అసంతృప్తుల జ్వాలలు | - | Sakshi
Sakshi News home page

అసంతృప్తుల జ్వాలలు

Feb 4 2026 7:03 AM | Updated on Feb 4 2026 7:03 AM

అసంతృ

అసంతృప్తుల జ్వాలలు

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌:

రీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల పరిధిలో టికెట్లు ఆశించిన ఆశావహులకు నిరాశ ఎదురవడంతో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం ముగియడంతో బీఫారాలు అందుకున్న అభ్యర్థులు ప్రచార బరిలో దిగారు. ప్రధాన పార్టీల్లో టికెట్లు దక్కలేదన్న ఆగ్రహంతో పలువురు బహిరంగ నిరసనలకు దిగారు. పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆశావహులు రోడ్డెక్కారు. పార్టీ సభ్యత్వాలు, పదవులకు రాజీనామా చేయడం, నాయకుల దిష్టిబొమ్మలు దహనం చేయడం, నేతల ఇళ్ల ముందు ఆందోళనలు నిర్వహించడం, పరస్పర వాగ్వాదాలకు దిగడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ పలువురు ఆశావహులు పార్టీ పెద్దల ఇళ్లముందు ఆందోళన చేపట్టారు. పార్టీ నిర్ణయాలను ధిక్కరిస్తూ కొందరు స్వతంత్రులుగా.. మరికొందరు పార్టీ రెబల్స్‌గా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు తమ పార్టీలకు రాజీనామా చేసి ప్రత్యామ్నాయ రాజకీయ మార్గాలపై దృష్టి పెట్టారు. ఈ పరిణామాలు ప్రధాన పార్టీలకు కొత్త తలనొప్పిగా మారాయి. రెబల్స్‌ ప్రభావం ఎన్నికల ఫలితాలపై తీవ్రంగా పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసంతృప్తులను బుజ్జగించేందుకు సీనియర్‌ నేతలు రంగంలోకి దిగుతున్నప్పటికీ.. చాలాచోట్ల పరిస్థితి అదుపులోకి రావడం లేదు. టికెట్ల వ్యవహారం మరింత మంటలు రాజేస్తుండటంతో కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో రాజకీయ పోరు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది.

టికెట్లు దక్కలేదని నిరసనలు

ప్రధాన పార్టీలకు తప్పని రెబల్స్‌ బెడద

పార్టీలకు పలువురు రాజీనామా

స్వతంత్రులుగా పోటీకి సిద్ధం

కరీంనగర్‌లో రెండు బీ ఫామ్‌లు ఇచ్చి రచ్చకెక్కిన కాంగ్రెస్‌ నాయకులు

రెబల్స్‌ బెడద

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు బీఫామ్‌లు అందించే సమయంలో హైడ్రామా నెలకొంది. ఒకే డివిజన్‌కు రెండు బీఫామ్‌లు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. పీసీసీ ఆదేశాలకు వ్యతిరేకంగా స్థానిక నాయకులు బీఫామ్‌లు అందించడం కలకలం రేపింది. తొలుత 50వ డివిజన్‌ అభ్యర్థిగా కొత్త అనిల్‌ను హైకమాండ్‌ ప్రకటించింది. అదే సమయంలో పార్టీ కార్పొరేషన్‌ ఇన్‌చార్జి వైద్యుల అంజన్‌కుమార్‌ బీఫామ్‌ను చక్రధర్‌రావుకు అందించారు. ఈ విషయం తెలిసి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు అవాక్కయ్యారు. అనిల్‌కు కాదని బీఫామ్‌ ఇవ్వడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఎలాగైనా అనిల్‌కు న్యాయం చేయాలనే ఆలోచనతో హైకమాండ్‌ అప్పటికే 57వ డివిజన్‌ పొత్తులో భాగంగా కమ్యూనిస్టులకు కేటాయించిన బీఫామ్‌ అందించారు. ఒక విధంగా అటు నగర, అసెంబ్లీ ఇన్‌చార్జిలు పార్టీ నిబంధనలు ఉల్లంఘించారని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.

అసంతృప్తుల జ్వాలలు1
1/1

అసంతృప్తుల జ్వాలలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement