పెద్దపల్లి నుంచి ధర్మపురి, వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం లాంటి పుణ్యక్షేత్రాలకు నేరుగా బస్సులు నడపాలి. కొంతకాలం ధర్మారం మీదుగా జగిత్యాలకు నడిపిన బస్సులు రద్దు చేశారు. వాటినే ధర్మపురి దాకా నడిపించాలి.
– స్వప్న, అప్పన్నపేట
ఆధునీకరించాలి
జిల్లా కేంద్రం హోదాకు తగ్గట్టుగా పెద్దపల్లి బస్టాండ్ను ఆధునీకరించాలి. ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా ప్లాట్ఫాంలను విస్తరించాలి. డిపో ఏర్పాటు కావడంతో బస్సుల సంఖ్య పెరిగే అవకాశమున్నందును బస్టాండ్ను ఆధునిక వసతులతో అభివృద్ధి చేయాలి.
– సోడాబాబు, పెద్దపల్లి
ప్రతిపాదనలున్నాయి
పెద్దపల్లి బస్టాండ్ను విస్తరించే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నారు. ఆర్టీసీకి ఆదాయం వచ్చేలా ప్రస్తుతం ఉన్న 16 గదులకు తోడుగా షాపింగ్ కాంప్లెక్సు విస్తరణ కూడా చేపట్టే అవకాశముంది. బస్డిపో ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రయాణికులకు మెరుగైన రవాణ సౌకర్యం కల్పిస్తాం. – రాంగోపాల్రెడ్డి, స్టేషన్మేనేజర్


