎక్కువ. అందుకనే చోరీ అనంతరం శాతవాహన యూనివర్సిటీ, మల్కాపూర్, రామడుగు, లక్ష్మీపూ ర్, రుద్రారం, గుండి, పెగడపల్లి, జగిత్యాల మీదుగా మహారాష్ట్ర వైపు వెళ్లినట్లుగా సీసీ ఫుటేజీని పోలీసులు సంపాదించారు. ప్రధాన రహదారుల వెంట వెళ్తే సులువుగా పట్టుబడతామని, పోలీసుల కళ్లు గప్పేందుకు గ్రామీణ రహదారిని ఎంచుకున్నారు. వీరిని పట్టుకునేందుకు నాలుగు బృందాలు ఆదివారం సాయంత్రం మహారాష్ట్ర, బిహార్కు బయల్దేరాయి. మరో నాలుగు బృందాలు (ఒక్కో బృందంలో నలుగురు చొప్పున సభ్యులు) కరీంనగర్ నుంచి జగిత్యాల మీదుగా మహారాష్ట్ర, బీహార్, ఇటువైపు హైదరాబాద్ వరకు వందలాది సీసీ కెమెరాల ఫుటేజీని వడపోస్తున్నారు. నిందితులు వాడిన అపాచీ, పల్సర్ బైకు నంబర్లు స్పష్టంగా లేకపోవడంతో గుర్తింపు కష్టంగామారింది. నిందితులు సిరిసిల్ల వైపు వెళ్లినట్టే వెళ్లి దారిమార్చి, వాహనాలనూ మార్చినట్లు పోలీసులు గుర్తించారు. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞాన్ని విస్తృతంగా వాడుతున్నారు. నిందితుల ఫొటోల ఆధారంగా నేషనల్ ఇంటిగ్రేటెడ్ గ్రిడ్ (నాట్గ్రిడ్) సాఫ్ట్వేర్ సాయంతో వారి నేరచరిత, ఎఫ్ఐఆర్, జైలు జీవితం, ఫోన్నంబర్లు తదితర వ్యక్తిగత వివరాలతో సహా కీలక అంశాలను ఇప్పటికే సేకరించారు. బందిపోట్లు, కరుడుగట్టిన నేరస్తులు, ఉగ్రవాదుల డేటాను నాట్గ్రిడ్లో పొందుపరుస్తారు. ఇది తిరిగి సీసీటీఎన్ఎస్తో అనుసంధానంగా ఉంటుంది. ఈ డేటాబేస్ను ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (ఆర్ఏడబ్ల్యూ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తదితర జాతీయ దర్యాప్తు సంస్థలు వినియోగిస్తాయి. గతేడాది నుంచి ఈ డేటాబేస్ ఎస్పీ ర్యాంకు ఆఫీసర్లకు ఉగ్రవాద, ఇతర కీలక కేసుల్లో దర్యాప్తు కోసం యాక్సెస్ కల్పించారు. వచ్చిన వారు ఉగ్రవాదులు అయి ఉంటారన్న అంశాన్ని పోలీసులు కొట్టిపారేయకపోవడం గమనార్హం. నిందితులు వచ్చిన మార్గంలోని అన్ని సెల్టవర్ల పరిధిలో అనుమానిత సెల్ఫోన్ సంభాషణల కోసం డంప్ (సెల్ టవర్ నుంచి వెళ్లిన కాల్స్ వివరాలు)ను సీడాట్ పద్ధతిలో జల్లెడ పడుతున్నారు. ఇందులోనూ కొన్ని అనుమానిత నంబర్లను పోలీసులు గుర్తించారు. ఆ నంబర్ల సంచారం ఆధారంగానే పోలీసులు దొంగలను వెంటాడుతూ వెళ్లారని సమాచారం. చోరీ అనంతరం దొంగలు ఆ నంబర్లను మార్చడం గమనార్హం. -
ఇద్దరు మిత్రులు.. ప్రత్యర్థులు
పాలకుర్తి: బసంత్నగర్ అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ లో ఈనెల 7న పర్మినెంట్ కార్మిక సంఘం ఎన్నికలు జరగనున్నాయి. అధికార కాంగ్రెస్ నుంచి యూనియన్ మాజీ అధ్యక్షుడు బయ్యపు మనోహర్రెడ్డి, కన్నాల సర్పంచ్ మల్క రామస్వామి, బీజేపీ నుంచి పెద్దపల్లి నియోజకవర్గ నేత నల్ల మనోహర్రెడ్డి బరి లో నిలిచారు. బీఆర్ఎస్ నుంచి ఎవరూ పోటీ చేయడంలేదు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ సొంత నియోజకవర్గమైన రామగుండంలోనే అల్రాటెక్ కంపెనీ ఉంది. ఇద్దరు మంత్రి అనుచరులు కాంగ్రెస్ అభ్యర్థి బయ్యపు మనోహర్రెడ్డి స్వగ్రా మం మంథని నియోజకవర్గంధిలోని రాణాపూర్. మల్క రామస్వామి అదే నియోజకవర్గంలోని కన్నా ల. వీరిద్దరూ మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్బా బు ముఖ్య అనుచరులు. కాంగ్రెస్లో సుదీర్ఘకాలం పనిచేశారు. 2018 ఎన్నికల అనంతరం అప్పటి మంథని ఎమ్మెల్యే పుట్ట మధు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత మనోహర్రెడ్డి కన్నాల సింగిల్విండో చైర్మన్గా ఎన్నికయ్యారు. రామస్వామి భార్య చంద్రకళ అప్పటికే కన్నాల సర్పంచ్గా కొనసాగుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మనోహర్రెడ్డి, ఎన్నికల తర్వాత మల్క రామస్వా మి ఇద్దరు కూడా మళ్లీ సొంతగూటికి చేరారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో రామస్వామి సర్పంచ్గా గెలుపొందారు. ఒకప్పటి మిత్రులు సిమెంట్ కంపెనీ ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థులుగా పోటీపడడం, అది కూడా ఒకేపార్టీ నుంచి ఇద్దరూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే ఆశీస్సులు ఎవరికో? పర్మినెంట్ కార్మిక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఇద్దరు నేతలు పోటీలో నిలవడం చర్చనీయాంశశంగా మారింది. అంతేకాదు.. పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఇద్దరు కూడా స్థానికంగా అందరికీ సుపరిచితులు కావడంతో ఎవరికి మద్దతు ప్రకటించాలనే విషయమై అయోమయం నెలకొంది. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్.. పార్టీ తరఫున అభ్యర్థిని ప్రకటిస్తారని శ్రేణులు భావించారు. ఈవిషయంలో ఆయన స్పందించకపోవడం, మరోవైపు నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగిసిపోవడంతో ఇద్దరూ పోటీలో నిలవడం అనివార్యమైంది. వీరిలో ఎమ్మెల్యే ఆశీస్సులు ఎవరికి ఉంటాయోననే ఉత్కంఠ నెలకొంది. -
మొగులు.. గుబులు
సాక్షి పెద్దపల్లి: రైతులు పంట సాగు చేయడం ఒకఎత్తయితే.. విక్రయించడం అంతకుమించిన సవాల్గా మారుతోంది. జిల్లాలో ప్రస్తుతం వరికోతులు ఊపందుకోగా, ధాన్యం సేకరణ మందకొడిగా సాగుతోంది. ఒకవైపు అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతుండగా.. కొనుగోలు కేంద్రాల్లోని కుప్పల వద్ద కాపలా ఉండాల్సి వస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో కోతల కొర్రీలు పెడుతుండగా.. అందుకు ఒప్పుకున్న వారి ధాన్యం తూకం వేస్తున్నారు. మిగతావారిని పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు తాగునీరు, నీడ సౌకర్యం లాంటివిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భయపెడుతున్న అకాల వర్షాలు చేతకొచ్చిన పంటను అమ్ముకుందామనుకున్న అ న్నదాతలకు ఆకాశంలో కమ్ముకుంటున్న మొగులు తో భయం పట్టుకుంది. ఆశించిన మేర దిగుబడి చే తికొచ్చినా ఆ సంతోషం నిలవకుండా అకాలం వెంటాడుతోందని వాపోతున్నారు. జిల్లాలో వరికోతలు చివరి దశకు చేరుకున్నాయి. కొనుగోళ్లలో జాప్యం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రైస్మిల్లర్లతో విప్ సమావేశం రెండు కిలోల కోతకు అంగీకరిస్తేనే ధాన్యం కాంటా వేస్తుండటంతో రైతుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాదిరిగానే కోత పెడుతున్నారని పలుచోట్ల ఇప్పటికే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఎలిగేడు మండలం శివపల్లిలో రైస్మిల్లర్స్ యాజమాన్యంతో ప్రభుత్వ విప్ విజయరమణరావు సోమవారం ఏకంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించబోనని, ధాన్యంలో కోతలేకుండా అన్లోడ్ చేసుకోవాలని సూచించారు. నూతన విధానంతో జాప్యం కొనుగోళ్లలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభు త్వం కొత్త విధానం తీసుకోచ్చింది. ఇందులో ఓపీఎంఎస్లో రైతు భూమి విస్తీర్ణం, ధాన్యం వివరాల ను సరిచూసి, ఎఫ్ఏక్యూ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో పరిశీలించి, నాణ్యత ఉంటేనే రైతులకు గన్నీసంచులు అందించాల్సి ఉంటుంది. సంచుల్లో ధాన్యం నింపి కొనుగోలు కేంద్రం వద్ద తూకం వేయాల్సి ఉంటుంది. తూకం వేసిన ధాన్యాన్ని జీపీఎస్ కలిగిన ట్రక్కులో లోడ్ చేసి, ఓపీఎంఎస్ ద్వారా ట్రక్షీట్ జనరేట్ చే యాలి. రైస్మిల్లు కేటాయింపు పూర్తి గా ఆటోమెటిక్గా చేపడుతోంది. మి ల్లర్ ధాన్యాన్ని స్వీకరించి ఓపీఎంఎస్లో అక్నాలెడ్జ్మెంట్ చేయాల్సి ఉంటుంది. మిల్లర్ నిర్ధారణ అనంతరం ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమచేస్తోంది. అడుగడుగునా ఆన్లైన్ విధానంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సర్వర్ స్లోగా ఉండడం, ఓపీఎంఎస్ సాఫ్ట్వేర్పై అవగాహన లేకపోవడం, ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి సమయం తీసుకుంటుండడంతో కొనుగోళ్లలో జాప్యమవుతోంది. ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలతో అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో ఆన్లైన్ విధానానికి తాత్కాలికంగా బ్రేక్ వేశారు. కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులివి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు జిల్లా సమాచారం ధాన్యం కొనుగోలు కేంద్రాలు 334 ఇప్పటివరకు ప్రారంభించినవి 273 ధాన్యం కేటాయించిన రైస్ మిల్లులు 118 కేంద్రాలకు వచ్చిన ధాన్యం(మెట్రిక్ టన్నుల్లో) 80,200 కొనుగోలు చేసిన ధాన్యం(మెట్రిక్ టన్నుల్లో) 49,537 మిల్లులకు తరలించింది(మెట్రిక్ టన్నుల్లో) 48,732 ఆందోళన వద్దు -
అంతా నిమిషాల్లోనే..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్క్రైం: ఆదివారం ఉదయం.. నగరం ప్రశాంతంగా ఉంది. నిత్యం రద్దీగా ఉండే జ్యోతినగర్ – విద్యుత్ కార్యాలయం ప్రధాన రహదారి.. సెలవు రోజు కావడంతో సందడి తక్కువగా ఉంది. ఇదే దారిలో ఉన్న పీఎంజే జ్యువెల్లర్స్ను అప్పుడే తెరిచారు. సిబ్బంది లాకర్లలో ఉన్న బంగారాన్ని లెక్కచూసుకుంటూ తీసుకొచ్చి కౌంటర్లు, డిస్ప్లేలో పెడుతున్నారు. ఇంతలో పెళ్లి ఉంది.. బంగారం కావాలంటూ ఓ వ్యక్తి ఉదయం 11 గంటలకు షాపులోకి వ చ్చాడు. బంగారం కొన్నట్లు నటించి, ఐదు నిమిషా ల తువాత మిగితా నలుగురిని లోనికి రమ్మని సై గలు చేశాడు. 11.06 గంటలకు వారు షాపులోకి ప్ర వేశించారు. తుపాకులతో బెదిరించి సిబ్బందిని తాళ్లతో బంధించారు. చేతికి అందిన బంగారాన్ని బ్యాగులో సర్దుకున్నారు. అడ్డువచ్చిన నలుగురిపై కాల్పులు జరిపా రు. సరిగ్గా 11.11 గంటలకు బైకులపై మల్కాపూర్, చింతకుంట మీదుగా సిరిసిల్ల వైపు పారిపోయారు. విషయం నిమిషాల్లో దావనంలలా వ్యాపించడంతో సీపీ గౌస్ ఆలం, ఏసీపీ వెంకటస్వామి, సీఐ సృజన్రెడ్డి, క్లూస్టీం సిబ్బంది ఘ టన స్థలానికి చేరుకున్నారు. నిందితుల వేలిముద్రలు సేకరించారు. ఘటనా స్థలంలో బుల్లెట్ షెల్స్, మ్యాగ్జిన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక బృందా లను ఏర్పాటు చేశామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని, రూ.కోటిన్నర విలువైన కిలోకు పైగా బంగారం చోరీకి గురైందని సీపీ ఆలం ‘సాక్షి’కి తెలిపారు. దోపిడీ ఘటనతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు. ప్రధాన రహదారులు దిగ్బంధించి, తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఘ టనా స్థలాన్ని హైదరాబాద్ క్లూస్ టీం సిబ్బంది రాత్రి పరిశీలించి పలు ఆధారాలు సేకరించారు. బీదర్ లేదా మహారాష్ట్ర వైపు? జ్యోతినగర్లో ఉన్న జ్యువెల్లరీ దుకాణం అయితే చోరీకి అనువుగా ఉంటుందని పక్కాగా రెక్కీ చేశా రు. కస్టమర్లు, జనసంచారం తక్కువగా ఉంటుందని ఆదివారాన్ని ఎంచుకున్నారు. చోరీ అనంతరం పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల రూట్లోకి లేదా జగిత్యా ల రూట్లో పారిపోవచ్చని స్కెచ్ వేసుకున్నారని తెలుస్తోంది. ఇలాంటి దొంగతనాల్లో రైలుమార్గాలు దగ్గర ఉన్న ప్రాంతాలను ఎంచుకొని పారిపోతుంటారు. నిందితులు సిరిసిల్ల వైపు వెళ్లారని, ముందుగానే ప్లాన్ చేసి కామారెడ్డి మీదుగా హైదరాబాద్, బీదర్ లేదా మహారాష్ట వైపు వెళ్లి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాస్కులు లేకుండానే దర్జాగా ఎక్కువశాతం దొంగతనాలకు పాల్పడేవారు తమను గుర్తు పట్టకుండా ముఖానికి మాస్కులు, హెల్మెట్ ధరిస్తుంటారు. పీఏంజే ఘటనలో దొంగలు దర్జాగా, ఎలాంటి భయం లేకుండా చోరీకి పాల్పడడం చూస్తే ఈ ప్రాంతం వారు కాదని తెలుస్తోంది. వారు బైకులపై హెల్మెట్లు, ముఖానికి మాస్క్లేకుండా లేకుండా రావడం, పారిపోవడం చూస్తే ఉగ్రవాదులా..? అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. కేవలం 5 నిమిషాల్లో దోపిడీకి పాల్పడిన ముఠా దుకాణం సిబ్బందిని బెదిరించి వారి చేతులు వెనక్కి కట్టేసి, వాష్ రూంలో భయంతో దాక్కున్న మహిళను కూడా సినీఫక్కీలో బయటకు తీసుకొచ్చి బెదిరించారు. చోరీచేసి బయటకు వస్తున్న క్రమంలో గాలిలోకి కాల్పులు జరుపుతూ బైకుపై వెళ్లిపోయారు. నగలు ఎత్తుకెళ్తున్న ఓ బ్యాగు అక్కడే పడిపోగా.. దోపిడీ ముఠా సభ్యుడు కూడా కిందపడిపోయాడని, తర్వాత కొంతదూరం పరిగెత్తి బైక్ ఎక్కాడని అక్కడ ఉన్న పలువురు చర్చించుకున్నారు. దోపిడీ జరిగిన తీరు చూస్తుంటే నిందితులు పాత నేరస్తులు లేదా ఉగ్రశిక్షణ పొంది ఉండి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మ్యాగ్జిన్.. బులెట్లు స్వాధీనం ఘటనా స్థలంలో ఓ షార్ట్ వెపన్ మ్యాగ్జిన్, మూడు కాలిన తూటాలు, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇక్కడ లభ్యమైన మ్యాగ్జిన్, బులెట్లపై ఉన్న క్లూస్ ఆధారంగా అవి ఎక్కడ కొనుగోలు చేశారన్న వివరాలు సేకరిస్తున్నారు. దోపిడీ అనంతరం దొంగలు వెళ్లిన దారితోపాటు వచ్చిన దారి సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఆదివారం జనసంచారం తక్కువగా ఉంటుందని తెలుసుకున్నారంటే తప్పకుండా వారం రోజులకుపైగా రెక్కీ నిర్వహించి ఉంటారని అనుమానిస్తున్నారు. నాడు మొరాదాబాద్ దొంగలు 2022 సెప్టెంబరు 5న కరీంనగర్లోని సెవెన్హిల్స్ సమీపంలో సాయివాణి రెడీమిక్స్కు చెందిన రూ.15 లక్షలు చోరీ చేసిన ముఠా కూడా అపాచీ, పల్సర్ బైకులనే వాడింది. ఒకరు చింతకుంట మీదుగా సిరిసిల్ల వెళ్లగా.. మరొకరు తిమ్మాపూర్ మీదుగా పారిపోయి చివరికి సిద్దిపేట వద్ద కలుసుకున్నారు. తరువాత నాంపల్లిలో రైలెక్కి ఉత్తర్ప్రదేశ్లోని మొరాదాబాద్ వెళ్లారు. నిందితులు ధరంపాల్, మనీశ్, పింటూ, ఏక్తా అని గుర్తించి పోలీసులు రూ.10లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నాడు ఆ దొంగల ను టాస్క్ఫోర్స్ సీఐగా ఉన్న సృజన్రెడ్డి అరెస్టు చేసి పట్టుకురావడం గమనార్హం. మొత్తంగా కొ న్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న నగరం ఆదివారం ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పలువురి పరామర్శ ఘటనా స్థలాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. దుండగుల దాడిలో గాయపడిన జువెల్లరీస్ సిబ్బంది ముస్తాక్, మధుకర్, రాజేశ్, కమలాసన్ను ఆస్పత్రి లో పరామర్శించారు. ఘటనపై ఆరా తీశారు. జువెల్లరీ షాపు ఘటనను గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి రాజకీయం చేయడం తగదని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రరెడ్డి సూచించారు. రెక్కీ చేశాకే పీఎంజే జ్యువెల్స్లో చోరీ ఐదు నిమిషాల్లో ముగించి.. రెండు బైకులపై పరారీ నిందితులు మహారాష్ట్రకు చెందిన ముఠా సభ్యులు? 2022లో మొరాదాబాద్ దొంగల తరహాలోనే దోపిడీ దుండగులు వచ్చిన దారి వెంట సీసీ ఫుటేజీల పరిశీలన -
విస్తరణ పనులు చకచకా!
