సాక్షి, అమరావతి : పదో తరగతి పబ్లిక్ పరీక్షల(ఎస్ఎస్సీ–2026) హాల్టికెట్లను రెండు, మూడు రోజుల్లో విడుదల చేయనున్నారు. ఈ నెల 16 నుంచి పరీక్షల నిర్వహణకు ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో గురు, లేదా శుక్రవారం హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్లో విడుదల చేయనున్నట్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.


