అధికారులకు చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు
యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పూర్తి కాలేదంటూ కక్షపూరిత చర్యలు
సర్వే చేయని సిబ్బందిపై నివేదికలు ఇవ్వాలని హుకుం
ఉద్యోగుల ఆగ్రహం
సాక్షి, అమరావతి: సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం, ఆ ఉద్యోగులపై వేధింపుల్లో మరో పర్వానికి తెరతీసింది. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే వంద శాతం పూర్తి చేయని గ్రామ వార్డు సచివాలయాల (ప్రస్తుత పేరు స్వర్ణ గ్రామ – స్వర్ణ వార్డు) ఉద్యోగుల వేతనాలు నిలుపుదల చేయాలంటూ సంబంధిత డీడీవోలకు రాష్ట్రంలో పలుచోట్ల ఎంపీడీఓలు ఆదేశాలు జారీ చేశారు.
సర్వే చేయని సిబ్బందిపై నివేదికలు తయారు చేయాలంటూ ఆదేశించారు. సర్వే పూర్తి కాలేదని చెబుతూ జీతాలు ఆపమని నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఉద్యోగులు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


