breaking news
Jogulamba District News
-
క్షయ నివారణ చర్యలపై జిల్లా బృందానికి అవార్డు
గద్వాల క్రైం: క్షయ నివారణ నిమిత్తం 2023లో గద్వాల క్షయ నివారణ బృందం పటిష్ట చర్యలు తీసుకొని 16వేల మంది అనుమానిత వ్యాధిగ్రస్తులకు పరీక్షలు చేపట్టిన నేపథ్యంలో ఉత్తమ అవార్డు వరించింది. శనివారం గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ చేతుల మీదుగా జిల్లా క్షయ నివారణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రాజు అవార్డు ఫర్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. దాదాపు 1500 మందిలో వ్యాధి లక్షణాలు గుర్తించి సకాలంలో వైద్య సేవలు అందించడం, క్షయ రహిత జిల్లాగా మార్చాలనే లక్ష్యంతో వైద్య శాఖ చర్యలు అభినందనీయమని జిల్లా ఇన్చార్జ్ వైద్యాధికారి సిద్ధప్ప, ఇతర వైద్య సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. -
నయా దందా..!
–8లో uరాజోళి: డబ్బు వెనకేసుకోవడమే లక్ష్యంగా జిల్లాలో కొందరు ప్రైవేట్ బ్యాంకు సిబ్బంది కొత్త దందాకు తెరలేపారు. మీ పేర్లపై ఆస్తులు లేకపోయినా.. తాతలు, అమ్మనాన్నల పేర్లపై ఉంటే చాలు.. మిగతాదంతా మేమే చూసుకుంటామంటూ నమ్మబలుకుతారు. మా బ్యాంకు ద్వారా రుణం అందిస్తాం.. నువ్వు చేయాల్సిందంతా రుణం మంజూరు కాగానే పర్సంటేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రూ.వేల నుంచి రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. ఇదే అదునుగా స్థానికంగా ఉన్న పైరవీకారులు వారితో కుమ్మకై ్క అమాయకులైన పల్లె ప్రజలను రుణాల పేరుతో మోసం చేస్తున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి.. రుణం పొందేందుకు సరైన పత్రాలు లేకున్నా.. దానిపై మీకు ఎలాంటి హక్కులు ఉన్నాయి, మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక కాగితం చూపించండని బ్యాంకు సిబ్బంది వారిని ప్రేరేపిస్తున్నారు. ఉన్న ఒక్క దాన్ని ఆసరాగా చేసుకుని, ఆస్తికి సంబంధించిన అన్ని నకిలీ పత్రాలను వారే తయారు చేస్తున్నారు. ఇవేవి తెలుసుకోకుండా.. అక్రమార్కులకు రూ.లక్షలు కమీషన్ల రూపంలో ఇచ్చి.. అనంతరం రుణ బకాయిలు చెల్లించలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. అలాంటి వారిలో అలంపూర్ మండలం క్యాతూరు గ్రామానికి చెందిన ఒకరు, రాజోళి మండలం మాన్దొడ్డి గ్రామానికి చెందిన మరొకరు ఉన్నారు. మాన్దొడ్డి గ్రామానికి చెందిన ఒక ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి కారణంగా అదే గ్రామంతో పాటు, సమీపంలో ఉన్న పచ్చర్ల గ్రామంలోను అగ్గి రాజేసుకుంది. పచ్చర్లలో నేటికి అన్నదమ్ములు, తండ్రి కొడుకుల మధ్య తగాదాలు జరిగి, పంటను నాశనం చేసుకుని, కేసులు పెట్టుకునే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం అదే కుటుంబం రెండు వర్గాలుగా ఏర్పడి స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. సదరు వ్యక్తి కారణంగానే మాన్దొడ్డిలో రుణం తీసుకుని కమీషన్ ఎక్కువ కావాలని డిమాండ్ చేయడంతో గ్రామ పెద్దలు పంచాయితీ చేసి మందలించినట్లు సమాచారం. కానీ ఆయన తీరు మార్చుకోలేక అయిజలోకి మకాం మార్చి, తన కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇదే వ్యక్తి గట్టు మండలంలో 3, రాజోళి మండలంలో 2, అయిజలో 5, వడ్డేపల్లిలో ఒకటి ఇలా రుణాలు ఇప్పించినట్లు తెలుస్తుంది. ఇవికాక మరికొందరి దగ్గర రుణాల కోసం వేల రూపాయల్లో ముందుగానే డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తుంది. నకిలీ సర్టిఫికెట్లు తయారుచేయడం, సంతకాలు ఫోర్జరీ చేయడం నేరం. రుణాల కోసం ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రజలు ఎవరూ కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించొద్దు. – మొగిలయ్య, డీఎస్పీ ప్రైవేట్ బ్యాంకు సిబ్బంది నిర్వాకం రూ.వేల నుంచి రూ.లక్షల్లో దండుకుంటున్న కమీషన్లు అయిజ, గద్వాల, మాన్దొడ్డి కేంద్రాలుగా లావాదేవీలు జిల్లాలో ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు పుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు కూడా తమ సిబ్బందికి రుణాలు మంజూరు, రీకవరీ పేరిట లక్ష్యాలను నిర్దేశించింది. దీంతో తాము లక్ష్యాలను చేరుకోకుంటే జీతం రాదని తలచిన కొందరు ప్రైవేట్ బ్యాంకు సిబ్బంది.. గ్రామాల్లో డబ్బు అవసరమున్న అమాయకులను లక్ష్యం చేస్తున్నారు. వారికి ఉన్న ఆస్తుల వివరాలను తెలసుకుని, అందులో ఉన్న లోటు పాట్లను తెలసుకుని వారే ముందు ఉండి అమాయకులను లోన్ ట్రాప్లో దింపుతున్నారు. జిల్లాలో ఇంత జరుగుతున్నా.. దానికి కారణమైన ప్రైవేట్ బ్యాంక్ సిబ్బంది వివరాలు తెలిసినా అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదనేది చర్చనీయాంశంగా మారింది. వీరు చేసే దందాలో అధికారులకు ఏమైనా పాత్ర ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. గట్టు, రాజోళి మండలాలకు సంబంధించిన ఫోర్జరీ సంతకాలు, ఫేక్ సర్టిఫికెట్లు బయటపడినా సంబంధిత అధికారులు వాటిపై ఎందుకు మౌనంగా ఉన్నారు. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి దందాలను మొదట్లోనే అడ్డుకోకుంటే.. గతంలో జరిగిన నకిలీ పాసు బుక్కుల కుంభకోణం తరహాలో రూ.కోట్ల రూపాయల్లో ఆస్తులకు ఎసరు పెడతారని, జిల్లా అధికారులు వారిపై కఠినమైన చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. -
ముకుందా.. ముకుందా
గద్వాల న్యూటౌన్/మల్దకల్: జిల్లా వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. హరేకృష్ణా నామస్మరణలతో జిల్లా కేంద్రం గాంధీచౌక్ సమీపంలోని కృష్ణమందిరం, చెన్నకేశవస్వామి ఆలయం, వేదనగర్లోని పాండురంగస్వామి ఆలయం, రాఘవేంద్రకాలనీలోని సత్యనారాయణ స్వామి ఆలయం, మండల పరిధిలోని రేపల్లె, వీరాపురంలలోని శ్రీకృష్ణ స్వామి ఆలయాలు మార్మోగాయి. ఆలయాలు కొత్తశోభను సంతరించుకున్నాయి. భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పలుచోట్ల నామకరణ, ఉట్టి కొట్టే కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులను చిన్ని కృష్ణుడు, గోపిక వేషధారణలతో అలంకరించారు. సద్దలోనిపల్లిలో.. మల్దకల్ మండలంలోని సద్దలోనిపల్లిలో కృష్ణాష్టమి వేడుకలను శనివారం భక్తులు కనులపండువగా జరుపుకొన్నారు. పెద్దసంఖ్యలో భక్తులు ఆలయానికి కొత్తకుండల్లో దాసంగాలు సిద్ధం చేసి మొక్కులు చెల్లించారు. ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయ అధికారులు భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. స్వామి వారి పల్లకీసేవ దశమికట్ట వరకు భాజాభజంత్రీలతో వెళ్లగా గ్రామస్తులు స్వామి వారికి పూజలు నిర్వహించారు. రాత్రి స్వామి వారి జననం, అనంతరం ఉత్సవమూర్తులతో పల్లకీసేవ నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. కృష్ణస్వామి మూలవిరాట్ జిల్లాలో కనులపండువగా కృష్ణాష్టమి వేడుకలు సద్దలోనిపల్లిలో అంబరాన్నంటిన వైనం -
ఆదివాసుల హక్కుల కోసం ఉద్యమిద్దాం
గద్వాల: ఆదివాసుల హక్కుల కోసం ఉద్యమించి కగార్ హత్యాకాండ–కాల్పుల విరమణపై నిర్వహించనున్న సభను విజయవంతం చేయాలని ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక నాయకులు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఆదివాసుల హక్కుల పోరాట సంఘీభావ వేదిక నాయకులు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మధ్య భారతంలో ఏడు నెలలుగా మావోయిస్టుల ఏరివేతలో భాగంగా అమాయకులైన ఆదివాసులను ఎన్కౌంటర్ల పేరిట హత్యలు చేసి వారిని మావోయిస్టుల ముద్రవేయడం వల్ల వారికి జీవించే హక్కుకు భంగం కలుగుతుందన్నారు. గడ్చిరోలి ప్రాంతంలోరూ.7లక్షల కోట్ల విలువ చేసే ఖనిజ సంపద ఉందని దానిని కార్పోరేట్లకు దోచిపెట్టేందుకే కేంద్రం ఆపరేషన్ కగార్ పేరిట దమణకాండను సృష్టిస్తుందని ఆరోపించారు. దేశంలో మొత్తం 461 ఆదివాసి తెగలు ఉండగా, అందులో 92 తెగలు అడవిపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని, వారి జీవన హక్కులను కేంద్రం ధ్వంసం చేస్తుందన్నారు. తక్షణమే కేంద్రం ఆపరేషన్ కగార్ నిలిపివేసి శాంతిచర్చలు జరిపి అడవులను ఆదివాసుల జీవించే హక్కులను కాపాడుతూ పర్యావరణాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్తో ఈనెల 24వ తేదీన వరంగల్లోని అంబేడ్కర్ భవన్లో సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో గోపాల్, జ్యోతి, వెంకటమ్మ, శంకరప్రభాకర్, నాగరాజు, సుభాన్, ప్రకాష్గౌడ్, ఆంజనేయులు, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
గద్వాల: మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రతలేదని, దాంతో పాటు కనీసం ప్రమాద బీమా కూడ లేదని సీఐటీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జె.రాజమల్లు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని స్థానిక బృందావన్గార్డెన్ ఫంక్షన్ హాలులో జరిగిన మూడో జిల్లా మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు ప్రమాద బీమా కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జీవితాంతం ప్రజలకు సేవలు అందించే కార్మికులకు ఉద్యోగ భద్రత లేకపోగా కనీసం ప్రమాద బీమాను కూడా కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. రాజీలేని పోరాటాల ద్వారానే ప్రభుత్వాల మెడలు వంచి హక్కులు సాధించుకోగలమన్నారు. ఈఎస్ఐ సౌకర్యం లేకపోవడంతో వైద్యం కోసం సొంత డబ్బులనే వెచ్చిస్తున్నారన్నారు. దీనికోసం అప్పులు సైతం చేస్తూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వెంకటస్వామి, వివి నర్సింహా, ఉప్పేర్ నర్సింహా, శివ, రవి, మహేష్, దేవి, లలితమ్మ, సత్యమ్మ, నరేష్, ప్రభుదాసు, సంజీవరాజు తదితరులు పాల్గొన్నారు. -
కష్టాల కడలిలో గంగమ్మ
నా భర్త ఉన్నప్పుడు ఎప్పుడూ సంతోషంగా ఉండేవాళ్లం. ఇప్పుడు గతిలేని పరిస్థితి మాది. వానొస్తే మొత్తం కురుస్తుంది. వరద ఎప్పుడొస్తుందో తెలియదు. రేషన్ బియ్యమే మాకు దిక్కు. అదీ కొత్త బండరాయిపాకులకు వెళ్లి తెచ్చుకోవాలి. పిల్లలను పోషించలేక వనపర్తిలోని గురుకుల పాఠశాలల్లో చేర్పించా. అక్కడైనా బువ్వ దొరుకుతుందని. ఫైనాన్సోళ్ల నుంచి మా డబ్బులు మాకు ఇప్పించి న్యాయం చేయాలి. – గంగ, మృతుడు హరిబాబు భార్య ఈ మధ్య బ్యాంకోళ్లు వచ్చారు. రూ.2లక్షల అప్పు ఉందని.. ఇప్పుడు రూ.5 లక్షలు అయిందని చెబుతున్నారు. కోర్టు కేసు పెడతామని.. జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. రూపాయి అప్పు పుడుత లేదు. పిల్ల తీర్చ లేదు. పిలగాడు లేకపాయె. పెడితే అందరినీ జైల్లో పెట్టండి. ఎక్కడికై నా వస్తాం. అక్కడ బువ్వ అయినా దొరుకుద్ది. నా కొడుకు పిల్లలకు కనీసం బుక్కులు, పెన్నులైనా కొనియ్యండి. – మల్లమ్మ, హరిబాబు తల్లి సాఫీగా సాగుతున్న జీవితంలో.. మిద్దె మల్లమ్మ, పెద్ద లక్ష్మయ్యకు నలుగురు కొడుకులు. అందరికీ పెళ్లిళ్లు కాగా.. మొదటి ముగ్గురు గతంలోనే బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వలసవెళ్లారు. చిన్నకుమారుడు హరిబాబు కాగా.. పెద్దకొత్తపల్లికి చెందిన గంగతో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. ప్రస్తుతం పెద్ద కుమార్తె శ్రుతి ఇంటర్, శాన్వి ఏడు, సమీర నాలుగో తరగతి చదువుతున్నారు. హరిబాబు ఆటో, ట్రాక్టర్ నడుపుతూ వీరిని పోషించేవాడు. తల్లిదండ్రులు కూడా వీరితోనే ఉండేవారు. ఉన్నంతలో సంతోషంగా జీవనం సాగిస్తున్న క్రమంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్లో ఆ కుటుంబం పొలం, ఇల్లును కోల్పోవాల్సి వచ్చింది. వచ్చిన పరిహారంలో హరిబాబు తనకు వచ్చిన వాటాలో నెలనెలా వడ్డీ వస్తుందనే ఆశతో 2021లో ఓం శ్రీసాయిరాం ఫైనాన్స్లో పెట్టాడు. ఇదే వారి కుటుంబానికి శాపంగా మారింది. మనోవేదనతో కిడ్నీలు దెబ్బతిని భర్త హరిబాబు మృతి ఆస్పత్రుల్లో చికిత్సకు రూ.10 లక్షలు దాటిన ఖర్చు ముగ్గురు ఆడపిల్లలు, ముసలి అత్తామామలతో పోషణ భారం -
చిగురిస్తున్న ఆశలు..
అయిజలో కొత్త మార్కెట్ యార్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు అలంపూర్: జిల్లాలో మరో మార్కెట్యార్డు ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. అయిజ సబ్యార్డును పూర్తి స్థాయి మార్కెట్ యార్డుగా మార్చాలని రైతులు, నాయకులు ఏళ్లుగా కోరుతున్నారు. గతేడాది వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటనతో ఈ ప్రతిపాదనలకు బీజం పడింది. అందుకు తగ్గట్టుగా అధికార పార్టీకి చెందిన నేతలు సంబంధిత శాఖ రాష్ట్ర నాయకులను కలుస్తు వినతులు అందిస్తున్నారు. మరోసారి తెరపైకి.. జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలోని అయిజలో కొత్త మార్కెట్ యార్డు ఏర్పాటుకు బీజం పడింది. 2024 సెప్టెంబర్ 13న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అలంపూర్ రాగా.. మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అయిజలోని సబ్ మార్కెట్ యార్డును పూర్తి స్థాయి మార్కెట్ యార్డుగా చేయాలని వినతి పత్రం అందజేశారు. అందుకు తగ్గట్టుగానే మంత్రి అయిజలో కొత్త మార్కెట్ యార్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ ప్రతిపాదనలు చేస్తే తప్పక పూర్తి స్థాయి యార్డుగా ఆధునీకరిస్తామని భరోసా ఇచ్చారు. గత నెలలో మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ స్థానిక నాయకులతో కలిసి రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మన్ కోదండారెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. దీంతో కొత్త మార్కెట్ యార్డు ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది. రూ.లక్షల్లో నుంచి రూ.కోట్లలో ఆదాయం అయిజ వ్యవసాయ మార్కెట్ సబ్యార్డు ఆదా యం ఏటేటా పెరుగుతూ వస్తోంది. మూడేళ్లలో ఆదాయం రెట్టింపునకు చేరింది. మార్కెట్ యార్డు ఆరంభంలో రూ.లక్షల్లో ఉన్న ఆదాయం కోట్లకు చేరింది. 2022–23 వార్షిక ఆదాయం రూ. 2.13 కోట్లు వచ్చింది. 2023–24 రూ. 3.07 కోట్లు, 2024–25లో రూ. 4.7 కోట్లు వచ్చింది. అలంపూర్ చౌరస్తా మార్కెట్ యార్డు పరిధిలో పుల్లూరు, అయిజ, ఎర్రవల్లిలోని మూడు చెక్పోస్టుల ద్వారా రూ.1.76 కోట్లు, వ్యాపార సముదాయాలు, వ్యాపారుల ద్వారా రూ.1.39 కోట్లు, అయిజ సంత మార్కెట్ యార్డు ద్వారా రూ.21.60 లక్షలు, గోదాంల ద్వారా రూ.69 లక్షలు మొత్తం రూ.4.07 కోట్ల ఆదాయం వచ్చింది. 2025–26 వార్శిక సంవత్సరంలో ఏప్రెల్ 1 నుంచి జూలై వరకు రూ.2.61 కోట్ల ఆదాయం వచ్చింది. కొత్త మార్కెట్తో లబ్ధి పెరిగిన జనాభా, మారిన పరిస్థితులకు అనువుగా కొత్త మార్కెట్ యార్డు ఏర్పాటు జరిగితే అన్ని విధాలుగా లబ్ది జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నియోజకవర్గంలో 8 మండలాలుగా విభజించారు. జనాభా గణయంగా పెరిగింది. అయిజలో ఇప్పటికే సబ్ మార్కెట్ యార్డుతోపాటు అనువైన వసతులు అందుబాటులో ఉండటంతో స్థానికంగా కొత్త మార్కెట్ యార్డు కావాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. కొత్త మార్కెట్ యార్డు వస్తే జిల్లాలో మొత్తం సంఖ్య మూడుకు చేరుతుంది. అంతర్ రాష్ట్రాలకు సరిహద్దుగా ఉండటంతో ఆదాయం పెరగడంతోపాటు రాజకీయంగా అనేక మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతం నుంచి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి ప్రాంతాలకు రైతులు పండించిన ధాన్యాలు తరలించకుండగా ఇక్కడే విక్రయించుకునే వెసలుబాటు ఉంటుంది. దీంతో రైతులకు ప్రయాణ భారం తగ్గడంతోపాటు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. 2024లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి హామీ.. ప్రస్తుత సబ్ యార్డు ఆదాయం రూ.4 కోట్లు మార్కెట్యార్డు వస్తే మరింత పెరిగే అవకాశం.. పెరగనున్న నామినేటెడ్ పోస్టులు అయిజ మున్సిపాలిటీలో కొత్త మార్కెట్ యార్డు ఏర్పాటుకు ఎన్నో అనుకూలతలు ఉన్నాయి. ఇప్పటికే సబ్ మార్కెట్ యార్డు కొనసాగుతుంది. అలంపూర్ చౌరస్తాలో అలంపూర్, మానవపాడు, ఇటిక్యాల, వడ్డేపల్లి, రాజోలి, ఉండవెల్లి, ఎర్రవల్లి మండలాల రైతులకు అనువుగా అలంపూర్ చౌరస్తాలో 1978లో వ్యవసాయ మార్కెట్ యార్డు నిర్మాణానికి శ్రీకారం చూట్టారు. దాదాపు 26.34 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించడం జరిగింది. ప్రస్తుతం ఈ మార్కెట్లోని 5 ఎకరాలు 100 పడకల ఆస్పత్రికి అప్పగించారు. అయిజ పెద్ద మండలంగా ఉండటంతోపాటు పట్టణం విశాలంగా విస్తరించింది. రైతుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఉత్పత్తులు పెరిగాయి. దీంతో దీన్ని దృష్టిలో ఉంచుకొని 1992లో సబ్ మార్కెట్ యార్డును ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో సబ్ మార్కెట్ యార్డు కొనసాగుతుంది. యార్డులలో ధాన్యం నిల్వ చేసే భారీ గోదాంలు, ఓపెన్ షెడ్స్, దుకాణ సముదాయాలు విశాలమైన మైదానాలు అందుబాటులో ఉన్నాయి. -
మహిళల ఆర్థిక ప్రగతే లక్ష్యం
గద్వాల: మహిళల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని.. ఈమేరకు ప్రతి మహిళను స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా చేర్చాలని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీవోసీ కార్యాలయంలోని సమావేశపు హాలులో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నూతన స్వయం సహాయక సంఘాల ఏర్పాటు కోసం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. కిశోర, బాలికలు, దివ్యాంగులు, వృద్ధులను మహిళా సంఘాల్లో చేర్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అర్హత కలిగిన ప్రతి మహిళను సంఘాల్లో చేర్చే బాధ్యత ఏపీఎంలు, సీసీలపై ఉందని ప్రతి అర్హురాళ్లను సభ్యురాలిగా చేర్చేలా సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళా సంఘాలు భద్రత సామాజిక గుర్తింపుతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తున్నాయని వివరించారు. గ్రామస్థాయిలో ఇటుకల తయారీ సెంటరింగ్ వర్క్స్ వంటి గ్రౌండ్ యూనిట్లను ఏర్పాటు చేసి కుటుంబ ఆదాయాన్ని పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్ల పట్టాలు మహిళల పేరిటనే మంజూరీ చేస్తున్నట్లు తెలిపారు. నిర్మాణానికి అవసరమైన నిధుల కొరత వుంటే మహిళా సంఘాల ద్వారా రుణాలు తీసుకుని ఇళ్లు పూర్తి చేసుకోవచ్చన్నారు. బ్యాంకర్లు రుణసదుపాయాల కల్పనలో పూర్తి సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎల్డీఎం శ్రీనివాసరావు, సమాఖ్య అధ్యక్షురాలు ప్రభావతి, జిల్లా సంక్షేమ అధికారి సునంద, ఇండస్ట్రీస్ జీఎం రామలింగేశ్వర్గౌడ్, ఏడీఆర్డీవో శ్రీనివాసులు, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు. -
మత్తు పదార్థాల విక్రయాలపై ఉక్కుపాదం
గద్వాల: జిల్లాలో మత్తుపదార్థాల వినియోగం, సరఫరా చేస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం ఐడీవోసీ కార్యాలయంలోని సమావేశం హాలులో మిషన్ పరివర్తన–మత్తుపదార్థాల వినియోగ నిర్మూలన కోసం సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగం వల్ల వ్యక్తిగత ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందన్నారు. అదేవిధంగా ఆలోచనశక్తి సామర్థ్యం నశిస్తుందన్నారు. మత్తుపదార్థాల క్రయవిక్రయాలు గుర్తిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. క్రయవిక్రయాలు జరిపేవారిపై చట్టపరంగా కఠిన తీసుకుంటామన్నారు. గతంలో పట్టణాలకే పరిమితమైన డ్రగ్స్ వినియోగం ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు సైతం వ్యాప్తిచెందడం ఆందోళన కలిగించే పరిణామం అన్నారు. యువకులు డ్రగ్స్కు బానిసలు కాకుండా వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతరం పిల్లలపై నిఘా ఉంచి గమనించాలన్నారు. అదేవిధంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ప్రాముఖ్యతను వివరిస్తూ యువతకు ఆధునిక సాంకేతిక విద్య, నైపుణ్యశిక్షణ అందించడంలో ఏటీసీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. సీఎన్ఎస్ మెషిన్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వాహనం, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, డిజిటల్ మానుఫ్యాక్చరింగ్, ఇంజినీరింగ్ డిజైన్, ఆటోమిషన్ వంటి దీర్ఘకాలిక స్వల్పకాలిక కోర్సులు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది గద్వాలలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయబడుతుందని యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సునంద, ఉపాధికల్పన అధికారి ప్రియాంక, ఎల్డీఎం శ్రీనివాసరావు, డీపీఆర్వో ఆరీఫుద్దీన్, సివిల్సప్లై డీఎం విమల తదితరులు పాల్గొన్నారు. డ్రగ్ రహిత సమాజమే లక్ష్యం గద్వాల క్రైం: డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పించే ఉద్ధేశంతో దేశవ్యాప్తంగా నషా ముక్త్ భారత్ అభియాన్ను అమలు చేస్తోందని అన్నారు. మాదక ద్రవ్యాల వాడకం, సరఫరాపై పోలీస్ యంత్రాంగం పూర్తి నిఘా ఉంచిందని అన్నారు. గంజాయి అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. -
వర్షాలతో అప్రమత్తం
రానున్న 72 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ● అవసరం ఉంటేనే ఇళ్ల నుంచి బయటకు రావాలి ● లోతట్టు ప్రాంతాలు, నదీపరివాహక ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేయండి ● కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు ● బీచుపల్లి పుష్కరఘాట్, పలు లోతట్టు ప్రాంతాల పరిశీలన ఉండవెల్లి: మండలంలో ఐదురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలతో పొంగిపొర్లాయి. మారమునగాల–1, 2, మెన్నిపాడు గ్రామాల మధ్య వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈక్రమంలో బుధవారం ఉపాధ్యాయులు ప్రమాదమని తెలిసినా మారుమునగాల–2, మెన్నిపాడు వాగులులను దాటి పాఠశాలకు చేరుకున్నారు. గ్రామస్తులది ఇదే పరిస్థితి. అదేవిధంగా, మారమునగాల – ప్రాగటూరు, బొంకూరు – మెన్నిపాడు మధ్యలో వాగు ఉధృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక తక్కశీలలోని పంట పొలాలకు వెళ్లేందుకు వీలు లేక వాగు ప్రవహిస్తండడంతో బ్రిడ్జి నిర్మించాలని రైతులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గద్వాల/ఎర్రవల్లి/మానవపాడు: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, రానున్న 72గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని కలెక్టర్ బీఎం సంతోష్ సూచించారు. బుధవారం ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి పుష్కర్ ఘాట్ వద్ద కృష్ణానది ఉధృతిని కలెక్టర్, ఎస్పీ శ్రీనివాసరావు వేర్వేరుగా పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా అధికారులందరూ సంసిద్ధంగా ఉండాలని, అదేవిధంగా ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా మూగజీవాలు ప్రాణాలు కోల్పోకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగులందరూ సెలవులు రద్దు చేసుకుని అందుబాటులో ఉండాలన్నారు. రానున్న 72గంటల పాటు అవసరం ఉంటేనే ఇళ్లనుండి బయటకు రావాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశాలు ఉన్నందున వైద్యారోగ్యశాఖ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, అన్ని పీహెచ్సీలు, ఆసుపత్రులలో సరిపడా మందులను అందుబాటులో ఉంచుకోవాలని, వైద్యులు, సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన వైద్యసేవలు అందించాలన్నారు. ● అలాగే, ఎర్రవల్లి మండలంలోని యాక్తాపురంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లన పనులను కలెక్టర్ పరిశీలించి పనులు వేగవంతంగా చేపట్టాలన్నారు. అవసరమైన ఇసుక, మట్టిని లబ్ధిదారులకు అందజేయాలని, నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. బి.కే.ఎస్ ట్రేడర్స్, ఫర్టిలైజర్స్ ఎరువుల గోదాములను తనిఖీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో జర భద్రం : ఎస్పీ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు దాటకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ టి. శ్రీనివాసరావు పోలీసులను ఆదేశించారు. బుధవారం ఎస్పీ బీచుపల్లి పుష్కరఘాట్, అమరవాయి పెద్దవాగు, మానవపాడు పోలీస్స్టేషన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో పొలీసు యంత్రాంగాన్ని సంసిద్దం చేయడం జరిగిందని, వర్షాల సమయంలో విద్యుత్ తీగలు తెగిపోవడం, చెట్లు కూలడం, రహదారులు దెబ్బతినే అవకాశాలు ఉన్నందున ప్రజలకు ఎలాంటి సమస్య తలెత్తిన డయల్ 100, పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో రెస్క్యూ టీమ్లను అవసరమైన పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. స్థానిక ప్రజలకు నిరంతరం ప్రజలకు మైక్అనౌన్స్మెంట్, సోషల్మీడియా ద్వారా విపత్తు నిర్వహణ విభాగంతో సమన్వయం చేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మానవపాడు పోలీస్స్టేషన్లో పలురికార్డులను పరిశీలించి, సిబ్బంది విధులను పరిశీలించారు. శాంతినగర్ సీఐ టాటాబాబు, అలంపూర్ సీఐ రవిబాబు, ఇటిక్యాల ఎస్ఐ రవి పాల్గొన్నారు. మానవపాడులో నీట మునిగిన పంటలు ఫైనాన్స్లో రూ.5 లక్షలను జమచేయగా.. నిర్వాహకులు తొలుత నెలకు రూ.2 చొప్పున వడ్డీ చెల్లించారు. ఆ తర్వాత ఇవ్వకపోవడంతో హరిబాబు నాగర్కర్నూల్లోని ఫైనాన్స్ కార్యాలయం, నిర్వాహకుల ఇళ్లకు నిత్యం తిరిగేవాడు. ఈ నేపథ్యంలో మనోవేదనకు గురై.. క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం దెబ్బతింది. సుమారు 8 నెలలు హైదరాబాద్లోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందాడు. చేతిలో డబ్బులు లేకపోవడంతో పునరావాసం కింద వచ్చిన ప్లాటును అమ్మి వైద్య చికిత్స చేయించారు. ఈ క్రమంలో 11 నెలల క్రితం చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆయన కుటుంబం దిక్కులేనిదైంది. హరిబాబుకు ఆస్పత్రి ఖర్చులు రూ.10 లక్షలకు పైగా అయ్యాయని.. అయినా బతికించుకోలేకపోయామని.. ప్రస్తుతం అప్పుల కుప్ప అయిందని ఆయన కుటుంబసభ్యులు వాపోతున్నారు. ప్రస్తుతం ఆ కుటుంబానికి గూడు లేకపోవడంతో ముంపులోని పాత బండరాయిపాకులలో తమ చేను వద్ద కవర్తో కప్పిన చిన్న గుడిసెలో ఉంటున్నారు. పుష్కరఘాట్ల దగ్గర ప్రజలు ఎవరు కూడా నీటి లోనికి దిగరాదని, పరివాహక ప్రాంతాల్లో నివసించే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని, పాడుబడ్డ ఇళ్లలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఎస్పీ సూచించారు. అలంపూర్: అలంపూర్ నియోజకవర్గంలో బుధవారం తెల్లవారుజాము నుంచి ఎడతేరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఐదు రోజులుగా వర్షలు కురుస్తుండటంతో వాగులు, వంకల్లో భారీగా వరద నీరు చేరాయి. తెల్లవారుజామున కురిసిన వర్షాలతో మరోసారి వాగులు ఉప్పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మానవపాడు మండలంలో 36 మి.మీ వర్షం కురిసింది. ఉండవెల్లి మండలంలో 27.2 మి.మీ, ఇటిక్యాలలో 25.3 మి.మీ, రాజోలిలో 24.3 మి.మీ, వడ్డేపల్లిలో 21.5 మి.మీ, అయిజలో 16.8 మి.మీ, అలంపూర్లో 15.6 మి.మీ వర్షపాతం నమోదైంది. అలంపూర్ మండలంలోని పల్లా వాగు భారీ వర్షంతో ఉధృతంగా ప్రవహించింది. గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తి తన బైక్తో వాగు దాటే ప్రయత్నం చేశాడు. వరద ఉధృతికి బైక్ వాగు మధ్యలోనే నిలిచింది. అక్కడే ఉన్న పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు వాగులోకి వెళ్లి అతడి కాపాడి బైక్తో సహ వాగుదాటించారు. వాగు ఉధృతి పెరుగుతుండటంతో వాహనాల రాకపోకలు కొనసాగించకుండా ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. వాగును ఎస్ఐ వెంకటస్వామి సిబ్బందితో కలిసి పరిశీలించారు. -
అతికష్టం మీద బతుకుతున్నాం..
నా పేరు, నా భర్త మీద రూ.6 లక్షలను 2021లో ఓం శ్రీసాయిరాం ఫైనాన్స్ కంపెనీలో పెట్టాం. మాకు నలుగురు కొడుకులు ఉండగా.. ముగ్గురు మరణించారు. ఒక్క కొడుకు మాత్రమే ఉన్నాడు. మాతో డబ్బులు లేకపోయేసరికి మమ్మల్ని ఎవరూ చూసుకోవడం లేదు. ఉన్న కొడుకు కూడా విడిగా ఉంటున్నాడు. నాకు పక్షవాతం వచ్చింది. ఒక కన్ను సరిగా కనిపించడం లేదు. అతికష్టం మీద బతుకుతున్నాం. డబ్బులు అనవసరంగా ఎవరికో ఇచ్చి ఇలా చేశారని కొడుకు, కోడలు నిత్యం తిడుతూనే ఉన్నారు. మాకు డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలి. – మిద్దె నాగమ్మ, బాధితురాలు ● -
నాన్న దూరమయ్యాడు.. కుటుంబం రోడ్డున పడింది..
మా నాన్న రాంచంద్రయ్య ఓం శ్రీ సాయిరాం చిట్ఫండ్లో రూ.13 లక్షలు పెట్టాడు. ఆ తర్వాత ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఫైనాన్సోళ్లను ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వకపోయేసరికి మనోవేదనతో మంచానపడ్డాడు. దీంతో వైద్య ఖర్చులకు ఆయనపై ఉన్న ప్లాటు అమ్మాల్సి వచ్చింది. ఈ క్రమంలో మా నాన్న గుండెపోటు వచ్చి మరణించాడు. ఇప్పుడు మాకు ఇల్లులేదు. డబ్బుల కోసం నా భార్యకు నాకు గొడవ జరిగింది. వీళ్లతో డబ్బులు పెట్టడం వల్ల మా నాన్న నాకు దూరమాయ్యాడు. నా కుటుంబం రోడ్డున పడింది. ప్రస్తుతం ఉండేందుకు ఇంటి స్థలం కూడా లేదు. – కుర్మయ్య, బాధితుడు -
కిరాయి ఇంట్లో ఉంటున్నాం..
తెలిసిన వాళ్లు మిత్తి వస్తుందని చెబితే.. మాకు పునరావాసం కోసం వచ్చిన డబ్బులు మొత్తం రూ.24 లక్షలను ఓం శ్రీ సాయిరాం చిట్ఫండ్లో నాలుగేళ్ల క్రితం పెట్టాం. ఇప్పటివరకు మాకు చిల్లిగవ్వ ఇవ్వలేదు. డబ్బులు లేక మేము ఇల్లు కట్టుకోలేదు. కిరాయికి వేరొకరి ఇంట్లో ఉంటున్నాం. నేనూ మా ఆయన ఇద్దరం కూలీ చేసుకుని బతుకుతున్నాం. మా పరిస్థితి ఇలా ఉంటే.. దుడ్డు మల్లయ్య అనే వాళ్లతో రూ.2.60 లక్షలు కట్టించాను. ఇప్పుడు వాళ్లు డబ్బులు ఇవ్వాలని నన్ను టార్చర్ పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి. – గోపాల పార్వతమ్మ, బాధితురాలు ● -
కానరాని పురోగతి!
సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులపై కాలయాపన రిపేర్లపై నిర్లక్ష్యం.. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి ర్యాలంపాడు జలాశయం గుండెకాయలాంటిది. అయితే రాక్టోల్, తూములు, ఆనకట్ట బండ్లో లీకేజీలు ఏర్పడటంతో నాలుగేళ్లుగా 2 టీఎంసీలు మాత్రమే నిల్వచేస్తూ వస్తున్నారు. కేవలం వానాకాలంలో మాత్రమే సాగునీటిని అందిస్తూ వస్తున్నారు. గతేడాది పుణెకు చెందిన ఇంజినీరింగ్ నిపుణుల బృందం ర్యాలంపాడు రిజర్వాయర్ను సందర్శించి.. మరమ్మతుకు రూ.185కోట్లు వ్యయం అవుతుందని నివేదించారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి చలనం లేదు. కోయిల్సాగర్ది అదే తీరు.. మరికల్, ధన్వాడ, చిన్నచింతకుంట, దేవరకద్ర మండలాల పరిధిలో 50 వేల ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టారు. గత పాలకులు కోయిల్సాగర్ పనులను పూర్తిచేయకపోవడంతో నేటికీ పెండింగ్లోనే ఉంది. మరోవైపు జూరాల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతున్న క్రమంలో మోటారు పంపులలో తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక్కడ కూడా నిర్వహణ లోపమే ప్రధాన కారణం. గద్వాల: పదేళ్ల క్రితమే పూర్తికావాల్సిన ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులు పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. ఏళ్ల తరబడి పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ పనులను వచ్చే ఏడాది నాటికి పూర్తిచేసి.. ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెబుతున్న ఆమాత్యుల హామీలు కేవలం సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనల్లో ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్లో ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన జరిగే ఉమ్మడి పాలమూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల పనుల సమీక్షకు ప్రాధాన్యత సంతరించుకుంది. నెరవేరని లక్ష్యం బీడు భూముల్లో సాగునీటిని పారించి వలసల పాలమూరు రూపురేఖలు మార్చాలని అప్పటి ముఖ్యమంత్రి దివంగత డా.వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం కింద కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టారు. ఆ ప్రాజెక్టుల ద్వారా 10లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని సంకల్పించారు. అయితే వైఎస్సార్ అకాల మరణాంతరం పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టుల పనులను పూర్తిచేయకుండా వదిలేయడంతో పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. ఫలితంగా 10 లక్షల ఎకరాలకు నీరందించాల్సిన ప్రాజెక్టుల కింద 6 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగునీరు పారుతోంది. నెట్టెంపాడుకు భూ సేకరణే అడ్డంకి.. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పనులు పదేళ్ల క్రితమే 90 శాతం పూర్తయ్యాయి. అయితే 99, 100 ప్యాకేజీల్లో భూసేకరణ సమస్య నెలకొనడతో కలెక్టర్ సంతోష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉండగా.. గూడ్డెందొడ్డి, ర్యాలంపాడు జలాశయాల కింద 1.45 ఎకరాలకు సాగునీరు అందుతోంది. మోటార్ల నిర్వహణ కొరవడటంతో తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తి నీటి పంపింగ్కు ఆటంకాలు ఏర్పడటం పరిపాటిగా మారింది. కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించినా.. గతేడాది సెప్టెంబర్లో జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులకు జడ్చర్ల వద్ద పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితుల నుంచి పెద్దఎత్తున నిరసన సెగలు తగిలాయి. పెండింగ్ పనులు పూర్తి చేయాలంటే భూసేకరణ సమస్యను పరిష్కరించాలని గ్రహించిన మంత్రులు.. భూసేకరణ ప్రక్రియతో పాటు పెండింగ్ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వేగం పెంచాలని కలెక్టర్లకే బాధ్యతలు కట్టబెట్టారు. అయితే 10 నెలల కాలంలో ప్రాజెక్టుల పనుల్లో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. వచ్చే ఏడాది నాటికి పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు అందడం గగనమే ఊసేలేని ర్యాలంపాడు రిజర్వాయర్ మరమ్మతు ఆమాత్యుల సమీక్షలు, క్షేత్రస్థాయిపర్యటనల్లో ప్రకటనలకే పరిమితం నేడు రాష్ట్ర సచివాలయంలో ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష -
ముగిసిన రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు
గద్వాలటౌన్: జిల్లా కేంద్రంలో మంత్రాలయ రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజైన మంగళవారం ఉత్తరారాధన ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రాఘవేంద్రస్వామి బృందావనానికి పంచామృత అభిషేకం చేశారు. వివిధ రకాల పూలతో బృందావనాన్ని సుందరంగా అలంకరించారు. అదే విధంగా భీంనగర్లోని రాఘవేంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ● ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులు రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల సందర్భంగా అలంకరించిన స్వామివారి ఉత్సవమూర్తిని పూల పల్లకీలో తీసుకెళ్లి రథంపై కొలువుదీర్చారు. షేరెల్లి వీధిలోని రాఘవేంద్రస్వామి మఠం నుంచి శేషదాస భజన మండలి సభ్యులు, భక్తుల పాటలు, భజనల మధ్య స్వామివారి ఊరేగింపు సాగింది. స్థానిక కోటలోని చెన్నకేశవస్వామి ఆలయం చుట్టూ రథోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ విచారణకర్త ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో బీజేపీకే అత్యధిక సభ్యత్వాలు అయిజ: దేశంలో అత్యధిక సభ్యత్వాలు గల పార్టీ బీజేపీ అని జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. మంగళవారం అయిజలో బీజేపీ నాయకులు హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలు సమష్టిగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు గోపాలకృష్ణ, అక్కల రమాదేవి, వెంకటేశ్,, ఆంజనేయులు, లక్ష్మణ్గౌడ్, నర్సన్న, అంజి, రాజేశ్గౌడ్, శశికుమార్, పరశురాముడు, మహేశ్, రాజశేఖర్, గోపాల్, సుంకన్న పాల్గొన్నారు. లైసెన్స్డ్ సర్వేయర్లకు రెండో విడత శిక్షణ గద్వాల: జిల్లాలోని లైసెన్స్డ్ సర్వేయర్లకు రెండో విడత శిక్షణ ఈ నెల 18నుంచి నిర్వహించనున్నట్లు భూ కొలతలు, సర్వేశాఖ ఏడీ రాంచందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 285 లైసెన్స్డ్ సర్వేయర్లు ఉండగా.. ఇప్పటికే మొదటి విడత శిక్షణ పూర్తిచేయడం జరిగిందన్నారు. రెండో విడత 50 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. -
ఉపాధ్యాయుడిగా మారిన కలెక్టర్
● రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి ఆయన కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్ బీఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, ఇరిగేషన్శాఖ ఎస్ఈ రహీముద్దీన్, విద్యుత్శాఖ డీఈ తిరుపతిరావు, డీఎంహెచ్ఓ సిద్దప్ప, డీఏఓ సక్రియానాయక్ ఉన్నారు. గద్వాల/గద్వాలటౌన్: పిల్లలూ ఎలా చదువుతున్నారు.. ఇంగ్లిష్ చదవడం వచ్చా.. అంటూ విద్యార్థులను పలకరించారు కలెక్టర్ సంతోష్. ఆయన అడిగిన ప్రశ్నకు వచ్చు సార్ అంటూ విద్యార్థులు బదులిచ్చారు. మంగళవారం గద్వాల మండలం పూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ తరగతి గదిలోకి కలెక్టర్ వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులచే పాఠాలు చదివించారు. టీచర్లు బాగా చెబుతున్నారా అని అడిగి సమాధానాలు రాబట్టారు. పదో తరగతి విద్యార్థులు చాలా మంది ఇంగ్లిష్లో చదివిన దానికి అర్థం చెప్పకపోవడంతో అసంతృప్తి వ్యక్తంచేశారు. చదువులో వెనకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదో తరగతి ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. అంతకుముందు ఉపా ధ్యాయుల హాజరు పట్టిక, విద్యార్థుల ఫెషియల్ రికగ్నిషన్, వంటగది, తాగునీరు, భోజనం నాణ్యత, స్టోర్రూంలోని సరుకులను కలెక్టర్ పరిశీలించారు. యూడైస్ ఎంట్రీలను ఎప్పటికప్పుడు అప్డేట్ చే యాలని హెచ్ఎంకు సూచించారు. ఆహార పదార్థా లు, కూరగాయలు నాణ్యతగా ఉండేలా చూడాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్మికశాఖ కమిషనర్ మహేశ్, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి ప్రియాంక, హెచ్ఎం వెంకటేశ్వర్లు ఉన్నారు. వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి.. భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు ప్రమాదకర పరిస్థితులు తలెత్తనప్పటికీ.. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. వరదలతో పొంగిపొర్లే వాగులు, వంకల వద్ద ప్రమాదాలు సంభవించకుండా చూడాలన్నారు. ప్రమాదాల నివారణ కోసం మండలస్థాయి బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. అదే విధంగా సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, ఇరిగేషన్ ఎస్ఈ రహీముద్దీన్, డీపీఓ నాగేంద్రం, డీఎంహెచ్ఓ డా.సిద్దప్ప, డీఏఓ సక్రియా నాయక్ ఉన్నారు. -
కదిలిస్తే కన్నీరే..
వీరందరూ వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో ముంపు గ్రామమైన బండరాయిపాకులకు చెందిన సామాన్య, మధ్య తరగతికి చెందిన ప్రజలు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన ఏదుల ప్రాజెక్ట్ నిర్మాణంలో వ్యవసాయ భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులు. ప్రభుత్వం ఇచ్చిన అరకొర పరిహారాన్ని ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ కంపెనీ నిర్వాహకులు గద్దలా తన్నుకుపోవడంతో గుండెలు బాదుకుంటున్నారు. నెలనెలా వడ్డీ వస్తుందనే ఆశ నిండా ముంచడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తాము చెల్లించిన డబ్బులను ఇవ్వాలని ఐదేళ్లుగా ఆందోళన చేస్తున్నా.. ఫలితం లేకపోవడంతో వారిలో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. ..ఇలా మోసపోయింది ఈ ఒక్క గ్రామస్తులే కాదు. వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల పరిధిలో దాదాపు 50 గ్రామాలకు చెందిన పీఆర్ఎల్ఐ నిర్వాసితులు 2,500 మంది ఉన్నట్లు అంచనా. డబ్బులు వస్తలేవనే మనోవేదనతో ఇప్పటికే పలువురు బలవన్మరణాలకు పాల్పడగా.. కొందరు గుండెనొప్పితో తనువు చాలించారు. ఈ నేపథ్యంలో బాధిత నిర్వాసితులను ‘సాక్షి’ పలకరించగా.. కన్నీళ్లే మిగిలాయి. అనారోగ్య కారణాలతో మంచమెక్కిన వారు.. వైద్య చికిత్సలకు డబ్బులు లేక విలవిల్లాడుతున్నారు. ఇళ్లు కట్టుకోలేక, సంతానాన్ని పోషించలేక, చదివించలేక నరకయాతన అనుభవిస్తున్నారు. బాధితులు ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాధ కాగా.. వారి ఆవేదన వారి మాటల్లోనే.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ -
కేన్సర్ పేషంట్ను.. గోలీలకూ డబ్బుల్లేవు..
పాత బండరాయిపాకులలో మాకు ఐదెకరాల భూమి ఉండేది. పాలమూరు ప్రాజెక్ట్తో ఉన్నది పోయింది. ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చాక సాయిరాం ఫైనాన్స్ వాళ్లు నా కొడుకును కలిసిండ్రు. మిత్తి ఎక్కువగా వస్తుందని మాయమాటలు చెప్పి బాగా నమ్మించిండ్రు. దీంతో నా కొడుకు రాములు పేరిట రూ.10 లక్షలు, నా కోడలు గోపాల శివశీల పేరిట రూ.5 లక్షలు, నేను దాచుకున్న రూ.1.50 లక్షలు.. మొత్తం రూ.16.50 లక్షలను 2021లో ఫైనాన్స్ కంపెనీలో డిపాజిట్ చేశాం. ఒకసారి రూ.60 వేలు, మరోసారి రూ.30 వేలు వడ్డీ కింద ఇచ్చారు. ఆ తర్వాత ఆరోగ్యం బాలేదని డబ్బులు అడిగితే ఇవ్వడం లేదు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ ఆస్పత్రికి వెళ్తే కేన్సర్ వచ్చిందని చెప్పారు. మళ్లీ ఆస్పత్రికి వెళ్లేందుకు, గోలీలకు డబ్బుల్లేవ్. ఫికరుతో ఎప్పుడు సచ్చిపోతనో నాకే తెలుస్తలేదు. – గోపాల బొజ్జమ్మ, బండరాయిపాకుల, రేవల్లి, వనపర్తి ● -
వసతిగృహాల్లో సమస్యల పరిష్కారానికి కృషి
అలంపూర్: ప్రభుత్వ వసతిగృహాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మంగళవారం కర్నూలులోని తన క్యాంపు కార్యాలయంలో ఎస్సీ, బీసీ వసతిగృహాల వార్డెన్లతో ఆయ సమీక్షించారు. ఈ సందర్భంగా హాస్టళ్ల వారీగా నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే తెలుసుకున్నారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం అయిజ మండలం టీటీదొడ్డికి చెందిన ఉరుకుందమ్మకు శస్త్రచికిత్స నిమిత్తం సీఎం సహాయనిధి మంజూరైన రూ. 5లక్షల ఎల్ఓసీ, అదే గ్రామానికి చెందిన ఎద్దుల రాముడు శస్త్రచికిత్స నిమిత్తం రూ. 2.20లక్షల ఎల్ఓసీని ఎమ్మెల్యే అందజేశారు. -
గుండె పగిలిపోయి..
ఒక్కొక్కరుగా ‘పాలమూరు–రంగారెడ్డి’ నిర్వాసితుల మృత్యువాత చనిపోయిన తన భర్త పస్పుల శేఖర్ ఫొటోను చూపిస్తున్న మహిళ పేరు పార్వతమ్మ. వనపర్తి జిల్లా రేవల్లి మండలం బండరాయిపాకుల గ్రామానికి చెందిన ఆ దంపతులకు ముగ్గురు సంతానం. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్లో భాగమైన ఏదుల రిజర్వాయర్ నిర్మాణంలో వీరికి ఉన్న ఎకరం భూమి ముంపునకు గురైంది. ఎకరాకు రూ.3.50 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం అందించింది. రూ.2 చొప్పున వడ్డీ ఇస్తామని నమ్మబలకడంతో శేఖర్ రూ.2 లక్షలను ఓం శ్రీసాయిరాం ఫైనాన్స్ కంపెనీలో జమచేశాడు. ఆరునెలల్లో డబ్బులు తిరిగిస్తామని పత్రం రాసివ్వగా, మూడేళ్లు గడిచినా డబ్బులు ఇవ్వలేదు. పైసలు రావడం లేదన్న బెంగతో 2023 ఆగస్టు 26న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పునరావాసం కింద నిర్మించుకుంటున్న ఇల్లు సైతం డబ్బులు లేక అసంపూర్తిగానే ఉండగా.. పిల్లలను ఎలా పోషించాలో తెలియడం లేదని భార్య పార్వతమ్మ వాపోతోంది. -
ఆందోళన చేపడతాం..
పరిహారం డబ్బుల కోసం ఎదురుచూస్తూ ఇప్పటికే దాదాపు 150 మంది చనిపోయారు. ఆర్అండ్ఆర్ కమిటీ చైర్మన్గా ఉన్న నాగం బుచ్చిరెడ్డి అలియాస్ సురేందర్రెడ్డి ప్రోద్బలంతోనే అందరూ ఓం శ్రీసాయిరాం ఫైనాన్స్లో డబ్బులు పెట్టారు. ఫైనాన్స్ నిర్వాహకుడు సాయిబాబుతో కలిసి పక్కా ప్లాన్తో బోర్డు తిప్పేశాడు. ఫైనాన్స్ కంపెనీ వాళ్లు గ్రామాల వారీగా బాధిత రైతుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి. మాకు పరిహారం చెల్లించకుంటే.. ఆందోళన చేపడతాం. ఆయా నిందితుల ఇంటి వద్ద వాంటావార్పు వంటి కార్యక్రమాలు చేపడతాం. మా బాధను అర్ధం చేసుకోవాలి. – బంగారయ్య, బాధితుడు, బండరాయిపాకుల● -
వంద పడకల ఆస్పత్రి భవనానికి లీకేజీలు
అలంపూర్: కొత్తగా నిర్మించిన ఆస్పత్రి భవనంలో లీకేజీలు స్థానికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి రాకముందే భారీ వర్షాలకు లీకేజీల రూపంలో నీరు దిగువకు రావడంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆస్పత్రిలో సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు లీకేజీలు కనిపించాయి. లీకేజీలతో వర్షపు నీరు లోపల పడుతుండటంతో సిబ్బంది బకెట్లతో నీటిని తోడేశారు. ఇటీవల వంద పడకల ఆస్పత్రిలో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇక్కడ ఓపీ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లీకేజీల ద్వార వర్షపు నీరు లోపలికి చేరుతుంది. దశల వారీగా రెండు భవనాల స్లాబ్లు వేర్వేరుగా వేయగా.. రెండు స్లాబులు కలిసిన చోట కాంట్రాక్టర్ కేవలం ఒక ఇనుప రేకుతో కప్పి వదిలేశాడు. దీంతో లీకేజీ అవుతున్నట్లు అనుమానిస్తున్నారు. శాశ్వత పరిష్కారం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
‘ప్రజావాణి’ ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి
గద్వాల: ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా.. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు నేరుగా కలెక్టర్కు 43 ఫిర్యాదులు అందించారు. వాటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపించి వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం కానిపక్షంలో అందుకు గల కారణాలు వివరిస్తూ సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్నాలెడ్డ్మెంట్ ద్వారా తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 12 అర్జీలు గద్వాల క్రైం: ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్కు మొత్తం 12 అర్జీలు వచ్చాయి. ఎస్పీ శ్రీనివాసరావు ఫిర్యాదుదారుల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుల్లో ప్రధానంగా భూ వివాదం, ఆస్తి తగదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడం లేదని ఇలా 12 మంది ఫిర్యాదులు చేశారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తామని, సివిల్ సమస్యలపై కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. వేరుశనగ క్వింటా రూ.6,389 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు సోమవారం 366 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.6389, కనిష్టం రూ. 3066, సరాసరి రూ.4431 ధరలు లభించాయి. పాఠశాలను సందర్శించిన యూనిసెఫ్ బృందం ధరూరు: మండలంలోని ఉప్పేర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సోమవారం యూనిసెఫ్ బృందం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించడంతోపాటు మరుగుదొడ్లు, మూత్రశాలలు ఎలా ఉన్నాయని బాలికలను అడిగి తెలుసుకున్నారు. మద్యాహ్న భోజనం సమయంలో విద్యార్ధులు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ఆర్ఓ ప్లాంట్ను పరిశీలించారు. కార్యక్రమంలో హెచ్ఎం గౌరిశంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వచ్చేనెల 3న సీఎం రేవంత్రెడ్డి రాక అడ్డాకుల: వచ్చే నెల 3న మూసాపేటకు సీఎం రేవంత్రెడ్డి రానున్నారు. మూసాపేటలో నిర్మాణాలు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు హాజరు కానున్నారు. ఇందులో భాగంగా సోమవారం దేవరకద్రలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి మూసాపేట గ్రామస్తులతో సమావేశమయ్యారు. మూసాపేటలో చివరి దశలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని లబ్ధిదారులకు సూచించారు. వచ్చేనెల ప్రారంభం నాటికి ఇళ్ల పనులను పూర్తి చేస్తే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి సీఎం రేవంత్రెడ్డి ప్రారంభిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. -
ఆయిల్పాం సాగుతో అధిక లాభాలు
అయిజ: రైతులు ఆయిల్పాం తోటలు సాగుచేస్తే ఇతర పండ్ల తోటలకన్నా అధిక లాభాలు గడించవచ్చని, జిల్లా వ్యాప్తంగా ఆయిల్పాం పంటల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారని ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కురవపల్లి గ్రామానికి చెందిన రైతుల పొలంలో జిల్లా ఇన్చార్జ్ శివ నాగిరెడ్డితో కలిసి మెగా ఆయిల్పామ్ కార్యక్రమంలో మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయిల్పాం పంటలో వచ్చే దిగుబడుల గురించి తెలియజేశారు. ఇదివరకే వేసిన ఆయిల్పాం తోటల నుంచి దిగుబడి వస్తున్న గెలలను సేకరించేందుకు వెంకటాపురం సమీపంలో ఏర్పాటు చేస్తున్న కలెక్షన్ సెంటర్ భవనాన్ని పరిశీలించారు. రైతులకు ప్రయోజనకరంగా ఉండేందుకు పూర్తి స్థాయిలో కలెక్షన్ సెంటర్లో అన్ని వసతులు త్వరలో ఏర్పాటు చేయిస్తామని అన్నారు. వేయింగ్ మిషన్ కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఆయిల్పామ్ తోటలకు అవసరమైన పరికరాలు సబ్సిడీ ధరలకు అందజేస్తామని అన్నారు. ఫర్టిలైజర్స్ను కూడా సబ్సిడీ ధరలకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రపోజల్ చేసిందని అన్నారు. ఆయిల్పామ్ పంటలు సాగు చేయాలనుకుంటున్న రైతులు ఆయిల్ఫెడ్ అధికారులకు, ఉద్యానవన శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి మొక్కలను తీసుకోవాలని సూచించారు. ఆయిల్ఫెడ్ మండల ఏరియా ఆఫీసర్ యుగేందర్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాబాలు.. గద్వాల వ్యవసాయం: ఆయిల్పాం సాగుతో అధిక లాభాలు గడించవచ్చని జిల్లా ఉద్యానశాఖాధికారి ఎం.ఏ. అక్బర్ అన్నారు. సోమవారం మండలంలోని జిల్లెడబండలో రైతు ప్రభాకార్రావ్ 13 ఎకరాల్లో మెగా ఆయిల్పాం ప్లాంటేషన్ నిర్వహించారు. ఆయన మొక్కలు నాటారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఆయిల్పాం సాగుకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు అందిస్తోందని చెప్పారు. తక్కువ పెట్టుడితో ఎక్కువ లాభాలు పొందవచ్చునని తెలిపారు. ఆయిల్పాం సాగులో అంతర్ పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. -
ఆయిల్పాం సాగుతో అధిక లాభాలు
అయిజ: రైతులు ఆయిల్పాం తోటలు సాగుచేస్తే ఇతర పండ్ల తోటలకన్నా అధిక లాభాలు గడించవచ్చని, జిల్లా వ్యాప్తంగా ఆయిల్పాం పంటల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారని ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కురవపల్లి గ్రామానికి చెందిన రైతుల పొలంలో జిల్లా ఇన్చార్జ్ శివ నాగిరెడ్డితో కలిసి మెగా ఆయిల్పామ్ కార్యక్రమంలో మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయిల్పాం పంటలో వచ్చే దిగుబడుల గురించి తెలియజేశారు. ఇదివరకే వేసిన ఆయిల్పాం తోటల నుంచి దిగుబడి వస్తున్న గెలలను సేకరించేందుకు వెంకటాపురం సమీపంలో ఏర్పాటు చేస్తున్న కలెక్షన్ సెంటర్ భవనాన్ని పరిశీలించారు. రైతులకు ప్రయోజనకరంగా ఉండేందుకు పూర్తి స్థాయిలో కలెక్షన్ సెంటర్లో అన్ని వసతులు త్వరలో ఏర్పాటు చేయిస్తామని అన్నారు. వేయింగ్ మిషన్ కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఆయిల్పామ్ తోటలకు అవసరమైన పరికరాలు సబ్సిడీ ధరలకు అందజేస్తామని అన్నారు. ఫర్టిలైజర్స్ను కూడా సబ్సిడీ ధరలకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రపోజల్ చేసిందని అన్నారు. ఆయిల్పామ్ పంటలు సాగు చేయాలనుకుంటున్న రైతులు ఆయిల్ఫెడ్ అధికారులకు, ఉద్యానవన శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి మొక్కలను తీసుకోవాలని సూచించారు. ఆయిల్ఫెడ్ మండల ఏరియా ఆఫీసర్ యుగేందర్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాబాలు.. గద్వాల వ్యవసాయం: ఆయిల్పాం సాగుతో అధిక లాభాలు గడించవచ్చని జిల్లా ఉద్యానశాఖాధికారి ఎం.ఏ. అక్బర్ అన్నారు. సోమవారం మండలంలోని జిల్లెడబండలో రైతు ప్రభాకార్రావ్ 13 ఎకరాల్లో మెగా ఆయిల్పాం ప్లాంటేషన్ నిర్వహించారు. ఆయన మొక్కలు నాటారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఆయిల్పాం సాగుకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు అందిస్తోందని చెప్పారు. తక్కువ పెట్టుడితో ఎక్కువ లాభాలు పొందవచ్చునని తెలిపారు. ఆయిల్పాం సాగులో అంతర్ పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. -
కుండపోత వర్షం..
గ్రామాల్లో ఉప్పొంగిన వాగులు, వంకలు ● ఉండవెల్లి మండలంలో 64.5 మి. మీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించాయి. రోడ్డుపై నుంచి వరద నీరు పారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మానవపాడు మండలంలో 11.3 మి.మీ, వడ్డేపల్లిలో 40.5 మి.మీ, రాజోలిలో 30.5 మి. మీ అయిజలో 19.3 మి.మీ వర్షపాతం నమోదు అయ్యాయి. దీంతో ఆయా మండలాల్లోని కొన్ని గ్రామాలు గంటల పాటు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అలంపూర్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉండటంతో తోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అలంపూర్ నియోజకవర్గంలో సోమవారం తెల్లవారుజామున దాదాపు నాలుగు గంటలకుపైగా కుండపోత వర్షం కురిసింది. అలంపూర్ మున్సిపాలిటీలోని అక్బర్పేట కాలనీలో వర్షపు నీరు రోడ్డును ముంచెత్తాయి. సీసీ రోడ్డు నిర్మాణ సమయంలో డ్రైనేజీలు నిర్మించకపోవడంతో ఈ పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తోందని కాలనీ వాసులు అందోళన వ్యక్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని నివాస గృహాల వద్దకు నీళ్లు చేరడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. రోడ్డుపై దాదాపు 3 అడుగులకుపై నీళ్లు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వాగులు ఉగ్రరూపం అలంపూర్ మున్సిపాలిటీకి అతి సమీపంలోని జోగుళాంబ వాగు ఉధృతంగా ప్రవహించింది. మండలంలోని కాశీపురం వాగు ఉగ్రరూపం దాల్చింది. కల్వర్టులు రోడ్డు కంటే తక్కువగా ఉండటంతో పై నుంచి నీళ్లు పరవళ్లు తొక్కాయి. దీంతో ఈ మార్గంలో దాదాపు ఐదు గంటలపాటు రాకపోకలు స్తంభించాయి. గ్రామస్తులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగు ద్వారానే దాటే ప్రయత్నాలు చేశారు. కోనేరు గ్రామ సమీపంలోని వాగు సైతం ప్రమాదకర స్థితితో ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. మండలంలో 71.9 మి.మీ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. ఉధృతంగా ప్రవహించిన వాగులను ఎస్ఐ వెంకటస్వామి, ఎంపీడీఓ పద్మావతి ప్రరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలంపూర్ మున్సిపాలిటీలో లోతట్టు కాలనీలు జలమయం గంటల తరబడి నిలిచిన వాహనాల రాకపోకలు స్తంభించిన జన జీవనం వాగులను పరిశీలించిన అధికారులు -
నులిపురుగుల నివారణతో ఆరోగ్యం
గద్వాల: పిల్లల్లో నులిపురుగులు నివారించి వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆల్బెండజోల్ మాత్రలు ఎంతో ఉపయోగపడతాయని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయన పాల్గొని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ నులిపురుగుల కారణంగా పిల్లల ఎదుగుదలలో ఎన్నో సమస్యలు తలెత్తుతాయన్నారు. వీటి నివారణ కోసం ప్రతిఏటా ప్రభుత్వం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేటి పౌరులే దేశానికి రేపటి వెలుగులని.. అలాంటి పౌరుల ఆరోగ్యం కాపాడటం ప్రతిఒక్కరి బాధ్యత అన్నారు. ప్రతిశుక్రవారం డ్రైడే కార్యక్రమం నిర్వహించి ఆరోగ్య జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. దీంతోపాటు సీజనల్లో వచ్చే డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా విద్యార్థులందరూ ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూనే విద్యపై కూడ శ్రద్ధ వహించాలన్నారు. గతంలో పదో తరగతిలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉండేదని అయితే గతేడాది 10.36శాతం వృద్ధిరేటు సాధించి 91.74శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఈ ఏడాది కూడా మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానం చేయనున్నట్లు తెలిపారు. కార్యమంలో డీఎంహెచ్వో డాక్టర్ సిద్దప్ప, డీడీఎంహెచ్వో డాక్టర్ సంధ్య, వైద్యులు కిర్మయి, రిజ్వాన, పాఠశాల అధ్యపకులు జహీరుద్దీన్, విద్యార్థులు పాల్గొన్నారు. రాఖీకట్టిన బాలసదనం విద్యార్థులు రాఖీపండుగను పురస్కరించుకుని బాలసదనం విద్యార్థులు కలెక్టర్ బీఎం సంతో్ష్కు రాఖీకట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. విద్యార్థుల అభిరుచులను ప్రోత్సహించాలి గద్వాలటౌన్: ఘల్లుఘల్లుమనే గజ్జల సవ్వడితో చిన్నారులు ప్రదర్శించిన నాట్యాంశాలు ప్రేక్షకులను రంజింపజేశాయి. సోమవారం స్థానిక గద్వాల బాలభవన్లో ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘దేశభక్తిని చాటుదాం’ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టకర్ సంతోష్, ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థుల నాట్యాంశాలను తిలకించారు. ప్రతిభ చాటిన విద్యార్థుళకు ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ చిన్నారులలో అంతర్గతంగా దాగిఉన్న ప్రతిభను ప్రోత్సహించాలని, అప్పుడే వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారన్నారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో రాణించాలని సూచించారు. సమాజాన్ని చైతన్య పర్చేలా సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందించాలన్నారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసానాల బారినపడ కుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థి దశ నుంచే దేశభక్తి, క్రమశిక్షణ కలిగి ఉండాలన్నారు. త్వరలోనే అన్ని హంగులతో కూడిన ఆడిటోరియాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఐఈఓ హృదయరాజు, ఎంఈఓ శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆల్బెండజోల్ మాత్రల పంపిణీలో కలెక్టర్ బీఎం సంతోష్ -
చికిత్సకు డబ్బులు లేక అమ్మ చనిపోయింది..
మా తల్లిదండ్రుల పేరిట ఉన్న 8 ఎకరాలు మొత్తం ప్రాజెక్ట్లోనే పోయింది. పరిహారం కింద వచ్చిన డబ్బులను మా తల్లిదండ్రుల పేరిట రూ.10 లక్షలు, నా పేరిట మరో రూ.2 లక్షలు ఫైనాన్స్ కంపెనీలో జమచేశాం. 2019లో డబ్బులు జమచేస్తే నాలుగేళ్లయినా తిరిగి ఇవ్వలేదు. మా అమ్మ లక్ష్మమ్మకు పక్షవాతం వస్తే, చికిత్స చేయించేందుకు కూడా డబ్బులు లేకపోవడంతో ఏడాది కిందట చనిపోయింది. జీవనాధారమైన భూములు కోల్పోయి, డబ్బులు పోగొట్టుకుని అరిగోస పడుతున్నాం. – అలివేలు, బండరాయిపాకుల, రేవల్లి, వనపర్తి ● -
కుండపోత వర్షం..
గ్రామాల్లో ఉప్పొంగిన వాగులు, వంకలు ● అలంపూర్ మున్సిపాలిటీలో లోతట్టు కాలనీలు జలమయం ● గంటల తరబడి నిలిచిన వాహనాల రాకపోకలు ● స్తంభించిన జన జీవనం ● వాగులను పరిశీలించిన అధికారులు అలంపూర్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉండటంతో తోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అలంపూర్ నియోజకవర్గంలో సోమవారం తెల్లవారుజామున దాదాపు నాలుగు గంటలకుపైగా కుండపోత వర్షం కురిసింది. అలంపూర్ మున్సిపాలిటీలోని అక్బర్పేట కాలనీలో వర్షపు నీరు రోడ్డును ముంచెత్తాయి. సీసీ రోడ్డు నిర్మాణ సమయంలో డ్రైనేజీలు నిర్మించకపోవడంతో ఈ పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తోందని కాలనీ వాసులు అందోళన వ్యక్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని నివాస గృహాల వద్దకు నీళ్లు చేరడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. రోడ్డుపై దాదాపు 3 అడుగులకుపై నీళ్లు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వాగులు ఉగ్రరూపం అలంపూర్ మున్సిపాలిటీకి అతి సమీపంలోని జోగుళాంబ వాగు ఉధృతంగా ప్రవహించింది. మండలంలోని కాశీపురం వాగు ఉగ్రరూపం దాల్చింది. కల్వర్టులు రోడ్డు కంటే తక్కువగా ఉండటంతో పై నుంచి నీళ్లు పరవళ్లు తొక్కాయి. దీంతో ఈ మార్గంలో దాదాపు ఐదు గంటలపాటు రాకపోకలు స్తంభించాయి. గ్రామస్తులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగు ద్వారానే దాటే ప్రయత్నాలు చేశారు. కోనేరు గ్రామ సమీపంలోని వాగు సైతం ప్రమాదకర స్థితితో ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. మండలంలో 71.9 మి.మీ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. ఉధృతంగా ప్రవహించిన వాగులను ఎస్ఐ వెంకటస్వామి, ఎంపీడీఓ పద్మావతి ప్రరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉండవెల్లి మండలంలో 64.5 మి. మీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించాయి. రోడ్డుపై నుంచి వరద నీరు పారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మానవపాడు మండలంలో 11.3 మి.మీ, వడ్డేపల్లిలో 40.5 మి.మీ, రాజోలిలో 30.5 మి. మీ అయిజలో 19.3 మి.మీ వర్షపాతం నమోదు అయ్యాయి. దీంతో ఆయా మండలాల్లోని కొన్ని గ్రామాలు గంటల పాటు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. -
ఆటల్లేవ్.. పోటీల్లేవ్ !
ఇక్కడ చిత్రంలో పెద్ద పెద్ద అక్షరాలతో ‘క్రీడా ప్రాంగణం’ అని కనిపిస్తుంది కదా ఇది రాయాపురం గ్రామంలోనిది. కానీ, అక్కడ బోర్డు తప్పా మైదానం లేదు. పైగా బోర్డు నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే నూతన పశువైద్యశాల భవనం కనిపిస్తుంది. అక్కడ పశువైద్య శాలనే కొనసాగుతోంది. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల పక్కనే అప్పట్లో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. పాఠశాల గేటు ముందు కేవలం క్రీడా ప్రాంగణం బోర్డును మాత్రమే పెట్టి వదిలేశారు. ఆటలు ఆడుకునేందుకుకు ఖాళీగా ఉన్న స్థలం చుట్టూ ఎలాంటి హద్దురాళ్లను ఏర్పాటు చేయలేదు. కేవలం క్రీడా ప్రాంగణం బోర్డును మాత్రమే పెట్టి వదిలేశారు. ఆ స్థలం పక్కనే కొత్తగా పశువైద్యశాల భవనం నిర్మించారు. ముందు చూస్తే క్రీడాప్రాంగణం బోర్డు.. లోపల పశువైద్యశాల భవనమా అంటూ చూసే వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది కొత్తగా చూసే వారికి కాస్త వింతగా అన్పించినా.. జిల్లాలో చాలామటుకు క్రీడా ప్రాంగణాల పరిస్థితి ఇలాగే నిరుపయోగంగా మారాయి. గట్టు: మట్టిలో మాణిక్యాల్లాంటి గ్రామీణ క్రీడాకారులకు గుర్తింపు తీసుకువచ్చేందుకు గత ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేసింది. అయితే వీటి నిర్వహణ మాత్రం అధ్వాన్నంగా తయారైంది. ఈ క్రీడా ప్రాంగణాలు కేవలం గ్రామాల్లో అలంకారప్రాయంగా మారాయి. కేవలం వీటికి బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకొన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రీడా ప్రాంగణాల్లో కనీస సౌకర్యాలను కూడా కల్పించకుండా వదిలేశారు. కొన్ని చోట్ల కనీసం ఆటలు ఆడుకునేందుకు భూమిని కూడా చదును చేయకుండా వదిలేశారు. వీటిలో ఇప్పటికి ఆటలు ఆడుకునేందుకు అనువుగా పరిస్థితులు లేకపోవడం గమనార్హం. పేరుకే ఇవి క్రీడా ప్రాంగణాలు. ఏ ఒక్క రోజు కూడా వీటిలో క్రీడలను నిర్వహించిన దాఖలాలు లేవు. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా 280 క్రీడా ప్రాంగణాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నట్లుగా అధికారుల లెక్కల ద్వారా తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా పోటీలను నిర్వహించుకునేందుకు అనువుగా వీటిని ఏర్పాటు చేశారు. ఉపయోగంలోకి తేవాలి గత ప్రభుత్వం గ్రామాల్లో నిర్మించిన క్రీడాప్రాంగణాల్లో మౌలిక వసతులను కల్పించి, ఆటలు అడుకునేందుకు వీలుగా సిద్ధం చేయాలి. ప్రభుత్వం ప్రతి ఏటా గ్రామీణ, మండల స్థాయిల్లో క్రీడలను నిర్వహించి ప్రతిభావంతులను గుర్తించి, వారికి సరైన ప్రోత్సాహాలను అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పల్లెల్లో కొత్తగా నిర్మించిన క్రీడా ప్రాంగణాలను ఉపయోగంలోకి తీసుకురావాలి. – రామకృష్ణ, ఆలూరు సౌకర్యాలు కల్పించాలి గ్రామాల్లో నిర్మించిన క్రీడా ప్రాంగణాల్లో సౌకర్యాలు కల్పించాలి. విద్యార్థులు, యువకులు ఈ క్రీడాప్రాంగణాల్లో క్రీడలు ఆడుకునే విధంగా అధికార యాంత్రాంగం చర్యలు తీసుకోవాలి. చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి. క్రీడా ప్రాంగణాల్లో క్రీడలను నిర్వహించడం ద్వారా ప్రతిభ కల్గిన గ్రామీణ క్రీడాకారులను గుర్తించవచ్చు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి. – సాయి, గట్టు ఊరికి దూరంగా.. క్రీడల పట్ల ఆసక్తిని కల్గించి, ప్రతిభ ఉన్న గ్రామీణ క్రీడాకారులను గుర్తించేందుకు వీలుగా ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణాలు ప్రస్తుతం నిరూపయోగంగా మారాయి. గ్రామాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను అధికారులు గుర్తించి, క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ క్రీడా ప్రాంగణాలు కొన్ని గ్రామాలకు దూరంగా ఉండడంతో పాటుగా క్రీడా ప్రాంగణాల్లో సరైన వసతులు లేక ఆటలు ఆడుకోవడం లేదు. యువత కూడా ఈ మైదానాల్లో ఆడుకునేందుకు ఇష్టపడడం లేదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా 296 క్రీడాప్రాంగణాలను మంజూరు చేయగా.. అందులో 280 పూర్తి చేసుకున్నట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. మరో 16 చోట్ల అడ్డంకులు ఏర్పడ్డాయి. అయితే క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేసిన చోట ప్రవేశ ద్వారాల దగ్గర పెద్ద సైజులో బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. కానీ, ఇక్కడ ఇప్పటి దాకా ఏ క్రీడా పోటీలను నిర్వహించిన దాఖలాలు లేవు. కనీసం ఆటలు ఆడుకునేందుకు అనుకూలంగా క్రీడామైదానాలను కూడా సిద్దం చేయకుండా అసంపూర్తిగా వదిలేశారు. ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన క్రీడాప్రాంగణాలు ఎందుకు పనికి రాకుండా పోయాయి. ఇప్పటికై నా అధికార యంత్రాంగం నిరుపయోగంగా ఉన్న క్రీడా ప్రాంగణాలను ఉపయోగంలోకి తీసుకురావాలని క్రీడాభిమానులు కోరుతున్నారు. జిల్లావ్యాప్తంగా నిరుపయోగంగా క్రీడా ప్రాంగణాలు ఆటలకు అనువుగా లేనిక్రీడా మైదానాలు.. నిర్వహణ కరువు జిల్లా వ్యాప్తంగా 296కుగాను 280 క్రీడా మైదానాల ఏర్పాటు -
‘నులి’పేద్దాం..
గద్వాల క్రైం: ఆటపాటలతో ఉల్లాసంగా గడపాల్సిన చిన్నారుల పాలిట శాపంగా మారుతున్నాయి నులిపురుగులు. పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. తరచూ అనారోగ్యం, అలసటతో బాధపడుతున్నారు. దీంతో నులిపురుగుల నివారణే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో 1 –19 సంవత్సరాలలోపు ఉన్న బాల బాలికలకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీని సోమవారం ప్రారంభించనున్నారు. ఈమేరకు జిల్లాలో 1,71,354 మందిని గుర్తించారు. ప్రతి ఆంగన్వాడీ, పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఈ మాత్రల పంపిణీ చేయనున్నారు. కలుషిత ఆహారమే కారణం.. నులిపురుగులతో బాధపడేవారు ప్రధానంగా ఎనిమియా (రక్తహీనత) వ్యాధి బారినపడతారు. శరీరంలో పదేపదే నీరసం వస్తూ నీరసించిపోతారు. శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. ఆకలి మందగించి జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. పిల్లలు మందబుద్ధిగా తయారవుతారు. మలవిసర్జన ప్రదేశంలో, చర్మంపై దురదలు వస్తుంటాయి. కొందరు పిల్లల్లో దీర్ఘకాలంపాటు ఇవి ఉన్నప్పటికి వ్యాధి లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ, ఈ సమస్య వారి ఆరోగ్యం, విద్య ఇలా అన్ని రకాల ఎదుగుదలపై ప్రభావితం చూపుతాయి. నులిపురుగుల ఎక్కువగా ఉంటే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. మల విసర్జన, బహిర్భూమికి వెళ్లివచ్చాక కాళ్లు, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పాదాలకు బూట్లు తప్పనిసరిగా ధరించాలి. దీంతోపాటు ఆహార పదార్థాలను శుభ్రంగా కడగాలి. ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం వల్ల నులిపురుగులు రాకుండా నియంత్రించవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలకు, యువకులకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని వైద్యాధికారులు చెబుతున్నారు. దీంతో సంక్రమణాన్ని నియంత్రించడంతోపాటు శారీరక, మానసిక అభివృద్ధికి దోహదపడుతుందని సూచిస్తున్నారు. నులి పురుగుల నిర్మూలన కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాం. చిన్నారుల ఆరోగ్య సంరక్షణ దిశగా ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేస్తున్నాం. పలు జాగ్రత్తలు తీసుకుంటే నులిపురుగుల బారిన పడకుండా పిల్లలను కాపాడుకోవచ్చు. మల విసర్జన తర్వాత, భోజనానికి ముందు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి. గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. పరిశుభ్రమైన నీటిని తాగాలి. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. వ్యక్తిగత శుభ్రత పిల్లలకు వివరించాలి. – సిద్దప్ప, జిల్లా ఇన్చార్జ్ వైద్యాధికారి మాత్రల డోస్ ఇలా.. ● ఏడాది నుంచి రెండేళ్లలోపు చిన్నారులకు సగం మాత్రను పొడి చేసి పాల ద్వారా, నీళ్ల ద్వారా వేయాలి. ● 2 నుంచి 3 ఏళ్లలోపు పిల్లలకు ఒక మాత్రను పొడి చేసి నీళ్ల ద్వారా మింగించాలి. ● 3 నుంచి 19 ఏళ్లలోపు వారు మధ్యాహ్న భోజనం తర్వాత మాత్రను నమిలి మింగించాలి. ● ఇది నేరుగా మింగే మాత్ర కాదు. నోట్లో వేసుకుని చప్పరించిన లేదా నులిమి మింగినా సరిపోతుంది. 19 ఏళ్లలోపు వారికి ఆల్బెండజోల్ మాత్రల పంపిణీకి ఏర్పాట్లు జిల్లాలో 1.71 లక్షల మంది బాలల గుర్తింపు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నేడు జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం -
కేఎల్ఐ.. రికార్డు బ్రేక్!
ఈ ఏడాది ఇప్పటికే 4 టీఎంసీలు పంపింగ్ ● గత సీజన్లో 50 టీఎంసీల నీటి ఎత్తిపోతలు ● మూడు మోటార్లతోనే కొనసాగుతున్న లిఫ్టింగ్ ● భారం పడుతున్నా.. తప్పడం లేదంటున్న అధికారులు కొల్లాపూర్: జిల్లా వరప్రదాయిని కేఎల్ఐ ప్రాజెక్టు నీటి ఎత్తిపోతల్లో రికార్డు సృష్టిస్తోంది. కృష్ణానదికి వరద ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే 4 టీఎంసీల నీటిని ఎత్తిపోసి గత రికార్డుకు బ్రేక్ వేసింది. 2011లో కేఎల్ఐ ద్వారా ఎత్తిపోతలు ప్రారంభం కాగా.. నాటి నుంచి అవిశ్రాంతంగా మోటార్లు పనిచేస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం ప్రాజెక్టు మొదటి పంపుహౌజ్లో రెండు మోటార్లు పాడయ్యాయి. మిగిలిన మూడు మోటార్లతోనే నీటిని ఎత్తిపోస్తూ ప్రాజెక్టు అధికారులు రికార్డు సృష్టిస్తున్నారు. పనితీరు ఇలా.. కేఎల్ఐ పరిధిలో ఎల్లూరు, జొన్నల బొగుడ, గుడిపల్లి గట్టు పంప్హౌజ్లు ఉన్నాయి. ఒక్కో పంపుహౌజ్లో 5 మోటార్ల చొప్పున ఏర్పాటుచేశారు. వీటిలో 4 మోటార్లు రెగ్యులర్ పంపింగ్ కోసం, ఒక మోటార్ స్పేర్లో ఉంచేందుకు నిర్ణయించారు. 30 మెగావాట్ల సామర్థ్యం గల ఒక్కో మోటార్ ద్వారా రోజూ 800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తారు. కేఎల్ఐ ద్వారా కొల్లాపూర్, నాగర్కర్నూల్, వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని ఆయకట్టు భూములకు సాగునీరు అందుతోంది. మోటార్లపై భారం.. ఎల్లూరు పంప్హౌజ్లో ఐదు మోటార్లకు గాను ప్రస్తుతం మూడు మోటార్లు మాత్రమే పనిచేస్తున్నాయి. 2011లో కేఎల్ఐ ద్వారా నీటి ఎత్తిపోతలు ప్రారంమైన సమయంలో ఐదు మోటార్ల ద్వారా 0.0086 టీఎంసీ నీటిని మాత్రమే ఎత్తిపోశారు. 2015 వరకు ప్రతి సంవత్సరం 2.5 టీఎంసీల లోపు మాత్రమే ఎత్తిపోతలు జరిగాయి.మూడు మోటార్ల తోనే రికార్డుస్థాయిలో పంపింగ్ జరుగుతోంది. సాగు, తాగునీటికి కేఎల్ఐ ప్రాజెక్టే దిక్కవడంతో మోటార్లపై పంపింగ్ భారం పెరుగుతోంది. నీటి పంపింగ్ రికార్డుస్థాయిలో జరుగుతోందని ఓవైపు ఆనందపడుతున్న అధికారులు.. మరో వైపు మోటార్లపై భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథకు సైతం.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలోని పలు మండలాలకు తాగునీరు అందించేందుకు ఏర్పాటుచేసిన మిషన్ భగీరథ పథకానికి కూడా కేఎల్ఐ ద్వారానే నీటి ఎత్తిపోతలు సాగుతున్నాయి. ఎల్లూరు సమీపంలోనే మిషన్ భగీరథ స్కీం ఏర్పాటుచేశారు. ఇక్కడి నుంచే అన్ని ప్రాంతాలకు తాగునీరు సరఫరా అవుతోంది. ప్రతి సంవత్సరం మిషన్ భగీరథ కోసం 7 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు. రెగ్యులర్గా పంపింగ్.. వర్షాకాలంలో మినహాయిస్తే మిగతా రోజుల్లో ఎల్లూరు పంప్హౌజ్ లోని మూడు మోటార్ల ద్వారా రెగ్యులర్గా నీటిని పంపింగ్ చేస్తు న్నాం. సాగునీటితో పాటు, మిషన్ భగీరథకు కూడా నీటిని ఎత్తిపోస్తున్నాం. దీంతో మోటార్లపై భారం పడుతోంది. అయినా తప్పడం లేదు. పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఎత్తిపో తలు ప్రారంభమైతే కేఎల్ఐపై భారం తగ్గు తుంది. ఈ ఏడాది జూన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 4 టీఎంసీల నీటిని ఎత్తిపోశాం. గతేడాది 50 టీఎంసీల నీటిని ఎత్తిపోశాం. – లోకిలాల్ నాయక్, డీఈ, పంపుహౌజ్ నిర్వహణ విభాగం -
ఎట్టకేలకు..!
జూరాలలో 3వ యూనిట్ వినియోగంలోకి అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం ఎగువ విద్యుదుత్పత్తి కేంద్రంలో రెండేళ్ల కిందట మరమ్మతుకు గురైన 3వ యూనిట్ను జెన్కో అధికారులు బాగు చేయించారు. ఆదివారం తెల్లవారుజామున ప్రారంభించే సమయంలో వాటికి సంబంధించిన బ్లాక్ పూడుకుపోవడంతో క్రేన్లను రప్పించి వాటి సాయంతో బ్లాక్ను పైకెత్తడంతో ప్రాజెక్టు రహదారిపై వాహనాల రాకపోకలు మూడు గంటల పాటు నిలిచిపోయాయి. దీంతో జూరాల క్రస్ట్ గేట్లకు సంబంధించిన రోప్లు మొరాయించడంతో క్రేన్ల సాయంతో పైకెత్తుతున్నారన్న సమాచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. జూరాలకు మళ్లీ సమస్య తలెత్తిందా.. ప్రాజెక్టు భద్రమేనా అనే విషయాలను పరిసర గ్రామాల ప్రజలు చర్చించుకోవడం కనిపించింది. సమస్య క్రస్ట్ గేట్లదు కాదని.. జెనన్కో సమస్య అంటూ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ● జూరాల ఎగువ జల విద్యుదుత్పత్తి కేంద్రంలోని ఆరు యూనిట్లకు 12 గేట్ల ద్వారా నీటిని సరఫరా చేస్తారు. వరద నిలిచిపోతే గేట్లు మూసివేస్తారు. వీటి కి సంబంధించిన గేట్ల రోప్లు అప్పుడప్పుడు మొ రాయించడం సాధారమేనని, వీటితో ఎలాంటి ప్ర మాదం ఉండదని జెన్కో సిబ్బంది వెల్లడిస్తున్నారు. రెండేళ్ల కిందట.. జూరాల ఎగువ జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ఆరు యూనిట్లకుగాను మూడో యూనిట్కు సంబంధించిన టర్బైన్ రెండేళ్ల కిందట కాలిపోయింది. మరమ్మతుకుగాను జెన్కో అధికారులు టెండర్లు ఆహ్వానించగా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ అలస్యంగా చేపట్టారు. ప్రస్తుతం మరమ్మతులు పూర్తవడంతో అధికారులు విద్యుదుత్పత్తి చేపట్టేందుకు సిద్ధమయ్యారు. 3వ యూనిట్కు నీటిని సరఫరా చేసే బ్లాక్ బురదలో ఇరుక్కొని పైకెత్తేందుకు మొరాయించడంతో అధికారులు కర్ణాటక నుంచి అధునాతన క్రేన్లను రప్పించి వాటి సాయంతో పనులు పూర్తి చేశారు. భారీగా నిలిచిన వాహనాలు జూరాల హైడల్ పవర్ ప్రాజెక్టు 3వ యూనిట్ బ్లాక్ను పైకెత్తే సమయంలో జెన్కో అధికారులు ఆనకట్టపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. దీంతో తెల్లవారుజామున 5 నుంచి ఉదయం 8 వరకు మరమ్మతులు భారీ క్రేన్ల సాయంతో చేపట్టడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రాజెక్టుపై తాగేందుకు కనీసం నీరు సైతం లభించలేదు. ఎలాంటి సమాచారం లేకుండా రాకపోకలు నిలిపివేయడం ఏమిటని అధికారులను ప్రశ్నించినా సమస్యను వినేవారే కరువయ్యారు. జూరాల జలాశయం క్రస్ట్గేట్ల రోప్లు మొరాయిస్తున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన వార్త అవాస్తవం. విద్యుదుత్పత్తి కోసం ఆరు బ్లాక్లకు నీటిని వదులుతున్నాం. వాటికి సంబంధించిన వ్యవహారం జెన్కో అధికారులే పర్యవేక్షిస్తారు. ప్రాజెక్టు 64 క్రస్ట్గేట్ల రోప్లు బాగానే ఉన్నాయి. ఎలాంటి ముప్పులేదు. – ఖాజా జుబేర్ అహ్మద్, ప్రాజెక్టు ఈఈ, గద్వాల రెండేళ్ల కిందట మరమ్మతుకు గురైన 3వ యూనిట్ టర్బైన్ను మరమ్మతుల తర్వాత ఆదివారం ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నాం. ఇందుకు సంబంధించిన బ్లాక్ బురదలో పూడుకుపోవడంతో రోప్ ద్వారా సాధ్యం కాకపోవడంతో క్రేన్ల సాయంతో పైకెత్తాం. అంతేగాని రోప్లు తెగిపోయాయనే మాట ల్లో వాస్తవం లేదు. – పవన్కుమార్, డీఈ, జెన్కో జూరాల జలాశయంపై వాహనాల రద్దీ -
అయ్యో.. తల్లీ
● ఆటో నుంచి జారిపడి మహిళ మృతి ● కూతురితో కుమారుడికి రాఖీ కట్టించి వస్తుండగా ఘటన ఎర్రవల్లి: రాఖీ పండుగ నేపథ్యంలో హాస్టల్లో ఉంటున్న కూతురి వద్దకు కుమారుడిని తీసుకెళ్లి రాఖీ కట్టించింది ఆ తల్లి. తిరిగి కుమారుడితో కలిసి స్వగ్రామానికి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఆటోలో నుంచి జారిపడి మృతిచెందింది. ఈ విషాదకర సంఘటన జాతీయ రహదారిపై వేముల స్టేజీ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని పల్లెపాడు గ్రామానికి చెందిన వడ్డె సుజాత(35) తన కుమారుడు వెంకటేష్తో కలిసి ఎర్రవల్లిలోని కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న తన కుమార్తె వద్దకు వెళ్లి కుమారుడికి రాఖీ కట్టించింది. అనంతరం కుమారుడితో కలిసి ఆటోలో స్వగ్రామానికి బయలుదేరింది. ఈ క్రమంలో జాతీయ రహదారిపై వేముల స్టేజీ సమీపంలోకి వచ్చే సరికి వారి బ్యాగ్ కింద పడుతుండటంతో దానిని పట్టుకునేందుకు ప్రయత్నించిన సుజాత ఆటో నుంచి జారి రోడ్డుపై పడింది. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. ఇదిలా ఉండగా.. ప్రమాద సమయంలో ఆటోలో ఉన్న ప్రయాణికులంతా ఒక పక్కకు ఒరగడంతో ఆటో కూడా రోడ్డుపై బోల్తా పడింది. సుజాత కుమారుడితోపాటు ఆటోలోని వారంతా గాయాలతో బయటపడ్డారు. కాగా.. సుజాత ఆదివారం ఉదయమే తన పుట్టినింటికి సైతం వెళ్లి సోదరుడికి రాఖీ కట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం ఎంతో ఆనందంగా ఇంటికి వచ్చిన సోదరి అంతలోనే విగతజీవిగా మారడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
భక్తిశ్రద్ధలతో నూలు పౌర్ణమి వేడుకలు
గద్వాలటౌన్: పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని భక్త మార్కండేయస్వామి ఆలయంలో రాఖీ పౌర్ణమి, నూలు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం 7గంటల నుంచి పలు పూజా కార్యక్రమాలు చేపట్టారు. గణపతి హోమం, యజ్ఞోపహితధారణ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. అనంతరం వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికీ రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. పద్మశాలీలు జంద్యం ధరించారు. అనంతరం రథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా చేపట్టారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం నాయకులు అఖండ భజన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు పులిపాటి వెంకటేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఇంటింటా వెల్లివిరిసిన ఆత్మీయ బంధం
● ఘనంగా రాఖీ వేడుకలు గద్వాలటౌన్: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలచిన రాఖీ పౌర్ణమిని శనివారం జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. సోదరీమణులు తమ సోదరులకు నుదుట కుంకుమ పెట్టి రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. దూర ప్రాంతాల నుంచి సైతం వచ్చి మహిళలు తమ సోదరులకు రాఖీలు కట్టారు. కొందరు మహిళలు కొరియర్, పోస్టల్ ద్వారా తమ సోదరులకు రాఖీలు పంపారు. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. నేను నీకు రక్షా.. నీవు నాకు రక్షా.. మనిద్దరం దేశానికి రక్షా అంటూ రాఖీ వేడుకలు చేపట్టారు. ప్రజాపిత బ్రహ్మకుమారీలు పలువురు రాజకీయ నాయకుల ఇళ్లకు వెళ్లి రాఖీలు కట్టారు. జిల్లాలో వివిధ పార్టీల నాయకులు రాఖీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డికి పలువురు మహిళలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. శనేశ్వరుడికి తైలాభిషేకాలు బిజినేపల్లి: నందివడ్డెమాన్ జైష్ఠ్యాదేవి సమేత శనేశ్వరుడికి శనివారం ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు శనేశ్వరాలయాన్ని సందర్శించి తమ ఏలినాటి శనిదోష నివారణ కోసం స్వామివారికి తిల తైలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మసూత్ర పరమశివుడిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ చైర్మన్ గోపాల్రావు, ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి, కమిటీ సభ్యులు రాజేశ్, ప్రభాకరాచారి, పుల్లయ్య, వీరశేఖర్, అర్చకులు శాంతికుమార్, ఉమ్మయ్య పాల్గొన్నారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించండి కందనూలు: అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్రెడ్డి, ప్రధాన కార్యదర్శి సదానందంగౌడ్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవనంలో జిల్లా అధ్యక్షుడు మురళి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. పదోన్నతులతో పాటు బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని కోరారు. 317 జీఓ బాధితుల సమస్యలను పరిష్కరించడంతో పాటు అక్రమ డిప్యూటేషన్లు రద్దు చేయాలన్నారు. హెల్త్ కార్డులు అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలయ్యే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. మధ్యాహ్న భోజన బిల్లులు ప్రతినెలా క్రమం తప్పకుండా విడుదల చేయాలని కోరారు. సమావేశంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్రావు, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఈశ్వర్, కార్యదర్శి రమేశ్, ఉపాధ్యక్షుడు లక్ష్మణరావు, జిల్లా మాజీ అధ్యక్షుడు సుదర్శన్ ఉన్నారు. -
దంచికొట్టిన వాన
జిల్లాలోని పలు మండలాల్లో శుక్ర, శనివారం వాన దంచికొట్టింది. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత జిల్లాలో ఇంతటి భారీ వర్షం కురవడం ఇదే తొలిసారి. వానాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా పెద్దగా వానలు లేక రైతులు ఇబ్బంది పడుతూ వచ్చారు. జిల్లాలో ఇప్పటికే దాదాపు 1.2 లక్షల ఎకరాల్లో పంటలు వేసినా.. వరుణుడి జాడ మాత్రం కరువైంది. చేసేది లేక వర్షాల కోసం పలు గ్రామాల్లో పూజలు సైతం చేశారు. ఎట్టకేలకు వరుణుడు కరుణించడంతో ఎండుదశకు చేరిన పంటలకు ఊపిరిపోసినట్లయ్యింది. ఇదిలాఉండగా, శనివారం ప్రధానంగా అలంపూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురవడంతో పంట పొలాలు నీటమునిగాయి. అలంపూర్, అయిజ, శాంతినగర్, ఉండవెల్లి, గట్టు, ఇతర మండలాల్లో వాగులు వంకలు పొంగి పొర్లాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. – సాక్షి నెట్వర్క్ -
కనులపండువగా కల్యాణోత్సవం
మల్దకల్ : ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం స్వామి వారి కల్యాణోత్సవం కనులపండువగా జరిగింది. ఆలయంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా వేదపండితులు రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారి వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారి ఉత్సవమూర్తులకు కల్యాణం నిర్వహించారు. ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామి వారి రథోత్సవం ప్రతి ఏటా రాఖీపౌర్ణమి రోజున స్వామి వారి ఆలయంలో రథోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగానే రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు అరవిందరావు, బాబురావు, చంద్రశేఖర్రావు, అర్చకులు రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారి, దామరామక్రిష్ణ, దామ భీమరాయుడు, దామగోవిందప్ప, దామమురళీఽ, దామ లక్ష్మీనారాయణ, భక్తులు, వాల్మీకి పూజారులు తిరుమల్, గోవిందు, దాతలు దామ శంకరయ్య పార్వతమ్మ పాల్గొన్నారు. -
ఔత్సాహికులకు వరం.. వాలీబాల్ అకాడమీ
మహబూబ్నగర్ క్రీడలు: ఔత్సాహిక వాలీబాల్ క్రీడాకారులను ప్రోత్సహించడానికి 2004లో రాష్ట్ర క్రీడాపాధికారిక సంస్థ జిల్లాకు వాలీబాల్ అకాడమీ మంజూరు చేసింది. అకాడమీ నడిచిన నాలుగేళ్లలో జిల్లా క్రీడాకారులు ఎంతో ప్రతిభ కనబరిచేవారు. అప్పట్లో ఈ వాలీబాల్ అకాడమీ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది. వాలీబాల్ అకాడమీలో శిక్షణ పొందిన జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులుగా ఎదిగారు. అయితే నిధుల నిర్వహణ భారంతో 2008 సంవత్సరంలో వాలీబాల్ అకాడమీని మూసివేశారు. అయితే స్థానిక ప్రజాప్రతినిధుల కృషి, అధికారుల చొరవతో మరోసారి వాలీబాల్ అకాడమీ ఏర్పాటై.. పూర్వవైభవం సంతరించుకునే దిశగా ముందుకు సాగుతోంది. అధునాతన సౌకర్యాలతో.. మహబూబ్నగర్లోని మెయిన్ స్టేడియంలో నూతన వాలీబాల్ అకాడమీ రూ.19.70 లక్షల నిధులతో ఏర్పాటు చేశారు. స్టేడియంలోని రెండు పాత వాలీబాల్ కోర్టులను ఆధునీకరించి వాటి స్థానంలో నూతన కోర్టులు నిర్మించారు. కోర్టుల చుట్టూ నాలుగు ఫ్లడ్లైట్లు, ప్రత్యేక షెడ్లు, గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జూన్ 12న వాలీబాల్లో అకాడమీలో ప్రవేశాల కోసం సెలక్షన్స్ నిర్వహించగా.. రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి బాల, బాలికలు హాజరయ్యారు. అకాడమీలో 32 మంది బాలురు, బాలికలు ప్రవేశాలు పొందారు. స్విమ్మింగ్పూల్ అంతస్తులో బాలురకు, ఇండోర్ స్టేడియంలో బాలికలకు వసతి ఏర్పాటు చేశారు. అదేవిధంగా భోజన వసతి కల్పించారు. క్రీడాకారులకు మెరుగైన శిక్షణ వాలీబాల్ అకాడమీలో ప్రవేశాలు పొందిన బాల, బాలికలకు మెరుగైన శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఒక కోచ్ ఉండగా త్వరలో మరో కోచ్ రానున్నారు. కోచ్ పర్వేజ్పాషా క్రీడాకారులకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఉదయం వేళలో రిక్రియేషన్ గేమ్, స్టెచ్చింగ్ ఫ్లెక్సిబిలిటీ, గ్రౌండ్ మూమెంట్, బాల్ డ్రిల్స్, సా యంత్రం బ్లాకింగ్, అటాకింగ్ డ్రిల్స్, బాల్ ప్రాక్టిస్పై శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రతి శుక్రవారం ఐదు సెట్ల మ్యాచ్ ఆడిపిస్తున్నారు. మహబూబ్నగర్లో నూతన వాలీబాల్ స్టేడియం ఏర్పాటు శిక్షణ పొందుతున్న వివిధ జిల్లాల క్రీడాకారులు బాల, బాలికలకు మెరుగైన వసతి సౌకర్యాలు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక శిక్షణ అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యంగా ముందుకు.. -
వైద్య సేవలపై ఆరా..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రాష్ట్ర బృందం విస్తృత తనిఖీ ●గద్వాల క్రైం: ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఉంచింది. రోగులతో వైద్య సిబ్భంది అనుసరిస్తున్న విధానం, వారికి అందిస్తున్న చికిత్స, మందులు పూర్తి వివరాలను తెలుసుకునే పనిలో పడింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారా.. మెరుగైన వైద్యం అందిస్తున్నారా.. ఏమేం మార్పులు చేస్తే బాగుంటుంది మొత్తంగా వైద్యశాఖలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అలాగే, ప్రైవేట్ ఆస్పత్రులు అనుమతులు పొందారా.. అర్హులైన వైద్యులు, టెక్నీషియన్లు ఉన్నారా.. ఫీజులు ఎంత వసూలు చేస్తున్నారు పూర్తి వివరాలతో నివేదికలు కోరారు. తాజాగా ఈ నెల 2వ తేదీన రాష్ట్ర మానిటరింగ్ అధికారి ఐఏఎస్ ఫణీందర్రెడ్డి బృందం జిల్లా ఆసుపత్రి, పీహెచ్సీలు, ప్రైవేటు ఆస్పత్రులను సందర్శించింది. రోగులకు అందుతున్న సేవలు, రికార్డులు, మందుల వివరాలు, అనుమతులపై వాకబు చేశారు. పీహెచ్సీలో సేవలపై.. జిల్లా ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు రోగులకు అందించిన సేవలు, వివరాలపై బృందం సభ్యులు నివేదికలు కోరారు. గర్భిణులకు అందుతున్న సేవలు, సాధారణ డెలివరీలు, శస్త్ర చికిత్సలు, మెరుగైన చికిత్సల కోసం వైద్యులు సిఫార్సు వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న వైద్యుల జాబితా, విధులకు హాజరు మేరకు రిజిస్టర్లు, మందుల సరఫరా అంశాలపై వాకబు చేశారు. ప్రభుత్వం అభివృద్ధి పనుల నిమిత్తం మంజూరు చేసిన నిధులు, వినియోగించిన వివరాలు, టెండర్ ప్రక్రియ, కాంట్రాక్టర్ల వివరాలు, ఇప్పటి వరకు మౌలిక సౌకర్యాల కోసం వినియోగించిన నిధులు, మందుల సరఫరా అంశాలపై ఆరా తీశారు. ఇటీవల రూ.3 కోట్లతో జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుపై నివేదికలు కోరారు. మరోవైపు మెడికల్ కళాశాల బోధన విషయాలు, ప్రొఫెసర్లు, అవసరమయ్యే సిబ్బంది వివరాలపై బృందం సభ్యులు వాకబు చేశారు. ల్యాబ్లో ఉండాల్సిన పరికారాలు, రోగుల కోసం ఆధునిక పరికరాలు, వాటి పనితీరు, టెక్నిషన్లు, డయాలిస్ రోగులకు అందుతున్న సేవలు, సమస్యలను తెలుసుకున్నారు. అత్యవసర సేవల విషయంలో మెడికల్ కళాశాల ప్రొఫెసర్ల సహాయంతో మెరుగైన వైద్య సేవలు అందించల్సిందిగా రాష్ట్ర మానిటరింగ్ అధికారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నివేదికలు కోరారు.. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ఈఏమరకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న సేవలపై రాష్ట్ర మానిటరింగ్ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఎక్కువగా ఏ జబ్బుతో బాధపడుతున్నారు, వారికి అందిస్తున్న వైద్య సేవలు, వైద్యులు సూచించిన మందుల వినియోగం తదితర విషయాలపై నివేదికలు కోరారు. జిల్లా ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉందని తెలియజేశాం. అవసరమయ్యే మౌలిక వసతులు, సౌకర్యాలపై వివరించాం. 300 పడకల ఆసుపత్రిని 550 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాల్సిందిగా కోరాం. – సిద్దప్ప, జిల్లా ఇన్చార్జ్ వైద్యాధికారి ప్రైవేట్ ఆస్పత్రుల్లో సౌకర్యాలు, ఫీజులపై వాకబు మెరుగైన వైద్యసేవలు అందడమే లక్ష్యం.. -
భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలు
గద్వాలటౌన్/ఎర్రవల్లి: శ్రావణమాసం మూడో శుక్రవారం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. పలు ఆలయాల్లో మహిళలు సామూహిక వ్రతాలు నిర్వహించగా, ఇళ్లలో కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని అందంగా అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. శ్రావణ పౌర్ణమికి ముందురోజు వచ్చిన శుక్రవారాన్ని పురస్కరించుకొని స్థానిక సరస్వతీ శిశు మందిరంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారికి ఇష్టమైన తీర్థ ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు. జిల్లా కేంద్రంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం, మార్కెండేయస్వామి ఆలయం, కాళికాదేవి ఆలయం, అయ్యప్పస్వామి ఆలయం, కోటలోని చెన్నకేశవస్వామి ఆలయం, నల్లకుంటలోని శివాలయం, రాఘవేంద్ర కాలనీలోని సత్యనారాయణస్వామి ఆలయాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సామూహిక కుంకుమార్చనను నిర్వహించారు. కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు వరలక్ష్మీదేవిగా దర్శనమిచ్చారు. కరెన్సీ నాణేలతో అందంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా అమ్మవారి ముందు గాజులు, పూలు, పండ్లు ఉంచారు. సుఖ శాంతులతో, సౌభాగ్యంగా ఉండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల నిర్వాహకులు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ● బీచుపల్లి కోదండరామస్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
గద్వాలటౌన్/గద్వాలన్యూటౌన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణపు పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఐడీఓసీలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై మున్సిపల్ కమీషనర్లు, ఎంపీడీఓలు, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణాల్లో స్పష్టమైన పురోగతి సాధించేందుకు క్షేత్రస్థాయిలో పనిచేయాలని, నిర్లక్ష్యం వహించిన వారిపైకఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాకు 7వేల ఇళ్లు మంజూరు కాగా ఇప్పటివరకు 1,078 మేస్మెంట్ దశకు, 3850 మార్క్అవుట్ దశకు చేరుకున్నాయని చెప్పారు. గతంతో పోల్చితే ఈసారి మంచి పురోగతి ఉందని, ఇదే వేగాన్ని పెంచి మరింత మెరుగైన ఫలితాలు సాధించాల్సి ఉందన్నారు. అన్ని మున్సిపల్, పంచాయతీల్లో లభ్దిదారుల వివరాలను ప్రదానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఎంపీడీఓలకు ఇసుక బుకింగ్ కోసం లాగిన్ ఐడీలు అందజేస్తామని, అబ్ధిదారులకు ఉచిత ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూ చించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావ్, హౌసింగ్ డీఈ కాశీనాథ్, ఎంపీడీఓలు,మున్సిపల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు. ఇళ్ల పరిశీలన గద్వాల శివారులో చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల పనులను కలెక్టర్, ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డితో కలిసి పరిశీలించారు. పెండింగ్ పనులను త్వరిరతగతిన పూర్తి చేయాలన్నారు. ముళ్ల పొదలను తొలగించి, పరిసరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. విద్యుత్తు, తాగునీటి సరఫరాలో లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషినల్ కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగరావు, ఎస్డీసీ శ్రీనివాసరావు, విద్యుత్శాఖ ఎస్ఈ శ్రీనివాస్రెడ్డి, పీఆర్ డీఈ లక్ష్మన్న, మున్సిపల్ కమిషనర్ దశరథ్, ఇరిగేషన్ శాఖ ఈఈ శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు. డే కేర్ సెంటర్ ఆదర్శవంతంగా నిలవాలి జిల్లాలో వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ఆదర్శవంతంగా నిలవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ‘అటల్ వయో అభివృద్ధి యోజన’ పథకం కింద జిల్లాకు మంజూరైన డే కేర్ సెంటర్ను ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ నిర్వహించేందుకు అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ సమక్షంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ అధికారిని సునంద, రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ రమేష్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. వృద్ధులకు నాణ్యమైన, పౌష్టికాహరం అందించడంతో పాటు, శారీరక, మనసికోల్లాసం కల్గించే కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎరువు దుకాణాల తనిఖీ జిల్లా కేంద్రంలోని మహంతి ఫర్టిలైజర్, శివశంకర్ ఆగ్రో ట్రేడర్స్ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయా దుకాణాల్లో యూరియా, ఇతర ఎరువుల అమ్మకం, స్టాక్ వివరాలను.. ఈపాస్ యంత్రాలు, గ్రౌండ్ నిల్వలతో పోల్చి వివరాలు తెలుసుకున్నారు. రైతు ఆధార్కార్డు, పట్టాదారు పాసు పుస్తకం ఆధారంగా ఈ–పాస్ ద్వారానే ఎరువులను విక్రయించాలని ఆదేశించారు. ఎరువుల అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
పైసలిస్తేనే.. ఫైల్ కదిలేది!
