ముళ్లపొదల వనం
రామగుండం కార్పొరేషన్లోని మూడోడివిజన్ మేడిపల్లి పట్టణ ప్రకృతి వనం బోర్డులకే పరిమితమైంది. నిర్వహణ, పర్యవేక్షణ లోపంతో నామరూపాల్లేకుండాపోయింది. ముళ్లపొదలతో దర్శనమిస్తోంది. బల్దియా సిబ్బంది చొరవచూపి ప్రకృతి వనం రూపురేఖలు మార్చాలని నగరవాసులు కోరుతున్నారు.
పెండింగ్ చలాన్లపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించాలరు. హెల్మెట్ ధరించాలని, లైసెన్స్ వెంట ఉంచుకోవాలని వాహనదారులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. మంగళవారం గోదావరిఖని మున్సిపల్ చౌరస్తాలోని రాజీవ్ రహదారిపై వాహనదారులను తనిఖీ చేస్తూ ‘సాక్షి’ కెమెరాకు ఇలా కనిపించారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి


