సాక్షి,నెల్లూరు: వైఎస్సార్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిపై అక్రమ కేసు నమోదైంది. విద్యుత్ ఛార్జీలపై పెంపుపై చేపట్టిన నిరసనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ అక్రమ కేసుపై నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి స్పందించారు. ‘2024 డిసెంబర్లో జరిపిన నిరసనకు నేడు నోటీసులు పంపించారు. 2024లో జరిగిన నిరసన ఘటనలో పోలీసులు నాపై అక్రమ కేసు నమోదు చేశారు. అక్రమ కేసులకు భయపడేది లేదు’అని వ్యాఖ్యానించారు.