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రమైన పెద్దపల్లి పట్టణంలోని మేన్రోడ్డు ఇరుకుగా ఉండడంతో రాకపోకలకు నిత్యం కష్టాలు తప్పడం లేదు. అటు పాదచారులు, ఇటు వాహనదారులు పడుతున్న బాధలను దూరం చేసేందుకు మేన్రోడ్డును విస్తరించాలని మున్సిపల్ పాలకులు నిర్ణయించారు. ఇందుకోసం 66 ఫీట్ల రోడ్డు నిర్మించేలా కొలతలకు శ్రీకారం చుట్టారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న భవనాలకు మార్కింగ్ చేశారు. ఇటీవల మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ మల్లయ్య, కమిషనర్ వెంకటేశ్లు మేన్రోడ్డులోని భవనాల యజమానులతో సమావేశం నిర్వహించి రోడ్డు విస్తరణకు సహకరించాలని కోరారు. ఇక విస్తరణ పనులు చకచకా సాగనున్నాయి. రోడ్డు విస్తరణకు చర్యలు జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలో వ్యాపార, వాణిజ్యసంస్థలున్న ఈ మేన్రోడ్డును విస్తరించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. కలెక్టర్ శ్రీహర్ష మేన్రోడ్డును 80ఫీట్ల మేర విస్తరించాలని ఆదేశించారు. అయితే కొన్ని భవనాలకు ఇబ్బంది కలుగుతుండడంతో వారి ప్రయోజనాల కోసం 66 ఫీట్ల మేర విస్తరించేలా మార్కింగ్ చేస్తున్నారు. ఇంజినీరింగ్ అధికారులు రోడ్డు విస్తరణ పనులను చేపట్టేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. రోడ్డు మధ్యలో 10ఫీట్ల మేర వాహనాల పార్కింగ్కోసం కేటాయించేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో వ్యాపార సంస్థలు అఽధికంగా ఉండడంతో నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డులో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు పక్కాగా కార్యాచరణ తీసుకుంటున్నారు. అయితే తమ భవనాలకు నష్టం వాటిల్లకుండా రోడ్డును విస్తరించాలంటూ పలువురు వ్యాపారులు రాజకీయ నాయకులపై ఒత్తిళ్లు చేస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం ఇటీవల చాంబర్ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఓ సమావేశాన్ని సైతం నిర్వహించుకున్నట్టు తెలిసింది. ఏదేమైనా ఈసారి పట్టణంలోని మేన్రోడ్డును విస్తరించి పాదచారులు, వాహనదారుల కష్టాలను తీర్చాలని కోరుతున్నారు. ఇబ్బందులు తీరుతాయి పెద్దపల్లి మేన్రోడ్డులో నడవా లన్న, వాహనం నడపాలన్న సాహసం చేయాల్సి వస్తోంది. గతంలో టౌన్మున్సిపాలిటీగా ఉన్న నాటి రోడ్డు ఆక్రమణ పాలు కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. పెరిగిన వాహనరద్దీ, ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్డును విస్తరిస్తే ఇబ్బందులు తీరుతాయి. – ద్వారకదాస్ అట్టల్, పెద్దపల్లి చర్యలు తీసుకుంటున్నాం ప్రజల అవసరాలకు అనుగుణంగా మేన్రోడ్డు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆ రోడ్డులో ఉన్న భవనాల యజ మానులతో సమావేశమై సూచనలిచ్చాం. సహకరించాలని కోరాం. మేన్రోడ్డు వ్యా పారస్తులు రోడ్డు విస్తరణకు ముందుకు రావాలి. – వెంకటేశ్, మున్సిపల్ కమిషనర్, పెద్దపల్లి టౌన్ మున్సిపాలిటీలో ఉన్న మాదిరిగానే..దాదాపు ఆరుదశాబ్దాల కాలం క్రితమే టౌన్ మున్సిపాలిటీగా ఉన్న పెద్దపల్లిలో మేన్రోడ్డు చాలా విశాలంగా ఉండేదని ఆ కాలం నాటి పెద్దలు అంటుంటారు. కాలక్రమేణ పెద్దపల్లి మేజర్ పంచాయతీగా అవతరించడం, ఆ తర్వాత రోడ్డును మెల్లమెల్లగా ఆక్రమించి నిర్మాణాలు చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనే విషయాలు వినవస్తున్నాయి. అయితే కొన్నేళ్ల క్రితం పెద్దపల్లిలో మాస్టర్ప్లాన్ అమలుకు కసరత్తు చేసినా రాజకీయ ఒత్తిళ్లు తదితర కారణాల వల్ల ఆ ప్రక్రియ అర్ధాంతరంగానే ఆగిపోయింది. జిల్లా కేంద్రంలో మేన్ రోడ్డు విస్తరణకు అధికారుల చర్యలు 66ఫీట్ల వరకు రహదారి నిర్మాణం -
పోచమ్మ తల్లికి ఎమ్మెల్యే పూజలు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం కనగర్తి గ్రామంలో జరుగుతున్న భూలక్ష్మీ, మహాలక్ష్మి గ్రామదేవతలు (బొడ్రాయి) ప్రతిష్టాపనోత్సవాల్లో ఆదివారం పోచమ్మతల్లి ఆలయంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయరమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచ్ ఎడెల్లి శ్రీదేవి, నాయకులు శంకరయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ కూటమిది కుటిల రాజకీయంపెద్దపల్లిరూరల్: కాంగ్రెస్ కూటమిది కుటిల రాజకీయమని నారీశక్తి అభినయ ఇన్చార్జి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచాలనే ఆలోచనతో ప్రధాని నరేంద్ర మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రవేశపెడితే కాంగ్రెస్ కూటమి అడ్డుకొని వీగిపోయేలా చేయడంపై మహిళలంతా ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, రామగుండం ఇన్చార్జి కందుల సంధ్యారాణి, నారీశక్తి జిల్లా ఇన్చార్జి వడ్డేపల్లి భారతి, నాయకులు పద్మ, నిర్మల, లత, రేణుక, మహేశ్, సోడాబాబు, సరిత, మమత పాల్గొన్నారు. సంఘటితశక్తితోనే హక్కులు కాపాడుకోగలం జ్యోతినగర్: సంఘటిత శక్తితోనే కార్మికుల హక్కులు కాపాడుకోగలమని ఐఎన్టీయసీ జాతీయ సీనియర్ కార్యదర్శి, ఎన్టీపీసీ ఎన్భీసీ సభ్యుడు బాబర్ సలీంపాషా అన్నారు. ఐఎన్టీయూసీ 79వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీపీసీ రామగుండం పర్మనెంట్ టౌన్షిప్లోని ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ కార్యాలయం ఆవరణలో జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ఎన్టీపీసీ ఉద్యోగులకు, కాంట్రాక్టు కార్మికులకు అండగా ఉండటంతో పాటు హక్కుల సాధన కోసం ఐఎన్టీయూసీ నిరంతరం పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సువర్దన్రావు, అడిషనల్ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, గోపాల్రావు, కొలని వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘ఎల్లంపల్లి’లో అడుగంటుతున్న నీటి మట్టం రామగుండం: గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం అడుగంటుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలు కాగా ఆదివారం 9.25టీఎంసీలకు పడిపోయింది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 895 క్యూసెక్కులు రాగా, ప్రాజెక్టు నుంచి ఎన్టీపీసీకి 242 క్యూసెక్కులు, హైదరాబాద్ మెట్రోకు 331 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 81 క్యూసెక్కులు, వేడికి ఆవిరవుతున్న నీరు 194 క్యూసెక్కులు కాగా, ప్రాజెక్టు నుంచి ఔట్ ఫ్లో మొత్తంగా 1095 క్యూసెక్కులుగా ఉంది. సింగరేణిలో మరో యూనియన్ గోదావరిఖని: సింగరేణిలో మరో యూనియన్ ఆవిర్భావం కోసం సన్నాహాలు చేస్తున్నారు. గతంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కెంగర్ల మల్లయ్య సారథ్యంలో నూతన యూనియన్ ప్రకటించాలని నిర్ణయించారు. సోమవారం మేడారం సమ్మక్క సారక్క గద్దెల సాక్షిగా తమ సన్నిహితులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కొత్త యూనియన్ను అధికారికంగా ప్రకటించనున్నారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సమాఖ్య(టీజీబీకేఎస్) పేరుతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తయ్యింది. -
బడి ఆస్తులు భద్రమేనా..?
మంథనిరూరల్: జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరం ముగిసింది. వేసవి సెలవులు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖ ప్రకటన చేసింది. రెండు నెలల పాటు ప్రభుత్వ పాఠశాలలు మూసిఉండనున్నాయి. అయితే, వాటి ఆస్తులు భద్రంగా ఉంటాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేదిఽశగా సర్కారు అడుగులు వేస్తున్న క్రమంలో.. అనేక విలువైన పరికరాలను అందజేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వేసవి సెలవుల్లో పాఠశాలల్లోని ఆస్తుల పరిరక్షణ ఆ శాఖ అధికారులకు సమస్యగా మారినట్లు తెలుస్తోంది. పీఎంశ్రీ పాఠశాలలు మినహా.. జిల్లాలో పీఎంశ్రీ పథకం కింద ఎంపికై న ప్రభుత్వ పాఠశాలలు మినహా మిగతా స్కూళ్లలో ఆస్తులకు భద్రత సమస్యగా మారింది. జిల్లావ్యాప్తంగా 832 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. అందులో ఏడు పీఎంశ్రీకింద ఎంపికయ్యాయి. వీటిలో సీసీకెమెరాలు ఏర్పాటు చేశారు. అటెండర్లను నియమించారు. ఒక ఉపాధ్యాయుడికి సీసీ కెమెరా పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఆకతాయిలకు అడ్డాగా.. సెలవులు వస్తే చాలు ఆకతాయిలకు ప్రభుత్వ పాఠశాలలే అడ్డాలుగా మారుతున్నాయి. గతంలో అనేక సందర్భాల్లో ప్రభుత్వ పాఠశాలల్లోనే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం, అద్దాలు, కిటీకీలు, తలుపులు ధ్వంసం చేయడంలాంటివి చూసే ఉంటారు. మందుబాబులు సైతం రాత్రి అయితే పాఠశాల ఆవరణలోనే మద్యం తాగుతూ, ఖాళీ బాటిళ్లు అక్కడే పడవేసిన సందర్భాలూ ఉన్నాయి. అలాంటి కార్యకలాపాలకు తావులేకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పాఠశాలల బలోపేతమే లక్ష్యం ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు ధీటుగా బలోపేతం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం జిల్లాలోని అనేక స్కూళ్లను అభివృద్ధి చేసింది. నాణ్యమైన విద్యాబోధన అందించేలా చర్యలు చేపట్టింది. ఈక్రమంలో అనేక విలువైన వస్తువులను అందజేసింది. ముఖ్యంగా కంప్యూటర్లు, ఫర్నీచర్, మినరల్వాటర్ ప్లాంట్లు, ఎల్ఈడీలాంటి వాటిని అందజేసింది. అనేక స్కూళ్లకు అటెండర్ల నియామకం లేకపోవడం, సీసీ కెమెరాలు అమర్చకపోవడంతో ఆస్తు ల భద్రతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల దృష్టి రెండు నెలల పాటు సెలవులు ఉండటంతో బడుల ఆస్తుల రక్షణపై విద్యార్థుల తల్లిదండ్రులు దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆకతాయిలు రాకుండా చర్యలు తీసుకోవాలని, యువత సైతం ఆ దిశగా అడుగులు వేయాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తమ గ్రామంలో బడిని కాపాడుకుంటేనే తమ పిల్లల భవిష్యత్కు బంగారు బాటలు పడుతాయనే ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని పలువురు అంటున్నారు. పర్యవేక్షణకు ఆదేశాలు వేసవి సెలవుల్లో ప్రభుత్వ పాఠశాలలపై పర్యవేక్షణ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి. అటెండర్లు ఉన్న పాఠశాలల్లో సమస్య లేదు కానీ వారు లేని వాటిపైనే ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఆస్తులు కాపాడుకునేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. టీచర్లను సైతం తరచూ పర్యవేక్షణ చేయాలని సూచించాం. – దాసరి లక్ష్మి, మండల విద్యాధికారి, మంథని పాఠశాలలకు వేసవి సెలవులు రెండు నెలలపాటు నిర్మానుష్యంగా బడులు ఆకతాయిలకు అడ్డాలు సర్కారు స్కూళ్లు కనిపించని పర్యవేక్షణ...రక్షణ చర్యలు పీఎం శ్రీ పాఠశాలల్లోనే రక్షణ ఏర్పాట్లు -
బొగ్గు దుమ్ముతో ఉక్కిరిబిక్కిరి
ఓసీపీ–3 సీహెచ్పీ నుంచి వెలువడతున్న బొగ్గు దుమ్ముగోదావరిఖని: ఓ వైపు 45 డిగ్రీల మండుతున్న ఎండలు, మరోవైపు కాలుతున్న బొగ్గు నుంచి వెలువడుతున్న ఘాటైన పొగ, కాలిన బొగ్గు నుంచి వస్తున్న దుమ్ముతో సీహెచ్పీలో బొగ్గు అన్లోడ్ చేస్తున్న కార్మికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–2 పరిధిలో ని ఓసీపీ–3 సీహెచ్పీ కార్మికులు వాయు కాలుష్యంతో శ్వాససంబంధిత వ్యాధుల పడుతున్నా సింగరేణి యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఓసీపీ–3 సీహెచ్పీలో.. బొగ్గు రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్న ఓసీపీ–3 సీహెచ్పీలో సుమారు 300 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 45డిగ్రీల ఎండ వేడిమికి మండుతున్న బొగ్గు నుంచి వస్తున్న విపరీతమైన పొగతో పాటు బొగ్గును అన్లోడ్ చేయడం, కన్వేయర్ బెల్ట్ ద్వారా రవాణా చేస్తున్న క్రమంలో భారీ దుమ్ము లేస్తోంది. నిత్యం వాయుకాలుష్యం మధ్య విధులు నిర్వహిస్తున్న సీహెచ్పీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రెగ్యులర్గా పనిచేస్తున్న కార్మికులు శ్వాసకోశ సంబంధ వ్యాధుల బారిన పడి ఆసుపత్రికి వెళ్తే డాక్టర్లు సమస్యను గుర్తించి దుమ్ములేని ప్రాంతంలో పనిచేయాలని సూచిస్తున్నారు. బొగ్గు రవాణా జరిగే గ్యాంట్రీ, కన్వేయర్ బెల్ట్, బొగ్గు అన్లోడింగ్ చేస్తున్న ప్రాంతాల్లో బొగ్గు దుమ్ము మరింత ఎక్కువగా ఉంటోందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్ప్రింక్లర్ల ద్వారా బొగ్గును తడుపుతున్నా.. వేసవికాలం కావడంలో ఓసీపీ క్వారీ నుంచి ఫైర్ కోల్ ఎక్కువగా వస్తోంది. ఈక్రమంలో అదే బొగ్గు ను షావల్ద్వారా లిఫ్ట్ చేయించి డంపర్లో పోస్తున్నారు. అయితే సీహెచ్పీకి వచ్చే ముందు డంపర్లో మండుతున్న బొగ్గును చల్లార్చేందుకు ప్రత్యేక స్ప్రింక్లర్లను యాజమాన్యం ఏర్పాటు చేసింది. అ యితే మండుతున్న బొగ్గును ఆర్పడంలో ఇది ఏమాత్రం పనిచేయడం లేదంటున్నారు. సీహెచ్పీ ప్రాంతంలో గ్రౌండ్లెవల్ బంకర్ల వద్ద సరైన వెంటిలేషన్ ఉండటం లేదని కార్మికులు పేర్కొంటున్నారు. వెంటిలేషన్ కెపాసిటీ పెరిగేందుకు హైకెపాసిటీ వెంటిలేషన్ ఫ్యాన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. శ్వాససంబంధ వ్యాధుల బారిన సీహెచ్పీ కార్మికులు పట్టించుకోని సింగరేణి యాజమాన్యం -
భానుడి భగభగ
● కమాన్పూర్ 45.7 డిగ్రీలు కమాన్పూర్(మంథని): భానుడి భగభగతో ప్రజలు తల్లడిల్లి పోతున్నారు. ఇంటి నుంచి బయటికిరాలేకపోతున్నారు. ఆదివారం కమాన్పూర్లో అత్యధికంగా 45.7 డిగ్రీల నమోదైంది. జిల్లాలోని పలు మండలాల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. రామగుండం, మల్యాలపల్లిలో 45.6, ఈసాలతక్కలపల్లిలో 45.4, ఓదెలలో 45.3, పాలితంలో 45.2, ముత్తారంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఉపాధిహామీ కూలీలు పనులకు వెళ్లాలంటే జంకుతున్నారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీ కార్మికులు పనులు చేయలేకపోతున్నారు. -
ఘనంగా నృసింహుని రథోత్సవం
ధర్మారం: ఖిలావనపర్తిలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి రథోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ పోల్దాసిరి సంతోష్, ఈవో కాంతారెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్లస్థలాలు కేటాయిస్తామన్నారు. ఆలయంలో ప్రత్యేక రథం, డైనింగ్ హాల్ కోసం రూ.15 లక్షలు మంజూరు చేశానని, మరో రూ.10 లక్షలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సై ప్రవీణ్కుమార్ బందోబస్తు పర్యవేక్షించారు. భక్తులు పాల్గొన్నారు. -
ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం
యైటింక్లయిన్కాలనీ: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రామగుండం మేయర్ మహంకాళి స్వామి అన్నారు. 15వ డివిజన్ వెంకట్రావుపల్లి కేకేనగర్లో కార్పొరేటర్ బుర్ర శశికళ–ముత్యాలు గౌడ్తో కలిసి శనివరాం ఆయన పర్యటించారు సింగరేణి ప్రభావిత వెంకట్రావుపల్లి పంచాయతీ ఎన్నికలు లేక అభిృవృద్ధికి నోచుకోవడం లేదన్నారు. డివిజన్ సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ శశికళ కోరారు. కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రె సిడెంట్ మారెల్లి రాజిరెడ్డి, కాలనీ పట్టణ అధ్యక్షుడు గుండేటి రాజేశ్, కార్పొరేటర్లు శంకర్ నాయక్, చక్రపాణి, రాములు, నాయకులు జక్కుల దామోదర్రా వు, రమేశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, తిరుపతి యాదవ్, కిషన్ నాయక్, రాజేశం, రబ్బానీ, రాజు ఉన్నారు. -
సజావుగా కొనుగోళ్లు
పెద్దపల్లిరూరల్: ధాన్యం, మక్కలను కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి మద్దతు ధరకు సేకరించాలని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూర మల్లారెడ్డి అన్నారు. స్థానిక మార్కెట్యార్డులో శనివారం ధాన్యం, మొక్కజొన్న రైతులు, సెంటర్ ఇన్చార్జిలతో ఆయన మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. దిగుబడులను నాణ్యతాప్రమాణాలకు లోబడి తీసుకొస్తే సత్వరమే కొనుగోలు చేస్తారని అన్నారు. రైతులకు అన్ని వసతులు కల్పించాలని సూచించారు. సీఈవో మదన్మోహన్, మార్క్ఫెడ్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. విద్యార్థుల స్టడీ టూర్ కాల్వశ్రీరాంపూర్: మంగపేట గ్రామంలోని దివ్య ఆర్గానిక్, వర్మికంపోస్ట్ తయారీ కేంద్రా న్ని రామగిరి ఉద్యానవన పాలిటెక్నిక్ విద్యార్థులు శనివారం సందర్శించారు. గడ్డి, ఇతర వ్యర్థాలు, వానపాముల ద్వారా వర్మీకంపోస్టు తయారీపై నిర్వాహకులు దివ్యశ్యాం వివరించారు. సేంద్రియ ఎరువుతో భూసారం పెరుగుతందని, ఆరోగ్యకరమైన పంటలు పండించుకోవచ్చని వివరించారు. వైస్ ప్రిన్సిపాల్ ప్రణీ త్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ట్రాక్ పనుల్లో రైల్వేకార్మికులు రామగుండం: జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతున్నాయి. రైల్వేట్రాక్పై ఇది 48 డిగ్రీల సెల్సియస్కుపైగా ఉంటాయి. ఇంతటి ఎండలోనూ రైల్వే కార్మికులు పట్టాల పునరుద్ధరణ పనుల్లో పాలుపంచుకుంటున్నారు. ప్రధానంగా రామగుండం–రాఘవపూర్ రైల్వేస్టేషన్ల మధ్య బసంత్నగర్ రైల్వే వంతెన కింద కార్మికులు ట్రాక్ పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. పిల్లలకు టీకాలు వేయించాలి సుల్తానాబాద్రూరల్: కాట్నపల్లిలో చేపట్టిన వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని హెచ్పీవీ వ్యాక్సినేషన్ రాష్ట్ర పరిశీలకుడు డేవిడ్ దామర శనివారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ, ఐదేళ్ల వయసులోపు పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలను వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. క్యాన్సర్ రాకుండా14 నుంచి 15 సంత్సరాలలోపు బాలికలకు హెచ్వీపీ వ్యాక్సిన్ తప్పనిసారిగా వేయించాలని సూచించారు. డీఐవో కిరణ్కుమార్, పీహెచ్సీ డాక్టర్ ఉదయ్కుమార్, సిబ్బంది ఉన్నారు. ప్రభుత్వ డిగ్రీకాలేజీలో చేరండి పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీకాలేజీలో ప్రవేశాలకు దోస్త్ ద్వారా ఆన్లైన్ దర ఖాస్తులు స్వీకరిస్తున్నారని ప్రిన్సిపాల్ లక్ష్మీనర్స య్య తెలిపారు. గతనెల 13న దోస్త్ నోటిఫికేషన్ విడుదలైందన్నారు. ఫేజ్– 1లో నమోదుకు ఈనెల 7వ తేదీ వరకు అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈనెల 8 వరకు వెబ్ ఆప్షన్లు నిర్వహిస్తారన్నారు. పెద్దపల్లి కాలేజీలో బీఏ, బీకాం(కంప్యూటర్ అప్లికేషన్స్, బ్యాంకింగ్) బీఎస్సీ లైఫ్సైన్సెస్, ఫిజికల్ సైన్సైస్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. వివరాలకు ప్రిన్సిపాల్ 94403 38459, దోస్త్ కో ఆర్టినేటర్ 94405 87697, టెక్నికల్ అసిస్టెంట్ 94411 83584 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. ఇంటింటికీ పౌష్టికాహారం పెద్దపల్లి: అంగన్వాడీ కేంద్రాలకు ఈనెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించడంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఇళ్లకు వెళ్లి కుపౌష్టికాహారం పంపిణీ చేసేందుకు అధికారు లు ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో706 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. గర్భిణులు 4,082 మంది, బాలింతలు 2,391 మంది, ఆరేళ్లలోపు పిల్లలు 2,435 మంది, ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులు 17,082 మంది, 3 నుంచి ఆరేళ్ల వయసుగలవారు 18,351 మంది ఉన్నారు. వీరందరికీ బియ్యం, పప్పు, పా లు, గుడ్లు, మురుకులు, బాలామృతం ఇళ్లవద్దనే పంపిణీ చేయనున్నారు. పక్కదారి పట్టకుండా ఉన్నతాధికారులు పర్యవేక్షించాలి. -
ఎండ మంట.. తప్పదంట
భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. జనాలు అల్లాడుతున్నారు. మే ప్రారంభంలోనే ఎండలు మండుతుండడంతో నెలంతా ఎలా గడుస్తుందోనని జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. మధ్యా హ్నం ఇళ్ల నుంచి బయట అడుగు పెట్టేందుకు జంకుతున్నారు. అత్యవసరమైతే ఉదయం, సాయంత్రం వేళల్లోనే ప్రయాణాలు చేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మండుతున్న ఎండల ధాటికి వాహనదారులు, పాదచారులు శనివారం అవస్థలు పడుతూనే గమ్యం స్థానం చేరుకున్నారు. రోడ్డుపై లారీలు ఇలా.. రాకపోకలెలా? పెద్దపల్లి – రాఘవాపూర్ మధ్య గోదాముల్లో సరుకులు అన్లోడ్ చేసేందుకు వచ్చిన లారీలు ఇరువైపులా నిలిపి ఉంచుతున్నారు. దారి ఇరుకుగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఇప్పటికే ప్రమాదాల బారినపడి గాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని గిడ్డంగుల నిర్వాహకులు, ట్రాఫిక్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని సర్పంచ్ తాడిచెట్టి చామంతి– శ్రీకాంత్ వాపోయారు. అఽధికారులు చర్యలు తీసుకోవాలని వాహహనదారులు కోరుతున్నారు. – పెద్దపల్లిరూరల్ -
డంపర్లకు బ్రేక్
● తీవ్రమైన టైర్ల కొరత ● నిలిచిన విడిభాగాల సరఫరా ● ఓసీపీల్లో కదలని భారీయంత్రాలు ● బొగ్గు ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం ఓపెన్కాస్ట్ ప్రాజెక్టుల్లో ఓవర్ బర్డెన్(మట్టి) తొలగించడం, బొగ్గు రవాణా చేయడంలో డంపర్లు(భారీవాహనాలు) సింగరేణి సంస్థకు గుండెకాయలాంటివి. నిర్దేశిత వార్షిక బొగ్గు ఉత్పత్తి సాధనలో ఓసీపీల వాటా దాదాపు 80శాతానికి పైగానే ఉంటుంది. ఇట్లాంటి ఉపరితల గనుల్లోని డంపర్లు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. ఓబీతోపాటు బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. టైర్లు లేక, విడిభాగాలు, పరికరాల సరఫరా నిలిచి ఈ దుస్థితి నెలకొంది. టైర్లు పంక్చర్ కావడంతో వర్క్షాప్లో మూలనపడిన డంపర్గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో వాహనాలు, భారీ యంత్ర విడిభాగాలకు కొరత ఏర్పడింది. వీటికొరతతో బొగ్గు గనుల్లో ప్రధానంగా ఓసీపీల్లో భారీ యంత్రాలు నిలిచిపోతున్నాయి. ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి పెరిగే సమయం, విద్యుత్కు డిమాండ్ తీవ్రంగా పెరుగుతున్న ఈ క్రమంలో యంత్రాలు, వాహనాలు నిలిచిపోవడం సంస్థకు సమస్యగా మారుతోంది. రామగుండం రీజియన్లోని ఓసీపీ–1, 2, 3, 5తోపాటు సింగరేణిలోని మిగతా ప్రాంతాల్లోనూ ఇదే సమస్య తలెత్తింది. ఆర్థిక వనరుల కొరత.. వాస్తవానికి సింగరేణికి ఆర్థిక వనరుల కొరత ఎదురైంది. అవి అందుబాటులో లేక ఈపరిస్థితి తలెత్తిందని అంటున్నారు. ప్రధానంగా డంపర్ టైర్ల కొరత తీవ్రంగా ఉందని కార్మికులు పేర్కొంటున్నారు. బేస్వర్క్షాప్లో ప్రతీరోజు 30 శాతానికిపైగా డంపర్ టైర్లు, ఇతర విడిభాగాలు సకాలంలో అందుబాటులోకి రావడం లేదని తెలుస్తోంది. కిందిస్థాయి అధికారి నుంచి సీఎండీ వరకు ఈ సమస్య తెలిసినా.. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఏమీచేయలేని దుస్థితి ఏర్పడిందనే చర్చ సాగుతోంది. అందుబాటులో లేని విడిభాగాలు డంపర్లు, డోజర్లు, షావల్స్, పొక్లెయిన్లు, బోజర్లు తదితర వాహనాలు, యంత్రాల విడిభాగాల కొరత వేధిస్తోంది. ప్రస్తుత వేసవిలో అధికంగా బొగ్గు ఉత్పత్తి చేయాలని కార్మికులను ఉరుకులు ప రుగులు పెట్టించే యాజమాన్యం.. ఉత్పత్తిలో కీలకపాత్ర పోషించే భారీ యంత్రాల మరమ్మతులపై ఎందుకు దృష్టి సారించడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈవిషయంలో సింగరేణి ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. బకాయిల భారం.. ప్రభుత్వం నుంచిసుమారు రూ.45వేల కోట్ల బకాయిలు సింగరేణికి రావాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే కొత్త గనుల తవ్వకం, యంత్రాల కొనుగోలు, ఉద్యోగులకు వేతనాల చెల్లింపుల కోసం ఇబ్బంది పడుతోంది. యంత్ర విడిభాగాలతోపాటు ఫైనాన్స్, పర్చేజ్ విభాగాల్లోపై దీనిప్రభావం చూపుతోంది. సివిల్ పనులు కూడా పెండింగ్ పడుతున్నాయి. కాస్త ఆలస్యమైంది.. డంపర్లు, ఇతర యంత్రాలకు అవసరమైన వంద టై ర్లు ఇప్పటివరకు వచ్చాయని ఓ అధికారి తెలిపా రు. ఇంపోర్టెడ్ టైర్లు కావడంతో కొనుగోలు విషయంలో బోర్డు ఆఫ్ డైరెక్టర్ల ఆమోదం కాస్త ఆలస్య మైన మాట వాస్తవమే అన్నారు. రిపేర్లో ఉన్న డంపర్ల టైర్లను రన్నింగ్లోని వాటికి అమర్చి నడిపిస్తు న్నామన్నారు. దశలవారీగా అన్నింటినీ వినియోగంలోని తీసుకొస్తామని, అలాగే విడిభాగాల విషయంలోనూ కాస్త జాప్యం అవుతోందని వివరించారు.బొగ్గు ఉత్పత్తిలో కీలకం.. బొగ్గు ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తున్న ఓసీపీల్లోని భారీ యంత్రాలకు టైర్ల కొరత తీవ్రంగా ఉంది. ప్రతీ ఓసీపీలోని డంపర్లలో 30 శాతం వరకు టైర్లు లేక నిలిచిపోతున్నాయని అంటున్నారు. ఉత్పత్తి, ఉత్పాదకత లేక ఈ సమస్య తీవ్రరూపం దాల్చిందని పేర్కొంటున్నారు. అంతేకాదు.. టైర్ల కొనుగోలుకు యాజమాన్యం యత్నిస్తున్నా భారీ బడ్జెట్ అవసరం కావడంతో ఏమీచేయలేని పరిస్థితిల్లో ఉందని తెలుస్తోంది. -
ఎర్లీబర్డ్ @ 11.65కోట్లు
కోల్సిటీ/పెద్దపల్లిరూరల్: ఆస్తిపన్ను, నల్లాబిల్లులు ముందుగా చెల్లించేవారికోసం ప్రభుత్వం అమలు చేసిన ఎర్లీబర్డ్ పథకం కింద జిల్లాలోని రామగుండం కార్పొరేషన్తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల ద్వారా రూ.11.65 కోట్ల ఆదాయం సమకూరింది. మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు మున్సిపల్ శాఖ ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే ఆస్తిపన్ను, నల్లా బిల్లులు చెల్లించేందుకు ముందుకొచ్చే వారికి ఐదుశాతం రాయితీ వర్తింపజేసింది. ఈ గడువు ఏప్రిల్ 30వ తేదీతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 15.11శాతమే రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ద్వారా రూ.1,667.75 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఎర్లీబర్డ్తో 4,04,981మంది రూ.252 కోట్లు(15.11శాతం) చెల్లించి ఐదుశాతం రాయితీ పొందారు. అందులో రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మున్సిపాలిటీ 58.41శాతం వసూలుతో అగ్రభాగాన నిలవగా సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం ద్వి తీయ, కరీంనగర్ జిల్లా జమ్మికుంట, హుజూరాబాద్ మూడు, నాలుగో స్థానాల్లో నిలిచాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ రూ.8.61కోట్ల వసూలుతో(44.70శాతం) ఐదోస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ఆఖరు స్థానంలో భూపాలపల్లి మున్సి పాలిటీ రూ.కోటి 2లక్షల ఆదాయాన్ని (1.05శాతం)తో నిలిచింది. కార్పొరేషన్లలో చూస్తే.. రామగుండం కార్పొరేషన్ అత్యధిక వసూళ్లతో అగ్రస్థానంలో నిలిచింది. బల్దియాలకు రూ.11.65కోట్ల ఆదాయం జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ల నుంచి రూ.11.65కోట్ల ఆదాయం ఎర్లీబర్డ్ ద్వారా సమకూరింది. రామగుండంలో రూ.19.26 కోట్ల డిమాండ్ ఉండగా రూ.8.61కోట్ల (44.70శాతం) ఆదాయాన్ని సాధించి రాష్టంలో ఐ దోస్థానాన్ని ఆక్రమించగా, జిల్లాలో అగ్రగామిగా ఉంది. అలాగే మంథని మున్సిపాలిటీలో రూ. 2.53కోట్ల డిమాండ్ ఉండగా రూ.63 లక్షలు సాధించి రాష్ట్రంలో 23వ, జిల్లాలో ద్వితీయ స్థానంలో ఉంది. పెద్దపల్లిలో రూ.8.78కోట్ల డిమాండ్ ఉండగా రూ.1.86కోట్లు సాధించి(21.18శాతం)తో రాష్ట్రంలో 38వ స్థానం, జిల్లాలో మూడోస్థానంలో ఉంది. సుల్తానాబాద్లో రూ.2.99కోట్ల డిమాండ్ ఉండగా రూ.55లక్షలు(18.39శాతం) మాత్రమే ఆదాయా న్ని సమకూర్చుకుని రాష్ట్రంలో 51వ స్థానం, జిల్లాలో ఆఖరు స్థానంలో ఉంది. పరిశ్రమల నుంచి అనూహ్య స్పందన రామగుండంలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల నుంచి 62 వేల వరకు అస్సెస్మెంట్లు ఉండగా, మొత్తం ఆస్తిపన్ను డిమాండ్ రూ.19.23 కోట్ల వరకు ఉంది. ఎర్లీబర్డ్ ఆఫర్కు ఆయ పరిశ్రమల నుంచి స్పందన లభించింది. ఎన్టీపీసీ రూ.3.88 కోట్లు, సింగరేణి రూ.కోటి 17లక్షలు, ఆర్ఎఫ్సీఎల్ రూ.కోటి 8లక్షలు, జెన్కో రూ.5లక్షల 99వేలు ఎర్లీబర్డ్ ద్వారా ఆస్తిపన్ను చెల్లించాయి. అభినందించిన మేయర్, కమిషనర్ ఆస్తిపన్ను ముందస్తుగా చెల్లించిన వారికి, వసూలు చేసిన రెవెన్యూ సిబ్బందిని రామగుండం మేయర్ మహంకాళి స్వామి, కమిషనర్ అరుణశ్రీ శనివారం ప్రత్యేకంగా అభినందించారు. ఐదుశాతం రాయితీతో ఆస్తిపన్ను వసూలు చేయడంలో రాష్ట్రంలోని కార్పొరేషన్లలో రామగుండం అగ్రస్థానంలో నిలవడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు సకాలంలో ఆస్తిపన్ను, నల్లాబిల్లులు చెల్లిస్తూ నగరాభివృద్ధికి సహకరించాలని మేయర్, కమిషనర్ కోరారు. జిల్లాలో రామగుండం కార్పొరేషన్ అగ్రస్థానం డిమాండ్ రూ.19.26 కోట్లు ఉంటే వసూలు చేసింది రూ.8.72కోట్లు చివరిస్థానంలో సుల్తానాబాద్ బల్దియా ముందస్తు ఆస్తిపన్ను చెల్లించిన పరిశ్రమలు -
విద్యుత్ ప్రమాదాల నియంత్రణపై అవగాహన
పెద్దపల్లిరూరల్: విద్యుత్ ప్రమాదాలను నియంత్రించేందుకు అనుసరించాల్సిన భద్రత ప్రమాణాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే అధికారులు పా టించాలని ఎస్ఈ గంగాధర్ సూచించారు. విద్యుత్ అధికారులతో శనివారం జిల్లా కేంద్రంలో ఆయన సమావేశమయ్యారు. అంతకు ముందు ప్రభుత్వ విప్ విజయరమణారావు, కలెక్టర్ శ్రీహర్షతో కలిసి విద్యుత్ భద్రత వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు. అధికారులు, సిబ్బంది పనులు చేసేటప్పుడు భద్రత ప్రమాణాలను పాటించాలన్నారు. డీఎంహెచ్వో ప్రమోద్కుమార్, టెక్నికల్ డీఈ బాలయ్య, ఆ పరేషన్ అధికారి రాజబ్రహ్మచారి, ఏడీఈ ఆంజనేయరావు, శ్రీనివాస్, జగదీశ్ పాల్గొన్నారు.వాణిజ్య కార్యకలాపాల్లోకి ఎన్టీపీసీ సోలార్ పవర్ ప్లాంట్ జ్యోతినగర్: ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఎన్టీపీసీ.. రామగుండంలోని 176 మెగావాట్ల సోలార్ పీ వీ ప్రాజెక్టులో 100 మెగావాట్ల ప్రాజెక్టును వాణిజ్య కార్యకలాపాల్లోకి ప్రవేశ పెట్టింది. శనివారం జీరో అవర్ నుంచి ఇది అమలులోకి వచ్చినట్లు న్యూఢిల్లీలోని కార్పొరేట్ సెంటర్ ఒక ప్రకటన విడుదల చే సింది. కొత్తగా ప్రారంభించిన 100 మెగావాట్ల సో లార్ ప్రాజెక్టు.. విద్యుత్ సామర్థ్యం, దక్షిణ భారతదేశంలో ఎన్టీపీసీ కొనసాగిస్తున్న పునరుత్పాదక ఇంధన విస్తరణలో ఓ భాగమని వెల్లడించింది. ఈప్రాజెక్టును ప్రధాని మోదీ ఈనెల 10న హైదరాబాద్లో అధికారికంగా ప్రారంభిస్తారని వివరించింది. -
ప్రజాసంక్షేమంపై ప్రత్యేక దృష్టి
పెద్దపల్లిరూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమానికే ప్రాధాన్యమిస్తోందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పట్టణ శివారు బంధంపల్లిలో శనివారం జరిగిన నియోజకవర్గస్థాయి ప్రజాపాలన – ప్రగతిప్రణాళిక 99రోజుల కార్యక్రమంపై కలెక్టర్ కోయ శ్రీహర్ష, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన సమీక్షించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. మహిళాసాధికారితకు సైతం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చి వ్యాపారావకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. రైతులు పంటమార్పిడి విధానాన్ని అవలంబిస్తే అధిక దిగుబడి వస్తుందని వెల్లడించారు. ‘మత్తు పదార్థాలకు నేను దూరం.. మరి మీరు’ అని విజయరమణారావు అన్నారు. మత్తునిచ్చే డ్రగ్స్, గంజాయిలాంటి పదార్థాల క్రయ, విక్రయాలపై టోల్ఫ్రీ నంబరు 1908, హెల్ప్లైన్ 14446 కు సమాచారం అందించాలని ఆయన కోరారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తున్నామని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కొత్త రేషన్కార్డులపై సన్నబియ్యం అందిస్తున్నామని అన్నారు. గృహజ్యోతి ద్వారా 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, ఇందిరమ్మ పథకం కింద పేదలు ఇల్లుకట్టుకునే అవకాశం కల్పించామని వివరించారు. ఇంధన కొరతపై వదంతులు డీజిల్, పెట్రోల్ కొరతపై వచ్చే వదంతులను నమ్మి ప్రజలు ఆందోళనపడొద్దని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. జిల్లాలో తగినన్ని నిల్వలు ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు కూర మల్లారెడ్డి, ప్రకాశ్రావు, ఆర్డీవో గంగయ్య, కౌన్సిలర్ పూరెళ్ల శైలజతోపాటు పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సర్కార్ ఆస్పత్రుల సేవల్లో పెద్దపల్లి టాప్ పంటమార్పిడి విధానంతో అధికదిగుబడి ఆదాయాన్నిచ్చే ఆయిల్పామ్ సాగుచేయండి ప్రభుత్వ విప్, విజయరమణారావు, కలెక్టర్ శ్రీహర్ష -
కార్మికుల శ్రమతోనే సంపద
జ్యోతినగర్: కార్మికుల శ్రమ దేశ సంపద సృష్టి కి మూలమని, సంస్థ అభివృద్ధిలో కార్మికుల శ్రమదానం ఎంతో గొప్పదని, శ్రమదానం చే సే వ్యక్తులు ఎల్లప్పుడూ ప్రతిఫలం పొందుతా రని రామగుండంలోని ఎన్టీపీసీ –తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. శుక్రవారం మేడే సందర్భంగా పార్కులో జెండా ఆవిష్కరించి మాట్లాడారు. కార్మికులు ఉత్పాదకత పెంచాలని, హక్కుల గురించి అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. ఉద్యోగుల సంక్షేమం, సమ్మిళిత వృద్ధిపై ఎన్టీపీసీ దృష్టి సారిస్తుందని ఆ యన స్పష్టం చేశారు. విధి నిర్వహణలో కార్మి కులు తమ ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. కార్యక్రమంలో ఉన్న తాధికారులు, అధికారులు, ఉద్యోగ గుర్తింపు సంఘం నాయకులు, పలు సంఘాల నాయకు లు, ప్రతినిధులు, ఉద్యోగులు, కాంట్రాక్టు ఏజెన్సీల ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. పథకాలపై అవగాహన అవసరం పెద్దపల్లి: కార్మిక సంక్షేమ పథకాలపై అవగాహన పెరగాలని అదనపు కలెక్టర్ వేణు అన్నా రు. కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన మే డేలో వేణు మాట్లాడారు. ప్రతీశాఖలోని ఉద్యోగులందరూ శ్రామికులేనని అన్నారు. శ్రామిక హ క్కులు, ప్రయోజనాలు పోరాటాల ద్వారానే సాధ్యమయ్యాయని తెలిపారు. కనీస వేతన చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, జిల్లాలోని సింగరేణి, ఆర్ఎఫ్సీఎల్, ఎన్టీపీసీ, కేశోరం వంటి పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమం అనంతరం మే డే పురస్కారాలను కార్మికులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్మిక కమిషనర్ వెంకటరమణ, జిల్లా సహాయ కార్మిక అధికారి మొహమ్మద్ రఫీ, ఉపాధి కల్పనాధికారి రాజశేఖర్, బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డిపాల్గొన్నారు. మోతాదు మించొద్దు మంథనిరూరల్: పంటలకు మోతాదుకు మించి ఎరువులు వాడవద్దని, అలా వాడితే పంట లతోపాటు భూమికి నష్టం జరుగుతుందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వ విద్యాలయ శాస్త్రవేత్తలు అరుణ్కుమార్, శ్రావణ్ అన్నారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చిన్నఓదాలలో రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. యూరియా వినియోగం తగ్గించాలని, అవసరానికి మించి పురుగులమందులు వాడితే దిగుబడిపై ప్రభావం చూపుతుందన్నారు. అనంతరం విశ్వవిద్యాలయం నుంచి రూపొందించిన వివిధ వరి రకాల వంగడాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగుల శారద, మండల వ్యవసాయ అధికారి నవ్య, ఏఈవో మురళి, పంచాయతీ సెక్రటరీతోపాటు రైతులు పాల్గొన్నారు. బుద్ధుని బోధనలు ఆచరించాలి జూలపల్లి/ఎలిగేడు: శాంతి, సామరస్యానికి బుద్ధుని బోధనలు ఎంతగానో ఉపయోగపడ తాయని బుద్ధ జయంతోత్సవ కమిటీ చైర్మన్ మొగురం రమేశ్ అన్నారు. వడ్కాపూర్లోని బౌద్ధస్తూపం వద్ద శుక్రవారం బుద్ధుని జయంతి ఘనంగా నిర్వహించారు. తెలంగాణలోనే ప్రాచీన, ప్రాముఖ్యత, చరిత్ర కలిగిన బౌద్ధ స్తూపం ఉన్న ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. కనీస సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం నిధు లు మంజూరు చేయాలని అన్నారు. జూలపలి మార్కె ట్ కమిటీ చైర్మన్ కొమ్మ పోచాలు, ధూళికట్ట సింగిల్విండో మాజీ చైర్మన్ వేణుగోపాలరా వు, సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు నర్సింహ యాదవ్ పాల్గొన్నారు. -
కార్మికులకు శ్రమశక్తి అవార్డులు
జ్యోతినగర్: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం(మేడే) సందర్భంగా ఎన్టీపీసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు డి.సత్యం, ఈదునూరి పర్వతాలు, ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకుడు దేవసాని భిక్షపతి ప్రతిష్టాత్మక శ్రమశక్తి అవార్డులు అందుకున్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ నుంచి వారు అవార్డులు అందుకున్నారు. కష్టపడి పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి విశేషంగా తోడ్పడిన కార్మికుల సేవలను గుర్తిస్తూ ఈ అవార్డులు ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతలను కాంట్రాక్టు కార్మికులు తదితరులు అభినందించారు. -
అడుగంటుతున్నాయి..