కొన్ని ప్రభుత్వ శాఖల్లో రాజ్యమేలుతున్న అవినీతి రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్లపై దృష్టి సారించాలి జిల్లాలోని తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై అవినీతి ఆరోపణలు బాహాటంగానే వెల్లువెతున్నాయి. మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారు. రియల్ భూం ఉన్న మండలాల్లో తహసీల్దార్లకు కాసుల వర్షం కురుస్తుంది. ప్రధానంగా గద్వాల సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో నిబంధనలు ఉల్లంఘించి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభం చేకూర్చుతూ... తమ జేబులను నింపుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. గద్వాల జిల్లాలోని ఈ కార్యాలయాలపై ఏసీబీ అఽధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. -
ఆల్బెండజోల్ మాత్రలు తప్పక వేయించాలి
గద్వాల న్యూటౌన్: నులిపురుగుల నిర్మూలన కోసం ఏడాది నుంచి 19 ఏళ్లలోపు వారందరికి ఈనెల 11న ఆల్బెండజోల్ మాత్రలు తప్పక వేయించాలని అడిషనల్ కలెక్టర్ నర్సింగ్రావు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఈనెల 11న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల దినోత్సవంపై జిల్లా టాస్క్ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య, ఆరోగ్యశాఖతో పాటు సంబందిత ప్రభుత్వ విభాగాలు, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజజమాన్యాలు సమన్వయంతో వ్యవహరిస్తూ ఏడాది నుంచి 19 ఏళ్ల వయస్సు ఉన్న వారందరికి అల్బెండజోల్ మాత్రలు వేయించాలని ఆదేశించారు. నులిపురుగులు ఉండటం వల్ల పిల్లలలో రక్తహీనత, ఆకలి మందగించడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. వీటివల్ల చదువులో ఏకాగ్రత కోల్పోతారని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం వల్ల మెరుగుదల కన్పించిందన్నారు. అన్ని హస్టల్లు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మాత్రలు ఇస్తారని, బడిబయటి పిల్లలకు కూడా ఈకేంద్రాల్లోనే మాత్రలు తప్పక ఇప్పించాలని సూచించారు. ప్రతి అంగన్వాడీ కేంద్రం, పాఠశాల, కళాశాలకు ఒక అంగన్వాడీ కార్యకర్త, ఆశా కార్యకర్త, ఏఎన్ఎంలను అనుసంధానం చేయాలన్నారు. జిల్లాలో 1.71 లక్షల మంది జిల్లాలో ఏడాది నుంచి 19 ఏళ్లలోపు వారు 1,71,354 మంది ఉన్నారని తెలిపారు. మాత్రల వలన ఎలాంటి అన్నారోగ్య సమస్యలు రావని వివరించారు. ఏడాది నుంచి రెండేళ్ల వయస్సు పిల్లలకు సగం మాత్రం పొడి చేసి ఇవ్వాలన్నారు. ఆపై వయస్సు ఉన్నవారికి ఒక మాత్ర నమిలిమింగించాలని సూచించారు. ఆర్ఎస్కే బృందాలు, పోగ్రాం అధికారులు పర్యవేక్షిస్తారని చెప్పారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి సిద్దప్ప, పంచాయతీ అధికా రి నాగేంద్రం, సంక్షేమఅధికారి సునంద, ఇంటర్మీడియేట్ అధికారి హృదయరాజ్, మున్సిపల్ కమీషనర్ దశరథ్, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ నుషిత, పోగ్రాం అధికారులు పాల్గొన్నారు. -
యూరియాపై ఆందోళన వద్దు
గద్వాల వ్యవసాయం: జిల్లాలో అవసరమైన మేరకు యూరియా నిల్వలు ఉన్నాయని డీఏఓ సక్రియానాయక్ అన్నారు. శనివారం స్థానిక పీఏసీఎస్ గోదాము వద్ద రైతులకు 20.25 మెట్రిక్ టన్నుల యూరియాను ఏఓ, ఏఈఓల పర్యవేక్షణలో పంపిణీ చేయగా ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ యూరియా కొరత రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పీఏసీఎస్లలోనే కాకుండా ప్రైవేట్ ఎరువుల దుకాణాల్లో 150 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ ఉందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. డీఏఓ వెంట ఏఓ ప్రతాప్కుమార్ ఉన్నారు. ఈ–పాస్ ద్వారానే ఎరువులు విక్రయించాలి కేటీదొడ్డి: ఎరువుల డీలర్లు ఈ–పాస్ మిషన్ ద్వారానే రైతులకు ఎరువులు విక్రయించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియానాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని నందిన్నె, కుచినెర్ల, చింతలకుంట గ్రామాలలో ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎమ్మార్పీ ధరలకే ఫర్టిలైజర్, మందులకు విక్రయించాలని, ఎరువుల దుకాణాల్లో ఎక్కడ కూడా యూరియా కొరత లేదని ఈ –పాసు మిషన్లతో అమ్మకాలు జరపాలన్నారు. అధిక ధరలకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు తప్పనిసరిగా రశీదులు అందజేయాలని, ఎరువుల ధరలు, స్టాక్ వివరాలను సూచిక బోర్డుపై ప్రదర్శించాలని పేర్కొన్నారు. వారి వెంట ఏఓ రాజవర్ధన్ రెడ్డి, ఏఈఓ కిరణ్కుమార్, తదితరులు ఉన్నారు. ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకుందాం గద్వాలటౌన్: బీజేపీ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు తెలిపారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యశాలలో ఆయన మాట్లాడారు. అన్ని మండలాలలో 9,10వ తేదీల నాటికి హర్ఘర్ తిరంగాపై కార్యశాల సన్నహాక సమావేశాలను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11 నుంచి 14 వరకు అన్ని మండలాలలో తిరంగా యాత్ర నిర్వహించాలన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకుంటూ, వారి విగ్రహాల దగ్గర నివాళులర్పించాలన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలన్నారు. విభజన గాయాల స్మారక దినాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. 15న ప్రతి ఒక్కరూ జెండా కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు రామచంద్రారెడ్డి, రవికుమార్, కేకేరెడ్డి, అక్కల రమాదేవి, జయశ్రీ, శివారెడ్డి, శ్యామ్రావు, నాగేశ్వర్రెడ్డి, సమతగౌడ్, వెంకటేశ్వర్రెడ్డి, దేవదాసు తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.5,303 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు శుక్రవారం 287 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.5303, కనిష్టం రూ.2940, సరాసరి రూ.2940 ధరలు లభించాయి. -
పాలమూరుకు ఆటుపోట్లు
ఇప్పట్లో నీటి ఎత్తిపోతలకు కనిపించని అవకాశాలు ● ఇళ్లు ఖాళీ చేయని నార్లాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులు ● జలాశయంలో ఇప్పటికే నాలుగు టీఎంసీల నీటి నిల్వ ● ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోస్తే ఇళ్లు మునిగిపోయే ప్రమాదం ● ఒకవేళ నింపినా.. ఏదులకు తరలించేందుకు అడ్డంకులు కొల్లాపూర్: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలు ఇప్పట్లో చేపట్టేలా కనిపించడం లేదు. ఇందుకు ప్రధానంగా పలు రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రాజెక్టు పంప్హౌజ్ పనులు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ నీటి ఎత్తిపోతలు మాత్రం రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్లో కచ్చితంగా నీటి ఎత్తిపోతలు చేపట్టాలని అధికారులు భావించినా.. ఆచరణకు నోచుకోలేదు. ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఈ ఏడాది ఆఖరి వరకు ఎత్తిపోతల కోసం ఎదురుచూడక తప్పేలా లేదు. పరిహారం చెల్లించాకే.. నార్లాపూర్ రిజర్వాయర్లో అంజనగిరి, వడ్డెగుడిసెలు, సున్నపుతండా గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. వీరిలో కొంతమందికి సరైన పరిహారం అందలేదు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రకారం తమకు పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యను ఇటీవలే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. వారికి పరిహారం ఇప్పించేందుకు చర్యలు చేపట్టారు. అయితే తమకు పూర్తిస్థాయి పరిహారం అందిన తర్వాతే ఖాళీ చేస్తామని నిర్వాసితులు చెబుతున్నారు. దీంతో పాలమూరు ప్రాజెక్టు అధికారులు కొత్తగా నీటి ఎత్తిపోతలు చేపట్టే ఆలోచనను విరమించుకున్నారు. ఒకవేళ నీటిని ఎత్తిపోస్తే సున్నపుతండాలో ఇళ్లు మునిగిపోయే ప్రమాదం ఉండటంతో అధికారులు వాయిదా వేస్తున్నారు. నాలుగు మోటార్ల బిగింపు.. ప్రాజెక్టులోని మొదటి లిఫ్టు ఎల్లూరు పంపుహౌజ్లో ఇప్పటి వరకు నాలుగు మోటార్లు బిగించారు. మూడు మోటార్ల పనులన్నీ పూర్తి కాగా.. మరో మోటార్కు ఫ్రీ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంది. లిఫ్టులో ఇంకో నాలుగు మోటార్ల బిగింపు పనులు కొనసాగుతున్నాయి. డెలివరీ మెయిన్స్ పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. ప్రాజెక్టు వద్ద 400/11 కేవీ విద్యుత్ సబ్స్లేషన్ను ఏర్పాటు చేస్తున్నారు. నార్లాపూర్లో నీటి నిల్వ ఇలా.. నార్లాపూర్ రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 6.4 టీఎంసీలు. ప్రస్తుతం పూర్తయిన పనుల ప్రకారం మూడు మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు అవకాశం ఉంది. దీంతో నార్లాపూర్ రిజర్వాయర్లోకి 4 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం ఈ ఏడాది తరలింపునకు కేఆర్ఎంబీ అనుమతులు సైతం ఉన్నాయి. అయితే గతంలో నార్లాపూర్ రిజర్వాయర్లో 2 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. ఇటీవల కాాలంలో కేఎల్ఐ ద్వారా ఎత్తిపోసిన నీటిని నార్లాపూర్ రిజర్వాయర్లోకి మళ్లించడంతో నీటి నిల్వ 4 టీఎంసీలకు పెరిగింది. రిజర్వాయర్లోకి కొత్తగా నీటిని ఎత్తిపోస్తే పలు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం దృష్టిలో ఉంది.. నార్లాపూర్ రిజర్వాయర్లో ఇప్పటికే 4 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. ఈ రిజర్వాయర్లోకి మరిన్ని నీళ్లు ఎత్తిపోస్తే నిర్వాసితుల ఇళ్లు మునిగిపోతాయి. కానీ, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు పూర్తయితేనే ఇళ్లు ఖాళీ చేస్తామంటున్నారు. ఈ సమస్య ప్రభుత్వం దృష్టిలో ఉంది. త్వరలోనే అన్ని సమస్యలను అధిగమించి ఈ సీజన్ ముగింపులోగా ఎత్తిపోతలు చేపడుతాం. – శ్రీనివాసరెడ్డి, ఈఈ, నీటిపారుదల శాఖ -
చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి
గద్వాల టౌన్: చేనేత రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, ఎక్కడా లేని విధంగా ఈ రంగంలోని ప్రతి ఒక్కరి సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషిచేస్తోందని కలెక్టర్ సంతోష్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చేనేత పరిశ్రమను అభివృద్ధి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయని చెప్పారు. గద్వాల జరీ చీరలు ఖండాంతర ఖ్యాతిని పొందడం గర్వకారణమని పేర్కొన్నారు. చేనేత అందాలు మన సంస్కృతికి చిహ్నాలన్నారు. వారసత్వంగా వచ్చిన చేనేతను కాపాడుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించేలా ప్రోత్సహించాలన్నారు. అమెజాన్, ఫ్లిప్కార్డు, మిత్రా తదితర కంపెనీల ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా గద్వాల చేనేత విశ్వవ్యాప్తం అయిందని, దీన్ని మరింత విస్తృతం చేయడానికి కృషిచేస్తామన్నారు. జిల్లాలో 2,950 మగ్గాలకు జియోట్యాగ్ ఉందని చెప్పారు. నేతన్నకు చేయూతలో ఆరు వేల మంది కార్మికులు ఎంపికయ్యారన్నారు. చేనేత రుణమాఫీలో 1,761 మంది కార్మికులకు రూ. 12 కోట్లు మంజూరయ్యాని వివరించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో దేశ వ్యాప్తంగా తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు మాత్రమే ఎంపికయ్యాయని, అందులో గద్వాల చీరలకు ప్రాధాన్యత లభించడం హర్షించదగిన విషయమన్నారు. చేనేత వస్త్రాలను ఆదరించాలి ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రలను ధరించి చేనేత రంగాన్ని ప్రోత్సహించాలన్నారు. జిల్లాలోని నేతన్నలకు అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తామన్నారు. చేనేత జౌళిశాఖ అధికారి గోవిందయ్య చేనేత అభివృద్ధిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు అందుబాటులో ఉండటం లేదని, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, రాయితీలను అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఇదిలాఉండగా, అంతకుముందు చేనేత, జౌళీశాఖ అధ్వర్యంలో పట్టణంలో ర్యాలీని ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక పాతబస్టాండ్ నుంచి ప్రధాన రహదారుల గుండా చేనేత కార్మిక సంఘం ప్రతినిధుల ర్యాలీ కొనసాగింది. అనంతరం చేనేత ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా చేనేత రంగంలో వృత్తి నైపుణ్యాలు కనబర్చిన పలువురు చేనేత కార్మికులకు ప్రశంసా పత్రం అందజేశారు. వ్యాసరచన, ఉపన్యాస పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. చేనేత వస్త్రాలతో విద్యార్థులు నిర్వహించిన ఫ్యాషన్షో ఆకట్టుకుంది. కార్యక్రమంలో చేనేత శాఖ సహాయ సంచాలకులు గోవిందయ్య, చేనేత క్లస్టర్ చైర్మన్ రామలింగేశ్వర కాంమ్లే తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ అవసరం గద్వాలటౌన్: విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. గురువారం జమ్మిచేడ ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల చేత ఇంగ్లీష్ పాఠాలు చదివించారు. టీచర్లు బాగా చెబుతున్నారా అని ఆరా తీశారు. బాగా చదువుకోవాలని విద్యార్థినీలకు సూచించారు. ఆకట్టుకున్న విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శన చేనేత ఫ్యాషన్ షో–8లో u కలెక్టర్ సంతోష్ ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం స్ట్రాంగ్రూం వద్ద పటిష్ట భద్రత గద్వాల న్యూటౌన్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద పటిష్ట భద్రత ఉంచాలని కలెక్టర్ బీ.ఎం. సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్ ఆవరణలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ను కలెక్టర్ సంబందిత అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును చూశారు. -
జోగుళాంబ ఆలయంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పూజలు
అలంపూర్: దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాలను ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు గురువారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే బాలబ్రహ్మేశ్వర స్వామి జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు శేషవస్త్రాలతో సత్కరించారు. వీరితోపాటు చల్లా ఆదిత్యరెడ్డి, జిల్లా మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు గోపాల్, నాయకులు రఘు రెడ్డి, సదానందమూర్తి, నాగేశ్వర్ రావు తదితరులు ఉన్నారు. ● ఆంధ్రప్రదేశ్–తెలంగాణ సీజీఎం, అంబుడ్స్మెన్ డాక్టర్ సింగాల సుబ్బయ్య, పృథ్వీఫాల్గుణి, కిరణ్ జార్జ్లతో కలిసి గురువారం దర్శించుకున్నట్లు ఈఓ పురేందర్ కుమార్ తెలిపారు. ఆలయ అధికారులు అర్చకులతో కలిసి స్వాతం పలికారు. ఈ సందర్భంగా వారు శ్రీ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వారిని శేషవస్త్రాలతో సత్కరించారు. 108 సేవలను సద్వినియోగించుకోవాలి గట్టు: ఆపద సమయంలో ఆదుకునేందుకు 108 సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని, వీటి సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని 108 జిల్లా అధికారి రత్నమయ్య తెలిపారు. గురువారం గట్టులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 108 వాహనాన్ని, రికార్డులను ఆయన తనిఖీ చేశారు. ఆక్సిజన్, వైద్య పరికరాలు, మందులు తదితర వాటిని పరిశీలించారు. అత్యవసర సమయంలో 108కు కాల్ చేస్తే క్షణాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకుంటుందని, ప్రజలు వీటి సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. వాహనం పూర్తిగా సిద్ధంగా ఉండే విధంగా డ్రైవర్తో పాటుగా సిబ్బంది చూసుకోవాలని ఆదేశించారు. క్షయ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు గద్వాల క్రైం: క్షయ వ్యాధి నిర్మూలనకు వైద్యశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా ఇంచార్జ్ వైద్యాధికారి సిద్దప్ప అన్నారు. గురువారం క్షయ అనుమానితులకు టీబీ ముక్త్ భారత్ అభియాన్ ద్వారా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. క్షయరహిత జిల్లాగా మార్చుకునేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. అనంతరం పోస్టర్ను విడుదల చేశారు. -
రొయ్యల సాగు ప్రశ్నార్థకం
●సమాచారం లేదు జిల్లాలోని జలాశయాలు రొయ్యల ఉత్పత్తికి అనుకూలంగా ఉన్నాయి. అయితే 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబధించి రొయ్యల సీడ్ కోసం టెండర్ల నిర్వహణకు సంబంధించిన సమాచారం మాతో లేదు. – షకీలా బానో, జిల్లా మత్స్యశాఖ అధికారి గద్వాల శివారులోని జములమ్మ రిజర్వాయర్ గద్వాల వ్యవసాయం: జిల్లాలో గడిచిన ఏడాది రొయ్యల సీడ్ను వదలలేదు. ఈ ఏడాది అయినా రొయ్యల సీడ్ను వదలుతారా.. అని మత్స్యకారులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 93 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 7162 మంది మత్స్యకారులు ఉన్నారు. ఈ కుటుంబాలకు చేపలు, రొయ్యల పెంపకం, విక్రయించడమే జీవనాధారం. జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదులు, జూరాల ప్రాజెక్ట్, శ్రీశైలం బ్యాక్ వాటర్, ఆరు రిజర్వాయర్లు, 38 నోటిఫైడ్ చెరువులతో పాటు చిన్న చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో ఏటా మత్స్యశాఖ అందించే చేపల, రొయ్యల సీడ్ను వదిలి పెంచుతున్నారు. పైలెట్ ప్రాజెక్ట్గా.. ఏడేళ్ల క్రితం రొయ్యల పెంపకంపై మత్స్యశాఖ దృష్టి పెట్టింది. జిల్లాలోని వాతావరణం, జలాశయాల్లోని నీటి సాంద్రత, అందులో ఉండే లవణాలు తదితర అంశాలపై కొంత సమాచారం తీసుకున్నారు. పైలెట్ ప్రాజెక్ట్గా 2019–20లో జూరాల జలాశయంలో 6లక్షల రొయ్యల సీడ్ను వదలగా.. బాగా పెరిగాయి. దీంతో మత్యశాఖ అధికారులు ఏటా రొయ్యల సీడ్ను వదిలే సంఖ్యను పెంచుతూ వచ్చారు. ఈసారైనా వదలుతారా.. రొయ్యలసాగు, ఉత్పత్తిలో భాగంగా రొయ్య సీడ్ కోసం ప్రభుత్వం మత్స్యశాఖకు బడ్జెట్ కేటాయిస్తుంది. ఈబడ్జెట్తో రొయ్యల సీడ్కు సంబంధించి మత్స్యశాఖ రాష్ట్ర స్థాయిలో టెండర్లు ఆహ్వానిస్తుంది. టెండర్లు దక్కించుకునే కాంట్రాక్టర్ ఆయా జిల్లాలకు నిర్ధేశించిన సీడ్ సంఖ్య ప్రకారం సప్లై చేస్తాడు. ఒక రొయ్య సీడ్ రూ.2 నుంచి రూ. 2.50పైసల వరకు గడిచిన 2023–24 వరకు ఉండింది. అయితే 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రొయ్యల సీడ్కై ప్రభుత్వం బడ్జెట్ కేటాయించలేదు. దీనివల్ల గడిచిన ఏడాది రొయ్యలను వదలలేదు. ఈఏడాది సైతం అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇంతవరకు రొయ్యల సీడ్కు అవసరమైన బడ్జెట్ను ప్రభుత్వం కేటాయించలేదు. ఫలితంగా ఈఏడాది సైతం రొయ్యల సీడ్ వదిలే విషయం పశ్నార్థకంగా మారింది. సీడ్ కోసం బడ్జెట్ కేటాయించని ప్రభుత్వం ఎదురుచూస్తున్న మత్స్యకారులు గతేడాది ఆర్థికంగా నష్టపోయిన వైనం మత్స్యకారులకు నష్టం రొయ్యలు బొన్లెస్గా ఉంటాయి. దీంతో వీటికి మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. గద్వాల ప్రాంతంలో కేజీ రూ.300 నుంచి రూ.400 వరకు ధరలున్నాయి. అయితే రొయ్యల సీడ్ వదిలిన ఆరు, ఏడు నెలల తర్వాత రిజర్వాయర్ పరిధిలోని మత్స్యపారిశ్రామిక సంఘాల్లోని మత్స్యకారులు వలల ద్వార పట్టుకొని విక్రయిస్తారు. చేపలు, రొయ్యల పెంపకం, విక్రయం ద్వార ఆధారపడి ఇక్కడి మత్స్యకారలు జీవనం సాగిస్తున్నారు. మధ్యరాత్రి రిజర్వాయర్లలోకి వెళ్లి వలలు కట్టి, తిరిగి తెల్లవారుజామున వలలో పడ్డ రొయ్యలను తీసి, మార్కెట్లో విక్రయించి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తారు. కాగా రొయ్య సీడ్ను వదలకపోవడం వల్ల మత్స్యకారులు గడిచిన ఏడాది ఆర్థికంగా నష్టపోయారు. ఐదేళ్ల రొయ్యల ఉత్పత్తిని బట్టి గడిచిన ఏడాది 286 టన్నుల ఉత్పత్తి నష్టపోయారు. ఈ ఏడాది సైతం వదలకపోతే మరోసారి మత్స్యకారులు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడనుంది. -
ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ డీఈ
అలంపూర్: కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఇరిగేషన్ డీఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం ప్రకారం.. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్లోని రక్షణ గోడ మరమ్మతు, ఇతర పనులను కాంట్రాక్టర్కు రూ.4 లక్షలకు అప్పగించారు. అయితే రెండురోజుల క్రితం కాంట్రాక్టర్ పనులకు సంబంధించిన ఎంబీ బుక్ మెజర్మైంట్ చేయడానికి ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్నాయుడును కలిశారు. ఈ క్రమంలో డీఈ రూ.12 వేలు లంచం అడగగా.. పనుల్లో నష్టం వచ్చిందని అన్ని డబ్బులు ఇవ్వలేనని చెప్పడంతో రూ.11 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. వారి సూచన మేరకు గురువారం కాంట్రాక్టర్ ఇరిగేషన్ కార్యాలయంలో డీఈకి డబ్బులు ఇస్తుండగా.. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని హైదరాబాద్లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తామన్నారు. ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ఫ్రీ నం.1064, వాట్సప్ నం.94404 46106కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ సూచించారు. రూ.11 వేలు తీసుకుంటూ పట్టుబడిన అధికారి -
వైభవంగా పవిత్రోత్సవాలు
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగాయి. ఉత్సవాలలో భాగంగా రెండో రోజైన గురువారం సుదర్శన్ నారాయణన్ ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాతసేవ, విశేష తిరువారాదన, సన్నాయి వాయిద్యాల నడుమ పవిత్రమాలలతో గ్రామోత్సవం, యాగశాల ద్వారా తోరణ, ధ్వజకుంభారాదనలు, మహాకుంభ ఆరాదనలు, పవిత్ర ప్రతిష్ట, మూలమంత్ర హోమాలు, పవిత్ర ఆదివాస హోమాలు, లఘు పూర్ణాహుతి, మహా నైవేద్య నీరాజనములు, తీర్థ ప్రసాదగోష్టి వంటి పూజలు చేశారు. సాయంకాలం దివ్యప్రబంధ పారాయణం, యాగశాల ఆరాదనలు, నిత్యహోమం, శ్రీరామ మూలమంత్ర గాయత్రీ హోమం, లఘు పూర్ణాహుతి వంటి పూజా కార్యక్రమాలను వేద మంత్రాల నడుమ అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్ రాజు, పాలక మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. నేడు సామూహిక వరలక్ష్మి వ్రతం బీచుపల్లి కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు తెలిపారు. ఆసక్తి గల భక్తులు కార్యాలయంలో రూ.1516 చెల్లించి తమ పేరు నమోదు చేసుకోవాలని, అప్పుడే పూజకు అవసరమైన సామగ్రిని ఇవ్వనున్నట్లు తెలిపారు. -
బీసీ రిజర్వేషన్లపై కేంద్రం చర్చించాలి
గద్వాల: బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత పార్లమెంట్ సమావేశంలో చర్చించాలని, బీసీ రిజర్వేషన్లకు తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భంలో తాను కూడా సంపూర్ణ మద్దతు తెలిపినట్లు చెప్పారు. ఢిల్లీలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాలని చేపట్టిన ధర్నాకు సంపూ ర్ణమద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం ఆమోదించి మద్దతు పలకాలన్నారు. అదేవిధంగా ఎంతో కాలంగా నూతన రేషన్కార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరీ చేయడంతో వారి ఇబ్బందులు తొలిగాయన్నారు. పేదల సొంతింటి కల సాకారం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం గద్వాల నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని, పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. నియోజకవర్గ పరిధిలో 7విద్యుత్తు సబ్స్టేషన్లకు రూ.18.70కోట్లు మంజూరీ అయ్యాయని, వీటి నిర్మాణానికి అవసరమైన 40.20ఎకరాల భూమిని కేటాయించినట్లు పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. అలాగే, విద్యుత్ గోదాం, విద్యుత్ పరికరాల స్టోర్, 10వేల మెట్రిక్ టన్నుల కెపాసిటీతో రెండు గిడ్డంగుల నిర్మాణాల కోసం రూ.20.50 కోట్లు మంజూరయ్యాయన్నారు. మల్దకల్లో పీఏసీఎస్ నూతన భవనం, వరికొనుగోలు కేంద్రం, బీసీ స్టడీసర్కిల్ నూతన భవనం(రూ.3కోట్లు), మహిళా సమాఖ్య భవననిర్మాణం(రూ.5కోట్లు), గ్రామీణ స్వయం ఉపాధిశిక్షణ సంస్థ భవనం(రూ.2కోట్లు), వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి కోసం 33/11కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం కోసం రూ.4.50 కోట్లు మంజూరీ అయినట్లు తెలిపారు. గద్వాల నియోజకవర్గం అభివృద్ధికై సంపూర్ణ సహకారం అందిస్తున్న సీఎం, డీప్యూటీ సీఎం, ఉమ్మడి జిల్లా మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు బాబర్, మురళి, విజయ్,శ్రీకాంత్రెడ్డి, రఘు, తిమ్మప్ప, ప్రభాకర్గౌడ్, కురుమన్న తదితరులు పాల్గొన్నారు. -
భూ సమస్యలు సత్వరం పరిష్కరించండి
గద్వాల: రాష్ట్ర ప్రభ్వుం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతిలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ తహసీల్దార్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాలులో తహసీల్దార్లతో సమీక్షించారు. భూసమస్యలపై వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగులో ఉన్నాయని, పరిష్కారం కాని వాటికి సంబంధించి ఎంతమందికి నోటీసులు జారీ చేశారు క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియ పూర్తి చేశారా..వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా దరఖాస్తుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యానికి గల కారణాలను ఆరా తీశారు. సక్సేషన్, పెండింగ్ ముటేషన్, పీవోపీ, డీఎస్ వంటి అన్ని పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా అసైన్మెంట్ భూములు పూర్తిగా పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి నివేదికను సమర్పించాలన్నారు. వచ్చే వారం నిర్వహించే సమీక్షలో పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా మీసేవ ద్వారా 2024 వరకు దరఖాస్తు చేసిన వివిధ సర్టిఫికెట్లు పెండింగ్లో లేకుండా వారంరోజుల వ్యవధిలో పరిష్కరించాలన్నారు. రేషన్కార్డు దరఖాస్తులలో చాలా వరకు పరిష్కరించగా పెండింగులో ఉన్నవాటిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, ఆర్డీవో అలివేలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. మందులు అందుబాటులో ఉంచాలి గద్వాల క్రైం: సీజనల్ వ్యాధులు ప్రబలే నేపథ్యంలో ప్రజలకు ఆహార అలవాట్లు, శుభత్ర, వ్యాధుల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలియజేయాలని, అలాగే ఆస్పత్రుల్లో అవసరమైయ్యే మందులను అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. బుధవారం గద్వాలలోని గాంధీచౌక్ బస్తీ దవాఖానాను ఆయన ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందుతున్న సేవలను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రసవాలు, శస్త్ర చికిత్సల రికార్డులను పరిశీలించారు. గర్భిణుల విషయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. రోగులను మెరుగైన చికిత్సల పేరుతో మరో ఆసుపత్రికి రెఫర్ చేసిన క్రమంలో వాటికి సంబంధించిన పూర్తి నివేదికలను ఉన్నతధికారులకు సిబ్బంది అందజేయలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా ఇంచార్జ్ వైద్యాధికారి సిద్దప్ప తదితరులు ఉన్నారు. -
ఆదాయ శాఖకు..అద్దె భవనాలే దిక్కా?
ఇబ్బందులు లేకుండా చూస్తాం.. నేను ఇటీవలే బాధ్యతలు చేపట్టాను. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నూతన భవన ప్రతిపాదనలపై నాకు ఎలాంటి సమాచారం లేదు. అయితే కార్యాలయాలకు వచ్చే క్రయ విక్రయదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం. – ఫణీందర్, జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్లు అధికారి మెట్టుగడ్డ: ఉమ్మడి జిల్లాలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సొంత భవనాలు కరువయ్యాయి. ప్రభుత్వానికి రూ.కోట్లలో ఆదాయం సమకూర్చే ఈ కార్యాలయాలు ఏళ్ల తరబడి అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఎంత ఆదాయం ఆర్జించినా.. కార్యాలయానికి సొంత భవనాలు సమకూర్చుకోలేని దుస్థితిలో ఈ శాఖ ఉంది. సరైన వసతులు లేకపోవడంతో అక్కడ పనిచేసే ఉద్యోగులు, సిబ్బందితోపాటు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే క్రయవిక్రయదారులు సైతం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల మాట అలా ఉంటే.. ఉమ్మడి జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల వ్యవహారాలు పర్యవేక్షించే జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం కూడా అద్దె భవనంలోనే కొనసాగుతుండటం మరో విశేషం. ఆడిట్, చిట్ రిజిస్ట్రార్ కార్యాలయాలు సైతం ఇందులోనే ఉన్నాయి. వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలు, ఉద్యోగులకు సైతం వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ స్థలం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు చోట్లే పక్కా భవనాలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా.. ఇందులో కేవలం కల్వకుర్తి, ఆత్మకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మాత్రమే పక్కా భవనాలు కలిగి ఉన్నాయి. మిగతా పది కార్యాలయాలు అద్దె భవనాల నుంచే రిజిస్ట్రేషన్ సేవలు అందిస్తున్నాయి. వీటికి గాను రూ.వేలల్లో ప్రతినెలా అద్దె చెల్లిస్తున్నారు. ఏళ్లతరబడిగా ఇలా చెల్లిస్తున్న అద్దెలతోనే పక్కా భవనాలు నిర్మించవచ్చని ప్రజలు విమర్శిస్తున్నారు. అయితే మక్తల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఇటీవల నూతన భవనంలోకి మార్చినా.. అద్దె నిర్ణయించలేదని అధికారులు చెబుతున్నారు. వసతులు లేక అవస్థలు.. జిల్లాలోని 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతుండగా.. ఎక్కడా సరైన వసతులు లేవు. ఒక్కో కార్యాలయానికి సగటున ప్రతిరోజు వందమంది వరకు వస్తుండటంతో మూత్రశాలలు, మరుగుదొడ్లు, పార్కింగ్, తాగునీరు వంటివి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నారాయణ పేటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చిన్నగా ఉండటంతో పార్కింగ్ లేక అవస్థలు పడుతున్నారు. అచ్చంపేటలో చిన్నపాటి రోడ్డులో ఉండటంతో వాహనాలు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది. ప్రైవేట్ ఇళ్లలో కొనసాగుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఆదాయం ఎక్కువ.. వసతులు తక్కువ వాహనాల పార్కింగ్కూ స్థలం కరువు అవస్థలు పడుతున్న క్రయవిక్రయదారులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి -
ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను కొనసాగిద్దాం
గద్వాల/గద్వాల క్రైం/ఎర్రవల్లి: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసి త్యాగం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని పలువురు ప్రముఖులు కొనియాడారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని జిల్లా వ్యాప్తంగా నిర్వహించి నివాళులర్పించారు. ముందుగా కలెక్టరేట్లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించగా.. కలెక్టర్ బీఎం సంతోష్ పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రత్యేక సాధననే శ్వాసగా ఆశయంగా కొట్లాడిన వ్యక్తి గొప్పయోధుడు ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు. ఆయన రచనలు, ఉపన్యాసాలు, పరిశోధనలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్రపోషించాయన్నారు. తెలంగాణ రాష్ట్రం నిర్మాణం వె నక ఉన్న శక్తి ప్రొఫెసర్ జయశంకర్ విద్యారంగంలో చేసిన కృషి, సమానత్వం, ప్రాంతీయ న్యాయం వంటి అంశాలపై చేసిన అధ్యాయనాలు ఈతరం విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, బీసీ సంక్షేమశాఖ అధికారి నుషిత, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ● తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ నిరంతం కృషి చేశారని ఏఆర్ డీఎస్పీ నరేందర్ రావు అన్నారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు.తెలంగాణ ఉద్యమంలో సకల జనులను భాగస్వామ్యం చేయడానికి ప్రొఫెసర్ జయశంకర్ ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. ● తెలంగాణ రాష్ట సిద్దాంత కర్త, రాష్ట్ర సాధన కోసం నిరంతరం శ్రమించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని బీచుపల్లి పదో బెటాలియన్ ఇన్చార్జ్ కమాండెంట్ జయరాజు అన్నారు. ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి పదో బెటాలియన్లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేశారు. ఎలాంటి పదవులు ఆశించకుండా కేవలం ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా పోరాడిన గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ అని, ప్రజల్లో ఉద్యమ భావాజాలాన్ని వ్యాప్తి చేస్తూ రాష్ట్ర సాదన కోసం తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆయన ఆడుగుజాడల్లో నడవాలని ఆయన సూచించారు. -
ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ ఏఈఈ
మహబూబ్నగర్ క్రైం: మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. రూ.3 వేలు లంచం తీసుకుంటూ ఓ ఏఈఈ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ కథనం ప్రకారం.. మహబూబ్నగర్ ఇరిగేషన్ సబ్ డివిజన్–1లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ)గా పనిచేస్తున్న మహ్మద్ ఫయాజ్.. ఓ వ్యక్తి తన 150 గజాల ప్లాట్కు సంబంధించి ఎల్ఆర్ఎస్, ఎన్ఓసీలను ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు రూ.5 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు రూ.3 వేలు లంచం ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం ఈ విషయాన్ని బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. కాగా.. బుధవారం ఉదయం జిల్లాకేంద్రంలోని వన్టౌన్ చౌరస్తాలో ఉన్న ఓ బేకరి దగ్గరకు రావాలని ఏఈఈ ఫోన్ చేయడంతో బాధితుడు అక్కడికి వెళ్లి తన దగ్గర ఉన్న రూ.3 వేల నగదు ఇచ్చాడు. ఆ డబ్బులు తీసుకున్న ఏఈఈ జేబు లో పెట్టుకున్న కా సేపటికే అక్కడికి వచ్చిన ఏసీబీ బృందం రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. అనంతరం ఏఈఈని నేరుగా కార్యాలయానికి తీసుకెళ్లి.. ఆయన చాంబర్తో పాటు వన్టౌన్ ఏరియా లో ఆయన అద్దె ఇంట్లో సైతం సోదాలు నిర్వహించా రు. తనిఖీల్లో ఎలాంటి ఆస్తులు, నగదు లభ్యం కాలేద ని డీఎస్పీ వెల్లడించారు. మహ్మద్ ఫయాజ్ను గురువారం ఏసీబీ కోర్టు నాంపల్లిలో హాజరుపరుస్తామని తెలిపారు. రూ.3 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన వైనం -
ఉత్తీర్ణత శాతం పెంచాలి
ధరూరు: ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పరిసరాలతో పాటు కంప్యూటర్ గదిని, లైబ్రరీ, వంట గదితో పాటు తరగతి గదులను, వాటర్ ఫిల్టర్ కేంద్రాన్ని పరిశీలించారు. విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని, ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలన్నారు. విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం అందిస్తుందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. పస్తుత సమాజంలో ప్రతీది ఆన్లైన్, కంప్యూటర్తో ముడిపడి ఉందని విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్టు ఆద్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు కొరకు తెచ్చిన స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ రవీంద్రబాబు, ఎంపీడీఓ మంజూల, జీహెచ్ఎం ప్రతాప్రెడ్డి, ట్రస్టు చైర్మన్ రత్నసింహారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, నర్సింహులు పాల్గొన్నారు. మెడికల్ ఏజెన్సీలో తనిఖీలు గద్వాల క్రైం: జిల్లా కేంద్రంలో వెలసిన మెడికల్ ఏజెన్సీలో జిల్లా ఇన్చార్జ్ ఔషధ నియంత్రణ అధికారి వినయ్ బుధవారం తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో మందుల క్రయ విక్రయాలు, సరఫరాల రికార్డులను పరిశీలించారు. ఈ క్రమంలో సుంకులమ్మ మెట్ సమీపంలోని ఓ ఏజెన్సీ నిర్వాహకులు మల్దకల్, కర్నూల్ జిల్లా ఎమ్మిగనూర్ మండలం తదితర ప్రాంతాల్లోని ఆర్ఎంపీలుగా ఉన్న వ్యక్తులకు మందులు సరఫరా చేసేందుకు వారితో ఒప్పందం చేసుకుంటున్నట్లు తెలిసిందని, అలాగే, జిల్లా కేంద్రంలోని వివిధ మెడికల్ దుకాణాలకు మందులు పంపిణీ చేసినట్లు రికార్డులలో నమోదు చేసినట్లు వివరించారు. కంపెనీల నుంచి కొనుగోలు చేసిన మందుల బిల్లులు, ఇప్పటి వరకు విక్రయాలు చేసిన వివరాలపై విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి ఆర్ఎంపీలకు మందులు సరఫరా చేయడం తనిఖీల్లో వెల్లడైందన్నారు. దీంతో మెడికల్ ఏజెన్సీ లైసెన్స్ను 15 రోజుల పాటు సస్పెండ్ చేశామన్నారు. మందుల క్రయ విక్రయాలపై నిర్వాహకుల నుంచి రికార్డులను సీజ్ చేశామని, తదుపరి చర్యలపై త్వరలో తెలియజేస్తామని వినయ్ పేర్కొన్నారు. సీపీఐ సభలు వాయిదా గద్వాల: సీపీఐ జిల్లా మహాసభలు ఈ నెల 14వ తేదీకి వాయిదా పడినట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు తెలిపారు. 7వ తేదీన జరగాల్సిన సభలు అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. చదువుతోనే గుర్తింపు గద్వాలటౌన్: జీవితంలో మనిషిని ఉన్నత స్థితికి చేరేందుకు దోహదపడేది చదువేనని, విద్య నేర్చుకున్నప్పుడే సమాజావృద్ధి జరుగుతుందని ప్రభుత్వ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ చవ్వా వెంకట్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ కళాశాలలో పీజీ రెండో సంవత్సర విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సాంకేతికను అందిపుచ్చుకోవాలన్నారు. అనంతరం విద్యా ర్థులు ఆట పాటలతో ఆకట్టుకున్నారు. ప్రొఫెసర్లు అరవిందు, మంగళగిరి శ్రీనివాసులు, గణేష్, గోపినాథ్, రాథోడ్, మహేందర్, రవిషెరీన్, రఫీ, గట్టయ్య పాల్గొన్నారు. -
పొలాలకు ముప్పు..!
