ధర్మారం: రామయ్యపల్లి గ్రామంలో దీర్ఘకాలికంగా ఎదురవుతున్న లో వోల్టేజీ సమస్య పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన 25 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను సర్పంచ్ మూల మంగతో కలిసి ఏడీఈ వెంకటరమణారెడ్డి శనివారం ప్రారంభించారు. కొద్దిరోజులుగా లోవోల్టేజీ సమస్య ఉండడంతో మంత్రి లక్ష్మణ్కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి.. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పా టు చేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా చేసినట్లు సర్పంచ్ మంగ తెలిపా రు. ఈ కార్యక్రమంలో ఖిలావనపర్తి ఏఈ మహేందర్రెడ్డి, ఉపసర్పంచ్ భూతగడ్డ గట్టమ్మ, లైన్మెన్ హైమద్పాషా, వార్డు సభ్యులు తదతరులు పాల్గొన్నారు.