సుందిళ్ల చెరువుబంధంపల్లి చెరువుఎండల తీవ్రతతో మనుషులతోపాటు చెరువులకూ కష్టాలు మొదలయ్యాయి. రోజు రోజుకూ మండుతున్న ఎండలతో చెరువుల్లో నీరుఅడుగంటి వెలవెలబోతున్నాయి. పంటలకు, తాగునీటికి ఈసారి సమస్య తప్పేట్టు లేదంటున్నారు పల్లెవాసులు. జిల్లావ్యాప్తంగా ఇదేపరిస్థితి నెలకొంది. పెద్దపల్లి మండలం బంధంపల్లి, గౌరెడ్డిపేట, ముత్తారంతోపాటు రామగిరి మండలం సుందిళ్ల చెరువులు ఎండల తీవ్రతతో అడుగంటిపోయి ‘సాక్షి’ కెమెరాకు ఇలా కనిపించాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
మంథని: కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పక్షపాతిగా పనిచేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. మేడే సందర్బంగా సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి మాట్లాడారు. అర్హులైన మున్సిపల్ కార్మికులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తామని, మేడే స్ఫూర్తితో కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తామన్నారు. సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గణేశ్, నాయకులు వేల్పు ల సురేశ్, గోవింద్, మల్లేశ్, చందు గట్టయ్య, జంప య్య, పోచమ్మ, భాగ్య, సుక్కమ్మ పాల్గొన్నారు. విద్యార్థుల సాంకేతిక నైపుణ్యం పెంచుతాం గ్రామీణ విద్యార్థుల సాంకేతిక నైపుణ్యం పెంపొందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. పట్టణంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు ఆయన పరిశీలించారు. ‘సూపర్ సమ్మర్’ వేసవి శిబిరాన్ని మంత్రి సందర్శించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. కంప్యూటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ), రోబోటిక్స్ వంటి ఆధునిక రంగాల్లో విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నామని మంత్రి అన్నారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో డిజిటల్ అక్షరాస్యత ఎంతో అవసరమని ఆయన అన్నారు. అభివృద్ది పనుల్లో వేగం పెంచండి అనంతరం పట్టణ శివారులోని గోదావరి నదిని సందర్శించిన మంత్రి శ్రీధర్బాబు.. నదిలో ఎల్లవేళలా స్వచ్ఛమైన నీరు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తర్వాత మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించి.. నిర్మాణంలో కొన్నిమార్పులు సూచించారు. అలాగే నిర్మాణంలోని తహసీల్దార్, ఆర్డీవో, సమగ్ర మండల కార్యాలయ సముదాయాలను ప రిశీలించి, పనులను వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు. ఎంపీడీవో పాత భవనాన్ని ఐటీ శాఖ కు కేటాయించి పునరుద్ధరించాలని చెప్పారు. అ య్యగారి చెరువు సుందరీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఆర్డీవో సురేశ్, తహసీల్దార్ ఆరిఫ్ ఉద్దీన్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేడే వేడుకల్లో మంత్రి శ్రీధర్బాబు -
నిర్మిస్తారా.. వదిలేస్తారా?
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ఐటీఐ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వ ఐటీఐ ప్రహరీని ఆనుకుని టేలాలు వేసుకుని కొందరు చిరువ్యాపారులు జీవనం సాగించారు. సదరు చిరువ్యాపారులకు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి గదులు కేటాయిస్తామని 1996లో అప్పటి అధికారులు, పాలకులు నిర్వాసితులకు హామీ ఇచ్చారు. కానీ, మూడు దశాబ్దాలు గడచినా ఆ హామీ నెరవేరలేదని అప్పటి తహసీల్దార్కు డీడీలు చెల్లించిన పలువురు టేలా వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్ల క్రితం ప్రతిపాదనలు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీబస్టాండ్ సమీపంలో ప్ర భుత్వ ఐటీఐ రాజీవ్ రహదారి, రైల్వేస్టేషన్ రోడ్డును ఆనుకుని ఉంది. ఐటీఐ ప్రహరీని కూల్చి రాజీవ్ రహదారి వైపు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు ప్రతిపాదించారు. రాజీవ్ రహదారి నిర్మాణ సమయంలోనే అధికారులు ఈ ప్రక్రియకు పూనుకున్నా రు. ఆ రోడ్డు విస్తరణ సమయంలో పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాల్లో ప్రధాన రోడ్ల వెంట చిరువ్యాపారాలు చేసుకునే వారి టేలాలు తొలగించడంతో ఉపాధి కోల్పోవాల్సి వస్తోదని అప్పటి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. సుల్తానాబాద్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. కానీ, పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ అధికారులు కాంపెక్స్ నిర్మాణానికి అంగీకరించలేదు. దీంతో షాపింగ్ కాంప్లెక్స్ పనులు మొ దలు కాలేదు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఉన్న గీట్ల ము కుందరెడ్డి దృష్టికి ఈ షాపింగ్ వ్యవహారం రాగా.. అప్పటి కేంద్రమంత్రి జి.వెంకటస్వామితో చర్చించి సీఎం వైఎస్సార్ చేతుల మీదుగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేయించేందుకు ఏర్పాట్లు చేశారు. దురదృష్టవశాత్తు అదే సమయంలో కేంద్రమంత్రి వెంకటస్వామి సతీమణి మరణించడంతో కార్యక్రమం వాయిదా పడింది. అప్పటినుంచి షాపింగ్ కాంప్లెక్స్ వ్యవహారం ఎటూతేలడంలేదు. డీడీల సొమ్ము ఏమైనట్టు? పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు.. నిర్వాసిత టేలా వ్యాపారుల నుంచి కంట్రిబ్యూషన్గా ఒక్కొక్కరి నుంచి రూ.5వేల నుంచి రూ.20వేల వరకు సేకరించారు. ఆ సమయంలో తహసీల్దార్ పేరిట చెల్లించిన డీడీల సొమ్ము ఏమైందో తెలియదు గానీ.. ఇప్పటివరకు షాపింగ్ కాంప్లెక్స్ పనులు జరగక.. చెల్లించిన చిరువ్యాపారుల కు తిరిగి ఇవ్వక ఆ సొమ్ము ఏమైందో తెలియని స్థితి ఉంది. జిల్లా మంత్రి శ్రీధర్బాబు, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు ఐటీఐ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంపై దృష్టి సారించాలని నిర్వాసితులు కోరుతున్నారు. ఐటీఐ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంపై సందిగ్ధం కంట్రిబ్యూషన్ డీడీలు చెల్లించి మూడు దశాబ్దాలు ఇంకా ప్రారంభించని పనులు టేలా నిర్వాసితుల్లో ఆందోళన -
స్వచ్ఛత కోసం ఫీడ్బ్యాక్ ఇవ్వండి
కోల్సిటీ: స్వచ్ఛ సర్వేక్షణ్లో రామగుండం నగరాని కి మంచి ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని మేయర్ మహంకాళి స్వామి కోరారు. స్థానిక 49వ డివిజన్లోని మార్కండేయ కాలనీలో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్ల య్య, కార్పొరేటర్ సాగి సంతోష్రావుతో కలిసి మే యర్ వార్డు పర్యటన చేపట్టారు. ఎమ్మెల్యే సూచ నల మేరకు స్వచ్ఛతపై దృష్టి సారించి కాలువల్లో పూడికతీత చేపట్టామని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ఇంటింటా అవగాహన క ల్పిస్తున్నామని తెలిపారు. వర్షాకాలంలో వరద ప్ర భావానికి గురైన గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ దఫా ముందుగానే కాలువల్లో పూడికతీత చేపట్టామని అన్నారు. శానిటేషన్లో మార్పు కనిపిస్తున్నందున స్వచ్ఛ సర్వేక్షణ్లో నగరం ఉత్తమ ర్యాంకు సాధించేందుకు మంచి ఫీడ్ బ్యాక్ ఇవ్వా లని ఆయన కోరారు. పలువురు కార్పొరేటర్లతోపాటు నగరపాలక సంస్థ ఎస్ఈ గురువీర, ఈఈ పీవీ రామన్, డీఈ ఆఫ్తాబ్, ఏఈ మీర్, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యం అవసరం స్వచ్ఛ సర్వేక్షణ్లో రామగుండం మంచి ర్యాంకు సాధించాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. గోదావరిఖని లక్ష్మీనగర్ ప్రాంతంలో ఆయన వ్యాపారులు, స్థానికులకు అవగాహన కల్పించారు. ఆన్లైన్లో స్వచ్ఛ సర్వేక్షణ్ ఫీడ్బ్యాక్ ఎలా ఇవ్వాలో మేయర్ వివరించారు. అక్కడికక్కడే ప్రజల మొబైల్ ఫోన్లలో ఫీడ్బ్యాక్ నమోదు చేయించారు. నగర శుభ్రత, మురుగు నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ అంశాల్లో ప్రజల అభిప్రాయాలు ఎంతో ముఖ్యమని ఆయన తెలిపారు. రామగుండం మేయర్ మహంకాళి స్వామి -
ఘనంగా శ్రీరామ పట్టాభిషేకం
కాల్వశ్రీరాంపూర్: జాఫర్ఖాన్పేటలో గురువా రం శ్రీరామపట్టాభిషేకం ఘనంగా నిర్వహించారు. రామాయణ కళాకారులు శ్రీసీతారామలక్ష్మణుల వేషధారణలతో ప్రదర్శనలు ఇచ్చా రు. మాస్టర్ అశోక్, కళాకారులను గ్రామస్తులు సన్మానించారు. మహిళలు ఒడిబియ్యం పోసి, కట్నకానుకలు సమర్పించారు. ఏగొళపు కుమా ర్ గౌడ్ ట్రస్ట్ చైర్మన్ సదయ్యగౌడ్ అన్నప్రసా దం అందజేశారు. సర్పంచ్ జ్యోత్స్న, ఉప స ర్పంచ్ శ్రావణ్, మాజీ జెడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ సంపత్ యాదవ్, మా జీ సర్పంచ్ దొమ్మటి శ్రీనివాశ్, మాజీ ఎంపీటీసీ కొల్లూరి రమాదేవి పాల్గొన్నారు. ఉద్యోగుల సేవలు ప్రశంసనీయంజ్యోతినగర్: విధి నిర్వహణలో ఎన్టీపీసీ ఉద్యోగులు ప్రదర్శిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఈడీ చందన్కుమార్ సామంత అన్నారు. ఎన్టీపీసీలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందుతున్న వారితో ఆయన గురువారం మొ క్కలు నాటించారు. అనంతరం జ్ఞాపికలు అందించి సన్మానించారు. పీటీఎస్ పార్కులో జరి గిన ఈ కార్యక్రమంలో ఉద్యోగ విరమణ పొందుతున్న రామలింగేశ్వరరావు, గొల్లపల్లి సత్యనారాయణ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఉద్యోగులు విద్యుత్ ఉత్పత్తిలో చేసిన సేవలు అభినందనీయమన్నారు. అధికారులు, ఉద్యోగుల కుటుంబసభ్యులు, వివిధ యూనియన్ల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ‘సరోవర్’ పనుల పరిశీలన కాల్వశ్రీరాంపూర్: జాఫర్ఖాన్పేటలోని శ్రీరా మపాద సరోవర్ ప్రాజెక్టు మరమ్మతులను ఇంజినీరింగ్ అధికారులు గురువారం పరిశీలించా రు. తరచూ బుంగపడుతుందని రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పనులు పక్కాగా చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్యోత్స్న, ఇరిగేషన్ ఈఈ హరిప్రసాద్, డీఈ రవి, ఏఈ శ్రవణ్, వర్క్ ఇన్స్పెక్టర్ సురేందర్, ఉప సర్పంచ్ శ్రావణి, రైతులు పాల్గొన్నారు. ఆధునిక పద్ధతులు పాటించాలిపాలకుర్తి: వ్యవసాయంలో రైతులు ఆధునిక ప ద్ధతులు ఆచరించి తక్కువ పెట్టుబడితో ఎక్కు వ ఆదాయం సాధించాలని కూనారం వ్యవసా య పరిశోధన సంస్థ హెడ్ సతీశ్చంద్ర అన్నా రు. రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు కార్యక్రమా న్ని గురువారం కుక్కలగూడూరులో నిర్వహించారు. రసాయన వినియోగాలను తగ్గించి సేంద్రియ ఎరువులు వినియోగించాలని సూచించారు. తద్వారా నేల, నీరు, గాలి కాలుష్యాన్ని నివారించి ప్రకృతిని కాపాడుకోవచ్చునని అ న్నారు. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజేంద్రప్రసాద్, మండల వ్యవసాయాధికారి ప్రమోద్కుమార్, రైతులు పాల్గొన్నారు. జూన్ 5 నుంచి సప్లిమెంటరీ పెద్దపల్లి: పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5 నుంచి 12వ తేదీ వరకు ని ర్వహిస్తారని డీఈవో శారద తెలిపారు. ఫెయి లైన విద్యార్థులు ప్రధానోపాధ్యాయుల ద్వారా Cyber Treasury ద్వారా ఏప్రిల్ 30 నుంచి మే 14వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. శస్త్రచికిత్సలు విజయవంతం పెద్దపల్లి: కాలిన గాయాలతో జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ ఆస్పత్రిలో గతనెల చేరిన ఓ మహిళ(28)కు డాక్టర్లు సాయిప్రసాద్, విష్ణుచంద్రిక ఆధ్వర్యంలో రెండురోజుల పాటు సాధారణ చి కిత్స అందించారు. చేశారు. పేషెంట్ కోలుకు న్నాక గురువారం ప్లాస్టిక్ సర్జరీని విజయవంతంగా పూర్తిచేశారు. ఇందులో డాక్టర్ అశోక్రెడ్డి బృందం నైపుణ్యం ప్రదర్శించింది. ఆయనతోపాటు డాక్టర్లు సాయిప్రసాద్, స్వాతిని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ అభినందించారు. అదేవిధంగా వివిధ రోడ్డు ప్రమాదాల్లో గాపడిన ఇద్దరు యువకులకు అరుదైన శస్త్రచికిత్స లు నిర్వహించిన సీనియర్ ఆర్థోపెడిక్ శ్రీనివాస్రెడ్డి, డాక్టర్లు వినయ్, భవాని తదితులను కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు. టీబీ రహిత జిల్లా లక్ష్యం పెద్దపల్లి: టీబీ రహిత జిల్లా నిర్మాణానికి అందరం సహకరించాలని గర్రెపల్లి పీహెచ్సీ డా క్టర్ ఉదయ్ కుమార్ కోరారు. సుల్తానాబాద్లో చెస్ట్ ఎక్స్రే ప్రోగ్రాం చేపట్టగా ఆయన మాట్లాడారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నారు. -
రాగం.. తాళం.. పల్లవి
మంథని: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఏకై క సంగీత, నృత్య విద్యాలయంలో మూగబోయిన సప్తస్వరాలు త్వరలోనే ఫరిడవిల్లే అవకాశం వచ్చింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆదేశాల మేరకు కలెక్టర్ కోయ శ్రీహర్ష విద్యాలయానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు యత్నిస్తు న్నా రు. ఇప్పటికే ఇద్దరు అధ్యాపకులను కాంట్రాక్ట్ పద్ధ తిన ఇప్పటికే నియమించారు. సొంతంగా భవనం కేటాయించారు. అసంతృప్తిగాఉన్న ఆ భవనాన్ని వి నియోగంలోకి తీసుకొచ్చేందుకు నిధులు కేటాయించడంతో పనులు చకచకా సాగుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలోగా సొంతభవనంలో సంగీత పాఠశాల విద్యార్థులతో కళకళలాడనుంది. గతమెంతో ఘనం.. ప్రాచీన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన వేదవిద్యకు పుట్టినిల్లు మంథని. ఇక్కడ సంగీత కళాశాల నెలకొల్పితే ప్రాచీన కళలకు జీవం పోసినట్లవుతుంది. ఈక్రమంలోనే మంథనిలో 1992లో సంగీత, నృత్య కళాశాల ప్రారంభించారు. అప్పట్లోనే పూర్తిస్థాయిలో అధ్యాపకులు, కార్యాలయ సిబ్బందిని నియమించారు. దీంతో సప్తస్వరాలు ఫరిడవిల్లాయి. కళల్లో ప్రావీణ్యం సంపాదించిన పలువురు విద్యార్థులు జిల్లా, రాష్ట్రస్థాయిల్లో అనేక బహుమతులు అందుకొని కళాశాల ఖ్యాతిని ఇనుమడింపజేశారు. కానీ.. కొంతకాలానికి కళాశాలను నిర్లక్ష్యం ఆవరించింది. అ ధ్యాపకులు, కార్యాలయ సిబ్బందిని డిప్యుటేషన్పై బదిలీచేశారు. కొత్తగా ఎవరినీ నియమించలేదు. సప్తస్వరాల చప్పుడు మెల్లమెల్లగా ఆగిపోయింది. ఆ పరిస్థితి చక్కదిద్దేందుకు పనులు ప్రస్తుతం ఆగమేఘాలపై కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 70 మంది విద్యార్థులు ప్రస్తుతం 70 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారు. కూచిపూడి నృత్యం, వీణ, వోకల్, పే రణి నృత్యం, మృదంగం కో ర్సులు అందుబాటులో ఉన్నా యి. రెగ్యులర్ ప్రిన్సిపాల్ ఉండగా, ఇద్దరు గౌరవ వేతనంపై పనిచేస్తున్నారు. మరో ఇద్దరు కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తు న్నారు. సీనియర్, జూనియర్ అసిస్టెంట్లతోపాటు ఇద్దరు అటెండర్లు ఉన్నారు. గౌరవ వేతనంపై రా జేశం మృదంగం విద్య నెర్పుతున్నారు. ప్రిన్సిపల్ కర్నాటక ఓకల్ నేర్పుతుండగా పేరణి డాన్స్ను మరో అధ్యాపకుడు నేర్పిస్తున్నారు. వయోలిన్, కూచిపూడి, సితార, గాత్రం, హిందూస్థానీ, గాయక అకంపనిస్టు, మృదంగం అకంపనిస్టు, వీణపోస్టులు ఖాళీగా ఉన్నాయి. అద్దె అవస్థలకు చెక్ పాఠశాలకు పక్కాభవనం లేదు. ప్రతినెలా అద్దె రూ.15వేలు భారం పడుతోంది. ఈ అవస్థ మరోనె లలో తీరనుంది. గతంలో మహిళా మండలి స్థలా న్ని పాఠశాలకు కేటాయించారు. నృత్య పాఠశాలకు కేటాయించిన భవనంలో కొన్ని పనులు అసంపూర్తిగా ఉండడంతో కలెక్టర్ జోక్యం చేసుకుని రూ.9 లక్షలు కేటాయించారు. దీంతో ప్రహరీ, గేట్లు, మరికొన్ని పనులు చేపట్టారు. అవసరమైన మరో రూ.పది లక్షలు కూడా సమకూర్చినట్లు తెలిసింది. డిప్లొమా కోర్సుకు కరీంనగర్ నుంచి.. కరీంనగర్కు చెందిన నలుగురు విద్యార్థులు డిప్లొమా కోర్సులో చేరినట్లు ప్రిన్సిపాల్ శారద జనస్వామి తెలిపారు. వారు నిత్యం పాఠశాలకు వచ్చి విద్య నేర్చుకుంటున్నట్లు పేర్కొన్నారు. పక్కా భవనం, కింది అంతస్తులోకి పాఠశాల మారుతుందనే సమాచారంతో చాలామంది విద్యార్థులు చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఆమె వివరించారు. ఈ విద్యాసంత్సరం నుంచే సొంత భవనంలోకి మారుతున్నామనేది సంతోషంగా ఉందన్నారు. మంథనిలో మళ్లీ సప్తస్వరాలు పలికించేలా తనవంతు కృషి చేస్తున్నానని అన్నారు. అందరి సహకారంతో పూర్వవైభవం వస్తుందని వివరించారు. శిక్షణ పొందుతున్న కళాకారులుఅందుబాటులో సప్తస్వరాలు పలికే పరికరాలు ఫరడవిల్లనున్న సప్తస్వరాలు సంగీత విద్యకు పూర్వవైభవం త్వరలోనే సొంత భవనంలోకి పాఠశాల అద్దె అవస్థలకు చెక్.. అడ్మిషన్లు పెరిగే అవకాశం -
మొక్కజొన్న పంట దగ్ధం
మల్లాపూర్: దగ్ధమైన పంట రాయికల్: మంటలు ఆర్పుతున్న హమాలీలు మల్లాపూర్/రాయికల్: సమీప రైతులు చెత్తకు నిప్పటించగా.. ప్రమాదవశాత్తు నిప్పురవ్వలు ఎగిసిపడి మూడెకరాల మొక్కజొన్న పంట దగ్ధమైన ఘటన మల్లాపూర్ మండలం రేగుంటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాలసాని రాజన్న కంకలను కుప్పగా పోశాడు. గురువారం తోటి రైతులు చెత్తను కాల్చేందుకు మంట పెట్టారు. దీంతో మంటలు ఎగిసిపడి రాజన్న మొక్కజొన్న చేనును చుట్టుముట్టాయి. బాధితుడు, రైతులు కలిసి మంటలను ఆర్పేశారు. అప్పటికే కంకులు కాలిపోయాయి. రూ.లక్ష నష్టం వాటిల్లినట్లు బాధితడు వాపోయాడు. ఏఈవో వంశీ పంటను పరిశీలించారు. రాయికల్లో తప్పిన ప్రమాదం రాయికల్: మండలంలోని ఆల్యనాయక్ తండాలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు ధాన్యం రాశులను చుట్టుముట్టాయి. ఆ సమయంలో రైతులెవరూ లేకపోవడంతో హమాలీలే స్పందించి మంటలను ఆర్పేశారు. సకాలంలో స్పందించిన హమాలీలను సర్పంచ్ సంతోష్, తిరుమల్నాయక్, రైతులు అభినందించారు. -
కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు
ఎలిగేడు: కాంగ్రెస్ ప్రభుత్వం కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తోందని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. ఎలిగేడు మండలం బుర్హాన్మియాపేట, సుల్తాన్పూర్, ముప్పిరితోట, రాములపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన గురువారం ప్రారంభించి మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తోందన్నారు. ఏవో ఉమాపతి, ఏపీఎం గీత, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సామ రాజేశ్వర్రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకుడు దుగ్యాల సంతోష్రావు, సర్పంచులు గోపు రజిత, కవ్వంపల్లి బాపయ్య, రామిడి శైలజ, సిద్ధి తిరుపతియాదవ్, మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. పెద్దమ్మ ఆలయంలో విప్ పూజలు పెద్దపల్లిరూరల్: సబ్బితం గ్రామంలో ముదిరాజ్ల ఆరాధ్యదైవం పెద్దమ్మతల్లి ఆలయంలో గురువారం జరిగిన ప్రత్యేక పూజల్లో ప్రభుత్వవిప్ విజయరమణారావు పాల్గొన్నారు. బోనాలతో అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. ఆలయకమిటీ సభ్యులు ఆయనను సత్కరించారు. సర్పంచ్ సరోజనతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. ప్రభుత్వ విప్ విజయరమణారావు -
మానవ తప్పిదాలేనా?
గోదావరిఖని: ఒక టీచర్ వెన్నెల ఇంట్లో చీకటి.. ఓ అర్చకుడు సంతోష్కుమార్ ఇంట్లో ఆర్తనాదాలు.. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఒకేరోజు జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. క్షేమంగా ప్రయాణించి– క్షేమంగా గమ్యం చేరాలనే లక్ష్యంతో పోలీసు శాఖ విసృత ప్రచారం చేస్తోంది. యముడు, చిత్రగుప్తుడు వేషధారణలతోనూ ప్రజలకు సులభంగా అవగాహన కల్పిస్తున్నారు. అయినా రోడ్డు ప్రమాదాలు పోలీసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సీటుబెల్ట్, హెల్మెట్, డంక్ అండ్ డ్రైవ్ తనిఖీలపై విస్తృత ప్రచారం చేస్తోంది. డీజీపీ నుంచి ఎస్సై వరకు అరైవ్ – అలైవ్పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. వార్డు సభ్యుని నుంచి సీఎం వరకు ప్రజాప్రతినిధులను భాగస్వా ములను చేస్తున్నారు. అయినా రోడ్డు ప్రమాదాలు మృత్యు ఘంటికలు మోగిస్తూనే ఉన్నాయి. జిల్లాలో గత రెండు నెలల్లో 105 ప్రమాదాలు జరిగి 39 మంది మృతి చెందారు. అనేకమంది గాయపడ్డారు. ప్రచారం ఉన్నా కానరాని ఫలితం ట్రాఫిక్, సివిల్ పోలీసులు, రవాణాశాఖ, వైద్యులు, ఇతర విభాగాల అధికారులు కలిసి రోడ్డు భద్రతపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం, వేగం నియంత్రణ వంటి అంశాలపై సూచనలు ఇస్తున్నారు. పాఠశాలలు, క ళాశాలలు, ప్రధాన కూడళ్లలో పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏ ర్పాటు చేస్తున్నారు. రోడ్డు సేఫ్టీ నిబంధనలుపాటించాలని సూచిస్తున్నారు. అయినా ఈప్రచారం ప్రజ ల ప్రవర్తనలో మార్పు తీసుకురాలేకపోతోంది. ఆందోళనకు గురిచేస్తున్న రోడ్డు ప్రమాదాలు ఎవరికీ పట్టని ‘అలైవ్– అరైవ్’ పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా ఆగని ఘటనలు రెండు నెలల్లో 105 ప్రమాదాలు.. 36 మంది దుర్మరణం ఆందోళన కలిగిస్తున్న వాహనదారుల నిర్లక్ష్యంరెండు నెలల్లో జరిగిన ప్రమాదాలునెల ప్రమాదాలు గాయాలు మృతులు మార్చి 89 51 30ఏప్రిల్ 19 08 09మొత్తం 108 59 39జిల్లాలో జరుగుతున్న ప్రమాదాలకు ఎక్కువసంఖ్యలో మానవతప్పిదాలే కారణమని విశ్లేషిస్తున్నారు. త్వరగా గమ్యం చేరాలనే ఆలోచన తో అతివేగం, తమకేమవుతుందిలే అని మ ద్యం తాగి డ్రైవింగ్ చేయడం కూడా ప్రమాదాలకు కారణమవుతోందని అంటున్నారు. మొబైల్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రమాదాలను తెచ్చపెడుతోంది. అయితే, ప్రమాదం జరిగినా ప్రాణాలను కాపాడుకునేందుకు వీలున్న హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం సరిగా ఉండటం లేదని పోలీసుశాఖ గుర్తించింది.ప్రజల్లో మార్పు రావాలి ప్రమాదాల నియంత్రణకు తరచూ స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. అయినా, ఏదోఓచోట ప్రమాదం చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. డీజీపీ ఆదేశాల మేరకు రామగుండం పోలీసు కమిషనరేట్లో అలైవ్–అరైవ్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, స్పీడ్ గన్స్ ద్వారా వేగంపై డేగకన్ను వేశాం. అయినా, ప్రజల్లో బాధ్యతా రాహిత్యంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. త్వరగా గమ్యం చేరుకోవాలనే ఆత్రుత వారి కుటుంబాల్లో విషాదం నింపుతోంది. – అంబర్ కిశోర్ ఝా, పోలీస్ కమిషనర్, రామగుండం -
తీరిన తాగునీటి తిప్పలు
పెద్దపల్లిరూరల్: ఊళ్లో రెండు వాటర్ ట్యాంకులు ఉండి.. ఇంటింటికీ మిషన్భగీరథ నల్లా కనెక్షన్ ఉన్నా ఎస్సీ కాలనీవాసులకు దాదాపు మూడేళ్లుగా తాగునీటి సరఫరా సాగడంలేదు. ఈసారి ఎండలు మండిపోతుండడంతో నీటిసమస్య తీవ్రరూపం దాల్చింది. కాలనీవాసులు అందరూ పంచాయతీ పాలకమండలి దృష్టికి తీసుకెళ్లారు. అదే చీకురాయి గ్రామంలోని కాలనీ. సర్పంచ్ ఓదెల శ్రీనివాస్, కార్యదర్శి శంకరయ్యతోపాటు పాలకమండలి సభ్యులు తమ సమస్య పరిష్కరించాలని కాలనీవాసులు కోరారు. స్పందించిన పాలక మండలి సభ్యులు.. డైరెక్ట్ పంపింగ్ ద్వారా తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించారు. దీంతో కాలనీవాసుల్లో సంతోషం వ్యక్తమైంది. ఇంటింటికీ నల్లా కనెక్షన్.. పెద్దపల్లి మండలం చీకురాయి గ్రామంలో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఉంది. కానీ మూడేళ్లుగా ఎస్సీకాలనీవాసులకు తాగునీరు అందక అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం మండుటెండలకు సమస్య మరింత జటిలమైంది. దీంతో పరిష్కారం ఎలా చూపాలా? అని పంచాయతీ పాలకులు, కార్యదర్శి ఆలోచించారు. వాటర్ ట్యాంకుకు సరఫరా అవుతున్న ప్రధాన పైపులైన్ నుంచి నేరుగా కాలనీవాసులకు నీటిని అందించేలా వాల్వ్ ఏర్పాటు చేశారు. వాల్వ్ ఆన్ చేయగానే నల్లాల ద్వారా ఇళ్లకు తాగునీరు చేరడంతో కాలనీవాసుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సమస్యకు పరిష్కారం చూపిన పంచాయతీ పాలకమండలి, కార్యదర్శికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. చీకురాయి ప్రొఫైల్ జనాభా 1,580 నివాసాలు 473 వాటర్ ట్యాంకులు 02 (60వేలు, 40వేల లీటర్ల నీటి సామర్థ్యం) కుళాయి కనెక్షన్లు 473 చీకురాయి ఎస్సీకాలనీకి నీటిసరఫరా మరమ్మతు పనులు చేయించిన పంచాయతీ పాలకులు -
బీ–థర్మల్లో ఊసేలేని తుక్కు వేలం
రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం మూతపడి జూన్ 4వ తేదీకి రెండేళ్లు పూర్తికానుంది. 1971 అక్టోబర్లో ప్రారంభమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18,743 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసింది. అనేక రికార్డులు సాధించింది. దీనిస్థానంలో త్వరలోనే 800 మెగావాట్ల సామర్థ్యంతో సూపర్ క్రిటికల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు కానుంది. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. బీ– థర్మల్ విద్యుత్ కేంద్రంలోని తుక్కు వేలం వేసి.. అదేస్థలంలో కొత్త కరెంట్ యూనిట్ స్థాపనకు శంకుస్తాపన చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కన్సల్టెన్సీల నియామకం లేదు.. తుక్కు వేలం నిర్వహణకు తొలుత వివిధ విభాగాల ఇంజినీర్లు ఆయా పరికరాల విలువ అంచనా వేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సుమారు రెండు నెలల సమయం పడుతుంది. అంచనా నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలి. తుక్కు వేలానికి టెండర్ ప్రకటన జారీచేయాల్సి ఉంటుంది. తుక్కు విక్రయించే ప్రక్రియ పూర్తయ్యేందుకు దాదాపు ఏడాది పట్టే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కానీ, ఇప్పటివరకు కన్సల్టెన్సీల నియామకం చేయలేదు. ఇంకా నియామకం కాని అంచనా వ్యయ కన్సల్టెన్సీలు -
మీనం విలవిల
ఎండ సలసల.. బోయినపల్లి(చొప్పదండి): మునుషులకే కాదు.. చేపలకూ ఎండదెబ్బ తగులుతోంది. భానుడి ప్రతాపానికి చెరువులు, కుంటల్లో నీరు వేడెక్కుతోంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రత కారణంగా చెరువులు, కుంటల్లో నీరు తగ్గి ప్రాణవాయువు కొరత ఏర్పడుతోంది. నీటి నాణ్యత తగ్గడం, గాఢత పెరగడం తదితర కారణాలతో చేపలు తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. కొన్ని సందర్భాల్లో పెద్ద మొత్తం చేపలు చనిపోతుంటాయి. రోగకారక సూక్ష్మజీవులు వల్ల వాటికి వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఎక్కువవుతాయి. నాలుగు ప్రాజెక్టులు, 340 చెరువులు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 13 మండలాల్లో 340 వరకు చెరువులు, కుంటలు ఉన్నాయి. బోయినపల్లి మండలం మాన్వాడలో మిడ్మానేరు, గంభీరావుపేట మండలంలో ఎగువమానేరు, ఇల్లంతకుంట మండలంలో అన్నపూర్ణ, కోనరావుపేట మండలంలో మల్కపేట ప్రాజెక్టులు ఉన్నాయి. గతేడాది సీజన్లో జిల్లాలోని పలు ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో 1.35 కోట్ల మేర చేపపిల్లలు వదిలినట్లు సంబంధిత అధికారి తెలిపారు. ● రోజూ చెరువులోని నీటి నాణ్యత, లోతు, విస్తీర్ణం, చేపల కదలిక గమనిస్తూ ఉండాలి. చెరువులోని కొన్ని చేపలను పట్టి వాటి పెరుగుదల, రంగు, తోక, రెక్కల స్వభావం, మొప్పెల రంగు, పై జిగురు తదితర లక్షణాలను పరిశీలించాలి. తేడాలు గమనిస్తే, సంబంధిత శాఖ అధికారి సలహాలు తీసుకోవాలి. ● ఉదయం 5 నుంచి 6 గంటల సమయంలో చేపలు చెరువు పైభాగాన నోరు తెరచుకొని తిరుగుతూ ఉంటే ప్రాణవాయువు కొరత ఉందని గమనించాలి. అలాంటి సందర్భాల్లో చెరువులో నీరు పెట్టడం లేదా పెద్దగా పెరిగిన చేపలను పట్టి విక్రయించాలి. దీంతో చేపల సాంద్రత తగ్గి ప్రాణవాయువు కొరతను అధిగమించవచ్చు. చేపలు మార్కెట్ సైజు రాలేదని, రేటు లేదని, ఐస్ దొరకలేదనే కారణాలతో మత్యకారులు నిర్లక్ష్యం చేయొద్దు. ● చెరువులో ప్రాణవాయువు లోటు ఉన్నట్లు అనిపిస్తే ఎకరాకు 1 కేజీ కాల్షియం పెరాకై ్సడ్ను ఇసుకతో కలిపి చెరువు నీటిలో చల్లాలి. దీంతో ప్రాణవాయువు పెరుగుతుంది. చెరువులోని నీటి నాణ్యత తగ్గినపుడు ఒక హెక్టారుకు 100 నుంచి 250 కేజీల వరకు సున్నం చెరువులో చల్లితే నీటి నాణ్యత, ప్రాణవాయువు శాతం పెరిగి ఉదజని సూచికను అదుపులో ఉంచుతుంది. ● చెరువులోని కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తగ్గించాలి. లేకుంటే రాత్రి సమయాల్లో అవి కేవలం కార్బన్ డై ఆకై ్సడ్ విడుదల చేయడం వల్ల చేపలకు ప్రాణవాయువు కొరత ఏర్పడి చనిపోతుంటాయి. అలాంటి సందర్భాల్లో మత్యకారులకు ఎవరైన గిట్టనివారు విషం కలిపారని అనుమానిస్తూ ఉంటారు. విషం కలిపితే కార్పు జాతి చేపలే కాకుండా కొర్రమట్ట (మర్రల్), మార్పు, జెల్లలు, తక్కువ ఆక్సిజన్ను తట్టుకునే చేపలు, కప్పలు, నీటి పాములు కూడా చనిపోతాయి. అలాంటి అనుమానాలు నిజమా కాదా అని నిర్ధారించుకోవాలి. ● వ్యాధితో చేపలు చనిపోయినప్పుడు వెంటనే వాటిని తొలగించి చెరువుకు దూరంగా కాల్చివేయాలి లేదా గొయ్యి తీసి పూడ్చివేయాలి. అనంతరం ఒక హెక్టారుకు 100 నుంచి 250 కిలోల సున్నం మోతాదులో చల్లాలి. ఇంకా అదుపులోకి రాకుంటే నీటి నాణ్యత పెంచే రసాయనాలను (బెంజాల్ కొలియం క్లోరైడ్) ఒక హెక్టారుకు ఒక లీటరు చొప్పున నీటిలో కలిపి చెరువులో చల్లాలి. ఈ చర్యల వల్ల నీటి నాణ్యత పెరగడమే కాకుండా చేపలపై ఉన్న పరాన్నజీవులు చనిపోతాయి. ఇన్ని చేసినా ఎలాంటి మార్పు లేకుంటే చివరి అస్త్రంగా యాంటిబయాటిక్ మందులను సూచించిన మోతాదులో మేతతో పాటూ కలిపి ఇవ్వాలి. ● ప్రాణవాయువు పెంచుకోవడానికి చెరువులోని నీటిని మోటార్ల ద్వారా తిరిగి చెరువులోనికి పంపింగ్ చేసుకుంటే విష వాయువులు తగ్గి ప్రాణవాయువు శాతం పెరుగుతుంది. పైన తెలిపిన సందర్భాల్లో కొన్ని చేపలను పట్టివేయడం అత్యంత శ్రేయస్కరం. 8 వేల మంది మత్స్యకారులు జిల్లాలో చేపల పెంపకం ద్వారా సుమారు 8,642 మంది మత్స్యకార్మికులు ఉపాధి పొందుతున్నారు. అలాగే 135 మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు, మహిళ మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలతో పాటు, ఎగువ మానేరులో మత్స్యకార్మిక సొసైటీ ద్వారా కార్మికులు చేపలతో జీవనోపాధి పొందుతున్నారు. అలాగే పలు చెరువుల్లో చేపలు పట్టడంతో మత్స్యకారులకు ఉపాధి దొరుకుతోంది. చేపలకు ఎండదెబ్బ భానుడి ప్రతాపానికి చెరువులు, కుంటల్లో వేడెక్కుతున్న నీరు ముందు జాగ్రత్తలే రక్ష ఉదయం, సాయంత్రం చేపల వేట శ్రేయస్కరం ప్రాజెక్టులు : మిడ్మానేరు, ఎగువ మానేరు, అన్నపూర్ణ, మల్కపేట చెరువులు, కుంటలు : 340 చేపపిల్లలు వదిలిన ప్రాజెక్టులు : మిడ్మానేరు, అన్నపూర్ణ వేసిన చేప పిల్లలు : 1.35 కోట్లు మత్స్య కార్మికులు : 8,642 మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు : 135 -
మరణించి.. ముగ్గురికి ఆయువు పోసి..
కోల్సిటీ(రామగుండం): మంచిర్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో విషాదం నింపినా.. ఓ ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. స్ఫూర్తిగా నిలిచిన ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటుచేసుకుంది. అవయవదానం ద్వా రా మరణానంతరం కూడా జీవించి చూపించిన ఆ యువకుడు, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. గురువారం గోదావరిఖనిలో అవయవదాతకు కన్నీటితో అంతియయాత్ర నిర్వహించారు. వివరాలు.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీనగర్కు చెందిన పెరుక శ్రీనివాస్(43) ఓ బ్యాంకులో తాత్కాలిక కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. గత నెల 23న రాత్రి మంచిర్యాల సమీపంలోని నస్పూర్ సీసీసీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా పరిస్థితి విషమించింది. దీంతో హైదరాబా ద్లోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు శ్రమించినా ఫలితం లేకపోయింది. శ్రీనివాస్ బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఈ విషాదవార్తను కుటుంబ సభ్యులకు తెలియజేయగా.. దుఃఖంలోనూ ధైర్యంగా ముందుకొచ్చిన భార్య పి.సంధ్యారాణి.. తన భర్త అవయవదానానికి అంగీకారం తెలిపారు. వైద్యులు 28న బ్రెయిన్ డెడ్గా నిర్ధారించిన అనంతరం 29న లివర్, కిడ్నీలు, కార్నియాలను సేకరించి అవసరమైన పేషెంట్లకు అమర్చారు. తద్వారా ముగ్గురికి పునఃర్జన్మతోపాటు మరో ఇద్దరికి కంటి చూపు ప్రసాదించినట్లయ్యింది. భర్తను కోల్పోయిన దుఃఖాన్ని దిగమింగుకుంటూ మానవత్వాన్ని ముందుకు తీసుకొచ్చిన సంధ్యారాణి నిర్ణయం సమాజానికి ఆదర్శంగా నిలిచింది. ‘అవయవదానం మహాదానం’ అనే నానుడిని ఈ ఘటన మరోసారి సార్థకం చేసింది. మృతుడు శ్రీనివాస్కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శ్రీనివాస్ మృతికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేయడంతోపాటు అవయవదానం చేయడానికి అంగీకారం తెలిపిన భార్యతోపాటు కుటుంబ సభ్యులను జీవన్ధాన్ సంస్థ, సదాశయ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు అభినందించారు. మరో ఇద్దరికి కంటి వెలుగులు ఇచ్చి.. బ్రెయిన్డెడ్తో బ్యాంక్ ప్రైవేట్ ఉద్యోగి మృతి భర్త అవయవాలను దానం చేసిన భార్య విషాదంలోనూ స్ఫూర్తిగా నిలిచిన కుటుంబం -
వేసవి శిక్షణ శిబిరాలకు వేళాయె
పెద్దపల్లి: వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా వివిధ ఆటల్లో మెలకువలు నేర్పించేందుకు జిల్లాలో వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామని డీవైఎస్వో సురేశ్ తెలిపారు. శిక్షణ ఇవ్వడానికి కోచ్ల ఎంపిక కోసం గతనెలలో దరఖాస్తులు ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. ఎంపికై న వారు జూన్ ఒకటినుంచి ఏడో తేదీ వరకు ఉదయం, సాయంత్రం వివిధ క్రీడల్లో శిక్షణ ఇవ్వనున్నారని వివరించారు. 14ఏళ్ల వయసులోపు బాలబాలికల్లో దాగిఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయడానికి శిక్షణ శిబిరాలు చేపట్టామన్నారు. కోచ్లకు గౌరవ వేతనం ఒక్కోకోచ్కు రూ.5వేల చొప్పున గౌరవ వేతనం ఇవ్వనున్నారు. క్రీడల్లో మెలుకువలు, ప్రతిభ, శారీరక, మానసికంగా పటిష్టంగా ఉండేందుకు శిక్షణ దోహదపడుతుంది. శిక్షణ ఇలా.. గ్రామీణ విద్యార్థులు ఆసక్తి కనబర్చే వాలీబాల్, ఖోఖో, తైక్వాండో, ఫుట్బాల్, హాకీ, అథ్లెటిక్స్లో శిక్షణ ఇస్తారు. ఎంపిక చేసిన జెడ్పీహెచ్ఎస్ క్రీడామైదానంలో శిబిరాలు ఉంటాయి. ఆసక్తిగల విద్యార్థులు http. Satgasc. telangana. gov. In వెబ్సైట్లో తమపేర్లు నమోదు చేసుకోవాలి. క్రీడల్లో శిక్షణ ఇచ్చే కోచ్ల వివరాలు ప్రాంతం గేమ్ కోచ్ సెల్ కమ్మర్ఖాన్పేట వాలీబాల్ మహేందర్ 90101 60020 తెలుకుంట తైక్వాండో సతీశ్ 9891 43163 వెన్నంపల్లి ఖోఖో దుర్గాప్రసాద్ 91779 64751 నిట్టూరు ఖోఖో భాస్కర్ 9 1779 92471 దుబ్బపల్లి వాలీబాల్ ఎండీ అస్లాం 82978 28559 నందిమేడారం వాలీబాల్ రమేశ్ 82473 41845 గర్రెపల్లి వాలీబాల్ నవీన్ 97033 99149 జూలపల్లి వాలీబాల్ రాకేశ్ 89787 55521 ఎక్లాస్పూర్ కబడ్డీ సతీశ్ 63047 69886 అంతర్గాం ఫుట్బాల్ నరేశ్కుమార్ 70137 01104 పెద్దపల్లి ఖోఖో ఎండీ షఫీ 99497 57572 సుల్తానాబాద్ బాక్సింగ్ రాకేశ్ 99597 22328 యైటింక్లయిన్కాలనీ బాక్సింగ్ ప్రసాద్ 93908 64576 సుల్తానాబాద్ ఖేలో ఇండియా సెంటర్ 79950 78488గ్రామీణ క్రీడాకారులు ప్రభుత్వం అందించే ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. పట్టణ ప్రాంత క్రీడాకారులు డబ్బులు చెల్లించి ఆన్లైన్లో తమ పేర్లు నమోదు చేయాలి. పట్టణ ప్రాంతాల నుంచి ఎంట్రీలు ఎక్కువ వస్తేనే శిక్షణ ఇస్తాం. – సురేశ్, డీవైఎస్వో -
అల్ఫోర్స్ డిగ్రీ కళాశాలలో ప్లేస్మెంట్ డ్రైవ్
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ సూర్యనగర్లోని అల్ఫోర్స్ మహిళా డిగ్రీ, పిజి కళాశాలలో గ్రాడ్ గురు ఇన్నోవేషన్స్ కంపెనీ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. 150 మంది విద్యార్థినులు పాల్గొనగా, 40మంది బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఉద్యోగాలకు ఎంపికై నట్లు అల్ఫోర్స్ మహిళా డిగ్రీ, పిజి కళాశాల కరస్పాండెంట్ వి.ర వీందర్రెడ్డి తెలిపారు. విద్యార్థుల వార్షిక వేతనం రూ.3 లక్షల నుంచి రూ.6లక్షల వరకు ఉంటుందన్నారు. భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులకు ఉత్తమ ప్లేస్మెంట్ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రాడ్గురు సంస్థ సీనియర్ మేనేజర్ ఆర్తి చౌదరి, మేనేజర్ వినయ్ తదితరులు పాల్గొన్నారు. -
ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూల ఫలితాలు
కరీంనగర్: ఐదురాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఎ లా ఉన్నా క్షేత్రస్థాయిలో బీజేపీకి ఉన్న రిపోర్టు, అంచనాలకు అనుగుణంగా గణనీయ విజయాలు సా ధిస్తుందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ పార్లమెంట రీ కమిటీ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. గురువా రం కరీంనగర్లోని ఓ హోటల్లో మాట్లాడుతూ తె లంగాణ రాజకీయాల్లో మార్పునకు నాంది పలికేలా ఈ నెల 10న మనప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్నారని, ఈ సందర్భంగా ఏర్పాటు చేసే భారీ బహిరంగసభను విజయవంతం చేయాలని కోరా రు. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూ ర్ గవర్నమెంట్ అని విమర్శించారు. బీఆర్ఎస్కు ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చారని, ఆ పార్టీ అవుట్ డేటెడ్దిగా వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరీంనగర్లో తొలి మేయర్గా బీజేపీ అభ్యర్థి గెలవ డం ప్రజల్లో మార్పునకు సంకేతమన్నారు. మేయ ర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి టి.శ్రీనివాస్గౌడ్ ఉన్నారు. కాంగ్రెస్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ 10న మోదీ సభ ద్వారా తెలంగాణకు దిశా నిర్దేశం ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ -
చెట్టుకు కారు ఢీకొని యువకుడి మృతి
రాయికల్: రాయికల్ మండలం కుమ్మరిపల్లి శివారులో కారు చెట్టును ఢీకొనడంతో చాపల్లి రాంబాబు (31) అనే వలస కూలీ అక్కడికక్కడే మృతిచెందినట్లు ఏఎస్సై సైఫోద్దీన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కొండేపి గ్రామానికి చెందిన రాంబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి రాయికల్ మండలం కుమ్మరిపల్లిలో పదేళ్లుగా మేసీ్త్ర పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఉదయం కూలీల కోసం కారులో జగిత్యాలకు వెళ్తుండగా.. కుమ్మరిపల్లి శివారుకు చేరగానే.. అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రాంబాబుకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. డాడీ.. ఒక్కసారి మమ్మల్ని చూడు అంటూ ఐదేళ్ల చిన్నారులు రాంబాబు మృతదేహంపై ఏడ్వడం అందరినీ కలిచివేసింది. భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆలూరులో ఏడిళ్లలో చోరీరాయికల్: రాయికల్ మండలం ఆలూరులో ఒకేసారి ఏడు ఇళ్లలో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. గొల్ల పల్లి దుబ్బయ్య ఇంట్లో నుంచి రెండు తులాల బంగారం, పదహారు తులాల వెండి, పిట్టల సుజాత ఇంట్లో నుంచి రెండు తులాల బంగారం, రూ.40 వేలు, రాజారపు మనోహర్ ఇంట్లో నుంచి తులం బంగారం, సురతాని రాజు ఇంట్లో నుంచి 10 గ్రాముల వెండి ఎత్తుకెళ్లారు. గొల్లపల్లి భూమరాజం, రాజారపు రాజేందర్, చిల్ముల మల్లక్క ఇళ్లలో దొంగతనానికి యత్నించారు. జగిత్యాల రూరల్ సీఐ సుదాకర్, ఎస్సై సుధీర్రావు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్, డ్యాగ్స్క్వాడ్తో ఆధారాలు సేకరించారు. వడదెబ్బతో వ్యక్తి మృతివెల్గటూర్: వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఎండపల్లి మండలం సూరారంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జాడీ లచ్చయ్య (62) పంటపొలం కోయిస్తుండగా.. వడదెబ్బకు గురై స్పృహ తప్పి పడిపోయాడు. కుటుంబ సభ్యులు అతడిని ఇంటికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించేందుకని 108కు అంబులెన్స్కు సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. లచ్చయ్య భార్య రాజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. క్యాటరింగ్కు వెళ్లి వస్తూ.. ఆటో బోల్తా ● ఒకరి మృతి.. ఇద్దరికి గాయాలు మంథనిరూరల్: శుభకార్యంలో క్యాటరింగ్ చేసి ఆటోలో తిరిగి వస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరో ఇద్దరు గాయపడిన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్పూర్ గ్రామ సమీపంలోని గాడుదులగండి వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో గోదావరిఖని గంగానగర్కు చెందిన రజిత(35) మృతి చెందగా, ధనలక్ష్మి, శ్రవణ్కుమర్కు తీవ్రగాయాలయ్యాయి. వివరాలు.. గోదావరిఖని గంగానగర్కు చెందిన రజిత, ధనలక్ష్మి క్యాటరింగ్ చేస్తుంటారు. గురువారం ఉదయం కాటారంలో జరిగిన ఓ శుభకార్యానికి ఆటోలో వెళ్లి క్యాటరింగ్ చేసి తిరిగి వస్తున్నారు. రేగులగూడెం వద్ద కమాన్పూర్కు చెందిన శ్రవణ్కుమార్ అనే పురోహితుడు మంథనికి వచ్చేందుకు ఈ ఆటోలో ఎక్కాడు. అయితే గాడుదులగండి మూలమలుపు వద్దకు రాగానే ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో రజిత అక్కడికక్కడే మృతి చెందగా ధనలక్ష్మి, శ్రవణ్కుమార్కు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళ మృతదేహంతోపాటు గాయడిన వారిని మంథని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
నీళ్లకు గోస పడ్డం
తాగునీటి కోసం మూడేళ్ల కాలంగా గోసపడ్డం. ఈసారి ఎండలు మండిపోతున్నయ్. నల్లాలు ఉన్నా నీళ్లు వస్తలేవని పంచాయతీ ఆఫీసోళ్లకు చెప్పినం. వాళ్లు ఏదో ఉపాయం చేసి కాలనీకి నీళ్లు వచ్చేలా చేసిండ్రు. – లంకదాసరి లక్ష్మి, ఎస్సీకాలనీ, చీకురాయి సంతోషంగా ఉంది మండే ఎండల్లో ఇంటి అవసరాలు, తాగేందుకు నీళ్లు ఎలా తెచ్చుకునేదని భయపడ్డం. కానీ పంచాయతీ వారు శ్రద్ధ తీసుకుని సమస్యకు పరిష్కారం చూపారు. మంగళవారం నుంచి ఎస్సీ కాలనీలోని ఇంటింటికీ నల్లా నీరు చేరింది. మాకు చాలా సంతోషంగా ఉంది. – మధునమ్మ, చీకురాయి ఇబ్బందులు రానివ్వం ఎండకాలంలో తాగునీటికి ఇబ్బందులు రానివ్వం. ఎస్సీ కాలనీలో నెలకొన్న నీటిసమస్యకు డైరెక్టు పంపింగ్ ద్వారా పరిష్కారం చూపాం. దీంతో మూడేళ్లుగా ఉన్న సమస్య పరిష్కారమైంది. ఊళ్లోని అన్ని వార్డులకు తాగునీటి సరఫరా మెరుగ్గా జరిగేలా చూస్తున్నాం. – ఓదెల శ్రీనివాస్, సర్పంచ్, చీకురాయి -
ర్యాంక్ డౌన్
గురువారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026అర్థమయ్యేలా ఏఐ బోధన మంథని: విద్యార్థులకు ఏఐపై పూర్తిఅవగాహన కల్పించేలా, సులభంగా అర్థమయ్యేలా బోధించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. మంథని జెడ్పీహెచ్ఎస్ (బాలికలు)లో చేపట్టిన ఏఐ శిక్షణ శిబిరం, వయోవృద్ధుల డే కేర్ సెంట ర్ను బుధవారం కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులు వేసిన డ్రాయింగ్లను కంప్యూటర్లోకి మార్చి, ఏఐ సాయంతో యానిమేషన్గా రూపొందించిన విధానాన్ని ఆసక్తిగా వీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ, త్వరలోనే రోబోటిక్స్ శిక్షణ ప్రారంభించాలని ఆదేశించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాల్, టీ ఫైబర్ ప్రత్యేకాధికారి జేఎస్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి మంథని/కమాన్పూర్: నాణ్యమైన ధాన్యం సేకరణను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. మంథని ఏఎంసీలో కొనుగోలు కేంద్రం, కమాన్పూర్ మండలం గుండారం ఐకేపీ సెంటర్, ఉపాధిహామీ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. డీఆర్డీవో కాళిందిని, ఎంపీడీవో ప్రియాంక, ఏపీఎం పద్మ పాల్గొన్నారు.పెద్దపల్లి: బుధవారం వెలువడిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో 16వ స్థానానికే పరిమితమైంది. 2023లో 9వ ర్యాంక్ సాధించిన జి ల్లా.. 2024లో 8వ ర్యాంక్ సాధించి కాస్త మెరుగుపడింది. 2025లో పదో స్థానం దక్కించుకున్నా.. ఈసారి 16వ స్థానానికి దిగజారిపోవడం విద్యావేత్తలు, తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది. బాలికల సత్తా.. టెన్త్ ఫలితాల్లో బాలికలు అత్యధిక సంఖ్యలో ఉత్తీర్ణత సాధించి సత్తా చాటా రు. జిల్లా వ్యాప్తంగా 41 కేంద్రాల్లో జరిగిన వార్షిక పరీక్షలకు మొత్తం 7,488 మంది విద్యార్థులు(బాలురు 3,674 మంది, బాలికలు 3,814మంది) పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 7,316 మంది(బాలురు 3,566 మంది, బా లికలు 3,750మంది) ఉత్తీర్ణత సాధించినట్లు డీఈవో శారద తెలిపారు. మొత్తంగా 97.7 శాతం ఉత్తీర్ణత నమోదైందని, రాష్ట్రస్థాయిలో 16వ స్థానం దక్కిందని వెల్లడించారు. జిల్లాలో 10 కేజీబీవీలు, 7 మోడల్ స్కూళ్లు, ఒక సెమీ రెసిడెన్షియల్ స్కూల్, 72 ప్రైవేట్ పాఠశాలలు, 98 జెడ్పీ హైస్కూళ్లు, 4 ప్రభుత్వ హైస్కూళ్లు, 6 బీసీ వెల్ఫేర్ పాఠశాలలు, 3 మైనారిటీ రెసిడెన్షియల్స్, 6 సోషల్ వెల్ఫేర్ పాఠశాలు ఉన్నట్లు డీఈవో వివరించారు. కాగా, ఓదెల మండలం పొత్కపల్లి ప్రభుత్వ ఉన్న త పాఠశాల విద్యార్థిని రాసాల మేఘన 583 మార్కులు సాధించిన జిల్లాలో ప్రథమ స్థానంలో నిలవగా.. ఉడుత శ్రీవల్లి 579 మార్కులు సాధించింది. ఫలితమివ్వని ప్రత్యేక తరగతులు చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించిన ఉపాధ్యాయులు.. రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఆ తర్వా త వివిధ రకాల టెస్ట్లూ నిర్వహించి వారి సామర్థ్యాలు పరిశీలించారు. చి వరగా ప్రీఫైనల్ పరీక్షలు కూడా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మ ధ్యాహ్న భోజన సౌకర్యం ఉన్నా.. అప్పటివరకు గ్రామీణ విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడకుండా ఉదయం అల్పాహారం, సాయంత్రం ప్రత్యేక తరగతుల్లోనూ స్నాక్స్ అందించారు. ప్రభుత్వం, స్వచ్ఛంద, యువజన సంఘాలు ఇతోధికంగా సాయం చేశాయి. ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించారు. విద్యాశాఖ అధికారులు తరచూ పర్యవేక్షించారు. అయినా, గతేడాదికన్నా ఈసారి ఫలితాల్లో 16వ స్థానానికి పడిపోవడం గమనార్హం. మేఘన(583) శ్రీవల్లి (579 )సైబర్ నేరాలపై అప్రమత్తం పెద్దపల్లిరూరల్: ఆన్లైన్ మోసాలు పెరుగుతున్నాయని, సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ కృష్ణ అన్నారు. మదర్ థెరిసా ఇంజినీరింగ్ కాలేజీలో బుధవారం జరిగిన అవగాహన కార్యక్రమంలో ఏసీపీ మాట్లాడా రు. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసుకుని ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దన్నారు. మహిళా శిశు సంక్షేమశాఖ, బాలల పరిరక్షణ అధి కారులు ‘ప్రజాపాలన’ వారోత్సవాలు జరుపుకున్నారు. ఎస్సై లక్ష్మణ్రావు, అధికారులు జితేందర్, నిర్మల, కనకరాజు తదితరులు ఉన్నారు. త్వరలోనే రోబోటిక్స్ శిక్షణ ప్రారంభం కలెక్టర్ కోయ శ్రీహర్ష మంథనిలో సూపర్ సమ్మర్ శిక్షణ శిబిరం పరిశీలన రాష్ట్రంలో జిల్లాకు 16వ స్థానం ఉత్తీర్ణత 97.70శాతంగా నమోదు బాలికలదే అగ్రస్థానం.. తర్వాతి స్థానంలో బాలురు -
కవితకు అన్ని డబ్బులు ఎక్కడివి?
