కోతులను తరిమేయాలి
సాక్షి, పెద్దపల్లి/పెద్దపల్లి: కాలనీలు, గల్లీల్లో కోతులు, కుక్కలు గుంపులుగా సంచరిస్తున్నాయని, ఎప్పుడు, ఎటువైపు నుంచి దాడి చేస్తాయో తెలియక భయాందోళనకు గురవుతున్నామని సుల్తానాబాద్ పట్టణవాసులు ఆవేదన చెందారు. మున్సిపల్ కొత్త పాలకవర్గం ఈ సమస్యపై దృష్టి సారించాలన్నారు. సుల్తానాబాద్లో బుధవారం ‘సాక్షి’ నిర్వహించిన చర్చావేదికలో పలువురు మాట్లాడారు. తీవ్రంగా వేధిస్తున్న కోతులు, కుక్కల బారినుంచి కాపాడే వారికే ఓటేస్తామన్నారు. ఇందుకోసం స్పష్టమైన ప్రణాళిక ప్రకటించాలని డిమాండ్ చేశారు. పట్టణం విస్తరిస్తోందని, ఇందుకు అనుగుణంగా వసతులు కల్పించాలని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే విజయరమణారావు.. సమస్యలను విన్నారు. సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పట్టణ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మరికొందరు మన్నారంటే..
కుక్కల బారినుంచి కాపాడాలి
వాకింగ్ ట్రాక్, సీసీ రోడ్లు నిర్మించాలి
పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలి
‘సాక్షి’ చర్చావేదికలో సుల్తానాబాద్ మున్సిపల్ ప్రజల అభిప్రాయాలు
సమస్యలు పరిష్కరిస్తాం
ఎమ్మెల్యే విజయరమణారావు
కోతులను తరిమేయాలి


