సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న తాజా హిందీ చిత్రం ‘లాహోర్ 1947’. షబానా అజ్మీ, ప్రీతి జింతా, కరణ్ డియోల్, అలీ ఫజల్, అభిమన్యు సింగ్ ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాజ్కుమార్ సంతోషి దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమాను ఆగస్టు 13న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
భారత్ – పాకిస్తాన్ దేశాల విభజన కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని బాలీవుడ్ సమాచారం. అయితే అప్పటి రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా ఉండదట. లక్నోకు చెందిన ఓ ముస్లిం కుటుంబం కొన్ని పరిస్థితుల కారణంగా లాహోర్ వెళ్లాల్సి వస్తుందట. ఆ తర్వాత అక్కడ ఆ కుటుంబం ఎలాంటి సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది? అనే కోణంలో ‘లాహోర్ 1947’ సినిమా కథనం సాగుతుందని సమాచారం.


