ఆరోగ్యశాఖ అప్రమత్తం
● ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద సిబ్బంది ● ఓటర్లు, సిబ్బంది అస్వస్థతకు గురైతే సత్వర వైద్యసేలు
● అందుబాటులో 108 వాహనం కూడా ● ‘సాక్షి’తో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి ప్రమోద్కుమార్
పెద్దపల్లిరూరల్: మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఓటర్లతోపాటు ఎన్నికల సిబ్బందికి ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తినా సత్వర వైద్యసేవలు అందించేందుకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలతోపాటు రామగుండం కార్పొరేషన్లోని ఒక్కో కేంద్రం వద్ద ఒక ఏఎన్ఎం, ఒక ఆశ వర్కర్తోపాటు అందుబాటులో ఒక మెడికల్ ఆఫీసర్ను నియమిస్తారు. వీరితోపాటు 108 అంబులెన్స్నూ సిద్ధంగా ఉంచుతారు. ఈ విషయంపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ప్రమోద్కుమార్ ‘సాక్షి’కి వివరాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే..
ఆరోగ్యశాఖ అప్రమత్తం


