నగరంపాలెం: శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో బిహార్ ఐజీ సునీల్ నాయక్ విచారణ నిమిత్తం గురువారం గుంటూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. ఉదయం పది గంటలకు హాజరైన ఐజీ సునీల్ నాయక్ సాయంత్రం ఐదు గంటలకు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చారు. విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ విచారణ అధికారిగా వ్యవహరించారు. మరో నాలుగు రోజులు ఆయన్ను విచారించనున్నారు. కస్టోడియల్ టార్చర్ కేసులో ఆ రోజు ఎంత మంది ఉన్నారని అడిగినట్లు తెలిసింది.