ఆరు వరుసల హైవేతో నీట మునుగుతున్న పంట పొలాలు ●అయిజ: భారత్మాల (ఆరు వరుసల హైవే రోడ్డు) కొందరు రైతుల పాలిట శాపంగా మారింది. ఇదివరకు పంటపొలాలకు ఏర్పాటు చేసుకున్న రోడ్లు మూతపడ్డాయని అసహనం వ్యక్తం చేయగా.. తాజాగా మరో చిక్కు వచ్చి పడింది. వర్షం కురిసిన ప్రతిసారి దాదాపు 55 నుంచి 60 ఎకరాల్లో వర్షం నీరు నిలిచిపోతుంది. దీంతో పంటలు మునిగిపోవడం, తేమ ఆరకుండా మొక్కలు ఎండిపోవడం, గిడసబారి పంటకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ముంబై, చైన్నె కారిడార్లో భాగంగా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భారతమాల రోడ్డు నిర్మాణంతో పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు ఏర్పాటు చేసుకున్న ఎండ్ల బండ్ల రస్తాలు (దారులు) సైతం రోడ్డు నిర్మాణంలో మూతపడుతున్నాయి. దానికి తోడు మొన్న కురుసిన వర్షాలకు భారతమాల రోడ్డు అంచుకు ఉన్న పంటపొలాల్లో నీరు నిలుస్తుంది. రోడ్డు నిర్మాణం పనులు శరవేగంగా సాగుతుండడంతో రైతుల మనసుల్లో దిగులు మొదలైంది. ఆరు మండలాలు.. 53 కి.మీ.రోడ్డు నిర్మాణం భారతమాల రోడ్డు జిల్లాలో మొత్తం 53 కి.మీ. మేర నిర్మాణం చేపట్టారు. దీనికోసం రైతుల నుంచి ప్రభుత్వం 775 ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్నారు. ఆరు మండలాల్లో నిర్మాణం పనులు శరవేగంగా నడుస్తున్నాయి. గద్వాల, అయిజ, మల్దకల్, కేటీ దొడ్డి, గట్టు, రాజోళి మండలాల మీదుగా హైవే నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అందులో సుమారు 35 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉంది. తూంకుంట శివారులో భారత్మాల రోడ్డు పక్కన నీట మునిగిన వ్యవసాయ పొలం నీరు నిలుస్తుంది భారత్మాల రోడ్డు నిర్మాణం చేపట్టడంతో రైతుల పంట పొలాల్లో వర్షం నీరు నిలుస్తోంది. దీంతో కొంత మంది రైతుల పంట పొలాలు మునిగిపోతున్నాయి. వర్షంనీరు ఇంకిపోయిన అనంతరం భూమిలో తేమ ఆరిపోకుండా ఉండడంతో పంటకు నష్టం చేకూరుతుంది. దిగుబడి ఘననీయంగా పడిపోతుంది. ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. – దావుద్, రైతు, అయిజ సమస్యలు పరిష్కరిస్తాం భారత్మాల రోడ్డు నిర్మాణంలో భాగంగా డీపీఆర్లో రూపొందించిన విధంగానే పనులు చేస్తున్నారు. అయితే పంట పొలాలకు వెళ్లే రోడ్లు మూతపడ్డాయని, పంట పొలాల్లో వర్షంనీరు నిలిచిపోతుందని రైతులు వాపోతున్నారు. రైతులు వారి సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేయాలి. రైతులకు నష్టం జరుగుతుందని మా దృష్టికి వస్తే నేషనల్ హైవే అథారిటీతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తాం. – లక్ష్మి నారాయణ, అదనపు కలెక్టర్ వర్షం కురిసిన ప్రతి సారి ఇక్కట్లు పంట నష్టం జరుగుతుందంటూ రైతుల ఆందోళన -
సాక్ష్యాధారాల సేకరణ వేగవంతం : ఎస్పీ
గద్వాల క్రైం: నేరం జరిగిన ప్రాంతాల్లో సమర్థవంతంగా, వేగవంతంగా సాక్ష్యాధారాలు సేకరించేందుకు వీలుగా ప్రభుత్వం జిల్లాకు మొబైల్ ఫోరెన్సిక్ వాహనం కేటాయించిందని ఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. మంగళవారం మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నేరం జరిగిన ప్రదేశంలో వేలి, కాలిముద్రలు, నార్కొటిక్, పేలుడు పదార్థాలు ఇతర అన్నిరకాల ఆధారాలను విచారణ అధికారులు మరింత వేగంగా, అత్యాధునిక పద్ధతుల్లో సేకరించేందుకు మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ వాహనంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది విధుల్లో ఉంటారన్నారు. ఘటనా స్థలాల్లో లభించే ఆధారాలను ఎప్పటికప్పుడు అనాలసిస్ చేయడానికి దోహ ద పడుతుందన్నారు. వాహనానికి ప్రత్యేక కెమెరా, ఫ్రిడ్జ్, మోడ్రన్ లైట్లు, డిజిటల్ పరికరాలు తదితర సాంకేతిక పరమైన టూల్స్ అందుబాటులో ఉన్నా యని తెలిపారు. విపత్కర కేసుల ఛేదనలో మొబైల్ ఫోరెన్సిక్ వాహనం కీలకంగా ఉంటుందన్నారు. కా ర్యక్రమంలో డీఎస్పీ మొగిలయ్య పాల్గొన్నారు. -
గట్టులో యూనిసెఫ్ బృందం పర్యటన
గద్వాల/గట్టు: గ్రామీణ ప్రాంతంలోని చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషక లోపాన్ని నివారించేందుకు చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు గాను మంగళవారం యూనిసెఫ్ బృందం గట్టులో పర్యటించింది. యూనిసెఫ్ ఇండి యా న్యూట్రీషన్ చీఫ్ మారీక్లాడ్, స్పెషలిస్టు సమీర్ మాణిక్రావు పవార్, హైదరాబాద్ ఫీల్డ్, న్యూట్రీషన్ స్పెషలిస్టు ఖ్యాతి తివారీ, ఎస్బీసీ సీమాకురమార్, న్యూట్రీషన్ ఆఫీసర్ రేషా దేశాయ్, కన్సల్టెంట్ నర్సింగరావు, డీడబ్ల్యూఓ సునంద తదితరులతో కూడిన బృందం గట్టు సంతబజారు అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అంగన్వాడీ కేంద్రం పరిధిలో పోషణలోపం, అతి తీవ్ర పోషణలోపం పిల్లల గుర్తింపు.. తల్లిదండ్రులు తీసుకుంటున్న జాగ్రత్తలపై ఆరా తీశారు. గర్భిణులు, బాలింతలకు అంగన్వాడీ ద్వారా అందిస్తున్న సేవలతో పాటు రోజు వారీగా తీసుకునే ఆహారం తదితర వివరాలను తెలుసుకున్నారు. మహిళా సంఘాలు నిర్వహిస్తున్న వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. అనంతరం నేతాజీ చౌక్లో ఆరోగ్య ఉపకేంద్రాన్ని పరిశీలించారు. వారి వెంట ఎస్బీసీసీ కోఆర్డినేటర్ శృతి అప్పింగికర్, ఏఐఐఎస్ ప్రాజెక్టు శాస్త్రవేత్త శిరీష, సురేశ్, హరినీలేష్, జశ్వంత్నాయుడు, ఎంపీడీఓ చెన్నయ్య ఉన్నారు. ● చిన్నారుల సంక్షేమంపై యూనిసెఫ్ బృందం సూచనలు పాటిస్తామని కలెక్టర్ బీఎం సంతోష్ అ న్నారు. ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్హాల్లో యూనిసెఫ్ బృందంతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా యూనిసెఫ్ బృందం పలు సూచనలు చేసింది. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, డీఎంహెచ్ఓ డా.సిద్ధప్ప, జిల్లా సంక్షేమశాఖ అధికారిణి సునంద, డీపీఓ నాగేంద్రం ఉన్నారు. -
మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
గద్వాల: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో మంగళవారం గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి సంబురాల్లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ఇందిరా మహిళాశక్తి పథకంతో రాష్ట్రంలో కోటిమంది మహిళలకు కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అందులో భాగంగా సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్బంకులు, మహిళాశక్తి క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సులకు యజమానులుగా చేసి.. ప్రతినెలా రూ.లక్ష ఆదాయం పొందే విధంగా చర్యలు చేపట్టిందన్నారు. పెట్రోల్బంకు, సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు నాలుగు ఎకరాల చొప్పున కేటాయిస్తున్నట్లు చెప్పారు. గద్వాల నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుపై మంజూరు చేయడం జరిగిందన్నారు. గద్వాల మండలంలో 1,587 కుటుంబాలకు కొత్త రేషన్కార్డులు ఇవ్వడంతో పాటు 4,877 మంది పేర్లను కొత్తగా రేషన్కార్డుల్లో చేర్చినట్లు తెలిపారు. అంతే కాకుండా మహిళా సంఘాలకు రూ. 50.61లక్షల వడ్డీలేని రుణాలతో పాటు 53 సంఘాలకు రూ. 7.87కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులకు రుణ చెక్కులతో పాటు లబ్ధిదారులకు కొత్త రేషన్కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు పాల్గొన్నారు. -
వరిధాన్యం కొనుగోలుకు ముందస్తు ఏర్పాట్లు
గద్వాల: వానాకాలంలో పండించే వరిధాన్యం కొనుగోలుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అదే విధంగా ధాన్యంపై క్వింటాల్కు పెరిగిన మద్దతు ధరపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న పరికరాలను వెంటనే మార్కెట్ కమిటీలకు అప్పగించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా మార్కెటింగ్శాఖ అధికారి పుష్పమ్మ, డీఎస్ఓ స్వామికుమార్, డీఎం విమల, జిల్లా కోఆపరేటివ్ అధికారి శ్రీనివాసరావు, ఏఓ సిద్ధయ్య తదితరులు ఉన్నారు.విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలిఅలంపూర్/మల్దకల్/మానవపాడు: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ, ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి విశ్వేశ్వర్ అధ్యాపకులకు సూచించారు. మంగళవారం అలంపూర్, మల్దకల్, మానవపాడు జూనియర్ కళాశాలల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు అధ్యాపకుల పనితీరుపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి జూనియర్ కళాశాలలో పూర్తిస్థాయిలో అధ్యాపకులు ఉన్నారన్నారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన ప్రతి విద్యార్థి ప్రభుత్వ కళాశాలలో చేరే విధంగా చొరవ చూపాలన్నారు. రాష్ట్ర కమిషనర్, కార్యదర్శి ఆదేశాల మేరకు అడ్మిషన్ల సంఖ్య పెంచాలని సూచించారు. అలంపూర్, మానవపాడు కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. కళాశాల ల్యాబ్కు సంబంధించిన ఇన్ఫ్రా కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. ప్రతి శనివారం విద్యార్థులతో క్రీడలు ఆడించాలన్నారు. ఎంసెట్, నీట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ సీఏ వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ప్రత్యేకంగా సమయ పట్టిక రూపొందించాలని సూచించారు. విద్యార్థుల ఆపార్ నమోదు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి హృదయరాజు, ప్రిన్సిపాల్స్ పద్మావతి, కృష్ణ, పద్మావతి పాల్గొన్నారు.రేపు జాతీయ చేనేత దినోత్సవంగద్వాల: జిల్లా కేంద్రంలో ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించనున్నట్లు చేనేత, జౌళిశాఖ ఏడీ గోవిందయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ నుంచి అనంత ఫంక్షన్హాల్ వరకు నిర్వహించే ర్యాలీలో కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహరెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం ఫ్యాషన్ షో ఉంటుందన్నారు. అదే విధంగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.పాఠశాల పరిశీలనధరూరు: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం యునెస్కో ప్రతినిధి సైదులు పరిశీలించారు. ప్రధానంగా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేకంగా సర్వే నిర్వహించారు. మరుగుదొడ్ల నిర్వహణ, వాటి శుభ్రత, తాగునీరు, తడి, పొడి చెత్త నిర్వహణ, తరగతి గదుల శుభ్రత తదితర వాటిపై వివరాలు నమోదు చేసుకున్నారు. పాఠశాలలో నూతనంగా నిర్మిస్తున్న అదనపు గదులు, కంప్యూటర్ ల్యాబ్ను పరిశీలించారు. ఆయన వెంట జీహెచ్ఎం ప్రతాప్రెడ్డి ఉన్నారు. -
రైతులపై ఆర్థిక భారం..
2024 వానాకాలం నుంచి రాయితీపై కూరగాయల, ఎండుమిర్చి విత్తనాలను అందిస్తామని ప్రస్తుత సర్కార్ పేర్కొంది. అయితే గతేడాదితో పాటు ఈసారి కూడా రాయితీపై విత్తనాలు ఇవ్వలేదు. సర్కార్ మాట నిలబెట్టుకోలేకపోవడంతో ఉద్యాన రైతులపై ఆర్థిక భారం పడుతోంది. ప్రధానంగా కూరగాయలు సాగుచేసేది సన్న, చిన్నకారు రైతులే. ఏటా విత్తనాలకే రూ. 6వేల నుంచి రూ. 8వేల వరకు వెచ్చిస్తున్నారు. రాయితీ ఉన్నప్పుడు రూ. 3వేల నుంచి రూ. 4వేలు మాత్రమే ఖర్చయ్యేదని రైతులు అంటున్నారు. రాయితీపై విత్తనాలు అందిస్తేనే ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంటున్నారు. ఇక ఎండుమిర్చి రైతుల పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. ఏటా ధరలు రాక నష్టపోతున్నారు. ఇక కంపెనీలు, రకాలను బట్టి విత్తనాలకే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గుంటూరు మిర్చి రకాలు కేజీ రూ. 600 నుంచి రూ. 900 వరకు ఉంది. ఎకరాకు కనీసంగా 3కిలోలు కావాల్సి ఉంటుంది. కొన్ని రకాలను కంపెనీలు పాకెట్ల రూపంలో ఇస్తారు. ఒక పాకెట్ ధర రూ.700 నుంచి రూ.900 వరకు ఉంది. ఎకరాకు 12 పాకెట్లు కావాల్సి ఉంటుంది. ఇలా ఉద్యాన రైతులు విత్తనాలకు కోసం అధికంగా వ్యయం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యాన రైతులకు రాయితీ అవకాశం కల్పిస్తేనే ప్రయోజనం చేకూరుతుంది. -
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
గద్వాలన్యూటౌన్: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ), వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. యూఎస్పీసీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ ప్రాంతంలో ధర్నా చేపట్టగా.. పలు సంఘాలు, పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా టీఎస్యూటీఎఫ్ జిల్లా అద్యక్షుడు రమేశ్ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయడంతో పాటు సీపీఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని అమలు చేయాలన్నారు. కేజీబీవీలో పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయాలని.. గురుకులాల్లో పనిచేస్తున్న వారికి 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలన్నారు. అనంతరం డీటీఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి ఉదయ్కిరణ్, సీపీఎం కార్యదర్శి వెంకటస్వామి, సీఐటీయూ కార్యదర్శి నర్సింహ, రిటైర్డ్ ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల నాయకులు ఆర్.మోహన్, స్వామి, అబ్దుల్బాబు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. జీపీఎస్ బిల్లులు చెల్లించాలని, రిటైర్డ్ అయిన రోజే అన్నిరకాల బెనిఫిట్స్ అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు రామన్గౌడ్, ఇక్బాల్, రవికుమార్, నాగర్దొడ్డి వెంకట్రాములు, అతికూర్ రహ్మన్, గోపాల్, కురువ పల్లయ్య, ప్రభాకర్, వినోద్ పాల్గొన్నారు. -
రాములు దారెటో..?
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/సాక్షి, నాగర్కర్నూల్: బీఆర్ఎస్ను వీడుతూ బీజేపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఉదంతం ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రెండు దశాబ్దాలుగా పైగా గులాబీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన గువ్వల అనూహ్యంగా పార్టీ మారడం పట్ల బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఆయనతో పాటు మరికొందరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడుతారన్న ప్రచారం నేపథ్యంలో వారంతా అయోమయంలో ఉన్నారు. అయితే పార్టీ మార్పుపై వదంతుల వ్యాప్తి ఉధృతంగా మారిన క్రమంలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు స్పందిస్తూ తాము పార్టీ వీడేది లేదని తెగేసి చెబుతున్నారు. గువ్వల బీజేపీలో చేరుతుండటంతో బీఆర్ఎస్తో పాటు బీజేపీలోని నేతలను సైతం కలవరపెడుతుండటం గమనార్హం.గువ్వల వెంట వెళ్లేందుకు కేడర్ విముఖత..మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరుతున్నట్టు తన ముఖ్య అనుచరులు, కేడర్గా ముందుగానే చెప్పారు. వారి నుంచి సహకారం కావాలని, తనతో పాటుగా బీజేపీకి రావాలని ఆహ్వానిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్లో బీజేపీతో కలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వారి కన్నా ముందే తాము బీజేపీలో చేరితే గౌరవం నిలబడుతుందని కేడర్తో చెబుతున్నారు. తద్వారా జాతీయ రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా పనిచేయవచ్చని అంటున్నారు. అంబేద్కర్ ఆశయాలు, జాతీయవాదాన్ని ఆచరించే పార్టీతో పని చేస్తానని చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆయనతో వెళ్లేందుకు బీఆర్ఎస్ కేడర్ విముఖంగా ఉందని తెలుస్తోంది. అచ్చంపేట నియోజకవర్గంలోని బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, అనుచరులు గువ్వల పాటు బీజేపీకి వెళ్లేందుకు నిరాసక్తతను కనబరుస్తున్నారు. ఇప్పటికే గువ్వల పార్టీ మారుతున్న ప్రచారం మొదలైన క్రమంలోనే సోమవారం సీఎం రేవంత్ సమక్షంలో పదర మండల మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, గువ్వల ముఖ్య అనుచరుడు రాంబాబునాయక్ కాంగ్రెస్లో చేరారు. ప్రధానంగా అచ్చంపేట నియోజకవర్గంలో బీజేపీ ప్రభావం తక్కువగా ఉండటం, బీజేపీ కన్నా బీఆర్ఎస్ కేడర్ బలంగా ఉందన్న భావన నేపథ్యంలో ఎక్కువ మంది అనుచరులు బీజేపీలో చేరడానికి విముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. -
రాయితీ.. ఉత్తిమాటే!
కూరగాయలు, మిరప రైతులకు అందని ప్రభుత్వ ప్రోత్సాహం ●గద్వాల వ్యవసాయం: ఉద్యాన పంటల విత్తనాలను 50శాతం రాయితీపై ఇస్తామన్న సర్కార్ హామీ నీటిమూటగానే మారింది. ఏడేళ్ల క్రితం వరకు ఆర్కేవీవై (రాష్ట్రీయ కృషి విజ్ఞాన్ యోజన) పథకం కింద కూరగాయల విత్తనాలను రాయితీపై అందించే వారు. ప్రస్తుతం ఈ పథకం తీగజాతి కూరగాయల సాగుకు ఏర్పాటుచేసే పందిళ్లకే పరిమితమైంది. కూరగాయలు, మిర్చి పండించే రైతుల ఆశలు అడియాశలుగానే మారాయి. జిల్లాలో విస్తారంగా సాగు.. జిల్లాలో ఉద్యాన పంటలకు నేలలు అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ సాధారణ పంటలతో పాటు కూరగాయలను ఏటా రెండు సీజన్లలో విస్తారంగా పండిస్తారు. గద్వాల మండలంలో వంకాయ, బెండ, పచ్చిమిర్చి, చిక్కుడు, క్యాలిఫ్లవర్, క్యాబేజీ, ధరూర్ మండలంలో బెండ, టమాట మల్దకల్ మండలంలో చిక్కుడు, టమాటా, బీర, సోరకాయ, బెండ, కాకర, అయిజలో బెండ, చిక్కుడు, వడ్డేపల్లిలో వంకాయ, బెండ, కాకర, క్యాబేజీ, క్యాలిఫ్లవర్, ఉల్లి, అలంపూర్లో ఉల్లి, రాజోళిలో పచ్చిమిర్చి, ఉల్లి, టమాటా పండిస్తారు. ఇక ఎండుమిర్చి సాగుపై ఈ ప్రాంత రైతులు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. మానవపాడు, అలంపూర్, ఇటిక్యాల, ఉండవెల్లి, రాజోళి, అయిజ, కేటీదొడ్డి, గట్టు మండలాల్లో ఏటా దాదాపు 30వేల ఎకరాలకు పైగా ఎండుమిర్చి సాగు అవుతోంది. సబ్సిడీపై విత్తనాలు అందించాలి.. నాకున్న మూడెకరాల్లో ఏటా రెండు సీజన్లలో కూరగాయలు పండిస్తాను. ఏడేళ్ల క్రితం వరకు కూరగాయల విత్తనాలు, మార్కెట్కు తరలించడానికి ట్రేలు సబ్సిడీపై ఇచ్చే వారు. దీనివల్ల పెట్టుబడి భారం కొంత తగ్గేది. ఇప్పుడు సబ్సిడీ లేకపోవడంతో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సబ్సిడీపై విత్తనాలు అందించాలి. – సుదర్శన్రెడ్డి, కూరగాయల రైతు, గద్వాల పెట్టుబడులు పెరుగుతున్నాయి.. నాకున్న ఆరెకరాలతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని గతేడాది వరకు ఎండుమిర్చి సాగు చేశాను. ఏటా పెట్టుబడులు పెరుగుతున్నాయి. ధరలు రావడం లేదు. విత్తనాలకే వేలకు వేలు అవుతున్నాయి. అందుకే ఈఏడాది మూడెకరాల్లో మాత్రమే వేశాను. ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు అందిస్తే కొంత పెట్టుబడి సాయం అవుతుంది. – వెంకటేశ్వర్లు, మిర్చిరైతు, చిన్నిపాడు, మానవపాడు మండలం పందిళ్లకు మాత్రమే..ఆర్కేవీవై పథకం కింద తీగజాతి కూరగాయలు పండించేందుకు అవసరమైన పందిళ్లను 50 శాతం రాయితీపై అందిస్తాం. ఇక కూరగాయల, ఎండుమిర్చి విత్తనాలను రాయితీపై అందించడం లేదు. – ఎంఏ అక్బర్, జిల్లా ఉద్యానశాఖ అధికారి భారంగా మారిన విత్తనాల కొనుగోలు ఆర్కేవీవై పథకంతో లబ్ధి చేకూరని వైనం నీటిమూటగానే మారిన సర్కారు హామీ పందిళ్లకే పరిమితం.. ఉద్యాన పంటలను ప్రోత్సహించడంలో భాగంగా కూరగాయల రైతులకు ప్రయోజనం చేకూర్చేలా అప్పట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆర్కేవీవై పథకానికి శ్రీకారం చుట్టాయి. ఈ పథకం ద్వారా రాయితీపై కూరగాయల విత్తనాలతో పాటు, ట్రేలు, తీగజాతి కూరగాయలకు అవసరమయ్యే పందిళ్లకు 50శాతం రాయితీ అందించే వారు. దీంతో చాలా మంది రైతులు ప్రభుత్వ రాయితీని సద్వినియోగం చేసుకునే వారు. పండించిన కూరగాయలను మార్కెట్కు తరలించడానికి వినియోగించే ట్రేళ్లను కూడా రాయితీపై తీసుకునేవారు. అయితే ఆర్కేవీవై పథకం కింద ఇవన్నీ 2015–16 వరకు అందించారు. ఆ తర్వాత ఏడాది నుంచి ఈ పథకం కేవలం పందిళ్ల ఏర్పాటుకే పరిమితమైంది. -
1.73 లక్షల ఎకరాల్లో పంటలు సాగు
మే నెలలో వర్షాలు కురవడంతో మెట్ట పంటలు సాగుచేసుకునేందుకు రైతులు భూములు దుక్కులు దున్నుకుని సిద్ధం చేసుకున్నారు. మృగశిరకార్తిలో పత్తి, వేరుశనగ, ఆముదం, మొక్కజొన్న, కందులు వంటి వివిధ రకాల పంటలు సాగుచేశారు. ఈ ఏడాది ఖరీఫ్లో మొత్తం 1,73,211 ఎకరాల్లో పంటలు సాగుచేయగా ఇందులో 1.50 లక్షల ఎకరాల్లో మెట్టపంటలు సాగుచేశారు. ఈ పంటలన్ని కూడా పూర్తిగా వర్షాధారంగానే పండుతాయి. ఇదిలాఉండగా, సాధారణంగా జూన్ చివర, జూలై మాసంలో సమృద్ధిగా వర్షాలు మొదలవుతాయి. అయితే ఈ సారి మే నెలలోనే వర్షాలు కురిశాయి. మే నెలలో జిల్లా వ్యాప్తంగా 117.3మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వాస్తవానికి మే నెలలో సాధారణ వర్షపాతం 25.8 మి.మీటర్లు కురవాల్సి ఉండగా.. అధికంగా కురిసింది. -
రాజకీయ కలకలం
అబ్రహం దారెటు? అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై ఆయన స్పందించలేదు. పార్టీ మార్పును ఇప్పటివరకు ధ్రువీకరించలేదు. అలంపూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి సీటు దక్కలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్లోనూ వర్గపోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయన బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే చర్చలు జరిగినట్టు చెబుతున్నా పార్టీ మార్పుపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన ముఖ్య అనుచరులు చెబుతున్నారు. ● కారు పార్టీకి గుడ్బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ● ఈ నెల 9న బీజేపీలో చేరే అవకాశం? ● ప్రచారంలో మరికొందరు మాజీ ఎమ్మెల్యేల పేర్లు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్: బీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేయడం బీఆర్ఎస్లో ప్రకంపనలు సృష్టించింది. ఆయనతో పాటు మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా తీవ్రంగా చర్చ సాగుతోంది. రెండు దశాబ్దాలుగా గులాబీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన గువ్వల పార్టీ వీడుతుండటంతో ఏం జరుగుతోందన్న ఆందోళన పార్టీ కేడర్లో నెలకొంది. ఈనెల 9న ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని, ఆయనతో పాటు మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు సైతం బీజేపీ గూటికి చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ప్రాధాన్యత లేదని.. బీఆర్ఎస్ పార్టీలో 2007లో చేరిన గువ్వల బాలరాజు మొదటి నుంచి క్రియాశీలకంగా ఉన్నారు. 2009లో మొదటిసారిగా నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్, టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాక ప్రభుత్వ విప్గా వ్యవహరించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్కర్నూల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సీటు ఆశించినా భంగపాటు ఎదురైంది. ఈ సీటును ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు కేటాయించడంతో అసంతృప్తికి గురయ్యారు. పార్టీలో తనకు ప్రాధాన్యతను తగ్గిస్తున్నారని, పార్టీ అధినేత కేసీఆర్ తనను పట్టించుకోవడం లేదని అనుచరులతో చెబుతున్నారు. భవిష్యత్లో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకుంటారని, వారి కన్నా ముందే తానే బీజేపీలో చేరుతున్నట్లు ముఖ్య అనుచరులతో స్పష్టం చేశారు. అయోమయంలో పార్టీశ్రేణులు.. గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేయడం, ఆయనతో పాటు మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు బీజేపీలో చేరనున్నారన్న ప్రచారం నేపథ్యంలో గులాబీ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. అకస్మాత్తుగా గువ్వల రాజీనామా, పార్టీ మార్పు ప్రకటనతో పార్టీలో ఏం జరుగుతోందన్న అయోమయంలో పార్టీ శ్రేణులు ఉన్నారు. గువ్వల రాజీనామా క్రమంలో మిగతా నేతలు కూడా అదే బాటలో పడుతున్నారన్న ప్రచారం, వదంతుల నేపథ్యంలో పలువురు నేతలు స్పందించి పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు ఎప్పటికీ పార్టీ లైన్లోనే ఉంటా: జైపాల్యాదవ్ చివరి శ్వాస వరకు బీఆర్ఎస్తోనే: మర్రి తాను చివరి శ్వాస వరకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని, పార్టీ మారే ఆలోచన తనకు లేదని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గ దర్శకాలతో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని చెప్పారు. తాను ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ లైన్లోనే ఉంటానని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గువ్వల నిర్ణయంతో తమకు సంబంధం లేదని చెప్పారు. తాను నిత్యం పార్టీ కార్యకర్తల నడుమ ఉంటున్నానని, బీఆర్ఎస్ పార్టీ కోసమే నిరంతరం పని చేస్తానని స్పష్టం చేశారు. -
‘నౌరోజ్ కళా బృందానికి’ రాష్ట్రస్థాయి గుర్తింపు
అయిజ: లలిత కళా సమాఖ్య సేవా సామాజిక సంస్కృతి ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆదివారం నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ 31వ సువర్ణ కంకరణ అవార్డు సంబరాల్లో అయిజ మండలం నౌరోజ్ క్యాంప్ కళా బృందం ఉత్తమ ప్రతిభ కనబర్చి మొదటి బహుమతి గెలుపొందింది. ఈ గెలుపులో అయిజ మండలం దేవబండ గ్రామానికి చెందిన మాస్టర్ శివకుమార్ ప్రత్యేక పాత్ర పోషించారు. వీరి కుటుంబం మూడు తరాల నుంచి కోలాటం నేర్పిస్తూ.. ఇంటిపేరే కోలంట్లగా మారింది. ఇదిలాఉండగా, హైదరాబాద్లోని కోలాట ప్రదర్శనలో మొత్తం 9 రాష్ట్రాల బృందాలు పాల్గొనగా.. రాష్ట్రం తరపు నుంచి మాస్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో అయిజ మండలానికి చెందిన నౌరోజ్ క్యాంప్ కళా బృందం పాల్గొనింది. ఈమేరకు ఉత్తమ ప్రతిభ కనబర్చగా ఈ బృందానికి ప్రథమ, ఏపీ బృందానికి ద్వితీయ, కేరళ బృందానికి తృతీయ బహుమతి లభించింది. ఈమేరకు నిర్వాహకులు మాస్టర్కు బంగారు కంకణం, మెడల్, బృందం సభ్యులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి, సినీ నటులు జార్జారావు, శివాజీ రాజు పలువురు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సోమవారం పలువురు ప్రముఖులు కోలాటం శివకుమార్ను, నౌరోజ్ క్యాంప్ కళా బృందాన్ని అభినందించారు. -
సీఎం సార్.. మా సమస్యలు పట్టించుకోండి
గట్టు : గట్టులోని ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు సీఎం రేవంత్రెడ్డికి పోస్టుకార్డుల ద్వారా విన్నవించారు. హై స్కూల్లో నెలకొన్న సమస్యలపై విద్యాశాఖ అధికారులకు పలు మార్లు విన్నవించినా సమస్యను పరిష్కరించకపోవడంతో విద్యార్థులు సోమవారం నేరుగా సీఎం రేవంత్రెడ్డికు సమస్యలను పోస్టుకార్డు ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో పోస్టు కార్డులను పంపారు. పాఠశాల విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారని, వారి సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు హలీంపాష డిమాండ్ చేశారు. పీడీ పోస్టు ఖాళీగా ఉందని, ఉపాధ్యాయుల కొరత, గదుల కొరత చాలా ఉందని తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గట్టు హైస్కూల్ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాంఢ చేశారు. -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
గద్వాల: ప్రభుత్వం సూచించిన మేరకు విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ బీఎం సంతోష్ హెచ్చరించారు. సోమవారం సాయంత్రం గద్వాల పట్టణంలోని చింతలపేటలో ఎస్సీ సంక్షేమ వసతిగృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా వసతిగృహంలోని స్టోర్రూం, వంటగది, కాంపౌండ్లోని పరిసర ప్రాంతాల్లో కలియతిరిగారు. ఈసందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడారు. పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలు అడిగారు. దూరప్రాంతాల నుంచి విద్య కోసం ఇంత దూరం వచ్చారని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా క్రమశిక్షణతో ముందుకెళ్లాలని విద్యార్థులకు సూచించారు. స్వయంగా విద్యార్థుల హాజరును పరిశీలించి విద్యార్థుల హాజరు వందశాతం లేని యెడల సక్రమంగా హాజరు కాని వారిపేర్లు తొలగించి వారి స్థానంలో కొత్తవారిని చేర్చుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమశాఖ జిల్లా అధికారి నుషితా, వార్డెన్లు శ్రీను, ఽమధు, రామకృష్ణ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన అనంతరం పట్టణంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. పనుల నాణ్యతపై ఏమాత్రం రాజీపడకుండా ప్రతిదశలో పనులు వేగంగా చేయాలన్నారు. ప్రతిఇంటిని అనుమతించిన 600 చదరపు అడుగుల లోపే నిర్మించేలా లబ్ధిదారులకు తెలియజేయాలని, అవసమరైన ఇసుక, మట్టిని అందజేయాలని, ఏఏ పనులు పూర్తయితే వాటి వివరాలు దశలవారిగా ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. లబ్ధిదారులకు విధిగా డబ్బులు జమచేయాలన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ దశరథ్, హౌసింగ్పీడీ కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
గద్వాల: వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సమావేశం హాలులో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు మొత్తం 43 ఫిర్యాదులను నేరుగా కలెక్టర్కు అందించారు. వాటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపించారు. వీటిని వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం కానిపక్షంలో అందుకు గల కారణాలు వివరిస్తూ సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్నాలెడ్డ్మెంట్ ద్వారా తెలియజేయాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 21 వినతులు గద్వాల క్రైం: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ కార్యక్రమానికి మొత్తం 21 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ శ్రీనివాసరావు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. ప్రధానంగా భూ వివాదం, ఆస్తి తగదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడం లేదని ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని వివరించారు. సివిల్ సమస్యలపై కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలన్నారు. కలెక్టర్కు సన్మానం గద్వాల: వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం నీతిఅయోగ్ ద్వారా చేపట్టిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో భాగంగా గట్టు మండలం ఆరుకీలక సూచికలలో ఉత్తమ ప్రగతి సాధించింది. దీంతో దేశంలోనే గట్టుకు ఉత్తమ ర్యాంకు రావడంతో గవర్నర్ విష్ణుదేవ్వర్మ చేతుల మీదుగా రాజ్భవన్లో కలెక్టర్ బీఎం సంతోష్ ఈ నెల 2వ తేదీన అవార్డు అందుకున్నారు. ఈనేపథ్యంలో అవార్డు పొందిన కలెక్టర్ను జిల్లా అధికారులు సోమవారం ఘనంగా సన్మానించారు. రేపు జాబ్ మేళా కందనూలు: జిల్లాకేంద్రంలోని నేషనల్ ఐటీఐ కళాశాలలో బుధవారం జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి, శిక్షణ శాఖాధికారి రాఘవేంద్రసింగ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వివిధ కేటగిరీల్లో వంద ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని యువతీ, యువకులు 10వ తరగతి, డిగ్రీ, ఫార్మసీ, పాసై 18–35 ఏళ్లలోపు నిరుద్యోగులు హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు సెల్ నం.97012 00819 సంప్రదించాలని కోరారు. పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు కోస్గి రూరల్: కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు చేపట్టామని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులలో సీట్లు ఉన్నా యని తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. విద్యార్థులు తమ ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లతో కళాశాలలో సంప్రదించాలని కోరారు. కాల్వలో జమ్ము తొలగింపునకు చర్యలు అమరచింత: భూత్పూర్ రిజర్వాయర్ నుంచి ప్రదాన ఎడమ కాల్వ నుంచి అమరచింత పెద్ద చెరువుకు సాగునీరు అందడంలో ఆలస్యం అవుతుండటంతో కాల్వలో ఉన్న జమ్మును తొలగించేందుకు ఇరిగేషన్ అధికారులు ముందుకు వచ్చారు. అమరచింత,పాంరెడ్డిపల్లి, పిన్నంచర్ల గ్రామాలకు చెందిన పలువురు రైతులు తమ చెరువులకు సాగునీరు అందడం లేదని విషయాన్ని ఇరిగేషన్ అధికారులకు విన్నవించాలని మాజీ అడ్వకేట్ జనరల్ దేశాయి ప్రకాష్రెడ్డికి ఆదివారం కలిసి విన్నవించారు. తమ సొంత డబ్బులను వెచ్చించి జమ్ము తొలగిస్తామని అధికారులకు తెలపడంతో సోమవారం ఇరిగేషన్ అధికారులు కాల్వ వెంట ఎన్ని మీటర్ల పొడవున జమ్ము, ముళ్ళ పొదలు వ్యాపించి ఉన్నాయనే విషయాలను కాల్వ వెంట తిరుగుతూ పరిశీలించారు. త్వరగా జమ్ము తొలగించే కార్యక్రమం చేపడతామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. -
రేపటి నుంచి బీచుపల్లిలో పవిత్రోత్సవాలు
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో 6వ తేదీ నుంచి 9వ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా 6న విశ్వకేశ ఆరాధన, పుణ్యహం, రక్షాబంధనం, 7న మంగళవాయిద్యాల నడుమ పవిత్ర గ్రామ ప్రదక్షణం, వేద ప్రబంధ పారాయణం, 8న మూల మూర్తి హోమాలు, పూర్ణాహుతి, అనంతరం సామూహిక వరలక్ష్మి వ్రతాలు, 9న లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం, ఉత్సవ పరిసమాప్తి, వేద ఆశీర్వచనం వంటి కార్యక్రమాలతో ఉత్సవాలు ముగియనున్నట్లు తెలిపారు. శివాలయంలో ప్రత్యేక పూజలు బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని శివాలయంలో సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణమాసం అందులోనూ రెండో సోమవారం కావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉదయాన్నే అధిక సంఖ్యలో ప్రజలు బీచుపల్లికి చేరుకొని కృష్ణానదిలో స్నానాలు ఆచరించి శివుడిని దర్శించుకొన్నారు. -
వరుణుడిపైనే ఆశలు..!
జిల్లాలో జూన్, జూలైలో సాధారణం కంటే కనిష్ట వర్షపాతం నమోదు ●గద్వాల: వానాకాలానికి ముందుగానే మే నెలలో ముందస్తుగా వర్షాలు కురవడంతో రైతులు ఎంతో సంతోషించారు. దుక్కులు దున్ని పంటలు సాగుచేసుకునేందుకు సిద్ధం చేసుకున్నారు. ఖరీఫ్లో మెట్టపంటలైన పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, పొగాకు, ఆముదాలు, కందులు, కూరగాయలు వంటి పంటలు 1,73,211 ఎకరాల్లో సాగుచేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, జూన్, జూలైలో సాధారణ వర్షపాతం కంటే కూడా తక్కువ వర్షపాతం నమోదు కావడంతో సాగుచేసిన పంటలు ఎండుముఖం పడుతూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతోపాటు వానాకాలంలో సమృద్ధిగా కురవాల్సిన వర్షాలు.. కురవకపోవడంతో భూగర్భజలాలపై కూడా ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఆశలతో రైతులు పంటలు సాగు చేయగా.. వరుణుడు కురవాల్సిన సమయంలో మాత్రం ముఖం చాటేశాడు. ప్రధానంగా జూన్, జూలై మాసాల్లో సాధారణం కంటే కూడా కనిష్ట వర్షపాతం నమోదైంది. వాస్తవానికి జూన్లో 84.4మిల్లీ మీటర్ల మేర వర్షం నమోదు కావాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా 72.4మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. కేవలం 5 రోజులు మాత్రమే వర్షం కురవగా మిగిలిన 25రోజుల పాటు వర్షమే కురవలేదు. అంటే సాధారణం కంటే 13.5 శాతం వర్షపాతం కనిష్టంగా కురిసింది. అదేవిధంగా జూలైలో సాధారణ వర్షం 112.1 మి.మీటర్లు కురవాల్సి ఉండగా, అందుకు భిన్నంగా కనిష్టంగా 96.9 మి.మీటర్ల వర్షం కురిసింది. కేవలం 9 రోజులు మాత్రమే వర్షం కురిసింది. 22రోజుల పాటు వర్షం జాడేలేదు. అంటే 13.6శాతం వర్షపాతం కనిష్టంగా కురిసింది. కనిష్ట వర్షపాతం నమోదు పత్తి పంట ఎండుతుంది.. గతేడాది పత్తిపంట దిగుబడి బాగా వచ్చింది. ఈసారి ముందస్తు వర్షాలు కురవడంతో 11 ఎకరాల్లో పత్తి పంట సాగుచేశాను. కానీ, జూన్, జూలై రెండు నెలల్లో సరైన వర్షాలు కురవనేలేదు. బాగా కాపుకాసి చెట్టు పెరిగే దశలో నీరు అందకుండా పోయింది. మొక్క పెరుగుదల అనుకున్నంతగా పెరగలేదు. ఇప్పటికే ఎకరాకు రూ.70వేల చొప్పున మొత్తం రూ.7లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. మరో వారం రోజుల్లో సరైన వర్షాలు కురవకపోతే పంట మొత్తం ఎండిపోతుంది. – నాయుడు, బోరెల్లి, మానవపాడు దిగుబడిపై ప్రభావం జూన్, జూలై నెలలో సాధారణ వర్షపాతం కంటే కూడా తక్కువ వర్షాలు కురిశాయి. దీంతో వర్షాధార పంటలకు ఇబ్బందులు తలెత్తాయి. మరో వారం, పది రోజుల్లో ఇలాగే వర్షాలు కురవకపోతే పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. – సక్రియానాయక్, డీఏఓ ఇప్పటికే 1.70 లక్షల ఎకరాల్లో మెట్టపంటలు సాగు ఎండుముఖం పడుతున్న పత్తి, మిరప, వేరుశనగ పంటలు రూ.వేల పెట్టుబడులు పెట్టామంటూ ఆందోళనలో రైతులు -
పర్యావరణహిత విద్యుత్ ఉత్పత్తి చేద్దాం
కొల్లాపూర్: పెరుగుతున్న డిమాండ్, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పర్యావరణ హితమైన విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఉదయం ఆయన నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశిలలో జెన్కో, ట్రాన్స్కో అధికారులతో విద్యుదుత్పత్తి, వినియోగం, ఉత్పాదక సామర్థ్యం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. హైడల్ పవర్తోపాటు పంప్డ్ స్టోరేజీతో పెద్దఎత్తున విద్యుదుత్పత్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 23 పాయింట్స్ గుర్తించి, వాటిమీద సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు. కృష్ణానదిపై ఉన్న జూరాల నుంచి పులిచింతల వరకు గల హైడల్ ప్రాజెక్టులను సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అవసరమైతే అంతర్జాతీయంగా పేరుగాంచిన కన్సల్టెంట్ల సహకారం తీసుకోవాలని చెప్పారు. సోలార్ ద్వారా పగటిపూట ఉత్పత్తి చేసే విద్యుత్ను స్టోరేజీ చేసి రాత్రివేళల్లో వినియోగించుకునేందుకు అవసరమైన సాంకేతిక, స్టోరేజీ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆధునిక సాంకేతిక వినియోగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. 1978లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తోషిబా, మిస్టుబుషి వంటి సంస్థల సాంకేతికతను వినియోగించుకున్న విషయాలను ఆయన గుర్తుచేశారు. సాంకేతికత వినియోగం కోసం కిందిస్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష అనంతరం స్థానిక లంబాడీ గిరిజనులతో డిప్యూటీ సీఎం మాట్లాడారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క -
చేనేత కార్మికులకు కేంద్రమంత్రి సన్మానం
గద్వాల: నేషనల్ డెవ్లప్మెంట్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ ఆధ్వర్యంలో వీవర్ సర్వీసింగ్ సెంటర్ ద్వారా ఎలక్ట్రానిక్ జాకార్డ్స్ సబ్సిడీపై లబ్ధిపొందిన గద్వాలకు చెందిన ఎనిమిది మంది చేనేత కార్మికులను కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి సన్మానం చేశారు. ఆదివారం ఎన్హెచ్డీసీ వారు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చేనేత కార్మికులు శ్రీహరి, శివశంకర్, శ్రీను, సరిత, హిమబిందు, మల్లిఖార్జున్, వెంకటేష్, రాధను కేంద్రమంత్రి మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో నిఫ్ట్ డైరెక్టర్ మాలిని, అక్కల శాంతారాం, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దేశభక్తి చాటుదాం గద్వాల: విజ్ఞానం, వినోదం, వికాసం, ఆటపాటలు వ్యాయమం వంటి శారీరక శ్రమ తగ్గిపోతున్న తరుణంలో విద్యార్థి దశలోనే ప్రతిభ పోటీలు నిర్వహించి వారిలో మనోవికాసాన్ని పెంపొందించేందుకు దోహదపడుతాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ఆదివారం ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిభపోటీలకు సంబంధించిన కరపత్రాన్ని తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తిని చాటుదాం అనే నినాదంతో ప్రజానాట్యమండలి వాళ్లు చేపడుతున్న ఈ ప్రతిభపోటీలు మంచి కార్యక్రమం అన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్రెడ్డి, ఆశన్న, నాయకులు విజయ్, రాజశేఖర్, ఖలీల్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకోవాలి మల్దకల్ : మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడుచుకుంటూ దైవ భక్తిని పెంపొందించుకోవాలని త్రిదండి దేవనాథ జీయర్ స్వామి భక్తులకు సూచించారు. ఆదివారం మండలంలోని అమరవాయిలో ఏర్పాటు చేసిన వెంకట్రామిరెడ్డి పరమావధి కార్యక్రమానికి త్రిదండి దేవనాథ జీయర్స్వామి హాజరై భక్తులకు వేదర్వశీచనాలు అందజేసి ప్రవచనాలు వినిపించారు. ప్రజలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భక్తి మార్గంలో నడుచుకోవాలన్నారు. భగవద్గీత ద్వారా సమాజంలో ఉన్న కులమతాలను రూపుమాపడానికి ప్రజల మధ్య ఉన్న అసమానతలను తొలగించడానికి సర్వమతాలకు దేవుడు ఒక్కడేనని, ప్రజలలో దైవ భక్తిని పెంపొందించడానికి ఎంతో దోహదపడుతుందన్నారు. భక్తులు ఆధ్యాత్మికతను అలవరచుకోవడం వలన జీవితంలో రాణించి ఉన్నత స్థానాలను చేరుకునే వీలుంటుందన్నారు. భగవంతుని చేరడానికి నాలుగు మార్గాలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో కరుణాకర్రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, కృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి గద్వాల: సీపీఎస్ రద్దు– ఓపీఎస్ అమలు కోసం పీఆర్టీయూ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్లోని ఇందిరాపార్కులో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంఘం నాయకులు తిమ్మారెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పీఆర్టీయూ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టిన సీపీఎస్ రద్దును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో భాగంగా సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ ని వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ డిమాండ్ను కోరుతూ పీఆర్టీయూ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేపడుతున్నట్లు, కార్యక్రమంలో ఉపాధ్యాయులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో యూనియన్ నాయకులు వేణుగోపాల్, నర్సింహారెడ్డి, పరమేశ్వర్రెడ్డి, వెంకట్నాయుడు, జాహేద్, రవిప్రకాష్రెడ్డి, ఎల్లస్వామి, గోవిందు తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధిని ఇంటింటా వివరించండి
రాజోళి: బీజేపి హయాంలోనే గ్రామాల్లో నూతన శకం మొదలైందని.. బీజేపీ హయాంలో గ్రామాల్లో చేసిన అభివృద్ధిని ఇంటింటా వివరించాలని నాగర్కర్నూల్ మాజీ ఎంపీ పోతుగంటి రాములు అన్నారు. గృహ మహా సంపర్క్ అభియాన్లో భాగంగా ఆదివారం మండల కేంద్రం రాజోళిలో మండల అధ్యక్షుడు శశి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ..బీజేపి ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రధానిగా గ్రామాలకు అందించిన సేవలను వివరించారు. నేడు గ్రామాల్లో కనిపిస్తున్న అభివృద్ధి ప్రధాని మోదీ ద్వారానే సాధ్యమైందని అన్నారు. సీసీ రోడ్లు, ఉచిత బియ్యం, ముద్ర రుణాలు, విశ్వకర్మ రుణాలను అందించి సాధారణ, మద్య తరగతి ప్రజలకు మేలు చేసిందన్నారు. దేశ భద్రతలో భాగంగా ఆర్టికల్ 370 రద్దు, మైనార్టీ మహిళల కోసం త్రిపుల్ తలాక్ రద్దు, ఆపరేషన్ సిందూర్ చేపట్టి ఉగ్రమూకలను తోక ముడుచుకునేలా చేసిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలను ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి, హామీలను తుంగలో తొక్కిందని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అబద్దపు హామీలను, రిజర్వేషన్ల పేరుతో ఓట్లు కాజేసేందుకు మళ్లీ ప్రజల్లోకి వస్తుందని, వారిని ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంపై, బీజేపీ పాలనపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని, రానున్న అన్ని ఎన్నికల్లో బీజేపి విజయఢంకా మోగిస్తుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా కన్వీనర్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ...ఈ నెల 4,5 తేదీలల్లో మండల నాయకులు, బూత్ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు 100 ఇళ్లకు తిరిగి బీజేపి ప్రభుత్వం చేసిన అభివృద్ది పనులను ప్రజలకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో రాజగోపాల్,సంజీవ రెడ్డి,రాజశేఖర్,నాగేశ్వర్ రెడ్డి, నాగరాజు, గోవిందు రాజులు, గోపాల కృష్ణ, భగత్ రెడ్డి బీమన్న తదిదరులు పాల్గొన్నారు. -
అయ్యో దేవుడా!
ముంపునకు గురైన ‘ఆలూరు’ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా ర్యాలంపాడు రిజర్వాయర్ నిర్మాణంలో ఆలూరు గ్రామం ముంపునకు గురైంది. 2016లో ర్యాలంపాడు రిజర్వాయర్ను పూర్తి స్థాయి 4 టీఎంసీల నీటిని నింపడంతో ఆలూరు గ్రామస్తులు గ్రామాన్ని ఖాళీ చేసి, పునరావాస కేంద్రంలోకి మకాం మారారు. ముంపు గ్రామస్తులకు అప్పట్లో బింగిదొడ్డి తండా సమీపంలో ప్రభుత్వం 130 ఎకరాల్లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి, 1,452 మందికి ప్లాట్లను కేటాయించింది. ఆలూరు ముంపు గ్రామస్తులతో పాటుగా ఆలయాలకు ప్రభుత్వం పరిహారాన్ని అందజేసింది. ఇక్కడి గ్రామస్తుల ప్రధాన దైవం ఆంజనేయస్వామి, శివాలయం. ఆలయాలకు ప్రభుత్వం సుమారుగా రూ.28 లక్షల పరిహారం అందజేస్తే.. బ్యాంకులో దాచుకున్న ఆ డబ్బులు ఇప్పుడు రెట్టింపయ్యాయి. ఈ నిధులు రూ. 50 లక్షలకు చేరాయి. రెండున్నర నెలల క్రితమే ఆలూరు పునరావాస కేంద్రంలో ఆంజనేయస్వామి, శివాలయాల నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లను పిలిచి పనులు అప్పగించింది. పనులు ఇప్పటికి ప్రారంభం కాలేదు. ఆలూరు గ్రామంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న 10 శాతం ఖాళీ స్థలంలో ఆంజనేయస్వామి, శివాలయంలో పాటుగా వాల్మీకి, కనకదాసుల విగ్రహాలు రేకుల మధ్య గుడిసెల్లో పూజలందుకుంటున్నారు. ఇక్కడి ఆంజనేయస్వామి జాతరను ప్రతి ఏటా జనవరిలో గ్రామస్తులు నిర్వహిస్తుంటారు. అయితే ఇక్కడ ఆలయ నిర్మాణం కోసం 6 పాట్లను కేటాయించారు. మిగతా దాంట్లో కొందరికి ప్లాట్లను కేటాయించిన నేపథ్యంలో వివాదం నెలకొంది. ఈ స్థలం మొత్తంలో ఆలయ నిర్మాణంతోపాటుగా జాతర, వివాహాది శుభకార్యాయాలు జరుపుకొనేందుకు అనువుగా ఆలయంతో పాటుగా ఖాళీ స్థలం ఉండాలని కొందరు పట్టుబట్టారు. ఈ పురనరావాస కేంద్రంలో రెండు చోట్ల పబ్లిక్ పర్పస్ కోసం బస్టాండ్ దగ్గర 3 ఎకరాలు, గ్రామం మధ్యలో 3 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇందులో కొంత మేరకు అన్యాక్రాంతం అయినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బస్టాండ్ పక్కనే ఉన్న మొత్తం ఖాళీ స్థలం మొత్తం దేవాలయాలు, గ్రామంలో నిర్వహించే శుభకార్యాలు, ఉత్సవాల కోసం అలానే ఉంచాలని మరికొందరు గ్రామస్తులు పట్టుపడుతుడుతున్నారు. ఆలయానికి కావాల్సిన 6 ప్లాట్లు సరిపోతాయని, మిగిలినవి లోతట్టు ప్రాంతంలో కట్టడాలకు పనికి రాని చోట కేటాయించిన వారికి ప్లాట్లను ఇవ్వాలని మరి కొందరంటున్నారు. ఆలయ నిర్మాణంపై గ్రామస్తుల్లో ఏకాభిప్రాయం లేని కారణంగా ఆలయాల నిర్మాణంపై ప్రభావం పడింది. రూ.లక్షలు ఉన్నా పూరి గుడిసెల్లోనే పూజలందుకుంటున్న దేవుళ్లు గట్టు: ఏ ఊరిలో అయినా పెళ్లి లేదా.. పండుగ.. ఇలా ఏ శుభకార్యమైనా మొదట ఆలయానికి వెళ్లి అంతా మంచి జరగాలంటూ దేవుడికి మొక్కులు చెల్లించుకుంటుంటారు. కానీ, ఆ ఊరిలో మాత్రం ఏళ్లుగా ఆలయాల నిర్మాణానికి నోచుకోక దేవుళ్లు పూరి గుడిసెలోనే ఉండిపోవడంతో గ్రామస్తులు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలయాలను పక్క గ్రామాలకు వెళ్లి చేయించుకునే పరిస్థితి నెలకొంది. చివరికి ఏటా ఘనంగా జరుపుకొనే జాతర సైతం కల తప్పినట్లయ్యింది. గట్టు మండలం ఆలూరు పునరావాస కేంద్రంలో నెలకొన్న విచిత్ర పరిస్థితి ఇదీ. ఆలూరులోని దేవుళ్ల పేరిట బ్యాంకుల్లో రూ.లక్షలు ఉన్నా ఆలయ నిర్మాణానికి మాత్రం నోచుకోవడేంలేదు. రెండున్నర ఏళ్ల క్రితం టెండర్లు పిలిచి పనులు అప్పగించినా.. నేటికీ ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. అటు ఆలయాల నిర్మాణాలు చేపట్టక.. రేకుల గుడిసెలో దేవుడు తలదాచుకుంటూ పూజలందుకునే పరిస్థితి నెలకొంది. ఆలూరు గ్రామంలో ఆలయాలు లేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. శుభకార్యాయాలు, పెళ్లిళ్లు జరుపుకోవాలన్నా ఆరు బయటే జరుపుకోవాల్సిందే. దేవుడి దీవెనల కోసం పూరి గుడిసెలో ఉన్న స్వామి వారిని దర్శించుకునే పరిస్థితి గ్రామంలో ఇప్పటికి కొనసాగుతోంది. గ్రామంలో ఆలయాల నిర్మాణం ప్రారంభం కాకపోవడంతో ఇప్పటికి పండుగలు, వివాహాది శుభకార్యాయాలు నిర్వహించుకునే సందర్భంలో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామానికి కొత్తగా వచ్చిన వారు గ్రామంలో ఆలయాలు లేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పట్టువిడుపులు మాని ఆలయ నిర్మాణానికి అధికారులు, ప్రజా ప్రతి నిధులు కృషి చేయాలని ఆలూరు గ్రామస్తులు కొరుతున్నారు. ఆలూరులో వివాదాస్పదంగా మారిన ఖాళీ స్థలం ఇదే.. త్వరలో నిర్మాణాలు చేపడతాం పునరావాస కేంద్రంలో ఆలయ నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. ఆలయంతో పాటుగా వివిధ నిర్మాణాలకు మరిన్ని నిధులు రావాల్సి ఉంది. వీటిపై సమీక్షించి, ఏడాదిలోపు నిర్మాణాలను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటాం. – లక్ష్మీనారాయణ, అడిషనల్ కలెక్టర్ ఆలయం నిర్మించాలి ఆలూరు పునరావాస కేంద్రంలో నూతన ఆలయాల నిర్మాణం చేపట్టని కారణంగా ఇబ్బంది పడుతున్నాం. పెళ్లిళ్లను ఊరిలో కాకుండా ఇతర ప్రాంతాల్లో చేసుకునే పరిస్థితి నెలకొంది. దేవుళ్లను గుడిసెల్లోనే పూజించుకుంటున్నాం. బస్టాండ్ పక్కనే ఉన్న 10 శాతం ఖాళీ స్థలం ఆలయాలు, ఫంక్షన్ హాల్, పబ్లిక్ పార్కు కోసం కేటాయించాలి. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి పునరావాస కేంద్రంలో నూతన ఆలయాలను నిర్మించాలి. – మహేష్గౌడ్, ఆలూరు ●ప్లాట్ల కేటాయింపు వివాదం ఆలూరు పునరావాస కేంద్రంలో ఆలయాల నిర్మాణాలకు గ్రహణం ఆలయాల పేరిట బ్యాంకులో మూలుగుతున్న రూ.50 లక్షలు రెండున్నరేళ్ల క్రితమే నిర్మాణానికి టెండర్లు ఎటూ తేలని 10 శాతం స్థలంలో ప్లాట్ల పంచాయితీ -
రుణ లక్ష్యం ఖరారు
రూ. 2998.57కోట్ల పంట రుణాలు ఇవ్వాలని నిర్దేశం రుణ లక్ష్యం నెరవేరేలా చర్యలు. పంట పెట్టుబడుల్లో బాగంగా పంట రుణాలకై ధరఖాస్తు చేసుకునే అర్హులైన రైతులందరికి రుణాలు అందిస్తాం. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రుణ లక్ష్యం మేరకు రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటాము. ఇందులో బాగంగా ఆయా బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశించాము. – శ్రీనివాసరావు, ఎల్డీఎం గద్వాలన్యూటౌన్: జిల్లాలో పంట రుణ లక్ష్యం ఖరారైంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను వానాకాలం, యాసంగి రెండు సీజన్లలో 1,47,258 మంది రైతులకు రూ. 2998.57 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. నడిగడ్డ రైతాంగం బ్యాంకులు అందించే రుణాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్టులతో పాటు నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద ఏడు రిజర్వాయర్లు, వందకు పైగా చెరువులు, కుంటలు ఉన్నాయి. ఏటా రెండు సీజన్లలో దాదాపు 5లక్షల ఎకరాల వరకు వివిధ రకాల పంటలను సాగు చేస్తుంటారు. పండ్లతోటలు, కూరగాయలు కూడా పండిస్తున్నారు. అయితే జిల్లాలో సన్న, చిన్నకారు రైతులు వేల సంఖ్యలో ఉన్నారు. రైతుభరోసా, పీఎం కిసాన్ సమ్మాన్ యోజన వంటి పంట పెట్టుబడుల పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్నా.. వాటితో రైతలు అవసరాలు పూర్తిగా తీరడం లేదు. దీంతో వీరంతా బ్యాంకులు అందించే పంట రుణాలపైనే ఆధారపడి సేద్యం చేస్తున్నారు. బ్యాంకర్లు సకాలంలో రుణాలు ఇవ్వకపోతే అధిక వడ్డీలకు ప్రైవేటులో అప్పులుచేసి ఆర్థికంగా నష్టపోతున్నారు. బ్యాంకర్లు సకాలంలో రుణాలు అందిస్తేనే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ● ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన పంట రుణ పరిమితి మేరకు బ్యాంకులు రైతులకు రుణాలు అందిస్తాయి. అందులో బాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయా బ్యాంకుల వారీగా రెండు సీజన్లకు రుణ లక్ష్యాన్ని లీడ్ బ్యాంక్ అధికారులు రూపొందించారు. వానాకాలంలో 88,356 మంది రైతులకు రూ. 1798 కోట్లు, యాసంగిలో 58,902 మంది రైతులకు రూ. 1200.58 కోట్లు లక్ష్యంగా నిర్దేశించారు. దీన్ని కొన్నిరోజల క్రితం కలెక్టర్ అధ్యక్షతన జరిగిన డీఎల్ఆర్సీ సమావేశంలో ఆమోదించారు. బ్యాంకుల వారీగా రుణ లక్ష్యం ఇలా (రూ.కోట్లలో) వానాకాలంలో 88,356మంది, యాసంగిలో 58,902మందిరైతులకు ఆర్థిక తోడ్పాటు లక్ష్యం నెరవేరితేనే ప్రయోజనం -
పాలమూరుపై బీఆర్ఎస్ నిర్లక్ష్యం
కొల్లాపూర్: ‘పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేయడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది.. ప్రాజెక్టు పనులు పూర్తిచేసి ఉంటే రిజర్వాయర్లలో కృష్ణానీటిని నింపుకొనేవాళ్లం.. పాలమూరు ప్రాజెక్టుతోపాటు జిల్లాలోని జూరాల, కోయిల్సాగర్, నెట్టెంపాడు, కేఎల్ఐ ప్రాజెక్టుల్లోని పెండింగ్ పనులన్నీ పూర్తిచేస్తాం.. ఇందుకు అవసరమైన నిధులు కేటాయిస్తామని’ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఆయన కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించి.. పలు విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణాలకు శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం రాజాబంగ్లా ఎదుట ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పలువురు లబ్ధిదా రులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి చెక్కులు, రేషన్కార్డులు, రైతులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. కొల్లాపూర్తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. 1980లో మల్లు అనంతరాములు నాగర్కర్నూల్ ఎంపీగా పోటీ చేశారని, తాను అప్పుడు కొల్లాపూర్ నియోజకవర్గానికి ఇన్చార్జిగా వ్యవహరించానని పేర్కొన్నారు. మధిర ప్రజలతో ఉన్న అనుబంధమే కొల్లాపూర్ ప్రజలతో నూ ఉందన్నారు. పాలమూరు బిడ్డ సీఎం రేవంత్రెడ్డి, కొల్లాపూర్తో అను బంధం ఉన్న తాను ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు విజ్ఞప్తి మేరకు కొల్లాపూర్లో అడ్వాన్స్ టెక్నాలజీతో ఐటీఐ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. గతంలో తొలగించిన బ్యాంకులన్నింటినీ తిరిగి గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు అధికారులతో మాట్లాడతామన్నారు. శ్రీశైలం నిర్వాసితుల అంశం ఆర్థిక పరమైనది కాబట్టి దీనిపై పరిశీలన చేసి చెబుతానన్నారు. ముంపు బాధితుల కోసం జూపల్లి కోరిన 3 వేల అదనపు ఇళ్ల గురించి కలెక్టర్లతో మాట్లాడి సమాచారం తెలుసుకొని తగిన న్యాయం చేస్తానన్నారు. అభివృద్ధికి సహకరించండి: మంత్రి జూపల్లి కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్దికి సహకరించా లని మంత్రి జూపల్లి కృష్ణారావు డిప్యూటీ సీఎంను కోరారు. ఇక్కడ ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కళాశాలలు మంజూరు చేయాలని, శ్రీశైలం నిర్వాసితులకు పంచాయతీ కార్యదర్శి, లష్కర్ పోస్టులు ఇవ్వాలని, లేనిచో ఒక్కో కుటుంబానికి రూ.25 లక్ష ల చొప్పున అదనపు పరిహారం చెల్లించాలని, నిర్వాసితుల కోసం నియోజకవర్గానికి అదనంగా 3 వేల ఇళ్లు మంజూరు చేయాలని విన్నవించారు. డిజిటల్ బుక్స్ ఆవిష్కరణ.. ఐఐఎఫ్సీఎల్ ఆధ్వర్యంలో ఎస్ఎస్సీ విద్యార్థుల కోసం రూపొందించిన డిజిటల్ బుక్స్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. వీటికి స హకరించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డిని ఆయ న అభినందించారు. ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, మేఘారెడ్డి, రాజేష్రెడ్డి, నారాయణరెడ్డి, శ్రీనివాసరెడ్డి, డీసీ సీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, నాయకులు జగదీశ్వర్రావు, ఒబేదుల్లా కొత్వాల్, సరిత పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే బుద్ధి చెప్పండి: ఎంపీ మల్లురవి ముగ్గురు, నలుగురు సీఎంలు మారినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి.. కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు జాతీయ రహదారి, సోమశిల– సిద్దేశ్వరం బ్రిడ్జిని మంత్రి జూపల్లి కృష్ణారావు సాధించారని ఎంపీ మల్లురవి అన్నారు. సీఎంను, డిప్యూటీ సీఎంను, మంత్రులను, ప్రభుత్వాన్ని ఎవరైనా అనవసరంగా విమర్శిస్తే వారికి కుక్కకాటుకు చెప్పుదెబ్బ తరహాలో బుద్ధిచెప్పాలని పార్టీ శ్రేణులకు సూచించారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి రూ.899 కోట్లు కేటాయించాలని, పాలమూరు ప్రాజెక్టు పనులకు రూ.5 వేలు లేదా రూ.10 వేల కోట్లు విడుదల చేయాలని డిప్యూటీ సీఎంను కోరారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో కొత్తగా 50 గ్రామీణ లైబ్రరీలను సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఏర్పాటు చేయబోతున్నామని, అందులో 8 లైబ్రరీలు కొల్లాపూర్ ప్రాంతంలోనే ఉంటాయన్నారు. అప్పుడే పూర్తి చేసి ఉంటే రిజర్వాయర్లలో కృష్ణానీళ్లు నింపుకొనేవాళ్లం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల అసంపూర్తి పనులకు నిధులు కేటాయిస్తాం అడ్వాన్స్ టెక్నాలజీతో ఐటీఐ ఏర్పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క -
పర్యవరణాన్ని పరిరక్షించుకుందాం
అలంపూర్: పర్యవరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా జడ్జి ప్రేమలత అన్నారు. వనమహోత్సవంలో భాగంగా శనివారం అలంపూర్ కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందన్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. అనంతరం జిల్లా జడ్జితో పాటు స్థానిక జూనియర్ సివిల్కోర్టు జడ్జి మిథున్ తేజను న్యాయవాదులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గవ్వల శ్రీనివాసులు, ఏపీపీ కార్తిక్ రాజ్, ఏజీపీ మధుసూదన్, ఎంఈఓ అశోక్కుమార్, న్యాయవాదులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం గద్వాల: బేగంపేట, రామనంతాపూర్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 2025–26 విద్యా సంవత్సరం ఒకటో తరగతిలో డేస్కాలర్గా ప్రవేశాల నిమిత్తం జిల్లాలోని గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిరిజన సంక్షేమశాఖ అధికారి పవన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2018 జూన్ 1నుంచి 2019 మే 31వ తేదీ మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారాలను జిల్లా గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో పొందవచ్చన్నారు. దరఖాస్తుతో పాటు నివాస, కులం, ఆదాయం, జనన ధ్రువపత్రాల జిరాక్స్తో ఈ నెల 8వ తేదీలోగా జిల్లా గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. 12న లక్కీ డిప్ ద్వారా విద్యార్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు. 7న సీపీఐ జిల్లా మహాసభలు గద్వాల: జిల్లా కేంద్రంలోని వాల్మీకి భవన్లో ఈ నెల 7న సీపీఐ జిల్లా 3వ మహాసభలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బి.ఆంజనేయులు అన్నారు. ఈ మేరకు శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో మహాసభలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ దేశ సంపదను దోచిపెడుతోందని ఆరోపించారు. దేశ ఐక్యత, లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని హాని తలపెడుతున్నారన్నారు. రాజ్యాంగ మూలాలను నాశనం చేయాలనే ఉద్దేశంతోనే దళితులపై దాడులకు తెగబడుతున్నారని అన్నారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ వంటి నిత్యావసర ధరలు పెంచి సామాన్యులపై భారం మోపుతున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో భవిష్యత్ పోరాటాలకు నాంది పలికేందుకు జిల్లా మహాసభల్లో పలు నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రంగన్న, ఖాసీం, ఉప్పేరు కృష్ణ, ప్రవీణ్, రవి, రామాంజనేయులు, తిమ్మప్ప, గోకారి పాల్గొన్నారు. ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్ గద్వాల: ఫేక్ డీఎస్ఆర్ అటెండెన్స్ నమోదు చేసిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు పడింది. మల్దకల్ మండలం విఠలాపురం, గట్టు మండలం బోయలగూడెం పంచాయతీ కార్యదర్శులు తిరుమలేశ్, శ్రీనివాసులును సస్పెన్షన్ చేసినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. లైవ్ డీఎస్ఆర్ అటెండెన్స్ నమోదు చేయకుండా ఫేక్ డీఎస్ఆర్ నమోదు చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. వేరుశనగ క్వింటాల్ రూ.6,100 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు శనివారం 482 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాల్కు గరిష్టంగా రూ. 6,100, కనిష్టంగా రూ. 3,499, సరాసరి రూ. 5,090 ధరలు లభించాయి. -
వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యాన్ని సహించం
గద్వాల క్రైం: ప్రజలకు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర వైద్యరోగ్యశాఖ మానిటరింగ్ అధికారి ఫణిందర్రెడ్డి హెచ్చరించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముందుగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి.. రోగులకు అందుతున్న సేవలు, మందుల నిల్వలు, వైద్యుల పనితీరు, స్కానింగ్ పరికరాల వినియోగం, మౌలిక వసతులు తదితర వివరాలను సూపరింటెండెంట్ ఇందిరతో తెలుసుకున్నారు. ప్ర సవాల కోసం వచ్చే గర్భిణులకు సాధ్యమైనంత వర కు సాధారణ ప్రసవం చేయాలని వైద్యులకు సూచించారు. అత్యవసరమైతేనే సిజేరియన్ చేయాలన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అన్నిరకాల మందులను అందుబాటు లో ఉంచుకోవాలని సూచించారు. అనంతరం రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. సెంట్రల్ మెడిసిన్ స్టోర్లో మందుల నిల్వ వివరాలను ఫార్మసిస్ట్తో తెలుసుకున్నారు. ప్రమాదకర వ్యాధులు, శస్త్ర చికిత్సల కోసం అందజేసిన మందులు, రోగుల వివరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అందుబాటులో లేని మందుల కోసం సమర్పించిన నివేదికలపై ఆరా తీశారు. కాగా, టెక్నిషియన్ పోస్టు ల భర్తీ కోసం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశామని సూపరింటెండెంట్ తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశా రు. మానిటరింగ్ అధికారి వెంట సిబ్బంది కౌటిల్య, వేణుగోపాల్, శ్రీనివాసులు, అభినేష్, రాజు, మధుసూదన్రెడ్డి, వినోద్ తదితరులు ఉన్నారు. -
కేంద్రియ విద్యాలయ ఏర్పాటుకు స్థల పరిశీలన
మల్దకల్ : మండల కేంద్రమైన మల్దకల్, కుర్తిరావుల చెర్వు గ్రామ పరిసరాల్లోని ప్రభుత్వ భూమిని శుక్రవారం కేంద్రియ విద్యాలయ అధికారులు కృష్ణవేణి, హరిప్రసాద్, డీఈఓ అబ్దుల్ ఘని పరిశీలించారు. మల్దకల్ తహసీల్దార్ ఝాన్సీరాణి, ఎంఈఓ సురేష్ల ఆధ్వర్యంలో మల్దకల్ టూరిజం శాఖ నిర్మించిన అతిథిగృహాన్ని తాత్కాలిక కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి నిర్మాణాలు చేపట్టే వరకు ప్రస్తుతం వాటిలో పాఠశాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేంద్రియ విద్యాలయ ఏర్పాటుతో గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందనుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి శాంతిరాజు, సూపరిండెంట్ వీరశేఖర్, సర్వేయర్ హరికృష్ణ, ఆర్ఐ మద్దిలేటి తదితరులు ఉన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితం
గద్వాల: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అవసరమైన ఇసుకను ఉచితంగా కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలోని వీనియోకాన్ఫరెన్స్ హాలులో ఇసుక బుకింగ్ విధానంపై రారష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అవసరమైన ఇసుక సరఫరా కోసం తుమ్మిళ్ల ప్రాంతంలో ఒక ఇసుక రీచ్ను గుర్తించామని, రేట్చార్జ్ను సిద్ధం చేసి లబ్ధిదారుల జాబితాను త్వరగా ఇస్తే వారికి ఉచిత ఇసుకను వెంటనే పంపిణీ చేసేలా ప్రఽణాళిక చేశామన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి 25క్యూబిక్ మీటర్ ఇసుకను అందించనున్నట్లు తెలిపారు. ఇసుక రవాణాకు ట్రాక్టర్ యజమానులు రిజిస్ట్రేషన్ చేసుకున్న ట్రాక్టర్లు, సొంత ట్రాక్టర్ల ద్వారా రవాణా చేసుకోవాలని సూచించారు. ఇసుక పక్కదారి పట్టకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఎస్డీసీ శ్రీనివాస్రావు, హౌసింగ్పీడీ కాశీనాథ్, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలతోపాటు మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
