హైలెవల్‌ వంతెన పనుల్లో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

హైలెవల్‌ వంతెన పనుల్లో వేగం పెంచాలి

Apr 2 2026 9:04 AM | Updated on Apr 2 2026 9:04 AM

ఓదెల: ఓదెల మండలం రూపునారాయణ పేట – జమ్మికుంట మండలం విలాసాగర్‌ మధ్య మానేరుపై చేపట్టిన హైలెవల్‌ బ్రిడ్జి ప నుల్లో వేగం పెంచాలని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సూచించారు. రూపునారాయణపేట మానేరుపై చేపట్టిన హైలెవల్‌వంతెన, డబుల్‌రోడ్డు నిర్మాణాన్ని బుధవారం పరిశీలించారు. వంతెన నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి రూ.80కో ట్లు మంజూరు చేశారన్నారు. బ్రిడ్జికి అనుబంధంగా చేపట్టిన పొత్కపల్లి శివారులోని సీసీరోడ్డు, పొత్కపల్లి – కాల్వశ్రీరాంపూర్‌ మధ్య రూ.27కోట్లతో చేపట్టిన డబుల్‌రోడ్డు పనులు ప రిశీలించారు. కాంగ్రెస్‌ నేత ప్రేంసాగర్‌రెడ్డి, స ర్పంచ్‌ బొంగోని రమాశ్రీనివాస్‌గౌడ్‌, మాజీ స ర్పంచ్‌ అంకం రమేశ్‌, మాజీ ఎంపీటీసీ నీర్ల శ్రీనివాస్‌, నాయకుడు కుమార్‌గౌడ్‌ ఉన్నారు.

భక్తాంజనేయస్వామి ఆలయంలో పూజలు

రూపునారాయణపేట భక్తాంజనేయస్వామి ఆల యంలో చండీయాగం, హోమం కార్యక్రమాల్లో ప్ర భుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారా వు – పావని దంపతులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్‌ విజయరమణారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement