టెన్త్లో ఉత్తమ ఫలితాల సాధనకు ‘సాక్షి’ స్టడీ మెటీరియల్
● సర్క్యులేషన్ మేనేజర్ మధుకర్రెడ్డి
పెద్దపల్లిరూరల్: పదోతరగతి చదివే విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించేందుకు దో హదపడేలా సాక్షి దినపత్రిక స్టడీ మెటీరియల్ రూపొందించిందని ‘సాక్షి’ సర్క్యులేషన్ మేనేజర్ మధుకర్రెడ్డి అన్నారు. పెద్దపల్లి శివారు రంగంపల్లిలోని మహాత్మాజ్యోతిబా పూలే పాఠశాలలో శుక్రవారం స్టడీ మెటీరీయల్ను ప్రిన్సిపాల్ మణిదీప్తితో కలిసి విద్యార్థులకు ఉచితంగా అందించారు. ప్రతీరోజు సాక్షి దినపత్రికలో ప్రచురితమయ్యే స్టడీ మెటీరియల్ ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. దీనిని విద్యార్థులు సద్వినియోగంచేసుకుని మంచి ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన వెంట ఏసీవో తిరుపతి ఉన్నారు.