మహిళా హక్కుల రక్షణకు ఉద్యమిద్దాం
గద్వాలటౌన్: దేశంలో మహిళా హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జరిగిన ఐద్వా జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో సీ్త్ర, పురుషులకు అనేక హక్కులను ప్రకటించినప్పటికి సమస్యలు వెంటాడుతున్నాయన్నారు. సీ్త్ర, పురుషుల మధ్య సమానత్వం లేదని.. విద్యా, వైద్యం, ఉపాధి రంగాలలో సీ్త్రలు ఇప్పటికి వెనుకబడే ఉన్నారని చెప్పారు. చట్టరీత్యా హక్కులున్నా అవేవీ సీ్త్రలకు అందుబాటులో లేవన్నారు. వీటికి తోడు హత్యాచారాలు, వరకట్నపు మరణాలు, కుటుంబంలో హింస, బలవంతపు పెళ్లిలు, బాల్యవివాహాలు, బహు భార్యత్వం వంటి అనేక సమస్యలు సీ్త్రలను వేధిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు వీటిని అరికట్టేందుకు సమగ్రమైన ప్రతిపాదిత చట్టాలు చేయాలని కోరారు. ప్రజాస్వామ్యం, సమానత్వం, సీ్త్ర విముక్తి అనే నినాదంతో ఐద్వా పనిచేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి నర్మద, కమిటీ సభ్యులు పద్మ, రత్నమ్మ, రాణి, సుధా, పద్మ, భాగ్యమ్మ, అమ్ములు, రాధా, కై యూమ్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్య పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: అలంపూర్ ఏరియా ఆసుపత్రిలో కాంట్రాక్టు విధానంలో వైద్యాధికారుల నియామకాలు చేపడుతున్నట్లు అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్చంద్ర శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అలంపూర్ ఏరియా ఆసుపత్రిలో గైనకాలజిస్ట్–2, జనరల్ సర్జన్–2, జనరల్ మెడిసిన్–2, అనస్తిటిస్ట్–2, ఈఎన్టీ–1, ఆర్థోపెడిక్–1, పాథాలజిస్ట్–1, సైక్రియార్టిస్ట్–1, డెర్మటాలజిస్ట్–1 పోస్టు ఖాళీగా ఉన్నాయని, అదేవిధంగా అలంపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో జనరల్ మెడిసిన్–1, పిడియాట్రీషియన్–1, జీడీఎంవో(ఎంబీబీఎస్)–2 కాంట్రాక్టు పోస్టులకు దరరఖాస్తులు చేసుకోవాలని కోరారు. దరఖాస్తుదారులు ఈనెల 7వ తేదీన అలంపూర్ ఏరియా ఆసుపత్రి, అలంపూర్ క్రాస్రోడ్డులో వాక్–ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్లో 75 మంది బాలలకు విముక్తి గద్వాల క్రైం: జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ –11 విజయవంతమైందని, మొత్తం 75 మంది బాలకార్మికులను గుర్తించి విముక్తి కల్పించినట్లు ఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గద్వాల – అలంపూర్ సెగ్మెంట్లో జులై 1 నుంచి 31వ తేదీ వరకు పోలీసు, కార్మిక, విద్య, స్వచ్ఛంద సంస్థలు సమష్టిగా కృషి చేశాయని, పలు ప్రాంతాల్లో బాలకార్మికులుగా పని చేస్తున్న 75 మంది చిన్నారులను గుర్తించి వారిని వెట్టి నుంచి విముక్తి కల్పించామని తెలిపారు. అనంతరం చిన్నారులను పాఠశాలలో చేర్పించామని, వారిని పనిలో పెట్టుకున్న యజమానులపై 18 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. జిల్లాలో ఎవరైన చిన్నారులను పనిలో పెట్టుకుంటే డయల్ 100 లేదా 1098కు సమాచారం అందించాలని, ఆపరేషన్ ముస్కాన్లో విధులు నిర్వహించిన సిబ్బంది కృషి మరువలేనిదని తెలిపారు. కేంద్రం నిధులిస్తే.. కాంగ్రెస్ ప్రారంభోత్సవాలా ? అలంపూర్: కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చి నిర్మిస్తే కాంగ్రెస్ మంత్రులు ప్రారంభోత్సవాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. అలంపూర్లోని ప్రసాద్ స్కీం భవనంలో బాలబ్రహ్మేశ్వర నిత్య అన్నదాన సత్రాన్ని, ఏర్పాట్లను ఆయనతోపాటు బీజేపీ నాయకులతో కలిసి శుక్రవారం సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్రం ప్రసాద్ స్కీం పథకం ద్వారా జోగుళాంబ ఆలయానికి 2021లో రూ.80 కోట్లు పలు భవనాలు, అభివృద్ధి పనుల కోసం కేటాయించారన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం రూ.36.72 కోట్లు మాత్రమే వినియోగించుకున్నట్లు తెలిపారు. నిర్మించిన వసతి గృహాలను సైతం వినియోగంలోకి తేవడానికి సరైన చర్యలు చేపట్టడం లేదన్నారు. ఈ భవనంలో భక్తుల సౌకర్యార్థం కళ్యాణమండపం, ఆడిటోరియం వంటివి అందుబాటులోకి రావాల్సి ఉందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల ప్రసాద్ స్కీంలోని సౌకర్యాలతోపాటు నిత్య అన్నదాన సత్రం తెలిసే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.కార్యక్రమంలో బీజేవైఎం ఉపాధ్యాక్షుడు రాజశేఖర్ శర్మ, బీజేపీ నాయకులు రాజగోపాల్, నాగేశ్వర్ రెడ్డి, శరత్, ఈశ్వర్, మురళికృష్ణ, రామకృష్ణ, నాగమల్లయ్య ఉన్నారు. జీవన ప్రమాణాలు మెరుగుపడాలి: వీసీ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే ఆర్థిక క్రమశిక్షణ అవసరం అని పాలమూరుయూనివర్సిటీ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో ఆర్థిక విద్య, జీవన నైపుణ్యాలు అనే అంశంపై ఒకరోజు జాతీయ వెబినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆన్లైన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం నైపుణ్య ఆధారిత పరిజ్ఞానం అవసరం అన్నారు. విద్యార్థి దశలోనే ఆర్థిక అవగాన పెంచుకుని, దేశ స్థూల జాతీయోత్పత్తిలో మీ వంతు పాత్ర పోషించాలన్నారు. కీనోట్ స్పీకర్, సీనియర్ కన్సల్టెంట్ బ్రహ్మ, రిజిస్ట్రార్ రమేష్బాబు, మధుసూదన్రెడ్డి, అర్జున్కుమార్ పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.6,570 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు శుక్రవారం 622 క్వింటాళ్ల వేరుశనగ రాగా గరిష్టం రూ. 6570, కనిష్టం రూ. 2276, సరాసరి రూ. 5370 ధరలు లభించాయి. -
హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
● అధికారులు సమన్వయంతో పనిచేయాలి.. ● నిర్లక్ష్యం వహిస్తే వేటుతప్పదు ● కలెక్టర్ బీఎం సంతోష్ గద్వాల: గురుకులాలు, సంక్షేమ శాఖల వసతిగృహాల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ బీఎం సంతోష్ హెచ్చరించారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాస్రావుతో కలిసి సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పాఠశాలలు, హాస్టళ్లల్లో నిర్వాహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా తగిన వేటుతప్పదన్నారు. ఇటీవల ఓ పాఠశాలలో జరిగిన ఘటనపై సంబంధిత డిప్యూటీ వార్డెన్, సూపర్వైజర్లను సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నిర్లక్ష్యం వహించిన ఇతర సంబంధిత అధికారులకు కూడా మొమోలు జారీ చేసినట్లు తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల సంక్షేమం కోసం మండల స్థాయి అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేయాలన్నారు. అన్ని మండలాలకు జిల్లా స్థాయి స్పెషల్ అధికారులను నియమించడం జరిగిందన్నారు. ప్రతినెలా కనీసం రెండుసార్లు పాఠశాలలు సందర్శించి అక్కడి విద్య, భద్రతా, మౌళిక వసతులైన తాగునీరు, మరుగుదొడ్లు ఇతర అవసరాలను సమీక్షించాలన్నారు. విద్యార్థులకు ప్రతిరోజు మెను ప్రకారం నాణ్యమైన పోషకాహారంతో కూడిన భోజనం తప్పనిసరిగా అందించాలన్నారు. ఏదైనా సమస్యలు తలెత్తితే వెంటనే తహసీల్దార్, ఎంపీడీవో పోలీసు అధికారులకు తెలియపర్చాలని తహసీల్దార్ మండల స్థాయి మెజిస్ట్రేట్ వెంటనే స్పందించాలన్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అనంతరం ఎస్పీ శ్రీనివాస్రావు మాట్లాడుతూ.. జిల్లాల్లో ఎలాంటి సంఘటన జరిగిన వెంటనే పోలీసుశాఖ అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటుందని, వసతిగృహాల ప్రతివిషయం అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. వ్యక్తులు ఎవరైనా విద్యార్థులను రోడ్డుపైకి వచ్చేలా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వసతి గృహాల్లోకి బయటి వారిని అనుమతించకూడదని వసతిగృహాల విద్యార్థుల హక్కులకు భంగం కలిగించే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. విద్యాలయాల ఆవరణలో ఎవరైనా మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. మండల స్థాయిలో అధికారులు, పోలీసువిభాగం పరస్పరం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు, ఆర్డీవో అలివేలు, అధికారులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తిచెందకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీస్తీదవాఖానాను ఆకస్మింకగా తనిఖీ చేశారు. దగ్గు, జలుబు, జ్వరం నివారణకు సంబధించి మెరుగైన వైద్యం అందించాలని, దోమల నివారణకు ఆయిల్బాల్స్, బ్లీచింగ్ వంటి నివారణ కారకాలను ఉపయోగించాలన్నారు. ఎరువుల కొరత సృష్టించొద్దు రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలని, వాటి కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ అన్నారు. రైతు నుంచి ఆధార్ వివరాలు సేకరించిన అనంతరమే యూరియా విక్రయాలు చేయాలని, ఈ–పాస్ ద్వారా అమ్మకాలు జరగాలన్నారు. జిల్లాలో ఎరువుల నిల్వలు, వినియోగంపై సమగ్ర నివేదికను ఇవ్వాలని డీఏవో సక్రియానాయక్ను ఆదేశించారు. -
టీచర్లకు తీపికబురు
ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా.. నిలిచిన డిప్యూటేషన్లు.. ఉమ్మడి జిల్లాలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో ఎంఈఓల నుంచి డిప్యూటేషన్ ఇవ్వాల్సిన ఉపాధ్యాయుల వివరాలను డీఈఓలు సేకరించారు. వీటికి కలెక్టర్ అనుమతితో ఆర్డర్ ఇవ్వాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 680 మందికి డిప్యూటేషన్లు ఇవ్వాల్సి ఉండగా ఒక్క మహబూబ్నగర్లోనే 330 మంది బదిలీ కావాలి. కానీ, ప్రస్తుతం ప్రభుత్వం పదోన్నతుల ప్రక్రియను చేపట్టనున్న నేపథ్యంలో డిప్యూటేషన్లు నిలిచిపోయాయి. పదోన్నతుల అనంతరం అక్కడ ఏర్పడిన ఖాళీల ఆధారంగా డిప్యూటేషన్లు చేపట్టనున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. పదోన్నతుల ప్రక్రియ ఈ నెల 11లోగా పూర్తయితే 15లోగా డిప్యూటేషన్లు కూడా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. నేటినుంచి ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం ● ఎస్జీటీలకు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, ఎస్ఏలుగా అవకాశం ● స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెచ్ఎంలుగా ప్రమోషన్ ● ఉమ్మడి జిల్లాలో 650 నుంచి 750 మందికి మేలు ● ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యాశాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా అర్హులైన సీనియర్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించనుంది. గత మూడేళ్ల క్రితమే ప్రమోషన్లు ఇచ్చిన తాజాగా ప్రభుత్వం మరోసారి ప్రక్రియ చేపట్టాలని పేర్కొంటూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2,991 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. 14,221 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న పదోన్నతులతో సుమారు 650 నుంచి 750 మంది ఉపాధ్యాయులు అర్హత పొందే అవకాశం ఉందని విద్యాధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఎస్జీటీలుగా విధులు నిర్వహిస్తున్న వారికి ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్లుగా అవకాశం కల్పించనున్నారు. ఇక స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెచ్ఎంలుగా, ఎంఈఓలుగా పదోతున్నతులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెల 11 వరకు.. ఉపాధ్యాయులకు పదోన్నతుల ప్రక్రియ శనివారం నుంచే ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆయా జిల్లాల వారీగా డీఈఓ వెబ్సైట్లలో గ్రేడ్–2 హెడ్మాస్టర్, స్కూల్ అసిస్టెంట్ సమానమైన క్యాడర్ ఖాళీల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చాల్సి ఉంది. వీటితోపాటు గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు పొందాల్సిన ఎస్జీటీ ఉపాధ్యాయులు సీనియార్టీ ప్రొవిజనల్ లిస్టు, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందనున్న ఎస్జీటీల ప్రొవిజనల్ సీనియార్టీ లిస్టును ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి. ఈ మేరకు సీనియార్టీ జాబితాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పుకొనేందుకు ఈ నెల 3న అవకాశం ఉంటుంది. అలాగే 4, 5 తేదీల్లో సీనియార్టీ జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి తుది జాబితా విడుదల చేస్తారు. 6న పదోన్నతులకు అర్హులైన వారు వెబ్ఆప్షన్లు పెట్టుకునేందుకు అవకాశం ఉంది. 7న సంబంధిత ఆర్జేడీ, డీఈఓల నుంచి ప్రమోషన్ ఆర్డర్ వెలువడనున్నాయి. ఇలా మొదట హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల ప్రక్రియను ఈ నెల 11 వరకు పూర్తి చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లా పాఠశాలలు విద్యార్థులు ఉపాధ్యాయులు మహబూబ్నగర్ 791 62,724 4,650 నాగర్కర్నూల్ 808 54,152 3,513 వనపర్తి 495 38,147 2,097 జోగుళాంబ గద్వాల 448 55,289 2,064 నారాయణపేట 458 52,314 1,879 షెడ్యూల్ ప్రకారమే.. ప్రభుత్వం ప్రమోషన్లకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 11లోగా ప్రక్రియను పూర్తి చేసే విధంగా ఆదేశించింది. అందులో భాగంగా ఆదివారం సీనియార్టీ లిస్టులను ప్రదర్శిస్తాం. జిల్లా పరిధిలో 1:3 ప్రకారం 450 మందిని ఎంపిక చేసి 150 మందికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఇక డిప్యూటేషన్లు ఆగిపోయే అవకాశం లేదు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఫైల్ ప్రాసెస్ చేసి డిప్యూటేషన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా తప్పిదాలకు తావులేకుండా ప్రక్రియ నిర్వహిస్తాం. – ప్రవీణ్కుమార్, డీఈఓ, మహబూబ్నగర్ -
లక్ష్యం దిశగా ముందుకు
నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్లో గట్టుకు కాంస్య పతకం గట్టు: దేశ వ్యాప్తంగా వెనుకబడిన మండలాలను గుర్తించి, వాటిని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్ ద్వారా మండలాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే దేశ వ్యాప్తంగా 500 మండలాలను ఎంపిక చేయగా, అందులో గట్టు మండలం కూడా ఉంది. ఈమేరకు కలెక్టర్ బీఎం సంతోష్ ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులు అన్ని శాఖల సమన్వయంతో అభివృద్ధికి అహర్నిశలు శ్రమించారు. అధికారుల శ్రమకు తగిన ఫలితం లభించింది. 6 అంశాలను పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం వాటికి ర్యాంకులు ఇవ్వగా.. గట్టు మండలానికి 5వ ర్యాంకు లభించిన విషయం తెలిసిందే. దీంతోపాటుగా దక్షణాది రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను జోన్ –3గా గుర్తించగా ఈ జోన్–3 లో గట్టు మండలం అభివృద్ధి సూచికలో 2వ ర్యాంకును సాధించింది. నేడు రాజ్ భవన్లో అవార్డు అందుకోనున్న కలెక్టర్ బీఎం సంతోష్ 6 అంశాలకు 3 అంశాల్లో వంద శాతం లక్ష్య సాధన సంపూర్ణ అభియాన్లో అధికారుల సమష్టి కృషికి గుర్తింపు -
కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి
గద్వాలటౌన్: కాంట్రాక్టు వర్కర్ల క్రమబద్ధీకరణ, కనీస వేతనాలు, పెన్షన్ తదితర డిమాండ్ల సాధన కోసం కార్మికులు కదం తొక్కారు. గురువారం టీయూసీఐ ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ నుంచి నిరసన ర్యాలీ నిర్వహించి.. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు హనుమంతు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కనీస వేతనాల జీఓ అమలు కాకపోవడంతో కాంట్రాక్టు సిబ్బంది చాలీచాలని జీతాలతో కాలం గడుపుతున్నారన్నారు. కాంట్రాక్టు సిబ్బందిని వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీయూసీఐ నాయకులు కృష్ణ, చెన్నరాములు, శంకరన్న, మహేశ్వరమ్మ, రంగన్న, నాగరాజు, వెంకటరామిరెడ్డి, భీమన్న, బీచుపల్లి, నల్లాస్వామి, సలీం, రాజు తదితరులు పాల్గొన్నారు. -
మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
అలంపూర్: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని ఓ ఫంక్షన్ హాల్లో గురువారం నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి సంబురాలు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మంత్రితో పాటు ఎమ్మెల్యే విజయుడు, కలెక్టర్ బీఎం సంతోష్, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందులో భాగంగానే 2,600 మహిళా సంఘాలకు రూ. 3.15కోట్ల వడ్డీ లేని రుణాలు అందించినట్లు చెప్పారు. పలు పెట్రోల్ బంకులు, 1000 ఆర్టీసీ బస్సులకు మహిళా సమాఖ్యలను యజమానులుగా చేసిందన్నారు. మహిళల పేరుపైనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు సీఎం రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు అందించారని.. అదే తరహాలో రేవంత్రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. తెలంగాణ వచ్చాక పేదలకు రేషన్కార్డులు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ.. అలంపూర్ నియోజకవర్గంలో 2,041 మహిళా సంఘాల సభ్యులు ఉండగా.. బ్యాంకు లింకేజీ రుణాలు రూ. 30.58 కోట్లు, 2,600 సంఘాలకు రూ. 3.15 కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. 23మందికి రూ. 13.89లక్షల బీమా చెక్కులు అందజేసినట్లు వివరించారు. కొత్తగా 3వేల రేషన్ కార్డులు మంజూరు కాగా.. 19వేల మంది పేర్లను కొత్తగా నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం గొర్రెలకు నీలినాలుక వ్యాధి నిరోధక టీకాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
గూడు.. తీరొక్క గోడు!
‘ఇందిరమ్మ ఇళ్ల’లో కొర్రీలు ●● అర్హుల జాబితాలో చేర్చి.. ఆపై తీసేయడంతో ఆందోళన ● 600 ఎస్ఎఫ్టీలలోపే అనుమతితో పలువురు దూరం ● పక్కా ఇళ్లలో అద్దెకున్న వారికి వర్తించని పథకం ● అడ్డంకిగా మారిన పలు నిబంధనలు కేటీదొడ్డి మండలం ఇర్కిచేడుకు చెందిన పద్మమ్మ తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి గుడిసెలో నివాసం ఉంటోంది. ఆమె ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇల్లు మంజూరు కాలేదు. నివాసముంటున్న గుడిసె కూడా పూర్తిగా దెబ్బతింది. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. వర్షం వస్తే పూర్తిగా కురుస్తుంది. కప్పుపై కవర్ కప్పుకొని కాలం వెల్లదీస్తున్నారు. అన్ని అర్హతలు ఉన్న తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతుంది. అద్దె ఇంట్లో ఉంటున్నాం.. మా ఇల్లు పాడుపడటంతో ఖాళీ చేసి.. అద్దె ఇంట్లో ఉంటున్నాం. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రతినెలా రూ. 5వేల ఇంటి అద్దె చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నా. సెంటు భూమి లేని మాకు కుటుంబం గడవడమే కష్టంగా ఉంది. ఇందిరమ్మ ఇంటి కోసం అధికారులను అడిగితే మీకు ఇల్లు రాలేదని అంటున్నారు. ఏం చేయాలో తోచడం లేదు. ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్న సొంతింటి కల కలగానే మిగిలింది. – శ్రీధర్, ధరూరు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పేద, మధ్య తరగతి కుటుంబాలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నిబంధనల కొర్రీలు లబ్ధిదారుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. ప్రధానంగా 600 చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇల్లు నిర్మిస్తే ఇందిరమ్మ పథకం వర్తించదని అధికారులు తేల్చిచెబుతుండడంతో ఎటూ తేల్చుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో ఎక్కువ మొత్తంలో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా వేచి చూస్తున్నారు. మరో వైపు అర్హుల జాబితాలో చేర్చి, ఆపై తీసేయడం.. పక్కా ఇళ్లలో అద్దెకుంటున్న వారికీ మొండిచేయి చూపడంతో పలువురు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతిబంధకాలుగా మారిన నిబంధనలతో ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఇబ్బందిపడుతున్న లబ్ధిదారులు, ఆశావహుల తీరొక్క గోడుపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. జిల్లాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల వివరాలు.. -
ఎర్రమట్టి గుట్టలను పరిశీలించిన విజిలెన్స్
అలంపూర్: మండలంలో ఎర్రమట్టి గుట్టలను కొల్లగొడుతున్న వైనంపై జూలై 27న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఆగని మట్టి దందా’ కథనానికి రాష్ట్ర విజిలెన్స్ అధికారులు స్పందించారు. గురువారం విజిలెన్స్ డీఎస్పీ శ్రీనివాస్, ఏడీఎంజీ కేఎల్ఎన్ రావు, ఆర్ఐ సత్యనారాయణ తదితరుల ఆధ్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడి సుల్తానాపురం, రేలంపాడు శివారుల్లో ఉన్న గుట్టలను పరిశీలించారు. గుట్టల్లో మట్టి తవ్వకాలతో పాటు ఇసుక అక్రమ రవాణాపై ఆరా తీసినట్లు తెలిసింది. మట్టి తవ్వకాలు ఎంత మేర జరిగాయనే దానిపై నివేదిక ఇవ్వాలని స్థానిక అధికారులకు సూచించినట్లు సమాచారం. అయితే విజిలెన్స్ అధికారులకు తగిన సమాచారం ఇవ్వడంలో స్థానిక అధికారులు దోబూచులాడటంపై విమర్శలు వ్యక్తవుతున్నాయి. ప్రకృతి సంపదను అక్రమార్కులు కొల్లగొడుతున్నా.. కనీస సమాచారాన్ని రహస్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ విషయమై మైనింగ్ అధికారులను ఫోన్లో సంప్రదించగా.. అందుబాటులోకి రాలేదు. విజిలెన్స్ అధికారుల వెంట ఆర్ఐ దుర్గాసింగ్ ఉన్నారు. -
రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరి
అయిజ: ప్రైవేటు స్కూల్ బస్సులను నిబంధనల మేరకు నడుపుకోవాలని.. రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని డీటీఓ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. గురువారం అయిజలో ప్రైవేటు స్కూల్ బస్సులను మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ రాములు, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణారెడ్డిలతో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అనుమతి పత్రాలను పరిశీలించారు. బస్సు సీటింగ్ కెపాసిటీ మేరకు విద్యార్థులను తరలించాలని సూచించారు. దరఖాస్తుల ఆహ్వానం గద్వాల: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రవేశాలకు సంబంధించి ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటో తరగతిలో జిల్లాకు ఒక సీటు కేటాయించినట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2018 జూన్ 1నుంచి 2019 మే 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలని.. గ్రామీణ ప్రాంతాల వారి వార్షిక ఆదాయం రూ. 1.50లక్షలు, పట్టణ ప్రాంతానికి చెందిన వారి వార్షికాదాయం రూ. 2లక్షలు మించరాదన్నారు. దరఖాస్తు ఫారాలు ఎస్సీ సంక్షేమాభివృద్ధిశాఖ కార్యాలయంలో పొందవచ్చన్నారు. ఆసక్తి, అర్హత గల విద్యార్థులు 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని.. 10న కలెక్టరేట్లో లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. మెరుగైన వైద్యం అందించాలి ఇటిక్యాల: ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.సిద్దప్ప అన్నారు. గురువారం ఇటిక్యాల పీహెచ్సీలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ.. ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. డీఎంహెచ్ఓ వెంట ఎంసీహెచ్ పోగ్రాం అధికారి డా.ప్రసూనారాణి, డీపీఎన్ఎం వరలక్ష్మి, మండల వైద్యాధికారి రాధిక తదితరులు ఉన్నారు. వేరుశనగ @రూ. 6,189 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు గురువారం 725 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాల్కు గరిష్టంగా రూ. 6,189, కనిష్టంగా రూ. 3,352, సరాసరి రూ. 4050 ధరలు లభించాయి. -
మామిడి కొమ్మల కత్తిరింపుతో అధిక దిగుబడులు
కొల్లాపూర్ రూరల్: మండలంలోని అంకిరావుపల్లి గ్రామ శివారులో ఉమ్మడి జిల్లాలోని మామిడి రైతులకు ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా గురువారం రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ బాబు మాట్లాడుతూ మామిడి కొమ్మల కత్తిరింపు, పునరుద్ధరణపై రైతులకు శిక్షణతోపాటు మామిడి కొమ్మలను కత్తిరింపు చూపించడం జరిగిందన్నారు. మామిడి కొమ్మలను కత్తిరించడం వల్ల దిగుబడి బాగా వస్తుందన్నారు. ప్రతి ఏటా ఆగస్టులోగా ఈ పద్ధతి పాటించాలని రైతులకు సూచించారు. మామిడి దిగుబడి రావాలంటే కొమ్మ కత్తిరింపు అనంతరం మొక్కకు కావాల్సిన సేంద్రియ, రసాయనిక ఎరువులను చెట్టు వయస్సు బట్టి వేసుకోవాలని చెప్పారు. కొమ్మల కత్తిరింపుతో గాలి, తేమ, సూర్యరష్మి తగిలి దిగుబడి ఎక్కువ వస్తుందన్నారు. అలాగే చీడపీడల బెడదను సమర్థవంతంగా నివారిచవచ్చున్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఉ ద్యాన అధికారి వేణుగోపాల్, వనపర్తి, గద్వాల, నా గర్కర్నూల్ జిల్లాల అధికారులు విజయభాస్కర్రె డ్డి, అక్బర్, వెంకటేశం, హార్టికల్చర్ యూనివర్సిటీ ఉద్యాన శాస్త్రవేత్త హరికాంత్, పాలెం శాస్త్రవేత్తలు ఆదిశంకర్, శైల, ప్రసాద్, సీడ్ రిస్క్ మేనేజర్ భూపేష్కుమార్, ఇండియా గ్యాప్ సర్టిఫికేషన్ శ్రీహరి, ఉమ్మడి జిల్లా రైతులు పాల్గొన్నారు. -
మెరుగైన వైద్య సేవలు అందించాలి
గద్వాల క్రైం: జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్ సంతోష్ అన్నారు. బుధవారం జిల్లా ఆసుపత్రిలో రూ.3 కోట్లతో చేసిన అభివృద్ధి పనులను కలెక్టర్తోపాటు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజయుడులు ముఖ్యఅతిథులుగా హాజరై ప్రారంచారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అత్యవసర సమయాల్లో రోగులకు ఆక్సిజన్ అందక మృతి చెందిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని, ఇక నుంచి ఆక్సిజన్ కొరత లేకుండా ప్లాంట్ ఏర్పాటుకు రూ.2.65 కోట్లు వెచ్చించి ఏర్పాటు చేశామన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు తక్షణ సహాయం అందించడం జరుగుతుందన్నారు. రేడియాలజీ సేవల కోసం వచ్చే గర్భిణులు వేచి ఉండేందుకు సిటీ స్కాన్ బ్లాక్ వద్ద నూతనంగా రూ. 8.90లక్షలతో వెయింటింగ్ హాల్ నిర్మించామన్నారు. ఆస్పత్రి ఆవరణలో సీసీ రోడ్లు, తదితర పనులు చేపట్టినట్లు తెలిపారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ.. 300 పడకల ఆసుపత్రిగా ఉన్నప్పటికి 550 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వానికి నివేదిక అందజేశామన్నారు. ఆధునిక వైద్య పరికరాలు, మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ.. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లోంచి వచ్చే రోగులకు ఎలాంటి సమస్యలు లేకుండా వైద్యులు చూడాలని, సిబ్బంది, వైద్యులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని అన్నారు. ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇందిర, అభినేష్, సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు. కలెక్టర్ బీఎం సంతోష్ జిల్లా ఆస్పత్రిలో రూ.3 కోట్లతో అభివృద్ధి పనులు -
నేడు అలంపూర్కు మంత్రుల రాక
అలంపూర్: జోగుళాంబ శక్తిపీఠాన్ని దర్శించుకోవడంతోపాటు అలంపూర్లోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ నెల 31వ తేదీన గురువారం మంత్రులు పట్టణానికి రానున్నుట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ ఆలయంలో ఉదయం 10 గంటలకు నిర్వహించే జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొంటారని, అనంతరం అలంపూర్ చౌరస్తాలో మహిళా సాధికారత, మహిళలకు వడ్డీలేని రుణాలు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి అయిజ: సీజనల్ వ్యాధుల భారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఇంచార్జ్ డీఎంహెచ్ఓ సిద్దప్ప అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. డెలివరీ రూం, ఏఎంసీలను, ల్యాబ్ను, ఫార్మసీ గదిని పరిశీలించారు. మెడికల్ ఆఫీసర్లు విష్ణు, కిరణ్తో వైద్య సేవలు, అందుబాటులో ఉన్న మందుల గురించి ఆరా తీశారు. సాధారణ కాన్పుల సంఖ్యను పెంచాలని, కుక్క, పాము కాటుకు మందులను సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. పీహెచ్సీకి నలుగురు డాక్టర్లను ఏర్పాటు చేశామని, ఇన్ పేషంట్లకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. ప్రజలు సీజనల్ వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలు సలహాలు చేశారు. దండం పెడతా.. విద్యార్థుల జీవితాలతో ఆటలొద్దు ఉండవెల్లి: విద్యార్థుల జీవితాలతో ఆటలొద్దని.. వారికి నాణ్యమైన భోజనం అందించాలంటూ ఎమ్మెల్యే విజయుడు వంట సిబ్బందికి సూచించారు. మండలంలోని అలంపూర్ చౌరస్తాలోని గురుకుల పాఠశాలను ఎమ్మెల్యేతోపాటు బీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ పల్లయ్య, పీఎసీఎస్ చైర్మన్ గజేందర్రెడ్డి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పురుగుల అన్నం, ఉప్పు నీటితో చారు చేసి ఇస్తున్నారని ఉపాధ్యాయులపై, రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని, అనేక సమస్యలున్నా నిధులు విడుదల చేయక ఇబ్బందులు పెడుతున్నారని, అందుకే విద్యార్థులు రోడెక్కుతున్నారని అన్నారు. వంట గదికి వెళ్లి విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందించాలని దండం పెట్టి వేడుకున్నారు. అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాద్యక్షుడు దామర కిరణ్ సైతం పాఠశాలకు చేరుకొని భోజనాన్ని పరిశీలించారు.ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈదన్న, సింగరాజు మద్దిలేటి, శేషన్ గౌడు, తదితరులు పాల్గ్గొన్నారు. -
ఈ–పాస్ ద్వారానే ఎరువుల విక్రయాలు
ఎర్రవల్లి: ఎరువుల డీలర్లు రైతులకు ఈ –పాస్ మిషన్ ద్వారానే ఎరువులు విక్రయించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియా నాయక్ అన్నారు. బుధవారం మండలంలోని కోదండాపురం, పుటాన్దొడ్డి గ్రామాలను సందర్శించి రైతులు వానాకాలంలో సాగు చేసిన వివిధ పంటలను ఏఓ రవికుమార్తో కలిసి పరిశీలించారు. అలాగే కోదండాపురం స్టేజీలోని రైతు సేవా కేంద్రం ఎరువుల దుకాణాన్ని, ఎరువుల నిల్వలు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. ఎరువుల కోసం వచ్చే ప్రతి రైతు నుంచి ఆదార్ కార్డు తీసుకొని ఈ పాస్లో నమోదు చేసిన తర్వాతే ఎరువులను విక్రయించాలన్నారు. ప్రభుత్వం ముద్రించిన ధరల కంటే అధికంగా విక్రయించరాదని ఆదేశించారు. రైతులు తమకు కావాల్సిన మోతాదు మేరకు మాత్రమే యూరియాను పంటలకు వాడుకోవాలన్నారు. ఎక్కువ మొత్తంలో యూరియాను వాడటం వల్ల పంటలకు లాభం కంటే నష్టం అధికంగా జరుగుతందన్నారు. రెండవ సారి యూరియాను వాడాలనుకునే రైతులు వంద శాతం నీటిలో కలిగే సూక్ష్మ రూపంలో దొరికే నానో డీఏపీ, నానో యూరియాను ఒక ఎకరానికి 500 మిల్లీ లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేస్తే మొక్కలకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని సూచించారు. కార్యక్రమంలో ఏఓ రవికుమార్, డీలర్ రవి, రైతులు రామిరెడ్డి, మల్లికార్జున్ ఉన్నారు. -
నిబంధనలు పట్టవా?
