మున్సి‘పోల్స్’కు సన్నద్ధం
● 36 వార్డులు.. 74 కేంద్రాలు ● ఎన్నికల అధికారులకు శిక్షణ పూర్తి
● ‘సాక్షి’తో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్
పెద్దపల్లిరూరల్: బల్దియాలో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈనెల 11న పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 43,789 మంది ఓటర్లు ఉండగా అందులో 22,127 మంది మహిళలు, 21,660 మంది పురుషులు, మిగతా వారు ఇతరులు ఉన్నారు. వీరు ఓటుహక్కు వినియోగించుకనేందుకు 74 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, వెబ్కాస్టింగ్ అమలు చేస్తారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్వర్లు ‘సాక్షి’కి వివరాలు వెల్లడించారు.
మున్సి‘పోల్స్’కు సన్నద్ధం


