వెయ్యేళ్ల క్రితం మన ఆలయంపై దండయాత్ర.. సంజయ్‌ లీలా భన్సాలీ కొత్త సినిమా | Sanjay Leela Bhansali announced A movie on JAY SOMNATH | Sakshi
Sakshi News home page

వెయ్యేళ్ల క్రితం మన ఆలయంపై దండయాత్ర.. సంజయ్‌ లీలా భన్సాలీ కొత్త సినిమా

Feb 16 2026 8:02 AM | Updated on Feb 16 2026 9:05 AM

Sanjay Leela Bhansali announced A movie on JAY SOMNATH

సోమనాథ్‌ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి... ఈ పదం చెవినబడగానే మన హృదయాంతరాళం పులకాంకితమై, మదిలో సగర్వ భావన మెదలుతుంది. అయితే, వెయ్యేళ్ల క్రితం సోమనాథ్‌పై జరిపిన గజనీ దండయాత్రను వెండితెరపై చూపించేందుకు బాలీవుడ్‌ దర్శకనిర్మాత సంజయ్‌ లీలా భన్సాలీ సిద్ధమయ్యారు. ఆయన సమర్పణలో ‘జై సోమనాథ్‌’ (JAI SOMNATH)అనే సినిమా రాబోతుంది. దర్శకుడు కేతన్‌ మెహతాతో కలిసి భన్సాలీ(Sanjay Leela Bhansali) తెరకెక్కిస్తున్నారు.  ఆలయం కూలిపోవచ్చు.. విశ్వాసం కాదు అంటూ ఒక పోస్టర్‌తో పాటు వీడియోను విడుదల చేశారు. 2027లో ఈ మూవీ విడుదల చేస్తామని తెలిపారు. ఈ మూవీలో నటించబోయే వారి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

గజనీ మహమ్మద్‌ 1026 జనవరిలో క్రూర, హింసాత్మక దండయాత్రలో భాగంగా ఈ ఆలయంపై దాడి చేశాడు. ప్రజల భక్తివిశ్వాసాలకు, నాగరికతకు సుసంపన్న ప్రతీక అయిన ఈ ఆలయాన్ని ధ్వంసం చేయజూశాడు. సోమనాథ్‌పై వెయ్యేళ్ల నాటి తొలి దండయాత్ర, అక్కడి దురాక్రమణదారుల క్రూరత్వం, పుణ్యక్షేత్ర విధ్వంసం వంటి అమానుష ఘట్టాలను వివిధ చారిత్రక గ్రంథాలు సవివరంగా నమోదు చేశాయి. వాటిని చదివే ప్రతి పాఠకుడి గుండె విలవిలలాడుతూ లిప్తపాటు విచలితమవుతుంది.

పర్షియా, మధ్య ఆసియా, అఫ్గానిస్థాన్‌లను కలిపి సువిశాలమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని గజనీ మహమ్మద్‌ అనుకున్నాడు.  అందుకు కావాల్సిన ఆర్థిక వనరుల కోసం భారత్‌పైకి దాడి చేసేందుకు దిగాడు.  కీ.శ.1000-1027 సమయంలో 17 సార్లు దండయాత్ర చేసి ఎంతో సంపదను భారత్‌ నుంచి దోచుకున్నాడు. అయితే,  15వ దండయాత్ర ఐశ్వర్యవంతమైన సోమనాథ దేవాలయంపై కొనసాగింది. సోలంకి రాజు భీమదేవుడిని ఓడించి సోమనాథ్‌ ఆలయాన్ని  గజనీ మహమ్మద్‌  కొల్లగొట్టడమే కాకుండా ధ్వంసం చేశాడు. సోమనాథ్‌ ఆలయంపై దాడికి వెయ్యేళ్లయిన సందర్భంగా భారత ప్రధాని మోదీ ఇటీవల ప్రత్యేక వ్యాసం రాసిన సంగతి తెలిసిందే..  (వ్యాసం కోసం క్లిక్‌ చేయండి)

ఆలయంపై దాడి జరిగిన ప్రతి సందర్భంలోనూ రక్షణ కుడ్యంలా నిలిచి, ఆత్మార్పణకూ వెరవని వీరపుత్రులు, పుత్రికలు ఎందరో ఉన్నారు. దాడి జరిగిన ప్రతిసారి మనదైన గొప్ప నాగరికతకు వారసులుగా వారు పుంజుకుంటూ తరతరాలుగా ఆలయ పునర్నిర్మాణం, పునరుజ్జీవనానికి పాటుపడుతూనే వచ్చారు. ఇటువంటి మహనీయులలో అహల్యాబాయి హోల్కర్‌ ప్రముఖులు. సోమ్‌నాథ్‌లో భక్తులు ప్రార్థనలు చేసుకునేలా ఆమె అందించిన అవిరళ కృషి వెలకట్టలేనిది. అటువంటి మహానుభావులు జీవించిన నేలపై నడయాడగలగటం నిజంగా మన అదృష్టం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement