breaking news
Jogulamba District News
-
కాంగ్రెస్.. బీఆర్ఎస్.. బీజేపీ..
ఉమ్మడి పాలమూరులో ఎన్నికలు జరిగిన మహబూబ్నగర్ కార్పొరేషన్లో 60 డివిజన్లు.. 18 పురపాలికల్లో 316 వార్డులు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ 30 డివిజన్లు, 179 వార్డుల్లో విజయం సాధించి పైచేయిగా నిలిచింది. అదేవిధంగా బీఆర్ఎస్ 15 డివిజన్లు, 75 వార్డులు.. బీజేపీ ఏడు డివిజన్లు, 38 వార్డుల్లో గెలుపొంది ఆ తర్వాత స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఏఐఎఫ్బీ తొమ్మిది, ఎంఐఎం ఆరు, స్వతంత్రులు తొమ్మిది, సీపీఎంకు చెందిన ఇద్దరు గెలుపొందారు. మక్తల్లోని ఆరో వార్డులో ఎన్నికలు వాయిదా పడ్డాయి. -
చేతిపురం..!
11 మున్సిపాలిటీల్లో ‘హస్తం’ హవా ఉమ్మడి పాలమూరులో గ్రామపంచాయతీ పోరులో పైచేయి సాధించిన కాంగ్రెస్ పురపాలిక ఎన్నికల్లోనూ హవా కొనసాగించింది. పదవీ కాలం ముగియని జడ్చర్ల, అచ్చంపేట మినహా మహబూబ్నగర్ కార్పొరేషన్తోపాటు మరో 18 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్, ఐదు పురపాలికల్లో (గద్వాల, నారాయణపేట, అమరచింత, దేవరకద్ర, అలంపూర్) హంగ్ ఏర్పడింది. 11 చోట్ల ‘హస్తం’ పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించింది. మహబూబ్నగర్ కార్పొరేషన్, దేవరకద్రలో మ్యాజిక్ ఫిగర్కు అడుగు దూరంలో ఉండగా.. ఈ పీఠాలనూ కై వసం చేసుకోనుంది. గత పురపాలక ఎన్నికల్లో ఎనిమిదింటిలో పూర్తి ఆధిక్యతను కనబర్చిన బీఆర్ఎస్కు ఈ సారి చేదు అనుభవమే ఎదురైంది. ఒక్క అయిజలోనే గెలుపొందింది. బీజేపీ బోణీ కూడా చేయలేక చేతులెత్తేసింది. నారాయణపేటలో ఆధిక్యతను కనబర్చినా.. మ్యాజిక్ ఫిగర్ను చేరుకోలేకపోయింది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు ఐదింటిలో హంగ్ బోల్తాపడ్డ కారు.. ఒక్క అయిజలోనే మెజార్టీ తారుమారైన బీజేపీ అంచనాలు ‘పేట’లో ఆధిక్యత.. అయినా ఊగిసలాట దేవరకద్రలో రెబల్ చేరికతో హస్తానికి లైన్క్లియర్ అలంపూర్లో బీఆర్ఎస్కు అవకాశం గద్వాలలో ఎమ్మెల్యే బండ్లకు షాకిచ్చిన ఫలితాలు ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య దోబూచులాట -
విజేత.. ఆశా కార్యకర్త
కొత్తకోట పురపాలికలో 5వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన ఆశా కార్యకర్త ముంత మంజుల విజయం సాధించారు. అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య జరిగిన పోరులో 67 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడం.. భర్త బీఆర్ఎస్ కార్యకర్త కావడంతో ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఆశా కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. – కొత్తకోట రూరల్ -
చైర్పర్సన్ అభ్యర్థులకు భంగపాటు
గద్వాల: స్థానిక మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లు విభిన్న తీర్పునిచ్చారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వకపోవడంతో హంగ్ ఏర్పడే అవకాశం ఉంది. గద్వాల మున్సిపల్ పీఠం మహిళకు రిజర్వ్ కావడంతో చైర్పర్సన్ స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలకు కష్టాలు వచ్చిపడ్డాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ తరపున చైర్పర్సన్ అభ్యర్థులుగా బరిలో దిగిన వారికి భంగపాటు ఎదురైంది. 28వ వార్డులో మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ భార్య కళావతి బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్కు చెందిన చంద్రశేఖర్ చేతిలో ఓటమి పాలయ్యారు. అదేవిధంగా 36వ వార్డులో లక్ష్మి కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్పర్సన్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీకి చెందిన కమ్మరి సునీత చేతిలో ఓటమి పాలయ్యారు. అలంపూర్ రూరల్: స్థానిక మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఇస్మాయిల్ ఓటమి పాలయ్యారు. 3వ వార్డు నుంచి పోటీ చేసిన ఇస్మాయిల్ సమీప బీఆర్ఎస్ అభ్యర్థి ఆసీఫ్ఖాన్ చేతిలో ఓటమి చవిచూశారు. -
23 ఏళ్లకే కౌన్సిల్లోకి...
వరుసగా ఐదోసారి నెగ్గి.. స్థానిక పురపాలికలోని ఆరో వార్డు నుంచి 23 ఏళ్ల పుట్టా రేణుక కాంగ్రెస్పార్టీ నుంచి పోటీచేసి గెలుపొంది కౌన్సిల్లో అడుగు పెడుతున్నారు. రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం, అనుకూలమైన రిజర్వేషన్ రావటంతో ఎన్నికల బరిలో నిలిచానని.. వార్డు ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించానని చెప్పుకొచ్చారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వార్డు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని తెలిపారు. – కల్వకుర్తి టౌన్ -
జీఎమ్మార్.. స్టార్ ‘లీడర్’
● దేవరకద్రలోని 3 మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ గెలుపు మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి (జీఎమ్మార్) స్టార్ లీడర్గా పేరు సాధించారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో దేవరకద్ర, భూత్పూర్, కొత్తకోట మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగగా.. అన్ని పీఠాలను కాంగ్రెస్ కై వసం చేసుకోనుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అంతర్గత ఒప్పందం చేసుకుని ఈ మున్సిపాల్టీలను హస్తానికి చేజిక్కకుండా రాజకీయాలు నడిపాయి. ఆయా పార్టీలకు చెందిన కొందరు నేతలు కలిసి ప్రచారం చేపట్టాయి. అయినా భూత్పూర్, కొత్తకోటలో కాంగ్రెస్ పూర్తి ఆధిక్యం సాధించింది. దేవరకద్రలో మ్యాజిక్ ఫిగర్కు అడుగుదూరంలో ఉన్నా.. ఎక్స్ అఫీషియో ఓటుతో ఆ పార్టీకే పీఠం దక్కనుండడంతో నియోజకవర్గంలోని కాంగ్రెస్శ్రేణులు ఎమ్మెల్యేను పొగడ్తలతో ముంచెత్తడంతో పాటు సంబరాల్లో మునిగారు. -
పకడ్బందీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ
గద్వాల: మున్సిపల్ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గోనుపాడు పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రంలో గురువారం అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపట్టే సిబ్బంది ఉదయం 6 గంటలకే కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్రూం ఓపెన్చేసి.. బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాలులోకి తీసుకురావాలన్నారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా చేపట్టాలన్నారు. వార్డుల వారీగా ఆయా పోలింగ్స్టేషన్ల బ్యాలెట్ బాక్సులను నిర్దేశిత టేబుల్ వద్ద ఓపెన్ చేసి.. ఆయా అభ్యర్థులకు వచ్చిన ఓట్లను 25 బ్యాలెట్ పేపర్ల చొప్పున కట్టలు కట్టి సిద్ధం చేయాలన్నారు. అదే విధంగా తిరస్కరించబడిన బ్యాలెట్ పేపర్ల విషయంలో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి రిటర్నింగ్ అధికారులు నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎవరైనా అభ్యర్థులు రీకౌంటింగ్ కోరితే నిబంధనల మేరకు వ్యవహరించాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం సీసీ నిఘాలో చేపట్టనున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం కౌంటింగ్ కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ నర్సింగ్రావు ఉన్నారు. కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ బీఎం సంతోష్ -
వడివడిగా.. మల్లన్న సన్నిధికి
అచ్చంపేట: హరహర మహాదేవ శంభో శంకర.. ఓం నమఃశివాయ.. శివాయ నమ ఓం.. అంటూ శ్రీశైలం జాతీయ రహదారి భక్తుల శివనామస్మరణతో మార్మోగుతుంది. మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా శ్రీశైలం తరలివెళ్తున్నారు. రవాణా సౌకర్యాలు ఉన్నా దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో శివనామ సంకీర్తనలు చేసుకుంటూ వేలాది మంది భక్తులు నల్లమల అటవీ ప్రాంతంలో పాదయాత్రగా కొండలు, గుట్టలు, బండరాళ్లను, ముళ్లకంపలను అడ్డు తొలగించుకుంటూ శ్రీశైలం చేరుకుంటున్నారు. ఈ ప్రయాణం శరీరానికి ఎంతో బాధ కలిగించినప్పటికీ మనస్సు మాత్రం ఆధ్యాత్మికానందంతో పులకిస్తుందని, అది ప్రత్యక్షంగా అనుభవిస్తే తెలుస్తుందని శివస్వాములు పేర్కొంటున్నారు. వందల కి.మీ.ల దూరం నుంచి ఎండను సైతం లెక్క చేయకుండా మదిలో ప్రతిధ్వనిస్తున్న శివనామస్మరణతో కై లాస ద్వారం చేరుకుంటున్నారు. గతంలో ఈఓగా పనిచేసిన శంకరరెడ్డి శివదీక్షను 1996లో ప్రారంభించి విశేష ప్రాధాన్యతను పెంపొందించేలా కృషి చేశారు. కాళ్ల నొప్పులు, పాదాలు పగలడం, బొబ్బలెక్కడం ఇవేవి లెక్కలోకి తీసుకోకుండా శ్రీశైలేశుని దర్శనం కోసం బారులు తీరుతున్నారు. భక్తిని మించిన మరే శక్తిలేదని శివదీక్షాస్వాములు స్పష్టం చేస్తున్నారు. పాదయాత్ర చేస్తున్న శివస్వాములు రాత్రివేళ మూడు, నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతూ.. అర్ధరాత్రి 2 గంటల తర్వాత తిరిగి నడక సాగిస్తున్నారు. రాత్రివేళ చలి, పగలు ఎండల్లో శివమాలధారుల పాదయాత్ర అభయారణ్యంలో ప్రతిధ్వనిస్తున్న శివనామస్మరణం నల్లమల దారిపొడవునా యాత్రికులకు దాతల చేయూత -
జలసంరక్షణ పనులకు ప్రాధాన్యం
కేటీదొడ్డి: నాబార్డు నిధులతో జలసంరక్షణ పనులు చేపట్టేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని నాబార్డు రాష్ట్ర రీజినల్ అసిస్టెంట్ మేనేజర్ సల్కన్ఖాన్, జిల్లా అభివృద్ధి అధికారి మనోహన్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని సిద్దోనిపల్లి, మల్లాపురంతండా గ్రామాల్లో నాబార్డు నిధులతో చేపట్టిన గంతిరాల వాటర్షెడ్ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాబార్డు నిధులతో ఐదేళ్లపాటు అమలు చేయనున్న ఈ ప్రాజెక్టు ద్వారా భూసార పరిరక్షణ, వర్షపునీటి సంరక్షణ, భూగర్భజలాల పెంపు తదితర పనులు చేపట్టనున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్టుతో రైతుల ఆదాయ వృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో సంస్ధ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, సీఈఓ విశ్వనాథాచారి, సర్పంచ్ పాండునాయక్, మాజీ సర్పంచ్ ఆంజనేయులు, తిమ్మప్ప పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.9,020 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు బుధవారం 397 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 9,020, కనిష్టంగా రూ. 5,089, సరాసరి రూ. 6,490 ధరలు లభించాయి. అదే విధంగా 50 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 7,369, కనిష్టంగా రూ. 3,129, సరాసరి రూ. 7349 ధరలు పలికాయి. క్వింటా ఆముదాలు రాగా.. రూ. 5,919 ధర లభించింది. నల్లమలలో ఆక్వా కల్చర్ సెంటర్ అచ్చంపేట: నల్లమలలో వంద ఎకరాల విస్తీర్ణంలో రూ.50 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోనే మూడో ఆక్వా కల్చర్ సెంటర్ ఏర్పాటు చేస్తా మని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నా రు. గురువారం అచ్చంపేట మండలం చంద్రసాగర్ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం అభివృద్ధి కార్యక్రమం, ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రూ.4 కోట్ల తో అధునాతన టెక్నాలజీతో చంద్రసాగర్లో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి చేసే చేపపిల్లలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభు త్వం మత్స్యశాఖకు రూ.3 వేల కోట్లతో బడ్జెట్ రూపొందిస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో పదేళ్లుగా చేపపిల్లల ఉత్పత్తి నిలిచిపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసే దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ ఏడాది రూ.123 కోట్లతో 88 కోట్ల చేపపిల్లలు కొనుగోలు చేసి 26 వేల చెరువుల్లో వదిలినట్లు వెల్లడించారు. అంచెలంచెలుగా రాష్ట్రంలో చేపపిల్లల కొనుగోలు తగ్గించి ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ముదిరాజ్లకు చెరువులపై పూర్తి హక్కులు కల్పించేందుకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని చెప్పారు. రాష్ట్రంలో పండుగ సాయన్న విగ్రహాల ఏర్పాటు, ముదిరాజ్ భవనాలను ప్రాధాన్యత క్రమంలో నిర్మిస్తామన్నారు. అచ్చంపేట ముదిరాజ్ భవనం నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అచ్చంపేట పాలశీతలీకరణ కేంద్రం సామర్థ్యాన్ని 30 లీటర్లకు పెంచుతామన్నారు. ముదిరాజ్లను బీసీ–ఏలో చేర్చేందుకు పోరాటం చేస్తామన్నారు. తనను అణగదొక్కే ప్రయత్నాలు ఎన్ని జరిగినా జంకలేదని.. మక్తల్లో చోటుచేసుకున్న బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య ఘటనలో తమ ప్రమేయం లేకపోయినా రాజకీయ రంగుపులిమేలా చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొడతామన్నారు. అంతకు ముందు రూ.18.21 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. -
కార్మికుల హక్కులను కాపాడుకుందాం
గద్వాలన్యూటౌన్: కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. లేబర్ కోడ్స్, వీబీజీ రామ్జీ చట్టం, జాతీయ విత్తన చట్టం, విద్యుత్ సవరణ బిల్లుల రద్దు తదితర విధానాలను నిరసిస్తూ.. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు గురువారం చేపట్టిన దేశవ్యాప్త సమ్మె జిల్లాకేంద్రంలో విజయవంతమైంది. ఈ సందర్భంగా వివిధ విభాగాల కార్మిక, రైతు సంఘాలతో పాటు విద్యుత్, బ్యాంకింగ్, ఎల్ఐసీ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సీఐటీయూ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ వద్ద నిర్వహించిన సభలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజీవ్రెడ్డి పాల్గొని మాట్లాడారు. కార్మికుల ఉపాధి, భద్రత, జీవనాధారాలను దెబ్బతీసేలా తీసుకొచ్చిన లేబర్ కోడ్స్, ఉపాది కూలీలకు నష్టం కలిగించే విబీజీ రామ్జీ చట్టం, జాతీయ విత్తన చట్టం, విద్యత్ సవరణ బిల్లుల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమాల్లో సీఐటీయూ జిల్లా అద్యక్షుడు ఉప్పేర్ నర్సింహ, కృష్ణ, కార్తీక్, గోపాల్, ప్రభాకర్, ఆశన్న, విద్యుత్ డీఈ నాగరాజు, ఈడీఈ కురుమూర్తి, రహీం, ఐసీఈయూ బ్రాంచ్ అద్యక్షుడు నర్సింగ్, ప్రధాన కార్యదర్శి రంగారావు, మల్లిఖార్జున్, రంగయ్య, యూబీఐ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు పరుశరాం, రామాచారి, రవి పాల్గొన్నారు. మన్యంకొండ ఆదాయం రూ.37.64 లక్షలు మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం హుండీ ఆదాయం రూ.37,64,907 ఆదాయం వచ్చింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం ఈ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ లెక్కింపు సాయంత్రం 7 గంటలకు సాగింది. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, ఇన్స్పెక్టర్ వీణ, ఐడీబీఐ మేనేజర్ మల్లిఖార్జున్, సత్యసాయి సమితి, మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. -
పట్టణం ఎవరికో..
మరికొన్ని గంటల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ● ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి ● అంచనాలకు అందని నడిగడ్డ ఓటరు నాడీ ● ప్రధాన పార్టీల మధ్య పోటాపోటీ ● ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్న అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఏ పార్టీ లెక్కలు ఎలా ఉన్నిప్పటికీ.. ఓటరు ఇచ్చిన తీర్పు శుక్రవారం మధ్యాహ్నానికి వెలువడనుంది. అప్పటి వరకు పార్టీల నాయకులు, అభ్యర్థులు, రాజకీయ విశ్లేషకులకు ఉత్కంఠ తప్పదు. మరికొన్ని గంటల్లో కౌన్సిలర్ అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. గద్వాల: మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో శుక్రవారం తేలిపోనుంది. పుర పోరులో నువ్వా.. నేనా అన్నట్టుగా పోటీపడిన అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా ఉంది. అయితే ఓటరు తీర్పు ఎలా ఉంటుందనే మల్లగుల్లాలు ప్రధాన పార్టీల నేతల్లో మొదలైంది. గద్వాల మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు హోరాహోరీగా పోటీపడ్డారు. అయిజ, అలంపూర్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ఽమధ్యే పోటీ కొనసాగింది. వడ్డేపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఫార్వార్డ్బ్లాక్ పార్టీల మధ్య పోటీ నెలకొంది. నాలుగు మున్సిపాలిటీల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పు స్ట్రాంగ్రూముల్లో నిక్షిప్తమై ఉంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు ఎవరికి వారే లెక్కలు వేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అనే దానిపైనే చర్చ సాగుతోంది. గద్వాల మున్సిపాలిటీలోని 37 వార్డుల్లో హోరాహోరీ పోరు నెలకొనగా.. చాలా వరకు సైలెంట్ ఓటింగ్ జరిగింది. ఓటువేసిన అనంతరం ఎవరికి వేశారో కూడా అంతర్గత చర్చలో బయటపెట్టేందుకు ఆసక్తి చూపకపోవడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గతానికి భిన్నంగా ఈసారి పట్టణ ఓటర్లను ఆకర్షించడానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు వివిధ రకాల తాయిళాలు, లిక్కర్, నగదు పంపిణీ విచ్చలవిడిగా చేపట్టినప్పటికీ.. ఓటరు నాడీని పసిగట్టలేదు. సర్వే ఏజెన్సీలు, మీడియా గ్రూపుల ద్వారా సమాచారాన్ని సేకరించి.. ఫలితాలపై విశ్లేషణలు చేస్తుస్తున్నారు. మరోవైపు వార్డుల్లో పోలైన ఓట్లు.. అందులో కులాలు, మతాల వారీగా లెక్కలు వేసుకుంటూ ఫలితాలను అంచనా వేయడంలో తలమునకలయ్యారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి ఒకింత అనుకూలత ఉన్నప్పటికీ.. చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకునేందుకు అవసరమైన మ్యాజిక్ సంఖ్య దక్కేనా అనే మీమాంసలో విశ్లేషణలు సాగుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ సైతం గట్టిపోటీ ఇచ్చామని.. వార్డుల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. ఎన్నికల్లో తామే కింగ్ మేకర్ కానున్నామని అంతర్గత విశ్లేషణలు చేసుకుంటున్నారు. 14 వార్డుల్లో రెండు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉండగా.. మరో 20 వార్డుల్లో త్రిముఖ పోటీ నెలకొంది. అదే విధంగా మరో మూడు వార్డుల్లో స్వతంత్రులు సైతం ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇచ్చారు. ● అలంపూర్, అయిజలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు పోటాపోటీగా తలపడ్డాయి. ఇక్కడ కూడా తమకే చైర్మన్ పీఠం దక్కుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. వార్డుల వారీగా పడిన ఓట్లను బేరీజు వేసుకుంటూ.. గతంలో వచ్చిన ఫలితాలపై విశ్లేషణలు చేసుకుంటున్నారు. వడ్డేపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఫార్వార్డ్బ్లాక్ పార్టీల మధ్య పోటీ సాగింది. -
బీజేపీ అభ్యర్థి కుటుంబానికి కేంద్రమంత్రి పరామర్శ
● రూ.10 లక్షల ఆర్థిక సాయం చెక్కు అందజేత మక్తల్/మాగనూర్: మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప కుటుంబాన్ని బుధవారం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పరామర్శించారు. మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన మహదేవప్ప అధికార పార్టీ నాయకుల వేధింపుల నెపంతో మంగళవారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ తరపున బాధిత కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 6వ వార్డులో ఈ రోజు పండుగ వాతావరణం ఉండాల్సిన సమయంలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం అన్నారు. కొంతకాలంగా మక్తల్ నుంచి మొదలుపెడితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల బరిలో నిల్చున్న మహిళా అభ్యర్థుల భర్తలను, యువకులను బెదిరించి పోలీస్టేషన్కు పిలిపించి కేసులు నమోదు చేయిస్తున్నారని, భూ రికార్డుల్లో మార్పులు, మధ్య తరగతి కుటుంబాల్లో రేషన్ కార్డులను తొలగిస్తామని భయబ్రాంతులకు గురిచేస్తూ ఉన్నారని దుయ్యబట్టారు. ఇతర పార్టీల అభ్యర్థులు ఎన్నికల్లో విత్డ్రా చేసుకుంటే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఆశ చూపిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఈ విధంగా జరగడం, అందరిని బెదిరించడం చాలా దురదృష్టకరం అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరిరోజు ర్యాలీలో కూడా పాల్గొని ఎంపీ డీకే అరుణతో గెలుపునకు చేరువలో ఉన్నానని చెప్పిన మహదేవప్ప అకాల మృతిచెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ, నాయకులు నాగురావు నామోజీ, కొండయ్య పాల్గొన్నారు. -
తీర్పు రిజర్వ్..
● 19 పురపాలికల్లో మొత్తంగా 75 శాతం పోలింగ్ ● గద్వాల జిల్లాలో అత్యధికం.. మహబూబ్నగర్లో అత్యల్పం ● అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు ● రేపు ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫలితాల వెల్లడి సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : ఉమ్మడి పాలమూరులో పురపాలక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఐదు జిల్లాల పరిధిలోని ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో మొత్తం 373 డివిజన్లు/వార్డు స్థానాలకు బుధవారం పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య పోలింగ్ నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభమైనప్పటికీ.. 11 గంటల తర్వాతే ఓటర్ల రాక ఊపందుకుంది. నిర్దేశిత సమయం సాయంత్రం ఐదు గంటల వరకు మొత్తంగా 75 శాతం పోలింగ్ నమోదైంది. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. ఓటరు తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో రిజర్వ్ కాగా.. శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు. 14న మున్సిపాలిటీల్లో చైర్మన్/చైర్పర్సన్, వైస్ చైర్లన్లు.. కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత 16న పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. మహబూబ్నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఒక కార్పొరేషన్, 20 మున్సిపాలిటీలు ఉన్నాయి. పదవీ కాలం ముగియని జడ్చర్ల, అచ్చంపేట మినహా మిగిలిన పురపాలికలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో మహబూబ్నగర్, అలంపూర్లో ఒక్కో వార్డు చొప్పున ఏకగ్రీవమయ్యాయి. మక్తల్ ఆరోవార్డు బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో అక్కడ పోలింగ్ వాయిదా పడింది. మొత్తంగా 59 డివిజన్లు, 314 వార్డుల్లో జరిగిన పోలింగ్లో 6,12,827 మంది ఓటర్లకు గాను 4,53,090 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో అత్యధికంగా 78.22 శాతం పోలింగ్ నమోదు కాగా.. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో అత్యల్పంగా 67.73 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కార్పొరేషన్గా ఆవిర్భవించిన తర్వాత తొలి సారిగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో నగర ఓటర్లు ఓటెత్తుతారని అందరూ భావించారు. ఇందుకు విరుద్ధంగా అత్యల్పంగా పోలింగ్ నమోదు కావడంతో ఈ ప్రభావం ఎవరిపై పడుతోందని రాజకీయ పార్టీల నేతలు డివిజన్ల వారీగా లెక్కల్లో మునిగారు. నాగర్కర్నూల్ 77.64 శాతంతో రెండు, వనపర్తి 75.56 శాతంతో మూడు, నారాయణపేట 74.04 శాతంతో నాలుగో స్థానంలో నిలిచాయి. పట్టణ మహిళల వెనుకంజ.. ఉమ్మడి జిల్లాలోని పోలింగ్ జరిగిన పురపాలికల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నా.. ఓటు హక్కు వినియోగంలో వారే వెనుకబడ్డారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మహిళా ఓటర్లు పోటెత్తగా.. పుర పోరుకు వచ్చేసరికి అతివలు ఓటుకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మహబూబ్గనర్, నాగర్కర్నూల్ జిల్లాలో సరాసరిగా పురుషులు, మహిళల ఓటింగ్ శాతం సమానంగా ఉండగా.. మిగతా జిల్లాల్లో ఒక్క శాతానికి పైగానే తేడా ఉంది.మున్సిపాలిటీల వారీగా పరిశీలిస్తే మహబూబ్నగర్, దేవరకద్ర, వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, అమరచింత, ఆత్మకూరు, గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి, నారాయణపేట, మక్తల్, మద్దూర్, కొల్లాపూర్లో మహళలు ఓటుకు దూరంగా ఉన్నారు. భూత్పూర్, కోస్గి, నాగర్కర్నూల్, కల్వకుర్తిలో మాత్రమే అతివల ఓటింగ్ శాతం పురుషుల కంటే కొంత మేర మెరుగ్గా ఉంది. 35 మందిలో 16 మంది.. ఉమ్మడి జిల్లాలోని ఎన్నికలు జరిగిన పుర పాలికల్లో ఇతరులు ఓట్లరు 35 మంది ఉన్నారు. వీరిలో 16 మంది మాత్రమే తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారినట్లు తెలుస్తోంది. పురపాలికల్లో డివిజన్లు/వార్డుల వారీగా పలువురు అభ్యర్థులు ఓటుకొక రేటు చొప్పున వెదజల్లినట్లు సమాచారం. పార్టీల వారీగా ఫండ్ రాగా.. ఒక్కో వార్డులో ఆయా అభ్యర్థులు ఒక్క ఓటుకు రూ.5 వేల చొప్పున పంచినట్లు తెలిసింది. ఈ క్రమంలో అప్పటివరకు గెలుపు అంచనాల్లో మునిగిన అభ్యర్థులు తెల్లారేసరికి పరిస్థితులు మారడంతో నోరెళ్లబెట్టినట్లు తెలుస్తోంది. ప్రధానం మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు దేవరకద్ర, భూత్పూర్, మక్తల్, వనపర్తి తదితర మున్సిపాలిటీల్లో అధికార, విపక్ష పార్టీల నేతలు రాత్రికిరాత్రే చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతుండగా.. పలువురు అభ్యర్థులు బెంబేలెత్తుతున్నారు. -
75% మున్సిపాలిటీలు గెల్చుకుంటాం
కొల్లాపూర్: రాష్ట్రవ్యాప్తంగా 75 శాతం మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ గెల్చుకుంటుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం కొల్లాపూర్లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆ మాట్లాడుతూ కొల్లాపూర్ మున్సిపాలిటీని క్లీన్స్వీప్ చేస్తామన్నారు. గత పాలకుల అవినీతికి ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజామోదం లభిస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలో కాంగ్రెస్దే పై చేయిగా నిలుస్తుందన్నారు. -
అంతుచిక్కని ఓటరు నాడీ
● ఏరులై పారిన లిక్కర్, విచ్చలవిడిగా నగదు పంపిణీ ● స్పష్టత లేని పోలింగ్ సరళి ● మల్లగుళ్లాలు పడుతున్న ప్రధాన పార్టీలు గద్వాల: మున్సిపాలిటీలోని 37 వార్డుల్లో జరిగిన ఎన్నికలు గతానికి భిన్నంగా జరిగాయి. ఈసారి అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు మూడు కూడా తమకు పట్టున్న వార్డుల్లో నువ్వానేనా అన్న తరహాలో పోటీపడ్డాయి. ఈ క్రమంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా ఓటర్లను ఆకర్షించుకునేందుకు వివిధ రకాల తాయిళాలు ఇచ్చారు. చికెన్, మిఠాయి డబ్బాలు, చీరలతో పాటు ఓటుకు గరిష్టంగా కొన్ని వార్డుల్లో రూ.5వేల వరకు, కనిష్టంగా రూ.వెయ్యి వరకు నగదు పంపిణీ చేశారు. అదే విధంగా యువత, కమ్యూనిటీ సభ్యులు, వృద్ధుల సంఘం ఇలా అన్ని గ్రూపులను లక్ష్యంగా చేసుకుని లిక్కర్ను ఏరులై పారించారు. ఈ ఎన్నికల్లో మూడు పార్టీలు కలుపుకొని రూ.15 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు అనాధికారిక అంచనా. పెద్ద ఎత్తున తాయిళాలు పంచినా ఓటరు నాడీ గుర్తించడంలో పార్టీలన్నీ గందరగోళంలో పడ్డాయి. బాహాటంగా ఎవరికి వారు తమకు ఇన్ని సీట్లు వస్తాయి అని దబాయించి చెబుతున్నప్పట్టికీ మనసులో మాత్రం ఎక్కడో అనుమానం నెలకొంది. కొంత మంది నాయకులైతే అరే ఇంత పెద్ద మొత్తంలో నగదు, లిక్కర్, స్వీట్లు, చికెన్ పంచి పెట్టినా ఎవరికి ఓటు వేశారో తెలియడం లేదు.. ఎంతైనా పట్టణ ఓటర్లు.. పట్టణ ఓటర్లే అంటూ నిట్టూర్పుతున్నారు. మరి కొంత మంది నాయకులు టెన్షన్ తట్టుకోవాంటే మందు డోస్ పెంచాల్సిందే అంటూ మత్తులో జారుకుంటున్నారు. వీరి ఉత్కంఠకు తెరదించాలంటే ఈ నెల 13వ తేదీ కౌంటింగ్ వరకు వేచి చూడాల్సిందే. -
జములమ్మ క్షేత్రం.. భక్తజన సంద్రం
గద్వాలన్యూటౌన్: నడిగడ్డ ప్రాంతంలో ప్రసిద్దిగాంచిన జములమ్మ క్షేత్రానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లో బారులు తీరారు. 10 గంటల నుంచి భక్తుల రద్దీ పెరిగింది. 12గంటలకు ఆలయ ప్రాంగణ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. డప్పుల మోతలు, మంగళ వాయిద్యాలు, పూనకాలతో ఆలయ పరిసరాల్లో పండగ వాతావరణం కనిపించింది. భక్తులు అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తమ కుటుంబాలను చల్లంగా చూడమ్మా.. జములమ్మ తల్లి అంటూ భక్తిశ్రద్ధలతో వేడుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈఓ పురందర్కుమార్ పర్యవేక్షణలో సిబ్బంది చర్యలు తీసుకున్నారు. -
నిర్భయంగా ఓటు వేయండి
రాజోళి: ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అదనపు ఎస్పీ శంకర్ అన్నారు. వడ్డేపల్లి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో మంగళవారం ఆయన పర్యటించి స్థానికులతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పా ట్లు చేసినట్లు చెప్పారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఓటరు తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎరువులు అధిక ధరకు విక్రయిస్తే చర్యలు గద్వాల(మల్దకల్): ఫర్టిలైజర్ దుకాణాల్లో ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప అన్నారు మంగళవారం మల్దకల్, ఎల్కూర్లోని ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు ఎరువుల స్టాక్ను పరిశీలించారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ.. ఫర్టిలైజర్ దుకాణాల్లో ఎరువులు, విత్తనాలు కొనుగోలుచేసే రైతులకు తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని డీలర్లకు సూచించారు. ఎరువుల విక్రయాల్లో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. అనంతరం వివిధ పంటలను ఆయన పరిశీలించి.. రైతులకు పలు సూచనలు చేశారు. డీఏఓ వెంట ఏఓ రాజశేఖర్ ఉన్నారు. వేరుశనగ క్వింటా రూ.8,506 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు మంగళవారం 255 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 8,506, కనిష్టంగా రూ. 4,200, సరాసరి రూ. 5,919 ధర పలికింది. అదే విధంగా 64 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 7,489, కనిష్టంగా రూ. 3,029, సరాసరి రూ. 7489 ధరలు వచ్చాయి. 2 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. రూ. 5,939 ధర పలికింది. -
ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం
గద్వాలన్యూటౌన్/ఉండవెల్లి: రైల్వే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాస్తవ్ అన్నారు. మంగళవారం ప్రత్యేక రైలులో డీఆర్ఎం సంతోష్కుమార్ వర్మ, ఇతర అధికారులతో కలిసి గద్వాల, జోగుళాంబ రైల్వేస్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా గద్వాల రైల్వేస్టేషన్లో అమృత్భారత్ స్కీం కింద రూ. 42.82 కోట్లతో చేపడుతున్న స్టేషన్ ప్లాట్ఫాం విస్తీర్ణం, ఆర్చీ, వెహికిల్ పార్కింగ్, రోడ్ల పనులను ఆయన పరిశీలించారు. అనంతరం కృష్ణా రైల్వే బ్రిడ్జి వద్ద భద్రతను తనిఖీ చేశారు. ట్రాక్మేన్లతో వివరాలు తెలుసుకున్నారు. అదే విధంగా ఆరేపల్లి లెవెల్ క్రాసింగ్ వద్ద తనిఖీ నిర్వహించారు. జోగుళాంబ రైల్వే హాల్ట్లో ప్రయాణికులు కూర్చోవడానికి సరిపడా బేంచీలు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీటి వసతి, నీడ సౌకర్యం కల్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం రైల్వే హాల్ట్ డిజైన్, చేపట్టిన నిర్మాణ పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. డబుల్ ట్రాక్ పనుల పురోగతిపై ఆరా తీశారు. హైదరాబాద్వైపు ఉన్న ఫ్లాట్ఫాంపై నీడ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. కాగా, జోగుళాంబ హాల్ట్ వద్ద హైలెవల్ ఫ్లాట్ఫాం ఏర్పాటు చేయించాలని ఎంపీ మల్లు రవితో స్థానిక నాయకులు ఫోన్లో మాట్లాడించగా.. పరిశీలిస్తామని ఆయన తెలిపారు. కాగా, గ్యాంగ్మేన్లను నైట్ పెట్రోలింగ్ మ్యాన్లుగా ఒక్కరినే పంపిస్తున్నారని.. ఇద్దరిని పంపించాలని, సిగ్నల్ అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్లలో ఖాళీ పోస్టులను భర్తీ చేయా లని కోరుతూ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ అసిస్టెంట్ డివిజనల్ సెక్రెటరీ రైల్వే శంకర్ జీఎంకు వినతిప్రతం అందించారు. గద్వాల డీఆర్డీ సిబ్బందికి కొత్త క్వార్టర్స్ కేటాయించాలని.. గద్వా ల, కర్నూలు రైల్వే క్వార్టర్స్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కోరారు. -
ప్రధానంగా అమాత్యుల ఇలాకాల్లోనే..
ఉమ్మడి పాలమూరుకు సంబంధించి ప్రధానంగా అమాత్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్, మక్తల్, కొల్లాపూర్ నియోజకవర్గాలతోపాటు మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో వికృత రాజకీయ పోకడలు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాలో పల్లె పోరులో కాంగ్రెస్ పైచేయిగా నిలిచినప్పటికీ, బీఆర్ఎస్, బీజేపీ సత్తా చాటడంతో ‘అధికార’ నాయకుల వైఖరిలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. పురంలో గెలుపే లక్ష్యంగా దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు ఒక్కదాని వెనుక ఒకటిగా చోటుచేసుకుంటున్న పలు ఘటనలే ఉదాహరణగా నిలుస్తున్నాయని సీనియర్ రాజకీయ నేతలు అంచనా వేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పాలమూరు వ్యాప్తంగా మక్తల్ మంటలు చెలరేగుతున్నాయి. పుర ఎన్నికల వేళ ఆ మున్సిపాలిటీలోని ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య ఉమ్మడి జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతోపాటు ఇటీవల ముగిసిన గ్రామ పంచాయతీ, ఆ తర్వాత మున్సిపల్ పోరు క్రమంలో చోటుచేసుకున్న పలు ఘటనలు తాజాగా చర్చనీయాంశంగా మారాయి. ఖద్దరు చేతిలో ఖాకీలు బంధీలయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకి చెందిన అభ్యర్థులకు పరోక్షంగా మద్దతు ఇస్తూ.. వారి ప్రత్యర్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న అలంపూర్ నియోజకవర్గంలోని అలంపూర్, అయిజ, వడ్డేపల్లిలో నెలకొన్నట్లు సమాచారం. మక్తల్లో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్యతో రాజకీయ దుమారం తెరపైకి కోస్గిలో కౌన్సిలర్ ఆశావహులపై బెదిరింపుల పర్వం మహబూబ్నగర్లో పోలీసుల డేగకన్నుతో ప్రతిపక్ష అభ్యర్థుల కట్టడి కొల్లాపూర్, అలంపూర్లో సైతం ఇవే పరిస్థితులు ఎన్నికల కమిషన్కు అందిన ఫిర్యాదు -
రండి ఓటేద్దాం
నేడే పురపాలిక ఎన్నికల పోలింగ్ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ /సాక్షి, నాగర్కర్నూల్: పురపాలిక పోరుకు వేళయింది. పది రోజుల నుంచి తలపడిన అభ్యర్థులను ఓటర్లు ఆశీర్వదించే తరుణం ఆసన్నమైంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కానుండగా, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. నిర్ణీత సమయంలో లోగా పోలింగ్ కేంద్రంలో వేచి ఉన్న ఓటర్లందరికీ ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు మరో 18 మున్సిపాలిటీలకు ఎన్నికల నిర్వహణ చేపట్టారు. ఇందుకోసం అవసరమైన బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రితో సిబ్బంది మంగళవారం సాయంత్రానికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. బరిలో 1,573 మంది అభ్యర్థులు.. ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్, 20 మున్సిపాలిటీలు ఉండగా.. అచ్చంపేట, జడ్చర్ల పురపాలికల్లో ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన వాటిలో మొత్తం 376 వార్డులు, డివిజన్లు ఉండగా.. మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 58వ వార్డులో కాంగ్రెస్కు చెందిన రమాదేవి, అలంపూర్ మున్సిపాలిటీలోని పదో వార్డు కౌన్సిలర్గా విక్రం (బీఆర్ఎస్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో 374 వార్డుల్లో 1,573 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. మక్తల్లోని 6వ వార్డులో బీజేపీకి చెందిన మహాదేవప్ప ఆత్మహత్య చేసుకోవడంతో చివరి నిమిషంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పలుచోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పోటీ తీవ్రత పెరిగింది. అత్యధికంగా మహబూబ్నగర్ కార్పొరేషన్లో 347 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. అత్యల్పంగా అలంపూర్లో 36 మంది పోటీ చేస్తున్నారు. దేవరకద్ర, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో 40 మంది చొప్పున అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బ్యాలెట్ పేపర్లలో రాజకీయ పార్టీల గుర్తులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థుల గుర్తులను ముద్రించారు. ఎన్నికల సమయంలో తప్పుల సవరణకు అవకాశం లేకపోవడంతో ముందు జాగ్రత్తగా బ్యాలెట్ పేపర్లను వివిధ దశల్లో అధికారులు నిశితంగా పరిశీలించారు. ● ఉమ్మడి జిల్లాలో 376 వార్డుల్లో 6,18,516 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3,03,793 మంది, మహిళలు 3,14,688 మంది, ఇతరులు 35 మంది ఉన్నారు. వీరి కోసం 971 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచిసాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ మహబూబ్నగర్ 58వ డివిజన్,అలంపూర్ 10వ వార్డు ఏకగ్రీవం బీజేపీ అభ్యర్థి మృతితోమక్తల్ 6వ వార్డులో పోలింగ్ వాయిదా మిగిలిన 373 వార్డులు/డివిజన్లలో 1,570 మంది అభ్యర్థులు బరిలో.. పోలింగ్కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా నిశిత పరిశీలన అన్ని కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహణ.. మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్న అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్కాస్టింగ్ నిర్వహణ చేపట్టారు. పోలింగ్ కేంద్రాల నుంచే వెబ్కాస్టింగ్ ద్వారా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఓటింగ్ను పర్యవేక్షించనున్నారు. ఒక్కో వార్డుకు ఒక్కో పోలింగ్కేంద్రాన్ని ఏర్పాటుచేయగా, ఒక్కో కేంద్రంలో ఒక బ్యాలెట్బాక్సును ఏర్పాటుచేశారు. ఒక్కో పోలింగ్కేంద్రంలో కనీసం ఐదుగురు చొప్పున ఎన్నికల సిబ్బంది విధుల్లో పాలుపంచుకోనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం వెంటనే బ్యాలెట్ బాక్సులను ఆయా మున్సిపాలిటీ కేంద్రాల్లోని స్ట్రాంగ్రూం వద్దకు తరలించనున్నారు. ఈనెల 11 మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, కౌంటింగ్ ఉదయం 8 గంటల నుంచే ప్రారంభం కానుంది. -
మక్తల్లో హై‘టెన్షన్’..!
● మంత్రి వాకిటి ఇలాకాలో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో కలకలం ● పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత.. 6వ వార్డులో ఎన్నిక వాయిదా ● నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తాం: మంత్రి వాకిటి ● పోలీసులపై చర్యలు తీసుకోవాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ● బెదిరింపులకు భయపడే ఆత్మహత్య: ఎంపీ డీకే అరుణ – మక్తల్/నారాయణపేట మహాదేవప్ప ఇంటి వద్ద గుమ్మికూడిన ప్రజలు వివరాలు IIలో -
నేటి మంత్రం.. చీలిక తంత్రం
గద్వాల: జిల్లాకేంద్రలోని పలు వార్డుల్లో పార్టీలు ప్రత్యర్థి జోరును నిలువరించేందుకు అతనికి పడే ఓట్లలో చీలిక తేవడంపైనే దృష్టి సారిస్తున్నాయి. గడిచిన అనేక ఎన్నికల్లో గద్వాలలోని కొన్ని వార్డుల్లో చీలిక మంత్రం బాగా పనిచేసి అభ్యర్థులను విజయ పథంలో నడిపింది. ప్రస్తుతం అదే సూత్రాన్ని పాటించి గెలుపు సొంతం చేసుకోవాలని నాయకులు పావులు కదుపుతున్నారు. ప్రధాన ప్రత్యర్థికి పడే ఓట్లను చీల్చగలిగే సత్తా ఉన్న అభ్యర్థుల పంట పండుతోంది. సదరు అభ్యర్థి తనకు ప్రధాన పోటీ కాదని భావిస్తే విస్తృతంగా పర్యటించి వీలైనన్ని ఎక్కువ ఓట్లు పొందాలని నేతలు ఆశీర్వదిస్తున్నారు. ఇందుకోసం అవసరమైతే ధనంతో సహా అన్ని రకాల సహాయ సహకారాలిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో చైర్మన్ స్థానానికే పరిమితమైన ఈ మంత్రాంగం ఈ ఎన్నికల్లో కొన్ని వార్డులోనూ అమలవుతోంది. తమకు వచ్చే ఓట్లు ఎన్ని అనే అంశం కంటే మూడో అభ్యర్థి తన ప్రధాన ప్రత్యర్థి ఓట్లలో ఎన్నింటిని చీల్చగలరనే అంశానికే నేతలు ప్రాధాన్యమిస్తున్నారు. పట్టణంలో పోటీ తీవ్రంగా ఉన్న వార్డుల్లో ప్రత్యర్థుల ఓటు బ్యాంకుకు గండికొట్టేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. గద్వాలలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యే సాగుతోందని భావిస్తున్నారు. రెండు, మూడు వార్డులలో ఎంఐఎం, సీపీఐ, స్వతంత్రులు తాము కూడా ప్రధాన రేసులోనే ఉన్నామని చెబుతున్నా.. వీటిని ఓట్లు చీల్చే పార్టీలుగానే ప్రధాన పక్షాలు భావిస్తున్నాయి. కొన్నిచోట్ల బీజేపీ, ఎంఐఎం, స్వతంత్రులు రోజురోజుకూ బలపడుతుండటం అధికార, ప్రతిపక్షానికి కంగారు పుట్టిస్తోన్నాయి. అభ్యర్థుల మధ్య పోటాపోటీ ఉన్నా వార్డుల్లో ఇతర పార్టీల అభ్యర్థులు వీలైనన్ని ఎక్కువ స్థాయిలో ఓట్లను పొదగలిగితే తమకు ఢోకా ఉండదని కాంగ్రెస్ ధీమాగా ఉంది. అదే తీరును బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తోంది. ప్రత్యర్థి పార్టీలు మైనార్టీల ఓట్లను ఎక్కువగా చీల్చకుండా కాంగ్రెస్, తన పాత ఓట్లకు కాంగ్రెస్ అభ్యర్థులు గండికొట్టకుండా బీఆర్ఎస్ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. చాలా వార్డుల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓట్ల చీలికే నిర్ణయించనుందనేది స్పష్టమవుతోంది. రెండు వార్డులు మినహా మిగిలిన ప్రతి వార్డులో 1,500– 1,800 ఓట్లకు మించిలేవు. ఈసారి ఎవరు గెలిచినా కొన్ని వార్డుల్లో మెజారిటీ వంద ఓట్లకు మించకపోవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. చాలా వార్డుల్లో చీలిక ఓట్లు కొద్దిగా ఉన్నా ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి. చీలిక ఓట్లు తమకే అనుకూలిస్తాయని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి చీలిక ఓట్లే ఫలితాన్ని శాసించబోతున్నాయి. గద్వాలలో త్రిముఖ, చతుర్ముఖ పోటీ తో రాజకీయం రసవత్తరంగా మారింది. ఓట్లు చీల్చడానికే కొన్ని పార్టీలు అభ్యర్థులను రంగంలోకి దింపాయి. ఈ పోటీలో తాము ఓట్లు చీల్చడ మే కాకుండా గెలిచి నిరూపిస్తామని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు. ప్రధాన పార్టీలను ఆశ ల పల్లకీ ఎక్కిస్తున్న చీలిక ఓట్లు ఈసారి ఎవరికి తీపి అనుభవాన్ని పంచునున్నాయో వేచిచూడాలి. -
అభ్యసనా సామర్థ్యాల పెంపే లక్ష్యం
ఎర్రవల్లి: ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాన్ని పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఫ్యాకల్టీ సభ్యుడు డాక్టర్ జగదీశ్వర్ అన్నారు. సోమవారం ఆయన మండలంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను సందర్శించారు. ముందుగా కొండపేట, ఎర్రవల్లి బెటాలియన్, ప్రాథమిక పాఠశాలలు, సరస్వతి, సాయుధ చైతన్య ప్రైవేట్ పాఠశాలలను సందర్శించి పునాది అభ్యాసన అధ్యయనం కార్యక్రమాల అమలును పరిశీలించారు. ముఖ్యంగా 3వ తరగతి విద్యార్థుల ఎఫ్ఎల్ఎస్ సన్నద్ధత, మాక్ టెస్టుల నిర్వహణ, ఐటెం బ్యాంక్ సాధన, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. అలాగే వివిధ మాధ్యమాల్లో విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించి ఉపాధ్యాయులకు కీలక సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎఫ్ఎల్ఎస్కు పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉండాలన్నారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా నమూనా పరీక్షలు నిర్వహించాలని, దీనికి అవసరమైన అన్ని రికార్డులను సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర బృందాల సందర్శన అనంతరం పాఠశాలల్లో రూపొందించిన నివేదికలను ఈ నెల 13లోగా రాష్ట్ర కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎంఓ మైఖేల్, జిల్లా సూపరింటెండెంట్ వీరశేఖర్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఖాజా, సీఆర్పీ రాణి, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోండి
గద్వాల: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అక్రమాలు, అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకునేలా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఆయన ఎస్పీ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా పూర్తి చేశామని, అదేతరహాలో మున్సిపల్ ఎన్నికలు సైతం ఎలాంటి ప్రశాంతంగా నిర్వహించేలా అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ సామగ్రి తరలింపు సమయంలో పూర్తిస్థాయి బందోబస్తు కల్పించాలన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం పోలింగ్ బాక్సులు డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు చేరే వరకు భద్రతా ఏర్పాట్లు కొనసాగించాలన్నారు. ప్రతిరూట్ మొబైల్కు హెడ్కానిస్టేబుల్ ఇన్చార్జిగా ఉంటారని, పోలింగ్ కేంద్రాల వద్ద మొబైల్ ఫోన్లు, మద్యం, ప్రచార సామగ్రి, ఆయుధాలు తీసుకురాకుండా అవసరమైన కఠిన చర్యలు చేపట్టాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, నగదు, మద్యం వంటివి పంపిణీ జరగకుండా నిరంతరం నిఘా ఉంచాలన్నారు. అలాగే సోషల్ మీడియాలో పుకార్లపై పర్యవేక్షణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. డ్రై డే సందర్భంగా సోమవారం సాయంత్రం 5 నుంచి గురువారం ఉదయం వరకు, అలాగే కౌంటింగ్ డే రోజు 13న మద్యం దుకాణాలు మూసివేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఏఎస్పీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక ప్రలోభాల వంతు
ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం గద్వాల: మున్సిపల్ ఎన్నికల్లో ప్రచార పర్వం ముగియగా.. ఇక చివరి అస్త్రంగా ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు ప్రలోభాలకు తెర లేపారు. గత పదిరోజులుగా పాటలు, ప్రసంగాలతో ప్రచారాన్ని హోరెత్తించిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. పెద్దసంఖ్యలో జనం, డీజే చప్పుళ్లు, మంది మార్బలంతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించగా.. సోమవారం సాయంత్రం 5 గంటల కల్లా పట్టణాల్లో నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. బుధవారమే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఎన్నికలకు ఇంకా కొద్ది గంటలే మిగిలి ఉండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. సోమవారం సాయంత్రానికి ప్రచారం పర్వం ముగియగా.. అభ్యర్థులు పెద్దఎత్తున ప్రలోభాలకు తెరలేపారు. వారంరోజుల పాటు విరామం లేకుండా ప్రచార హోరు సాగించారు. పోలింగ్ ప్రక్రియకు 48 గంటల ముందు ప్రచారం ఆపేయాలనే ఎన్నికల సంఘం నియమావళి మేరకు అన్ని పార్టీల అభ్యర్థులు సోమవారం సాయంత్రం 5 గంటలకే ప్రచారం ఆపేశారు. మైకులు, పాటలు కూడా మూగబోగా.. మరోవైపు మద్యం దుకాణాలకు తాళాలు పడ్డాయి. కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన బీఫాంల వివాదం సద్దుమణగలేదు. సరిత వర్గానికి చెందిన వారు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచి ప్రచారం చేశారు. అదే క్రమంలో తనకు ఏడు బీఫాంలు ఇస్తానని ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆరోపిస్తూ డీసీసీ అధ్యక్షుడు రాజీవ్రెడ్డిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా.. పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్, ఎంపీ మల్లురవికి సరిత వర్గానికి చెందినవారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేస్తూ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వీటన్నింటిపై స్పందించిన మల్లురవి విచారణ జరిపి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లావ్యాప్తంగా నాలుగు మున్సిపాలిటీలలో పోటీపడ్డ అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ప్రధానంగా గద్వాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి వర్గీయులు, బీఆర్ఎస్, బీజేపీల నుంచి అభ్యర్థులు పోటీలో నిల్చున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నుంచి పోటీచేస్తున్న అభ్యర్థుల గెలుపును ఎమ్మెల్యే బండ్ల తన భుజస్కంధాలపై వేసుకుని 37 వార్డులలో సుడిగాలి పర్యటన చేపడుతూ.. మరోవైపు కులాలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, కాలనీ సంఘాలతో ప్రత్యేకంగా సమ్మేళనాలు నిర్వహిస్తూ ప్రచారం సాగించారు. ఈ క్రమంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన మోసపూరిత మాటలను నమ్మి మోసపోవద్దని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్కేశవ్, ఆంజనేయగౌడ్, బాసు హన్మంతు పార్టీ ప్రచార బాధ్యతలు స్వీరించి అభ్యర్థుల గెలుపు కోసం వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలను ఓట్లడిగారు. ప్రధానంగా బీఎస్ కేశవ్ గతంలో తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి మున్సిపల్ చైర్మన్గా ఉన్నానని అప్పుడే గద్వాల మున్సిపాలిటీ పెద్దఎత్తున అభివృద్ధి చెందినట్లు ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఓట్లేసిన ప్రజలను నట్టేట ముంచిందని.. మరోసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మోసం పోవడం ఖాయమని ప్రజలకు వివరించారు. ఈసారి తనపై నమ్మకం ఉంచి బీఆర్ఎస్ పార్టీకి చైర్మన్ పీఠం కట్టబెడితే గద్వాల పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటానని భరోసానిచ్చారు. అలాగే ఆంజనేయగౌడ్, బాసు హన్మంతు వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహించారు. బీజేపీ నుంచి మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ నేతృత్వంలో ప్రచార పర్వం సాగింది. చాలాకాలం తర్వాత మాజీ ఎమ్మెల్యే డీకే భరతసింహారెడ్డి వార్డులలో పర్యటిస్తూ ప్రజలను ఓట్లు అడిగారు. గతంలో తాను, తన భార్య చేసిన అభివృద్ధి తప్పితే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి గద్వాలకు చేసిన అభివృద్ధి ఏమిలేదని ఆరోపణలు చేశారు. గద్వాల పట్టణం అభివృద్ధి చెందాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రచారం ముగియడానికి ఒకరోజు ముందు బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభ నిర్వహించగా.. సభలో పాల్గొన్న ఎంపీ డీకే అరుణ ప్రత్యర్థులపై విమర్శనస్త్రాలు సంధించారు. రాజకీయ పార్టీల ప్రచారపర్వం ఇలా ఉంటే మరోవైపు బుధవారం జరిగే పోలింగ్ ప్రక్రియకు సంబంధించి కలెక్టర్ బీఎం సంతోష్ అన్ని రకాల ఏర్పాట్లు, సిబ్బందికి విధుల కేటాయింపులు వంటివి పూర్తి చేసి సిద్ధం చేశారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎస్పీ శ్రీనివాసరావు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సివిల్, ఆర్మ్డ్ పోలీసు బృందాలు ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేపడుతూ పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా చేసేలా ఏర్పాట్లు చేశారు. పోటీచేసే అభ్యర్థులు సాయంత్రం 5 గంటలకే ప్రచారాన్ని ముగించగా, మరోవైపు మద్యందుకాణాలకు సైతం తాళాలు పడ్డాయి. జిల్లాలోని పురపాలికల్లో వారంపాటు హోరెత్తిన మైకులు నేతల మాటల తూటాలు, మద్యం దుకాణాలకు తాళాలు ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు మద్యం, డబ్బులు రెడీ గెలుపుపై ఎవరి ధీమా వారిదే.. రేపే పుర సమరం -
పకడ్బందీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ
గద్వాల: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కీలకమైనదని, ఇందులో ఎలాంటి తప్పిదాలకు చోటులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో కౌంటింగ్ ప్రక్రియపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. కౌంటింగ్ నిర్వహించే సిబ్బంది, అధికారులు సకాలంలో కేంద్రాలకు చేరుకొని ఉదయం 8 గంటలకే ప్రక్రియ మొదలుపెట్టాలన్నారు. మూడు వార్డులకు కలిపి ఒక రిటర్నింగ్ అధికారి లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తారన్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కించాక సాధారణ బ్యాలెట్ పేపర్లు లెక్కించాలన్నారు. ఒక్కో వార్డులో రెండు నుంచి మూడు పోలింగ్ స్టేషన్ల వారిగా బ్యాలెట్ బాక్సులు ఉంటాయన్నారు. చెల్లుబాటు, చెల్లుబాటు కాని బ్యాలెట్ పేపర్స్ విషయంలో సంబంధిత వార్డు రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయం అన్నారు. తుదిఫలితం ప్రకటించే ముందే ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అన్నివిధాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అనదపు కలెక్టర్ నర్సింగ్రావు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగేంద్రం, రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు. ర్యాండమైజేషన్ పూర్తి మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బంది కేటాయింపు కోసం మూడో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. ఎన్నికల పరిశీలకులు చంద్రశేఖర్రెడ్డితో కలిసి ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. నాలుగు మున్సిపాలిటీల పరిధిలోని మొత్తం 189 పోలింగ్ కేంద్రాలకు 189 మంది పీఓలు, 189 మంది ఏపీఓలు, 567 మంది ఓపీఓలను కేటాయించినట్లు వివరించారు. -
పదేళ్లలో గద్వాల అస్తవ్యస్తం
గద్వాల: ఎవరికి ఓటు వేస్తే అభివృద్ధి సాధ్యమవుతుందో విజ్ఞులైన గద్వాల పట్టణ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని పాతబస్టాండ్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. గడిచిన పదేళ్లలో అభివృద్ధి చేసే నాయకులు లేకపోవడంతో గద్వాల పట్టణం మొదలుకుని నియోజకవర్గం మొత్తం అస్తవ్యస్తంగా మారిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు ఇళ్లు లేని నిరుపేదలకు 3 వేల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తే.. ఇప్పుడు వాటిని బలవంతంగా లాక్కుని రోడ్డున పడేశారని మండిపడ్డారు. ముఖ్యంగా సాగు, తాగునీరు, రహదారులు, పేదలకు ఇళ్లు, పాఠశాల నిర్మాణాలు, నెట్టెంపాడు పథకం తాను సాధించానని ఆ ప్రాజెక్టు వచ్చిన తర్వాతే గద్వాల పెద్దఎత్తున అభివృద్ధి చెందిందన్నారు. అభివృద్ధి కోసం సీఎంను కలిసినట్లు చెబుతున్న ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఆయన చేసిన అభివృద్ధి ఏమిటో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. చేనేత పార్కు నిర్మాణం ఇప్పటి వరకు అతీగతి లేదని, పట్టణంలోని 37 వార్డులలో కొత్తగా జరిగిన అభివృద్ధి ఎంతమాత్రం లేదన్నారు. పనిచేసే వ్యక్తులనే గెలిపించాలని పట్టణ ప్రజలు ఆలోచించి బీజేపీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించి గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు డీకే స్నిగ్ధారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, రామచంద్రారెడ్డి, త్యాగరాజు, వెంకట్రాములు, పద్మావతి, కృష్ణవేణి, నర్సింహులు, వెంకటేశ్వర్రెడ్డి, దేవదాసు, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేయాలి
గద్వాల: విద్యార్థులు సమాజానికి ఉపయోగపడేలా నూతన ఆవిష్కరణలు చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఎస్సీ సంక్షేమాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆనంద నిలయంలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముందుగా విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్స్ను పరిశీలించారు. సైన్స్ ఎంతో అభివృద్ధి చెందుతుందని, అందుకనుగుణంగా విద్యార్థి దశ నుంచే నూతన విషయాలను కనిపెట్టేలా అవసరమైన జ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. హాస్టల్ విద్యార్థులు ఇలా ప్రదర్శనలు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రతివిద్యార్థి ప్రదర్శనను గురించి విద్యార్థులతో తెలుసుకుని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పలువురు విద్యార్థులు కలెక్టర్ యోగాసనాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో అదన పు కలెక్టర్ నర్సింగ్రావు, ఎస్సీ సంక్షేమాభివృద్ధి శాఖ జిల్లా అధికారి నుషిత, హాస్టల్ వార్డెన్లు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్
గద్వాల: మున్సిపాలిటీ ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు ఆదివారం పోస్టల్ బ్యాలెట్ నిర్వహించారు. ఈ ప్రక్రియను కలెక్టర్ బీఎం సంతోష్ పర్యవేక్షించారు. గద్వాల మున్సిపాలిటీలో పర్యటించి ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా సజావుగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నాలుగు మున్సిపాలిటీ పరిధిలో 408 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకున్నారు. గద్వాలలో 290 మంది, అలంపూర్లో 33, అయిజలో 63, వడ్డేపల్లిలో 22 మంది ఉద్యోగులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నట్లు అదనపు కలెక్టర్ నర్సింగ్రావు తెలిపారు. పుర ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తాం అమరచింత: పురపాలికల ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. ఆదివారం పట్టణంలో కాంగ్రెస్, సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన పుర ఎన్నికల ప్రచార రోడ్షోలో వారితో పాటు కాంగ్రెస్, సీపీఎం నాయకులు, కార్యకర్తలు, ఆయా పార్టీల అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామని.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ మాదిరిగా కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసగించమని తెలిపారు. జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి ఈ ప్రాంత ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని.. బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోలేదని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం నిధులు మంజూరు చేయడమే గాకుండా పనులు కూడా ప్రారంభించినట్లు చెప్పారు. నియోజకవర్గంలోని మక్తల్, ఆత్మకూర్, అమరచింత పురపాలికలపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. అమరచింతలో సీపీఎం మద్దతుతో అధికారం చేపడతామని.. అమరచింత పీహెచ్సీని ఆధునికీకరించి నిరంతర వైద్యసేవలతో పాటు వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పెరుగుతున్న కిడ్నీ సమస్య బాధితులు నారాయణపేట: జిల్లాలోని మక్తల్, నర్వ మండలాల ప్రజలు కిడ్నీ సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారని.. ప్రభుత్వం తక్షణమే ఉన్నతస్థాయి వైద్య బృందంతో విచారణ జరిపించాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఎస్.తిరుపతయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఆయా మండలాల్లో నిజ నిర్ధారణ బృందం పర్యటించి బాధితులు, గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మక్తల్ మండలం మంతన్గోడ్, ఎర్నాగునపల్లి, కాట్రేవ్పల్లి, నర్వ మండలం రాయికోడ్, జక్కన్నపల్లి, పాతర్చేడ్లో బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. రెండువేల జనాభా లేని కాట్రేవ్పల్లిలో కిడ్నీ సమస్యతో పదేళ్లలో పదిమందికి పైగా మృతిచెందారని, డయాలసిస్ చేయించుకుంటున్న వారు ఐదుగురు, డయాలసిస్కి చేరువలో 15 మంది ఉన్నారని సమాచారం ఉందని తెలిపారు. ప్రభుత్వం డయాలసిస్ రోగులకు నెలకు రూ.రెండు వేలు ఇచ్చి, మక్తల్లో డయాలసిస్ కేంద్రం ప్రారంభించి చేతులు దులుపుకొనే ధోరణిలో ఉందని, వెంటనే ఉన్నతస్థాయి వైద్య నిపుణుల బృందాన్ని ఆయా మండలాలకు పంపించి సమస్య తీవ్రతకు గల కారణాలను శోధించాలని సూచించారు. ఆయా మండల కేంద్రాల్లో వారానికి రెండుసార్లు నెఫ్రాలజిస్ట్ను అందుబాటులో ఉంచాలని, డయాలసిస్ సెంటర్ సామర్థ్యం పెంచి రోగులకు నెలకు రూ.12 వేలు పించన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిజ నిర్ధారణ కమిటీలో మానవ హక్కుల వేదిక బృందం సభ్యులు దిలీప్, తాళ్ల రోహిత్, సభ్యులు శ్రీధర్, వెంకటనారాయణ , బొల్లి ఆదాంరాజు ఉన్నారు. -
ప్రత్యర్థుల కోటలపైనే గురి
● అన్ని పార్టీల అభ్యర్థులది ఇదే ఎజెండా ● ప్రత్యర్థి ఓటు బ్యాంకుకు తూట్లు పొడిచేలా వ్యూహాలు ● గత ఎన్నికల్లో భంగపడిన నాయకుల ముందు జాగ్రత్త బలమైన ప్రాంతాల్లో పాగా మరికొంతమంది నాయకులు గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకున్నామంటూ ప్రత్యర్థికి బలమైన ప్రాంతాల్లో పాగా వేస్తున్నారు. కొంతమంది ఈ ఒక్కసారికి చూడండి అంటూ సానుభూతితో ముందుకొస్తుండటంతో ప్రత్యర్థులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. గద్వాల పట్టణంలో వైరిపక్షాల మధ్య తీవ్ర పోటీ సాగుతున్న 15 నుంచి 18 వార్డుల్లో ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. గత ఎన్నికల్లో భంగపడిన నాయకులు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో విజయం చేజారిపోరాదానే కృతనిశ్చయంతో ఆయా పార్టీల శ్రేణులు పనిచేస్తున్నాయి. గద్వాల: గత ఎన్నికల్లో ప్రత్యర్థి భారీగా ఓట్లు పొందిన ప్రాంతాలను గుర్తించడం.. ఈసారి అక్కడ లోటు పడకుండా చూసుకోవడం.. పట్టణంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఏకై క ఎజెండా ఇది. పార్టీ పరంగా, వ్యక్తిగతంగా అందుకు అవసరమైన వ్యూహాన్ని రూపొందించుకోవడంలో నాయకులు నిమగ్నమయ్యారు. ప్రత్యర్థి ఓటు బ్యాంకుకు తూట్లు పొడవటం ద్వారా తాను విజయం సాధించడంపైనే అందరు అభ్యర్థులు దృష్టిసారిస్తున్నారు. దీంతో పోటీ తీవ్రంగా ఉన్న వార్డుల్లో నాయకుల ఎత్తులతో వాతావరణం వేడెక్కుతోంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం ఉధృతం చేశారు. తమ ఓటు బ్యాంకులను కాపాడుకుంటూనే ఎదుటి పక్షం ఓట్ల కోటను ముక్కలు చేసే లక్ష్యంతోనే అందరూ ముందుకు సాగుతున్నారు. దీంతో ప్రతిఒక్కరూ ప్రచార పర్వంలో ముందడుగు వేస్తూ అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తమ కోటగా భావించే ప్రాంతానికి ప్రత్యర్థి వచ్చి వెళ్లాడంటే ఎంత ధీమా ఉన్నా.. మరోసారి అక్కడికి వెళ్లి పరిస్థితిని అంచనా వేసుకోవాల్సి వస్తుంది. ఓట్లలో చీలిక తెచ్చేలా.. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికలు రాజకీయ భవితవ్యానికి సవాల్గా మారడంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు కీలకంగా మారిన కొన్ని వర్గాల ఓట్లపై దృష్టి కేంద్రీకరించారు. భారీ సంఖ్యలో ఉన్న ఒకవర్గం ఓట్లలో చీలిక తెచ్చేలా ప్రధాన పార్టీలు పోటీపడుతున్నాయి. పట్టణంలోని ప్రధాన పక్షాల మధ్య పోటీ తీవ్రంగా ఉన్న వార్డుల్లో ఇరుపక్షాలు ఎదుటి పక్షం ఓటు బ్యాంకుకు కన్నం వేసే పనిలోనే నిమగ్నమయ్యారు. అభ్యర్థులు వార్డులకు వెళ్లేటప్పుడు తన వెంట ఉండే కార్యకర్తల విషయలో కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత ఎన్నికల్లో మైనస్ అయిన కాలనీలను గుర్తించి అక్కడ కూడా ఈసారి ఆధిక్యం వచ్చేలా ప్రధాన పార్టీలు ప్రణాళిక రూపొందిస్తున్నాయి. గత రెండేళ్ల కాలంలో ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను వివరించడం ద్వారా వారిని తమవైపు తిప్పుకొనేందుకు పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ● కాంగ్రెస్ అభ్యర్థులు ప్రధానంగా మైనార్టీ ఓట్లపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. మైనార్టీ ఓట్లను వీలైనంత అధికంగా పొందడమే ప్రధాన లక్ష్యంగా వ్యూహం రచిస్తున్నారు. ● బీఆర్ఎస్ తమ ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే ప్రత్యర్థి వర్గం ఓట్లకు గండికొట్టే వ్యూహాలు పన్నుతోంది. మైనార్టీ ఓట్లను పెద్దమొత్తంలో పొందాలని చూస్తుంది. ● ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ అనుసరిస్తున్న వ్యూహాలను నిర్వీర్యం చేసి ఒకవర్గం ఓట్లన్నీ మొత్తంగా పొందాలని బీజేపీ పావులు కదుపుతోంది. ● మిగతా పార్టీలు, స్వతంత్రులు సైతం తమ ప్రచార సరళిని కూడా మార్చుకొని వార్డుల్లో ఓటర్లకు దగ్గరవడం ద్వారా ప్రధాన పార్టీల ఓటు బ్యాంకును కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ప్రతి వార్డులోనూ ప్రధాన పార్టీల అభ్యర్థులు బలబలాలు బేరీజు వేసుకుని లోటును పూడ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. -
మూడంచెల్లో బందోబస్తు
గద్వాల: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసేలా పోలీస్ శాఖ తరపున పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ‘సాక్షి’ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. నాలుగు మున్సిపాలిటీల పరిధిలో.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించి 77 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటికే పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాం. ప్రధానంగా బందోబస్తును మూడు భాగాలు విభజించి చేపడుతున్నాం. మొదటిది ప్రీపోల్ బందోబస్తులో నామినేషన్ల ప్రక్రియ, ర్యాలీలు, విత్డ్రాలు వంటివి ఉంటాయి. వీటికి అవసరమైన బందోబస్తును ఏర్పాటు చేసి ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా విజయవంతంగా నిర్వహించాం. ఇక రెండోది పోల్ బందోబస్తు కాగా.. ఈ నెల 11న జరిగే పోలింగ్కు అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టాం. ప్రధానంగా అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద ఇప్పటికే బందోబస్తుపై దృష్టిపెట్టాం. అదేవిధంగా సమస్యాత్మాక ప్రాంతాలను గుర్తించి అదనపు బందోబస్తు కల్పించనున్నాం. రూట్ బందోబస్తు కోసం జిల్లావ్యాప్తంగా నాలుగు చోట్ల సరిహద్దు ప్రాంతాల్లో బందోబస్తు కల్పిస్తాం. ఇందులో మూడు ఇంటర్ స్టేట్, ఒకటి ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్పోస్టులను ఏర్పాటు చేశాం. గట్టు మండలం బలిగెర, రాజోలి మండలం సుంకేసుల, అలంపూర్ మండలం ర్యాలంపాడు వద్ద అంతర్రాష్ట్ర చెక్పోస్టులు, ధరూర్ మండలం జూరాల డ్యాం వద్ద అంతర్ జిల్లా చెక్పోస్టు ఏర్పాటు చేశాం. మూడో విభాగంలో కౌంటింగ్ బందోబస్తు కోసం నాలుగు మున్సిపాలిటీల పరిధిలో నాలుగు కౌంటింగ్ సెంటర్లలోని స్ట్రాంగ్ రూం వద్ద ప్రత్యేక ఫోర్స్తో బందోబస్తు కల్పిస్తున్నాం. కౌంటింగ్ రోజు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టేందుకు ఇప్పటికే సన్నద్ధం చేశాం. ఇందులో కౌంటింగ్ సెంటర్ లోపల, కౌంటింగ్ సెంటర్ వెలుపల బందోబస్తు ఆర్మ్డు ఫోర్స్తో ఉంటుంది. ర్యాలీలు నిషేధం.. ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు వచ్చిన వెంటనే ఏ పార్టీలు, నాయకులు ర్యాలీలు, విజయోత్సవాలు నిర్వహించడం పూర్తిగా నిషేధం. చైర్మన్ ఎన్నిక వరకు మోడల్ కోడ్ కండక్ట్ అమలులో ఉంటుందనే విషయాన్ని ప్రతిఒక్కరు గమనించాలి. ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే వారిపై ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు చేపడుతాం. ముందస్తు అనుమతి తప్పనిసరి.. ఎన్నికల సందర్భంగా ఎవరైన పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు లౌడ్స్పీకర్లు, ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించుకోవాలనుకుంటే ముందస్తు పోలీసు అనుమతి తప్పనిసరి. ఆన్లైన్లో ఎవరైతే ముందుగా దరఖాస్తు చేసుకుంటారో వారికి క్రమపద్ధతిలో అనుమతులు ఇస్తాం. విస్తృతంగా తనిఖీలు.. ఎన్నికలు పకడ్బందీగా, శాంతియుతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 500 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధానంగా 10 ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశాం. ఇందులో 4 ఫ్లయింగ్ స్క్వాడ్, 6 స్టాటిక్ సర్వైలెన్స్ టీంలు ఏర్పాటు చేశాం. గద్వాల మున్సిపాలిటీ పరిధిలో ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, రెండు స్టాటిక్ సర్వైలెన్స్ టీంలు, అయిజలో ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, రెండు స్టాటిక్ సర్వైలెన్స్ టీంలు, వడ్డేపల్లిలో ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, ఒక స్టాటిక్ సర్వైలెన్స్ టీంలు, అలంపూర్లో ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, ఒక స్టాటిక్ సర్వైలెన్స్ టీంలు ఏర్పాటు చేశాం. ఈటీంలు నిబంధనల మేరకు విస్తృత తనిఖీలు చేపడుతాయి. ఏదేని అనుమానాస్పద వస్తువులు, అక్రమ నగదు తరలింపు చేపడితే చర్యలు తీసుకుంటాం. 24 గంటలపాటు పెట్రోలింగ్.. జిల్లావ్యాప్తంగా ఎన్నికలు జరిగే నాలుగు మున్సిపాలిటీలో 24 గంటల పాటు పెట్రోలింగ్ ఉంటుంది. గద్వాల మున్సిపాలిటీలో ఎస్ఐ స్థాయి అధికారితో రెండు టీంలు, అలంపూర్, అయిజ, వడ్డేపల్లిలో ఒక టీం చొప్పున ఏర్పాటు చేసి పగలు, రాత్రివేళలో పెట్రోలింగ్తో కూడిన బందోబస్తు ఏర్పాటు చేశాం. ఎక్కడైనా అనుమానాస్పద కార్యకళాపాలు గమనిస్తే ప్రజలు వెంటనే సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలి. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు.. ఓటుహక్కు వినియోగం ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరి బాధ్యత. ఓటుహక్కు కలిగిన ప్రతిఒక్కరు ఓటుహక్కును వినియోగించుకుని మెరుగైన వ్యక్తులను ఎన్నుకుని సమ సమాజ హితంలో భాగస్వాములు కావాలి. ఇందుకోసం పోలీసుశాఖ పరంగా అవసరమైన అన్ని పటిష్ట చర్యలు తీసుకుని.. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసేలా సహకరిస్తాం. 140 మంది బైండోవర్.. ఎన్నికల్లో ఎలాంటి అల్లర్లు, ఘర్షణలు జరిగి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జిల్లావ్యాప్తంగా 140 మంది రౌడీషీటర్లు, నేరచరిత్ర కలిగిన వారు, ఘర్షణలు సృష్టించే వారిని గుర్తించి ముందస్తుగా బైండోవర్ చేశాం. అలాగే వాహనాల తనిఖీలు, పెట్రోలింగ్లో భాగంగా జిల్లావ్యాప్తంగా అక్రమంగా తరలిస్తున్న లిక్కరు పట్టుకున్నాం. ఇప్పటి వరకు 150 లీటర్ల లిక్కర్ స్వాధీనం చేసుకుని సదరు వ్యక్తులపై కేసు నమోదు చేశాం. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు పోలింగ్ విధుల్లో 500 మంది సివిల్, ఆర్ముడ్ పోలీసులు జిల్లావ్యాప్తంగా 4 చెక్పోస్టులు ఏర్పాటు 150 లీటర్ల లిక్కర్ స్వాధీనం.. లైసెన్స్ ఆయుధాలు డిపాజిట్ ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎస్పీ శ్రీనివాసరావు ఆయుధాలు డిపాజిట్.. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున జిల్లావ్యాప్తంగా లైసెన్స్ ఆయుధాలు కలిగిన వ్యక్తుల నుంచి ఆయుధాలను డిపాజిట్ చేసుకున్నాం. ఎన్నికల నియమావళి తొలగిన అనంతరం ఎవరి ఆయుధాలను వారికి తిరిగి అప్పగిస్తాం. -
లోపల పొత్తులు.. బయటకు కత్తులు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీల మధ్య అంతర్గత పొత్తులు ఆసక్తి రేపుతున్నాయి. పార్టీల సిద్ధాంతాలు, వైరుధ్యాలకు సంబంధం లేకుండా చైర్మన్ పీఠాలను కై వసం చేసుకోవడమే లక్ష్యంగా అంతర్గతంగా ఒప్పందాలు కుదిరిపోతున్నాయి. బాహాటంగా పొత్తు మాట లేకుండా వార్డుల్లోనే మీకిది.. మాకది అన్న చందంగా పార్టీల అభ్యర్థులు సర్దుబాట్లు చేసుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల గడువు సమీపిస్తున్న క్రమంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల మధ్య అంతర్గత పొత్తులు, సర్దుబాట్లు ముమ్మరంగా చోటుచేసుకుంటున్నాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో చైర్మన్ స్థానాలను కై వసం చేసుకునేందుకు ఇతర పార్టీల అభ్యర్థులతోనూ గుట్టుగా సంప్రదింపులు జరుపుతుండటం చైర్మన్ పీఠాల కోసం పార్టీల పోటీ తీవ్రతకు అద్దం పడుతోంది. సర్దుబాట్లతో కలసిన పార్టీలు.. నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో సీపీఎం పార్టీ పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్తో సంప్రదింపులు జరిపింది. అయితే చివరి నిమిషంలో ఏ పార్టీతోనూ పొత్తు పొసగలేదు. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎవరికి వారు సొంతంగానే అభ్యర్థులను పోటీలో నిలిపాయి. చైర్మన్ పీఠమే లక్ష్యంగా ఈ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య అంతర్గత సర్దుబాట్లు కొనసాగినట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీ అభ్యర్థుల గెలుపునకు అవకాశం ఉన్నచోట సహకరించడం, ఫలితంగా చైర్మన్ ఎన్నికల్లో మద్దతును పొందేలా ఒప్పందాలు కుదిరినట్టుగా తెలుస్తోంది. ఈ తరహా అంతర్గత సర్దుబాట్లు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయోనని కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. వనపర్తి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ సీపీఎంతో పొత్తు పెట్టుకుంది. ఒప్పందంలో భాగంగా సీపీఎం పార్టీకి రెండు వార్డులను సైతం కేటాయించింది. అమరచింత మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్, సీపీఎం మధ్య పొత్తు కుదిరింది. ఇక్కడ పది వార్డుల్లో సీపీఎం పార్టీకి మూడు వార్డులు దక్కాయి. ఈ రెండు మున్సిపాలిటీల్లో సీపీఎం పార్టీ ఒకచోట బీఆర్ఎస్, మరోచోట కాంగ్రెస్ పార్టీతో జతకట్టడం గమనార్హం. చక్రం తిప్పేందుకు బహుముఖ వ్యూహం.. మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఈసారి మేయర్ పీఠం కోసం మూడు ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన కీలక నేత ఒకరు ఇతర పార్టీల అభ్యర్థులతో సైతం వేగంగా సంప్రదింపులు జరుపుతుండటం చర్చనీయాంశమవుతోంది. ఈసారి మేయర్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు ఇతర పార్టీల్లోని అభ్యర్థులతో సైతం టచ్లోకి వెళుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక్కడ పలువార్డుల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య సరు ్దబాట్లు కొనసాగుతుండటం, చివరకు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ఆసక్తి నెలకొంది. భూత్పూర్ మున్సిపాలిటీలోనూ బీఆర్ఎస్, బీజేపీల మధ్య అంతర్గతంగా చర్చలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. గద్వాలలో చైర్మన్ కోసం పోటీతీవ్రం.. గద్వాల మున్సిపాలిటీలో ఈసారి చైర్మన్ స్థానం కోసం మూడు ప్రధాన పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ సైతం అంతర్గత పోరుతో ఇరువర్గాలుగా చీలిపోయింది. ఈ క్రమంలో కాంగ్రెస్లోని ఓ వర్గం బీఆర్ఎస్ అభ్యర్థులతో సర్దుబాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చైర్మన్ పీఠం కోసం తీవ్రమైన పోరు కొనసాగుతోంది. బీఆర్ఎస్లోనూ ఆపార్టీ కీలకనేత ఈ ఎన్నికల సందర్భంగా అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండటంతో ఫలితాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్న అంశం ఆసక్తి రేపుతోంది. వనపర్తి, అమరచింతలో బహిరంగంగానే పొత్తు.. మున్సిపల్ ఎన్నికల వేళ పార్టీల మధ్య అంతర్గత పొత్తులు చైర్మన్ పదవులే లక్ష్యంగా అంతర్గత ఒప్పందాలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్న ప్రధాన పార్టీలు పార్టీలతో నిమిత్తం లేకుండా వార్డుల్లో అభ్యర్థుల సర్దుబాట్లు -
మిగిలింది 2 రోజులే..
● మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సమీపిస్తున్న గడువు ● ప్రధాన పార్టీల మధ్య ప్రచార జోరు ● సమయం దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో మొదలైన టెన్షన్ ● బలప్రదర్శనతో హోరెత్తిస్తున్న పార్టీలు సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజుల సమయమే మిగిలి ఉంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనుండగా.. అంతకు 48 గంటల ముందే ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ క్రమంలో ప్రచారానికి తక్కువ సమయమే ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. దీంతో ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా క్షణం తీరిక లేకుండా రోజంతా ప్రచారంలో నిమగ్నమవుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. బలప్రదర్శనపై ఫోకస్.. ఇప్పటివరకు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ వచ్చిన పార్టీలు ఎన్నికల ప్రచారంలో క్రమంగా వేగం పెంచుతున్నాయి. ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజులే మిగిలి ఉండటంతో తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను ఆకర్షించేందుకు బల ప్రదర్శనపై దృష్టిపెట్టాయి. ఎక్కువ మంది మహిళలు, యువత, పెద్ద సంఖ్యలో ప్రజలను తమ వెంట ప్రచారంలో తిప్పుకొనేందుకు అధికంగా ఖర్చు చేస్తున్నాయి. ప్రచార ర్యాలీల్లో బల ప్రదర్శన చూపించడం ద్వారా తటస్థ ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. గంపగుత్తగా ఓట్లను పొందేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. వలస ఓట్ల కోసం గాలింపు.. ఉమ్మడి జిల్లాలో వలస ఓటర్ల ప్రభావం ఎక్కువ ఉండటంతో మున్సిపల్ ఎన్నికల్లో వారి ఓట్ల కోసం అన్ని పార్టీల గాలింపు కొనసాగుతోంది. హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో నివశిస్తున్న ఓటర్లను గుర్తించడంతోపాటు వారి నివాస స్థలాలు, ఫోన్ నంబర్లను సేకరిస్తున్నారు. వారందరినీ పోలింగ్ రోజున స్వస్థలాలకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వారి బాధ్యతలు, బాగోగులను సంబంధిత వార్డుల్లో ఇన్చార్జిలకు అప్పగిస్తున్నారు. వలస ఓటర్లకు సంబంధించి వారి ప్రయాణ ఖర్చులతోపాటు ఓటుకు కనీసం రూ.2 వేల చొప్పున ముట్టజెప్పేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మిగతా ఓటర్ల కన్నా ముందస్తుగానే వలస ఓటర్లకు సర్దుబాటు చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. మొదలైన ప్రలోభాల పర్వం.. మున్సిపల్ పోలింగ్కు మూడు రోజుల ముందే పట్టణాల్లో ఓట్ల కోసం ప్రలోభాల పర్వం మొదలైంది. ఇప్పటికే వార్డుల్లో మద్యం ఏరులై పారుతోంది. నిత్యం ప్రచారంలో పాల్గొంటున్న వారితోపాటు వార్లుల్లో ఇంటింటికి మద్యం బాటిల్ పంపిణీ సైతం ఇప్పటికే మొదలైంది. కుల, మహిళా సంఘాల్లోని సభ్యుల ఓట్లను గంపగుత్తగా పొందేందుకు అభ్యర్థులు ఎవరికి వారు తాయిళాలు ప్రకటిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు గడువు ముంచుకొస్తుండటంతో ప్రలోభాల పర్వం మరింత ఊపందుకోనుంది. -
రైతుల మేలుకే యూరియా యాప్
ఇటిక్యాల: రైతుల మేలు కోసమే ప్రభుత్వం యూరియా యాప్ తీసుకువచ్చిందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప అన్నారు. శనివారం ఎర్రవల్లి మండలంలోని కోదండాపురం గ్రామ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా యాప్ ద్వారా జిల్లాలో యూరియా లభ్యత సమాచారం ఎప్పటికప్పడు రైతులు తెలుసుకొని తమకు నచ్చిన చోట తీసుకునే వెసులుబాటు ఉందన్నారు. దీని ద్వారా రైతులకు యూరియా పారదర్శకంగా, సక్రమంగా అందుతుందన్నారు. ప్రసుత్తం జిల్లాలో యూరియా కొరత లేదని, ప్రతి మండలంలో రైతులకు కావాల్సినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అలాగే సబ్సిడీపై స్ప్రేయర్స్ అందుబాటులో ఉన్నాయని, అవసరమైన రైతులు మండల వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో అలంపూర్ ఏడీఏ సక్రియానాయక్, ఏఓ సురేష్ గౌడ్, రైతులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండాలి ధరూరు/ గద్వాల: విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతతోపాటు శుచి, శుభ్రతగా ఉండాలని డీఈఓ విజయలక్ష్మి అన్నారు. శనివారం మధ్యాహ్నం ఆమె మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి.. వంటగది, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. వంట ఏజెన్సీ మహిళలు బియ్యాన్ని రెండు సార్లు శుభ్రంగా కడిగి వండాలన్నారు. బియ్యంలో పురుగులు, మట్టి పెల్లలు, రాళ్లు వంటివి లేకుండా చూసుకొని వండాలన్నారు. వంట కోసం తీసుకువచ్చిన సరుకులను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పాఠశాల జీహెచ్ఎం ప్రతాప్రెడ్డికి సూచించారు. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు బాగా చదివి ఉత్తీర్ణులు కావాలన్నారు. పరీక్షలకు సమయం దగ్గరపడుతోందని, ఈ కొద్ది రోజులు బాగా చదవాలన్నారు. అలాగే స్పషల్ క్లాస్ల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే గట్టు మండలంలోని మాచర్ల ఉన్నత పాఠశాలను డీఈఓ ఆకస్మికంగా తనిఖీ చేసి.. తరగతి గదులు, టింకరింగ్ ల్యాబ్, వాటర్ ప్లాంటు, గ్రంథాలయాన్ని పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీఓ కృష్ణమోహన్, తహసీల్దార్ నరేందర్, హెచ్ఎం రఘు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
ఆశాజనకంగా యాసంగి
● చివరలో కురిసిన భారీ వర్షాలతో పుష్కలంగా నీళ్లు ● విస్తారంగా పప్పుశనగ, వేరుశనగ, వరి, మొక్కజొన్న పంటల సాగు ● ఖరీఫ్ నష్టాల నుంచి గట్టెక్కిస్తుందని ఆశలు ●గద్వాల వ్యవసాయం: ప్రస్తుత యాసంగి సీజన్ సాఫీగా సాగుతోంది. వానాకాలం సీజన్లో అధిక వర్షాలతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదు. దీంతో రైతులు ఆర్థికంగా నష్టాల పాలయ్యారు. జరిగిన నష్టాన్ని దిగమింగుకొని యాసంగి సీజన్ అయినా గట్టెక్కిస్తుందన్న గంపెడు ఆశతో యాసంగిని ఆరభించిన రైతులకు ప్రస్తుత పంటల పరిస్థితి ఊరటనిస్తోంది. కన్నీరు మిగిల్చిన ఖరీఫ్.. గడిచిన ఏడాది 2024–25 వానాకాలం (ఖరీఫ్), యాసంగి సీజన్లు రైతులకు కలిసొచ్చాయి. వానాకాలంలో సమయానుకూలంగా వర్షాలు కురిశాయి. బోర్లు, బావులు రీచార్జి అయ్యాయి. ఇలా అన్ని పరిస్థితులు అనుకూలం కావడంతో ఆ ఏడాది వానాకాలం సీజన్, యాసంగి సీజన్ సాగు సాఫీగా సాగింది. పత్తి, కంది, వరి, వేరుశనగ, మొక్కజొన్న తదితర పంటల దిగుబడులు బాగానే వచ్చాయి. అయితే 2025 వానాకాలం సీజన్ (ఖరీఫ్) రైతులకు కన్నీరు తెప్పించింది. ఆరంభంలో వర్షాలు కురవలేదు. ఆ తర్వాత ప్రధానంగా జూలై, ఆగస్టు నెలల్లో కురిసిన అధిక వర్షాల ప్రభావం పంటలపై పడింది. పలుచోట్ల నీరు నిల్వ అయి మొక్కల ఎదుగుదలపై ప్రభావం పడింది. ఆ తర్వాత సెప్టెంబర్లోనూ కురిసిన వర్షాల వల్ల పంటలు బాగా దెబ్బతిన్నాయి. దాదాపు అన్ని రకాల పంటలకు తెగుళ్లు, వైరస్లు, రకరకాల పురుగులు ఆశించాయి. ఫలితంగా జిల్లాలో అత్యధికంగా సాగు చేసిన పత్తి పంట దిగుబడులు సగానికి పడిపోయాయి. పత్తి, వరి, వేరుశనగ, కంది ఇలా వానాకాలం సీజన్లో సాగు చేసిన అన్ని పంటల దిగుబడులు తగ్గి.. రైతులను ఆర్థికంగా నష్టాల పాలు చేసింది. 1,15,400 ఎకరాల్లో పంటలు.. ప్రస్తుత యాసంగిలో భాగంగా జిల్లాలో వరి, పప్పుశనగ, వేరుశనగ, మొక్కజొన్న పంటలను ప్రధానంగా వేశారు. 1,30,516 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు అయ్యే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. అయితే 1,15,400 ఎకరాల్లో పంటలు సాగు అయ్యాయి. వానాకాలంలో కురిసిన విస్తారమైన వర్షాల వల్ల బోర్లు, బావులు రీచార్జి అయ్యాయి. దీంతో వీటి కింద రైతులు ఎక్కువగా పంటలు వేశారు. ఇక ఆయకట్టు కింద వరి సాగు చేశారు. మొక్కజొన్న గడిచిన ఏడాదితో పోల్చితే ఈసారి సాగు బాగా పెరిగింది. జొన్న పంట సాగు సైతం పెరిగింది. భూగర్భజలాల నీటిమట్టం పెరగడం వల్ల బోర్లు, బావులు బాగా రీచార్జి అయ్యాయి. దీనివల్ల నీటికి ఇబ్బందులు లేవు. ఇదే సమయంలో వాతావరణం సైతం అనుకూలంగా ఉంది. ఫలితంగా వరి, మొక్కజొ న్న, పప్పుశనగ, వేరుశనగ ఇలా అన్ని పంటల పరిస్థితి ఆశాజనకంగా ఉందని అటు రైతులు, ఇటు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఈ నెలంతా ఇలానే గడిస్తే పంట దిగుబడులు బాగా వస్తాయని రైతులు ఆశిస్తున్నారు. ఇక కూరగాయల తోటలు సైతం మెరుగ్గా ఉన్నాయి. గడిచిన వానాకాలం సీజన్లో ఈ రైతులు కూడా నష్టాలు చూశారు. యాసంగి సీజన్లో మాత్రం కూరగాయల దిగుబడులు బాగా వస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు. పంట సాగు విస్తీర్ణం (ఎకరాల్లో) వరి 46,529 మొక్కజొన్న 40,380 జొన్న 7,559 పొగాకు 5,085 వేరుశనగ 5,447 పప్పుశనగ 5,259 అలసంద 2,588 మినుములు 2,323 ఇతర పంటలు 15,346 అన్ని పంటలు బాగున్నాయి. అధిక వర్షాల వల్ల వానాకాలం సీజన్లో అన్ని పంటల దిగుబడులు తగ్గాయి. యాసంగి సీజన్లో వేసిన అన్ని పంటలు ప్రస్తుతం బాగున్నాయి. అన్ని రకాల పంటల దిగుబడులు ఆశాజనకంగా వస్తాయని భావిస్తున్నాం. – వీరప్ప, డీఏఓ -
నయానో.. భయానో
గద్వాల టౌన్: పార్టీ అభ్యర్థిపై అసంతృప్తితో ఉన్న నాయకులు.. టికెట్లను ఆశించి భంగపడ్డ అభ్యర్థులు.. ఇతరత్రా కారణాలు చెప్పి పార్టీ ప్రచారానికి దూరంగా ఉంటున్న కార్యకర్తలను నయానో.. భయానో బుజ్జగించి ప్రచారంలో పాల్గొనేలా చూడాల్సిన బాధ్యతను ఆయా పార్టీల ముఖ్యనేతలు తమ భుజాలపై వేసుకున్నారు. ఇటీవల గద్వాల మున్సిపాలిటీలో వివిధ రాజకీయ పక్షాలలో చోటు చేసుకున్న పరిణామాలు తీవ్ర గందరగోళ పరిస్థితులను సృష్టించాయి. ఈ క్రమంలో వార్డు స్థాయిలో అసంతృప్తితో ఉన్న పార్టీ నాయకులను ఆ పార్టీ అభ్యర్థులు బుజ్జగిస్తూ డిమాండ్లను తీర్చేందుకు ముందుకు వస్తున్నారు. ఇంతకాలంగా పార్టీ కోసం పనిచేస్తూ వచ్చాం.. మాకు ఏమిచ్చారు. కనీసం ఎలక్షన్లు వచ్చాయి.. ఇప్పుడైనా ప్యాకేజీ ప్రకటించి నజరానా ఇస్తే సరి.. లేదంటే పార్టీకి గుడ్బై.. ప్రచారానికి దూరం అంటూ వార్డు స్థాయి నాయకులు ఆయా పార్టీల అభ్యర్థులను ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. గల్లీస్థాయి కార్యకర్తలు సైతం పార్టీ అభ్యర్థులను ఇప్పుడే బెంబేలెత్తిస్తున్నారు. మా గల్లీలో ఇన్ని ఓట్లు ఉన్నాయి.. గత మున్సిపల్ ఎన్నికల్లో భారీగా మెజార్టీ వచ్చింది.. అంతకంటే ఎక్కువ ఓట్లు రావాలంటే మా అనుచరులను మంచిగా చూసుకోవాలి అంటూ కోరికలను ముందుంచుతున్నారు. ముందుంది అసలు పండుగ.. ‘అయ్యా.. టిక్కెట్ తెచ్చుకోవడానికే అష్టకష్టాలు పడ్డాం.. రూ.వేలు గుమ్మరింస్తున్నాం.. ఇక్కడికొస్తే ఒక్కొక్క కార్యకర్త లిస్టు చూసి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.. ఒకరా.. ఇద్దరా.. ఏ గల్లీకి వెళ్లినా ఇదేం లొల్లిరా బాబూ అంటూ ఆయా పార్టీల అభ్యర్థులు గగ్గోలు చెందుతున్నారు. ‘మీకే ఇంత సొమ్ము ముట్టజెప్పితే పోలింగ్కు ముందు గల్లీలో గుమ్మరించేందుకు అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి మహాప్రభో.. అంటూ తలగోక్కుంటున్నారు. రూ.లక్ష తగ్గకుండా ఖర్చు అవుతుందని అంచనా వేసుకున్నాం. కానీ, ఇప్పుడు అలా కనిపించడం లేదు అంటూ నిట్టూరుస్తున్నారు. మరోవైపు కొన్ని కుల సంఘాలకు చెందిన నాయకులు కూడా తమ పబ్బాన్ని గడుపుకొంటున్నారు. తాము ఫలానా సంఘానికి చెందిన వారమని పరిచయాలు చేసుకుంటూ.. గుండుగుత్తగా ఓట్ల విషయంలో అభ్యర్థులకు హామీలు చేస్తున్నారు. ఎంత మొత్తం తమకు ముట్టజెప్పుతారు అనే అంశంపై బేరసారాలు సాగిస్తున్నారు. రూ.వేలల్లో ఖర్చు.. ఎన్నికల్లో టికెట్లను ఆశిస్తూ గత కొన్ని నెలలుగా రూ.వేలు ఖర్చు పెట్టిన కొందరు నాయకులు చివరి క్షణంలో టిక్కెట్ గల్లంతు కావడంతో చేసిన ఖర్చును తల్చుకుంటూ నిట్టూరుస్తున్నారు. ‘ఎందుకన్నా అంత బాధపడుతున్నావ్.. ఇప్పుడు వచ్చిన క్యాండిడెట్ చాలా స్ట్రాంగ్.. మనకు ఇంత వరకు అయిన ఖర్చు లిస్టు తయూరు చెయ్.. మనం వెళ్లి లిస్టును ముందు పెట్టి డబ్బులు అడుగుదాం. ఇవ్వకపోతే చూసుకుందాం..’ అంటూ ఆ నాయకులకు చోటామోటా కార్యకర్తలు నూరిపోస్తున్నారు. ఈ జాఢ్యం అన్ని పార్టీల్లో కొనసాగుతుంది. నాయకులను మచ్చిక చేసుకుంటున్న అభ్యర్థులు తమదారిలోకి తెచ్చుకునేందుకు అష్టకష్టాలు అసంతృప్తులను బుజ్జగించేందుకు పెద్దఎత్తున తాయిళాలు -
వైభవంగా అంజన్న రథోత్సవం
ధరూరు: వేలాదిగా తరలివచ్చిన భక్తుల అంజన్న నామస్మరణ మధ్య మండలంలోని అల్వాలపాడు తెలుగోనిపలి్ల్ ఆంజనేయస్వామి రథోత్సవం శుక్రవారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముందుగా స్వామి వారి అలంకరణ, పంచామృతాభిషేకం, కుంకుమార్చన, తదితర పూజా కార్యక్రమాలు జరిపారు. వేద పండితుల మంత్రోచ్ఛరణాలు, భక్తుల అంజన్న నామస్మరణ మధ్య స్వామివారి రథోత్సవం కొనసాగింది. జిల్లా నలుమూలలతోపాటు కర్ణాటక నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి.. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో సర్పంచు మాణిక్యమ్మ, మాజీ సర్పంచులు ప్రతాప్, వీరన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి
దోమలపెంట: టీఎస్ జెన్కో పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి చేసినట్లు కేంద్రం సీఈ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్ఈ (సివిల్) రవీంద్రకుమార్, ఎస్ఈ (ఓఅండ్ఎం) ఆదినారాయణతో కలిసి సీఈ కేక్ కట్ చేసి ఇంజినీర్లు, ఉద్యోగులకు అందజేసి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూగర్భ కేంద్రంలో మొదటి యూనిట్ ద్వారా 2001– 02 నుంచి విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు. తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒక యూనిట్ చొప్పున సిద్ధం చేస్తూ మొత్తం ఆరు యూనిట్లు ఒక్కొక్కటి 150 మెగావాట్లతో 900 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో నిర్మించారని పేర్కొన్నారు. 2020లో కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగి నాలుగో యూనిట్ మరమ్మతుకు గురవగా.. ప్రస్తుతం 5 యూనిట్ల ద్వార ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఈ ఏడాది జెన్కో యాజమాన్యం భూగర్భ కేంద్రంకు 1,500 మి.యూనిట్లు టార్గెట్ నిర్దేశించగా.. 492 టీఎంసీల నీటిని వినియోగించి.. 2,544.22 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి సాధించామన్నారు. ఈ ఏడాది విద్యుదుత్పత్తి లక్ష్యం మార్చి 31 కాగా.. ఇంకా 50 రోజులు గడువు ఉందన్నారు. ఇంజినీర్లు, సిబ్బంది అందరి సహకారంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. -
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
వనపర్తి రూరల్: పేద ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం వనపర్తి పుర పరిధిలోని 18, 21 వార్డుల్లో అభ్యర్థులు పుట్టా ఆంజనేయులు, గంధం మదన్తో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి కర్రెమ్మ ఆలయం వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి కార్మికులు, కర్షకులు సంఘటితం కాకుండా చూస్తోందన్నారు. కష్టజీవులంతా ఐక్యంగా ఉద్యమిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని.. వార్డుల్లోని సమస్యలు పరిష్కరించాలంటే పేదల గురించి తెలిసిన కమ్యూనిస్టు అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ సీపీఎంకు మద్దతు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్, డి.బాల్రెడ్డి, రాజు, బాల్యానాయక్, బీఆర్ఎస్ నాయకులు గంధం బాలపీర్, గంధం విజయ్, పరంజ్యోతి, మంద రాము, తిరుపతయ్య, వెంకటయ్య, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. -
పీయూ డిగ్రీ ఫలితాలు విడుదల
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని కళాళాలలకు సంబంధించి డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను గురువారం పీయూ వీసీ జి.ఎన్.శ్రీనివాస్ వెల్లడించారు. ఇందులో భాగంగా సెమిస్టర్–1లో 30.08 శాతం, 3లో 39.72 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని ఆయన పేర్కొన్నారు. పీయూ పరిపాలన భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ పి.రమేష్బాబు, పరీక్షల నియంత్రణ అధికారి డా.కె.ప్రవీణ, ఎగ్జామినేషన్ కో–ఆర్డినేటర్ డా.అరుంధతిరెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ గౌతం పాల్గొన్నారు. -
తెలుగోనిపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
ధరూరు: మండలంలోని అల్వాలపాడు తెలుగోనిపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ఉదయం స్వామివారి అలంకరణ, కుంకుమార్చన, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఉపనయనం, పల్లకీసేవ చేశారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి ఆలయం వద్ద ఉన్న కోనేరులో స్వామివారి తెప్పోత్సవం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు అర్చకులు కిష్టాచారి తెలిపారు. ముఖ్యంగా కర్ణాటక భక్తులు పాల్గొని ప్రత్యేకంగా నైవేద్యాలు తయారు చేసి స్వామివారికి సమర్పించారు. రాత్రి అఖండ భజన కార్యక్రమం నిర్వహించారు. ఇదిలా ఉండగా శుక్రవారం సాయంత్రం స్వామివారి ఉచ్ఛాయ మహోత్సవం (రథోత్సవం) కార్యక్రమం జరగనుంది. నేడు స్వామి వారి రథోత్సవం -
నల్లమలకు విశేష ప్రాముఖ్యత
అచ్చంపేట: నల్లమల అటవీ ప్రాంతానికి విశేష ప్రాముఖ్యత ఉందని, ప్రధానంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో జీవిస్తున్న చెంచు గిరిజనుల జీవన విధానం అడవితో విడదీయరాని బంధం ముడిపడి ఉందని ఎంసీహెచ్ఆర్డీ వైస్ చైర్మన్ శాంతికుమారి అన్నారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట గిరిజన సంక్షేమ శాఖ శిక్షణ కేంద్రంలో గ్రూప్–1 అధికారులకు 2 బ్యాచ్లుగా మూడు రోజులుగా నిర్వహించిన నల్లమల అటవీ ప్రాంత ట్రెక్కింగ్, స్టడీ టూర్ శిక్షణ తరగతుల చివరిరోజు గురువారం నాగర్కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంతంలో సందర్శించిన వివిధ ప్రదేశాల వివరాలు, అక్కడ పొందిన అనుభూతులను శిక్షణ పొందుతున్న గ్రూప్–1 అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చెంచు గిరిజనుల ఆచారాలు, సంప్రదాయాలను గౌరవిస్తూనే వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయాలని సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలన శిక్షణ తరగతులలో అధికారులు ఆసక్తితో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్షేత్రస్థాయి శిక్షణ ద్వారా పరిపాలనా వ్యవస్థను నేరుగా అవగాహన చేసుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను దగ్గర నుంచి తెలుసుకొని సమర్థవంతమైన నిర్ణ యాలు తీసుకునేందుకు ఈ తరహా శిక్షణ భవిష్యత్ పాలనకు ఎంతో దోహదపడుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలను అనుగుణంగా పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అధికారులు బాధ్యతాయుతంగా శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని, పొందిన అనుభవాన్ని తమ విధి నిర్వహణలో అమలు చే యాలని సూచించారు. జిల్లా యంత్రాంగం మూడురోజులుగా గ్రూప్–1 అధికారుల శిక్షణ విజయవంతం చేసేందుకు ఎంతో కృషిచేయడం జరిగిందని కలెక్టర్ బదావత్ సంతోష్ వివరించారు. అనంతరం నల్లమల అటవీ ప్రాంతంలోని సలేశ్వరం ట్రెక్కింగ్కు శిక్షణ అధికారులతో కలిసి శాంతికుమారి వెళ్లారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, డీఎఫ్ఓ రేవంత్చంద్ర, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఫిరంగి తదితరులు పాల్గొన్నారు. చెంచుల ఆచారాలు, సంప్రదాయాలు గౌరవించాలి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ స్టడీ టూర్ పాలనకు మార్గదర్శకం కావాలి ఎంసీహెచ్ఆర్డీ వైస్ చైర్పర్సన్ శాంతికుమారి -
స్వేచ్ఛగా ఓటేయాలి
శుక్రవారం శ్రీ 6 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026–8లో uగద్వాల: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం అని, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా.. అక్రమాలు, అవినీతికి దూరంగా ఉండి ప్రజాసేవ చేసే వ్యక్తులను ఓటర్లు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ కోరారు. మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గురువారం ఆయన ‘సాక్షి’ దినపత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నికల నిబంధనలు, పోలింగ్ ప్రక్రియ, కేంద్రాల ఏర్పాటు, ఓటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, ర్యాండమైజేషన్లో ఎన్నికల సిబ్బంది కేటాయింపు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. ఎన్నికల ఏర్పాటు ప్రక్రియపై ఆయన మాట్లాల్లోనే.. ఐదేళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎన్నుకోవాలి ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల గత చరిత్ర, ప్రస్తుత ఆయన చేస్తున్న వ్యవహారం, ఎంతవరకు చదువుకున్నారు. గెలిపిస్తే సమస్యలు పరిష్కారం చూపుతారా....వంటి ప్రధాన అంశాలను దృష్టిలో ఉంచుకుని ఐదేళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సరైన వ్యక్తిని ఎన్నుకోవాలి. అప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుంది. 77 వార్డులకు ఎన్నికలు జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో గద్వాలలో 37, అయిజలో 20, అలంపూర్లో 10, వడ్డేపల్లిలో 10 వార్డులు కలిపి మొత్తం 77 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. 189 పోలింగ్ కేంద్రాలు 77 వార్డులకు సంబంధించి మొత్తం 1.08 లక్షల మంది ఓటర్లు ఉండగా.. 189 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. గత మున్సిపల్ ఎన్నికలతో పోల్చితే 11 వేల కొత్త ఓటర్లు తమ తొలి ఓటును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. అదేవిధంగా దివ్యాంగులకు వీల్చైర్లు, సహాయకులను ఏర్పాటు చేశామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ విధానం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దీనిద్వారా ఎక్కడైనా పోలింగ్ కేంద్రంలో సమస్య తలెత్తితే వెంటనే స్పందించి పరిష్కరించేందుకు వీలవుతుందన్నారు. ఎన్నికల విధుల్లో.. ఎన్నికల విధులు నిర్వహించేందుకు జిల్లాలోని 1,500 మంది ప్రభుత్వ అధికారులను కేటాయించినట్లు వెల్లడించారు. గద్వాలలో 13, అయిజలో 7, అలంపూర్లో 4, వడ్డేపల్లిలో నలుగురు చొప్పున రిటర్నింగ్ అధికారులను నియమించామన్నారు. మరో 1000 మంది అధికారులకు ఎన్నికల్లో వివిధ స్థాయిలో విధులు కేటాయించామని పేర్కొన్నారు. అదే విధంగా 330 మంది పోలీసులు, 240 మందిని స్టాండ్బై కింద ఉంచామన్నారు. అత్యవసర సమయాల్లో వీరి సేవలు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అందరికీ అవసరమైన శిక్షణను ఇచ్చి ఎన్నికల నిర్వహణకు సంసిద్ధం చేశామన్నారు. ఎన్నికల విధుల్లోని ఉద్యోగులకు 8వ తేదీన పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ బీఎం సంతోష్ 11 గుర్తింపు కార్డులతో.. ఓటర్లకు ఫొటోతో కూడిన ఓటరు జాబితాను సిద్ధం చేశాం. ఎవరైనా ఓటరు గుర్తింపు కార్డు లేకపోతే ప్రభుత్వం జారీ చేసిన ఏదేని గుర్తింపు కార్డు (ఆధార్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డు, బ్యాంకు అకౌంట్ బుక్కు వంటివి)లను పోలింగ్ అధికారులకు చూయించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పోలింగ్ అనంతరం కౌంటింగ్ ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేశాం. వార్డుకు ఓ టేబుల్ చొప్పున కౌంటింగ్ ప్రక్రియ చేపడతాం. అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీలకు సంబంధించిన ఫలితాలు మూడు గంటల వ్యవధిలోనే పూర్తవుతాయి. అదేవిధంగా గద్వాల మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఈ ఫలితాలు ఫిబ్రవరి 13న మధ్యాహ్నం దాటే అవకాశం ఉంది. 48 గంటల ముందే.. పోలింగ్ తేదీకి 48 గంటల ముందు అభ్యర్థులు తమ ప్రచారాన్ని పూర్తిగా నిలిపివేయాలి. అదే విధంగా 144సెక్షన్ అమలులో ఉంటుంది కాబట్టి గుంపులుగా తిరగొద్దు. దీనిపై ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాం. ఎన్నికలను పూర్తి శాంతియుతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా రాజకీయ పార్టీలు, పార్టీ ప్రతినిధులు సహకరించాలి. ఓటుహక్కు వినియోగం ప్రతి ఒక్కరి బాధ్యత 11 వేల కొత్త ఓటర్ల నమోదు జిల్లావ్యాప్తంగా 77 వార్డుల్లో ఎన్నికలు 1,500 మంది అధికారుల కేటాయింపు కలెక్టర్ బీఎం సంతోష్ నిఘా కోసం ప్రత్యేక టీంలు ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. ముఖ్యంగా ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఉల్లంఘనలు జరగకుండా 14 ఫ్లైయింగ్, 18 ఎస్ఎస్టీ, మరో 14 సెక్టోరియల్ టీంలను ఏర్పాటు చేశాం. వీరు 24 గంటల పాటు విధులు నిర్వహిస్తూ డబ్బులు, లిక్కర్ పంపిణీ వంటివి చోటుచేసుకోకుండా కట్టడి చేస్తారు. -
కేంద్రం నిధులతోనే అభివృద్ధి పనులు
నారాయణపేట: ‘ప్రతి వార్డుకు వచ్చేంత సమయం లేదు.. ఇక్కడికి వచ్చిన అంటే మీ ఇంటికి వచ్చి ఓటు అడిగినట్లు భావించండి.. అరుణమ్మ ఎంపీ అయినా నారాయణపేట మున్సిపాలిటీ గెలవలేకపోయింది అనే మాట రానివ్వకుండా చూడాలి’ అని ఎంపీ ఎంపీ డీకే అరుణ పుర ప్రజలను కోరారు. గురువారం జిల్లాకేంద్రంలోని సత్యనారాయణచౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆమె మాట్లాడారు. మున్సిపాలిటీలో డ్రెయినేజీలు, రోడ్లు, తాగునీటి సరఫరా కోసం కేంద్రం పెద్దఎత్తున నిధులు ఇస్తోందన్నారు. పీఎంఏవై నిధులతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం వస్తే ప్రతి పైసా అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని.. మంత్రులు వేసే శిలఫలకలు అలాగే మిగిలిపోతాయని జోస్యం చెప్పారు. కాంగ్రెస్పార్టీ కర్ణాటకలో ఐదు గ్యారంటీలు అంటే.. ఇక్కడ ఆరు గ్యారంటీలు అని ప్రజలను మోసం చేసిందన్నారు. బిల్లులు చెల్లించాలంటే కాంట్రాక్టర్లు 40 శాతం కమీషన్ చెల్లించాలనే ప్రచారం కర్ణాటక వరకు వెళ్లిందని ఇప్పుడే కర్ణాటక మాజీ ఎమ్మెల్యే రాజు పాటిల్ చెప్పారని వివరించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నేతలు నాగూరావు నామాజీ, రతంగ్పాండురెడ్డి, జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, పట్టణ అధ్యక్షుడు పోషల్ వినోద్కుమార్, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. -
ముగిసిన చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు
● సంప్రదాయబద్ధంగా సుదర్శన ‘చక్ర’ స్నానం ● ఉత్సవమూర్తుల ఊరేగింపు గద్వాలటౌన్: పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య బుధవారం భూలక్ష్మీచెన్నకేశవస్వామి సుదర్శన చక్రస్నానం సంప్రదాయబద్ధంగా చేయించా రు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గద్వాల కోటలోని ఆ లయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి సన్నిధానంలో నిత్యపూజ కార్యక్రమాల అనంతరం స్వామివారికి అవబృత స్నానం గావించారు. ఉత్సవమూర్తులకు పంచామృతాభిషేకం, సత్యనారాయణ స్వామి పూజ కార్యక్రమం నిర్వహించారు. అశ్వవాహనంపై.. శ్రీ భూలక్ష్మీచెన్నకేశవస్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి సాయంత్రం అశ్వవాహనంపై ఊరేగించారు. చెన్నకేశవస్వామి ఆలయం నుంచి పురవీధుల గుండా పెద్ద అగ్రహరంలోని అహోబిలమఠం వరకు ఊరేగింపు కొనసాగింది. మఠంలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో పూజలు నిర్వ హించి తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు. భజనలు చేస్తూ, భక్తీ గీతాలు ఆలపిస్తు భక్తులు ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం నాగవళి, దేవత విసర్జన, సర్వసమర్పణోత్సవ పూజలతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. కార్యక్రమంలో ఆలయ విచారణ కర్త ప్రభాకర్, మేనేజర్ శ్రీపాదజోషి పాల్గొన్నారు. -
కమలంలో కొత్త జోష్
గురువారం శ్రీ 5 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026–8లో u‘యూరియా యాప్లో బుక్ చేసుకోవాలి’ ధరూరు: యూరియా కావాల్సిన రైతులు ఫర్టిలైజర్ యాప్ ద్వారానే బుక్ చేసుకోవాలని ఏడీఏ సంగీత లక్ష్మి సూచించారు. బుధవారం ఆమె మండల కేంద్రంతో పాటు నెట్టెంపాడులోని ఫర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి రైతుకు అవసరమయ్యే ఎరువులను ఫర్టిలైజర్ యాప్ ద్వారా బుక్ చేసుకోవాలన్నారు. బుక్ చేసుకున్న 24 గంటల్లోగా ఎరువులను తీసుకెళ్లాలన్నారు. బుక్ చేసుకున్న యూరియాను రెండు రోజుల్లో తీసుకోకపోతే బుకింగ్ రద్దు అవుతుందన్నారు. తిరిగి బుకింగ్ చేసకోవాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా స్టాక్ వివరాలు, రికార్డులను పరిశీలించారు. ప్రతి దుకాణం వద్ద విధిగా స్టాక్ వివరాలతో పాటు ధరల పట్టికను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఓ శ్రీలత, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.8,299 గద్వాల వ్యవసాయం: స్థానిక మార్కెట్ యార్డు కు బుధవారం 583 క్వింటాళ్ల వేరుశనగ రాగా.. గరిష్టంగా రూ.8,299, కనిష్టం రూ.3,519, సరాసరి రూ.6,590 ధరలు లభించాయి. 7 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టంగా రూ. 5,930, కనిష్టం రూ.5,720 ధరలు వచ్చాయి. 94 క్వింటాళ్ల కంది రాగా.. గరిష్టంగా రూ. 7566, కనిష్టం రూ. 3519 ధరలు పలికాయి. ‘ప్రతి రూపాయికి బిల్లు తప్పనిసరి’ ● ఎన్నికల ఖర్చుపై అభ్యర్థులకు అవ గాహన అలంపూర్ రూరల్: మున్సిపల్ ఎన్నికల్లో అభ్య ర్థుల వెంట ఎన్నికల పరిశీలికులు నీడలా ఉంటారని, మీరు చేసే ప్రతి రూపాయికి లెక్కలు వేస్తుందని ఈఓ రాజేష్బాబు అన్నారు. అలంపూర్ పట్టణంలోని ఉపాధిహామీ పథకం భవనంలో బుధవారం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులకు సంబంధించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. అభ్యర్థులు నూతన బ్యాంక్ అకౌంట్ తెరిచి, అందులో రూ.లక్ష డిపాజిట్ చేసి వాటినే ఎన్నికలకు ఖర్చు పెట్టాలన్నారు. నామినేషన్ వేసిన నాటి నుంచి పోలింగ్ రోజు వరకు ఖర్చులు చూపించాలని తెలిపారు. 45 రోజుల లోపు ఖర్చులకు సంబంధించిన బిల్లులను గెలిచిన అభ్యర్థులు అధికారులకు అందించికపోతే అనర్హులుగా ప్రకటించే అధికారం ఈసీకి ఉంటుందన్నారు. అలాగే ఓడిన అభ్యర్థులు లెక్కలు సమర్పించకపోతే మూడేళ్ల వరకు ఇతర ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత ఉందన్నారు. కార్యక్రమంలో నోడల్ ఎక్స్పెండేచర్ నరేందర్రెడ్డి, ఏఈఓ యశోద, తహసీల్దార్ మంజుల, కమిషనర్ శంకర్, అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/పాలమూరు: కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ముందు కమల దళపతి రాకతో బీజేపీ శ్రేణుల్లో నూతన జోష్ వచ్చింది. మహబూబ్నగర్లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం నిర్వహించిన విజయ సంకల్ప సమ్మేళనం కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హాజరై తన ప్రసంగంతో కమల దళంలో ఉత్తేజాన్ని నింపారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలలో ఉండే బూత్ స్థాయి కార్యకర్తలు, వివిధ కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు, ఎన్నికల్లో పోటీ కౌన్సిలర్, కార్పొరేటర్ అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఇక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతిసి.. ఒక వర్గాన్ని సంతృప్తి పర్చేందుకు కాంగ్రెస్ చేస్తున్న కుటిల రాజకీయాలను గమనించాలన్నారు. తెలంగాణలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని, అయినా రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదని మండిపడ్డారు. అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ ‘తెలంగాణలో ఎన్నికల ముందు హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మహిళలనే కాదు.. రైతులను, బడుగు, బలహీన వర్గాలు, ఓబీసీలనూ మోసం చేసింది. రైతు భరోసా కింద రూ.15 వేలు, రుణమాఫీ, భూమి లేని వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామని చెప్పి దగా చేసింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఆదివాసీలు ఇలా అన్ని వర్గాల వారిని నమ్మించి నట్టేట ముంచింది. మహిళలకు రూ.2,500 ఇస్తామని చెప్పినా.. ఇంత వరకు ఇవ్వడం లేదు. కల్యాణలక్ష్మి ద్వారా రూ.లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి మోసానికి పాల్పడింది. పదేళ్లు అధికారంలో ఉన్న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే మార్గాన్ని అవలంబించి ప్రజాగ్రహానికి గురైంది. తెలంగాణలో అన్ని వర్గాలకూ న్యాయం జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి. మోదీకి తెలంగాణ ప్రజలపై చిత్తశుద్ధి ఉంది. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధులు మంజూరు చేసినా.. ఇక్కడి కాంగ్రెస్ నేతలు కావాలని విమర్శిస్తున్నారు. రైల్వేరంగంలో హై స్పీడ్ కారిడార్, హైదరాబాద్–పుణె, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చైన్నె రోడ్డు కారిడార్ మంజూరు చేశాం. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో తెలంగాణకు రూ.5,450 కోట్లు కేటాయించాం. యువ నాయకత్వం బీజేపీకి అండగా నిలుస్తోంది. బీజేపీ, మోదీ నాయకత్వాన్ని కోరుకుంటూ ప్రతి నగరం నుంచి ఎన్నికల కోసం పని చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ పోరాటం అధికారం కోసమో, కుర్చీ కోసం కాదు. తెలంగాణ గౌరవం కోసం. ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం మెజార్టీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమలాన్ని గెలిపించుకోవాలి.’ అని నితిన్ నబిన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మహారాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ఆశిష్ షెలాన్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, పీ కొండ విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్రెడ్డి, గౌతమ్రావు, నాయకులు పోతుగంటి రాములు, గువ్వల బాలరాజు, ఆచారి, భరత్, చికోటి ప్రవీణ్, కట్టా సుధాకర్రెడ్డి, నాగురావు నామాజీ, శాంతికుమార్, శ్రీనివాస్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పాలమూరు గడ్డ.. బీజేపీకి అడ్డా: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా బీజేపీ పార్టీకి అడ్డాగా నిలువబోతోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఇక్కడి నుంచే మున్సిపల్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో తెలంగాణ పోరుయాత్రను సైతం పాలమూరులోని మక్తల్ నుంచే ప్రారంభించామని గుర్తు చేశారు. ఇప్పుడు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్రంలోనే మొదటిసారిగా ఇక్కడకు వచ్చారన్నారు. నారాయణపేట మున్సిపాలిటీలో ఏళ్లుగా చైర్మన్ స్థానాన్ని కై వసం చేసుకుంటూనే ఉన్నామని చెప్పారు. మక్తల్, ఆమనగల్ చైర్మన్ స్థానాలను గతంలోనే దక్కించుకున్నామన్నారు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా తాము పాలమూరులో ఎంపీ సీటును గెలిచామని చెప్పారు. ఎవరితో పొత్తులు, అండ లేకుండానే ఒంటరిగా విజయాలను సాధించగలిగామని.. రానున్న రోజుల్లో పాలమూరు బీజేపీకి అడ్డాగా మారబోతుందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో పాలమూరు గడ్డపై బీజేపీ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా హామీలను నెరవేర్చలేక పోయారని విమర్శించారు. మహిళలు, నిరుద్యోగులు, రైతులు, దళిత, బీసీ వర్గాలకు ఒక్క హామీనైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కాలంలోనూ పాలమూరుకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇరుపార్టీలకు బుద్ధి చెప్పాలని కోరారు. పాలమూరుకు ఇప్పటికీ అన్యాయమే: రాంచందర్రావు ఇక్కడి నుంచి రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయినా పాలమూరు జిల్లాకు అన్యాయమే జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. రెండేళ్లలో సీఎం ఇక్కడి ప్రజల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. ఆలయాలను ధ్వంసం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో హోంమంత్రిగా ముఖ్యమంత్రి ఉన్నా లా అండ్ ఆర్డర్ అదుపులో లేదని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని కోరారు. కేంద్ర నిధులతో మున్సిపాలిటీల అభివృద్ధి బాధ్యత బీజేపీ తీసుకుంటుందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల శంఖారావం మోగించిన బీజేపీ భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు దిశానిర్దేశం చేసిన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా తెలంగాణ గౌరవం కోసమే బీజేపీ పోరాటం రాష్ట్ర భవిష్యత్ కోసం మెజార్టీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించండి -
మిగిలింది 5 రోజులే..
సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇంకా ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తికావడంతో అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈనెల 11న మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనుండగా ఎన్నికల ప్రచారానికి మాత్రం ఇంకా ఐదు రోజులే ఉంది. సమయం తక్కువగా ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఉన్న తక్కువ టైంలో ఎక్కువ మంది ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రెబల్స్ పోరుతో ఆందోళన.. మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ ఎక్కువ సంఖ్యలో పోటీలో ఉండటంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఆందోళన నెలకొంది. ప్రధానంగా మహబూబ్నగర్, గద్వాల మున్సిపాలిటీల్లో రెబల్స్ పోరు అఽధికంగా ఉండటంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మహబూబ్నగర్ మున్సిపాలిటీలో అత్యధికంగా 347 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, గద్వాల మున్సిపాలిటీలో 160 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో అత్యధికులు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన వారే రెబల్స్గా ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ క్రమంలో సొంత పార్టీలోనే ఇద్దరు అభ్యర్థుల పోటీతో ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగకుండా ఉండేందుకు ఎమ్మెల్యేలు, పార్టీల ముఖ్య నేతలు రంగంలోకి దిగుతున్నారు. వార్డుల వారీగా ఇన్చార్జ్లకు బాధ్యతలు.. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక వార్డులను సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తున్నాయి. మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా పార్టీ నేతలకు ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగించారు. వార్డులో ఉన్న ఓటర్లలో కులాల వారీగా ఉన్న ఓట్లపై దృష్టి పెట్టి గంపగుత్తగా ఓట్లను పొందేందుకు వ్యూహాలను రచిస్తున్నారు. ప్రధానంగా మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రధాన పార్టీలకు అగ్ని పరీక్షే.. మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ స్థానాలను కై వసం చేసుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థుల ఏకగ్రీవం కోసం కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు కొనసాగించారు. అయితే సొంత పార్టీలోనే అభ్యర్థులు రెబల్స్గా పోటీ చేయడంతో ఏం జరుగుతోందన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో నెలకొంది. ఇప్పటికే పార్టీలో ఏళ్లుగా కొనసాగిన సీనియర్ నాయకులు టికెట్ దక్కకపోవడంతో రాజీనామా చేశారు. మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహాలకు పదును పెడుతోంది. బీజేపీ సైతం మున్సిపల్ ఎన్నికల్లో పాగా వేసేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. అర్బన్ ఓటింగ్ తమకు అనుకూలంగా ఉంటుందని ఈ ఎన్నికల్లో సత్తాచాటాలని ఆ పార్టీ భావిస్తోంది. మహిళా ఓట్లకు గాలం.. మున్సిపల్ ఎన్నికల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు మూడు ప్రధాన పార్టీలు దృష్టిపెట్టాయి. ఎక్కువ సంఖ్యలో ఉన్న మహిళల ఓట్లను పొందేందుకు మహిళా సంఘాలతో సమావేశాలను నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా మహిళల సమస్యలను పరిష్కరిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. వార్డుల వారీగా మహి ళా సంఘాల బాధ్యులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు తమ ఎన్నికల ప్రచారాన్ని మరింత హోరెత్తించనున్నాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సమీపిస్తున్న గడువు పట్టణ వీధుల్లో హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీలు వార్డుల వారీగా పార్టీ ఇన్చార్జ్లకు బాధ్యతలు అభ్యర్థుల ఖర్చులకు ప్రత్యేక నేతల నియామకం గద్వాల, మహబూబ్నగర్లో రెబల్స్ పోరుతో ఆందోళన -
వెట్టి నుంచి విముక్తి
ఆపరేషన్ స్మైల్తో 59 మంది బాలల గుర్తింపు ● పనుల్లో పెట్టుకున్న యజమానులపై కేసులు నమోదు ● బాల కార్మిక వ్యవస్థపై నిఘా ● అధికారుల సమష్టి కృషితోనే సాధ్యం గద్వాల క్రైం: ఒక వైపు సాంకేతిక విజ్ఞానం వైపు వి ద్యార్థులు పరుగులు పెడుతున్నా.. మరికొన్ని స్థాయి ల్లో చిన్నారులు బాల కార్మికులుగా హోటళ్లు.. మోకానిక్ షాపులు.. ఇటుక బట్టీలు.. వ్యవసాయ పొల్లాలో.. గొర్రెల కాపారులుగా మగ్గిపోతున్నారు. విద్యాలయాల్లో ఉండాల్సిన చిన్నారులు తల్లిదండ్రుల నిర్లక్ష్యం.. ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగా ఉండడంతో నిరాక్ష్యరాస్యులుగా మారి బాల కార్మిక వ్యవస్థ కో రల్లో చిక్కుకుపోతున్నారు. ఈ వ్యవస్థను పూర్తి స్థాయి లో నిర్మూలించాలనే లక్ష్యంతో పోలీసు, కార్మిక, విద్యాశాఖ, స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా ప్రభు త్వం చేపట్టిన ఆపరేషన్ స్మైల్లో భాగస్వాములయ్యా రు. జనవరి 1 నుంచి 31 వరకు గద్వాల, అలంపూర్ సెగ్మెంట్లలో జిల్లావ్యాప్తంగా పలు బృందాలుగా వీడి పోయి 59 మంది బాల కార్మికులను గుర్తించి, వారిని పాఠశాలలకు పంపించారు. చిన్నారులను పనిలో పెట్టుకున్న యజమానులపై పోలీసుశాఖ, కార్మిక శాఖ అధికారులు 49 కేసులు నమోదు చేశారు. మెకానిక్ షాపులు, కిరాణాలు, హోటళ్లు, బట్టల దుకాణం, ఇట్టుక బట్టీలు తదితర ప్రదేశాలల్లో చిన్నారులను పనుల్లో పెట్టుకుంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని అధికారులు హెచ్చరించారు. చిన్నారులకు విద్య అనేది ప్రాథమిక హక్కు అని, ఎవరూ కాలరాయొద్దని సూచించారు. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరం బాల కార్మికులను గుర్తించి పాఠశాలలు, ఆర్బీసీ సెంటర్లలో చేర్పించడంతోనే అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. కొన్ని రోజుల తర్వాత వారు తిరిగి పనులు చేసేందుకు వెళ్తున్నారు. నిరంతరం బాలలపై నిఘా లేకపోవడం సమస్యగా మారుతోంది. జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు చేపట్టి పనులు చేస్తున్న చిన్నారులను గుర్తిస్తున్నారే తప్పా.. నిరంతరం నిఘా ఉండడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ సభ్యులే చిన్నారులను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి పనులు చేయిస్తున్నారు. -
సమష్టి కృషితో సాధ్యం
చిన్నారులను కుటుంబ స భ్యులే ఉన్నత లక్ష్యాల వైపు పయనించేలా చర్యలు తీసుకోవాలి. చదువుకోవడం వల్ల ఉండే ప్ర యోజనాలను చిన్నారులకు వివరించాలి. ప్రభుత్వం బాల కార్మికులను గుర్తించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ అందించి వారి పిల్లల భవిష్యత్కు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆర్థిక పరిస్థితులు, సమస్యల కారణంగా కుటుంబ సభ్యులే చిన్నారులను మళ్లీ పనులకు పంపిస్తున్నారు. ప్రభుత్వంతో పౌరుల సమష్టి కృషితో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించొచ్చు. – శ్రీనివాసరావు, ఎస్పీ -
లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట చర్యలు
గద్వాల/అలంపూర్ రూరల్/రాజోళి/అయిజ: మున్సిపల్ ఎన్నికల బ్యాలెట్ పేపర్ల లెక్కింపునకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. అలంపూర్ మున్సిపాలిటీ పరిధిలో పోలింగ్ సామగ్రి పంపిణీ రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్, లెక్కింపు కేంద్రాలుగా అలంపూర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఎంపిక చేయగా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ సామగ్రి పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేందుకు వార్డు వారీగా తగిన సంఖ్యలో కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అవసరమైన వసతులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అనంతరం అలంపూర్, రాజోళి, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో పర్యటించి ఎన్నికల నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను నిల్వ చేసే స్ట్రాంగ్రూంలో బందోబస్త్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కౌంటింగ్ హాళ్లలో టేబుల్స్, సూపర్వైజర్లు ఇతర సిబ్బంది నియామకంలో ఎలాంటి తప్పిదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నా రు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, జెడ్పీ డీప్యూటీ సీఈఓ నాగేంద్రం, ఇరిగేషన్ ఎస్ఈ రహీముద్దీన్, తహసీల్దార్లు జ్యోతి, మంజుల, మున్సిపల్ కమిష్నర్లు సీహెచ్ సైదులు, శంకర్, ఈఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు. రెండో ర్యాండమైజేషన్ పూర్తి మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా రెండో ర్యాండమైజేషన్ ద్వారా మున్సిపాలిటీలకు పోలింగ్ అధికారుల కేటాయించినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. బుధవారం ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్హాల్లో మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ సిబ్బందికి రెండో ర్యాండమైజేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో 77వార్డులు ఉండగా.. 189 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించేందుకు 189 పీఓలు, 189 ఓపీఓలు, 567 మంది చొప్పున మొత్తం 945 మంది ఎన్నికల సిబ్బందిని రెండో ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేసి మున్సిపాలిటీలకు కేటాయించినట్లు తెలిపారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం రాకముందు సమాజంలో అంటరానితనం, అసమానతలు వంటి సామాజిక రుగ్మతలు ఎక్కువగా ఉండేవన్నారు. వీటిని రూపుమాపేందుకు సంఘ సంస్కర్తలు అలపెరగని పోరాటం చేశారన్నారు. ఆనాటి మహనీయులను ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న సామాజిక న్యాయదినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సామాజిక న్యాయ దినోత్సవం ప్రతిజ్ఞను చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, జెడ్పీడీప్యూటీ సీఈఓ నాగేంద్రం, రమేష్బాబు పాల్గొన్నారు. -
బరిలో 1,573 మంది
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల్లో తుదిపోరులో నిలిచిన అభ్యర్థులు ఎవరన్నది తేలిపోయింది. ఉమ్మడి జిల్లాలోని మొత్తం 19 మున్సిపాలిటీల్లో 376 వార్డులకు మొత్తం 1,573 మంది బరిలో ఉన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 3,177 నామినేషన్లు రాగా.. వీటిలో 10 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మరో 675 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అత్యధికంగా మహబూబ్నగర్ కార్పొరేషన్లో మొత్తం 347 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, గద్వాల మున్సిపాలిటీలో 160 మంది, వనపర్తిలో 150 మంది, నాగర్కర్నూల్లో 102 మంది ఎన్నికల బరిలో నిలిచారు. అత్యల్పంగా అలంపూర్లో 36 మంది, వడ్డేపల్లి, దేవరకద్ర మున్సిపాలిటీల్లో 40 మంది చొప్పున పోటీలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 19 పురపాలికల్లో మొత్తం 376 వార్డులు/డివిజన్లు అత్యధికంగా మహబూబ్నగర్ కార్పొరేషన్లో 347 మంది బరిలో.. తక్కువగా అలంపూర్లో 36 మంది, దేవరకద్ర, వడ్డేపల్లిలో 40 మంది చొప్పున అభ్యర్థుల పోటీ -
నాడు కూల్చివేత.. నేడు పునర్నిర్మాణం
● అక్రమ నిర్మాణాలకు కలిసొస్తున్న ఎన్నికలు గద్వాలటౌన్: జిల్లాకేంద్రమైన గద్వాల మున్సిపాలిటీలో ప్రజా అవసరాల కోసం వదిలిన 10 శాతం స్థ లాల్లో అక్రమ నిర్మాణాలు రోజురోజుకు పెరిగిపోతు న్నాయి. స్థానిక 6వ వార్డులోని బసవన్న చౌరస్తాలో రూ. 50లక్షల విలువచేసే మున్సిపల్ స్థలంలో ఓ వ్యక్తి పదేళ్ల క్రితం అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టగా.. అధికారులు గుర్తించి పూర్తిగా నేలమట్టం చే శారు. ఆ తర్వాత చాలాకాలం పాటు నిర్మాణం జోలి కి వెళ్లకుండా గమ్మునుండిపోయారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికార యంత్రాంగం ఎన్నికల విధుల్లో ఉండటాన్ని గమనించి.. ఇదే అదునుగా మళ్లీ అక్రమ నిర్మాణాన్ని చేపట్టారు. స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు గతేడాది ఫిబ్రవరి 18న ఆ నిర్మాణాన్ని మరోసారి కూల్చివేశారు. తాజాగా ము న్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎవరికి కనిపించకుండా పరదాలు కట్టి అక్రమంగా నిర్మాణాన్ని చేపడుతుండటం గమనార్హం. ఈ అక్రమ నిర్మాణంపై స్థానికులు మరోసారి మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.కబ్జాదారుడు కొంతమంది నాయకులకు ముడుపులు చెల్లించాడనే ఆరోపణ లు ఉన్నాయి. అక్రమ నిర్మాణంపై అధికారులు మ రో సారి ఎలా వ్యవహరిస్తారో అనే అంశంపై సర్వ త్రా ఆసక్తి నెలకొంది. అక్రమ నిర్మాణాన్ని ఎన్నికల కూల్చివేతగా స్థానికులు చర్చించుకుంటున్నారు. -
వైభవంగా వేంకటేశ్వరుడి దర్బారు సేవ
● ముత్యాల అలంకరణలో మెరిసిన స్వామివారు ● మన్యంకొండలో కొనసాగిన భక్తుల రద్దీ మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో మంగళవారం రాత్రి వేంకటేశ్వరస్వామి దర్బారు సేవ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా మన్యంకొండ దేవస్థానం నిర్మాణ మూల పురుషుడు అళహరి రామయ్య చిత్రపటానికి హారతితో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం దర్బారు సేవ జరిపారు. శోభాయమానంగా అలంకరించిన శేషవాహనంలో స్వామివారిని గర్భగుడి నుంచి మండపం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ సేవలో స్వామివారు ముత్యాల అలంకరణలో భక్తకోటికి దర్శనమిచ్చారు. అలాగే పల్లకీలో స్వామివారి సుదర్శన పెరుమాళ్లను గర్భగుడి నుంచి తేరు మైదానం సమీపంలో ఉన్న హనుమద్దాసుల కోనేరు మీదుగా దిగువ కొండ వద్దనున్న శ్రీఅలివేలు మంగతాయారు దేవస్థానం వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అనంతరం అక్కడ ప్రత్యేక పూజల అనంతరం తిరిగి మళ్లీ సుదర్శన పెరుమాళ్లను పల్లకీలో గుట్టపై ఉన్న గర్భగుడి వద్దకు తీసుకువచ్చారు. పల్లకీలో స్వామివారి సుదర్శన పెరుమాళ్లు పూల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. ముగిసిన సేవలు మన్యంకొండ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గత నెల 28న ప్రారంభమైన స్వామివారి సేవలు శుక్రవారం ముగిశాయి. ప్రతిరోజు రాత్రి స్వామివారి వివిధ సేవలను నిర్వహించారు. సేవలు ముగిసినప్పటికీ మార్చి 1న దిగువ కొండ వద్దనున్న శ్రీఅలివేలు మంగతాయారు ఉత్సవాలు ప్రారంభమయ్యే వరకు దేవస్థానం వద్ద జాతర కొనసాగనుంది. -
ప్రకృతి వ్యవసాయం లాభదాయకం
అయిజ: పంటల సాగులో రసాయనిక ఎరువుల వినియోగంతో భూములు, గాలి, నీరు కలుషితమవుతున్నాయని.. ప్రకృతి వ్యవసా యంతో పర్యావరణాన్ని కాపాడుకుందామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప అన్నా రు. మంగళవారం మండల కేంద్రంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎస్ఏ) ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (ఎన్ఎంఎన్ఎఫ్)పై వ్యవసాయశాఖ సహకారంతో కృషి సఖిలకు ఐదు రోజులపాటు నిర్వహించనున్న శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయంతో రైతులకు మంచి లాభాలు ఉండటంతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుందన్నారు. రైతులు ప్రకృతి సేద్యంపై దృష్టిసారించాలని సూచించారు. అనంతరం పంటల సాగులో యాజమాన్య పద్ధతులను వివరించారు. స్థానిక రైతువేదికలో జరిగిన రైతునేస్తం కార్యక్రమంలో ఆయన రైతులతో కలిసి పాల్గొన్నారు. అదే విధంగా ఫర్టిలైజర్స్ దుకాణాలను తనిఖీ చేశారు. డీఏఓ వెంట ఏడీఏ సక్రియా నాయక్, ప్రాజెక్ట్ డైరెక్టర్ జగ్గునాయక్, ఏడీఏ సంగీతలక్ష్మి, సాంకేతిక అధికారి శ్రీలత, ఏఓ జనార్దన్ ఉన్నారు. సంఘాల లావాదేవీలు డిజిటలైజేషన్ గద్వాల(గట్టు): స్వయం సహాయక మహిళా సంఘాల లావాదేవీలన్నీ ఇక నుంచి డిజిటలైజేషన్ చేస్తున్నట్లు అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం గట్టు మండల సమాఖ్య భవనంలో విలేజ్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వయం సహాయక మహిళా సంఘాల లావాదేవీలను డిజిటలైజేషన్ చేయడంలో లోకోస్ మొబైల్ యాప్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఈ యాప్పై గ్రామ సహాయకులకు పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. సంఘాల సభ్యుల వివరాలు, పొదుపు, రుణాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు యాప్లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. సంఘాల లావాదేవీల్లో పారదర్శకత పెంచడానికి సాంకేతికను అందిపుచ్చుకోవాలన్నారు. కార్యక్రమంలో యాంకర్పర్సన్ రూప, ఇన్చార్జి ఏపీఎం దేవదాసు, సిబ్బంది జ్యోతి, శేఖర్, తిమ్మక్క, శివకుమార్ పాల్గొన్నారు. నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడి రాక పాలమూరు: ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్నగర్ నగరానికి నేడు(బుధవారం) బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన సందర్భంగా బీజేపీ పాలమూరు శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. బూత్ స్థాయి కార్యకర్తల దగ్గరి నుంచి జిల్లా నాయకులు భారీగా తరలిరావాలని ఇప్పటికే పిలుపునిచ్చారు. ఈ సమావేశం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అన్ని శాఖలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కలిపి దాదాపు 25వేల మందితో ఈ సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం ఒకటి గంటలకు కార్యకర్తలు సమావేశ స్థలం దగ్గరకు చేరుకోవాలని, మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రసంగించనున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈనెల 11న జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ● మహబూబ్నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో చేస్తున్న ఏర్పాట్లను మంగళవారం ఎంపీ డీకే అరుణ, ఎన్నికల ఇన్చార్జి చింతల రామచంద్రరెడ్డి పరిశీలించారు. సమావేశం నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లపై ప్రత్యేకంగా సమీక్షించారు. ● పాలమూరులోని ఎంవీఎస్ కళాశాలలో కార్యకర్తల సమావేశం -
రాజకీయం రణరంగం
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరింపజేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చివరి వరకు ప్రయత్నాలను కొనసాగించారు. ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల వార్డులను ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ముమ్మరంగా ప్రయత్నించారు. పార్టీలో రెబల్స్గా పోటీలో ఉన్న అభ్యర్థులను బుజ్జగించేందుకు ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగారు. మంగళవారం సాయంత్రం 3 గంటల వరకు పార్టీ బీఫారాల అప్పగింతకు సమయం ఉండగా పలుచోట్ల చివరి క్షణం వరకూ హైడ్రామా కొనసాగింది. ● నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో 15వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ప్రయత్నించడం, ఈ క్రమంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. మొదట బీఆర్ఎస్ తరఫున నామినేషన్ వేసిన తవిటి ఇందిర చివరి క్షణంలో కాంగ్రెస్ గూటికి చేరడంతో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థి కాంగ్రెస్కు చేరడంతో మిగిలిన ఇండిపెండెంట్ అభ్యర్థులను విత్డ్రా చేయించేందుకు సైతం కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అభ్యర్థి నజియా బేగం ఇంటికి చేరుకుని అప్పటికే మంతనాలు జరుపుతున్న కాంగ్రెస్ నేతలతో వాగ్వివాదానికి దిగారు. పోలీసుల సమక్షంలో ఆమె బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నట్టు ప్రకటించడంతో ఆమెకే బీఫారాన్ని అందించారు. అసంతృప్త నేతల రాజీనామా పర్వం.. కాంగ్రెస్ తరఫున టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు రాజీనామా చేయడం ఆపార్టీలో చర్చనీయాంశంగా మారింది. టికెట్ రాని వారిని నామినేషన్ ఉపసంహరణ చేసుకోవాలని ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు బుజ్జగించినా ఫలితం దక్కలేదు. ఎన్నికల్లో పోటీ చేసేందుకే మొగ్గుచూపడంతో పాటు పార్టీకి రాజీనామా చేయడం పరిస్థితి తీవ్రతకి అద్దం పడుతోంది. నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో 6వ వార్డులో కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేసిన తైలి శ్రీనివాసులకు పార్టీ బీఫారం ఇవ్వలేదు. దీంతో భంగపాటుకు గురైన ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన నాగర్కర్నూల్ పార్లమెంట్ కమ్యునికేషన్ కోఆర్డినేటర్గా పనిచేశారు. అలాగే నాగర్కర్నూల్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మల్లేపల్లి జగన్ కల్వకుర్తి మున్సిపాలిటీలో 11 వార్డులో నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ బీఫారం ఇవ్వకపోవడతో తన పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. డబుల్ బీఫారాలతో అలజడి.. గద్వాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేసిన అభ్యర్థులకు ఒకే వార్డుల్లో ఇద్దరికి బీఫారాలు ఇవ్వడం కలకలం రేపింది. మొదట మున్సిపాలిటీలో 37 వార్డు స్థానాలకు గానూ కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డికి చెందిన వర్గీయులకు 37 మందికి పార్టీ బీఫారాలను అందజేశారు. ఆతర్వాత కాంగ్రెస్ నేత సరితాతిరుపతయ్య వర్గానికి చెందిన మరో ఏడుగురు సైతం పార్టీ బీఫారాలను సమర్పించడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. స్వతంత్రుల్లో సింహభాగం రెబల్స్గా.. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. చాలాచోట్ల బీజేపీ అభ్యర్థుల కన్నా ఇండిపెండెంట్ అభ్యర్థులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన వారే రెబల్స్గా పోటీలో ఉండటంతో ఎన్నికల ఫలితాల్లో ఏం జరుగుతుందోనని ఇరు పార్టీల కేడర్ ఆందోళన చెందుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగియడం, తుది పోరులో మిగిలిన అభ్యర్థులు ఎవరన్నది తేలిపోవడంతో అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ చివరి నిమిషంలో పార్టీల్లోకి చేరికలు గద్వాల, నాగర్కర్నూల్ మున్సిపాలిటీల్లోచివరి వరకు హైడ్రామా బలాబలాల ప్రదర్శనపై ప్రధాన పార్టీల దృష్టి ఉపసంహరణ ఘట్టం ముగియడంతోఊపందుకోనున్న ఎన్నికల ప్రచారం -
నిబంధనల మేరకే గుర్తుల కేటాయింపు
గద్వాల: మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు ఎన్నికల సంఘం నిబంధనల మేరకే గుర్తులు కేటాయించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు బ్యాలెట్ పేపర్స్ ముద్రణపై కలిగి ఉండాలన్నారు. నామినేషన్ల విత్డ్రా అనంతరం వివిధ రాజకీయ పార్టీల తరపున, స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచిన వారికి ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి ఆయా గుర్తులను కేటాయించాలన్నారు. వార్డుల వారిగా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల వివరాలతో కూడిన బ్యాలెట్ పేపర్ ముద్రణ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఫైనల్ ప్రూఫ్ రీడింగ్ అనంతరం రిటర్నింగ్ అధికారులు బ్యాలెట్ పేపర్స్ ముద్రణ చేయించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించే వారందరికీ పోస్టల్ బ్యాలెట్స్ అవకాశం కల్పించడం జరుగుతుందని, నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రిటర్నింగ్ అధికారులందరూ హ్యాండ్బుక్ క్షుణ్ణంగా అధ్యయనం చేసి అందులోని నిబంధనల మేరకు విధులను పకడ్బందీగా నిర్వ ర్తించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, జెడ్పీ డీప్యూటీ సీఈఓ నాగేంద్రం, ఎన్నికల నోడల్ అధికారులు శ్రీనివాసరావు, రమేష్బాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు ప్రోత్సాహం అవసరం
గద్వాల టౌన్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులను ప్రోత్సహించినప్పుడే మరింత ముందుకు వెళ్తారని డీఈఓ విజయలక్ష్మి అభిప్రాయపడ్డారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల ఆవరణలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టన్, సోషల్ ఫోరం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి టాలెంట్ టెస్టును నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 70 పాఠశాలలకు చెందని 150 మంది విద్యార్థులు టాలెంట్ టెస్టులో పాల్గొన్నారు. ఈ క్రమంలో తెలుగు మీడియం విభాగంలో విజయలక్ష్మి (తనగల), రాఘవేంద్ర (కొండాపూర్), కిషోర్ (ఉత్తనూర్), హరినాథ్గౌడ్ (మేడికొండ) వరుస నాలుగు స్థానాల్లో నిలిచారు. ఇంగ్లిష్ మీడియం విభాగంలో పూజిత (గద్వాల), అఖిలసాయి (మానవపాడు), హాప్సా (గద్వాల) వరుస మూడు స్థానాలు స్థానాలు సాధించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నగదుతోపాటు ప్రశంస పత్రాలను డీఈఓ విజయలక్ష్మి అందజేసి మాట్లాడారు. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి చదువులో అత్యంత ప్రతిభ అవసరమన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, నైపుణ్యాలను వెలికితీయడానికి ఇలాంటి పోటీలు దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో సోషల్ ఫోరం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి ప్రతాప్, ఎస్ఓ అంపయ్య, నాయకులు రాజుసాగర్, హన్మంతునాయక్, శంకర్నాయక్, భాస్కర్రెడ్డి, చంద్రన్న, శ్రీనివాసులు, రాజు, మహేందర్, అశోక్, కృష్ణగౌడ్, రాముడు, పరశురాం తదితరులు పాల్గొన్నారు. -
కొందరికే రుణమాఫీ!
● చేనేత కార్మికుల ఆందోళన ● జిల్లాలో 333 మందికి గాను 101 మందికి మాత్రమే చెల్లింపులు ● రూ. కోటి మాత్రమే విడుదల.. పెండింగ్లో రూ.1.27 కోట్లు ● అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్న కార్మిక సంఘం నాయకులు ●అధికారుల నిర్లక్ష్యమే కారణం.. చేనేత కార్మికుల రుణమాఫీ వ్యవహారంలో జౌళీశాఖ అధికారులు పూర్తిస్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రూ.లక్ష రుణం తీసుకున్న వారి వివరాలను సేకరించకుండా సొసైటీ ద్వారా సిఫారసు చేసిన వ్యక్తుల పేర్లను ఖరారు చేస్తూ రుణమాఫీకి ఎంపిక చేయడం ఎంతవరకు సమంజసం. బ్యాంకు ద్వారా రూ.లక్ష రుణం పొందిన ప్రతి కార్మికుడికి రుణమాఫీ చేయాలి. – పగడాకుల నర్సింహ, నేత కార్మికుడు, అమరచింత అనర్హులకు వర్తింపజేశారు.. నిత్యం చేనేతపై ఆధారపడి జీవిస్తున్న నేతన్నలను దూరం పెట్టి 25 సంవత్సరాలుగా చేనేతకు దూరంగా ఉన్న కార్మికుల పేర్లను రుణమాఫీ కోసం సిఫారసు చేయడం దారుణం. అమరచింతలో 85 మందికి చేనేత రుణమాఫీ వర్తింపజేయగా.. వీరిలో 15 మంది బినామీలు ఉన్నారు. అధికారులు విచారించి అర్హులకు న్యాయం చేయాలి. – చిలువరి నాగరాజు, నేత కార్మికుడు, అమరచింత అమరచింత: చేనేత కార్మికులు బ్యాంకుల్లో తీసుకున్న రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని రెండేళ్ల క్రితం హామీ ఇచ్చింది. ఈ మేరకు అర్హులైన నేతన్నలకు రుణమాఫీ వర్తింపజేయకుండా.. అనర్హుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ చేశారని చేనేత కార్మికులు ఆందోళన చెందుతున్నారు. అర్హులైన కార్మికుల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం అమరచింత యూనియన్ బ్యాంక్ ఎదుట ఆందోళనకు దిగారు. నేతన్నల ఆందోళనకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాకు సుమారు రూ. 2.50 కోట్లు మంజూరు కావాల్సి ఉండగా, కేవలం రూ.కోటి మాత్రమే మంజూరు చేయడంతో చాలా మంది నేతలకు రుణమాఫీ వర్తించలేదన్నారు. అర్హుల రుణాలను మాఫీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. చేనేత, జౌళీశాఖ ఏడీ వచ్చి సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. అనంతరం బ్యాంకు మేనేజర్కు వినతిపత్రం అందజేశారు. జిల్లాలో ఇలా.. జిల్లాలోని అమరచింత, తిపుడంపల్లి, కొత్తకోట, వెల్టూరు, ఘనపురం ప్రాంతాల్లో ఉన్ని కార్మికులతో పాటు మగ్గాలపై జరి చీరలు తయారు నేస్తున్న కార్మికులు ఉన్నారు. వీరిలో 385 మందికి జియోట్యాగ్ నంబర్లు కలిగి ఉండగా.. జాతీయ బ్యాంకుల్లో నేత పనుల పెట్టుబడి కోసం రూ.లక్షలోపు రుణం పొందిన వారు 333 మంది ఉన్నారని జౌళీశాఖ అధికారులు తెలిపారు. వీరందరూ చేనేత రుణమాఫీకి అర్హులని తేల్చి.. పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదించారు. అయితే ప్రభుత్వం రూ. 2.50కోట్లు విడుదల చేయాల్సి ఉండగా.. కేవలం రూ. కోటి మాత్రమే విడుదల చేయడంతో 101 మంది కార్మికుల ఖాతాల్లో మాత్రమే రుణమాఫీ డబ్బులు జమ అవుతున్నాయి. అమరచింతలో 85 మంది.. మిగిలిన గ్రామాల్లో 16 మందికి మాత్రమే రుణమాఫీ వర్తించనుంది. రూ. 1.27కోట్లు రావాల్సి ఉంది.. జిల్లాలో మొత్తం 333 మంది చేనేత కార్మికులు రుణమాఫీకి అర్హులు. వీరికి రూ. 2.50 కోట్లు రావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి రూ.కోటి మాత్రమే వచ్చాయి. ఆ నిధులను 101 మంది నేతన్నల ఖాతాల్లో జమ చేయడానికి చర్యలు తీసుకున్నాం. మరో వారం వ్యవధిలో రూ. 1.27కోట్లు రానున్నాయి. అర్హులందరికీ ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ చేస్తాం. – గోవిందయ్య, చేనేత, జౌళీశాఖ ఏడీ -
దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి నుషిత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అర్హులైన అభ్యర్థులు మార్చి 31వ తేదీ వరకు www.epass.cgg.gov.in వెబ్సైట్లో అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకో వాలన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియలో అవకతవకలు గద్వాల టౌన్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు అనుమానం ఉందని కాంగ్రెస్ నాయకుడు తిరుపతయ్య ఆరోపించారు. ఈ విషయాన్ని సోమవారం రాత్రి 7.30 గంటలకు తిరుపతయ్య తన వర్గంలోని అభ్యర్థులతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి కమిషనర్ జానకిరాం దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీలోని రెండు గ్రూపులలో అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్ల దాఖలు చేశారు. నామినేషన్ల చివరిరోజు జనవరి 30వ తేదీ నాటికి కాంగ్రెస్ పార్టీ నుంచి 119 నామినేషన్లు దాఖలు అయ్యాయని అదనపు కలెక్టర్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. జనవరి 31న నామినేషన్ల పరిశీలన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి 42 నామినేషన్లు దాఖలు అయ్యాయని అడిషినల్ కలెక్టర్ మరో ప్రకటన అధికారింగా విడుదల చేశారు. ఒక్క రోజు తేడాలో నామినేషన్లు ఎలా తగ్గాయని తిరుపతయ్య కమిషనర్ను ప్రశ్నించారు. ఏ అభ్యర్థి కూడా నామినేషన్ను ఉపసంహరించుకోకపోయినా 119 నుంచి 42కు ఎలా తగ్గాయని వాదనకు దిగారు. పరిస్థితి విషమిస్తుందనే సమాచారం మేరకు వెంటనే డీఎస్సీ మొగిలయ్య, సీఐ శ్రీనివాస్, నలుగురు ఎస్ఐలు, 20 మంది పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. కమిషనర్ చాంబర్లో ఉన్న కాంగ్రెస్ నాయకులను బయటికి పంపించి, ముగ్గురు ముఖ్యమైన నాయకులు మాట్లాడేలా చర్యలు తీసుకున్నారు. నామినేషన్ల వివరాలను మున్సిపాలిటీ నుంచి ఇవ్వలేదని కమిషనర్ జానకిరాం వారికి వివరించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 88 నామినేషన్లు దాఖలయ్యాయని, అవే వివరాలను కలెక్టరేట్కు పంపామని చెబుతూ ఆ కాపీని కమిషనర్ కాంగ్రెస్ నాయకులు అందజేశారు. అయితే ఈ జాబితాలో కూడా తప్పులు ఉన్నాయని, 119 నుంచి 88 నామినేషన్లు ఎలా వచ్చాయని వాదించారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తిరుపతయ్య విలేకరులకు వెల్లడించారు. బీఆర్ఎస్, బీజేపీ నామినేషన్ల దాఖలులోనూ ఇదే వ్యత్యాసం ఉంది. ఆయా పార్టీల నాయకులు సైతం ఇవే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలను పరిశీలించిన పీయూ రిజిస్ట్రార్ మహబూబ్నగర్ న్యూటౌన్: పాలమూరు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలనుయూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ. రమేశ్బాబు సోమవారం పరిశీలించారు. అలాగే పీజీ రెండో సంవత్సరం మూడో సెమిస్టర్ పరీక్షలను పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ డా.మధుసూదన్రెడ్డి తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా.చంద్రకిరణ్, హెచ్ఓడీ డా.పండుగ రామరాజు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
మూడు ముక్కలాట..
రసకందాయంలో గద్వాలలో పుర పోరు ● కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య హోరాహోరు ● చేరికలతో బలం పెంచుకునేలా ప్రధాన పార్టీల ఎత్తుగడలు ● జిల్లాకేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించిన బీజేపీ ● ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే బండ్ల ప్రచారం ● ఒకవైపు చేరికలు.. మరోవైపు ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు గద్వాల: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో అలంపూర్, వడ్డేపల్లి, అయిజ మున్సిపాలిటీలలో రాజకీయం ఒక తీరుగా ఉంటే.. జిల్లాకేంద్రమైన గద్వాలలో మాత్రం పూర్తిభిన్నంగా ఉంది. అలంపూర్, వడ్డేపల్లి, అయిజ మున్సిపాలిటీలలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీఆర్ఎస్ రెబెల్ వర్గం పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉంటే.. గద్వాలలో మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ ఉంటూనే.. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో బీఫాంల పంచాయతీ కొనసాగుతుంది. ఇప్పటికే ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా ఇక మిగిలింది బీఫాంల సమర్పణ, బరిలో ఎవరు ఉండబోతున్నారో తేల్చే అభ్యర్థుల తుది జాబితానే రావాల్సి ఉంది. బీఫాంల పంచాయితీ.. ఇదిలా ఉంటే గద్వాల కాంగ్రెస్ పార్టీలో బీఫాంల పంచాయితీ కొనసాగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బండ్ల కృష్ణమోహన్రెడ్డి తన వర్గానికి కాంగ్రెస్ పార్టీ బీఫాంలను ఇప్పించుకోవడంలో సఫలీకృతమయ్యారు. అయితే పార్టీలో ఇన్చార్జిగా కొనసాగుతున్న తనకు కాకుండా ఇతర పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు ఎలా బీఫాంలు ఇస్తారని సరిత అధిష్టానం వద్ద పంచాయితీ పెట్టింది. గద్వాలలో 37 వార్డులకు కాకుండా సగం వార్డులకై నా తనవర్గానికి ఇవ్వాలని కోరారు. అయితే మరోవైపు ఒక్క బీఫాం తక్కువగా ఇచ్చినా ఒప్పుకొనేది లేదని ఎమ్మెల్యే బండ్ల పట్టుబట్టడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తలనొప్పి వచ్చి పడింది. ఈ నేపథ్యంలో ఇద్దరు నాయకుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ను రంగంలోకి దింపింది. ఈ క్రమంలోనే సంపత్కుమార్ సైతం ఎమ్మెల్యే బండ్ల, సరిత వర్గాలతో మంతనాలు జరిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సైతం ఇరువర్గాలతో నేరుగా మాట్లాడినట్లు సమాచారం. వర్గపోరుతో పార్టీకి నష్టం జరగకుండా చూడాలని, అదే క్రమంలో పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. దీంతో సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ శంకర్కు బీఫాం ఇవ్వడానికి ఎమ్మెల్యే బండ్ల సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అభివృద్ధి మంత్రంతో ఎన్నికల్లో ఓటర్లను కలుస్తూ మరోవైపు పార్టీలో వర్గపోరు, రెబెల్స్ తాకిడి వంటి సవాళ్లను ఎదుర్కొని ఎన్నికల్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తనవర్గాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో అనే చర్చ పట్టణంలో మొదలైంది. -
కదిలింది.. చెన్నకేశవుడి రథం
(ఇన్సెట్లో) మాట్లాడుతున్న మంత్రాలయ పీఠాధిపతి సుబుదేంద్రతీర్థ శ్రీపాదులు దేవదేవుడైన శ్రీచెన్నకేశవస్వామి ఉభయ దేవేరులతో కలిసి అధిష్టించిన దివ్యరథం భక్తుల జయజయ ధ్వానాల మధ్య ముందుకు కదిలింది. ముందుగా ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి మంగళవాయిద్యాల నడుమ పల్లకీలో ఊరేగిస్తూ రథం వద్దకు తీసుకువచ్చారు. మంగళ వాయిద్యాలు, గోవింద నామస్మరణ మధ్య ఆదివారం రాత్రి 11.19 గంటలకు శ్రీభూలక్ష్మీచెన్నకేశవస్వామి రథాన్ని వేలాదిగా తరలివచ్చిన భక్తులు పోటీపడి లాగారు. అంతకు ముందు స్థానిక పాతబస్టాండ్లోని రథశాల దగ్గర మంత్రాలయ పీఠాధిపతి సుబుదేంద్రతీర్థ శ్రీపాదులు రథానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పాంత్రం ప్రాశస్త్యం, కోటకున్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని గద్వాలకు పూర్వవైభవం తీసుకువస్తామన్నారు. గద్వాలను పవిత్ర యాత్ర స్థలంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు. గద్వాల ప్రాంతంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. లోక కల్యాణం కోసం ప్రతిఒక్కరు ఆధ్యాత్మిక చింతను అలవర్చుకుని, నిత్యం పూజలు చేయాలని సూచించారు. – గద్వాల టౌన్ -
మంచాలకట్టను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
కొల్లాపూర్: కృష్ణానది తీరంలోని మంచాలకట్ట గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా, పర్యాటకులకు కనువిందు చేసే విధంగా ఉన్న ఈ గ్రామాన్ని నిత్యం పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఈ మేరకు సోమవారం మంత్రి గ్రామాన్ని సందర్శించి అభివృద్ధి పనుల నిమిత్తం రూ.1.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధులతో కృష్ణానది తీరాన కాటేజీలు ఏర్పాటు చేయాలని పర్యాటక శాఖ అధికారులకు ఫోన్లో సూచించారు. అలాగే గ్రామాన్ని సందర్శించి ప్రతిపాదనలు రూ పొందించాలని ఆదేశించారు. అదేవిధంగా గ్రామానికి నూతనంగా 17 ఇళ్లను మంజూరు చేశారు. గ్రామంలో ఎవరూ పూరి గుడిసెలో నివశించవద్దని, కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుందని చెప్పారు. అనంతరం మంచాలకట్ట గ్రామంలో గతకొద్ది రోజుల క్రితం మరణించిన రాగుల వెంకటస్వామి, రాగుల మశమ్మల కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ శివయ్య, నిరంజన్, బాలరాజు, గోవింద్, కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఈసారీ.. నిరాశే
కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు దక్కని కేటాయింపులు సాక్షి, నాగర్కర్నూల్: కేంద్ర బడ్జెట్ ఈసారి కూడా ఉమ్మడి పాలమూరు జిల్లావాసులకు నిరాశే మిగిల్చింది. ఉమ్మడి జిల్లాకు జీవనాడిగా చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ జాతీయ హోదా విషయంలో బడ్జెట్లో ప్రస్తావన కరువైంది. సాగునీటి ప్రాజెక్టులు, పర్యాటక రంగ అభివృద్ధితో పాటు గద్వాల– మాచర్ల రైల్వేలైన్కు ఎలాంటి కేటాయింపులు దక్కలేదు. కొత్తగా అలంపూర్– నల్లగొండ వరకు జాతీయ రహదారి నిర్మాణానికి నిధులు కేటాయిస్తారని భావించినా భంగపాటు ఎదురైంది. వెనుకబడిన జిల్లాలో ఉపాధి కల్పనకు ప్రత్యేకంగా పరిశ్రమల ఏర్పాటు ఉంటుందని ఆశించగా అందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే హైదరాబాద్– బెంగళూరు రైల్వే మార్గంలో హైస్పీడ్ కారిడార్ ఏర్పాటు, ప్రతి జిల్లాలో బాలికల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా హాస్టల్ ఏర్పాటు, చేనేత కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహంతో ఉమ్మడి జిల్లాకు కాసింత ప్రయోజనం కలగనుంది. ఊసే లేని గద్వాల– మాచర్ల కొత్త లైన్ ఉమ్మడి పాలమూరులో చేపట్టాల్సిన కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలకు కేంద్ర బడ్జెట్లో ప్రస్తావన కరువైంది. గద్వాల– మాచర్ల రైల్వే లైన్ నిర్మాణానికి నిధులు కేటాయిస్తారని భావించగా నిరాశే మిగిలింది. కృష్ణా– వికారాబాద్– గద్వాల– డోర్నకల్ రైల్వే లైన్ల ప్రతిపాదనలు అలాగే మిగిలిపోయాయి. ఉమ్మడి జిల్లా అలంపూర్ సమీపంలోని పుల్లూరు నుంచి నల్లగొండ వరకు నూతన జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదనలున్నాయి. ఇందుకోసం ఇప్పటికే సర్వే సైతం నిర్వహించగా.. ఈసారి బడ్జెట్లో మాత్రం నిధులు కేటాయించలేదు. చేనేత కార్మికులకు దన్ను.. మహాత్మగాంధీ గ్రామ్ స్వరాజ్, సమర్థ్ 2.0 కార్యక్రమాల ద్వారా చేనేత కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను కేంద్రం అందించనుంది. ఉమ్మడి జిల్లాలోని గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో ఉన్న మరమగ్గాలు, చేనేత కార్మికులకు ఈ పథకం ద్వారా మేలు చేకూరనుంది. చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయంగా బ్రాండింగ్తోపాటు మార్కెట్ లింకేజీ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచనున్నారు. చదువు.. ఉపాధి విద్యాభివృద్ధిలో భాగంగా బాలికల కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా హాస్టల్ ఏర్పాటు చేయనున్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో బాలికల భాగస్వామ్యం పెంచడంతోపాటు విద్యాభివృద్ధి కోసం ఈ హాస్టళ్లను ఏర్పాటు చేస్తారు. దీనిద్వారా బాలికలకు చదువుతోపాటు ఉపాధికి అవసరమైన నైపుణ్యాలను కల్పించనున్నారు. ● యువతకు చదువుతో పాటు నేరుగా ఉపాధి కల్పించే విధంగా నైపుణ్యాలను పెంచేందుకు ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్ కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్, కంటెంట్ క్రియేషన్ ల్యాబ్లను ఏర్పాటుచేసి యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. సామాన్యులకు వ్యతిరేకం.. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా ఉంది. రాష్ట్రంతోపాటు వెనుకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎలాంటి కేటాయింపులు లేవు. విభజన సమయంలో హామీ ఇచ్చిన విధంగా పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ జాతీయ హోదా విషయంలో ప్రస్తావన కూడా లేదు. ఉపాధి హామీ పథకానికి అవసరమైన నిధులు పెంచలేదు. నిరుద్యోగులు, నిత్యావసర ధరలు తగ్గించేందుకు అవసరమైన చర్యలు కనిపించలేదు. – మల్లు రవి, ఎంపీ, నాగర్కర్నూల్ రాష్ట్రంపై నిర్లక్ష్యం.. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రా న్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఈ బడ్జెట్లో రాష్ట్రానికి ఇచ్చిందేమీ లేదు. పర్యాటకరంగ అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరిగణలోకి తీసుకోలేదు. పేదలు, మధ్యతరగతి వర్గాలపై దృష్టిపెట్టలేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు రైల్వేతోపాటు జాతీయ రహదారుల ప్రస్తావన లేదు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. – జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి హైస్పీడ్ రైల్వే కారిడార్.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే రైల్వే మార్గాన్ని హైస్పీడ్ రైల్వే కారిడార్గా మార్చనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఫలితంగా ఈ మార్గంలో ప్రయాణించే రైళ్లు వేగాన్ని పుంజుకోనున్నాయి. పర్యావరణహితమైన రవాణా వ్యవస్థగా మార్చడంతోపాటు ప్రయాణ సమయాన్ని తగ్గించేలా రైళ్ల వేగాన్ని పెంచనున్నారు. తద్వారా వేగంగా చేరుకోవడంతో పాటు ఇతర రైల్వే నెట్వర్క్, రోడ్లపై రద్దీ భారం తగ్గనుంది. ఈ హైస్పీడ్ రైల్వే కారిడార్ ద్వారా ఉమ్మడి జిల్లాలో రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. దక్కని జాతీయ హోదా.. ఉమ్మడి జిల్లాలో చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా ప్రకటనతో పాటు పనులను వేగంగా పూర్తి చేసేందుకు కేంద్రం నుంచి నిధులు అందించాలన్న డిమాండ్ ఏళ్లుగా వ్యక్తమవుతోంది. అయితే కేంద్ర బడ్జెట్లో దీనిపై కనీస ప్రస్తావనకు నోచుకోలేకపోయింది. ఫలితంగా ఈ ప్రాజెక్ట్ పూర్తిచేసేందుకు అవసరమైన నిధులు సర్దుబాటు చేసే భారమంతా రాష్ట్రం మీదే పడింది. అలాగే ఉమ్మడి జిల్లాలో ఐదోశక్తి పీఠమైన అ లంపూర్ జోగుళాంబ ఆలయానికి ప్రసాద్ పథకం కింద ప్రత్యేకంగా నిధులు అందుతాయని భావించినప్పటికీ నిరాశే మిగిలింది. కొత్త జిల్లాలకు నవోదయ, కేంద్రీయ విద్యాలయాల మంజూరుపై ఆశలు పెట్టుకోగా భంగపాటు తప్పలేదు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ ప్రస్తావన కరువు గద్వాల– డోర్నకల్ రైల్వే లైన్లు, నూతన జాతీయ రహదారులకు తప్పని భంగపాటు హైదరాబాద్– బెంగళూరు హైస్పీడ్ రైల్వే కారిడార్తో ప్రయోజనం ప్రతి జిల్లాలోనూ బాలికలకు ప్రత్యేకంగా హాస్టల్ ఏర్పాటుతో మేలు -
కార్మికులకు కనీస వేతనాలు అందించాలి
రాజోళి: సంఘటిత, అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు వారి పనిని బట్టి కనీస వేతనాలు అందించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పేరు నర్సింహ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం అందించాలని, ఎనిమిది గంటలు మాత్రమే పని చేయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. వాటికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న కేంద్ర కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని, దానికి ప్రతి కార్మికుడు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాజోళి మండల కన్వీనర్ లక్ష్మన్న, వెంకటేశ్వర్లు, లీలావతి, చిట్టెమ్మ, బీసమ్మ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ ఎన్నికలపై నిఘా
గద్వాల క్రైం: మున్సిపల్ ఎన్నికలపై జిల్లా పోలీసుశాఖ నిఘా వ్యవస్థను బలోపేతం చేస్తు ఎలాంటి అల్లర్లు, హింసత్మక ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, అలంపూర్, అయిజ, వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల నిర్వహించనున్న నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఈ నెల 3 వరకు ఉపసంహరణలకు అవకాశం ఉండడంతో దాని తర్వాత అసలుసిసలైన ఎన్నికల వేడి రాజుకోనుంది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అభ్యర్థులు తదితర వివరాలపై ఇప్పటికే ఫ్లయింగ్ సర్వైలైన్ టీం(ఎఫ్ఎస్టీ), స్టాటిక్ సర్వైలైన్స్(ఎస్ఎస్టీ) బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓటర్లకు పంచే మద్యం, నగదు, వస్తువులు వంటివి కట్టడి చేయడంతో పాటు వాటిని అందించే వారిపై కేసులు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. గద్వాల 37, అయిజ 20, అలంపూర్ 10, వడ్డేపల్లి 10 మొత్తం 77 వార్డు స్థానాల్లో అభ్యర్థులు తమ భవితవ్యం తేల్చుకోనున్నారు. ఆయా మున్సిపల్ వార్డుల్లో ప్రత్యేక బృందం సమస్యాత్మక అంశాలపై నివేదికలను సేకరిస్తున్నారు. తాజాగా శనివారం రాత్రి జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీలో అకస్మాత్తుగా కార్డెన్ సెర్చ్ నిర్వహించి అనుమతి లేని బైక్లు, ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. 50 వేల లోపే నగదు.. కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికల నియమావళి మేరకు రూ. 50వేల కంటే అధికంగా నగదు తీసుకెళ్లరాదు. అత్యవసరంగా తీసుకెళ్లాంటే నగదుకు సంబంధించిన సరైన ఆధారాలు, వాటికి సంబంధించిన రశీదులు అధికారులకు చూపించాల్సి ఉంటుంది. పెద్ద మొత్తంలో వస్తు సామగ్రి, మద్యం, చీరలు, ఇతర ఒకే రకమైన వస్తువులు తీసుకెళ్లినా ఆధారాలు చూపించాల్సిందే. లేని తరుణంలో అధికారులు వాటిని సీజ్ చేస్తారు. ముందుస్తు అరెస్టులు.. బైండోవర్లు విస్తృతంగా తనిఖీలు భద్రత ఏర్పాట్లపై కసరత్తు నగదు.. మద్యం పంపిణీపై ప్రత్యేక దృష్టి విస్తృతంగా తనిఖీలు... జిల్లాకు సంబంధించి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లోని పోలీసు సిబ్బంది చెక్పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వార్డుల్లో, ప్రతి మున్సిపల్ పరిధిలో ప్రత్యేక బృందం ఎన్నికల నియమావళికి సంబంధించిన ఫిర్యాదులపై స్పందిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. తహసీల్దార్ స్థాయి అధికారి, నలుగురు పోలీసులు, వీడియోగ్రాఫర్ సైతం విధుల్లో ఉంటున్నారు. స్టేషన్ పరిధిలోని సిబ్బంది, ప్రత్యేక బృందం సమస్యాత్మక పోలీంగ్ కేంద్రాలను సందర్శించి అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. పాత నేరస్తులు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, రౌడీ షీట్ల వివరాలు సేకరిస్తున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో అల్లర్లు సృష్టించిన వారిపై నిఘా ఉంచడంతో పాటు బైండోవర్ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో అనుచిత వాఖ్యలు చేసినా, ఫార్వర్డ్ మెసేజ్ చేసినా, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించిన ఎన్నికల నియమావళి ప్రకారం కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
సర్వం సిద్ధం
● నేటి నుంచి ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు ● సీసీ కెమెరాల పర్యవేక్షణ ● 23 కేంద్రాల ఏర్పాటు ●అన్ని ఏర్పాట్లు చేశాం రెండు విడతలుగా జరిగే ప్రయోగ పరీక్షలకు జిల్లా పరిధిలోని అన్ని కళాశాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంటర్ బోర్డు నిర్ణయం మేరకు సీసీ కెమెరాలు ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు కళాశాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాం. దీనిద్వారా ప్రయోగ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించే వెసులుబాటు ఉంది. ఫలితంగా ప్రతిభ ఉన్న విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. బోర్డు ద్వారా నియమితులైన ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ల ద్వారా పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలి. – హృదయరాజు, డీఐఈఓ, గద్వాల గద్వాలటౌన్: ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమవనున్న నేపథ్యంలో అందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కళాశాలల్లో అన్ని వసతులు ఉండి కెమెరాలు బిగించిన వాటికే పరీక్ష కేంద్రాలుగా అనుమతి ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కలిపి మొత్తం 43 జూనియర్ కళాశాలల్లో మొత్తం 3,925 మంది విద్యార్థులు చదువుతుండగా.. 23 పరీక్ష కేంద్రాలను గుర్తించారు. 50 మంది కన్నా తక్కువ విద్యార్థులు ఉన్న కళాశాలల విద్యార్థులకు సమీపంలో ఉన్న కళాశాలలకు మార్చారు. సైన్స్ గ్రూపుల్లో ఎంపీసీ విద్యార్థులు భౌతిక, రసాయన శాస్త్రాలు.. బైపీసీ విద్యార్థులు భౌతిక, రసాయన శాస్త్రంతో పాటు జంతు, వృక్ష శాస్త్రాల్లో ప్రయోగాలు చేయించాల్సి ఉంటుంది. ఒక్కో సబ్జెక్టుకు 30 మార్కులు ఉంటాయి. రెండు విడతల్లో... జిల్లా వ్యాప్తంగా మొదటి విడత ఈ నెల 2 నుంచి 6వ తేదీ వరకు, రెండో విడత ఈ నెల 7వ నుంచి 11వ తేదీ వరకు ప్రయోగ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రం నుంచి నేరుగా పర్యవేక్షణ పరీక్షల నిర్వహణకు ప్రయోగశాలల్లో సీసీ కెమెరాలు బిగించి ఐపీ అడ్రస్ నమోదు చేసినందున జిల్లాలోని వివిధ కళాశాలల్లో నిర్వహించే ప్రయోగ పరీక్షలను జిల్లా ఇంటర్ విద్యాధికారితో పాటు ఇంటర్ బోర్డు అధికారులు నేరుగా పర్యవేక్షించే వెసులుబాటు కలగనుంది. ప్రతీసారి స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేయించాల్సిన అవసరం లేదు. మరోవైపు పరీక్ష కేంద్రాలపై ఏదైనా ఫిర్యాదు వస్తే సీసీ కెమెరాల ద్వారా డిజిటల్ వీడియో రికార్డర్లో మొత్తం రికార్డు కానుండటంతో పరిశీలించే వెసులుబాటు ఉంటుంది. వెంటనే మార్కుల నమోదు ప్రయోగ పరీక్షలు ముగిసిన వెంటనే మూల్యాంకనం చేసిన మార్కులను ఇంటర్బోర్డు వెబ్సైట్లో అప్పటికప్పుడు నమోదు చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ప్రయోగ పరీక్షల నిర్వహణకు కావాల్సిన ప్రశ్నాపత్రాలు కూడా పరీక్ష సమయానికి ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిద్వారా ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. – వివరాలు IIలో.. జూనియర్ కళాశాలలు 43 జనరల్ విద్యార్థులు 2,327 ఓకేషనల్ విద్యార్థులు (ద్వితీయ) 714 ఓకేషనల్ విద్యార్థులు (ప్రథమ) 884 జనరల్ విద్యార్థులకు కేంద్రాలు : 14 ఓకేషనల్ విద్యార్థులకు కేంద్రాలు : 09 జిల్లా వ్యాప్తంగా.. జనసంద్రం.. మన్యంకొండ గోవింద నామస్మరణతో మార్మోగిన గిరులు ఒక్కరోజే స్వామివారిని దర్శించుకున్న లక్ష మంది భక్తులు రథోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసిన దేవాదాయ శాఖ అధికారులు -
శాంతియుత వాతావరణంలో..
మున్సిపల్ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైనా అల్లర్లు, దాడులు, హింసత్మక ఘటనలకు ప్రేరేపిస్తే సహించేది లేదు. ప్రత్యేక బృందాలు నిత్యం తనిఖీలు చేపడుతున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే చర్యలు తప్పవు. పాత నేరస్తులను ముందుస్తుగా బైండోవర్ చేశాం. నామినేషన్ కేంద్రాలను సైతం తనిఖీలు చేశాం. అవసరమైతే పదో బెటాలియం సిబ్బంది సహాయంతో భద్రత చర్యలు కట్టుదిట్టం చేస్తాం. 13 వరకు కోడ్ అమల్లో ఉంటుంది. ర్యాలీలు, సభలు నిర్వహించాలంటే తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. – శ్రీనివాసరావు, ఎస్పీ ● -
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
గద్వాల క్రైం: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించి.. శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉంటూ అనుమానాస్పద కేసులపై వేగంగా విచారణ చేయాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. గద్వాల, అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపల్ ఎన్నికల విషయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వ్యక్తులపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రౌడీషీటర్లను ముందస్తుగా అరెస్టు చేసి బైండోవర్ చేయాలన్నారు. వివిధ పోలీసుస్టేషన్లలో నమోదైన కేసులు, సమస్యలపై వచ్చే బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాలపై విలేజ్ రోడ్డు సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. హిట్ అండ్ రన్ ప్రమాదాలపై ప్రత్యేక విచారణ చేపట్టాలన్నారు. అనుమతి లేకుండా ఇసుక, మట్టి, రేషన్ బియ్యం, నిషేధిత మత్తు పదార్ధాలు, గంజాయి, పేకాట వంటివి కట్టడి చేయాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా పెట్టాలన్నారు. స్టేషనలో నమోదైన కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసి నిందితులకు శిక్ష పడేలా వ్యవహరించాలన్నారు. గ్రామాల్లో అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించి చైతన్యం చేయాలన్నారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐ టాటాబాబు, శ్రీను, ప్రదీప్కుమార్, ఎస్ఐలు కల్యాణ్కుమార్, శ్రీకాంత్, శేఖర్, రాజునాయక్, శ్రీనివాసులు, మల్లేష్, శ్రీహరి, నందికర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావాణి రద్దు
గద్వాల: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రజావాణిని యథావిధిగా కొనసాగిస్తామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు. సమాజంపై విద్యార్థులకు అవగాహన గద్వాల: ప్రభుత్వ కాలేజీలలో చదువుకోవడంతో విద్యార్థులకు సమాజం పట్ల అన్ని రకాల అవగాహన ఏర్పడుతుందని దీంతో విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తారని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు నిర్వహించిన ఫేర్వెల్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ కళాశాల విద్యార్థులు అత్యధికంగా వెనకబడిన, నిరుపేద కుటుంబాల నుంచి వస్తారని, చదువుతోపాటు సమాజం పట్ల కూడా పూర్తిగా అవగాహన ఏర్పడుతుందన్నారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న నాతో సహా ప్రభుత్వ ఉద్యోగులందరూ అదే వర్గానికి చెందినవారమన్నారు. కార్యక్రమంలో ఏజీఎంసీ బండ్ల దేవేందర్రెడ్డి, గండిచెరువు శేఖర్, పవన్కుమార్, కలీముల్లా, సృజన, గీత, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు నిబంధనలు తప్పనిసరి గద్వాల క్రైం: ప్రతిఒక్కరు రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఇన్చార్జి రవాణాధికారి కృష్ణారెడ్డి అన్నారు. శనివారం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో నిర్వహించిన రోడ్డు భద్రత వారోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సీటు బెల్టు, హెల్మెట్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్తోపాటు సామర్థ్యం కలిగిన వారు మాత్రమే రోడ్డు ప్రయాణాలు చేయాలన్నారు. మద్యం, సెల్ఫోన్, నిద్రలేమి కారణాలతో డ్రైవింగ్ చేయడం ద్వారా ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుందన్నారు. అనంతరం ప్రైవేట్ డ్రైవర్లకు ఉచిత హెల్త్ క్యాంపు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సిబ్బంది రాములు, రమేష్, రుక్మాత్ తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపాలిటీలు..
నామినేషన్లు గద్వాల/ గద్వాల టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 408 నామినేషన్లు దాఖలయ్యాయని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు తెలిపారు. అలంపూర్ మున్సిపాలిటీ పరిధిలో 10 వార్డులకు గాను మొత్తం 45 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఇందులో బీఎస్పీ పార్టీ నుంచి 1, బీజేపీ 8, సీపీఐ (ఎం) 1, కాంగ్రెస్ 17, బీఆర్ఎస్ 13, జనసేన 2, నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే గద్వాల మున్సిపాలిటీ పరిధిలో 37 వార్డులకు గాను 232 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. ఇందులో ఆప్ నుంచి 1, బీఎస్పీ 1, బీజేపీ 40, సీపీఐ 1, కాంగ్రెస్ 42, ఎంఐఎం 5, బీఆర్ఎస్ 30, జనసేన 5, ఫార్వర్డ్ బ్లాక్ 2 నామినేషన్లు దాఖలయ్యాయి. అయిజ మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను 80 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో బీఎస్పీ నుంచి 4, బీజేపీ 18, కాంగ్రెస్ 23, బీఆర్ఎస్ 30, జనసేన 1, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీ నుంచి 1 నామినేషన్లు వచ్చాయి. అదేవిధంగా వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలో 10 వార్డులకు గాను 51 మంది అభ్యర్థులు నామినేషన్లు వచ్చాయి. ఇందులో బీజేపీ నుంచి 11, కాంగ్రెస్ 12, ఎంఐఎం 1, బీఆర్ఎస్ 13, ఫార్వర్డ్ బ్లాక్ నుంచి 12 నామినేషన్లు దాఖలు అయినట్లు పేర్కొన్నారు. మొత్తంగా నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 77 వార్డులకు గాను 408 మంది అభ్యర్థులు 408 నామినేషన్లు దాఖలు చేసినట్లు వివరించారు. ప్రత్యర్థి పార్టీల గాలం.. సొంత పార్టీపై కోపంగా ఉన్న వారికి ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు గాలం వేస్తున్నారు. ప్రధానంగా గద్వాలలో అధికార కాంగ్రెస్ పార్టీకి చాలా వార్డులలో రెబల్స్ బెడద ఉంది. టికెట్ రాని కాంగ్రెస్ నాయకులు గుర్రుగా ఉన్నారు. బీఆర్ఎస్కు 3, 6, 8, 20 వార్డులలో రెబల్స్ బెడద ఏర్పడింది. బీజేపీకి 8, 23 రెబల్స్ బెడద తప్పడం లేదు. తమ సత్తా ఏమిటో ఎన్నికలలో చూపిస్తామని ఆయా పార్టీల్లోని రెబల్స్ నాయకులు సవాల్ విసురుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ పర్వానికి ముందే ఇతర పార్టీల వారిని లోపాయికారీగా మద్దతు కూడగట్టుకోవడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు పోటీపడుతున్నాయి. వివిధ వార్డుల్లో ప్రాబల్యం ఉన్న మైనార్టీల ఓటర్లను పిలుచుకొని మద్దతు కోరుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న నాయకులు.. జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వర్గీయులలో టికెట్ రాని వారితోపాటు అసంతృప్తితో ఉన్న నాయకులను కలుపుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ ఖరారైన ప్రధాన పార్టీల అభ్యర్థులు సమయం చిక్కినప్పుడల్లా కొందరు ముఖ్య నాయకుల ఇళ్లకు నేరుగా వెళ్లి వారితో సంప్రదింపులు మొదలుపెట్టారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు వార్డుల వారీగా అలిగిన నాయకుల ఇళ్లకు దూతలను పంపుతూ సర్దిచెప్పే పనిలో నిమగ్నమయ్యారు. నాయకుల మద్దతును కూడగట్టుకోవడానికి అన్ని పక్షాల నేతలు తమ చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. -
మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
గద్వాల: పోలింగ్ నిర్వహణ విధులు బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలింగ్ విధులు నిర్వహించే ప్రిసైడింగ్ అధికారులకు ఏవైనా సందేహాలుంటే వెంటనే శిక్షకులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు. అదేవిధంగా ఎన్నికల హ్యాండ్బుక్ను క్షుణ్ణంగా అమలు చేయాలన్నారు. ఎలక్ట్రోరల్ ఓటరు జాబితాలో పేర్లు ఉన్న వారందరికీ ఓటుహక్కు కల్పించాలని, ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలన్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రాజకీయ పార్టీల గుర్తులతో పోటీ చేస్తున్నందున అధికారులు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులకు పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. అంతకు ముందు మాస్టర్ శిక్షకలు పోలింగ్ నిర్వహణపై ప్రిసైడింగ్ అధికారులకు సమగ్రంగా శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఎన్నికల జనరల్ పరిశీలకులు చంద్రశేఖర్రెడ్డి, జెడ్పీడీసీఓ నాగేంద్రం, నోడల్ అధికారులు రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు. సమర్థవంతంగా విధులు.. ఓటరు జాబితా సవరణకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు సూపర్వైజర్లు, బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ నిర్వహించిన వీసీలో పాల్గొన్న అనంతరం జిల్లాలోని ఎన్నికల అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 54.87 శాతం మ్యాపింగ్ పూర్తయిందని, ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్ణీత గడువులోగా పూర్తిచేశామన్నారు. బీఎల్ఓలు, సూపర్వైజర్లకు లక్ష్యాలు కేటాయించి క్షేత్రస్థాయిలో వేగంగా ప్రక్రియ కొనసాగేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ అలివేలు, ఎన్నికల విభాగం అధికారి కరుణాకర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా రాములోరి కల్యాణం
ఎర్రవల్లి: పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో శనివారం సీతారాముల కల్యాణ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సీతారాములను అపురూపంగా ముస్తాబు చేసి వేదమంత్రాల నడుమ వైభవంగా కల్యాణాన్ని జరిపారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు ఆలయ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కల్యాణానికి హాజరైన భక్తులకు ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, అర్చకులు భువనచంద్ర, దత్తుస్వామి, భానుమూర్తి తదితరులు పాల్గొన్నారు. హనుమత్ వాహనంపై వేంకటేశ్వరుడు మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారి హనుమత్ వాహన సేవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన హనుమత్ వాహనంపై స్వామివారిని గర్భగుడి నుంచి దేవస్థానం ముందున్న మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాలు, భక్తుల హరినామచ్చరణల మధ్య స్వామివారి సేవ ముందుకు కదిలింది. బంగారు ఆభరణాలు, వివిధ రకాల పూల అలంకరణల మధ్య స్వామివారు హనుమత్ వాహనంపై ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. అలాగే ప్రభోత్సవం నిర్వహించారు. -
ఈసారైనా.. పట్టాలెక్కేనా?!
ప్రతిసారి పాలమూరుకు దక్కని కేటాయింపులు ● ఏళ్లుగా పెండింగ్లోనే గద్వాల–మాచర్ల రైల్వేలైన్ ● ఇంకా ప్రారంభం కాని మహబూబ్నగర్– డోన్ రైల్వేలైన్ డబ్లింగ్, విద్యుదీకరణ ● నేటి కేంద్ర బడ్జెట్పై ఉమ్మడి జిల్లావాసుల ఆశలు మహబూబ్నగర్– డోన్ రైల్వే లైన్ డబ్లింగ్తోపాటు విద్యుద్దీకరణ పనుల కోసం మూడేళ్ల కింద కేంద్రం రూ.60 కోట్లు కేటాయించింది. అయితే ఈ మేరకు పనులు పూర్తికాలేదు. మేడ్చల్– ముద్ఖేడ్, మహబూబ్నగర్– డోన్ సెక్షన్ల మధ్య విద్యుద్దీకరణ కోసం మొత్తం రూ.122.81 కోట్లు అవసరమని అంచనా వేసినా, ఇందుకు అవసరమైన నిధులు కేటాయించలేదు. ఈ మార్గంలో రైల్వే లైన్ డబ్లింగ్తోపాటు బైపాస్ లైన్, విద్యుద్దీకరణ పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించాల్సి ఉంది. సాక్షి, నాగర్కర్నూల్: కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఈసారైనా ఉమ్మడి పాలమూరు జిల్లాకు కేటాయింపులు దక్కాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు ప్రతిపాదించిన కొత్త రైల్వే లైన్లకు ఈసారి బడ్జెట్లో నిధులు మంజూరవుతాయన్న ఆశలు నెలకొన్నాయి. ఉమ్మడి జిల్లాలో రవాణా వ్యవస్థ మెరుగుపర్చడంతోపాటు కొత్త రైల్వేలైన్లకు నిధులు కేటాయించాల్సి ఉంది. అయితే ప్రతిసారి కొత్త రైల్వేలైన్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం.. సర్వేలకే పరిమితం చేస్తుండటం నిరాశ కలిగిస్తోంది. కానీ, ఈసారి బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు కేటాయింపులు దక్కుతాయన్న ఆశలు నెలకొన్నాయి. 30 ఏళ్ల నుంచి ప్రతిపాదనలకే.. కృష్ణా– వికారాబాద్– గద్వాల– డోర్నకల్ కొత్త రైల్వే లైన్ నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. నారాయణపేట జిల్లాలోని కృష్ణా నుంచి వికారాబాద్ వరకు 87 కి.మీ., మేర రైల్వే లైన్ కోసం 30 ఏళ్ల కిందట ప్రతిపాదనలు చేశారు. ఇప్పటి వరకు ఐదుసార్లు సర్వే పూర్తిచేసినా పనులు పూర్తిచేసేందుకు అవసరమైన నిధులు మంజూరు కావడం లేదు. ● గద్వాల– డోర్నకల్ లైన్కు 20 ఏళ్ల కిందట రూ.190 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మూడుసార్లు సర్వే పనులు పూర్తిచేసినా.. బడ్జెట్లో మాత్రం కేటాయింపులు దక్కడం లేదు. ● కొత్తగా అచ్చంపేట– మహబూబ్నగర్– తాండూరు మార్గంలో సుమారు 180 కి.మీ., కొత్త రైల్వేలైన్ కోసం రూ.360 కోట్లతో కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే నిధులు కేటాయించకపోవడంతో ఆ ఆమోదం ప్రతిపాదనలకే పరిమితమైంది. ● గద్వాల– వనపర్తి– నాగర్కర్నూల్– గుంటూరులోని మాచర్ల వరకు కొత్త రైల్వేలైన్ ప్రతిపాదనలకే పరిమితమైంది. ఏళ్లుగా కేంద్ర బడ్జెట్లో ఈ ఊసే కనిపించడం లేదు. వలసల జిల్లాగా పేరొందిన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు పరిశ్రమలను ఏర్పాటు చేయలేదు. పెద్ద సంఖ్యలో స్థానికులకు ఉపాధి కల్పించడంతోపాటు ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్రం పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఉపాధి కోసం ఎలాంటి పరిశ్రమలు లేక ఇక్కడి నుంచి పనికోసం హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వలసలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో విద్యాభివృద్ధి కోసం అవసరమైన నిధులతోపాటు కొత్త జిల్లాలకు నవోదయ, కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేయాల్సి ఉంది. -
4న పాలమూరుకు నితిన్ నబీన్
పాలమూరు: ఫిబ్రవరి 4వ తేదీన మహబూబ్నగర్లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో ఉమ్మడి జిల్లా బీజేపీ బూత్స్థాయి కార్యకర్తల సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా హాజరవుతున్నట్లు ఎంపీ డీకే అరుణ వెల్లడించారు. శనివారం ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానాన్ని బీజేపీ నేతలతో కలిసి ఎంపీ పరిశీలించారు. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక అయిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు అది కూడా పాలమూరు జిల్లాకు రావడం సంతోషకరమన్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న పార్టీ నాయకులు, బూత్ కమిటీల సభ్యులు, బూత్ అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, అన్ని రకాల మోర్చా అధ్యక్షులు ఇతర కార్యవర్గం పార్టీ అనుబంధ సంఘాల నాయకులు సమావేశానికి హాజరు కావాలన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతి ఒక్క బీజేపీ అభ్యర్థిని గెలిపించుకునే విధంగా ప్రతి కార్యకర్త బాధ్యత తీసుకోవాలని, ఈ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ బాగా పుంజుకుంటుందని యువత అధికంగా కమలం వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి రాబోతుందన్నారు. ఆమె వెంట జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు. ఎంవీఎస్ కళాశాలలో కార్యకర్తలసమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ డీకే అరుణ -
క్రమం తప్పుకుండా తరగతులకు హాజరు కావాలి
మహబూబ్నగర్ న్యూటౌన్: యూనివర్సిటీ పీజీ కళాశాల మొదటి సంవత్సరం వివిధ విభాగాల తరగతులను పాలమూరు యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొ.రమేశ్బాబు సందర్శించారు. శుక్రవారం తరగతులను కలియ తిరుగుతూ విద్యార్థులను సిలబస్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు క్లాసులకు క్రమం తప్పుకుండా హాజరు కావాలని సూచించారు. ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించి మెడిసినల్ రిజిస్టర్ను తనిఖీ చేశారు. బీఫార్మసీ, మొదటి సంవత్సరం, డీఫార్మసీ పరీక్షలను తనిఖీ చేశారు. మహిళా హాస్టల్లో డైనింగ్ హాల్ ప్రారంభం క్యాంపస్లో మహిళా హాస్టల్లో డైనింగ్ హాల్ను వీసీ శ్రీనివాస్ ప్రారంభించారు.విద్యార్థులు మంచి ఆరోగ్యంతో చదువుకునేందుకు పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలని సూచించారు. ఆహారంలో ఆకుకూరలు, రాగి జావా, చపాతి, ఎక్కువగా తీసుకోవాలన్నారు. డైనింగ్ హాల్ పరిసరాలలో శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో ప్రిన్సిపాల్ డా.డి.మధుసూదన్రెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్ డా.నూర్జహాన్, అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ డా.చంద్రకిరణ్, పరీక్షల నియంత్రణ అధికారి కె.ప్రవీణ, హెచ్ఓడీలు పాల్గొన్నారు. -
శ్రీభూలక్ష్మీచెన్నకేశవస్వామి ఉత్సవాలు ప్రారంభం
గద్వాల టౌన్: జిల్లాకేంద్రంలోని కోటలో వెలసిన శ్రీభూలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక ఆలయంలో ఉదయం మూల విరాట్కు నిత్య విశేష, ఫల పంచామృతాభిషేకం, విశేష పుష్పాలంకరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి.. సాయంత్రం ధ్వజారోహణం చేపట్టారు. రాత్రి 7.30 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులను హనుమద్ వాహనంపై ఊరేగించారు. భజన మండలి సభ్యులు భక్తిగీతాలు ఆలపిస్తూ ముందుకు సాగారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులు పాల్గొని తన్మయత్వం పొందారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి దంపతులు ఆలయంలో స్వామివారి దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసి.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి ఆలయ ఆవరణలో స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. కల్యాణోత్సవాన్ని పురస్కరించుకొని ఔత్సాహిక గాయకురాలు విజితాగౌడ్ బృందం చేత అన్నమయ్య సంకీర్తన కార్యక్రమాలు ఉంటాయన్నారు. -
సూర్యప్రభవాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండలో శుక్రవారం రాత్రి శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి సూర్యప్రభవాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. శోభాయమానంగా అలంకరించిన సూర్యప్రభవాహనంపై స్వామివారిని గర్భగుడి నుంచి దేవస్థానం ముందున్న మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాలు, భక్తుల హరినామస్మరణ మధ్య స్వామివారి సేవ ముందుకు కదిలింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారి సేవను చూసి భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారి హనుమత్వాహన సేవ, ప్రభోత్సవం నిర్వహిస్తారు. -
షికారుతో పాలిట్రిక్స్!
గద్వాలలో కీలక రాజకీయ పరిణామాలు ● బండ్ల, సరిత వర్గ పోరులో మారిన పుర ఎన్నికల ముఖచిత్రం ● కాంగ్రెస్లో టికెట్ల నిరాకరణతో సరిత వర్గీయుల నారాజ్ ● బీఆర్ఎస్ నుంచి పలు వార్డుల్లో పోటీకి రంగం సిద్ధం ● మరికొందరు స్వతంత్రంగా బరిలోకి.. ● నామినేషన్ల చివరి రోజు బహిర్గతం సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఆధిపత్య, వర్గ రాజకీయాలకు కేరాఫ్గా నిలిచిన ఉమ్మడి పాలమూరులోని గద్వాల జిల్లాలో మరోసారి కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పుర ఎన్నికల వేళ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సరిత మధ్య చోటుచేసుకున్న టికెట్ల లొల్లి కాంగ్రెస్లో చిచ్చు రాజుకోగా.. పట్ణణంలో పోరు ముఖచిత్రాన్ని మార్చేసింది. నామినేషన్ల ఘట్టం చివరి రోజు శుక్రవారం అనూహ్యంగా తారుమారు పాలి‘ట్రిక్స్’తెరపైకి రాగా.. ఉమ్మడి జిల్లాలో హాట్టాపిక్గా మారింది. బీఫాంలు ఎవరికో.. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సరిత మధ్య తొలి నుంచీ ఆధిపత్య లొల్లి కొనసాగుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు, ఆ తర్వాత ఒకరెనుక ఒకరు కాంగ్రెస్లో చేరినా.. వారి మధ్య అగాధం పెరుగుతూనే వచ్చింది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో సైతం ఇరు వర్గాలు పోటీ పడినప్పటికీ.. పార్టీ గుర్తుపై జరిగేటివి కాకపోవడంతో ఎవరు గెలిచినా కాంగ్రెస్ మద్దతుదారులుగా ముద్రపడ్డారు. కానీ మున్సిపాలిటీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరిగేటివి కావడంతో ప్రస్తుతం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు ఆసక్తిగా మారాయి. అంతేకాదు కొందరు సరిత వర్గీయులు ఇటు కాంగ్రెస్తోపాటు అటు బీఆర్ఎస్ తరఫున కూడా నామినేషన్లు దాఖలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో బీఫాంలు ఎవరికి దక్కుతాయి.. ముఖ్య నేతలు సయోధ్యకు చొరవ తీసుకుంటారా అనేది చర్చనీయాంశమైంది. అసలు ఏం జరిగిందంటే.. గద్వాల పురపాలికలో మొత్తం 37 వార్డులు ఉన్నాయి. పురపాలికలకు ఎన్నికల కసరత్తు జరుగుతున్న క్రమంలో తన వర్గానికి 20 కేటాయించాలని సరిత అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహబూబ్నగర్లో పర్యటించిన క్రమంలో కూడా ఆమె ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఆయన ఈ సమస్యను పరిష్కరించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, నాగర్కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి, మంత్రి వాకిటి శ్రీహరికి సూచించారు. అయితే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఇందుకు ససేమిరా అంటూ నిరాకరించినట్లు సమాచారం. అంతేకాదు.. ఒకానొక సందర్భంలో కౌన్సిలర్, పుర పీఠం ఎలా దక్కించుకోవాలో తనకు తెలుసని.. ఆ వర్గానికి ఒక్క టికెట్ కేటాయించినా మీ ఇష్టమని సమాధానమిచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో 20 నుంచి 12.. ఆ తర్వాత పది టికెట్లయినా కేటాయించాలనే ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. చివరకు తన వర్గానికి చెందిన ఇద్దరు ముఖ్య నాయకులకు టికెట్లు ఖరారు చేయాలని కోరగా.. తనకు వారు నేరుగా ఫోన్ చేస్తే కేటాయిస్తానని చెప్పినట్లు వినికిడి. ఇందులో ఒకరు ఫోన్ చేయగా.. ఆయనకు టికెట్ ఖరారు చేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈ క్రమంలో నామినేషన్ల చివరి రోజు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు, శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే భారీ ర్యాలీ నిర్వహించారు. అభ్యర్థులతో నామినేషన్లు వేయించగా.. ఈ కార్యక్రమానికి సరిత, ఆమె వర్గీయులు దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్తో టచ్లోకి.. ఆ వెంటనే.. టికెట్ల నిరాకరణతో నారాజ్లో ఉన్న సరిత వర్గీయులు నామినేషన్ల చివరి రోజు కీలక అడుగులు వేశారు. దాదాపు 15 వరకు వార్డుల్లో ఆమె మద్దతుదారులు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ తరఫున కాకుండా కొందరు స్వతంత్రంగా, మరికొందరు బీఆర్ఎస్ తరఫున నామినేషన్లు దాఖలు చేశారు. మూడు, నాలుగు రోజుల క్రితమే పలువురు బీఆర్ఎస్ నేతలతో టచ్లోకి వెళ్లడం.. వారి అంగీకారంతోనే పలు వార్డులకు వారు ఆ పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు నామినేషన్ల అనంతరం కారెక్కేందుకు వారు రంగం సిద్ధం చేసుకోవడం ముందస్తు స్కెచ్లో భాగమని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వారిని కట్టడి చేయలేక సరిత చేతులెత్తేసిందా.. ఎమ్మెల్యేను ఢీ కొట్టేందుకే తన వ్యూహంలో భాగంగా వారిని ఆ పార్టీలోకి పంపించిందా అనే దానిపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. -
కేసీఆర్కు సిట్ నోటీసులివ్వడం ఎన్నికల స్టంట్
● స్పీకర్ సైతం కోర్టులను మోసం చేయడం దారుణం ● రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి గెలవాలని ఎమ్మెల్యే బండ్లకు సవాల్ : ఎంపీ డీకే అరుణ పాలమూరు: ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడం కేవలం మున్సిపల్ ఎన్నికల స్టంట్ మాత్రమేనని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. ఎంపీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ప్రజలను మోసం చేసేందుకు ఏదో ఒకటి తెరపైకి తేవడం అలవాటుగా మారిందని ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ తెచ్చారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యలో ఉన్న అండర్ స్టాండింగ్ పాలిటిక్స్ అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం, ఈ–కార్ రేస్ నివేదికలు వచ్చాయి..ఈ రెండేళ్లలో ఏం చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం చెప్పాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవగాహన ఒప్పందంలో భాగంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు లబ్ధి చేకూర్చడానికి సిట్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. చర్యలు తీసుకుంటామని చెప్పే నాటకం తప్పా, చర్యలు తీసుకునే చిత్తశుద్ధి కాంగ్రెస్కు లేదని విమర్శించారు. గద్వాల ఎమ్మెల్యే బీఆర్ఎస్లో ఉన్నాడని స్పీకర్ చెబుతుంటే.. కాంగ్రెస్కు ఓటు వేయాలని సదరు ఎమ్మెల్యే ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందాలని సవాల్ విసిరారు. స్పీకర్ సైతం కోర్టులను మోసం చేయడం చూస్తుంటే.. ఇంతకన్నా దారుణం ఇంకా ఏదీ ఉండదన్నారు. ఫిరాయింపులపై రాహుల్గాంధీ, రేవంత్రెడ్డి ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాలన్నారు. మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్గా బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. -
తేలని టికెట్లు.. తప్పని ‘పరీక్ష’!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పురపాలక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. అయినా అభ్యర్థిత్వాలు ఖరారు కాకపోవడం ఆశావహులకు పరీక్షలా మారింది. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) పరిధిలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పూర్తిగా, బీజేపీ పలు డివిజన్లకు అభ్యర్థులను ఇప్పటివరకూ అధికారికంగా వెల్లడించలేదు. ఈ క్రమంలో చివరి రోజు ఆయా పార్టీలకు చెందిన ఆశావహులు అధిక సంఖ్యలో నామినేషన్ కేంద్రాలకు పోటెత్తారు. అనిశ్చితి, ఆందోళనల మధ్యే నామినేషన్ పత్రాలు సమర్పించారు. దాదాపుగా అన్ని పార్టీల్లోనూ అందరూ రెండు సెట్లు (పార్టీ తరఫున, స్వతంత్రంగా) దాఖలు చేసినట్లు తెలుస్తోంది. వ్యూహాత్మకమేనా.. మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు డివిజన్ల పరిధిలోని శ్రేణులతో కలిసి ర్యాలీ చేపట్టారు. రెబల్స్ ప్రభావం అధికంగా ఉందని గ్రహించిన ఆయా పార్టీల ముఖ్య నేతలు ర్యాలీలు నిర్వహించినా.. వ్యూహాత్మకంగానే అధికారికంగా కార్పొరేటర్/కౌన్సిలర్ అభ్యర్థులను ప్రకటించలేదని తెలుస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ రోజే బీపాంలు అందజేసే అవకాశం ఉందని సీనియర్ రాజకీయ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలు వార్డుల వారీగా ఫైనల్ అయిన అభ్యర్థులకు ఫోన్ చేసి మీ పని మీరు చేసుకోండని సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా రెబల్ అభ్యర్థులను బుజ్జగించేలా ఆయా పార్టీల ముఖ్య నేతలు సంప్రదింపులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. మహబూబ్నగర్: 60 డివిజన్లు.. 781నామినేషన్లు కొత్తగా ఆవిర్భవించిన ఈ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. గడువు ముగిసే నాటికి మొత్తంగా 781నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున 328, బీఆర్ఎస్ నుంచి 153, బీజేపీ నుంచి 112, ఎంఐఎం నుంచి 28, జనసేన తరఫున 20, బీఎస్పీఎనిమిది డివిజన్లలో, ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ముగ్గురు, ఆప్, సీపీఎం నుంచి ఇద్దరేసి చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. మరో 125 మంది స్వతంత్రులు/ఇతరులు నామినేషన్లు దాఖలు చేసిన వారు ఉన్నారు. సగటున ఒక్కో వార్డుకు కనిష్టంగా ముగ్గురు నుంచి గరిష్టంగా పది మంది వరకు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్లో గరిష్టంగా ఒక్కో డివిజన్లో ఆరుగురు, బీఆర్ఎస్లో గరిష్టంగా ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల ఘట్టం ముగిసినా ఖరారు కాని అభ్యర్థిత్వాలు కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్లోనూ కొనసాగుతున్న అనిశ్చితి ఎంఎంసీలో చివరి రోజు పోటెత్తిన కార్పొరేటర్ అభ్యర్థులు మొత్తంగా 781.. ఒక్కొక్కరు దాదాపు 2 సెట్లు దాఖలు రెబల్స్ కట్టడికి ప్రధాన పార్టీల వ్యూహాత్మక అడుగులు -
77 వార్డులు..525 నామినేషన్లు
● ముగిసిన నామినేషన్ల దాఖలు పర్వం ● చివరిరోజు పోటాపోటీగా దాఖలు ● జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో సందడి గద్వాల టౌన్: పార్టీ జెండాల రెపరెపలు.. డప్పు వాయిద్యాలు.. మేళతాళాలు.. బాణసంచా.. కార్యకర్తల కేరింతల మధ్య మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి చివరిరోజు కావడంతో పోటీచేసే అభ్యర్థులందరూ శుక్రవారం ఒకేసారి ముందుకు రావ డంతో జిల్లాలోని నాలుగు పట్టణాలు జనంతో కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా కనిపించింది. పోటాపోటీగా నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లావ్యాప్తంగా అన్ని మున్సిపల్ పట్టణాలలో నామినేషన్ల జాతర కనిపించింది. అన్ని పార్టీల నుంచి.. జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లోని 77 స్థానాల్లో పోటీ చేసేందుకు అన్ని పార్టీల నుంచి పోటెత్తారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన అభ్యర్థులు పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు చేయగా.. ఎంఐఎం, బీఎస్పీ, ఆప్, పార్వర్డ్ బ్లాక్ పార్టీలతోపాటు స్వతంత్రంగా పోటీచేసే అభ్యర్థులు సైతం పట్టున్న వార్డుల్లో నామినేషన్లు దాఖలు చేశారు. ఆయా పార్టీల తరపున అభ్యర్థులు ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిసి నామినేషన్ పత్రాలను అందించారు. మొదటి రెండు రోజులు అనుకున్న స్థాయిలో నామినేషన్లు దాఖలు కాలేదు. శుక్రవారం తుది గడువు ఉండటంతో ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు పెద్దమొత్తంలో నామినేషన్లు వేశారు. జిల్లావ్యాప్తంగా మొదటిరోజు 5, రెండోరోజు 119 నామినేషన్లు దాఖలైన విషయం తెలిసిందే. చివరిరోజు ఏకంగా 401 నామినేషన్లు వచ్చాయి. మూడు రోజులకు గాను జిల్లాలో మొత్తం 525 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ నుంచి 186 , బీఆర్ఎస్ 145, బీజేపీ 93, పార్వర్డ్ బ్లాక్ 17, ఎంఐఎం 6, బీఎస్పీ 6, ఆప్ 1, సీపీఐ 1, సీపీఎం 1, జనసేన నుంచి 12 నామినేషన్లు దాఖలు కాగా.. మిగతావి స్వతంత్రుల నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా వార్డుల నుంచి నామినేషన్లు వేయడానికి వచ్చిన అభ్యర్థులతోపాటు మరో ఇద్దరిని కార్యాలయంలోకి అనుమతించారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రానికి సమీపంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. కొంతమంది అభ్యర్థులు హంగు, ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా వచ్చి నామినేషన్లు వేయడం విశేషం. నామినేషన్ల ప్రక్రియలో తొలి ఘట్టం ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
కాంగ్రెస్లో బీ ఫామ్ టెన్షన్ !
● ఎమ్మెల్యే బండ్ల, సరిత వర్గాల్లో కలవరం ● టికెట్ దక్కకుంటే పార్టీ మారే యోచనలో నాయకులు ● గెలుపు గుర్రాలకు ఇతర పార్టీల ఎర.. గద్వాలటౌన్: ‘అన్నా.. ఎటూ చెప్పడం లేదు.. చూస్తేనేమో నామినేషన్ దాఖలుకు సమయం మరి కొన్ని గంటలే ఉంది. పార్టీ తరఫున ఒకటి, ఇండిపెండెంట్గా మరో నామినేషన్ వెయ్యనా.. తొందరపడితే బీఫామ్ రాకుండా పోతుందా.. ఏమీ తెలుస్తలేదు. వేరే వాళ్లకు టికెట్ ఖరారు చేస్తే నా పరిస్థితి ఏమి.. ఇది కాకపోతే మరో పార్టీ గుర్తు అయినా తెచ్చుకుంటా.. కానీ, ఈ సారి బరిలో నిల్చోవడం పక్కా.. మరోసారి రిజర్వేషన్ అనుకూలిస్తుందో లేదో.. మిమ్మల్నే నమ్ముకుని ఉంటే బీఫామ్ రాకపోతే ఎట్లా..?’ అని గద్వాల కాంగ్రెస్ పార్టీలో ఇంకా టికెట్లు ఖరారు కాని రెండు వర్గాలకు చెందిన పలువురు ఆశావహులు దిక్కు తోచని పరిస్థితిలో పడ్డారు. వర్గ పోరుతో... మున్సిపల్ ఎన్నికలు గద్వాల కాంగ్రెస్లో కాకలు పుట్టిస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ టికెట్లను ఎక్కువ మంది ఆశిస్తున్నారు. ఏడాదిన్నగా గద్వాల కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలతో సతమతమవుతోంది. ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి వర్గం, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వర్గాలుగా నాయకులు, కార్యకర్తలు వీడిపోయి వేరువేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో సైతం ఎవరికివారు పోటీ చేసి ఇరువురు అభ్యర్థులు సత్తాచాటారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో సైతం అదే దూకుడు కనిపిస్తుంది. అయితే పార్టీ పరంగా ఎన్నికలు కావడంతో పార్టీ బీఫాం అభ్యర్థులకు కీలకంగా మారింది. రెండు వర్గాలలో ఎవరికి పార్టీ బీఫాంలు దక్కుతాయోననే చర్చ అందరిలో నెలకొంది. అయితే అభివృద్ధి నినాదంతో కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తన వర్గానికే బీఫాం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సరిత సైతం తన వర్గానికి సగం వార్డులో పోటీ చేయడానికి పార్టీ బీఫాం ఇవ్వాలని పట్టుపడుతున్నట్లు తెలిసింది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఎమ్మెల్యే వర్గానికే అన్ని బీఫాంలు వచ్చాయని తెలుస్తుంది. ఆ దిశగానే ఆభ్యర్థులందరూ కాంగ్రెస్ జెండాలతో ప్రచారం నిర్వహించారు. సరిత వర్గానికి పార్టీ బీఫాం ఇవ్వడం లేదనే ప్రచారంతో వారి వర్గీయులు డీలాపడ్డారు. ఇదే విషయంపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పార్టీ న్యాయం చేస్తుందని, ఎవరు తొందరపడొద్దని సరిత నాయకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ భరోసాతో గురువారం సరిత వర్గీయులు కొంతమంది కాంగ్రెస్ పార్టీపై నామినేషన్ల వేశారు. శుక్రవారం అదును చూసుకుని మరో నామినేషన్ వేయడానికి కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ బీఫాంపై ఆశలు సన్నగిల్లుతుండటంతో సరిత వర్గీయులు ఎవరి దారి వారు చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. సందులో సడేమియ్యా అన్నట్లుగా ఆయా వర్గాల్లో పార్టీ బీఫాం రాని అభ్యర్థులకు బీఆర్ఎస్ నాయకులు గాలం వేస్తున్నారు. పార్టీ బీఫాం రాకుంటే రెబల్గా పోటీ చేయడమా.? లేదా పార్టీ ఫిరాయించడమా అనే దానిపై అసంతృప్తవాదులు మల్లగుల్లాలు పడుతున్నారు. జంపింగ్లకు సిద్ధం.. ఈ సారి మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎవరికి వారే అధికార పీఠం దక్కించుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పార్టీలో అవకాశం దొరకకపోతే కొందరు నాయకులు పార్టీ మారడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే కొంతమంది టికెట్ రాని అభ్యర్థులు ఇతర పార్టీలో చేరి బరిలో దిగుతున్నారు. శుక్రవారం నామినేషన్లు వేయడానికి తుది గడువు కావడంతో పార్టీ జంపింగ్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాంటి వారిలో గెలిచే అభ్యర్థులను గుర్తించి వల వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య నెలకొన్న వర్గపోరు వలన ఇతర పార్టీలకు బలం చేకూరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనవేస్తున్నారు. -
పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి
గద్వాలటౌన్: పదో తరగతి వార్షిక పరీక్షల గడువు సమీపిస్తుందని, విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అడిషినల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ సూచించారు. గురువారం స్థానిక బాలభవన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రభుత్వ సంక్షేమ వసతి గృహా పదో తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్రేరణ – మార్గ నిర్ధేశక తరగతులు కార్యక్రమానికి అడిషినల్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థి పదికి పది మార్కులు సాధించాలని సూచించారు. వసతిగృహాల్లో చదివే విద్యార్థులందరూ నిరుపేద కుటుంబాల పిల్లలే ఉంటారని, వీరికి నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడిపై ఉందన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ప్రముఖ సైకాలజిస్టు రవీంద్రధీర మాట్లాడు తూ పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం కావాలనే దా నిపై అవగాహన కల్పించారు. సొంతంగా ఆలోచించడం, నిరంతర సాధన చేయడం విద్యార్థులు అలవాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ విజయలక్ష్మి, సంక్షేమశాఖల జిల్లా అధికారు లు నుషిత, అక్బర్బాషా తదితరులు పాల్గొన్నారు. -
ఎట్లైనా పోరుబాట..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పురపాలక ఎన్నికలకు సంబంధించి డివిజన్లు/వార్డుల వారీగా కార్పొరేటర్/కౌన్సిలర్ అభ్యర్థులు ఎవరనే దానిపై స్పష్టత రాలేదు. బీఫాంలు ఎవరికి ఇస్తారనేది తేలలేదు. నామినేషన్లకు ఒక్క రోజు మాత్రమే గడువు ఉండగా.. ప్రధానంగా అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్లోనూ అనిశ్చితి నెలకొంది. టికెట్పై మీమాంస కొనసాగుతుండగా.. పలువురు ఆశావహులు ప్లాన్–ఏ లేదంటే ప్లాన్–బీ అమలుకు శ్రీకారం చుట్టారు. ఏదేమైనా బరిలో నిలిచే విధంగా తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. అవసరమైతే పార్టీ మార్పు లేదంటే స్వతంత్రంగానైనా రంగంలోకి దిగేలా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు పలు మున్సిపాలిటీల్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీజేపీ వైపు చూపు.. మహబూబ్నగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్, బీఆర్ఎస్లో టికెట్ ఖరారు కాని పక్షంలో పలువురు పార్టీ మారి.. బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రస్తుత రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్కు సంబంధించిన నాయకులు ఎక్కువ శాతం స్వతంత్రంగా పోటీలో ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. బీఆర్ఎస్కు చెందిన వారు మాత్రం బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 2024 ఎంపీ ఎన్నికల్లో బీజేపీ నుంచి డీకే అరుణ గెలుపొందగా.. అప్పుడు నగర పరిధిలో ఆ పార్టీకి ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈసారి కార్పొరేషన్ ఎన్నికలను కమలం నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని పార్టీల కంటే ముందుగానే 43 డివిజన్లకు సంబంధించి కార్పొరేటర్ అభ్యర్థులను ప్రకటించారు. రెండో జాబితాను శుక్రవారం ప్రకటించనున్నారు. ఈ క్రమంలో బలమైన అభ్యర్థులను చేర్చుకోవాలనే ఉద్దేశంతోనే 17 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిలువరించేందుకేనా.. అధికార కాంగ్రెస్లో భారీగా ఆశావహులు ఉండడం ఆ పార్టీ ముఖ్య నేతలను కలవరానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సర్వే ఫలితాల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని.. ఇది పాత కాంగ్రెస్ కాదు, కొత్త కాంగ్రెస్.. క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవని చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. జీపీ ఎన్నికల్లో అధిక సంఖ్యలో కాంగ్రెస్ మద్దతుదారులే గెలిచినప్పటికీ.. బీఆర్ఎస్ సత్తా చాటింది. కొన్ని చోట్ల తక్కువ ఓట్లతోనే ఇతర అభ్యర్థులు గెలుపొందారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే రెబల్స్ను నిలువరించేందుకు ఆయన ఆ విధంగా హెచ్చరికలు జారీ చేసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు పలు మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీలు తగిన ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలే లక్ష్యంగా పొత్తులకు తెరలేపాయి. మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర, వనపర్తి జిల్లాలోని అమరచింతతో పాటు నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో ఈ తరహా రాజకీయాలు నడుస్తున్నట్లు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన దేవరకద్ర పురపాలికలో గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరి.. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరుదామనుకున్నా అడ్డుకోవడంతో ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న ఓ నాయకుడు తన భార్యను చైర్మన్గా చేయాలనే లక్ష్యంతో పావులు కదిపినట్లు తెలిసింది. బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచేలా స్కెచ్ వేయడంతో పాటు బీజేపీతో అంతర్గతంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అదేవిధంగా నారాయణపేటలో కాంగ్రెస్, ఎంఐఎం, అమరచింతలో కాంగ్రెస్, సీపీఎంతో పొత్తు పెట్టుకునేలా చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగియనుండగా.. ఇదే రోజు ప్రధాన పార్టీలు డివిజన్లు/వార్డుల వారీగా తమ తమ కార్పొరేటర్/కౌన్సిలర్ అభ్యర్థులను ప్రకటించనున్నాయి. కొన్ని ఉదాహరణలు.. కాంగ్రెస్కు సంబంధించి మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపుగా అన్ని డివిజన్లలో కార్పొరేటర్ కోసం ఇద్దరికి మించి పోటీపడుతున్నారు. ఒకటో డివిజన్లో 19 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ డివిజన్లో ఇప్పటివరకు ఆ పార్టీకి చెందిన ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. నాలుగో డివిజన్కు ముగ్గురు నామినేషన్లు వేశారు. 39వ డివిజన్లో ముఖ్య నాయకులు ఇద్దరు నామినేషన్లు వేయడం పోటాపోటీకి నిదర్శనంగా నిలుస్తోంది. కార్పొరేషన్లోని 52వ డివిజన్కు సంబంధించి బీఆర్ఎస్ నాయకుడైన మాజీ కౌన్సిలర్ ఒకరు పోటీకి రంగం సిద్ధం చేసుకున్నారు. పార్టీ ఇప్పటివరకు అభ్యర్థిత్వం ఖరారు చేయకపోవడంతో మనస్థాపం చెందిన ఆయన బీజేపీ వైపు అడుగుల వేస్తున్నట్లు సమాచారం. శుక్రవారం ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో ఆ డివిజన్ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఆయన చేరిక ఖాయమని తెలుస్తోంది. ప్లాన్–ఏ లేదంటే ప్లాన్–బీ ఆశావహుల ముందస్తు ఏర్పాట్లు కార్పొరేటర్/కౌన్సిలర్ బరిలో నిలిచేలా అడుగులు అవసరమైతే జంప్.. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా.. బీజేపీ వైపు పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల చూపులు ‘మహబూబ్నగర్’లో రసవత్తరంగామారిన రాజకీయాలు పలు మున్సిపాలిటీల్లో పార్టీల పొత్తుల ఎత్తుగడలు నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు ఇదే రోజు పార్టీల వారీగా తేలనున్న అభ్యర్థిత్వాలు భారీగా ఆశావహులతో అనిశ్చితి.. తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్న మహబూబ్నగర్ కార్పొరేషన్లోని 60 డివిజన్లలో కార్పొరేటర్ పదవుల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్లో ఆశావహులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ పదవులకు పోటీ చేయాలని అనుకుంటున్న అభ్యర్థుల నుంచి కాంగ్రెస్ రెండు పర్యాయాలు, బీఆర్ఎస్ ఒకసారి దరఖాస్తులు ఆహ్వానించింది. కాంగ్రెలో తొలుత 376, ఆ తర్వాత 292 దరఖాస్తులు రాగా.. బీఆర్ఎస్లో 440 మంది వరకు అర్జీ పెట్టుకున్నారు. కుప్పలు తెప్పలుగా వచ్చిన దరఖాస్తులతో ఆయా పార్టీల్లో అభ్యర్ధిత్వాల ఖరారుపై అనిశ్చితి నెలకొంది. ఉమ్మడి పాలమూరులోని పలు మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దీంతో రెబల్స్ ప్రభావం లేకుండా పార్టీల ముఖ్యులు ఆయా వ్యక్తులతో సంప్రదింపులకు శ్రీకారం చుట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో అభ్యర్థుల ఫైనల్ జాబితా కొలిక్కి రాలేదని తెలుస్తోంది. -
నేటి నుంచి భూలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు
● 31న కల్యాణోత్సవం ● ఫిబ్రవరి 1న రథోత్సవం గద్వాలటౌన్: గద్వాల కోటలో వెలసిన శ్రీభూలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠం ఆధ్వర్యంలో ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 17 ఏళ్ల క్రితం గద్వాల కోటలోని ఆలయ పరిసరాలు, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను మంత్రాలయ మఠానికి అప్పగించారు. గద్వాల పెద్ద జాతరగా పిలువబడే చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలకు గద్వాల చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు కర్ణాటకకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. పెద్ద జాతర సందర్భంగా జమ్ములమ్మ ఉత్సవాలు ప్రారంభం కావడంతో గద్వాల ప్రాంతంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వారం పాటు.. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 4 వరకు శ్రీ భూలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. 31న కల్యాణోత్సవం, ఫిబ్రవరి 1న రాత్రి రథోత్సవాన్ని నిర్వహిస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు మంత్రాలయ పీఠాధిపతి సుబుధేంద్రతీర్థ శ్రీపాదుల హోమాలు, విశేష పూజలు నిర్వహిస్తారు. వేడుకలకు మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ, కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత, ఇతర జిల్లా ఉన్నతాధికారులు వేరువేరు సందర్భాల్లో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. లింగంబావిలో తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ విచారణకర్త ప్రభాకర్, మేనేజర్ శ్రీపాదజోషి కోరారు. -
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
గద్వాలన్యూటౌన్: కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఫిబ్రవరి 12న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను కార్మిక వర్గం జయప్రదం చేయాలని ఐసీఈయూ గద్వాల బ్రాంచ్ సెక్రటరీ బంగి రంగారావు అన్నారు. గురువారం స్థానిక ఎల్ఐసీ కార్యాలయ ఆవరణలో సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. కేంద్ర విధానాలను నిరసిస్తూ చేపట్టనున్న సమ్మెను కార్మికులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్య వాదులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎల్ఐసీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి’
గద్వాల: మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. గురువారం ఆయన ఐడీఓసీ కార్యాలయం కాన్ఫరెన్స్హాల్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల నియమావళిని పాటిస్తూ అధికారులకు సహకరించాలన్నారు. అదేవిధంగా నామినేషన్ స్వీకరణకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేయడమే కాకుండా ఏదైన సందేహాలు ఉంటే నివృత్తి చేసేందుకు హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు సంబఽంధించి ఫారం–ఏ శుక్రవారం సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని సూచించారు. అదేఽవిధంగా నామినేషన్ ఉపసంహరణకు సంబంధించి ఫారం–బీ ను ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు సమర్పించాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే పబ్లిక్ మీటింగులు, ర్యాలీలు, లౌడ్స్పీకర్ల వినియోగానికి సంబంధించి పోలీస్ శాఖ నుంచి, ప్రచార వాహనాలు వినియోగించాలంటే మున్సిపల్ కమిషనర్ అనుమతి తీసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంగిస్తే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
‘అత్తా అల్లుడి జిమ్మిక్కులను పటాపంచలు చేద్దాం’
గద్వాలటౌన్: మున్సిపల్ ఎన్నికల సమయంలో అత్తా అల్లుడు చేస్తున్న రాజకీయ జిమ్మిక్కులను ప్రజలు పటాపంచలు చేయాలని రాష్ట్ర స్పోర్ట్స్ అఽథారిటీ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్ అన్నారు. బుధవారం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్లోనే ఉంటే గులాబీ కండువా కప్పుకొని ప్రజల ముందుకు రావాలని సవాల్ విసిరారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని చెబుకుంటున్న ఎమ్మెల్యే.. రెండేళ్ల కాలంలో ఏం అభివృద్ది సాధించారో ప్రజలకు వివరించాలన్నారు. గద్వాలలో అత్తా, మామ, అల్లుడు చేస్తున్న రాజకీయాలను ప్రజలను గమనిస్తున్నారని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అల్లుడి గెలుపు కోసం డీకే అరుణ గద్వాలలో పోటీ నుంచి తప్పుకొన్నారని ఆరోపించారు. బంగ్లా వారసత్వం కోసం అరుణమ్మ ఆరాటపడుతున్నారని విమర్శించారు. గులాబీ శ్రేణుల శ్రమ, త్యాగంతో ఎమ్మెల్యేగా గెలిచి.. పార్టీకి ద్రోహం చేసిన ఎమ్మెల్యేకు ప్రజలు గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్లో నిర్మించిన భవనాలకు రంగులు మార్చడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒరిగిందేమీ లేదని దుయ్యబట్టారు. గద్వాలలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కాగా, బీజేపీ జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జి చిత్తారి కిరణ్ సుమారు 200 మందితో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 5వ వార్డు నుంచి కాంగ్రెస్ నాయకుడు సంటన్న, 24వ వార్డు నుంచి రియాజ్, 31వ వార్డు నుంచి సుజాత, రాజు, 35వ వార్డు నుంచి అప్సర్ తన అనుచరులతో బీఆర్ఎస్లో చేరగా.. వారికి ఆంజనేయగౌడ్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, హనుమంతు, నాగర్దొడ్డి వెంకట్రాములు, పద్మ వెంకటేశ్వర్రెడ్డి, కోటేష్, యూసుఫ్, అతికూర్ రహమాన్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులు ఆర్థికంగా ఎదగాలి
● కేంద్ర వ్యవసాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణకాంత్ దూబే గద్వాల/ఎర్రవల్లి: ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజన పథకంతో రైతులు వ్యవసాయ, అనుబంధ రంగాల్లో రాణించి ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలని కేంద్ర వ్యవసాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణకాంత్ దూబే అధికారులను ఆదేశించారు. జిల్లాలో పీఎండీడీకేవై అమలుపై బుధవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన పంటల సాగు, అనుబంధ రంగాలైన మత్స్య, పాడిపరిశ్రమ తదితర రంగాల్లో రాణించేందుకు ఈ పథకం ద్వారా అవసరమైన సహకారం అందించాలన్నారు. బీచుపల్లి వద్ద ఆయిల్మిల్లు ఉన్నందున ఆయిల్పాం సాగుపై శిక్షణ ఇవ్వాలన్నారు. నాబార్డు ఇతర బ్యాంకింగ్ రంగాలు రైతులకు సబ్సిడీపై అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకునేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ● ఎర్రవల్లి, ఇటిక్యాల మండలాల్లో కేంద్ర వ్యవసాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణకాంత్ దూబే పర్యటించి పలు పంటలను పరిశీలించారు. ముందుగా తిమ్మాపురంలో రైతులు సాగుచేస్తున్న చేపల చెరువు, బీచుపల్లిలో తెలంగాణ ఆయిల్పాం నర్సరీని సందర్శించారు. జిల్లాలో చేపల పెంపకం, ఆయిల్పాం సాగు విస్తీర్ణాన్ని తెలుసుకున్నారు. కొండేరులో కూరగాయల తోటలను ఆయన పరిశీలించి.. వ్యవసాయ అనుబంధ రంగాల్లో అమలవుతున్న వివిధ పథకాలు, రుణ సదుపాయాలు, ఈ ప్రాంతంలో మౌలిక వసతులపై ఆరా తీశారు. ఇటిక్యాల మండలం మునుగాలలో జాతీయ నూనెగింజల పథకంతో 100 శాతం సబ్సిడీపై అందించిన విత్తనాలతో సాగుచేసిన వేరుశనగ పంటను ఆయన పరిశీలించారు. మునుగాలలో రైతు శ్రీనివాస్రెడ్డి, షాబాద్లో రైతు బాలకృష్ణారెడ్డి సాగుచేస్తున్న ఆయిల్పాం తోటలను సందర్శించి.. తోటల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, మార్కెటింగ్ తదితర వివరాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఏఓ సక్రియా నాయక్, ఏడీ సంగీతలక్ష్మి, ఉద్యానశాఖ అఽధికారి అక్బర్, ఆయిల్ఫెడ్ ఏడీఏ శివనాగిరెడ్డి, పరిశ్రమలశాఖ మేనేజర్ రామలింగేశ్వర్గౌడ్, ఎల్డీఎం శ్రీనివాసరావు, మత్స్యశాఖ అధికారి షకీలాభాను, వ్యవసాయ శాస్త్రవేత్త రాజేంద్రకుమార్రెడ్డి, నాబార్డు డీడీఎం షణ్ముఖాచారి, ఇరిగేషన్ అఽధికారి శ్రీనివాస్, ఉద్యానశాఖ డివిజినల్ అధికారులు రాజశేఖర్, ఇమ్రానా, మహేశ్, ఎంఐఈ వినీత్, ఏఓ రవికుమార్, రైతు సంఘం సీఈఓ రఘురామిరెడ్డి పాల్గొన్నారు. -
పురం పిరం..!
పురపాలికల్లో ఇదే రాజ‘కీ’యం ● ఆర్థిక స్థోమత ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ● కౌన్సిలర్/కార్పొరేటర్ నుంచి చైర్మన్/మేయర్ వరకూ.. ● ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు.. అన్ని పార్టీలదీ ఇదే దారి ● కర్ణాటక సరిహద్దు జిల్లాలోని ఓ మున్సిపాలిటీకి భలే గిరాకీ ● చైర్మన్ గిరికి పలికిన ధర సుమారు రూ.5 కోట్లు? ● ఎన్హెచ్పై ఉన్న మరో దాంట్లో ఆర్థిక బలమే పరమావధిగా.. -
వెంకటేశా.. నమోస్తుతే
● మన్యంకొండ బ్రహ్మోత్సవాలు ప్రారంభం మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల అనంతరం దేవస్థానం సమీపంలోని కోటకదిరలో ఉన్న ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్ ఇంటి నుంచి స్వామి ఉత్సవమూర్తిని మన్యంకొండ గుట్టపైకి పల్లకీలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. కోలాటాలు, భజనలతో కోటకదిర భక్తిపారవశ్యంతో పులకించిపోయింది. ముందుగా స్వామివారిని వివిధ బంగారు ఆభరణాలతో అలంకరించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకం, నివేదన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన దాసంగాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు స్వా మివారికి గరుడవాహన సేవ నిర్వహించారు. పల్లకీ లో స్వామివారిని గర్భగుడి నుంచి దేవస్థానం ముందు ఉన్న మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు చేసి.. తిరిగి స్వామివారిని గర్భగుడి వద్దకు తీసుకెళ్లారు. తిరుచ్చిసేవలో స్వామివారు బంగారు ఆభరణాలు, వివిధ పూల అలంకరణలో ధగధగ మెరిసిపోతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. గురువారం స్వామివారికి హంసవాహనసేవ నిర్వహిస్తారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. -
రిటైర్మెంట్ బెనిఫిట్స్అందించండి
గద్వాల: అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని సీఐటీయూ నాయకుడు ఉప్పేరు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం అంగన్వాడీ సిబ్బందితో కలిసి కలెక్టరేట్లో ఏఓ భూపాల్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాల తరబడి గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజల కు సేవలు అందించి రిటైర్మెంట్ అయిన అంగన్వాడీలకు ఎలాంటి బెనిఫిట్స్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం గతేడాది జీఓ నం.8 మేరకు రిటైర్డ్మెంట్ అయిన అంగన్వాడీ టీచర్లకు రూ. 2లక్షలు బెనిఫిట్స్ అందిస్తామని హామీ ఇచ్చారని.. కాని అది అమలుకు నోచుకోవడం లేదన్నారు. వెంటనే జీఓ అమలు చేయాలన్నా రు. అదే విధంగా మరణించిన వారి స్థానంలో వారి వారసులకు అవకాశం కల్పించాలని కోరా రు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి వీవీ నర్సింహ, అంగన్వాడీ టీచర్లు శాంతమ్మ, సువార్తమ్మ, మారెమ్మ పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.11,590 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు బుధవారం 230 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 11,590, కనిష్టంగా రూ. 5,800, సరాసరి రూ. 10,746 ధరలు వచ్చా యి. అదే విధంగా 6 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 5,946, కనిష్టంగా రూ. 5,619, సరాసరి రూ. 5,619 ధర పలికింది. 198 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 8,239, కనిష్టంగా రూ. 3,869, సరాసరి రూ. 8,229 ధరలు వచ్చాయి. నిర్లక్ష్యంతోనే అధిక శాతం ప్రమాదాలు: వీసీ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ట్రాఫిక్ నియమాలను ప్రతి ఒక్కరు తప్పకుండా పాటించాలని పీయూ వీసీ శ్రీనివాస్ సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పీయూలో అధికారులు బుధవారం హ్యాకథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీయూ నుంచి వన్టౌన్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీసీ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలను పాటించకుండా డ్రైవింగ్ చేస్తే జరిగే ప్ర మాదాలతో జీవితాంతం బాధపడాల్సి వస్తుందన్నారు. అతివేగం ప్రమాదకరమని, నిర్ణీత వేగంతో వెళ్లాలని, రోడ్డుపై సిగ్నల్స్ను గమ నిస్తూ వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా యు వత మద్యం తాగి వాహనాలను నడపొద్దని, దాని వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని, డ్రైవ్ చేసేటప్పుడు సెల్ఫో న్లు కూడా మాట్లాడొద్దని సూచించారు. అడిషనల్ డీఎస్పీ రత్నం మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలను నిర్లక్ష్యంగా నడపడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందన్నారు. కార్యక్రమంలో పీయూ రిజిస్ట్రార్ రమేష్బాబు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రవీణ, డీటీఓ నాగేశ్వర్రావు, ఎంవీఐ వాసుదేవరావు, ఏఎంవీఐ రూబీనా పర్వీన్, ప్రవీణ్, రఘుబాబు తదితరులు పాల్గొన్నారు. -
సస్యరక్షణతోనే అధిక దిగుబడులు
ఎర్రవల్లి: రైతులు పంటల సాగులో సరైన సస్యరక్షణ చర్యలు చేపడితేనే అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియా నాయక్ అన్నారు. మంగళవారం ఇటిక్యాల మండల కేంద్రంతో పాటు శివనంపల్లి, మునుగాల గ్రామాల్లో సాగుచేసిన వేరుశనగ పంటను ఆయన సందర్శించారు. జాతీయ నూనెగింజల అభివృద్ధి పథకం కింద రైతులకు 100 శాతం సబ్సిడీతో అందించిన మేలు రకం వంగడం గిరినార్–5, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా సభ్యత్వం పొందిన రైతులకు అందించిన వేరుశనగ సాగును కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి.. రైతులకు పలు సూచనలు చేశారు. వేరుశనగ పంటలో 40–75 రోజుల వరకు ఎలాంటి చీడపీడలు ఆశించకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. అనంతరం ఎర్రవల్లి రైతువేదికలో ఏర్పాటుచేసిన రైతునేస్తం కార్యక్రమంలో డీఏఓ పాల్గొని యాసంగి పంటల సాగులో చేపట్టాల్సిన వివిధ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఓ రవికుమార్, ఎఫ్యూసీఓయూ రఘురామిరెడ్డి, ఏఈఓ వెంకటేశ్ పాల్గొన్నారు. -
అభ్యర్థుల వేట షురూ..!
● వ్యూహ ప్రతివ్యూహాల్లో ప్రధాన రాజకీయ పార్టీలు ● అంతర్గత సమావేశాలతో బిజీ బిజీ ● ఉత్సాహవంతులు, ప్రజాదరణ ఉన్న వారిపై గురి గద్వాల టౌన్: పురపాలికల్లో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. ప్రకటన వెలువడటంతో ఒక్కసారిగా తేరుకున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులు కార్యాచరణకు సిద్ధమయ్యారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్నాయి. రిజర్వేషన్ల ఆధారంగా వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపికకు ప్రాథమిక కసరత్తుకు శ్రీకారం చుట్టాయి. ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ ద్వితీయ శ్రేణి నాయకులతో సమాలోచనలు జరపడంతో పాటు ఆశావహుల జాబితాను సిద్ధం చేశారు. ప్రజల్లో పలుకుబడి ఉన్న నాయకులు.. గెలుపొందే అవకాశాలున్న వారిని ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రతి వార్డులో తాము పోటీకి సిద్ధంగా ఉన్నామని ముగ్గురు, నలుగురు ఉత్సాహం చూపుతుండటంతో ఎంపిక వ్యవహారం క్లిష్టంగా మారుతోంది. కాస్త కఠినంగా వ్యవహరిస్తే ఎక్కడ పార్టీ వీడుతారనే భయం ప్రధాన పార్టీల నాయకులను వెన్నాడుతోంది. ఇప్పటికే కొన్ని వార్డుల్లో అభ్యర్థులను అనధికారికంగా ఖరారు చేసి ప్రచారం చేసుకోవాలని సూచించారు. మరికొన్ని వార్డుల్లో అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాములా మారింది. ఎక్కడ చూసినా చైర్మన్ బరిలో ఏ పార్టీ తరఫున ఎవరు ఉంటారని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
ఉత్సాహంగా అండర్–16 జట్టు ఎంపిక
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని ఎండీసీఏ మైదానంలో మంగళవారం ఉమ్మడి జిల్లా అండర్–16 క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ మాట్లాడుతూ ఈనెల 30వ తేదీ నుంచి సంగారెడ్డిలో హెచ్సీఏ అండర్–16 ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్ ఉంటుందని తెలిపారు. ఈ టోర్నీలో ఉమ్మడి జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కోచ్లు గోపాలకృష్ణ, ముఖ్తార్అలీ, సీనియర్ క్రీడాకారుడు మహేష్ పాల్గొన్నారు. -
నామినేషన్ల స్వీకరణకు 13 కౌంటర్లు
గద్వాలటౌన్: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. గద్వాల మున్సిపల్ కార్యాలయంలోని మెప్మా, ఇన్వార్డు సెక్షన్, మీసేవ సెంటర్లో నామినేషన్ల స్వీకరణ కౌంటర్లు ఏర్పాటుచేశారు. మొత్తం 37 వార్డులకు గాను మూడింటికి ఒక కేంద్రం చొప్పున 13 కౌంటర్లను ఏర్పాటుచేశారు. మున్సిపల్ కమిషనర్ జానకీరామ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. బాల్యవివాహాలను నిర్మూలిద్దాం గద్వాల క్రైం: బాల్యవివాహాలను నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా బాలల పరిరక్షణ అధికారి నర్సింహ, ఐసీడీఎస్ సీడీపీఓ ఆకాశ దీప్తి అన్నారు. మంగళవారం గద్వాల మండలం పూడూర్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. ఎక్కడైనా బాల్యవివాహం చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే టోల్ఫ్రీ నంబర్ 1098 లేదా స్థానిక అధికారులకు సమాచారం అందించాలన్నారు. తద్వారా బాల్యవివాహాలను కట్టడి చేయవచ్చన్నారు. తల్లిదండ్రులు పిల్లల ఉజ్వల భవిష్యత్కు కృషి చేయాలని కోరారు. వేరుశనగ ధరలు ౖపైపెకి.. గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో వేరుశనగ ధరలు ౖపైపెకి ఎగబాకుతున్నాయి. మూడు రోజుల క్రితం రికార్డు స్థాయిలో క్వింటాకు రూ. 9,389 ధర పలకగా.. మంగళవారం అంతకు మించి రూ. 11,190 నుంచి రూ.10,899 ధరలు వచ్చాయి. మూడు రోజుల క్రితం కర్ణాటక ప్రాంతం దేవునిపల్లికి రైతు సయ్యద్ ఎక్బాల్ అహ్మద్ 27 క్వింటాళ్ల వేరుశనగను విక్రయానికి తీసుకొచ్చి రూ. 9,389 ధర పొందారు. ఽమంగళవారం 479 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. ఇందులో వనపర్తి జిల్లా చిన్నదగడకు చెందిన రైతు కుర్మయ్య 27 క్వింటాళ్లు, కేటీదొడ్డి మండలం చింతలకుంటకు చెందిన మహిళా రైతు నర్సమ్మ 50 క్వింటాళ్ల వేరుశనగను ఖరీదుదారుడు నర్సింహులు రికార్డు స్థాయిలో కోడ్ చేసి కొనుగోలు చేశారు. రైతు కుర్మయ్య క్వింటాకు రూ. 11,190, మహిళా రైతునర్సమ్మ రూ. 10,899 ధర పొందారు. ఈ సీజన్లో ఇవి అత్యధిక ధరలుగా యార్డు అధికారులు పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో అత్యధిక ధరలు పొందిన ఇద్దరు రైతులతో పాటు ఖరీదుదారుడిని మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, వైస్చైర్మన్ శ్రీకాంత్, చింతలకుంట సర్పంచ్ రాజశేఖర్, యార్డు కార్యదర్శి నర్సింహ తదితరులు ఘనంగా సన్మానించారు. బ్యాంకు ఉద్యోగుల నిరసన గద్వాలన్యూటౌన్: వారంలో ఐదు రోజులు మాత్రమే పనిదినాలు ఉండాలని డిమాండ్ చేస్తూ.. మంగళవారం అన్ని బ్యాంకుల ఉద్యోగులు విధులను బహిష్కరించారు. అనంతరం యూనైటెడ్ బ్యాంక్ యూనియన్స్ ఫోరం ఆధ్వర్యంలో స్థానిక ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. రెండున్నరేళ్ల క్రితం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) వారంలో ఐదు రోజులు మాత్రమే పనిదినాలు ఉండేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చిందన్నారు. కానీ ఇంతవరకు ఆ హామీ నెరవేరలేదన్నారు. వారంలో ఐదు రోజులు మాత్రమే పనిదినాలు కల్పిస్తే.. ఖాతాదారులు, బ్యాంకు సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాము రోజు 40 నిమిషాలు అధిక సమయం పనిచేస్తామని చెప్పామన్నారు. ఇప్పటికై నా వారంలో ఐదు రోజుల పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు రాజమౌళి, శేఖర్, కృష్ణారెడ్డి, ప్రభాకర్రెడ్డి, రవికుమార్, శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు. -
ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో..
ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఒక కార్పొరేషన్, 20 మున్సిపాలిటీలు ఉన్నాయి. మహబూబ్నగర్లోని జడ్చర్ల, నాగర్కర్నూల్లోని అచ్చంపేట పురపాలికల పాలక వర్గాల పదవీ కాలం మే నెలలో ముగియనుంది. ఇవి పోనూ మిగిలిన 19 (ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీలు) వాటిలో ఎన్నికలు జరగనున్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో గ్రేడ్–1 మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్నగర్ కార్పొరేషన్గా ఆవిర్భవించింది. ఇదే జిల్లాలో మేజర్ పంచాయతీగా ఉన్న దేవరకద్ర, నారాయణపేట జిల్లాలో మద్దూర్ మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందాయి. ఈ మూడు పురపాలికల్లోనూ తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. -
పదేళ్లలో గద్వాల అస్తవ్యస్తం
● ఇక్కడి ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పలేని దుస్థితి ● ఎంపీ డీకే అరుణగద్వాల: పదేళ్లుగా అభివృద్ధిచేసే నాయకులు లేకపోవడంతో గద్వాల పట్టణంతో మొదలుకొని నియోజకవర్గం మొత్తం అస్తవ్యస్తంగా మారిందని మహ బూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవా రం జిల్లా కేంద్రంలోని డీకే బంగ్లాలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు ఇళ్లు లేని నిరుపేదలకు ఇచ్చి న ఇంటి స్థలాలను బలవంతంగా లాక్కొని రోడ్డునపడేశారని ధ్వజమెత్తారు. గద్వాల ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పలేని దుస్థితిలో ఉన్నా రని ఎద్దేవా చేశారు. అభివృద్ధి కోసం సీఎంను కలిసినట్లు చెబుతున్న ఎమ్మెల్యే.. ఇప్పటి వరకు ఆయన చేసిన అభివృద్ధి ఏమిటో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. చేనేత పార్కు నిర్మాణం ఇప్పటి వరకు అతీ గతి లేకుండా పోయిందన్నారు. పట్టణంలోని 37 వార్డుల్లో కొత్తగా జరిగిన అభివృద్ధి ఎంతమాత్రం లేదన్నారు. పేదల ఇంటి స్థలాల్లో ఆస్పత్రి, కాలేజీల నిర్మాణం చేపడుతూ.. తీరని అన్యాయం చేశారన్నా రు. గద్వాల ప్రాంతాన్ని తాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాననే విషయం ప్రజలందరికీ తెలుసన్నా రు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలి పించి, మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ఉన్నారు. -
సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణ
గద్వాల: గ్రామ పంచాయతీ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. అనంతరం అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఏమైనా సందేహాలు ఉత్పన్నమైతే తన దృష్టికి తీసుకొచ్చి నివృత్తి చేసుకోవాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు ఆయా పార్టీల గుర్తు కేటాయించడం జరుగుతుందని, మిగిలిన ఎన్నికల ప్రక్రియ మొత్తం ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఉంటుందన్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి మాస్టర్ శిక్షకులు అవసరమైన శిక్షణ అందిస్తారన్నారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద శాంతిభద్రతల అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి.. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, జెడ్పీ సీఈఓ నాగేంద్రం, మున్సిపల్ కమిషనర్ జానకీరామ్ తదితరులు ఉన్నారు. -
సబ్బండ వర్గాల.. సంక్షేమానికి కృషి
ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ అభివృద్ధి ఫలాలు ● మహాలక్ష్మి, రైతుభరోసాపథకాలతో ఎంతో మేలు ● అమ్మ ఆదర్శ పథకం కింద పాఠశాలలకు పెద్దఎత్తున నిధులు ● కలెక్టరేట్లో త్రివర్ణ పతాకం ఆవిష్కరించిన కలెక్టర్ బీఎం సంతోష్ ● జిల్లావ్యాప్తంగా అట్టహాసంగా గణతంత్ర వేడుకలు జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న కలెక్టర్ బీఎం సంతోష్, చిత్రంలో ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజయుడు తదితరులు -
భక్తుల ఇంటికే బంగారం..
● ఆర్టీసీ వినూత్న కార్యక్రమం ● రూ.299తో బుకింగ్ చేసుకుంటే చాలు.. ● ప్రసాదంతో పాటు దేవతల ఫొటో, పసుపు, కుంకుమ ● వచ్చేనెల 5వ తేదీ వరకు బుకింగ్ చేసుకునే అవకాశం స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ సంస్థ ప్రయాణికుల సౌకర్యార్థం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇటు ప్రయాణికులకు సేవలు అందించడంతో పాటు అటూ ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా పార్సింగ్, కొరియర్ సేవలు అందజేస్తోంది. దీంతో టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ సేవలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గతంలో రాఖీ పండుగ సందర్భంగా దూరంగా ఉన్న సోదరీ మణులు రాఖీలను తమ సోదరులకు పంపించేలా కొరియర్ సేవలు అందజేశారు. అదేవిధంగా ప్రతి ఏడాది శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటివద్దకే అందజేశారు. ● ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం ప్రసాదాన్ని భక్తుల ఇంటివద్దకే అందజేసేలా టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ తగిన ఏర్పాట్లు చేస్తోంది. మేడారం సమ్మక్క–సారక్క జాతరకు కోట్లాది మంది భక్తులు తరలి వెళుతుంటారు. అయితే జాతరకు వెళ్లలేని భక్తులకు అమ్మవార్ల ప్రసాదాలను అందించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం మహబూబ్నగర్ రీజియన్ పరిధిలోని ఆర్టీసీ లాజిస్టిక్ కేంద్రాల్లో రూ.299తో బుకింగ్ చేసుకుంటే ఇంటి వద్దకే ప్రసాదాన్ని అందజేస్తారు. దేవాదాయ శాఖ సహకారంతో మేడారం అమ్మవార్ల బంగారం ప్రసాదం పాకెట్, దేవతల ఫొటోతో సహా బెల్లం, పసుపు కుంకుమ వస్తువులు అందజేయనున్నారు. రీజియన్లోని పది డిపోల పరిధిలోని లాజిస్టిక్ కేంద్రాల్లో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమ్యాయి. భక్తులు www.tgsrtclogistics.co.in వెబ్సైట్ లాగిన్ ద్వారా లేదా సమీపంలోని టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ కౌంటర్లలో బంగారం ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చు. వచ్చేనెల 5వ తేదీ వరకు బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇటీవల ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ మేడారం ప్రసాదానానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. -
చిరుధాన్యాలు.. అంతంతే
గద్వాల వ్యవసాయం: నడిగడ్డలో చిరుధాన్యాల సాగు కనుమరుగవుతుందా..? అవుననే పరిస్థితులే కనిపిస్తున్నాయి. జిల్లాలో ఈ ఏడాది కేవలం 45 ఎకరాల్లో మాత్రమే ఆయా పంటలు సాగు కావడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. మార్కెట్లో చిరుధాన్యాలకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ.. ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లభించకపోవడంతో రైతులు ఆసక్తి కనబర్చడం లేదు. మరో ముఖ్య ఆహార పంటలైన అయిన జొన్న, సజ్జ సాగు విస్తీర్ణం మాత్రం గతంతో పోల్చితే కాస్త పెరగడం గమనార్హం. మారిన ఆహారపు అలవాట్లతో.. ప్రస్తుత దైనందిన జీవితంలో చాలామంది అనేక రకాలుగా ఒత్తిళ్లకు లోనవుతుండటంతోపాటు ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులతో పలు రకాల అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నారు. ప్రధానంగా బీపీ, షుగర్, ఆస్తమా, కీళ్లనొప్పులు తదితర వాటి బారినపడటంతోపాటు కిడ్నీ, లివర్, గుండె సంబంధిత సమస్యలతో శారీరకంగా బలహీన పడుతున్నారు. ఇలాంటి వారికి బలవర్ధకమైన ఆహారం చిరుధాన్యాలే. ముఖ్యంగా కొర్రలు, అండుకొర్రల్లో పీచుపదార్థాలతోపాటు బలమైన పోషక విలువలుంటాయి. రాగుల్లో క్యాల్షియం, ఐరన్ ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే బీపీ, షుగర్ లాంటి రోగాలు దూరం కావడంతోపాటు శారీరకంగా బలపడతారు. మద్దతు లేకపోవడంతో.. గత కొన్నేళ్ల నుంచి చిరుధాన్యాల వినియోగంపై వైద్యులు పెద్దఎత్తున సలహాలు ఇస్తున్నారు. దీంతో వీటికి మార్కెట్లో డిమాండ్ ఏర్పడింది. అయినా చిరుధాన్యాల సాగుపై రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీనికి ప్రధానంగా ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడమే అని చెప్పవచ్చు. పత్తి, వరి, మొక్కజొన్న తదితర పంటలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తోంది. అలాగే ఆయిల్పాం, పండ్ల తోటలకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. కానీ చిరుధాన్యాలకు ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వడం లేదు. సరైన మార్కెటింగ్ వ్యవస్థ కూడా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ‘ఆత్మ’కు నిధులేవి? చిరుధాన్యాల సాగుపై వ్యవసాయాధికారులు వ్యవసాయ సాంకేతిక సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో 2019లో అవగాహన సదస్సులు నిర్వహించారు. రైతులు ఎక్కువగా చిరుధాన్యాలు సాగు చేసేలా చర్యలు తీసుకున్నారు. దీంతోపాటు జాతీయ ఆహార భద్రత (ఎన్ఎఫ్ఎస్) పథకం కింద పండించే రైతులకు 90 శాతం సబ్సిడీపై విత్తనాలు అందించి ప్రోత్సహించారు. దీంతో 2016, 2017, 2018 గణాంకాలను పోల్చితే 2019లో సాగు పెరిగింది. ఆ తర్వాత 2020 నుంచి మళ్లీ తగ్గింది. ఇందుకు ప్రభుత్వం ‘ఆత్మ’కు గడిచిన ఐదేళ్లుగా నిధులు కేటాయించకపోవడమే కారణం. ఫలితంగా రైతులు ఎప్పటిలాగే వరి, పత్తి పంట సాగుకు మొగ్గుచూపారు. మరింత పెరిగేలా.. జొన్న, సజ్జలు పోషక విలువలు ఉండే బలవర్ధకమైన ఆహారం. ఈ పంటల సాగు ఈ ఏడాది కొంత పెరిగిన ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. వీటికి మార్కెట్లో గిట్టుబాటు ధరలు ఉన్నాయి. 10, 15 ఏళ్ల క్రితం వరకు జొన్న, సజ్జ సాగు చేసిన రైతులు ఆ తర్వాత వరి, పత్తి లాంటి పంటలను వేస్తున్నారు. ఇక్కడి ప్రాంత ప్రజలు నాణ్యమైన జొన్నలు లభించకపోవడంతో కర్ణాటకలోని రాయచూర్ నుంచి తెచ్చుకుంటున్నారు. దీంతో జొన్న, సజ్జల సాగు మరింత పెరిగేలా రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. చి,లు: చిరుధాన్యాలు జిల్లాలో ఈ ఏడాది గణనీయంగా తగ్గిన సాగు ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడమే కారణం అక్కడక్కడ పెరిగిన జొన్న, సజ్జ పంటలు రెండు సీజన్లలో సాగు.. చిరుధాన్యాలన్నీ ఆరుతడి పంటలే. సాధారణంగా రెండు సీజన్లలో సాగు చేయవచ్చు. అయితే ఈ పంటల్లో కలుపు ఎక్కువగా వస్తుంది. పెట్టుబడులు సైతం రెట్టింపు అవుతాయి. దీనికితోడు నూతన యాజమాన్య పద్ధతులపై రైతులకు సరైన అవగాహన లేదు. స్థానికంగా మార్కెటింగ్ సౌకర్యం కూడా లేదు. వీటన్నింటి ఫలితంగా జిల్లాలో పత్తి, మిర్చి, పొగాకు లాంటి వాణిజ్య పంటలు, వరి, మొక్కజొన్న లాంటి ఆహారపు పంటలపై ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు. అవగాహన కల్పిస్తాం.. ఇక్కడి రైతులు వాణిజ్య, ఇతర ఆహార పంటలపైనే ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. రాగులు, కొర్ర, అండుకొర్రలు సాగు చేసేలా రైతులకు ప్రతిసారి చెబుతూనే ఉన్నాం. చిరుధాన్యాలు ఎక్కువగా సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తాం. జొన్న, సజ్జ పంటల సాగు ఈ ఏడాది కొంత పెరిగింది. – సక్రియానాయక్, డీఏఓ -
ఉత్తమ సేవలకు పురస్కారం
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం జిల్లాకేంద్రంలోని పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన పలువురు అధికారులకు కలెక్టర్ బీఎం సంతోష్ ప్రశంసాపత్రాలు అందజేశారు. – గద్వాలనుషిత, ఎస్సీ సంక్షేమాధికారి రహీముద్దీన్ ఇరిగేషన్ ఎస్ఈ భద్రప్ప, తహసీల్దార్ఇందిర, సూపరింటెండెంట్ అక్బర్, ఉద్యాన అధికారి అశోక్, ఎస్పీ ఆఫీస్, ఏఓ నగేష్, ఆర్ఐ, మల్దకల్ వెంకటేష్, అటెండర్శ్రీకాంత్, ఎస్ఐడాక్టర్ శ్యాం, అలంపూర్ రాధాకృష్ణారెడ్డి, సీసీ జుబేర్,జూరాల డ్యాం ఈఈ కనకయ్య, జూ.అసిస్టెంట్ శ్రీనివాస్, ఎస్ఎస్ఏ -
త్యాగధనుల కృషితోనే స్వేచ్ఛాయుత వాతావరణం
గద్వాల క్రైం: ఎందరో త్యాగధనుల కృషితోనే ప్రస్తుతం స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవిస్తున్నామని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్పీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరు దేశం పురోగమిస్తుందని చెప్పారు. అనంతరం పలువురు సిబ్బందికి ఉతృష్ట, అతి ఉతృష్ట సేవా పథకాలు అందజేశారు. అలాగే రవాణా శాఖ కార్యాలయంలో ఇన్చార్జి డీటీఓ కృష్ణారెడ్డి తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించారు. నేడు అండర్–16 క్రికెట్ జట్టు ఎంపిక మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని ఎండీసీఏ మైదానంలో మంగళవారం ఉమ్మడి జిల్లా అండర్–16 క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్కార్డు, ఎస్ఎస్సీ మెమో, జననఽ ధ్రువీకరణ పత్రం, బోనఫైడ్, రెండు ఫొటోలతో మైదానంలో రిపోర్టు చేయాలని సూచించారు. ఎంపికయ్యే ఉమ్మడి జిల్లా జట్టు ఈనెల 30 నుంచి సంగారెడ్డిలో ప్రారంభమయ్యే హెచ్సీఏ అండర్–16 ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లో పాల్గొంటుందని ఆయన తెలిపారు. దేశాభివృద్ధికి పాటుపడాలి కొల్లాపూర్: స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాంగ నిర్మాణకర్తల త్యాగాలు, విశేష కృషి ఫలితంగానే మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం మంత్రి మాట్లాడారు. మహనీయుల స్ఫూర్తిని కొనసాగిస్తూ.. వారి అడుగుజాడల్లో నడిచినప్పుడే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి బలమైన పునాదిగా నిలుస్తోందన్నారు. రాజ్యాంగ విలువలు కాపాడుతూ ప్రతి పౌరుడు దేశాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. -
భక్తులు సద్వినియోగం చేసుకోవాలి
సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో మేడారం వెళ్లలేని భక్తులకు ఇంటివద్దకే అమ్మవార్ల బంగారం ప్రసాదాన్ని టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా అందజేస్తున్నాం. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమీప ఆరీసీ లాజిస్టిక్ కేంద్రాల్లో రూ.299 చెల్లించి బుకింగ్ చేసుకోవాలి. దేవాదాయశాఖ సహకారంతో మేడారం బంగారం ప్రసాదంతో పాటు దేవతల ఫొటో పసుపు, కుంకుమ భక్తుల ఇంటివద్దకే వెళ్లి అందజేస్తాం. – సంతోష్కుమార్, ఆర్టీసీ ఆర్ఎం, మహబూబ్నగర్ ● -
చిన్నారులను మింగిన పాంపాండ్
చెట్టును పట్టుకోవడంతో బతికాను మేము నలుగురం కలిసి ఆడుకునేందుకు పొలం వద్దకు వెళ్లాం. బంతి ఆట ఆడుకుంటూ గుంతలోకి వెళ్లడంతో సిరి, శ్రీమన్యు, స్నేహ మునిగిపోయారు. వారిని కాపాడేందుకు చుట్టుపక్కల వాళ్లను మా బాబాయి శ్రీకాంత్రెడ్డి పిలిచారు. మా బాబాయి నన్ను అక్కడే ఉన్న చెట్టు పట్టుకోమని చెప్పడంతో నేను బతికిపోయాను. బాబాయి పిలిచిన వారంతా గుంత వద్దకు వచ్చే సరికి ఆ ముగ్గురూ నీటి లోపలికి మునిగిపోయారు. – విద్యాధరణి, ప్రాణాలతో బయటపడిన బాలిక తల్లిదండ్రులతో కలిసి సరదాగా సొంతూరికి వచ్చిన చిన్నారులు వ్యవసాయ పొలంలో ఆడుకునేందుకు వెళ్లి విగత జీవులుగా మారారు. ఉదయం నుంచి హుషారుగా కేరింతలు కొడుతూ.. సెల్ఫీలు దిగుతూ.. ఆడుకున్న ఆ చిన్నారుల ఆనందం ఊహించని ఘటనతో ఆవిరైపోయింది. పాంపాండులో పడిన బంతి తీసుకునేందుకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృత్యుఒడికి చేరిన విషాదకర ఘటన నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని ముచ్చర్లపల్లిలో చోటుచేసుకుంది. కల్వకుర్తి టౌన్/ ఊర్కొండ: ముచ్చర్లపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్రెడ్డి, రజని దంపతుల సంతానం మాదు సిరి(14), మాదు శ్రీమన్యు(12), రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం రావిర్యాల గ్రామానికి చెందిన అతని సోదరి చంద్రకళ కూతురు స్నేహ(15), అదే గ్రామానికి చెందిన అతని అన్న వేణుగోపాల్రెడ్డి కూతురు విద్యాధరణి కలిసి వేణుగోపాల్రెడ్డి పొలంలో ఉదయం నుంచి సరదాగా ఆడుకున్నారు. మధ్యాహ్నం అందరూ కలిసి భోజనం చేశాక వేణుగోపాల్రెడ్డి పొలంలో ఉన్న పాంపాండ్ వద్ద బంతితో సరదాగా ఆడుకుంటుండగా అందులో పడిపోయింది. దీంతో పాంపాండులో బంతిని తీసుకునేందుకు ముందుగా శ్రీమన్యు వెళ్లగా.. అతనికి ఈత రాక మునిగిపోవడంతో అక్క మాదు సిరి చూసి తమ్ముడిని కాపాడేందుకు వెళ్లింది. ఇద్దరూ గుంతలో మునిగిపోతున్నారని గమనించిన స్నేహ సైతం వారి ని రక్షించాలని గుంతలో దిగగా ముగ్గురికి ఈత రాకపోవడం, పాంపాండు లోతుగా ఉండటంతో అక్కడే ఉన్న మరో చిన్నారి విద్యాధరణి గమనించి పాంపాండులోకి దిగుతూ గట్టిగా కేకలు వేసింది. వెంటనే శ్రీకాంత్రెడ్డి ఈత రాకపోయినా తన కాలుకు తాడు కట్టుకొని గుంతలోకి వెళ్లి విద్యాధరణిని బయటకు తీశాడు. మళ్లీ గుంతలోకి వెళ్లేసరికి ముగ్గురు చిన్నారు లు అప్పటికే పాంపాండులో బురదనీటిని మింగడంతో మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న ఊర్కొ ండ ఎస్ఐ కృష్ణదేవరాయ ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు చిన్నారులను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై చిన్నారుల తల్లి రజని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని కల్వకుర్తి సీఐ నాగార్జున తెలిపారు. ఈ జీవితం మాకు వద్దు.. కళ్లెదుటే తమ ఇద్దరు సంతానం విగత జీవులుగా పడి ఉండడం చూసి తల్లిదండ్రులు మా పిల్లలు లేని ఈ జీవితం మాకు వద్దు అని బోరున విలపించారు. మా పిల్లలు చనిపోయిన ఈ గుంతలోనే మేం కూడా చనిపోతామని అనడంతో స్థానికులు వారిని ఓదార్చారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా.. ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఎమ్మెల్యే పరామర్శ ప్రమాదవశాత్తు గుంతలో పడి మృతిచెందిన చిన్నారుల కుటుంబ సభ్యులను జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి పరామర్శించారు. ఒకే కుటుంబంలోని చిన్నారులను కోల్పోవడం దురదృష్టకరణమన్నారు. కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన ఆయన చిన్నారుల మృతదేహాలను సందర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. సంఘటనకు దారితీసిన పరిస్థితులను కుటుంబ సభ్యులు, పోలీసులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మాదు శ్రీమన్యు (ఫైల్) మాదు సిరి, స్నేహ (ఫైల్) నీటిలో పడిన బంతి తీసేందుకు వెళ్లి ముగ్గురు మృతి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డ మరో బాలిక నాగర్కర్నూల్ జిల్లా ముచ్చర్లపల్లిలో విషాదం -
గణతంత్ర వేడుకలకు ముస్తాబు
గద్వాల: గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఆదివారం కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూడురంగుల జెండాలు, విద్యుత్దీపాలతో అలంకరించారు. జిల్లా కేంద్రంలోని స్థానిక పరేడ్గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం 8:55 గంటల నుంచి 8:57 గంటల వరకు ముఖ్య అతిథికి గౌరవవందనం, 9గంటల నుంచి 9:05గంటల వరకు పతాకావిష్కరణ, 9:06గంటల నుంచి 9:16 గంటల వరకు కలెక్టర్ బీఎం సంతోష్ సందేశం, 9:17గంటల నుంచి 9:40 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, 9:41 గంటల నుంచి 10 గంటల వరకు వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు ప్రశంసా పత్రాలు అందజేత, 10:01గంటల నుంచి 10:30 గంటల వరకు వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శన కార్యక్రమాలు ఉంటాయని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ తెలిపారు. -
పాలమూరు పద్మం
జోగుళాంబ గద్వాల● నగరవాసి పి.విజయానంద్రెడ్డిని వరించిన అవార్డు ● వైద్యరంగంలో 44 ఏళ్ల సేవలకు విశిష్ట పురస్కారం ● క్యాన్సర్పై అవగాహనకు అనేక కార్యక్రమాలు ● ఉమ్మడి జిల్లాకు మూడోసారి దక్కిన గౌరవం చెన్నకేశవుడి చెంతకే .. గంగాపురంలో ఆదివారం రాత్రి నిర్వహించిన లక్ష్మీచెన్నకేశవుడి రథోత్సవానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. సోమవారం శ్రీ 26 శ్రీ జనవరి శ్రీ 2026–IIలో uపాలమూరు సిగలో మరో పద్మశ్రీ చేరింది. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్నగర్లోని నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన కిన్నెర మొగులయ్య, నారాయణపేట జిల్లాకు చెందిన బుర్రవీణ వాయిద్య కారుడు దాసరి కొండప్పలను పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. తాజాగా పాలమూరు నగరంలోని వల్లబ్నగర్కు చెందిన వైద్యుడు పాలకొండ విజయానంద్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించడంతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయానంద్రెడ్డి 44 ఏళ్లుగా వైద్యరంగంలో అందిస్తున్న విశిష్ట సేవలకు ఈ పురస్కారం దక్కిందని కొనియాడారు. – సాక్షి ప్రతినిధి మహబూబ్నగర్/ పాలమూరు మహబూబ్నగర్లోని పాలకొండ వెంకట్రాంరెడ్డి, దమయంతి దంపతుల కుమారుడు విజయానంద్ రెడ్డి 1982లో ఉస్మానియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి కొన్ని రోజులపాటు భూత్పూర్ పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత రేడియేషన్ అంకాలజీలో ఎండీ, డీఎన్బీ పూర్తి చేసి 30 ఏళ్లుగా అపోలో ఆస్పత్రిలోని అంకాలజీ విభాగం ప్రొఫెసర్ హెచ్వోడీగా పనిచేస్తున్నారు. ఆయన భార్య డాక్టర్ శశికళ ఉస్మానియా కళాశాల ప్రిన్సిపాల్గా రిటైర్డ్ కాగా.. ఇద్దరు కొడుకులలో ఒకరు వైద్యుడిగా, మరొకరు సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు. -
‘ఓటుతోనే ప్రజాస్వామ్యం పరిరక్షణ’
గద్వాలటౌన్: రాజ్యాంగం ప్రజలకు కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటే ప్రజాస్వామ్యానికి పరిపుష్టత చేకూర్చినట్లు అవుతుందని అడిషినల్ కలెక్టర్ నర్సింగరావు అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషినల్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరుగా నమోదు కాని వారు వ్యవస్థను మార్చలేరన్నారు. యువకుల చేతిలో ఓటు ఓ ఆయుదం లాంటిదని, మంచి నాయకుడిని ఎన్నుకుంటే భవిష్యత్కు భరోసా దొరుకుతుందని పేర్కొన్నారు. ఓటు హక్కు ప్రాధాన్యతను అందరూ గుర్తించుకొని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరిని నమోదు చేయాలన్నారు. ఓటు హక్కు నమోదు, వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి రమేష్బాబు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నుషిత, బీసీ సంక్షేమ శాఖ అధికారి అక్బర్బాషా, డీవైఎస్ఓ కృష్ణయ్య, తహసీల్దార్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహంగా ర్యాలీ... జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అడిషినల్ కలెక్టర్ నర్సింగరావు జెండా ఊపి స్థానిక కలెక్టరేట్ నుంచి ర్యాలీని ప్రారంభించారు. ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ నినాదాలు చేశారు. అడిషనల్ కలెక్టర్, వివిధ శాఖల అధికారులు ర్యాలీలో పాల్గొన్ని స్ఫూర్తిని చాటారు. -
‘అక్రమార్కులకు చెక్ పెడదాం’
అయిజ: కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడు వసూలురాజాగా చలామని అవుతున్నాడని, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి అక్రమార్కులకు చెక్ పెడదామని ఎమ్మెల్సీ చెల్లా వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల కేటాయింపు పూర్తై, నోటిపికేషన్ వెలువడనున్న సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ నాయకుల సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల హామీలో భాగంగా ఆరు గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్కు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు ఇసుక, మట్టి అక్రమాల వ్యాపారాలపై ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై చూపడం లేదని ఆరోపించారు. అభివృద్ధి కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యమని, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుదామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నూతన విధానంతో మేలు
నూతన రిజిస్ట్రేషన్ విధానం ఈ నెల 24వ తేదీన నుంచి అమల్లోకి వచ్చింది. షోరూంలోనే వాహనాల రిజిస్ట్రేషన్ పూర్తవుతుండడంతో వాహన దారులకు సమయం, డబ్బు ఆదా అవుతాయి. కొత్త విధానంపై వాహనదారులకు అవగహన కల్పించడమే కాకుండా షోరూంల్లో రిజిస్ట్రే షన్ సందర్భంగా ఇబ్బందులు రాకుండా సిబ్బంది పరిశీలన ఉంటుంది. శనివారం సాయంత్రం రిజిస్ట్రేషన్ కోసం ఒక దరఖాస్తు వచ్చింది. పరిశీలించి అనుమతులు ఇస్తాం. వాణిజ్య వాహనాలు మాత్రం రవాణాశాఖ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. – ఎం.కృష్ణారెడ్డి, ఇన్చార్జ్ జిల్లా రవాణాశాఖ అధికారి ● -
బాల్యవివాహాలను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు
ఎర్రవల్లి: బాల్య వివాహాలను ప్రోత్సహించినా.. సహకరించినా చట్టరీత్యా నేరమని సీడీపీఓ సుజాత అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో మహిళా, శిశు, సంక్షేమ శాఖ, బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాల్య వివాహ్ ముక్త్ భారత్ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరై సర్వీస్ ప్రొవైడర్స్, పురోహితులు, ఖాజీలు, ఫాస్టర్స్, ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, టెంట్హౌస్ నిర్వాహకులకు బాల్య వివాహాలు చేయడం వల్ల జరిగే నష్టాలతోపాటు అందుకు ప్రోత్సహించిన వారికి పడే శిక్షల గురించి వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాలు బాలల భవిష్యత్కు ఎంతో ఆటంకం కలిగిస్తాయన్నారు. పెళ్లికి ముందే ఇరువురి వయస్సును ప్రతిఒక్కరూ తప్పకుండా ధ్రువీకరించుకోవాలని సూచించారు. అబ్బాయికి 21, అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలన్నారు. బాలికల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నాయని చెప్పారు. నేటి బాలలే రేపటి పౌరులు అని, వారిని ప్రోత్సహించి చదివిస్తే ఉన్నత చదువులు చదివి విద్యావంతులు అవుతారని పేర్కొన్నారు. బాల్య వివాహాలు జరిపిస్తే రూ.లక్ష జరిమానాతోపాటు రెండేళ్ల జైలుశిక్ష విధిస్తారని హెచ్చరించారు. అలాగే వివాహానికి సహకరించిన వారిపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదవుతుందన్నారు. బాల, బాలికలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా డయల్ 100, 1098కు కాల్ చేసి సహాయం పొందవచ్చన్నారు. అనంతరం బాల్య వివాహాల నిర్మూలన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మహేష్, బాలల సంరక్షణ అధికారులు నర్సింహ, రవి, చైల్డ్లైన్ కోఆర్డినేటర్లు శివలీల, జయ్యన్న పాల్గొన్నారు. -
మెడికల్ సీట్లు పెరిగే అవకాశం?
పాలమూరు: తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మొదటి ప్రభుత్వ మెడికల్ కళాశాలను పాలమూరులోనే ఏర్పాటు చేశారు. 2016లో 150 ఎంబీబీఎస్ సీట్లతో మొదలైన కళాశాల ప్రస్తుతం 175 సీట్లతో కొనసాగుతోంది. పదేళ్ల కాలంలో నాలుగు ఎంబీబీఎస్ బ్యాచ్లు కోర్సు పూర్తి చేసుకొని బయటకు వెళ్లాయి. ఒక్కో బ్యాచ్లో 150 విద్యార్థుల చొప్పున 600 మంది విద్యార్థులు పూర్తి చేసుకున్నారు. అలాగే కళాశాలలో 34 పీజీ సీట్లు ఉండటం విశేషం. తాజాగా మరో 25 సీట్లు పెంచడానికి శనివారం పాలమూరు మెడికల్ కళాశాలను, జనరల్ ఆస్పత్రిని ఎన్ఎంసీ(జాతీయ మెడికల్ కౌన్సిల్) బృందం సభ్యులు డాక్టర్ మల్లిఖార్జున్, డాక్టర్ అనిల్ బాబు సందర్శించారు. ఉదయం వారు మెడికల్ కళాశాలకు వెళ్లి స్థానికంగా బోధకుల సంఖ్య, పరిపాలన సిబ్బంది, తరగతి గదులు, ఇతర వసతులపై ఆరా తీశారు. అక్కడి నుంచి జనరల్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో రోజు వారీగా వచ్చే ఓపీ రోగులు, ఐపీ రోగుల సంఖ్య, క్యాజువాలిటీ, అన్ని రకాల ఆపరేషన్ థియేటర్స్, వార్డులు, ఐసీయూ, మాతా శిశు విభాగం ఇలా ప్రతి వార్డును సందర్శించి స్థానికంగా ఉన్న వసతులపై నివేదిక తయారు చేశారు. ఎన్ఎంసీ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా సీట్ల పెంపు ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఎన్ఎంసీ పర్యటన పూర్తయిన నేపథ్యంలో పాలమూరు మెడికల్ కళాశాల అధికారులు ఈ నెల 28 వరకు 200 ఎంబీబీఎస్ సీట్లు ఏర్పాటు చేయాలనే అంశంపై ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎన్ఎంసీ ఈ ప్రతిపాదనలు పరిశీలించి మరోసారి పర్యటిస్తారా? లేదా ఆన్లైన్లో అనుమతులు మంజూరు చేస్తారా? అనేది ఈ నెల చివరి నాటికి తెలుస్తుంది. ఎన్ఎంసీ బృందం వెంట కళాశాల డైరెక్టర్ డాక్టర్ రమేష్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా ఆజ్మీరా ఇతర వైద్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు. 150 సీట్లతో 2016లో పాలమూరు ప్రభుత్వ కళాశాల ప్రారంభం ఇప్పటి వరకు నాలుగు ఎంబీబీఎస్ బ్యాచ్లు పూర్తి తాజాగా 25 సీట్ల కేటాయింపు కోసంఎన్ఎంసీ బృందం పర్యటన -
వేరుశనగ @ రూ.9,389
రోజురోజుకూ పెరుగుతున్న ధరలు నాణ్యతను బట్టి ధర ● ఈసారి రికార్డు స్థాయిలో పెరుగుదల ● మద్దతుకు మించి ఎగబాకుతున్న వైనం ● గద్వాల మార్కెట్కు భారీగా రాక ● జిల్లాలో ఊపందుకున్న దిగుబడులు గద్వాల వ్యవసాయం: జిల్లాలో పల్లీ ధరలు రోజురోజుకూ ఎగబాకుతున్నాయి. రైతులు యాసంగి సీజన్కు ముందుగా వేరుశనగ వేయగా.. పంట చేతికి రావడంతో విక్రయానికి గడిచిన మూడు నెలల నుంచి గద్వాల మార్కెట్ యార్డుకు తీసుకువస్తున్నారు. ఇలా వస్తున్న వేరుశనగకు అక్టోబర్ నుంచి జనవరి వరకు పోల్చితే నెలనెలా రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. ఈ సీజన్లో గరిష్టంగా రూ.9,389 ధర పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన వానాకాలం సీజన్లో అధిక వర్షాల వల్ల వేరుశనగ బాగా దెబ్బతినడంతో కొన్నిచోట్ల పంటను తీసివేశారు. జిల్లాలో పలుచోట్ల అనుకున్న స్థాయిలో దిగుబడులు రాలే దు. అయితే విస్తారంగా కురిసిన వర్షాల వల్ల బోర్లు, బావులు రీచార్జి అయ్యాయి. దీంతో ఆగస్టు, సెప్టెంబర్లో దాదాపు 7–10 వేల ఎకరాల్లో ముందస్తుగా యాసంగి సీజన్లో భాగంగా మల్దకల్, కేటీదొడ్డి, గట్టు, గద్వాల, ఇటిక్యాల, అయిజ మండలాల్లో పంట సాగు చేశారు. ఇలా వేసిన వేరుశనగ పంట అక్టోబర్ నుంచి యార్డుకు అమ్మకానికి వస్తోంది. బోరుబావులు, అందుబాటులో ఉన్న నీటివనరుల కింద వేరుశనగను సాగు చేశారు. అయితే దిగుబడులు ఎక్కువగా రాకున్నా గింజ బాగా గట్టిగా, లావుగా ఉంది. దీంతో చేతికి వచ్చిన వేరుశనగను బాగా ఆరబెట్టి, మట్టి పెల్లలు, దుమ్ము, ధూళి లేకుండా రైతులు తీసుకొస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఈ సమయంలో వేరుశనగ యార్డులకు రావడం లేదు. దీంతోపాటు ఇక్కడి నుంచి చైన్నె, మహారాష్ట్రకు ఎగుమతి అవుతోంది. ఫలితంగా ఇక్కడ వేరుశనగకు మంచి ధరలు రావడంతోపాటు పెరుగుతున్నాయి. బాగా ఆరబెట్టి తీసుకొస్తుండటంతోపాటు సరుకు నాణ్యతగా ఉంటుండటంతో వ్యాపారులు మంచి ధరలు కోడ్ చేస్తున్నారు. ఈ సీజన్లో వేరుశనగ క్వింటాకు లభించిన ధరలు ఇలా.. -
పకడ్బందీగా మున్సిపల్ ఎన్నికలు
గద్వాల: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించే బాధ్యత ఆర్ఓ, ఏఆర్ఓలపై ఉందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన అనుభవం ఉన్నప్పటికీ ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల పరంగా అభ్యర్థులు పోటీ చేస్తున్నందున జిల్లా ఎన్నికల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలు నిబంధనల ప్రకారం నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికల సంఘం ముద్రించిన హ్యాండ్బుక్ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి దాని ప్రకారమే కేటాయించిన విధులను కౌంటింగ్ ప్రక్రియలో వ్యాలిడ్, ఇన్వ్యాలిడ్ ఓట్ల లెక్కింపులో ఎన్నికల నిబంధనలను పాటించాలన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే ముందుగానే మాస్టర్ ట్రైనర్స్ను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. విధుల్లో అలసత్వం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించిన మాదిరిగానే మున్సిపల్ ఎన్నికలను విజయవంతంగా చేపట్టాలన్నారు. అంతకు ముందు రాష్ట్ర శిక్షకులు హరినాథ్రెడ్డి హైదరాబాద్ నుంచి ఎన్నికల విధులపై వర్చువల్గా అవగాహన కల్పించారు. అనంతరం మాస్టర్ ట్రైనర్స్ రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు క్షుణ్ణంగా శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, జెడ్పీ సీఈఓ నాంగేంద్రం, ఎన్నికల నోడల్ అధికారి రమేష్బాబు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
ముమ్మరంగా వన్యప్రాణుల గణన
మన్ననూర్/ లింగాల: అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలో నేషనల్ టైగర్ కన్జర్వేటర్ (ఎన్టీసీ) న్యూఢిల్లీ ఆదేశాల మేరకు అటవీ శాఖ చేపట్టిన వన్యప్రాణుల గణన ముమ్మరంగా కొనసాగుతుంది. 2,611 చ.కి.మీ., పరిధిలో విస్తరించి ఉన్న అభయారణ్యంలో ఆరు రోజుల పాటు సర్వే నిర్వహించనున్నారు. అన్నిరకాల వన్యప్రాణుల లెక్క తేల్చనున్న ఈ గణనలో అటవీశాఖ సిబ్బందితోపాటు డెహ్రాడూన్ నేషనల్ ఆఫ్ ఇండియా, కన్జర్వేటర్ అథారిటీతోపాటు 133 మంది వన్యప్రాణి ప్రేమికులు, వలంటీర్లు పాల్గొంటున్నారు. ఈ గణన శాకాహారం, మాంసాహార జంతువులు నేరుగా చూసినవి పాదముద్రలు, మలం, చెట్లకు అంటుకుని ఉన్న వెంట్రుకలు తదితరాలను రెండు విభాగాలుగా సేకరించి సర్వే నిర్వహిస్తారు. గతంలో అభయారణ్యంలో అమర్చిన సీసీ కెమెరా పుటేజీలను కూడా ఆధారం చేసుకుంటున్నారు. సేకరించిన సర్వే వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరుస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే శాకాహార జంతువుల గణన పూర్తి కాగా మాంసాహార జంతువుల గణన జరుగుతుందని పేర్కొన్నారు. శనివారం చేపట్టిన సర్వేలో పెద్దపులి, చిరుతపులి, ఎలుగుబంటి, రేసు కుక్కలు, అడవి పిల్లి వంటి వన్యప్రాణుల ఉనికిని గమనించామని లింగాల ఎఫ్ఆర్ఓ ఈశ్వర్ తెలిపారు. -
నల్లమలలో అలజడి
కలకలం రేపిన మవోయిస్టుల అరెస్టు సాక్షి, నాగర్కర్నూల్: దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమాలు, తుపాకీ చప్పుళ్లతో దద్దరిల్లిన నల్లమల మరోసారి ఉలిక్కిపడింది. నల్లమలకే చెందిన ముగ్గురు మావోయిస్టు సానుభూతిపరులతోపాటు ఇద్దరు మావోయిస్టు కీలక నేతలను అచ్చంపేటలో అరెస్ట్ చేయడం స్థానికంగా కలకలం రేపింది. నల్లమలలో సుమారు 20 ఏళ్లుగా మావోయిస్టు కార్యకలాపాలు తెరమరుగు పడుతూ రాగా.. తాజాగా మావోయిస్టుల అరెస్ట్ నేపథ్యంలో మళ్లీ అలజడి సృష్టించింది. ఆంధ్ర, ఒడిశా, చత్తీస్ఘడ్ సరిహద్దు, దండకారణ్యంలో కేంద్ర బలగాల ముమ్మర కూంబింగ్, వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో అక్కడి నుంచి మావోయిస్టులు ఆశ్రయం కోసం నల్లమల ప్రాంతానికి చేరుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే వీరు ఆశ్రయం కోసమే వచ్చారా.. లేక ఈ ప్రాంతంలో మావోయిస్టు పునరుజ్జీవం కోసం ప్రయత్నం చేస్తున్నారా.. అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. నిశిత పరిశీలన.. మావోయిస్టు పార్టీలో కీలక నేతలకు ఆశ్రయం ఇవ్వడంతోపాటు అన్నిరకాలుగా మద్దతుగా నిలుస్తున్నట్టుగా నల్లమల ప్రాంతానికి చెందిన వ్యక్తులపై పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలోనే పౌరహక్కుల నేతలు, మాజీ మావోయిస్టులు, ప్రజా సంఘాల నేతలపై పోలీసులు నిఘా ఉంచి నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే నల్లమల ప్రాంతంలోని పదర మండలం వంకేశ్వరం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎడ్ల అంబయ్య ఇప్పటికే పలుమార్లు చత్తీస్ఘడ్ వెళ్లి మావోయిస్టులతో సంప్రదింపులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. ఆయన తెలంగాణ ప్రజాఫ్రంట్ కో కన్వీనర్గా పనిచేస్తున్నారు. అమ్రాబాద్ మండలం మన్ననూర్కు చెందిన జక్క బాలయ్య పౌర హక్కుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు. స్థానికంగా పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు. అలాగే లింగాల మండలం క్యాంపురాయవరం గ్రామానికి చెందిన మన్శెట్టి యాదయ్య గతంలో మావోయిస్టుగా పనిచేసి పోలీసులకు లొంగిపోయాడు. ప్రస్తుతం వ్యవసాయం చేస్తూ గ్రామంలో ఉంటున్నాడు. నల్లమల ప్రాంతానికే చెందిన ఈ ముగ్గురు అరెస్టు కావడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి పాలమూరులో.. రెండు దశాబ్దాల కిందట నల్లమల దళం కేంద్రంగా ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమం ఉధృతంగా సాగింది. అనేక మెరుపుదాడులు, ఎన్కౌంటర్లు, పరస్పర దాడులకు ఉమ్మడి జిల్లా సాక్ష్యంగా నిలిచింది. నాగర్కర్నూల్ జిల్లా సోమశిల సమీపంలో 1993 నవంబర్ 13న పోలీసులు ప్రయాణిస్తున్న బస్సుపై మావోయిస్టులు దాడి చేయడంతో ఏకంగా ఎస్పీ పరదేశినాయుడితో పాటు ఇద్దరు ఎస్ఐలు, ఆరుగురు పోలీసులు మరణించారు. అలాగే 2005 ఆగస్టు 15న ధన్వాడలో అప్పటి ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డిపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో ఆయన మృతి చెందారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మావోయిస్టుల ప్రాబల్యం తీవ్రస్థాయిలో కొనసాగింది. తాజాగా మావోయిస్టుల అరెస్ట్ నేపథ్యంలో మళ్లీ అలజడి రేగింది. ఉమ్మడి జిల్లాలో మళ్లీ మవోయిస్టు పార్టీ పునరుజ్జీవం కోసం ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా ముమ్మరంగా విచారణ చేపడుతున్నారు. అచ్చంపేటలో కేంద్ర మిలటరీ కమిటీ సభ్యుడు సాలోమాన్తో పాటుమరో ముగ్గురు స్థానికులు అదుపులోకి.. ఆశ్రయం కోసం వచ్చారా.. పునరుజ్జీవం చేసేందుకా? ఉమ్మడి జిల్లాలో బలోపేతానికియత్నించినట్లు పోలీసుల వెల్లడి -
సీజన్లో అత్యధిక ధర..
గద్వాల యార్డుకు శనివారం 193 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. ఇందులో కర్ణాటక ప్రాంతం దేవునిపల్లి గ్రామానికి రైతు సయ్యద్ ఎక్బాల్ అహ్మద్ 27 క్వింటాళ్ల వేరుశనగను తీసుకురాగా.. బాగా నాణ్యతగా ఉండటంతో క్వింటాల్కు అత్యధికంగా రూ.9,389 ధరకు కొనుగోలు చేశారు. ఈ సీజన్లోనే ఇది అత్యధిక ధరగా యార్డు అధికారులు పేర్కొన్నారు. సీజన్లో రికార్డు స్థాయిలో అత్యధిక ధర పొందిన రైతు సయ్యద్ ఎక్బాల్ అహ్మ ద్ను మార్కెట్ యార్డు చైర్మన్ హన్మంతు, వైస్చైర్మన్ శ్రీకాంత్, యార్డు కార్యదర్శి నర్సింహ తదితరులు ఘనంగా సన్మానించారు. -
అచ్చంపేటలో మోస్ట్ వాంటెడ్..
ఆంధ్ర, ఒడిశా, చత్తీస్ఘడ్ సరిహద్దుల్లో కీలకంగా పనిచేస్తున్న దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు, కేంద్ర మిలటరీ కమిటీ సభ్యుడిగా ఉన్న మీసాల సాలోమాన్తోపాటు ఆయన భార్య సన్బట్టిని పోలీసులు అచ్చంపేటలో అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన సాలోమాన్ 32 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు. కేంద్ర మిలటరీ కమిటీ సభ్యుడిగా అగ్రనేతలు తిప్పరి తిరుపతి, దేవ్జీ, హిడ్మా వంటి వారితో పనిచేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో సంచరిస్తూ అక్కడి మావోయిస్టు దళాలకు గెరిల్లా యుద్ధ విద్యల్లో శిక్షణ ఇస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఆయన భార్య సైతం దండకారణ్యం డీవీసీఎం కేడర్, పీఎల్జీ బెటాలియన్ సభ్యురాలిగా కీలకంగా పనిచేస్తున్నారు. ఈ దంపతులు దండకారణ్యాన్ని వదిలి నల్లమల ప్రాంతానికి చేరుకోవడం.. ఈ క్రమంలోనే అరెస్ట్ కావడం స్థానికంగా అలజడి సృష్టించింది. -
ప్రతి పల్లెకు బ్యాంకు సేవలు
ఎర్రవల్లి: గ్రామీణ ప్రజల అవసరాలను తీర్చేందుకే ఎస్బీఐ కీలక అడుగులు వేసి నూతన శాఖను ప్రారంభించిందని ఎంపీ మల్లు రవి అన్నారు. శుక్రవారం ఎర్రవల్లిలో ఏర్పాటు చేసిన ఎస్బీఐ నూతన శాఖను ఎమ్మెల్యే విజయుడు, జీఎం సతీష్కుమార్తో కలిసి ఎంపీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పల్లెకు ఎస్బీఐ సేవలను అందించడమే లక్ష్యంగా ఎర్రవల్లి కూడలిలో బ్యాంకు నూతన శాఖను ఏర్పాటు చేయడం ఎంతో గర్వకారణమన్నారు. ఎస్బీఐలో ఎన్నో సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు, రైతులు, మహిళలు, చిరు వ్యాపారులు ఈ సేవలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. బ్యాంకులంటే ప్రజలకు ఎంతో నమ్మకం ఉందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన బ్యాంకు సేవలను అందించి ప్రజల మన్ననలు పొందాలని సిబ్బందికి సూచించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం.. స్థానిక ఎమ్మెల్యే విజయుడుతో తమకు ఎలాంటి విబేధాలు లేవని, ఇద్దరం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారమని, ఆయనతో కలిసి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఎంపీ మల్లురవి అన్నారు. పార్టీలు వేరైనా అభివృద్ధే ఎజెండాగా కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఓ సంఘటన వివాదాస్పదం కావడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో గద్వాల ఆర్డీఓ అలివేలు, ఎస్బీఐ ఏజీఎం బిరోజ్ కుమార్, ఆర్ఎం సుజాత, బ్రాంచి మేనేజర్ శివతేజ, డీసీసీబీ మాజీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రాజీవ్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాసులు, మార్కెట్ యార్డు చైర్మన్ దొడ్డెప్ప, తహసీల్దార్ నరేష్, సర్పంచ్ అనిత తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో వసంత పంచమి పూజలు
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమిని పురస్కరించుకొని శుక్రవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం సుప్రభాతసేవ, పంచామృత అభిషేకం, కుంకుమార్చన, మహానైవేద్య నీరాజనాలు, విశేష అలంకరణ తదితర పూజా కార్యక్రమాలను అర్చకులు కనులపండువగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లి పుణ్యక్షేత్రానికి చేరుకొని పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో సరస్వతిదేవిని దర్శించుకొన్నారు. అనంతరం సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే ఆలయ ప్రధాన అర్చకులు భువనచంద్రచారి, దినకరన్, దత్తుస్వామి, భానుమూర్తి ఆధ్వర్యంలో వేద మంత్రాలతో 280 మంది చిన్నారులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో సామూహికంగా అక్షరాభ్యాసం చేయించారు. భక్తులకు పాలక మండలి ఆధ్వర్యంలో అల్పాహారం, అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ వైస్ చైర్మన్ వెంకటాద్రి, జనరల్ సెక్రెటరీ సీతారామిరెడ్డి, మేనేజర్ సురేందర్రాజు, సభ్యులు విజయమోహన్రెడ్డి, నారాయణనాయుడు, నాగబలిమి, రవిబాబు తదితరులు పాల్గొన్నారు. -
జములమ్మ బ్రహ్మోత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు
గద్వాల: జములమ్మ బ్రహ్మోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో ఈ నెల 27 నుంచి ప్రారంభమవుతున్న జమ్ములమ్మ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మంగళవారం, శుక్రవారాల్లో వేలాది సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, బారికేడ్లు ఏర్పాటు చేసి క్యూలైన్ సక్రమంగా నిర్వహించాలన్నారు. భక్తులకు తాగునీటి వసతి, మరుగుదొడ్లు, పరిశుభ్రతకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ నిర్వహణ, భద్రత పార్కింగ్ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఎమర్జెన్సీ సేవలను అందుబాటులో ఉంచాలని, ఆలయ ప్రాంగణంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు చెప్పారు. వైన్షాపుల దగ్గర ఎలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ఎక్సెజ్ అధికారులకు సూచించారు. నీటి ప్రమాదాలు జరిగితే గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, జమ్ములమ్మ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పురేందర్, జిల్లా మత్స్యశాఖ అధికారి షకీలాభాను, తహసీల్దార్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి ప్రజాస్వామంలో 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం అధికారులతో స్వీప్ నోడల్ అధికారి రమేష్బాబు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఓటుహక్కు ప్రాధాన్యత తెలియజేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. -
తాజాగా మల్లు రవి వర్సెస్ విజయుడు..
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. అలంపూర్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్కు చెందిన విజయుడు ఉన్నారు. అయితే కాంగ్రెస్ ముఖ్య నేత ఒకరు అంతా తానై అధికారం చెలాయిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేనే అయినప్పటికీ అధికారిక కార్యక్రమాలతో పాటు నిత్యం జరుగుతున్న ఇసుక, మట్టి, మొరం, అసైన్డ్ భూముల దందాల్లో చక్రం తిప్పతున్నారు. ఏ పని అయినా ఆయనకు కమీషన్, వాటా ముట్టనిదే ముందుకు కదలడం లేదనే టాక్ ఉంది. తన మాట వినని అధికారులను బెదిరిస్తున్నట్లు ఇటీవల ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ ఒక్క నియోజకవర్గమే కాదు.. గద్వాలలో సైతం ఖాకీలు, ఇతర అధికార యంత్రాంగాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని చక్రం తిప్పుతున్నారని.. తనను లెక్కచేయని ఓ జిల్లా స్థాయి అధికారి బదిలీ వెనుక ఆయన ‘హస్తమే’ ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలంపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పైపాడులో ఈ నెల 20వ తేదీన ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే విజయుడి మధ్య ప్రొటోకాల్ రగడ చోటుచేసుకుంది. వివిధ అభివృద్ధి పనులకు టెంకాయ కొడుతున్న సమయంలో ఇరువురితో పాటు వారి వారి అనుచరుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఎంపీ మల్లు రవి తోసివేస్తూ దుర్భాషలాడినట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్గా మారగా.. రాజకీయ రచ్చకు తెరలేసినట్లయింది. దీనిపై ఎమ్మెల్యే విజయుడిని దూషిస్తూ అవమానం చేసిన ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత న్యూఢిల్లీ వేదికగా మల్లు రవి ‘నేను ఎమ్మెల్యేను తిట్టింది గానీ, కొట్టింది గానీ లేదు. కానీ నేను ఎమ్మెల్యేపై భౌతిక దాడి చేశానని కేటీఆర్ ట్వీట్ చేశారు. తప్పుడు ప్రచారం చేసిన వారు నాకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే నిరాహార దీక్షకు కూర్చుంటా’ అని ప్రతిస్పందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు గద్వాల జిల్లాలో ఏం జరుగుతోందనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. -
లీడర్ల ‘లడాయి’..!
దూకుడు పాలి‘ట్రిక్స్’ కేరాఫ్ నడిగడ్డ శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2026–IIలో uసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్రంతో పాటు పాలమూరులో విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు గద్వాల, అలంపూర్ పెట్టింది పేరు. ఇటు కృష్ణా, అటు తుంగభద్ర నది మధ్య నడిగడ్డ (జోగుళాంబ గద్వాల)గా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతాలు ఎప్పుడూ ప్రత్యేకమే. ఒకవైపు ఏపీ, మరోవైపు కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ నియోజకవర్గాలు రాజకీయ చైతన్యానికి ప్రతీకగా నిలుస్తాయి. ఆధిపత్యమే హద్దుగా అసమాన రాజకీయాలకు కేరాఫ్గా నిలిచిన ఈ జిల్లాలో ఆ ఒరవడి ఇప్పటికీ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాలతో పాటు స్వపక్షంలోని విపక్ష నేతల మధ్య వార్ నడుస్తోంది. ఇటీవల నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి మధ్య ప్రొటోకాల్ చిచ్చు రాజకీయ రగడకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో పలువురు లీడర్ల లడాయి, వారి వ్యవహార శైలి హాట్టాపిక్గా మారింది. గద్వాల: పెద్దల వద్దకు ‘వార్డుల’ లొల్లి గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్లో వర్గ పోరు తీవ్రమైంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత మధ్య తొలి నుంచీ ఆధిపత్య యుద్ధం కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో పలు స్థానాల్లో ఆయా వర్గాల మధ్య పోటాపోటీ నడిచింది. తాజాగా మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైన నేపథ్యంలో ఇరువర్గాలు కసరత్తు మొదలుపెట్టాయి. మున్సిపాలిటీలో మొత్తం 37 వార్డులు ఉండగా.. తమకు 16 వార్డులు కేటాయించాలని ఓ వర్గం వారు పార్టీ ముఖ్య నేతలకు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొనేది లేదని.. లేకుంటే మీ ఇష్టమంటూ మరో వర్గ నేత సమాధానమిచ్చినట్లు సమాచారం. స్వపక్షంలో విపక్షంలా ముదిరిన పంచాయితీ కీలక నేతలను బెంబేలెత్తిస్తోంది. ప్రస్తుతం ఈ లొల్లి రాష్ట్ర పెద్దల వద్దకు చేరినట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ‘ఆధిపత్య’మే హద్దుగాఅసమాన రాజకీయాలు అటు అధికార, ప్రతిపక్షాలు.. ఇటు స్వపక్షంలోనే విపక్షం నాగర్కర్నూల్ ఎంపీ, అలంపూర్ ఎమ్మెల్యే మధ్య రగడతో మళ్లీ తెరపైకి.. హాట్టాపిక్గా ఉమ్మడి జిల్లాలోని పలువురు నేతల వ్యవహార శైలి -
యథేచ్ఛగా అడ్డ‘దారి’
గద్వాల టౌన్: జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలో జనాభా పెరుగుతోంది.. రోడ్లపై వాహనాల రద్దీ ఎక్కువైంది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న రోడ్లను విస్తరించాలి. అయితే.. కొందరు స్వార్థపరులు మాత్రం ఉన్న దారులనే మింగేస్తున్నారు. రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి స్థిరాస్తి వ్యాపారానికి ‘దారి’తీశారు. అడిగేవారు, అడ్డుకునేవారు లేకపోవడంతో అక్రమార్కుల బరితెగింపు రోజురోజుకూ మితిమీరుతోంది. అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం చోద్యం చూస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. కబ్జా చేసి.. ప్లాట్లుగా విక్రయించి జిల్లాకేంద్రంలో అత్యంత ఖరీదైనా ప్రాంతాలలో కొత్తహౌసింగ్ బోర్డుకాలనీ ఒకటి. ఈ కాలనీకి ఆనుకొని సర్వే నంబర్ 789లోని రెండు ఎకరాల స్థలంలో 1988లోనే అధికారికంగా ఎల్పీని ఏర్పాటు చేశారు. ఇందులో నాలుగు గుంటల స్థలాన్ని ప్రజా అవసరాల కోసం వదిలారు. అయితే ఈ ఖాళీ స్థలంతోపాటు 40 అడుగుల రోడ్డును కొంతమంది కబ్జాచేసి ప్లాట్లుగా డాక్యుమెంట్లు సృష్టించారు. ఆ ప్లాట్లను అధికార పార్టీకి చెందిన నేతలు తక్కువ ధరలకు కొనుగోలు చేసి తమ ఆధీనంలో ఉంచుకున్నారు. కబ్జాకు గురైన ఆ స్థలం బహిరంగ మార్కెట్లో రూ.4 కోట్లు ఉంటుంది. కబ్జా చేసిన ప్లాట్లకు దారి లేకపోవడం, వాటిని అభివృద్ధి చేసుకొనేందుకు నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఎవరు ఏమీ చేయరనే ఉద్దేశంతో ఏకంగా ప్లాట్లకు ఆనుకుని ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ప్రజా అవసరాల ఖాళీ స్థలాన్ని సైతం ఆక్రమించేశారు. అందరూ చూస్తుండగానే అధికార పలుకుబడితో నిబంధనలకు తుంగలో తొక్కి ఖాళీ స్థలంలో మట్టి రోడ్డు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్రమ ప్లాట్లలో దుకాణాలు సైతం నిర్మిస్తున్నారు. దీనిపై స్థానికులు అభ్యంతరం తెలిపి, ఫిర్యాదు చేసినా అధికార బలం ముందు ఫలితం లేకుండా పోయింది. ఎల్పీలోని ఖాళీ స్థలంతోపాటు రహదారిలో ప్లాట్లు ఏర్పాటు చేయటం, హౌసింగ్బోర్డు కాలనీకి చెందిన ఖాళీ స్థలంలో దౌర్జన్యంగా రోడ్డు నిర్మించడం నిబంధనలకు విరుద్ధమైనా కబ్జాదారులు అవేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. నేతల బాహాబాహీ.. రాజకీయ ఒత్తిడితో స్థలాల కబ్జా, అక్రమ నిర్మాణాల గుర్తింపు వ్యవహారం పక్కదారి పడుతోంది. కొంతమంది నేతల అండతో సాగుతున్న కబ్జాల పర్వానికి అంతే లేకుండా పోతుంది. దీనిపై రెండేళ్ల క్రితం అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలు బాహాబాహీకి దిగిన సంఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది. అప్పుడు ఉన్న కలెక్టర్ కబ్జాలపై సీరియస్గా తీసుకుని అక్రమ నిర్మాణాలను నిలిపిచేయించారు. ప్రస్తుతం అధికారులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటాన్ని అదునుగా తీసుకుని అక్రమార్కులు మళ్లీ అక్రమ నిర్మాణాలకు తెరలేపారు. నిబంధనలకు విరుద్ధమని టౌన్ప్లానింగ్ అధికారులు చెప్పినప్పటికీ అక్రమార్కులు పట్టించుకోవడం లేదు. పైగా ‘ఆ ప్లాట్లు మనోళ్లవే ఎవరు ఫిర్యాదు చేసినా అక్కడికి వెళ్లొద్దని ముఖ్య నాయకులు అధికారులకు ఫోన్ చేసి హెచ్చరించడం విశేషం. ఎల్పీలోని రోడ్డు, ఖాళీ స్థలం కబ్జా ప్లాట్లు ఏర్పాటు చేసి.. దుకాణాల నిర్మాణం రూ.4 కోట్ల విలువైన స్థలం పరులపాలు ఫిర్యాదు చేసిన వారిపైనే కబ్జాదారుల బెదిరింపులు చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం ‘ఇక్కడ కనిపిస్తున్న దుకాణ నిర్మాణాలు, ప్లాట్ల హద్దులు సర్వే నంబర్ 789 అప్రూవుడ్ లే అవుట్ ప్లాన్లోనివి. ఎల్పీలో ఉన్న ప్రజా అవసరాల కోసం వదిలిన ఖాళీ స్థలంతోపాటు 40 అడుగుల రోడ్డు మధ్యలో వీటిని ఏర్పాటు చేశారు. నిబంధలను పట్టించుకోకుండా లే అవుట్లోని ఖాళీస్థలం, రోడ్డును కొంతమంది దౌర్జన్యంగా కబ్జా పెట్టి ప్లాట్లుగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దుకాణాలు సైతం నిర్మిస్తున్నారు. ఈ ప్లాన్కు ఆనుకుని ఉన్న కొత్త హౌసింగ్ బోర్డుకు చెందిన ప్రజా అవసరాల స్థలాన్ని కూడా కబ్జా చేశారు. దీనిపై స్థానికులు ప్రశ్నిస్తే ప్రత్యామ్నాయంగా మరోచోట రోడ్డు వేస్తామని బెదిరిస్తుండటం గమనార్హం. -
ఎగబడి పోవాలె..!
ఉమ్మడి జిల్లాలో బస్సు సౌకర్యం లేక విద్యార్థుల అగచాట్లు ● అనేక గ్రామాల్లో కిక్కిరిసిన ఆటోల్లోనే పాఠశాలలకు.. ● కొన్నిప్రాంతాల్లో ఎడ్ల బండ్లు, కాలినడకే శరణ్యం ● నిత్యం కిలోమీటర్ల కొద్దీ ప్రమాదకర ప్రయాణం ● అరకొరగా ఆర్టీసీ సర్వీస్లు.. సమయానికి రాక.. వచ్చినా ఆపక ఇబ్బందులు ● పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు ఫీట్లు.. పాట్లు -
పేదింటి ఆడబిడ్డలకు అండగా ప్రభుత్వం
గద్వాల: పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 145 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, 300 పడకల ఆస్పత్రి, గురుకుల పాఠశాలలు, ప్రధాన రహదారులు, సీసీరోడ్లు, డ్రయినేజీ నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. అదే విధంగా పేదలకు ఏదైనా సమస్య తలెత్తితే 24 గంటలు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో తాము బలపర్చిన అభ్యర్థులను గెలిపించి గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు బోయ వెంకట్రాములు, జంబు రామన్గౌడ్, చెన్నయ్య, రమేశ్ నాయుడు, సుభాన్, బండారి భాస్కర్, బాబర్ పాల్గొన్నారు. -
‘ఉపాధి హామీ’ పేరు మార్పు సరికాదు
కేటీదొడ్డి: అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు లబ్ధి చేకూర్చే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్ముడి పేరు తొలగించడం సరికాదని డీసీసీ అధ్యక్షుడు రాజీవ్రెడ్డి అన్నారు. గురువారం కేటీదొడ్డిలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మహాత్మాగాంధీ పేరు ఉపాధి హామీ పథకానికి ఉండటం వల్ల కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలి కానీ.. ఉన్న పథకం పేరు రద్దు చేయడం సరికాదన్నారు. దేశంలో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. అందులో భాగంగానే గాంధీజీ పేరు తొలగించిందని ఆరోపించారు. ఈ నెల 26న ప్రతి గ్రామపంచాయతీలో కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని పిలుపునిచ్చారు. తీర్మాన ప్రతులను రాష్ట్రపతికి పంపిస్తామన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, సర్పంచ్ నారాయణ, నాయకులు ఉరుకుందు, గోవిందు, కొండన్న, యుగందర్, శేఖర్రెడ్డి ఉన్నారు. -
ఆర్టీసీకి సంక్రాంతి ఆదాయం
● ఈ నెల 9 నుంచి 20 వరకు రూ.22 కోట్లు ఆర్జన ● 34 లక్షల కి.మీ. ప్రయాణం, 39 లక్షల ప్రయాణికుల వినియోగం ● ఓఆర్లో రాష్ట్రంలోనే మహబూబ్నగర్ రీజియన్ అగ్రస్థానం స్టేషన్ మహబూబ్నగర్: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ సంస్థ ప్రత్యేక అదనపు బస్సు సర్వీసులను నడిపింది. మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో ఈ నెల 9 నుంచి 13 వరకు హైదరాబాద్ నుంచి పది డిపోలకు 430 బస్సులు, తిరుగు ప్రయాణంలో ఈ నెల 17 నుంచి 20 వరకు ఆయా డిపోల నుంచి హైదరాబాద్ వైపు 364 బస్సులు నడిపారు. ముఖ్యంగా ప్రయాణికులు హైదరాబాద్ నుంచి ఉమ్మడి జిల్లాలోని స్వస్థలాలకు వెళ్లడానికి అధికంగా బస్సులు తిప్పారు. వీటిలో సెలవులు ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. అత్యధికంగా 109 శాతం.. మహాలక్ష్మి పథకం కింద ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణంలో జీరో టికెట్ ఉన్నప్పటికీ అందులో వారు తిరిగిన రూట్ ఆధారంగా టికెట్ చార్జీ కూడా పొందుపరిచారు. సాధారణ, మహిళల ఆదాయాన్ని కలుపుకొని సంక్రాంతి పండుగ రోజులకు సంబంధించి ఈ నెల 9 నుంచి 20 వరకు (14, 15, 16 తేదీలు మినహా) మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో అదనపు బస్సు సర్వీసులు నడపగా రూ.22,69,54,338 కోట్ల ఆదాయం వచ్చింది. 9 నుంచి 20 వరకు రీజియన్లోని బస్సులు 34,47,623 కిలోమీటర్లు తిరిగాయి. మహాలక్ష్మి పథకం ప్యాసింజర్లు, టికెట్ చార్జీ ప్రయాణికులతో కలిపి 39,20,918 మంది బస్సుల్లో ప్రయాణించారు. ఆక్యుపెన్షి రేషియాలో మహబూబ్నగర్ రీజియన్ రాష్ట్రంలో అత్యధికంగా 109 శాతం సాధించి అగ్రస్థానంలో నిలవడం విశేషం.డిపో కిలోమీటర్లు ఆదాయం ప్రయాణికులు మహబూబ్నగర్ 5,40,780 3,38,01,857 5,14,321 వనపర్తి 4,57,678 3,09,42,056 5,33,909 గద్వాల 4,06,181 2,46,20,151 4,95,360 అచ్చంపేట 3,34,898 2,44,05,169 3,39,395 కల్వకుర్తి 3,65,956 2,38,98,638 4,23,531 నారాయణపేట 3,66,405 2,37,08,913 3,66,638 షాద్నగర్ 3,18,770 2,24,55,052 4,09,820 నాగర్కర్నూల్ 3,17,478 2,09,87,807 4,39,589 కొల్లాపూర్ 2,71,300 1,81,41,848 3,05,620 కోస్గి 68,177 39,92,947 92,735 -
నో బస్.. నో సర్వీస్
జిల్లాలో మొత్తం 360 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో నాలుగు డిపోలు ఉండగా.. 275 గ్రామాలకు సర్వీసులు నడుస్తుండగా.. మరో 85 పల్లెలకు బస్సు సౌకర్యం లేదు. సుదూర ప్రాంతాల్లోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో ప్రధానంగా 50 గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బస్సు సౌకర్యం కల్పించాలని ఈ విద్యాసంవత్సరంలో ఆర్టీసీకి 16 దరఖాస్తులు రాగా.. 12 గ్రామాలకు పునరుద్ధరించారు. ఇబ్బంది పడుతున్న గ్రామాలు.. మర్రిపల్లి (ఉప్పునుంతల), జమిస్తాపూర్ (నాగర్కర్నూల్), చెన్నంపల్లి, పద్మనపల్లి, కొత్త చెరువు, ఎంసీతండా (లింగాల), మైలారం, లక్ష్మీపల్లి, బాణాల, అంబగిరి, నర్సాయిపల్లి (బల్మూరు), ఖానాపూర్, గుడ్ల నర్వ, నెల్లికొండ (బిజినేపల్లి). జిల్లాలో మొత్తం 261 గ్రామాలు ఉన్నాయి. ఒక డిపో ఉండగా.. 252 పల్లెలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. తొమ్మిది గ్రామాలకు మాత్రం బస్సు సర్వీసులు నడుస్తలేవు. 2025– 26లో బస్సు సౌకర్యం కల్పించాలని ఏడు గ్రామాలకు చెందిన ప్రజలు అర్జీలు పెట్టుకోగా.. తుంకుంట (అయిజ), మల్లెందొడ్డి (మల్దకల్)కి మాత్రమే సర్వీస్లు నడిపిస్తున్నారు. ప్రధానంగా ఆరు గ్రామాలకు చెందిన విద్యార్థులు బస్సుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బంది పడుతున్న గ్రామాలు.. రాయపురం (గట్టు), తుమ్మిళ్ల (రాజోళి), కుర్వపల్లి, పరాముల (గద్వాల), మైలగడ్డ (ధరూర్), ఇటిక్యాలపాడు (మానవపాడు). జిల్లాలో మొత్తం 276 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో రెండు డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 157 గ్రామాలకు మాత్రమే బస్సు సౌకర్యం ఉంది. 119 పల్లెలకు ఆర్టీసీ సర్వీసులు లేవు. 2025–26 విద్యా సంవత్సరంలో ఉజ్జని (మాగనూర్), సంగంబండ (మక్తల్), రాయికోడ్ (నర్వ) గ్రామాలకు ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించాలని ఆయా గ్రామస్తులు విజ్ఞప్తి చేయగా.. ఇప్పటి వరకు పెండింగ్లోనే ఉంది. ఏయే గ్రామాలు అంటే.. షేర్నపల్లి, మేకహనుమాన్తండా, వందరగుట్ట తండా, పిల్లిగుండ్లతండా, బోయిన్పల్లి తండా (నారాయణపేట), చిన్నపొర్ల, పెద్దపొర్ల, మల్లేపల్లి, నాగిరెడ్డిపల్లి (ఊట్కూరు), అల్లీపూర్, తిమ్మారెడ్డిపల్లి (కొత్తపల్లి), ఎలిగండ్ల, పసుపుల, మాధవరం (మరికల్). ఈ ఆటోలో కూర్చుని ప్రయాణిస్తున్నది అలంపూర్ మండలం సింగవరం గ్రామానికి చెందిన విద్యార్థులు. అలంపూర్కు 7 కి.మీ. దూరంలోని గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. విద్యార్థులు పాఠశాలకు వచ్చేందుకు నిత్యం ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. సమయానికి పాఠశాలకు చేరుకునేందుకు ఇలా వాహనం సామర్థ్యానికి మించి కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. బస్సు సౌకర్యం కల్పిస్తే ఇబ్బందులు తొలగుతాయని విద్యార్థులు చెబుతున్నారు. గట్టు నుంచి రాయాపురం వెళ్లేందుకు నిత్యం ఇబ్బందులు పడుతున్నాం. సాయంత్రం పాఠశాల వదిలిన తర్వాత 4:30 గంటల నుంచి రోడ్డుపై నిలబడినా బస్సులు రావు. అటుగా వెళ్లే ప్రైవేటు వాహనాలను లిఫ్ట్ అడుగుతాం. ఒక్కోసారి ఇంటికి చేరుకునేందుకు చీకటి పడుతుంది. మాకు బస్సు సౌకర్యం కల్పించాలి. – అమృత, 10వ తరగతి విద్యార్థి, రాయాపురం గట్టు మండలం నా కూతురు మౌనిక గట్టులో 10వ తరగతి చదువుకుంటుంది. క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్తుంది. సాయంత్రం పాఠశాల వదిలిన తర్వాత గట్టు నుంచి ఇంటికి వచ్చేందుకు బస్సు సౌకర్యం లేకపోవడంతో నా కూతురుతో పాటు మిగతా పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలకు బస్సు సౌకర్యం కల్పించాలి. – తిమ్మప్ప, రాయాపురం, గట్టు మండలం జిల్లావ్యాప్తంగా 252 గ్రామాలకు బస్సులు నడుపుతున్నాం. అదే విధంగా కొత్తగా ఇటిక్యాలపాడు, తూంకుంట, మల్లెందొడ్డిలో రూట్లకు బస్సులు నడిపేలా చర్యలు తీసుకున్నాం. ఇంకా అవసరమున్న గ్రామాల పరిధిలో బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటాం. – సునీత, ఆర్టీసీ డీఎం, గద్వాల టంకర, కిష్టారం (హన్వాడ), కొత్తపల్లి (మిడ్జిల్), రామచంద్రపూర్ (మహబూబ్నగర్ రూరల్) జిల్లాలో 423 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో ఒక ఆర్టీసీ డిపో ఉండగా.. దీని పరిధి 45 రూట్లలో బస్సులు నడుస్తున్నాయి. నాలుగు గ్రామాలకు బస్సు సర్వీసులు లేకపోవడంతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. టంకర మినహాయించి మూడు గ్రామాలకు చెందిన వారు బస్సులు నడపాలని విజ్ఞప్తులు చేసినా.. అమలు కాలేదు. ..ఇదీ భావి భారత పౌరుల దుస్థితి. ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక.. ఉన్నప్పటికీ సమయపాలన పాటించకపోవడం.. వచ్చినా ఆపకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పడుతున్న అగచాట్లకు ఈ దృశ్యాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కాలినడకన కొందరు.. ప్రమాదమని తెలిసినా ఆటోల్లో కిక్కిరిసి వేళ్లాడుతూ మరికొందరు.. బస్సుల్లో ఫుట్బోర్డ్పై ప్రయాణం చేస్తూ ఇంకొందరు నరకయాతన అనుభవిస్తున్నారు. స్థానికంగా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు లేకపోవడం.. రవాణా ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టడంలో పాలకుల వైఫల్యం వెరసీ విద్యార్థులు నానా ఫీట్లతో దినదినగండంగా రాకపోకలు చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరులోని పలు గ్రామాల్లో నిత్య సవాళ్ల మధ్య చదువుల యుద్ధం కొనసాగిస్తున్న విద్యార్థులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 212 గ్రామాలు ఉన్నాయి. ఒక ఆర్టీసీ డిపో ఉండగా.. దీని పరిధిలో 189 గ్రామాలకు మాత్రమే సర్వీస్లు నడిపిస్తున్నారు. 23 పల్లెలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు రవాణా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బస్సు సౌకర్యం కల్పించాలని 11 గ్రామాల నుంచి అర్జీలు రాగా.. ఆరు పల్లెలకు మాత్రమే నడుపుతున్నారు. విద్యార్థులు ఇబ్బంది పడుతున్న గ్రామాలు.. దావాసిపల్లి (పాన్గల్), నగరాల (శ్రీరంగాపురం), కంభాళపూర్తండా (ఖిల్లాఘనపురం), చె న్నూర్ (గోపాల్పేట), మిరాస్పల్లి (కొత్తకోట). -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి ఉండాలి
గద్వాల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టిసారించి పురోగతి సాధించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఎంపీడీఓలతో మండలాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రస్తుతం జిల్లా రాష్ట్రస్థాయిలో 19వ స్థానంలో ఉందన్నారు. అందరూ సమన్వయంతో పనిచేసి పనులను వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు రూ. 75కోట్లు లబ్ధిదారులకు మంజూరు చేసినట్లు చెప్పారు. మంజూరు పొందిన లబ్ధిదారులు తక్షణమే నిర్మాణ పనులు చేపట్టేలా ప్రోత్సహించాలన్నారు. 45 రోజులలోపు మార్క్ అవుట్ చేయని లబ్ధిదారులను రద్దుచేసి.. వారి స్థానంలో అర్హులైన కొత్త లబ్ధిదారులను గుర్తించి, ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. అలంపూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మరింత ప్రగతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో గృహనిర్మాణశాఖ పీడీ శ్రీనివాసరావు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగేంద్రం, డీపీఓ శ్రీకాంత్ ఉన్నారు. నిబంధనల మేరకు లేఅవుట్ల అభివృద్ధి ప్రభుత్వ నిబంధనల మేరకు లేఅవుట్ల అభివృద్ధి జరిగేలా తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. గద్వాల మున్సిపాలిటీలోని వెంకటపేట శివారు సర్వేనం. 20లో లేఅవుట్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మ్యాప్లను చూసి.. రోడ్డు కనెక్టివిటి, నీటి వనరులు, బఫర్ జోన్ తదితర అంశాలపై ఆరా తీశారు. లేఅవుట్ల అభివృద్ధిలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. దీంతో పాటు సర్వే.నం 494 లేఅవుట్ను కలెక్టర్ పరిశీంచారు. ఇక్కడ నీటి కనెక్షన్, స్ట్రామ్ వాటర్ డ్రెయినేజీ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వేనం. అదే విధంగా సర్వేనం.1028లోని లేఅవుట్లో నీటి వనరులు, విద్యుత్, డ్రెయినేజీలను అందుబాటులోకి తీసుకరావాలని సూచించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ జానకీరామ్, టౌన్ ప్లానింగ్ అధికారి కుర్మన్న, తహసీల్దార్ మల్లిఖార్జున్ ఉన్నారు. -
ఐద్వా మహాసభలు జయప్రదం చేయండి
అలంపూర్: హైదరాబాద్లో ఈ నెల 25న నిర్వహించే ఐద్వా మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు ఏమెలమ్మ, జిల్లా కార్యదర్శి నర్మద పిలుపునిచ్చారు. అలంపూర్ పట్టణంలోని సంతోష్నగర్ కాలనీలో బుధవారం ఐద్వా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఐద్వా 14వ జాతీయ మహాసభల జెండా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఐద్వా పోరాట ఫలితంగా అనేక హక్కులు సాధించుకున్నామన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, గ్రామాల్లో బెల్ట్ షాపులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు దేవమ్మ, కాంతమ్మ, మదనమ్మ, లక్ష్మి, పార్వతమ్మ, ఏసమ్మ, బుజ్జమ్మ, మరియమ్మ, కవిత తదితరులు ఉన్నారు. నీటి వినియోగంపై లెక్క పక్కా.. గద్వాల క్రైం: జిల్లాలోని జలాశయాలు, భూగర్భ జలాలు, ఎత్తిపోతల పథకాల గణనను బుధవారం జలాశయాల మంత్రిత్వశాఖ, ఆర్థిక గణాంక శాఖ హైదరాబాద్కు చెందిన నిపుణులు సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా జల నిపుణులు మహేందర్రెడ్డి, విశ్వేశ్వరయ్య మాట్లాడుతూ.. గద్వాల, అలంపూర్ సెగ్మెంట్లలో భూగర్భ, జలాశయాలు, ఎత్తిపోతల పథకాల అనుసంధానంగా ఉన్న వాటిని సర్వే చేయడంతో పాటు జియోట్యాగింగ్ చేస్తామన్నారు. ఈ విధానంతో నీటి పంపిణీ విధానం, నీటి పారుదల విస్తీర్ణం, జలాశయాల ద్వారా వ్యవసాయ పంటలకు చేరుతున్న నీటి వాటాలపై ప్రణాళికలు తెలియజేస్తుందన్నారు. జలాశయాల ద్వారా జిల్లాలో మత్స్య సంపద, సాగు పంటల వివరాలను సులువుగా తెలుసుకునేందుకు దోహదపడుతాయని పేర్కొన్నారు. అవసరమైయ్యే నీటి వినియోగంపై పక్కా లెక్కలతో పాటు అవగాహన వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పాపయ్య, నాగర్జునగౌడ్ తదితరులు ఉన్నారు. రాజాగారి బంగ్లా మరమ్మతుకు రూ.10 కోట్లు వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలో శిథిలావస్థకు చేరిన రాజాగారి బంగ్లా మరమ్మతుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు. అదేవిధంగా కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వసతిగృహాల పునరుద్ధరణకు రూ.13.15 కోట్లు కేటాయించినట్లు వివరించారు. వచ్చిన నిధులతో రాజాగారి బంగ్లాను ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామన్నారు. పురపాలికల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం అమరచింత: తమ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడమేగాకుండా పురపాలికల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర పశుసంవర్దకశాఖమంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం పట్టణంలోని పది వార్డుల్లో రూ.15 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. తమ ప్రభుత్వం స్థానిక పురపాలికకు ఇప్పటి వరకు రూ.35 కోట్లు కేటాయించిందని.. మునుపెన్నడూ లేని విధంగా సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు. వార్డుల్లో సీసీ రహదారులు, డ్రైనేజీలు, పార్క్లు, కూడళ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు వివరించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వార్డుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉండాలని.. అనంతరం ప్రతి ఒక్కరూ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఆర్డీఓ సుబ్రమణ్యం, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, డీసీసీ ప్రధానకార్యదర్శి అయ్యూబ్ఖాన్, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు మహేందర్రెడ్డి, అరుణ్కుమార్, మార్కెట్ డైరెక్టర్లు పోసిరిగారి విష్ణు, శ్యామ్, కమలాకర్గౌడ్, తౌఫిక్ తదితరులు పాల్గొన్నారు. -
23 నుంచి బాలబ్రహ్మేశ్వర జాతర
కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు అలంపూర్: శ్రీజోగుళాంబ అమ్మవారి బ్రహోత్సవాల్లో జాతరను విజయవంతం చేద్దామని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి సేవా సమితి అధ్యక్షుడు బండి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పట్టణంలోని హరిత హోటల్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 23న వసంత పంచమిని పురస్కరించుకొని జోగుళాంబ సేవా సమితి ఆధ్వర్యంలో గంటలేశ్వర ఆలయం నుంచి జోగుళాంబ అమ్మవారి ఆలయం వరకు జాతర ఊరేగింపు ఉంటుందన్నారు. గంటలేశ్వర ఆలయం నుంచి ఉదయం 8 గంటలకు ప్రారంభమై టూరిజం హోటల్, గాంధీచౌక్, పోలీస్స్టేషన్ మీదుగా బాల బ్రహ్మేశ్వర ఆలయం సముదాయం నుంచి జోగులాంబ అమ్మవారి ఆలయానికి భక్తులు చేరుకుంటారని తెలిపారు. అనంతరం తుంగభద్ర బ్రిడ్జి సమీపంలో ఉన్న అష్టభుజి గంటలేశ్వర ఆలయం వద్ద అన్నప్రసాదం వితరణ ఉంటుందన్నారు. ఉత్సవాల్లో పలు సేవా సంస్థలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివేకానంద యూత్ సొసైటీ అధ్యక్షుడు సంజీవనాయుడు తెలిపారు. ఆలయ కమిటీ మాజీ చైర్మన్ జితేందర్గౌడ్, మాజీ ధర్మకర్త సభ్యుడు నరసింహారెడ్డి ఆలయంలో భక్తులు దర్శించుకోవడానికి ఇబ్బందులు లేకుండా క్యూలైన్లును ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మాధవి, శివానంద స్వామి, పట్టణ ప్రముఖులు, సుంకన్న, సత్యనారయణ, రమేష్ గుప్తా, ప్రశాంత్, నారయణ, బుజ్జీ, కేకే సత్యం, పోలీస్ చిన్నయ్య, రాజశేఖర్ శర్మ తదితరులు ఉన్నారు. -
భక్తిశ్రద్ధలతో వార్షిక బ్రహోత్సవాలు
అలంపూర్: శ్రీజోగుళాంబ అమ్మవారి వార్షిక బ్రహోత్సవాలు బుధవారం మూడో రోజు వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు, త్రిశతి అర్చనలు ప్రత్యేకంగా నిర్వహించారు. అదేవిధంగా విశేష అర్చనలు, చండీహోమాలు, పవమాన సూక్త పారాయణ, పవమాన సూక్త హోమాలు, అవాహిత దేవతా హోమాలు, మండప ఆరాధన, బలిహరణ, నీరాజన మంత్రపుష్పములు పూజలు చేశారు. మరో రెండు రోజుల పాటు వార్షిక బ్రహోత్సవాలు కొనసాగుతాయని ఆలయ ఈఓ దీప్తి తెలిపారు. ఈ నెల 23వ తేదీ ఉత్సవాల చివరి రోజు బ్రహోత్సవాల్లో భక్తులకు అమ్మవారు నిజరూప దర్శనం కలుగుతుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలన్నారు. -
ఎత్తిపోతలకు గ్రహణం
కొల్లాపూర్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి గ్రహణం వీడటం లేదు. ప్రాజెక్టు ద్వారా నీటి పంపింగ్కు తరచుగా బ్రేకులు పడుతున్నాయి. ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెబుతున్న అధికారులు.. నీటి ఎత్తిపోతలు మాత్రం ఇప్పట్లో జరగవని తేల్చి చెబుతున్నారు. రెండేళ్లుగా ఇదే తంతు కొనసాగుతుండటంతో నీటి ఎత్తిపోతలపై అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వం అరకొరగా బడ్జెట్ కేటాయిస్తుండటంతో పనులు ముందుకు సాగడం లేదనే ప్రచారం కూడా ఉంది. మూడేళ్ల క్రితం మొదటి పంపుతో.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 2023 సెప్టెంబర్ 16న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఎల్లూరు సమీపంలోని పంప్హౌజ్లో ఒక మోటారు ఆన్చేసి.. నీటి ఎత్తిపోతలు చేపట్టారు. రెండు టీఎంసీల నీటిని నార్లాపూర్ రిజర్వాయర్లోకి ఎత్తిపోశారు. మరుసటి ఏడాది తాగునీటి అవసరాల కోసం నాలుగు టీఎంసీల వరకు నీటిని ఎత్తిపోసుకునేందుకు అనుమతులు లభించాయి. కానీ పంప్హౌజ్లో మోటార్ల బిగింపు, సివిల్ వర్క్స్, విద్యుత్ సరఫరా పనులు పెండింగ్లో ఉన్నాయనే కారణాలతో నేటి వరకు రెండో దఫా ఎత్తిపోతలు జరగడం లేదు. నాలుగు మోటార్ల బిగింపు.. ప్రాజెక్టులోని మొదటి లిఫ్ట్ అయిన ఎల్లూరు పంపుహౌజ్లో ఇప్పటివరకు నాలుగు మోటార్లు బిగించారు. మూడు మోటార్ల పనులన్నీ పూర్తయ్యాయి. మరో మోటారు ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంది. లిఫ్టులో మరో నాలుగు మోటార్ల బిగింపునకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. సివిల్ వర్క్స్ దాదాపుగా పూర్తిచేశారు. మెకానికల్, సిస్టమ్ వర్క్ మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. డెలివరీ మెయిన్స్ పనులు దాదాపుగా తుది దశకు చేరుకున్నాయి. ప్రాజెక్టు వద్ద నిర్మించిన 400/11 కేవీ సబ్స్టేషన్కు విద్యుత్ సరఫరా పనులు నత్తనడకన సాగుతున్నాయి. విద్యుత్ పనులు ఆలస్యం అవుతుండటమే నీటి ఎత్తిపోతలు జరగకపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. కేఎల్ఐ ద్వారా రిజర్వాయర్లోకి నీరు.. పాలమూరు ప్రాజెక్టులో నార్లాపూర్ రిజర్వాయర్ మొదటిది కాగా.. నీటి నిల్వ సామర్థ్యం 6.4 టీఎంసీలు. ప్రాజెక్టు ప్రారంభ సమయంలో 2 టీఎంసీల నీటిని ఈ రిజర్వాయర్లోకి ఎత్తిపోశారు. తర్వాతి కాలంలో పాలమూరు ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు సాగకపోవడంతో కేఎల్ఐ ద్వారా ఎత్తిపోసే నీటిని నార్లాపూర్ రిజర్వాయర్లోకి మళ్లిస్తున్నారు. కేఎల్ఐలోని ఎల్లూరు రిజర్వాయర్ నుంచి నార్లాపూర్ రిజర్వాయర్లోకి నీటి మళ్లింపునకు వీలుగా ప్రత్యేకంగా తూము ఏర్పాటు చేశారు. తాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఏర్పడొద్దనే ఉద్దేశంతోనే నీటి మళ్లింపు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నార్లాపూర్ రిజర్వాయర్లో 4 టీఎంసీల మేరకు నీటి నిల్వ ఉంది. కొలిక్కిరానినిర్వాసితుల సమస్యలు.. నార్లాపూర్ రిజర్వాయర్లో అంజనగిరి, వడ్డెగుడిసెలు, సున్నపుతండా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వీరిలో కొంతమందికి సరైన పరిహారం అందలేదు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రకారం తమకు పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పూర్తిస్థాయిలో పరిహారం ఇస్తేనే.. తాము ఇళ్లు ఖాళీ చేస్తామని కొందరు నిర్వాసితులు మొండికేశారు. ఈ సమస్యను రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లారు. వారికి పరిహారం ఇప్పించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. నిర్వాసితులు ఇళ్లు ఖాళీ చేసేవరకు నార్లాపూర్ రిజర్వాయర్లో 4 టీఎంసీల కన్నా ఎక్కువ నీటిని నింపలేమని.. నీటిని అధికంగా నింపితే నిర్వాసితుల ఇళ్లు ముంపునకు గురవుతాయని అధికారులు చెబుతున్నారు. సీజన్ ముగిసేలోగా ఎత్తిపోస్తాం నార్లాపూర్ రిజర్వాయర్లో 4 టీఎంసీల మేరకు నీరు నిల్వ ఉంది. ఈ రిజర్వాయర్లోకి మరిన్ని నీళ్లను ఎత్తిపోస్తే నిర్వాసితుల ఇళ్లు మునిగిపోతాయి. తమకు పరిహారం సమస్య పరిష్కారమైతేనే ఇళ్లు ఖాళీ చేస్తామంటున్నారు. ఈ సమస్య ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఒకవేళ ఎత్తిపోసే నీళ్లను ఏదుల రిజర్వాయర్కు తరలించాలంటే కాల్వ పనులు పూర్తికావాలి. ఇందుకు కొంత సమయం పడుతుంది. ఆయా సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఎత్తిపోతలను వాయిదా వేస్తూ వస్తున్నాం. ఈ ఏడాది సీజన్ ముగిసేలోగా కచ్చితంగా ఎత్తిపోతలు చేపడతాం. – శ్రీనివాసరెడ్డి, ఈఈ, నీటిపారుదలశాఖ అసంపూర్తి కాల్వలతో.. నార్లాపూర్ రిజర్వాయర్లో ప్రస్తుతం ఉన్న నీటిని ఏదుల రిజర్వాయర్కు పారించేందుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. నార్లాపూర్ రిజర్వాయర్ సమీపంలోని కుడికిళ్ల, తీర్నంపల్లి శివార్లలో ప్రధాన కాల్వ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. నిధుల లేమి కారణంగా కాల్వ నిర్మాణం మధ్యలోనే నిలిచింది. ఈ క్రమంలో కాల్వ పనులను పూర్తిచేసేందుకు కొన్ని నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం రూ. 100కోట్లకు పైగా నిధులను కేటాయించింది. కానీ పనులు మాత్రం ఇప్పటికీ నత్తనడకనే సాగుతున్నాయి. ఈ కాల్వ పనులు పూర్తయితేనే నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్కు నీటిని తరలించవచ్చు. అప్పటివరకు పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. పాలమూరు ప్రాజెక్టులో వాయిదా పడుతూ వస్తున్న నీటి పంపింగ్ పెండింగ్ పనులతోనే సమస్య కేఎల్ఐ ద్వారా నార్లాపూర్ రిజర్వాయర్కు నీటి మళ్లింపు అక్కడి నుంచి ఏదులకు నీటిని తరలించేందుకు అడ్డంకులు -
వైద్య పరికరాలపై ఆరా
గద్వాల క్రైం: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రుల నిర్వహణ, వైద్య సేవలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ బృందం విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. గద్వాల, అలంపూర్ సెగ్మెంట్లో రోగులకు అందుతున్న వైద్య సేవలు, అవసరమైయ్యే మందులు, వైద్యుల వివరాలు, స్కానింగ్ పరికరాల వినియోగం, మౌలిక వసతులపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో వైద్యశాఖ అనుమతి లేకుండా శాంతినగర్లో నిర్వహిస్తున్న ఓ ప్రయివేట్ ఆస్పత్రిని ఈ నెల 2న సీజ్ చేయడంతో పాటు ఈసీజీ, ఎక్స్రే మిషన్లు, బయో వ్యర్థాల నిర్వహణ, రికార్డులు సరిగా లేనందుకు మరో రెండు ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లఘించిన యాజమాన్యంపై చర్యలు తీసుకుంటున్నారు. వైద్య సేవల కోసం వస్తున్న రోగులు, ఎంత మంది అత్యవసర సేవలు పొందారు. మెరుగైన వైద్యం, జిల్లా ఆస్పత్రులకు సిఫార్సు చేయాల్సిన రోగుల వివరాలను సిబ్బంది సేకరించారు. అన్ని ఆస్పత్రుల్లో కూడా సాధారణ ప్రసవాలు చేసేందుకు వైద్యులు కృషి చేయాలని, అత్యవసరం అయితే తప్ప శస్త్ర చికిత్స చేయకూడదని ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రిలోని సెంట్రల్ మెడిసిన్ స్టోర్లో అందుబాటులో ఉన్న మందుల వివరాలను ఫార్మాసిస్టు ద్వారా తెలుసుకున్నారు. ప్రయివేట్ మెడికల్ దుకాణాల్లో అందుబాటులో ఉన్న మందులపై డ్రగ్ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రమాదకరమైన వ్యాధులు, శస్త్ర చికిత్సలకు అందజేసిన మందులు, రోగుల వివరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అందుబాటులో లేని మందుల గురించి ఆరా తీశారు. గర్భిణుల కడుపులో బిడ్డ ఎదుగుదల గుర్తించేందుకు వినియోగించే స్కానింగ్, ఎక్స్రే, ఈసీజీ తదితర యంత్రాల పనితీరు, అందుబాటులో ఉన్న వైద్యులు, టెక్నీషియన్లు గురించి తెలుసుకున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. పలు ప్రయివేట్ ఆస్పత్రుల ఆధీనంలో కొనసాగే మెడికల్ దుకాణాలలో ఫార్మసిస్టులు లేకుండానే రోగులకు మందులు విక్రయిస్తున్నారనే విషయం డ్రగ్ అధికారుల తనిఖీలో వెలుగు చూసింది. దీంతో నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. జిల్లా వైద్యా అధికారిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సంధ్యా కిరణ్మయి విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న సేవలపై నిరంతరం ఆరా తీస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది నిర్లక్ష్యంపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో కొనసాగుతున్న 52 ప్రయవేట్ ఆస్పత్రులు, 20 క్లీనిక్లు, 137 ల్యాబ్లు, 22 డెంటల్ క్లీనిక్లు, 2 ఫిజియోథెరపీ క్లీనిక్లు, 5 కంటి ఆస్పత్రుల అనుమతులు, మౌలిక వసతులు తదితర అంశాలపై నివేదికను అందజేయాల్సిందిగా ఆస్పత్రి నిర్వాహకులకు సూచించారు. రోగుల వివరాలు.. సేవలపై ఆరా మందుల రికార్డులు పరిశీలన రిజిస్ట్రేషన్ లేని ఆస్పత్రి సీజ్ నిర్లక్ష్యం వహించిన యాజమాన్యంపై చర్యలు -
‘ప్రమాదం.. ఓ కుటుంబం చిన్నాభిన్నం’
గద్వాల: వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. బుధవారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహించిన ‘చేరుకోండి.. జీవించండి’ నినాదంతో నిర్వహించిన కార్యక్రమానికి ఎస్పీ శ్రీనివాస్రావు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముఖ్యంగా అధికారులు వాహనాల్లో ప్రయాణించేటప్పుడు రోడ్డు నియమాలు పాటించి, ప్రజలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. అదేవిధంగా ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో నిర్మించే రహదారులను నిబంధనల మేరకు నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలన్నారు. అతి వేగం కారణమే.. తాను హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు ఎండీగా పనిచేసిన సందర్భంలో అక్కడ జరిగే ప్రమాదాలకు కారణాలను విశ్లేషించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా స్పీడ్ లిమిట్లో వెళ్లే మార్గాల్లో వాహనదారులు అందుకు విరుద్ధంగా అధిక స్పీడ్తో వెళ్తూ ప్రమాదాల బారిన పడేవారన్నారు. అదేవిధంగా సడన్ బ్రేకులు వేయడం, రహదారులపై అడ్డదిడ్డంగా వాహనాలను నిలపడం వంటివి ప్రమాదాలకు కారణాలు అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవర్లు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తే ఎన్నో కుటుంబాలు ఆనందంగా ఉంటాయన్నారు. అనంతరం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ ఇటీవలి కాలంలో ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మద్యం తాగి, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, అతివేగంగా వాహనాలు నడపడం వంటి వాటితోనే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయన్నారు. ప్రమాదాల నివారణలో రవాణాశాఖ, ట్రాఫిక్, పోలీసు శాఖల అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరారు. బాధ్యతతోనే ప్రమాదాల నివారణ పౌరులు బాధ్యతాయుతమైన ప్రవర్తనతోనే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని ఎస్పీ శ్రీనివాస్రావు అన్నారు. రోడ్డు భద్రత ప్రతి కుటుంబానికి సంబంధించిన విషయమని, రోడ్డు ప్రమాదంలో పోయే ఒక ప్రాణం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుందన్నారు. ఇంటి యజమాని వారి పిల్లలు, కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తే చాలా వరకు ప్రమాదాలు కట్టడి అవుతాయన్నారు. అదేవిధంగా ప్రతిఉద్యోగి ద్విచక్రవాహనంపై వచ్చే టప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. అనంతరం ‘చేరుకోండి.. జీవించండి’ వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలె క్టర్ నర్సింగ్రావు, అదనపు ఎస్పీ శంకర్, ఆర్డీఓ అలివేలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సేవలపై ఆరా తీస్తున్నాం..
గద్వాల, అలంపూర్ సెగ్మెంట్లలో ప్రభుత్వ, ప్రయివేటఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీస్తున్నాం. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఆస్పత్రులపై చర్యలు చేపట్టాం. మెడికల్ దుకాణాల్లో అందుబాటులో ఉన్న మందుల వివరాలపై నిఘా ఉంచాం. జిల్లాలో ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘించి వైద్య సేవలు అందిస్తే సహించేది లేదు. ప్రిస్కిప్షన్ లేకుండా మందులు ఇచ్చి రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడే మెడికల్ దుకాణాల లైసెన్స్ రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం. – సంధ్యాకిరణ్మయి, జిల్లా ఇన్చార్జ్ వైద్యాధికారి -
ప్రతిష్టాత్మకంగా సీఎం కప్ పోటీలు
గద్వాల: తెలంగాణ సీఎం కప్ క్రీడా పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో క్రీడలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు గ్రామస్థాయి, 28 నుంచి 31 వరకు మండల, మున్సిపాలిటీ స్థాయి, వచ్చే నెల 3 నుంచి 5వ తేదీ వరకు అసెంబ్లీ నియోజకవర్గస్థాయిలో పోటీలు ఉంటాయన్నారు. 9 నుంచి 12వ తేదీవ వరకు జిల్లా స్థాయిలో, 20 నుంచి 23వ తేదీ వరకు రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సీఎం కప్ క్రీడల నిర్వహణతో విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తి పెరగడంతో పాటు క్రీడాస్ఫూర్తి కలుగుతుందన్నారు. క్రీడల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం, ఆధార్కార్డు జతపర్చాలన్నారు. పూర్తి వివరాలకు 98854 79896, 94415 90842, 96039 96900 నంబర్లను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో డీవైఎస్ఓ కృష్ణయ్య, ఎంపీడీఓలు, పీడీలు, పీఈటీలు ఉన్నారు. -
ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలి
గద్వాల(మల్దకల్): ప్రజలందరూ ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలని శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీకృష్ణ జ్యోతిస్వరూపానంద స్వామీజీ అన్నారు. మంగళవారం మల్దకల్ ఆదిశిలా క్షేత్రంలోని స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, అర్చకులు మధుసూదనాచారి, రవిచారి స్వామీజీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో విశేష పూజల అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. అదే విధంగా వాసవీ కన్యకా పరమేశ్వరిదేవిని స్వామీజీ దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు వేద ప్రవచనాలు వినిపించారు. మారుతున్న కాలానుగుణంగా ప్రజలు సన్మార్గంలో పయనించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చెడు వ్యసనాలు వీడి.. భగవంతుడిని ఆరాధించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, మధుసూదన్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, చంద్రశేఖర్రావు, నరేందర్, పద్మారెడ్డి, నాగరాజు, శ్రీనివాస్, వెంకటేశ్, రాజు, శ్రీనివాస్శెట్టి పాల్గొన్నారు -
సామాజిక సేవలు అభినందనీయం
● వనపర్తిలో ఎస్బీఐ రీజనల్ కేంద్రం ఏర్పాటుకు స్థలం కేటాయిస్తాం ● నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి అలంపూర్: ఎస్బీఐ సామాజిక సేవలు అభినందనీయమని నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. మానవపాడు మండలంలో ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులుశెట్టి దత్తత తీసుకున్న పెద్దపోతులపాడు, చిన్నపోతులపాడు, చెన్నిపాడు, బొంకూరు, గోకులపాడు గ్రామాల్లో మంగళవారం ఎస్బీఐ ఫౌండేషన్, భవిష్య భారత్ స్వచ్ఛంధ సంస్థ అధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించగా.. ఎంపీతో పాటు కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే విజయుడు, ఎస్బీఐ సీజీఎం రాధాకృష్ణన్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హాజరయ్యారు. ముందుగా పెద్ద పోతులపాడు ప్రాథమికోన్నత పాఠశాలలో కల్నల్ సంతోష్బాబు యువ శిక్షణ కేంద్రంలో క్రీడలు, ఇతర అంశాలపై శిక్షణ తీసుకుంటున్న యువతతో అతిథులు మాట్లాడారు. అనంతరం సంచార పశువైద్య సేవలు అందించే శాలిహోత్ర ఎక్స్ప్రెస్ వాహనం, వ్యర్థాల సేకరణకు వినియోగించే స్వచ్ఛత సాథీ వాహనాన్ని ప్రారంభించారు. చెన్నిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్, కంప్యూటర్ ల్యాబ్లను ప్రారంభించి.. విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం పేద విద్యార్థులకు ఉపకార వేతనాలను అందజేశారు. పెద్దపోతులపాడు, చిన్నపోతులపాడు, చెన్నిపాడు, బొంకూరు, గోకులపాడు గ్రామాల్లో రూ. 4 కోట్లు వెచ్చించి.. విద్య, వైద్య, ఇతర రంగాల అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులుశెట్టి స్వగ్రామం పెద్దపోతులపాడుతో పాటు చుట్టుపక్కల మరో నాలుగు గ్రామాల్లోనూ ఎస్బీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. తమ స్వగ్రామంలోనూ ఎస్బీఐ ఫౌండేషన్ సేవలు ప్రారంభించాలని కోరారు. ధరూరు, ఎరవ్రల్లి చౌరస్తాలో కొత్తగా ఎస్బీఐ బ్రాంచ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వనపర్తిలో ఎస్బీఐ రీజనల్ కేంద్రం ఏర్పాటుకు స్థలం కావాలని చైర్మన్ అడిగితే ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు చెప్పారు. త్వరలోనే రూ. 25కోట్ల విలువైన స్థలాన్ని ఉచితంగా అందజేస్తామని తెలిపారు. ● కలెక్టర్ బీఎం సంతోష్ మాట్లాడుతూ.. అక్షరాస్యతలో వెనుకబడిన జిల్లా నుంచి ఎస్బీఐ చైర్మన్గా శ్రీనివాసులు శెట్టి ఎదగడం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. పెద్దపోతులపాడులో పాఠశాల అభివృద్ధితో పాటు స్థానిక యువత ఆర్మీ, పోలీస్ ఉద్యోగాల్లో ప్రతిభ చాటేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించేందుకు రూ. 12లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ● ఎస్బీఐ సీజీఎం రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధుల సహకారంతో ఎస్బీఐ ఫౌండేషన్ సేవలను విస్తరిస్తున్నట్లు తెలిపారు. ఎస్బీఐ చైర్మన్ స్వగ్రామంలో చేపట్టిన సేవా కార్యక్రమాలు స్ఫూర్తిగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప, భవిష్య భారత్ స్వచ్ఛంద సేవాసంస్థ మేనేజింగ్ ట్రస్టి హరిప్రసాద్, ఎస్బీఐ ఫౌండేషన్ సీఈఓ స్వపన్ ధర్, ఫౌండేషన్ అధ్యక్షుడు జగన్నాథ్ సాహో, రీజినల్ మేనేజర్ సునీత, భవిష్య భారత్ డైరెక్టర్ హేమంత్ కుమార్, గ్రామసేవ కోఆర్డినేటర్ సిద్ధ లింగేష్, సర్పంచ్ రజాక్ పాల్గొన్నారు. -
ఎవరిదో పైచేయి..!
కాంగి‘రేసు’లో పురపాలక పీఠాల లొల్లి ఇద్దరు నుంచి ఆరుగురు వరకు.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ కార్పొరేషన్, 20 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందు లో పదవీ కాలం పూర్తి కాని జడ్చర్ల, అచ్చంపేట మిన హా మిగిలిన 19 పురపాలికల్లో ఎన్నికలు జరగనున్నా యి. కార్పొరేషన్లో 60 డివిజన్లు, మిగతా మున్సిపాలిటీల్లో 310 వార్డులు ఉండగా.. ఒక్క దాంట్లో కనీ సం ఇద్దరు.. అధికంగా ఆరుగురు వరకు ఆశావహులు పోటీపడుతున్నారు. ప్రధానంగా అధికార కాంగ్రెస్లో పోటాపోటీ నెలకొంది. అదేవిధంగా మేయర్, చైర్మన్ పదవులకూ ప్రధానంగా ఇద్దరు నుంచి నలుగురు వర కు ద్వితీయ శ్రేణి ముఖ్య నాయకులు ఆశలు పెట్టుకున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: మున్సి‘పోల్స్శ్రీకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు కావడం.. ఎన్నికలకు రాష్ట్ర మంత్రి వర్గం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో ఉమ్మడి పాలమూరులోని నగర, పట్టణాల్లో రాజకీయ సందడి ఊపందుకుంది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించనుండడంతో నాలుగైదు రోజుల్లోపే నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు డివిజన్లు,వార్డుల పరిధిలో కార్పొరేటర్లు,కౌన్సిలర్ల ఆశావహులు యువతను వెంటేసుకుని విందులకు శ్రీకారం చుట్టారు. దీంతోపాటు మేయర్, చైర్మన్, చైర్పర్సన్ పదవుల కోసం అధికార పార్టీ కాంగ్రెస్లో పలువురి మధ్య పోటాపోటీ నెలకొంది. ఈ క్రమంలో పార్టీలో గ్రూప్ రాజకీయాలు మరోసారి తెరపైకి రాగా.. నేతల మధ్య అంతర్గత పోరు తారస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. మేయర్/చైర్మన్ గిరి కోసం ఆశావహుల తీవ్ర ఒత్తిళ్లు కార్పొరేటర్/కౌన్సిలర్ పదవులకు సైతం.. వర్గాల వారీగా చీలిన ఎమ్మెల్యేలు, డీసీసీ, కీలక నేతలు తమ అనుచరులకు దక్కేలా ఎవరికి వారు పావులు రసవత్తరంగా మారిన గ్రూప్ రాజకీయాలు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం లోకసభ స్థానాల వారీగా ఇన్చార్జీలను నియమించిన విషయం తెలిసిందే. మహబూబ్నగర్ పార్లమెంట్ బాధ్యతలను మంత్రి దామోదర రాజనర్సింహ, నాగర్కర్నూల్ పార్లమెంట్ బాధ్యతలను మంత్రి వాకిటి శ్రీహరికి అప్పగించింది. వీరు ఆయా మున్సిపాలిటీల పరిధిలో నేతలను సమన్వయం చేసుకుంటూ గెలుపు గుర్రాలను బరిలో నిలిపేలా కసరత్తు చేపట్టాలి. ఆయా మున్సిపాలిటీల్లో ఆయా పదవులకు ఆశావహులు అధికంగా ఉండడంతో పాటు గ్రూప్ రాజకీయాలు వారికి గుదిబండగా మారాయి. సరైన వ్యూహంతో ముందుకు సాగకపోతే పంచాయతీ ఎన్నికల మాదిరిగా రెబల్స్ బరిలో నిలిచే అవకాశముందని పార్టీలోని సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రభుత్వ బడులు బలోపేతం
అలంపూర్: స్వచ్చంద సంస్థల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలు మరింత అభివృద్ధి చెందుతున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయలక్ష్మి అన్నారు. అలంపూర్లోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం అలై ఎన్జీఓ ప్రతినిధులు, పాప్ సింగర్ స్మిత, సుశీలతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. అలై ఎన్జీఓ ఆధ్వర్యంలో తొమ్మిది పాఠశాలల్లో రూ. 30లక్షల వ్యయంతో మధ్యాహ్న భోజన వంట గదుల ఆధునికీకరించినట్లు తెలిపారు. వంట గదిలో టైల్స్, ఫ్యాన్లు, కిచెన్ కట్టలు, ఫ్లోర్ రిపేర్, ప్రతి పాఠశాలకు ఒక సిలిండర్, గ్యాస్ స్టవ్, కుర్చీలు, విద్యార్థులకు ప్లేట్లు అందజేసినట్లు వివరించారు. కార్యక్రమంలో సేక్టోరియల్ అధికారి అంపయ్య, ఎంఈఓ అశోక్ కుమార్, కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీనివాస్, జీహెచ్ఎం అమరేందర్రెడ్డి పాల్గొన్నారు. -
శారీరక దృఢత్వం, క్రమశిక్షణ కీలకం
వనపర్తి: పోలీసు వృత్తిలో శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, క్రమశిక్షణ అత్యంత కీలకమని.. క్రీడలు కేవలం పోటీలకే పరిమితం కాకుండా, సిబ్బందిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించి సమన్వయంతో కూడిన పనితీరును అలవరుస్తాయని ఎస్పీ సునీతరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు క్రీడా మైదానంలో జోగుళాంబ జోన్–7 జోనల్ పోలీస్ స్పోర్ట్స్, గేమ్స్ మీట్–2026 ఎంపికలను నారాయణపేట జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీ రియాజ్ హుల్హక్తో కలిసి ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలీసు బలగాల శక్తి కేవలం ఆయుధాల్లోనే కాకుండా క్రీడా మైదానాల్లోనూ ప్రతిఫలిస్తుందని తెలిపారు. జోనల్ సెలక్షన్న్స్ ద్వారా ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ చాటాలని, జోగుళాంబ జోన్–7 పేరు ప్రతిష్టలను మరింత పెంచేందుకు కృషి చేయాలని కోరారు. జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో శాసీ్త్రయంగా, నిష్పక్షపాతంగా ఎంపికలు నిర్వహించామని, క్రీడల్లో ప్రతిభ కనబర్చే ప్రతి పోలీసు యువతకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. పోటీల్లో వనపర్తి, మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్, నారాయణపేట జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది, మహిళా సిబ్బంది పాల్గొన్నారు. 100, 200, 400, 800, 1600 మీటర్ల పరుగు పందెం, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల పరుగు పందెం, కబడ్డీ, వాలీబాల్, హ్యాండ్బాల్, ఖో–ఖో, హైజంప్, లాంగ్జంప్, షాట్పుట్, షటిల్ తదితర 31 క్రీడల్లో మొత్తం 370 మంది పోలీసులు పోటీపడ్డారు. ప్రతిభ కనబర్చిన 90 మంది క్రీడాకారులు ఫిబ్రవరి 2 నుంచి హైదరాబాద్లో జరగనున్న తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్, గేమ్స్ మీట్లో పాల్గొననున్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ, సీఐ కృష్ణయ్య, వనపర్తి, మహబూబ్నగర్, గద్వాల, నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాల రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, అప్పలనాయుడు, వెంకటేష్, విజయభాస్కర్, కృషయ్య, నర్సింహ, రాఘవరావు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఐదు జిల్లాల ఎస్ఐలు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీసు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు
గద్వాల: దివ్యాంగులకు ఉచితంగా అందించే సహాయ ఉపకరణాల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంసీఆర్ చప్పల్స్, స్మార్ట్ కేన్స్, వాకింగ్ స్టిక్స్, క్రచెస్, హియరింగ్ ఎయిడ్లు, వీల్ చైర్లు, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిల్స్, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ట్యాబ్ లు, డిగ్రీ విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన వారు ఈ నెల 30వ తేదీలోగా httpr.obmm r.cff. gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ దరఖాస్తులకు సదరం సర్టిఫికెట్, ఆధార్, విద్యార్హత పత్రాలు, ఆదాయం, రేషన్కార్డు జిరాక్స్ జతచేసి కలెక్టరేట్లో ని మహిళా శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ కార్యాలయంలో 31వ తేదీలోగా సమర్పించాలని తెలిపారు. వివరాలకు 77998 66325 నంబర్ను సంప్రదించాలన్నారు. దరఖాస్తుల ఆహ్వానం గద్వాల: జిల్లాలోని మహిళా రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం కంపెనీలో కాంట్రాక్టు విధానంలో పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అదనపు కలెక్టర్ నర్సింగ్రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలంపూర్లోని బాలబ్రహ్మేశ్వర ఉమెన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలో సీఈఓ, అకౌంటెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సీఈఓ పోస్టుకు బీఎస్సీ అగ్రికల్చర్ లేదా మార్కెటింగ్ లేదా ఎంబీఏ మార్కెటింగ్, బీబీఏ ఏదైనా విద్యార్హత కలిగి ఉండాలన్నారు. ప్రతినెలా జీతం రూ.15వేలు ఉంటుందన్నారు. అదే విధంగా అకౌంటెంట్ పోస్టుకు బీకాం విద్యార్హత ఉండాలని, జీతం రూ. 6వేలు ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు 87909 90641, 87909 90593 నంబర్లను సంప్రదించాలని సూచించారు. అధిక వసూళ్లకు పాల్పడితే చర్యలు కేటీదొడ్డి: మీసేవ కేంద్రాల నిర్వాహకులు అంకితభావంతో పనిచేయాలని.. ప్రభుత్వం నిర్దేశించిన రుసుము కంటే అధికంగా వసూళ్లు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ–జిల్లా మేనేజర్ (ఈడీఎం) శివ అన్నారు. మంగళవారం మండల కేంద్రంతో పాటు నందిన్నెలోని మీసేవ, ఆధార్ నమోదు కేంద్రాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లో సిటిజన్ చార్ట్, నోటీస్ బోర్డులను పరిశీలించడంతో పాటు సర్టిఫికెట్ల దరఖాస్తు కోసం వసూళ్లు చేస్తున్న రుసుముపై ఆరా తీశారు. మీసేవ కేంద్రాల్లో ప్రజలకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈడీఎం మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సేవలు అందించడమే మీసేవ కేంద్రాల లక్ష్యమని అన్నారు. కేంద్రాల నిర్వాహకులు ఆన్లైన్ లవాదేవీలను రికార్డు చేయాలని సూచించారు. ఈడీఎం వెంట డీఎం సుధాకర్రెడ్డి, మీసేవ కేంద్రాల నిర్వాహకులు సురేశ్, మౌలాలి, వెంకటేశ్, రవిబాబు ఉన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి గద్వాల క్రైం: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు మంగళవారం గద్వాల ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందన కరువైందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గిరిరాజు, రాంనాథ్, పరుశరాములు, సూరిబాబు, సురేశ్, శ్రీధర్గౌడ్, గోవిందరాజు, నాగరాజు పాల్గొన్నారు. 23న సామూహిక అక్షరాభ్యాసం ఎర్రవల్లి: వసంత పంచమిని పురస్కరించుకొని ఈ నెల 23న బీచుపల్లి క్షేత్రంలోని జ్ఞానసరస్వతి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సామూహిక అక్షరాభ్యాసంలో పాల్గొనే వారు రూ.వెయ్యి చెల్లించి తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. -
వంతెన నిర్మాణంతో తగ్గనున్న దూరం
గద్వాల/ఆత్మకూర్: జూరాల, కొత్తపల్లి గ్రామాల మధ్యనున్న కృష్ణానదిపై హైలెవల్ వంతెన నిర్మాణంతో ఆయా ప్రాంతాల మధ్య దూరం తగ్గనుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం ఆయన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, కార్యకర్తలతో కలిసి కృష్ణానదిపై రూ.123 కోట్లతో నిర్మిస్తున్న వంతెన పనులు, తాత్కాలిక రోడ్డుపై జూరాల పుష్కరఘాట్ నుంచి కొత్తపల్లి శివారు వరకు నడుచుకుంటూ వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూర్ మండలంలోని పార్టీ కార్యకర్తలు, ఆయా గ్రామస్తులు మంత్రి, ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లావాసి కావడం అదృష్టమని, అడిగిన వెంటనే వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని వివరించారు. నిర్మాణం పూర్తయితే వనపర్తి నుంచి మంత్రాలయం, ఎమ్మిగనూరు వెళ్లే ప్రయాణికులకు సుమారు 40 కిలోమీటర్ల దూరం తగ్గునుందని వివరించారు. ఆత్మకూరు నుంచి గద్వాలకు వెళ్లాలంటే 35 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉందని.. బ్రిడ్జి పూర్తయితే కేవలం 11 కిలోమీటర్ల దూరం ప్రయాణించి చేరుకోవచ్చన్నారు. త్వరలో నాలుగు వరుసల రహదారి రాబోతుందని వెల్లడించారు. ఏడాదిన్నరలో పనులు పూర్తిచేసేలా అధికారులు చర్యలు చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా, గద్వాల మాజీ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, నాయకులు పటేల్ ప్రభాకర్రెడ్డి, అశోక్, రాజశేఖర్, సుజాత, పరమేష్, తులసీరాజ్, నల్లగొండ శ్రీను పాల్గొన్నారు. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
వ్యూహాలకు పదును
మున్సిపాలిటీల్లో గెలుపు గుర్రాల వేటలో ప్రధాన పార్టీలు గద్వాల: మున్సిపల్ వార్డులు, చైర్మన్ స్థానాలు ఏ సామాజిక వర్గాలకు కేటాయించారో తేలిపోయింది. ఇక ప్రత్యేక్ష పోరే మిగలడంతో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో ఎన్నికల వేడి పెరిగింది. మున్సిపాలిటీల్లో తమ బలాబలాలను నిరూపించుకునేందుకు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. వార్డుల్లో గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. రిజర్వేషన్ల ప్రక్రియ రొటేషన్ విధానంలో పూర్తికావడం.. మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించడం వంటి అంశాలతో గతంలో ఉన్న వార్డులు, మున్సిపల్ చైర్మన్ స్థానాల రిజర్వేషన్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని చోట్ల పాతవారికే అనుకూలంగా మారగా.. మరికొన్ని చోట్ల ప్రతికూలంగా మారాయి. దీంతో బల్దియా పీఠాలను కై వసం చేసుకునే దిశగా ప్రధానపార్టీలు ముందుకు సాగుతున్నాయి. మరోవైపు బరిలో దిగాలనుకునే ఆశావహులు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గద్వాలపైనే నేతల దృష్టి.. జిల్లా కేంద్రమైన గద్వాల మున్సిపాలిటీపైనే ఆయా పార్టీల ప్రధాన నేతలు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎంపీ డీకే అరుణ, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత దృష్టిసారించారు. ఇక్కడ పార్టీల తరఫున కంటే ప్రధాన నేతలే బల్దియా పీఠాన్ని కై వసం చేసుకునేందుకు పావులు కదుపుతూ.. ఎన్నికల వ్యూహాలకు పదునుపెడుతున్నారు. వార్డుల్లో రిజర్వేషన్ల మేరకు తమ బలాలు, బలహీనతలను లెక్కలు వేసుకుంటున్నారు. బలంగా ఉన్న చోట గెలుపు అభ్యర్థుల పలుకుబడిని కూడా పరిగణనలోకి తీసుకుంటూ పోల్ మ్యానేజ్మెంట్ ఎలా చేయాలో చర్చలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈసారి పోటీ తీవ్రంగా ఉండటం ఖాయంగా కనిపిస్తుండటంతో ఓటర్లకు ఏ స్థాయిలో తాయిళాలు వేస్తారో.. లిక్కర్ ఏరులైపారుతుందోనని రాజకీయ వర్గాలు లెక్కలు వేసుకుంటుండటం గమనార్హం. నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఆశావహులు జిల్లాలో మూడు ప్రధాన పార్టీల మధ్యే పోటీ గద్వాల మున్సిపాలిటీపై ప్రధాన నేతల దృష్టి -
చదువుతోనే సమాజంలో మార్పు
నాగర్కర్నూల్: చదువుకుంటేనే సమాజంలో మార్పు వస్తుందని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం విద్య కు అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర వైద్య. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం ఆయన ఎంపీ మల్లు రవి, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, అచ్చంపేట, నాగర్కర్నూల్ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్రెడ్డితో కలిసితో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అలాగే నాగర్కర్నూల్ పట్టణంలోని 245 మంది మహిళా సంఘాల సభ్యులకు రూ.7.80 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కును అందజేశారు. అనంతరం జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్ప న, ఉపాధ్యాయుల నియామకం, ఆధునిక సాంకేతికత విద్య తదితరవి అమలు చేస్తున్నామన్నారు. విద్యతోనే భవిష్యత్ తరాలకు బలమైన పునాది వేయగలమని, అదే రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహ దం చేస్తుందన్నారు. అలాగే ప్రతి పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడటమే ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తున్నామని, అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు. రాష్ట్రంలో 109 ట్రామా కేంద్రాలు నిర్మించామని, వృద్ధ తల్లిదండ్రుల కోసం 37 ప్రణామ్ కేంద్రాలు స్థాపించామని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల అభివృద్ధి, ఆధునిక వైద్య పరికరాల ఏర్పాటు, వైద్య సిబ్బంది నియామకం ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందుతాయన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. చేపట్టిన అభివృద్ధి పనులు నిర్ణీత గడువులో పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. విద్యార్థులకు సూచనలు మంత్రి దామోదర రాజనర్సింహ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారు.. ఏ లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఎలా సిద్ధం కా వాలన్న అంశాలపై మంత్రి సూచనలు చేశారు. క్ర మశిక్షణ, నిరంతర శ్రమ, సరైన ప్రణాళికతో ముందుకు సాగితే విజయం సాధ్యమని పేర్కొన్నారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగానే కొనసాగుతుందన్నారు. విద్య, వైద్యానికే మా ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యత రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నాగర్కర్నూల్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన -
పెండింగ్ పనులు త్వరగా పూర్తిచేయాలి
మానవపాడు: మండల రెవెన్యూ కార్యాలయాల్లో పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేయాలని ఆర్డీఓ అలివేల అన్నారు. సోమవారం మానవపాడు తహసీల్దార్ కార్యాలయంలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల వివరాలను తెలుసుకున్నారు. భూ భారతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు సూచించారు. అదే విధంగా ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. మహిళా సంఘాలకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మానవపాడు: ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో స్వయం సహాయక మహిళా సంఘాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అతి తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తోందని అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాసులు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో అలంపూర్, మానవపాడు, ఉండవెల్లి మండలాలకు చెందిన మహిళా సంఘాల బాధ్యులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాల్లోని సభ్యులకు వ్యక్తిగతంగా రూ. 40వేల చొప్పున రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. అనంతరం ట్రైనర్ రఘు పలు అంశాలను వివరించారు. కార్యక్రమంలో డీపీఎం రుతమ్మ, ఏపీఎంలు భీమన్న, సునంద, మారుతమ్మ పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.8,500 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు సోమవారం 440 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 8,500, కనిష్టంగా రూ. 4,302, సరాసరి రూ. 7,000 ధరలు వచ్చాయి. అదే విధంగా 9 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,062, కనిష్టంగా రూ. 5,802, సరాసరి రూ.6053 ధరలు లభించాయి. 250 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,949, కనిష్టంగా రూ. 5,039, సరాసరి రూ. 6,939 ధరలు వచ్చాయి. 40 క్వింటాళ్ల వరి (సోన) అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 2,389, కనిష్టంగా రూ. 1,710, సరాసరి రూ. 2,389 ధరలు లభించాయి. -
గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు కీలకం
● అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలి ● కలెక్టర్ బీఎం సంతోష్ ఎర్రవల్లి: గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సోమవారం ఎర్రవల్లిలోని పదో బెటాలియన్లో జిల్లాలోని సర్పంచులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించగా.. ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజయుడుతో పాటు కలెక్టర్ హాజరై మాట్లాడారు. సర్పంచులు అధికారులతో సమన్వయం చేసుకొని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఐదు రోజుల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం అన్ని నియమాలు, విధులు, బడ్జెట్, 15వ ఆర్థిక సంఘం నిధులు, ప్రభుత్వ పథకాల వినియోగం, అధికారుల సంప్రదింపు విధానం వంటి అంశాలను పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. పేదల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలన్నారు. సర్పంచుల సహకారంతో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తూ.. ప్రాథమిక విద్యకు బలమైన పునాదులుగా మార్చాలన్నారు. నీతి అయోగ్లో గట్టు మండలం వెనుకబడిన ప్రాంతంగా ఉన్నప్పటికీ.. చిత్తశుద్ధితో పనిచేసి రూ.కోటి నగదు బహుమతి సాధించడం జరిగిందని కలెక్టర్ వివరించారు. గ్రామాల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమం ద్వారా పరిశుభ్రతపై ప్రజలను ప్రోత్సహిస్తూ ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత సర్పంచులదేనని అన్నారు. గ్రామాల అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ప్రతి వారం సర్పంచులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. ● ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. గ్రామాల్లో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులను విజయవంతంగా చేపట్టామని.. రాబోయే రోజుల్లో విద్య, వైద్యం, మహిళా సాధికారత, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సర్పంచులకు సూచించారు.