● ముందుగా ఆస్తి తగాదాలు పరిష్కరించుకోవాలి ● సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జూలపల్లి: మాజీసీఎం కేసీఆర్ కుటుంబం అక్రమంగా సంపాదించిన ఆస్తుల పంచాయితీ పరిష్కరించుకున్న తర్వాత ప్రజాప్రభుత్వంపై విమర్శలు చేయాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మారం వ్యవసాయ మార్కెట్లో మక్కల కొనుగోలు కేంద్రం, నందిమేడారం, చామన్పల్లిలో ధాన్యం కొనుగోళ్లను మంత్రి బుధవారం ప్రారంభించి మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి దిగిపోవాలని, బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని హరీశ్రావుతోపాటు కొత్తగా పార్టీలో చేరిన జీవన్రెడ్డి మాట్లాడుతున్నారని, కల్వకుంట్ల కుటుంబం తొలుత ఆస్తుల పంచాయితీ పరిష్కరించుకున్న తర్వాత ప్రజాప్రభుత్వంపై విమర్శలు చేయాలన్నారు. కేసీఆర్ కూతురు కవితకు కొత్తగా పార్టీ పెట్టేం డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. మొక్కజొన్న రైతులకు క్వింటాల్కు రూ.2,400 మద్దతు ధర కల్పిస్తున్నామని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మద్దతు నిర్ణయించి చేతులు దులుపుకుంటోందని ఆరోపించారు. చామనపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఇరిగేషన్శాఖ ద్వారా స్థలం కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హామీ ఇచ్చారు. -
నాణ్యమైన ధాన్యం తూకం వేయాలి
పెద్దపల్లి: నాణ్యమైన ధాన్యం తూకం వేయాలని, ఆ వెంటనే లారీల్లో లోడ్ చేయాలి కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై వ్యవసాయ అధికారులతో కలెక్టరేట్లో ఆయన బుధవారం సమీక్షించారు. హమాలీ కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలు పూర్తిచేసిన ధాన్యాన్ని వెంటనే లారీల్లో లోడ్ చేయాలని అన్నారు. జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ 80 శాతం పూర్తయిందని, 92 శాతానికి పెంచాలని తెలిపారు. మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ఇందుకోసం పెద్దపల్లి, పొత్కపల్లి, రేగడిమద్దికుంట, ధర్మారం, జూలపల్లి ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు వివరించారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 6న మెగా జాబ్ మేళా జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు మే 6న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. జాబ్ మేళాను విజయవంతం చేసేందుకు జిల్లా అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రంగంపల్లి ఆర్టీవో కార్యాలయం ఎదుటగల వెంకటపద్మ ఫంక్షన్ హాల్లో జాబ్మేళా నిర్వహించనున్నట్లు వివరించారు. డీఈఈట్, టాస్క్ సమన్వయంతో సుమారు 100 ప్రముఖ కంపెనీలు హాజరై అర్హులను ఎంపిక చేస్తాయని చెప్పారు. గ్రాడ్యుయేట్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జెడ్పీ సీఈవో నరేందర్, డీఆర్డీవో కాళిందిని, జిల్లా ఉపాధి కల్పనాధికారి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
సత్తా చాటిన సర్కారు స్కూళ్లు
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చాటారు. పెద్దపల్లి మండలంలో 16 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 476 మంది (251మంది బాలికలు, 225మంది బాలురు) పరీక్షలు రాయగా 461 మంది (242మంది బాలికలు, 219మంది బాలురు) 96.85శాతం ఉత్తీర్ణత సాధించారు. నూరుశాతం సాధించిన 11 పాఠశాలలు పెద్దపల్లి మండలంలో 16 ఉన్నత పాఠశాలలు ఉండగా 11 పాఠశాలలు నూరుశాతం ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. అందులో మారెడుగొండ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల వరసగా 12 ఏళ్లుగా నూరుశాతం ఉత్తీర్ణత సాధిస్తూ వస్తోంది. టాపర్గా భువనశ్రీ పెద్దపల్లి మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థుల్లో పెద్దపల్లి జెడ్పీ బాలికోన్నత పాఠశాల విద్యార్థిని కాల్వ భువనశ్రీ 581 మార్కులతో మండల టాపర్గా నిలిచింది. ఇదే పాఠశాలకు చెందిన ప్రశాంతి 570మార్కులు, మహాలక్ష్మి 568 మార్కులు, నిట్టూరు హైస్కూల్కు చెందిన సాగాల అక్షర 562 మార్కులు, వర్షిణి 560, తుర్కలమద్దికుంట హైస్కూల్కు చెందిన సాత్విక, శ్రీహర్షిణి 552 మార్కులు, హన్మంతునిపేట హైస్కూల్ విద్యార్థిని కంది హాసిని 552మార్కులు, పెద్దపల్లి జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన రాఘవచంద్ర 551 మార్కులు సాధించారు. -
కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి ఎదుగుతారు
● రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ గోదావరిఖని: కష్టపడి చదివితే ఉన్నస్థానానికి ఎద గవచ్చని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూ ర్ అన్నారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో అధిక మార్కులు సాధించిన పలు పాఠశాలల విద్యార్థుల ను బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అభినందించారు. మంచి మార్కులు సాధించిన ప్ర తీవిద్యార్థి భవిష్యత్లో ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఫెయిల్ అయిన విద్యార్థులు నిరుత్సాహపడకుండా మరింత పట్టుదలతో ప్రయత్నించి విజయాన్ని సాధించాలని ప్రోత్సహించారు. నగ ర మేయర్ మహంకాళి స్వామి, ప్రజాప్రతినిధులు, పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి పెద్దపీట ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నారు. ఆర్టీసీ కార్మికులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి ఠాకూర్ను సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కా ర్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు నిర్వహించడం, 11శాతం పీఆర్సీ ప్రకటించడం వంటి కీలక నిర్ణయాలతో ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేసిందని రాజ్ఠాకూర్ అన్నారు. సఖి సెంటర్ ఉద్యోగుల తొలగింపు పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని సఖి సెంటర్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వర్తిస్తున్న నలుగురిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు డీడబ్ల్యూవో వే ణుగోపాల్రావు తెలిపారు. బాధితులపక్షాన ఉండాల్సిన ఉద్యోగులు రీల్స్ చేయడమే కాకుండా స్టేటస్లు పెట్టుకొని ప్రచారం చేయడం, ఉద్యోగులపై వ్యక్తిగత దూషణలు చేయడంతో అధికారులు మందలించి పలుమార్లు వివరణ తీసుకున్నారని గుర్తుచేశారు. అయినా, పద్ధతి మార్చుకోకపోవడంతో సఖి సెంటర్ సీఏ స్వప్న, లీగల్ కౌన్సెలర్ సుమతి, వర్కర్ స్వప్న, సౌజన్యను విధుల నుంచి తొలగించాలని వారధి ఇన్చార్జి జగపతిి సిఫారసు చేశారు. కలెక్టర్ ఆదేశం మేరకు నలుగురిని విధుల నుంచి తొలగించినట్లు వివరించారు. ఇన్చార్జిగా ఉమారాణి సఖి సెంటర్ ఇన్చార్జిగా ఉమారాణిని నియమించారు. ఈమేరకు జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాల్రావు ఉత్తర్వులు ఇచ్చారు. విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలుపాలకుర్తి: బసంత్నగర్ సమీపంలోని బుగ్గ క్రాస్రోడ్డు వద్ద ఇటీవల నిర్మించిన దారి మైసమ్మ ఆలయంలో బుధవారం విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వేదపండితుడు వోజ్జల వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలను చల్లంగా చూడాలని వేడుకున్నారు. అంతర్గాం, బసంత్నగర్, పెద్దపల్లి పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. స్టాంపు వెండర్ల లైసెన్సులు రద్దుకరీంనగర్క్రైం: జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయ పరిధి లో ఇద్దరు స్టాంపు వెండర్ల లైసెన్సులను రిజిస్ట్రార్ ప్రవీణ్కుమార్ రద్దు చేశారు. కరీంనగర్కు చెందిన ఎండీ.రియాజుద్దీన్, సుల్తానాబాద్కు చెందిన గుజ్జ అశోక్రావు స్టాంపు వెండర్ లైసెన్సులు కలిగి ఉండగా, వీరు విక్రయించిన స్టాంపు పేపర్లలో అవకతవకలు ఉన్నాయని అధికారులకు ఫిర్యాదు వచ్చాయి. విచారణ జరిపిన అధికారులు ఇద్దరు స్టాంపు వెండ ర్ల లైసెన్సులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ పాఠశాలల ప్రభంజనం
ఓదెల: పదోతరగతి పరీక్ష ఫలితాల్లో పొత్కపల్లి హైస్కూల్ జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాసాల మేఘన 583 మార్కులు, ఉడుత శ్రీవల్లి 579 మార్కులు సాధించి జిల్లా టాపర్లుగా నిలిచారు. సంబోజి లాస్య, బాసవేన శరణ్య, తాళ్లపల్లి లాస్యప్రియ 567 మార్కులు సాధించారు. మొత్తం 41మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా అందరూ ఉత్తీర్ణులై వందశాతం నమోదు చేశారు. ఇందులోని 23మంది 500 నుంచి 550, 13 మంది 550కిపైగా మార్కులు సాధించి సత్తా చాటారు. ప్రధానోపాధ్యాయుడు సాంబయ్య, ఉపాధ్యాయులు అమృత కిశోర్, వై. శ్రీనివాస్, భద్రయ్య, రామకృష్ణ, రఘుపతి విద్యాబోధన తీరు, విద్యార్థుల కృషి ఇందుకు కారణమైంది. మేఘన, శ్రీవల్లిని ఎంఈవో ఎర్ర రమేశ్, ఉపాధ్యాయులతోపాటు సర్పంచ్ అంబాల సారమ్మ అభినందించారు. వ్యవసాయ కుటుంబలో పుట్టిపెరిగిన మేఘన 583 మార్కులు సాధించి జిల్లాలో టాపర్గా నిలిచిన రాసాల మేఘన తల్లిదండ్రులు లావణ్య– శ్రీనివాస్. వీరికి ముగ్గురు కుమార్తెలు, మేఘన రెండోకూతురు. మూడెకరాల్లో వ్యవసాయం చేయడంతోపాటు కూలీ పనులు చేస్తూ దంపతులు తమ పిల్లలను చదివిస్తున్నారు. తల్లితండ్రుల పోత్సాహం, ఉపాధ్యాయుల బోధన తీరుతో తాను అత్యధిక మార్కులు సాధించినట్లు మేఘన తెలిపారు. కూతురు అమూల్య బీటెక్, చిన్నకూతురు అక్షర ఇదేపాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. బాసవేన శరణ్య సంబోజి లాస్య టి.లాస్యప్రియ బాసరలో చదువుతా అమ్మానాన్న పోత్సాహం, ఉపాధ్యాయుల బోధన తీరుతోపాటు పట్టుదలతో చదివిన టెన్త్లో 583 మార్కులు సాధించిన. బాసరలోని ట్రిపుల్ ఐటీలో ప్రవేశం తీసుకుని సివిల్స్కు ప్రిపేరవుతా. – రాసాల మేఘన, జిల్లా టాపర్ -
ఇద్దరు సీఐలకు పదోన్నతి
గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషరేట్లో ఇద్దరు సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ బుధవారం ఆదేశాలు జారీ అయ్యాయి. ఎన్టీపీసీ సీఐ టి.ప్రవీణ్కుమార్, సీఎస్బీ సీఐ కె.పురుషోత్తంకు డీఎస్పీగా పదోన్నతి కల్పించారు. ఈమేరకు రాష్ట్ర డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. రెస్క్యూ పోటీల్లో సింగరేణి సత్తాగోదావరిఖని: అంతర్జాతీయ రెస్క్యూ పోటీల్లో సింగరేణి జట్టు సత్తా చాటుతోంది. మంగళ, బుధవారాల్లో జరిగిన పలు పోటీల్లో సింగరేణి జట్టు ప్రతిభ చాటుతోంది. బుధవారం జరిగిన ఫైర్ఫైటింగ్ పోటీల్లో మంచి ప్రతిభను కనబర్చినట్లు రెస్క్యూ జీఎం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. పంట మార్పిడి పద్ధతితో అధిక దిగుబడి ముత్తారం: పంట మార్పిడి పద్ధతి, అంతర్ పంటల సాగు లాభదాయకమని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అర్చన, రాకేశ్ అన్నారు. హరిపురంలో బుధవారం జరిగిన రైతుముగింట్లో శాస్త్రవేత్తలులో వారు మాట్లాడారు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గిస్తే పెట్టుబడి ఆదా అవుతుందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మెంగని సమత, మండల వ్యవసాయాధికారి అనూష, ఉద్యానవన అధికారి జ్యోతి, ఏఈవో హారిక పాల్గొన్నారు. పోస్టల్ ఎస్పీగా సైదిరెడ్డి బాధ్యతల స్వీకరణకరీంనగర్: కరీంనగర్ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్గా కె.సైదిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మూడురోజుల క్రితం జరిగిన సాధారణ బదిలీల్లో కరీంనగర్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న కె.శివాజీ హన్మకొండ డివిజన్కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సైదిరెడ్డి నియామకం అయ్యారు. సైదిరెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. పోస్టల్ అధికారులు, సిబ్బంది, వివిధ యూనియన్ల నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ప్రవీణ్కుమార్కె.పురుషోత్తం -
కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు
కాల్వశ్రీరాంపూర్: రైతుల నుంచి కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వ విప్ విజయరమణా రావు అన్నారు. మంగపేట, జాఫర్ఖాన్పేట, వెన్నంపల్లి, కూనారంలో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. కూనారంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించి మాట్లాడారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ రాజమల్లు, మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, సీఈవో విజేందర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. మార్క్ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు సుల్తానాబాద్రూరల్: మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనుగోలు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. సుద్దాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రేగడిమద్దికుంట, హాకా, ఐకేపీ ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను విప్ ప్రారంభించి మాట్లాడారు. గతంలో రైతులకు ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈసారి ముందుగానే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామన్నారు. సర్పంచులు కొదాటి సాయికిరణ్, లావణ్య పాల్గొన్నారు. రైతుల పక్షపాతి రేవంత్రెడ్డి సర్కార్ ఓదెల: సీఎం రేవంత్రెడ్డి సర్కార్ రైతు పక్షపాతిగా వ్యవహరిస్తోందని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. ఓదెలలో డీసీఎమ్మెస్ మొక్కజన్న కొనుగోళ్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సర్పంచ్ కనికిరెడ్డి సతీశ్, ఉపసర్పంచ్ గోపతి శ్రీలత, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూల ప్రేంసాగర్రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పిట్టల రవికుమార్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి తీర్థాల వీరన్న, ఏపీఎం సంపత్, మాజీ ఎంపీటీసీ బొడకుంట శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
వడదెబ్బతో వ్యక్తి మృతి
ఎలిగేడు: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామానికి చెందిన యాళ్ల మల్లారెడ్డి(52) వడదెబ్బతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మల్లారెడ్డి ఇటీవల ఇల్లు నిర్మించుకున్నాడు. ఈనెల 26న గృహప్రవేశం జరిగింది. ఇందుకోసం ఆయన వివిధ పనులు, ఏర్పాట్లపై ఎండలో తిరిగాడు. ఈక్రమంలో అస్వస్థకు గురయ్యాడు. బుధవారం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య లత, కూతురు, కుమారుడు ఉన్నారు. తాటిచెట్టు పైనుంచి పడి..మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని కూచిరాజ్పల్లి మద్దికుంట తాళ్లలో గంగాపురికి చెందిన జక్కుల దేవయ్య(60) ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచిపడి మృతి చెందాడు. రోజూ మాదిరిగానే తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె
గోదావరిఖని: సింగరేణి కార్మికుల సమస్యలు వారంలోగా పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ హెచ్చరించారు. స్థానిక భాస్కర్రావుభవన్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సింగరేణి కాలరీస్వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరివి రాజ్కుమార్తో కలిసి ఆయన మాట్లాడారు. నాలుగు లేబర్ కోడ్లను సింగరేణిలో అమలు చేయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యాజమాన్యాల దయాదాక్షిణ్యాలతో పనిచేసేలా లేబర్ కోడ్లు ఉన్నాయన్నారు. మే డే సందర్భంగా వీటి రద్దు కోసం ప్రతిన బూనాలని కోరారు. నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, గోసిక మోహన్, ఎంఏ గౌస్, బిట్టి వెంకటేశ్వర్లు, తొడుపునూరి రమేశ్కుమార్, పడాల కనకరాజు, బూడిద మల్లేశ్, చెప్యాల మహేందర్రావు, మీసాల మల్లయ్య, కోడూరి మునీందర్, జైపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘మోడల్’.. వందశాతం
రామగుండం: లింగాపూర్ మోడల్ స్కూల్, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు వందశాతం ఫలితాలు సాధించినట్లు ప్రధానోపాధ్యాయులు పంబాల సదానందం యాదవ్, మాధవి తెలిపారు. మోడల్ స్కూల్లో వంద మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకాగా అందరూ ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. తాని జశ్వంత్ 577, బి.మనోరశ్మిత 576, ఉదురుకోట వైష్ణవి 573 మార్కులు సాధించారు. అదేవిధంగా రామగుండం గురుకుల విద్యాలయంలో 77 మంది పరీక్షకు హాజరు కాగా అందరూ ఉత్తీర్ణత సాధించారు. నీలం సిరి 564, మరో 38 మంది విద్యార్థులకు 500కుపైగా మార్కులు వచ్చాయి. తాని జశ్వంత్ (577) మనోరశ్మిత (576) ఉదురుకోట వైష్ణవి (573) -
ఆర్వోబీ పనుల ఆలస్యంపై మేయర్ ఆగ్రహం
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణ పనుల్లో విపరీత జాప్యం పట్ల మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన పనులు పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ ప్రాంతంలో గుంతల రోడ్డు, దుమ్ముతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. భూసేకరణ సంబంధించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు ఆశించిన స్థాయిలో సాగడంలేదన్నారు. ఎలాంటి పురోగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు, కాంట్రాక్టు ప్రత్యేక చొరవ తీసుకొని యుద్ధ ప్రాతిపదికన బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేయాలన్నారు. పనులు ప్రారంభించిన ఒక పక్క త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు కొంత ఇబ్బందులను తొలగించాలన్నారు. కార్యక్రమంలో రైల్వే ఏడీఈఎన్ భిక్షపతి, సీనియర్ సెక్షన్ ఇంజినీర్ సంతోష్, సాదినేని మునిందర్ తదితరులు పాల్గొన్నారు. -
డాక్టర్స్ అసోసియేషన్ కార్యవర్గం
పెద్దపల్లి: తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షులుగా ఎన్.కుమార్గౌడ్, డి.రాజు పోటీపడ్డారని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కంది శ్రీనివాస్రెడ్డి తెలిపారు. 65 మంది గవర్నమెంట్ డాక్టర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారని పేర్కొన్నారు. కుమార్గౌడ్కు 43 ఓట్లు రాగా రాజుకు 22 ఓట్లు వచ్చినట్లు వివరించారు. 21 ఓట్ల మెజారిటీతో కుమార్గౌడ్ గెలుపొందినట్లు ఆయన ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా శిరీష, స్వప్న, లతసాయిప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా కేవీ సుధాకర్రెడ్డి, కోశాధికారిగా సీహెచ్ విజయకుమార్, సహాయ కార్యదర్శులుగా రవీందర్, మంజూష, నిషిక్రిస్టియన, జనరల్ కౌన్సిల్మెంబర్లుగా అనిత,లావణ్య, వాణిశ్రీ,, యూనిట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా రవివర్మ, ఫరీద్, సంజనేష్ కుమార్, పూర్ణిమ, రాజశేఖర్రెడ్డి, సాయిసూర్యను ఎన్నుకున్నారు. కుమార్గౌడ్ను పలువురు పూలమాలతో సన్మానించారు. డీసీహెచ్ఎస్ శ్రీధర్, డాక్టర్ వాసుదేవరెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. -
‘పది’లో ‘అల్ఫోర్స్’ విద్యార్థుల హవా
కొత్తపల్లి(కరీంనగర్): పదోతరగతి 2025–26 వార్షిక పరీక్షల ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యా సంస్థల విద్యార్థులు అత్యధిక మార్కులతో హవా కొనసాగించారు. కరీంనగర్ వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనీటాట్స్లో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో అత్యధిక మార్కులు సాధించినవారిని అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్రెడ్డి అభినందించారు. అల్ఫోర్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్కు చెందిన ఆర్.సాత్విక్ 589/600 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, ఓ.ఆద్య, టి.రాజు, బి.అక్షిత్ రెడ్డి 588 మార్కులు సాధించినట్లు తెలిపారు. 1,274 మందికి 1,026 మంది 500 మార్కులు, ఆపై సాధించడం అభినందనీయమన్నారు. 48 మంది విద్యార్థులు 580 మార్కులకు పైగా సాధించగా. 334 మంది విద్యార్థులు 560 మార్కులు పైగా సాధించి సత్తాచాటినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
చిరువ్యాపారి కూతురు.. చదువులో మేటి
కాల్వశ్రీరాంపూర్: మండల కేంద్రానికి చెందిన పిల్లలమర్రి సాయిశివాణి(మల్యాల మోడల్ స్కూల్) టెన్త్లో 571 మార్కులు సాధించి మండల్ టాపర్గా నిలిచింది. తల్లిదండ్రులు వారసంతలో ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు, మసాలా దినుసులు విక్రయిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోపాటు పట్టులతో చదివింది. ఇదే గ్రామానికి చెందిన ఐలి జ్ఞాపిక(మల్యాల మోడల్ స్కూల్) 562 మార్కులు సాధించింది. తల్లిదండ్రులు నందిని – మహేందర్ది వ్యవసాయ కుటుంబం. ఐఏఎస్ లక్ష్యంగా ఉన్నత చదువులకు వెళ్తామని ఇద్దరు విద్యార్థినులు తెలిపారు. అమ్మానాన్నల ప్రోత్సాహం జ్యోతినగర్: నాన్న రమేశ్ కూలీ పనులు చేస్తున్నాడు. అమ్మ రేణుక ఇల్లాలు. మమ్మల్ని ఉన్నతంగా చదివిస్తున్నారు. పదో తరగతిలో 524 మార్కులు సాధించా. మా చెల్లి వర్షిత కూడా 412 మార్కులు సాధించడం ఆనందంగా ఉంది. మా అక్కయ్యలు ఇద్దరూ డిగ్రీ చేస్తున్నారు. మాతంగికాలనీలో నివాసం ఉంటున్నాం. మా ఇంట్లో నలుగురం అక్కాచెల్లెలం, ఒక తమ్ముడు ఉన్నాడు. – హర్షిత, జెడ్పీ హైస్కూల్, రామగుండంఆనందంగా ఉంది ఎన్టీపీసీ ఇందిరమ్మకాలనీలో నివాసం ఉంటున్న. ఆటోనడుపుతూ కుటుంబాన్ని పోసిస్తున్నా. మా పాప ఎండీ ఫరా ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూ ల్లో పదో తరగతి చదివి 535 మార్కు లు సాధించడం ఆనందంగా ఉంది. మా పాపను ఉన్నత చదువులు చదివిస్తాం. – దావూద్ ఆలీ–నాజిమా -
