వికసిత్‌ భారత్‌ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

వికసిత్‌ భారత్‌ లక్ష్యం

Aug 15 2026 12:10 AM | Updated on Aug 15 2026 12:10 AM

వికసిత్‌ భారత్‌ లక్ష్యం మనమే సంపద సృష్టించాలి పరిజ్ఞానం పెంపొందాలి ప్రకృతిని కాపాడుతూ..

మనదేశం సాంకేతికతతో అన్నిరంగాల్లో దూసుకెళుతోంది. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యం సాధించడం ఖాయం. విదేశీయుల టెక్నాలజీపై ఆధారపడకుండా సొంత పరిజ్ఞానంతో ఇప్పటికే అనేక విజయాలు సాధించి ప్రపంచ దేశాలనే నివ్వెర పర్చుతోంది.

– అర్చన, విద్యార్థిని, పెద్దపల్లి

ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం పొరుగు విదేశాలకు వలసవెళ్లడం కాదు.. మనదేశ యువతే ప్రపంచ దేశాల కంపెనీలను శాసించేస్థాయిలో పట్టు సాధించాలి. పరదేశీయులే జాబ్స్‌ కోసం మనదేశం వైపు చూడాలి. ఇది 2047 వరకు సాధ్యమవుతుందనే నమ్మకం ఉంది.

– గాయత్రీ, పెద్దపల్లి

ప్రస్తుత ప్రపంచంలో పెరుగుతున్న పోటీకి అనుగుణంగా యువత ఆధునికత సాంకేతికతపై పట్టు సాధించాలి. విదేశాలపై ఆధారపడకుండా సొంత పరిజ్ఞానంతోనే సూ పర్‌ కంప్యూటర్లు సృష్టించే హబ్‌గా ఎదుగుతాం. సాంతికేతకను అందిపుచ్చుకుంటాం.

– సిరిహాసిని, పెద్దపల్లి

సహజవనరులను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా ఎదుగుతాం. ఇప్పటికే పీఎం సూర్యఘర్‌ లాంటి పథకంతో సౌరశక్తితో విద్యుత్‌ ఉత్పత్తికి బాటలు వేసుకున్నాం. ప్రజలూ భాగస్వాములవుతున్నారు.

– వైష్ణవి, సెకండియర్‌, పెద్దపలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement