జ్యోతినగర్: పేదల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభు త్వం విస్మరిస్తోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాజీవ్ రహదారిపై ఆ పార్టీ నేతలు కౌషిక హరి, వ్యాళ్ల హరీశ్రెడ్డితో కలిసి సోమవారం ధర్నా చేశారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మా ట్లాడుతూ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను తక్షణమే పునరుద్ధరించాలన్నారు. బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్లీడర్ మేకల సమ్మయ్య యాదవ్, కార్పొరేటర్లు తోకల రమేశ్, మహేశ్, కర్క పద్మజ, నిమ్మరాజల రవి, మాజీ జెడ్పీటీసీ అముల నారాయణ, నాయకులు నారాయణదాసు మారుతి, మందల కిషన్రెడ్డి, మెతుకు దేవరాజ్, బొడ్డుపెల్లి శ్రీనివాస్, ఈదునూరి పర్వతాలు, ఈదునూరి శ్రీకాంత్, తస్లీమా బాను, అయిత శివకుమార్, వకుల, సత్యవతి, సాజిదా, కళావతి, కిరణ్, రామరాజు తదితరులు పాల్గొన్నారు.