4 నెలలు.. 1.53 లక్షల టెస్ట్లు
పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గల టీ హబ్ వ్యాధి నిర్ధారణ టెస్టుల్లో రాష్ట్రంలోనే నంబర్ వన్గా నిలిచింది. మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్లో ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్కు అవార్డు అందించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. రోజూ 1,500 నుంచి 2 వేల వరకు శాంపిళ్లు సేకరిస్తున్న సిబ్బంది.. 4 గంటల్లోనే ఫలితాలు అందిస్తున్నారు. పేదలే కాకుండా సామాన్య, మధ్యతరగతి వారు కూడా టీ హబ్ సేవ లు వినియోగించుకుంటున్నారు. సుమారు రూ.2కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన తెలంగాణ వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రం(టీ–హబ్)లో 53 రకాల టెస్టులను ఉచితంగా చేస్తున్నారు. బయోకెమిస్ట్రీ, పాథలాజికల్, మైక్రోబయాలజీ, థైరాయిడ్ వంటిసేవలు తక్కువ సమయంలోనే అందిస్తున్నారు. అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానం అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన మిషనరీలను ప్రభుత్వం టీ–హబ్ కోసం కొనుగోలు చేసింది. ఫుల్ ఆటోమెటిక్ సిస్టంతో ఏర్పాటు చేసిన బయోకెమిస్ట్రీ అనలైజర్ మిషన్తో ప్రతీగంటకు 1,800 పరీక్షలు చేసే సామర్థ్యం ఉంది. రూ.80 లక్షల విలువైన ఈ యంత్రం ద్వారా అనేక రకాల వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. సెల్ కౌంటర్ మిషన్కు ప్రతీ గంటకు 1,500 టెస్టులు చేసే పామర్థ్యం ఉంది. ఇప్పటి వరకు థైరాయిడ్ టెస్టుకు రెండు రోజుల సమయం పట్టేది. టీ–హబ్ మిషన్తో అదేరోజు ఫలితంగా అందించే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. వీటితోపాటు యూరిన్ ఆనలైజర్ మిషన్, ఇమ్యునో కెమిస్ట్రీ అనలైజర్, ఎలీసారీడర్, 2 డీ ఎకో మిషన్, ఈసీజీ మిషన్లు సమకూర్చారు. 24 కేంద్రాలు, 3 రూట్లు.. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వ్యాధి నిర్ధారణ కేంద్రం పరిధిలో 24 సెంటర్లు, 3 రూట్లు, 3 వాహనాలతో శాంపిళ్లు సేకరిస్తున్నారు. జిల్లాలోని 18 ప్రాథమిక, 6 అర్బన్ హెల్త్ సెంటర్లు, ఆస్పత్రుల్లోని పేషెంట్ల వ్యాధులను బట్టి షాంపిల్స్ సేకరిస్తున్నారు. ప్రతీరోజు మధ్యాహ్నం 2 గంటల లోపు శాంపిల్స్ను టీ–హబ్లో అందించాల్సి ఉంటుంది. షాంపిల్స్ను బార్కోడ్స్ సాయంతో స్కాన్ చేసి వ్యాధి నిర్ధారణ పరీక్ష చేస్తారు. ఆ వెంటనే పే షెంట్ మొబైల్ నంబరు లేదా మెయిల్కు రిపోర్టు సమాచారం అందిస్తున్నారు. మాన్యువల్ పద్ధతిన కూడా నివేదికలు పొందే అవకాశం ఉంది. నెల పరీక్షలు జనవరి 32,072 ఫిబ్రవరి 42,125 మార్చి 44,057 ఏప్రిల్(ఇప్పటివరకు) 35,319 మొత్తం 1,53,573 టీ హబ్లో చేసిన వివిధ పరీక్షలు వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో జిల్లా ఆస్పత్రి అగ్రస్థానం రాష్ట్రంలోనే ప్రత్యేకత సాధించినట్లు గుర్తింపు -
మంత్రి వద్దకు ఫ్లెక్సీ పంచాయితీ
పెద్దపల్లి: ఫ్లెక్సీల చించివేత పంచాయితీ మంత్రి శ్రీధర్బాబు వద్దకు చేరింది. సుల్తానాబాద్ మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం స్థానిక నేతలు అతిథులకు ఆహ్వానం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈక్రమంలో తమ ఫొటో ఉండా ల్సినచోట లేదని పేర్కొంటూ రెండు గ్రూపులుగా వి డిపోయి ఫ్లెక్సీలను చించి వేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్ మంత్రి శ్రీధర్ బాబుదృష్టికి తీసుకెళ్లారు. దీంతో 11 మంది మున్సిపల్ పాలకవ ర్గం మంత్రికి ఆయనపై ఫిర్యాదు చేసింది. అయితే, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు పా లకవర్గం కూడా సమన్వయంతో పనిచేసుకోవాలని మంత్రి సూచించారు. తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని, అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, యూత్ కాంగ్రెస్ జాతీయ మాజీ కార్యదర్శి ఊట్ల వరప్రసాద్, కౌన్సిలర్లు గాజుల రాజమల్లయ్య, ఉట్ల వరప్రదీప్, రాకేశ్, సిద్ద తిరుపతి, వేగోళం అబ్బయ్యగౌడ్, కుమార్, టీకే ప్రభాకర్, శేఖర్, అంజన్న, రవీందర్, బాకం సాయికిరణ్ పాల్గొన్నారు. -
విశాలమైన వీధులే లక్ష్యం
కోల్సిటీ: వీధులు విశాలంగా ఉంచుకోవాలని రా మగుండం నగర మేయర్ మహంకాళి స్వామి కో రారు. నగరంలోని 47వ డివిజన్ మార్కండేయకాలనీలో స్థానిక కార్పొరేటర్ దాసరి సాంబమూర్తి, అధికారులతో కలిసి ఆయన మంగళవారం పర్య టించారు. మేయర్ మాట్లాడుతూ, రోడ్డు ఆక్రమించి ఇళ్ల ఎదుట గద్దెలు, మెట్లు నిర్మించడం, చెట్లకొమ్మలు, పిచ్చిచెట్లతో దారి మూసుకుపోయేలా వ్యవహరించడం ద్వారా ప్రమాదాలు జరుతున్నాయని అన్నారు. స్థానికుల విన్నపం మేరకు హనుమాన్గు డి వీధిలో కల్వర్ట్ నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. మేయర్ ఆదేశాలతో జేసీబీలతో మేజర్ నాలాలో పూడిక తొలగించారు. పిచ్చిచెట్లు తొలగించి శుభ్రం చేయించారు. ఇళ్ల ఎదుట స్థలం ఆక్రమించి నిర్మించిన గద్దెలు తొలగించారు. రోడ్డుపై వేలాడుతున్న చెట్లకొమ్మలు తొలగించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వడ్లూరి రవి, ఈఈ పీవీ రామన్, టీపీఎస్ నవీన్, డీఈఈ అఫ్తాబ్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, జవాన్ సంపత్ పాల్గొన్నారు. రామగుండం మేయర్ మహంకాళి స్వామి -
తీరనున్న ట్రాన్స్‘ఫార్మర్’ తిప్పలు
పెద్దపల్లిరూరల్: వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే అన్నదాతలకు ఎంత కష్టమో.. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ను రిపేర్ సెంటర్కు తరలించేందుకు పడే బాధలు అన్నీఇన్నీకాదు. ఈ సమస్యల నుంచి రైతులను గట్టెక్కించేందుకు అధికా రులకు కేవలం సమాచారం అందిస్తే చాలు ట్రాన్స్కో వాహనం సత్వరమే ఘటనా స్థలానికి ఆగమేఘాలపై చేరుకుంది. దానిని వెనువెంటనే రిపేర్ సెంటర్కు తీసుకెళ్తుంది. అక్కడ మరమ్మతులు పూర్తయ్యాక మళ్లీ యథాస్థానంలో ఏర్పాటు చేసుకుంది. ఇందుకోసం విద్యుత్ అధికారులు, సిబ్బందే యుద్ధప్రాతిపదికన పనిచేస్తారు. జిల్లాలో 9 వాహనాలు జిల్లాలోని సబ్ డివిజన్, డివిజన్ పరిధిలో ఎక్కడ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా ఆ సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందించాలి. వారు సత్వరమే స్పందించి సమీపంలో అందుబాటులో ఉన్న వాహనం ఘటనా స్థలానికి చేరుకునేలా ఆదేశాలు జారీచేస్తారు. అంతేకాదు.. కరెంట్ ట్రాన్స్ఫార్మర్ను రిపేర్ సెంటర్కు చేర్చుతారు. ఇందుకోసం జిల్లాలో జీపీఎస్ ట్రాకింగ్తో కూడిన 9 వా హనాలను అందుబాటులో ఉంచారు. అక్కడి పరిస్థితులను బట్టి రిపేర్ చేయడమా? లేక వేరొకదానిని అమర్చడమా? అనేది నిర్ణయించి రైతులకు ఇబ్బంది తలెత్తకుండా అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు. మెరుగైన సేవల కోసం.. వ్యవసాయ రంగానికి మెరుగైన సేలు అంలందించాలనే లక్ష్యంతోనే ట్రాన్స్కో అధికారులు ఈ కా ర్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రధానంగా పంట లు దెబ్బతినకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చే యాలనే లక్ష్యంతో ఉన్నతాధికారులు అనేక సంస్కరణలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ట్రాన్స్ఫార్మర్ల తరలింపు కోసం ప్రత్యేకంగా వాహనాలు సమకూర్చుతున్నారు. సమస్యపై సమాచారం ఇస్తే చాలు.. విద్యుత్ సంబంధ సమస్యలు తలెత్తితే వెంటనే అధికారులకు సమాచారమందించాలని సూచిస్తున్నా రు. ఎట్టిపరిస్థితుల్లోనూ స్వయంగా కరెంట్ ట్రాన్స్ఫర్మర్లు, విద్యుత్ పరికరాలను తాకరాదని వారు పేర్కొంటున్నారు. స్థానిక అధికారులకో టోల్ఫ్రీ నంబరు 1912కు ఫిర్యాదు చేసినా స్పందిస్తారని వివరించారు. ట్రాన్స్ఫార్మర్లను మోసే ‘భారం’ మాదే కాలిపోయినట్లు సమాచారం ఇస్తే చాలు మోసుకొచ్చేందుకు 9 వాహనాలు సిద్ధం రైతులకు సత్వర సేవలు అందించడమే మా లక్ష్యం పెద్దపల్లి ట్రాన్స్కో సర్కిల్ ఎస్ఈ గంగాధర్ -
ఇంటర్ బోర్డు నిఘా పెట్టాలి
ప్రైవేట్ విద్యాసంస్థల్లో అడ్మిషన్ల పేరుతో టీచర్లు, అధ్యాపకులను మానసికంగా వేధించడం మానుకోవాలి. సెలవు దినాల్లోనూ పనులు చేయించుకునే పద్ధతికి స్వస్తి చెప్పాలి. టీచర్లు, అధ్యాపకులను బోధనేతర పనులకు ఉపయోగించుకోవడం సరికాదు. వర్క్షాపుల పేరుతో మానసిక ఇబ్బందులకు గురి చేస్తే స హించేదిలేదు. ఇన్ని చేస్తున్నా చాలా విద్యాసంస్థల్లో జీతాలు కూడా సరిగా ఇవ్వ డం లేదు. ఇలాంటి యాజమాన్యాలపై ఇంటర్బోర్డు కఠిన చర్యలు తీసుకోవాలి. – కె.రాణాప్రతాప్, పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి -
బాలల సంరక్షణ అందరి బాధ్యత
పెద్దపల్లి: బాలల సంరక్షణ అందరి బాధ్యతని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక –99 రోజుల కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల సంరక్షణపై మంగళవారం అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ, మిషన్ వాత్సల్య్, అంగన్వాడీ సేవలు, ప్రీ–ప్రైమరీ విద్య ద్వారా పిల్లల సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అన్నారు. అనంతరం బాల్యవివాహాల రహిత గ్రా మంగా ఎంపికై న పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి సర్పంచ్కు సర్టిఫికెట్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్రావు, గ్రామీ ణ అభివృద్ధి అధికారి కాళిందిని, అదనపు అధికారి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తరించేందుకు మే 6న జాబ్ మేళా నిర్వహించనున్నామని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. టెలికాం కమ్యూనికేషన్, కస్టమర్ సపోర్ట్, బీపీవో, సేల్స్, మార్కెటింగ్, డి జిటల్ సర్వీసెస్, ఫీల్డ్ ఆపరేషన్స్ వంటి విభిన్న రంగాల్లో అవకాశాలు ఉన్నాయని, ఎస్సెస్సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఫార్మసీ, ఇంజినీరింగ్, ఎంబీఏ తదితర కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులని కలెక్టర్ వివరించారు. పలు కంపెనీల ప్రతినిధులు హాజరవుతారన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష -
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?
కోల్సిటీ: రామగుండం నగరంలో జరుగుతు న్న రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బీజేపీ నా యకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు ప్ర మాదాల నియంత్రణకు వెంటనే చర్యలు చేపట్టాలనే డిమాండ్తో బల్దియా కార్యాలయం ఎ దుట మంగళవారం ధర్నా చేశారు. ఎస్సీ మో ర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాజీపేట శివాజీ మా ట్లాడుతూ, ఇంజినీరింగ్ ప్రమాణాలు పాటించకుండా, సైన్బోర్డులు ఏర్పాటు చేయకుండా ని ర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇంజినీరింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. వారంలో గా తగిన చర్యలు తీసుకోకుంటే బల్దియా కా ర్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ కార్యదర్శి ఉమామహేశ్వర్కు వినతిపత్రం అందజేశారు. నాయకులు కొండపర్తి సంజీవ్కుమార్, జక్కు ల నరహరి, సులువ లక్ష్మీనరసయ్య, మాతంగి రేణుక, ఊరగొండ అపర్ణ, కోడూరు రమేశ్, ఐ త పవన్, మాదరబోయిన రాకేశ్ పాల్గొన్నారు. డ్రగ్స్తో ఆరోగ్య సమస్యలు రామగుండం: మాదక ద్రవ్యాలతో ఆరోగ్య స మస్యలు తలెత్తుతాయని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. స్థానిక తబితా ఆశ్రమాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. చైల్డ్ సేఫ్టీ – డ్రగ్స్కు నో చెప్పండి అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించా రు. ఎస్సై సంధ్యారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు బదావత్ సారయ్యనాయక్, డీసీపీ బూక్య రాంరెడ్డి, సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై ఉదయ్కిరణ్, పోలీసు సిబ్బంది రవీందర్, సాగి ప్రభాకర్రావు, సంపత్ తదితరులు పాల్గొన్నారు. అనుమతి ఇవ్వాలని వినతి రామగుండం: స్థానిక క్రీడా మైదానంలో మే 3న నిర్వహించనున్న హిందూ మెగా సమ్మే ళనం నిర్వహణకు అనుమతి ఇవ్వాలని బీ–థర్మల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ దాసరి శంకరయ్యకు నిర్వాహకులు మంగళవారం వినతిప త్రం అందజేశారు. సమ్మేళనానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులతో పాటుగా అత్యధికంగా హిందువులు హాజరుకానున్నారని తెలిపారు. వినతిపత్రం సమర్పించిన వారిలో నిర్వాహకులు తూండ్ల శ్రీనివాస్ పటేల్, వడ్డెపల్లి సురేశ్, జాగటి శ్రీకాంత్కుమార్, మద్ధి అన్వేశ్, లగిశెట్టి రవి తదితరులు ఉన్నారు. తేమశాతం వచ్చిన వెంటనే కొనుగోలు పెద్దపల్లి: నిర్దేశిత తేమశాతం వచ్చిన వెంటనే ధాన్యం తూకం వేయాలని అదనపు కలెక్టర్ వే ణు సూచించారు. సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్లో మంగళవారం ఆయన ధాన్యం కొ నుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం ఆరిన తర్వాతే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం కొనుగోలు చేస్తారని వి వరించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి వెంకటేశ్వర్లు, కార్యదర్శి సంతోష్, రైతులు ఉన్నారు. ఒకేపంట.. రెండు రంగుల్లో.. మంథనిరూరల్: ప్రకృతిలో ఆకట్టుకునే సన్నివేశాలు అరుదుగా కనిపిస్తుంటాయి. ఇక్కడ కనువిందు చేస్తున్న ఈ దృశ్యం కూడా ఇలాంటిదే. మంథని శివారులోని ఓ పొలంలో వరి సాగుచేశాడు ఓ రైతు. అయితే, పంట ప్రస్తుతం కోత దశకు చేరింది. రెండు మడుల్లోని పంట రెండు రంగులతో కనువిందు చేస్తోంది. పక్కనే పక్కనే ఉన్న ఒకేరకం పంటలో ఒకటి ఆకుపచ్చగా మరొకటి పసుపుపచ్చగా కనిపిస్తుండడం ఆకట్టుకుంటోంది. -
బతుకు పోరాటం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘మీ ఇంట్లో పిల్లలు ఎంత మంది. ఏం చదువుతున్నారు. ఎక్కడ చదువుతున్నారు.. మా పాఠశాల/కళాశాలలో చేర్పించండి. నాణ్యమైన బోధన ఉంటుంది. ఫలితాలు చూడండంటూ’ పేపర్లు చూపుతున్నారు. సీటు ఇప్పుడు కన్ఫార్మ్ చేసుకుంటే ఫీజులో రాయితీ ఇప్పిస్తామంటూ చెబుతున్నారు. తల్లిదండ్రుల నంబర్లు తీసుకుని రోజూ నాలుగైదు సార్లు ఫోన్లు చేస్తున్నారు. తమకు టార్గెట్లు ఉన్నాయంటూ వేడుకుంటున్నారు. ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాలు లేక 45 డిగ్రీల సెల్సియస్ ఎండల్లో ఉదయం, సాయంత్రం యాజమాన్యాలు ఇచ్చిన టార్గెట్ల కోసం కష్టపడుతున్నారు. మండే ఎండలు ఒకవైపు, వీధి కుక్కలు మరోవైపు, పిల్లల కోసం తలుపులు తడితే ఛీత్కరించుకునే ఇంటి యజమానుల మాట లను భరించుకుంటూ బతుకు బండి లాగేందుకు ప్రయాసపడుతున్నారు ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు టీచర్లు. సెలవులు లేని కొలువు పనిచేసేది పాఠశాలలోనైనా సెలవనే మాట ఉండదు. ఆదివారమైనా.. వేసవి సెలవులైనా, పండుగలైనా.. పాఠశాల కోసం పని చేయాల్సిందే. ఇక కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. యాజమాన్యం ఇచ్చి న టార్గెట్ చేయించకపోతే ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో తెలియదు. అందుకే వేసవి సెలవుల్లోనూ ఇంటింటికి తిరుగుతూ ‘మీ పిల్లలను మా విద్యాసంస్థల్లో చేర్పించండి.. ఫీజులో రాయితీ కూడా ఇప్పిస్తాం’ అంటూ తల్లిదండ్రులను బతిమాలుకుంటున్నారు. మెడపై అడ్మిషన్ల కత్తి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది మెడపై అడ్మిషన్ల కత్తి వేలాడుతోంది. 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు భారీగా చేయాలంటూ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఆ సంఖ్యను బట్టే జీతా ల చెల్లింపు.. ఇంక్రిమెంట్లు, ఉద్యోగభద్రత ఉంటుందని చెప్పడంతో కంటి మీద కునుకు లేకుండా పోతోంది. యాజమాన్యాలు టార్గెట్లు పెట్టి మానసిక క్షోభకు గురి చేస్తున్నాయని, ఉదయం, సాయంత్రం సమావేశాలు నిర్వహించి దురుసుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలల్లో 15 వేల మందికిపైగా బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తుండగా అందరిదీ అదే పరిస్థితి.ఉద్యోగులతో వెట్టిచాకిరీ... అడ్మిషన్ల టార్గెట్లే కాకుండా.. యాజమాన్యాలు వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ 10 నుంచి 12గంటలు పని చేయాలని, శని, ఆదివారం, జాతీయ సెలవు దినాలు, పండుగ రోజుల్లోనూ స్కూళ్లు, కళాశాలలకు వెళ్లాల్సిందేనని వాపోతున్నారు. పనికి తగ్గ వేతనాలు ఇవ్వడం లేదంటున్నారు. టీటీసీ, బీఈడీ, ఎంఈడీ, పీజీ, ఎంబీఏ తదితర కోర్సులు చేసి ఉపాధి కోసం పని చేస్తున్నామని, ఇక్కడ ఉద్యోగ భద్రత లేకపోగా పని ఒత్తిడి చేస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉమ్మడి జిల్లా వివరాలు జిల్లా ప్రైవేటు పాఠశాలలు ఉపాధ్యాయులు కరీంనగర్ 298 6,254 రాజన్న సిరిసిల్ల 132 1,555 పెద్దపల్లి 192 4,224 జగిత్యాల 292 3,480 -
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
పెద్దపల్లిరూరల్: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మ ద్దతు ధరకే విక్రయించాలని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. బ్రాహ్మణపల్లి, రాగినేడు, కుర్మపల్లి, అందుగులపల్లి, దేవునిపల్లి, రంగాపూర్, గౌరెడ్డిపేట, ముత్తారం, హన్మంతునిపేట, చీకురాయిలో మంగళవారం ధాన్యం కొనుగోళ్లను ఆ యన ప్రారంభించి మాట్లాడారు. పెద్దపల్లి మార్కె ట్ కమిటీ చైర్మన్ కూరమల్లారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, సర్పంచులు ఆరె సంతోష్, సుజాత, రో జారాణి, అంజయ్య, కుమార్, లక్ష్మి, బొక్కల రేఖ, గంట రమేశ్, శ్రీనివాస్, కౌన్సిలర్ గుజ్జుల కుమార్, కొమ్ము సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రంగాపూర్లో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ గంట రమేశ్తో కలిసి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందించారు. అన్నదాతకు ప్రభుత్వం అండ జూలపల్లి: రైతుల సంక్షేమమే ధ్యేయంగా అన్నిగ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోందని విప్ విజయరమణారావు అన్నారు. వడ్కాపూర్, వెంకట్రావుపల్లె, కాచాపూర్, కీచులాటపల్లె, కుమ్మరికుంట, బాలరాజుపల్లెలో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మాట్లాడారు. నాయకులు, అధికారులు పుల్లూరి ప్రశాంతి, వేణుగోపాలరావు, పెంట కావేరి, మచ్చ అరుణ, మెండే తిరుపతి, కుంటూరి అంజమ్మ, ప్రభుదాస్, కొమ్మ పోచాలు, నర్సింహ యాద్, అలువాల తిరుపతి, రవీందర్రెడ్డి, సురేశ్ పాల్గొన్నారు. కోతలు లేకుండా కొనుగోళ్లు సుల్తానాబాద్రూరల్: గత ప్రభుత్వాలు కోతల పేరిట రైతులను ఇబ్బందులకు గురిచేయగా తమ ప్రభుత్వం గింజ కోతలేకుండా ధాన్యం కొనుగోలు చేస్తోందని విప్ విజయరమణారావు అన్నారు. కాట్నపల్లిలోని కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఓగుల పూజ, సంఘం పర్సన్ ఇన్చార్జి వెంకటేశ్వర్లు, సీఈవో సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ విజయరమణారావు -
అర్జీలు పెండింగ్లో ఉంచొద్దు
పెద్దపల్లి: సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి అర్జీలు స్వీకరించారు. దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని ఆదేశించారు. రామగిరి మండలం కల్వచర్లకు చెందిన దిండు స్వప్న ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోగా, అవసరమై చర్యలు తీసుకోవాలని వారధి సొసైటీకి సూచించారు. పెద్దపల్లి పట్టణం నల్ల పోచమ్మవాడకు చెందిన రజియా బేగం డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకోగా, తగు చర్యలు తీసుకోవాలని హౌసింగ్ పీడీని ఆదేశించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆన్లైన్లో నమోదు చేయాలి
తాత, తండ్రుల నుంచి భూమిని సాగు చేసుకుంటున్నాం. రెవెన్యూ అధికారులు తమ భూమిని ఆన్లైన్లో నమోదు చేయడం లేదు. కబ్జాలో, పట్టాలో నేనే ఉన్నప్పటికీ ఆన్లైన్లో కనబడడం లేదు. అధికారులు చొరవ తీసుకొని సమస్య పరిష్కరించాలి. – కొమ్ము మల్లేశం, రైతు, వడుకాపూర్ అక్రమ పట్టా రద్దు చేయాలి సుల్తానాబాద్ మండలం కనుకుల శివారులో సర్వే నంబర్ 221లో అక్రమంగా 11 ఎకరాల 23 గుంటల భూమిని జిన్న శ్రీలత పట్టా చేసుకున్నారు. గ్రామానికి సంబంధం లేని వ్యక్తికి పట్టా ఎలా చేస్తారు. అక్రమ పట్టా రద్దు చేసి, నిబంధనలకు విరుద్ధంగా పట్టా చేసిన అధికారిపై చర్య తీసుకోవాలి. సదరు భూమిని ప్రజల అవసరాలకు కేటాయించాలి. – సర్పంచ్ కవిత, గ్రామస్తులు, కనుకుల