ప్రిస్కిప్షన్ లేకుండానే ఔషధాల విక్రయాలు ●లైసెన్స్ రద్దు చేస్తాం అనుమతి లేకుండా మెడికల్ దుకాణాలు, ఏజెన్సీలు ఏర్పాటు చేసినా.. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే సదరు దుకాణాల లైసెన్స్ రద్దు చేస్తాం. గర్భవిచ్ఛిత్తి మాత్రలు, అబార్షన్ కిట్ విక్రయాలు, వాటికి సంబంధించిన రికార్డులపై తనిఖీలు నిర్వహించాం. మూడు మెడికల్ దుకాణాల నిర్వాహకులు సరైన రికార్డులు చూయించకపోవడంతో షోకాజ్ నోటీసులు జారీ చేశాం. ప్రజలు సైతం ఇష్టారీతిలో మందులు కొనుగోలు చేసి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు. – వినయ్, జిల్లా ఇన్చార్జి ఔషధ నియంత్రణ అధికారి గద్వాల క్రైం: జిల్లాలో కొందరు మెడికల్ షాపు యజమానులు.. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే పలు మందులు విక్రయిస్తూ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ఔషధ నియంత్రణ అధికారులు గత వారం రోజులుగా గద్వాల – అలంపూర్ సెగ్మెంట్లలో తనిఖీలు నిర్వహించిన క్రమంలో బహిర్గతం అయ్యింది. నిబంధనలు ఉల్లంఘించిన 21 మెడికల్ దుకాణాలకు నోటీసులు జారీ చేసి అయిదు రోజుల పాటు సస్పెనషన్ వేటు వేశారు. మరో వైపు గర్భవిచ్చిత్తి మాత్రలు, అబార్షన్ కిట్ అమ్మకాలపై ఈ నెల 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్ కంట్రోల్ అధికారులు మెడికల్ దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులకు అనుసంధానంగా ఉన్న మూడు ఫార్మసీలలో తనిఖీలు చేయగా గర్భవిచ్ఛిత్తి మాత్రలు, అబార్షన్ కిట్ రికార్డులు లేకపోవడంతో ముగ్గురికి షోకాజ్ నోటీసులను జిల్లా ఇంచార్జ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ వినయ్ ఇచ్చారు. మొత్తంగా జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించి మందుల విక్రయాలు జరుగుతున్నాయని తనిఖీల్లో బహిర్గతం అయ్యింది. తనిఖీలు ముమ్మరం గద్వాల, అయిజ, అలంపూర్, ధరూర్, గట్టు, ఇటిక్యాల, శాంతినగర్ తదితర మండలంలోని మెడికల్ దుకాణాలపై ఔషధ నియంత్రణ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేయడంతో వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో పలువురికి షోకజ్ నోటీసులు జారీ చేసి శాఖ పరమైన చర్యలు తీసుకున్నారు. మరో వైపు గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి అనుమతి లేకుండా మందులు, ఇంజక్షన్లు ఆర్ఎంపీలు సైతం విక్రయాలు చేయడం వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించి సీజ్ చేసిన సంఘటనలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో తనిఖీలు చేపడితే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునేందుకు దోహద పడుతుంది. మెడికల్ షాపు యజమానుల ఇష్టారాజ్యం మత్తు ఇంజెక్షన్లు, గర్భస్త్రావం మాత్రలు యథేచ్ఛగా విక్రయాలు రికార్డుల నిర్వహణలోనూ నిర్లక్ష్యం అధికారుల తనిఖీల్లో పలు విషయాలు వెలుగులోకి.. -
రహదారులకు మహర్దశ
ఉమ్మడి జిల్లాలో రోడ్ల విస్తరణకు నిధులు కేటాయించిన ప్రభుత్వం సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కీలకమైన రహదారులకు మహర్దశ పట్టనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వీటి విస్తరణ కోసం పెద్దఎత్తున నిధులు విడుదల చేసింది. మహబూబ్నగర్, వనపర్తి సర్కిళ్ల వారిగా ఉమ్మడి జిల్లాలోని మొత్తం 41 రోడ్ల విస్తరణ, బలోపేతం చేసేందుకు రోడ్డు, భవనాల శాఖ నిధులు కేటాయించింది. ప్రధానంగా జిల్లాలను అనుసంధానం చేస్తూ కొనసాగుతున్న రహదారులతోపాటు మండలాలు, గ్రామాలకు కనెక్టింగ్ రోడ్లను విస్తరించనున్నారు. మహబూబ్నగర్ ఆర్అండ్బీ సర్కిల్లో మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలు ఉండగా.. వీటి పరిధిలోని 26 రోడ్ల నిర్మాణానికి సంబంధించి మొత్తం 380.85 కి.మీ., మేర రోడ్లను విస్తరించనున్నారు. ఇందుకు గానూ ప్రభుత్వం రూ.434.19 కోట్లు కేటాయించింది. అలాగే వనపర్తి సర్కిల్లో వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలు ఉండగా.. వీటి పరిధిలో 15 రోడ్లను ప్రభుత్వం డబుల్ రోడ్లుగా విస్తరించనుంది. మొత్తం 279.16 కి.మీ., మేర రహదారులను విస్తరించాల్సి ఉండగా ఇందుకోసం రూ.399.34 కోట్లు మంజూరు చేసింది. పెండింగ్లో ఉన్నవాటికి మోక్షం.. ఉమ్మడి జిల్లాలో గత కొన్నేళ్లుగా ప్రధాన రహదారుల విస్తరణ, మరమ్మతు పనులు దాదాపుగా నిలిచిపోయాయి. రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ చేపట్టిన జాతీయ రహదారుల నిర్మాణాలు మాత్రమే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జిల్లాలను ఒక దానితో మరొకటి అనుసంధానిస్తూ ఉన్న ఆర్అండ్బీ రోడ్లు, మండల కేంద్రాలను అనుసంధానం చేస్తూ ఉన్న రోడ్ల విస్తరణతోపాటు మరమ్మతుకు సైతం నోచుకోవడం లేదు. సుమారు ఐదేళ్లకుపైగా ఆర్అండ్బీ రోడ్లకు మరమ్మతు లేకపోవడంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిని అధ్వానంగా మారాయి. మండల కేంద్రాల నుంచి గ్రామాలకు వెళ్లే కనెక్టింగ్ రోడ్లు వర్షాలకు దెబ్బతిని, కంకర తేలి దర్శనమిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం ఆర్అండ్బీ రోడ్ల విస్తరణ, మరమ్మతుకు నిధులను మంజూరు చేయడంతో ఈ రోడ్ల రూపురేఖలు మారిపోనున్నాయి. హెచ్ఏఎం విధానంలో.. ఈసారి రహదారుల నిర్మాణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యూటీ మోడ్ (హెచ్ఏఎం) విధానంలో చేపడుతోంది. పూర్తిస్థాయిలో నిధులను ప్రభుత్వమే ఖర్చు చేయకుండా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రహదారులను నిర్మించాలని నిర్ణయించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణాలను ఈ విధానంలోనే చేపడుతుండగా.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఏఎం విధానంలో రోడ్ల విస్తరణ చేపట్టనుంది. ఈ విధానంలో రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల్లో 40 శాతం నిధులను ప్రభుత్వం సమకూర్చితే మిగతా 60 శాతం నిధులను ఆయా రోడ్డు నిర్మాణ కాంట్రాక్టు సంస్థలే భర్తీ చేయాల్సి ఉంటుంది. తర్వాత 15 ఏళ్లపాటు రోడ్డు నిర్వహణ బాధ్యతలతోపాటు టోల్ రుసుం సంబంధిత సంస్థలే నిర్వహిస్తాయి. రోడ్ల విస్తరణకు నిధుల కొరత లేకుండా, నిర్ణీత గడువులోగా వేగంగా పనులు పూర్తిచేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వనపర్తి సర్కిల్ పరిధిలో.. వనపర్తి– జడ్చర్ల వయా వట్టెం, తిమ్మాజిపేట రోడ్డు, బల్మూరు– నాగర్కర్నూల్ వయా గోదల్, తుమ్మన్పేట్, అచ్చంపేట– రాకొండ వయా ఉప్పునుంతల రోడ్డు, పెంట్లవెల్లి– వనపర్తి వయా శ్రీరంగాపూర్, అమ్రాబాద్– ఇప్పలపల్లి రోడ్డు, వనపర్తి– ఆత్మకూర్, ఆత్మకూర్– మరికల్ రోడ్డు, వనపర్తి– బుద్దారం రోడ్డు, చిన్నంబావి– చెల్లెపాడు రోడ్ల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టనుంది. అలాగే బల్మూర్– నాగర్కర్నూల్ వయా గోదల్, తుమ్మన్పేట్ రోడ్డు, అచ్చంపేట– రాకొండ, పెంట్లవెల్లి– వనపర్తి రోడ్లను డబుల్గా విస్తరించనున్నారు. మహబూబ్నగర్ సర్కిల్ పరిధిలో జోగుళాంబ గద్వాలలోని ఎర్రిగెర– అయిజ– అలంపూర్ రోడ్డు (బల్గెర, మిట్టిదొడ్డి, తుమ్మపల్లి, శాంతినగర్, కౌకుంట్ల, శ్రీనగర్, కొరివిపాడు, బొంకూర్)ను విస్తరించారు. అలాగే గద్వాల– రంగాపూర్ రోడ్డు, తుంగభద్ర బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు, గద్వాల– అయిజ రోడ్డు (బింగిదొడ్డి, అయిజ) రోడ్లను మెరుగుపరచనున్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తి– జడ్చర్ల వయా బిజినేపల్లి రోడ్డు, మహబూబ్నగర్– మంగనూర్ రోడ్డు, మహబూబ్నగర్– నవాబుపేట రోడ్డు, వేపూర్ జెడ్పీ రోడ్డు నుంచి కొమ్మిరెడ్డిపల్లి వయా షేక్పల్లి, కురుమూర్తిరాయ టెంపుల్ రోడ్డు, గుడిబండ– తిరుమలాపూర్– అప్పంపల్లి రోడ్డు, కోడూరు– కోయిల్కొండ రోడ్డు వయా మల్కాపూర్, మణికొండ రోడ్డు, జడ్చర్ల రైల్వేస్టేషన్– కొత్తమొల్గర రోడ్డు, రాజాపూర్– తిరుమలాపూర్, మరికల్– మిన్సాపూర్ రోడ్డు, మక్తల్– నారాయణపేట వయా లింగంపల్లి రోడ్లను పునరుద్ధరించనున్నారు. మహబూబ్నగర్ సర్కిల్ పరిధిలో 380.85 కి.మీ మేర రోడ్ల నిర్మాణానికి రూ.434 కోట్లు వనపర్తి సర్కిల్లో 15 రోడ్ల నిర్మాణానికి రూ.399.34 కోట్లు మంజూరు హైబ్రిడ్ యాన్యూటీ విధానంలో పనులు చేపట్టేందుకు చర్యలు జిల్లాలు, మండలాలు, గ్రామాల కనెక్టింగ్ రోడ్లకు ప్రాధాన్యం -
టీచర్గా మారిన కలెక్టర్..
గద్వాలటౌన్: పిల్లలూ... ఎలా చదువుతున్నారు, ఇంగ్లీష్ చదవడం వచ్చా.. అంటూ విద్యార్థినులను పలకరించారు కలెక్టర్ సంతోష్. కలెక్టర్ అడిగిన ప్రశ్నకు ఆ.. వచ్చు సార్ అంటూ పిల్లలు బదులిచ్చారు. బుధవారం గద్వాల మండలం గోనుపాడులో ఉన్న కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల చేత పాఠాలు చదివించారు. టీచర్లు బాగా చెబుతున్నారా అని అడిగి సమాధానాలు రాబట్టారు. బాగా చదువుకోవాలని విద్యార్థినులకు సూచించారు. ఉపాధ్యాయుల హాజరు పట్టిని, విద్యార్థుల ఫెషియల్ రికగ్నిషన్ను పరిశీలించారు. యూడైస్ ఎంట్రీలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు.ఇదిలాఉండగా, మధ్యాహ్న భోజన తనిఖీలో లోపాలు కనిపించడం, మెనూ పాటించకపోవడంపై కలెక్టర్ సంతోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం అందించకపోవడంతో ఎస్ఓకు మెమో జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలో భాగంగా కలెక్టర్ పాఠశాలలోని వంటగది, తగునీరు, భోజనం నాణ్యత, స్టోర్ రూంలోని సరుకులు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు మెనూ ప్రకారం ప్రతిరోజు పౌష్టికాహారం ఇవ్వాలన్నారు. -
జాతీయస్థాయికి ‘అనంతపురం’ విద్యార్థుల ప్రాజెక్టు
గద్వాలటౌన్ : 2024–25 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రస్థాయి స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ ప్రదర్శనలో గద్వాల మండలం అనంతపురం పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ప్రతిభ చాటారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ సెల్ వారు పాఠశాల విద్యార్థులకు ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. అనంతపురం పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయురాలు జానకమ్మ ఆధ్వర్యంలో విద్యార్థులు ఇర్ఫాన్, పవన్, ప్రశాంత్ ఇన్నోవేషన్ మారథాన్ ప్రదర్శనలో ప్రతిభ చాటారు. ‘మొక్కజొన్న కంకులపై పొట్టుతో తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ కార్న్ హస్క్ పెన్స్’ అనే అంశంపై ప్రాజెక్టును రూపొందించగా.. ఆ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. జులై 28 నుంచి 31 వరకు డిల్లీలో జరుగుతున్న జాతీయస్థాయి ఇన్నోవేషన్ మారథాన్ ప్రదర్శనకు ఎంపిక చేశారు. దేశ వ్యాప్తంగా మొత్తం 27 ప్రదర్శనలను ఎంపిక చేశారు. ఇందులో రాష్ట్రం నుంచి గద్వాలతో పాటు సిద్దిపేట, సిరిసిల్ల పాఠశాలలు ఉన్నాయి. అనంతపురం విద్యార్థులు జాతీయస్థాయి ఇన్నోవేషన్ మారథాన్ ప్రదర్శనకు ఎంపిక కావడంపై డీఈఓ అబ్దుల్ ఘనీ, ఎంఈఓ శ్రీనివాస్గౌడ్, జిల్లా సైన్స్ అధికారి బాస్కర్పాపన్న, ఉపాధ్యాయలు హర్షం వ్యక్తం చేశారు. -
తేళ్లు కుట్టని పంచమి
అరచేతిలో తేలు.. ఆనందంలో యువతి తేళ్లను చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. ఎక్కడ కుట్టి చంపేస్తుందేమోననే భయంతో ఆమడదూరం పారిపోతాం. కానీ, తేలు కుట్టని రోజంటూ ఒకటుందని మీకు తెలుసా.. అదే తేళ్ల పంచమి. ఈ రోజు తేలును పట్టుకున్నా.. ఒంటిపై, చెంపపై, చేతిపై వేసుకున్నా.. ఏకంగా నోట్లో నాలుకపై పెట్టుకున్నా ఏమీ చేయని అరుదైన దృశ్యాలను రాష్ట్ర సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం యాద్గీర్ జిల్లా కందుకూరులో చూడవచ్చు. నాగుల పంచమి పర్వదినమైన మంగళవారం నాడు తేళ్ల పంచమిని పురస్కరించుకొని స్థానికంగా కొండమవ్వగుట్టపైకి వందలాది మంది తరలివెళ్లి తేళ్ల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. గుట్టపై రాళ్ల కింద, చెట్ల పొదల్లో ఉన్న తేళ్లను చిన్నా, పెద్ద తేడా లేకుండా పట్టుకొని సందడి చేశారు. మరికొందరు తమ ఇంటికి తేళ్లను తీసుకెళ్లి పూజించారు. తేళ్ల పంచమి జరుపుకోవడం ద్వారా తమను తాము తేళ్ల బారి నుంచి రక్షించుకోవచ్చని నమ్ముతారు.ఈ జాతరకు వేలాదిగా రాగా గుర్మిట్కల్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. – నారాయణపేట -
లక్కీడిప్ ద్వారా విద్యార్థుల ఎంపిక
గద్వాల: బెస్ట్అవైలబుల్ పాఠశాలలో మిగిలిన సీట్లను నిబంధనల మేరకు లక్కీడిప్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేసినట్లు అదనపు కలెక్టర్ నర్సింగ్రావు తెలిపారు. మంగళవారం ఐడీవోసీ కార్యాలయంలో ఎస్సీ సంక్షేమాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో గ్రూప్–3లో మిగిలిన సీట్లకు దరఖాస్తులు లేకపోవడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రూప్–1, గ్రూప్–2 నుంచి దరఖాస్తు చేసిన విద్యార్థులను వారి తల్లిదండ్రుల సమక్షంలో లక్కీడిప్ ద్వారా ఎంపిక చేసినట్లు తెలిపారు. మొత్తం 20 మంది విద్యార్థులు ఎంపికై నట్లు తెలిపారు. వీరిలో 1వ తరగతిలో ఏడు మంది విద్యార్థులు, 5వ తరగతిలో 13మంది విద్యార్థులు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికై న విద్యార్థులు తమ ధ్రువపత్రాలను తీసుకుని ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. లక్కీడిప్ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా పూర్తి చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమాభివృద్ధి శాఖ జిల్లా అధికారి నుషిత, కో–ఆర్డినేటర్ ఆంజనేయులు, కెజిబివి కన్వీనర్ హాంపయ్య, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
క్రమశిక్షణతో చదివితే ఉజ్వల భవిష్యత్
మల్దకల్: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నతంగా ఎదగాలని కలెక్టర్ బీఎం సంతోష్ సూచించారు. మంగళవారం మల్దకల్ జెడ్పీహెచ్ఎస్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు రిజిష్ట్రర్లను పరిశీలించారు. గత ఏడాది పదో తరగతి ఫలితాలపై ఆరా తీసి ఈ ఏడాది వంద శాతం ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. అనంతరం పాఠశాల తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుందని, క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుని పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచిపేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించి పిల్లల చదువుపట్ల ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా స్థాయిలో ఉత్తమ పీఎం శ్రీ పాఠశాలగా ఎంపికై న మల్దకల్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుని, ఉపాధ్యాయులను అభినందించారు. అదే విధంగా పాఠశాలలో విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ఎంఈఓ సురేష్, జిల్లా సెక్టోరియల్ అధికారి ఎస్తేర్రాణి, జాకీర్హుసేన్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
ఎక్కడి పనులు అక్కడే!
పురపాలికల్లో ప్రత్యేక అధికారుల పాలన మరో ఆర్నెళ్లు పెంపు గద్వాలటౌన్: సర్కార్ మళ్లీ ప్రత్యేక పాలన పెంపునకే మొగ్గుచూపింది. ఇప్పటికే ఎక్కడి పనులు అక్కడే పడి వున్నా స్పందించేవారు కరవయ్యారు. తాజాగా మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారుల పాలన మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు మున్సిపాలిటీలకు ఉత్తర్వులు అందాయి. అయితే వచ్చే ఆరు నెలల్లో మున్సిపాలిటీల పనితీరు ఇంకా ఏమేరకు దిగజారుతుందన్నదే ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న ప్రశ్న..? గత ఆరు నెలలుగా జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలో ప్రత్యేక అధికారి పాలన సాగుతుంది. ఇప్పటికే అస్తవ్యస్తంగా ఉన్న గద్వాల మున్సిపాలిటీ పరిస్థితి మరింత దీనంగా తయారు కానుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. పాలన నత్తనడకన సాగుతోంది. అభివృద్ధి పనులు మందగించాయి. గద్వాల మున్సిపాలిటీలో ప్రత్యేకాధికారి ముద్ర ఏమాత్రం లేదు. అడిషినల్ కలెక్టర్ నర్సింగరావు ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఆయనతో పాటు కమిషనర్ దశరథ్పై రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా పని చేస్తున్నాయి. నాయకులను కాదని ఆయన ఏ పనీ చేయలేకపోతున్నారు. సిబ్బంది కొరత కూడ ఆయన కాళ్లకు బంధాలు వేస్తోంది. పడకేసిన పథకాలు.. అమృత్ 2.0 పథకం కింద చేపట్టిన తాగునీటి ప్రాజెక్టు పనులను చూస్తే నత్తే నయమనిపిస్తుంది. డబుల్ బెడ్రూం ఇళ్ల అప్పగింత కాగితాలకే పరిమితం అయింది. ఇందిరమ్మ ఇళ్ల పురోగతి కనిపించడం లేదు. ఐదేళ్లు గడుస్తున్నా పట్టణ ఆడిటోరియం భవన నిర్మాణం పనుల ప్రారంభానికి మోక్షం లభించడం లేదు. రోడ్ల అభివృద్ధి, విస్తరణ అనేది మర్చిపోయారు. రింగ్రోడ్డు అభివృద్ధి ఊసేలేదు. కూరగాయల మార్కెట్తో పాటు ఇతర దుకాణాల నుంచి ఆదాయం లభించడం లేదు. ఐడీఎస్ఎంటీ దుకాణాల లీజు పూర్తయినా చర్యలు లేవు. ప్రకృతి వనాల నిర్వహణ గాడితప్పింది. అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నా నివారణ చర్యలు కనిపంచడం లేదు. పన్ను వసూళ్లపై రాజకీయ పెత్తనం కనిపిస్తుంది. ఇలా ఏది తీసుకున్నా అంగుళం కూడా ముందుకు కదల్లేదు. పథకాలన్ని ‘ఎక్కడవేసిన గొంగడి అక్కడే’ అన్న చందంగా మారాయి. పట్టణంలో ఏ సమస్యనైనా ఇది వరకు ప్రజలు తమ వార్డు కౌన్సిలర్ వద్దకు వెళ్లి మొరపెట్టుకునేవాళ్లు. చాలా సమస్యలు వాళ్ల స్థాయిలో పరిష్కారమయ్యేందుకు అవకాశం ఉండేది. ప్రస్తుతం ప్రజలు తమ సమస్యలను కమిషనర్, ప్రత్యేక అధికారి దృష్టికే తీసుకువెళ్లాల్సి వస్తోంది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. తాగునీటి సరఫరాలోనూ ఇబ్బందులతో పాట్లు తప్పడం లేదు. వార్డు ఆఫీసర్లు ఉన్నా వారికి మొక్కుబడి పనులే అప్పగిస్తున్నారు. ఈ ఆరు నెలల కాలంలో పట్టణంలో గొప్పగా చెప్పుకునే పథకం ఒక్కటీ లేదు. అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా కానరాని నివారణ చర్యలు పన్ను వసూళ్లపై రాజకీయనాయకుల పెత్తనం పడకేసిన పథకాలు.. నత్తనడకన అభివృద్ధి పనులు కనిపించని ‘ప్రత్యేక’ మార్క్ -
హైదరాబాద్ చేరిన నాయకుల పంచాయితీ
గద్వాల: నియోజకవర్గంలో అధికార పార్టీలో నెలకొన్న వర్గపోరు హైదరాబాద్కు చేరింది. మంగళవారం జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వర్గం నాయకులు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ను కలిశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డికి అధిక ప్రాధాన్యత ఇస్తూ నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులను విస్మరించడంతో పాటు అక్రమ కేసులు నమోదు చేస్తూ ఇబ్బందులు గురిచేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా నామినేటెడ్ పదవులు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, ఇందిరమ్మ కమిటీలలో పదవులు అన్ని కూడా ఎమ్మెల్యే వర్గానికి ఇస్తూ తీవ్ర అన్యాయం చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థలలో బీ–ఫారాలను పాత కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవ్వాలని, ఇదేవిషయంపై పలుమార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. పరిస్థితి ఇదేవిధంగా కొనసాగితే అన్ని మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఛలో గాంధీభవన్కు పాదయాత్ర చేపట్టాల్సి వస్తుందన్నారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్చైర్మన్ శంకర్, డీఆర్ శ్రీధర్, లత్తిపురం వెంకట్రామిరెడ్డి, వెంకటస్వామిగౌడ్, కృష్ణ, డీటీడీసీ నర్సింహులు, ఆనంద్గౌడ్, పటేల్ శ్రీనివాసులు, ప్రకాష్, మాభాషా, రాఘవేంద్రరెడ్డిలు ఉన్నారు. -
మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యం
మల్దకల్: కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. మంగళవారం మల్దకల్లో గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా ఎమ్మెల్యే, కలెక్టర్ బీఎం సంతోష్, అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటీశ్వర్లు చేయడమే లక్ష్యంగా మహిళా సంఘాలకు ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నట్లు, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే నియోజక వర్గం అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోని మరింత అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారెంటీలలో రైతుబంధు, రణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు, రూ.500 కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లు కరెంట్ ఉచితం, ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం పంపిణీ వంటి సంక్షేమ పథకాలను నిరుపేద ప్రజలకు అందించడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మహిళలు చదువుకోవాలి: కలెక్టర్ మహిళలందరు తప్పనిసరిగా చదువుకోవాలని అప్పుడే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మహిళల అర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం సోలార్ విద్యుత్ ప్లాంటు, మూడు బస్సులు, త్వరలో పెట్రోల్ బంకులతో పాటు ఇందిరా మహిళా శక్తి సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందించి ఆదుకోవడం జరుగుతుందన్నారు. మండలంలోని నిరుపేదలకు 900 రేషన్కార్డులు ఇవ్వడం జరిగిందన్నారు. మండలంలోని మహిళా సంఘాలకు గత ఏడాది రూ.26 కోట్లు రుణంగా మంజూరు చేయగా ఈ ఏడాది రూ.72 లక్షలు వడ్డీ మాఫీ చేశామన్నారు. అంతకు ముందు జిల్లా స్థాయిలో ఉత్తమ పీఎం శ్రీ పాఠశాలగా ఎంపికై న మల్దకల్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీచైర్మన్ బండారి భాస్కర్, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, తిమ్మారెడ్డి, సీతారామిరెడ్డి, సత్యారెడ్డి, విక్రమ్సింహరెడ్డి, రాజారెడ్డి, వీరన్న, నరేందర్గోపాల్రెడ్డి, తహసీల్దార్ ఝూన్సీరాణి, ఎంపీడీఓ సాయిప్రకాష్ , అధికారులు పాల్గొన్నారు. -
అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టండి
ఎక్కడా లేని విధంగా నాలలు, కందకాలు కబ్జాకు గురయ్యాయి. అధికారులు, పాలకుల ఊదాసీనత వల్లే అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు పెరిగాయి. ఇప్పటికై నా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించాలి. తద్వారా రానున్న రోజుల్లో ఎదుర్కొనే సమస్యల పరిష్కారంపై స్పష్టత వస్తుంది. ఇప్పటికై నా మేల్కొనపోతే భవిష్యత్లో త్రీవ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. – శ్రీధర్, గద్వాల దారులు అధ్వానం పట్టణంలోని ప్రధాన రహదారులతో పాటు కాలనీ అంతర్గత రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. ఎక్కడపడితే అక్కడ గుంతలు ఏర్పాడ్డాయి. నిత్యం గుంతల రోడ్లపై ప్రయాణం అంటే సాహసం చేయాల్సి వస్తోంది. ప్రమాదాలు చోటుచేసుకుంటున్న అధికారుల పట్టనట్లుగా ఉన్నారు. మరమ్మతులు సైతం మొక్కుబడిగా చేపట్టి చేతులు దులుపుకొంటున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి రహదారులను మెరుగుపర్చాలి. – గోపాల్, గద్వాల -
ఎరువులు అధిక ధరకు విక్రయిస్తే చర్యలు
మల్దకల్: ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని డీఏఓ సక్రియానాయక్ ఫర్టిలైజర్ షాపు నిర్వాహకులను హెచ్చరించారు. మంగళవారం పాల్వాయి గ్రామంలోని ఫర్టిలైజర్ షాపును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎరువులను విక్రయించిన వెంటనే రశీదులను ఇవ్వాలని, విత్తనాలు కొనుగోలు చేసే రైతులు తప్పనిసరిగా షాపు యజమానులతో రశీదులు పొందాలన్నారు. ఫర్టిలైజర్ షాపులలో ఈ – పాస్మెషిన్ ద్వారానే మందులు పంపిణీ చేపట్టాలని, స్టాక్ వివరాలను రికార్డులలో పొందుపరచాలన్నారు. అనుమతులు లేని ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయఽ అధికారి రాజశేఖర్, ఫర్టిలైజర్ షాపు నిర్వాహకులు పాల్గొన్నారు. -
బడుల బలోపేతం దిశగా..
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రుల ఆలోచనల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ప్రీప్రైమరీ (పూర్వపు ప్రాథమిక విద్య)ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రైవేటు స్కూళ్లలో ప్రీ ప్రైమరీ విద్య అందిస్తున్నారు. ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూళ్లు అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటులో చేర్పిస్తున్నారు. తద్వారా అన్ని స్థాయిల్లో ప్రైవేటు స్కూళ్లకు విద్యార్థులు అలవాటు పడుతున్నారు. ఈ లోపాన్ని సరిదిద్ది సర్కారు బడుల్లో అడ్మిషన్లు పెంచేందుకు ప్రభుత్వం పూర్వపు ప్రాథమిక విద్య అందించేందుకు చర్యలు చేపట్టింది. అందుకోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 90 ప్రీ ప్రైమరీ స్కూళ్లను నెలకొల్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి నూతనంగా ప్రారంభించిన పాఠశాలల్లో 4–5 ఏళ్ల పిల్లలను చేర్చుకోవాలని సూచించింది. ఇద్దరు చొప్పున నియామకం.. ప్రతి ప్రీ ప్రైమరీ పాఠశాలకు ఇద్దరు సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో ఒక టీచర్ ఇంటర్మీడియట్తోపాటు ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్, ప్రైమరీ టీచింగ్లో అర్హులై ఉండాలి. విద్యార్థుల బాగోగులు చూసుకునేందుకు ఒక ఆయాను కూడా ని యమించాల్సి ఉంది. ఆమెకు కనీసం 7వ తరగతి అర్హత ఉండి స్థానికులై ఉండాలి. వీరిని జిల్లాస్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఎంపిక చేస్తుంది. ప్రీ ప్రై మరీ విద్యార్థులకు ఎస్సీఆర్టీ జాతీయ స్థాయిలో అ మలుపరుస్తున్న సిలబస్ను బోధించాల్సి ఉంటుంది. ప్రైమరీ పాఠశాలల్లో.. నూతనంగా ప్రారంభించే ప్రీ ప్రైమరీ స్కూళ్లకు ప్రస్తుతం కొనసాగుతున్న ప్రైమరీ పాఠశాలల్లో ఒక తరగతి గదిని కేటాయించనున్నారు. అనంతరం అందుబాటులో ఉండే నిధుల ఆధారంగా కొత్త గదులను నిర్మించనున్నారు. వీటిలో వసతుల కల్పన కోసం ఒక్కో బడికి రూ.1.50 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో విద్యార్థులు ఇండోర్, అవుట్ డోర్ గేమ్స్ ఆడేందుకు బొమ్మలు, గోడలపై ఆకర్షణీయమైన చిత్రాలు వేయడం, బేంచీలు, బోర్డులు, కుర్చీల వంటివి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటి కొనుగోలు పూర్తిగా కలెక్టర్ ఆదేశాల మేరకు అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టాలి. వీటితోపాటు అన్ని పాఠశాలల మాదిరిగానే మధ్యాహ్న భోజనం, స్నాక్స్ వంటివి విద్యార్థులకు అందిస్తారు. ఏయే పాఠశాలల్లో అంటే.. ఎంపీపీఎస్ నారగ్దొడ్డి, చమన్ఖాన్దొడ్డి, కేశవరం, ఉలిగేపల్లి, ఈడిగోనిపల్లి, చింతలక్యాంప్, పరమల, ఇనుములోనిపల్లి, మరమునగాల–1 వడ్డేపల్లి, అలంపూర్ (బాలికల) చాగాపూర్, కరుపాకుల, ఇందువాసి, నందిన్నె, అరగిద్ద, ఆలూర్, చింతల్కుంట, బలిగెరలో ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు. నారాయణపేట 10 మహబూబ్నగర్ 25 వనపర్తి 17 జోగుళాంబ గద్వాల 18 నాగర్కర్నూల్ 20 జిల్లాల వారీగా ప్రీ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటు ఇలా.. ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు ఉమ్మడి జిల్లాలో కొత్తగా ప్రారంభం కానున్న 90 పాఠశాలలు వసతుల కల్పనకు రూ.1.50 లక్షల చొప్పున మంజూరు ఈసారి నుంచే ఎల్కేజీ, యూకేజీ అడ్మిషన్లకు అనుమతి జాతీయ స్థాయి సిలబస్ బోధనకు చర్యలు అడ్మిషన్లు తీసుకుంటాం.. మహబూబ్నగర్ జిల్లాలో 26 ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాలల్లోనే ఒక గదిలో ప్రీ ప్రైమరీ స్కూల్ ప్రారంభిస్తాం. ఇందుకోసం ఒక్కో పాఠశాలలో వసతుల కల్పన కోసం రూ.1.50 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు తీసుకుంటాం. – ప్రవీణ్కుమార్, డీఈఓ, మహబూబ్నగర్ -
బీజేపీలో రగడ..!
నేతల మధ్య రచ్చకెక్కిన అంతర్గత పోరు ● రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు సమక్షంలోనే బహిర్గతం ● చిచ్చురేపిన డీకే మాటలు.. మనస్తాపానికి గురైన శాంతికుమార్? ● ఎంపీ అనుచరుల గోబ్యాక్ నినాదాలపై పార్టీలో భిన్నస్వరాలు ● తెరపైకి బీసీ వాదం.. ‘కమలం’ శ్రేణుల్లో అయోమయం ● ‘స్థానిక’ ఎన్నికల వేళ నష్టం వాటిల్లుతుందని ఆందోళన సీనియర్ల మండిపాటు.. పార్టీలో లోటుపాట్లు, నేతల మధ్య విభేదాలపై అంతర్గత వేదికలపైనే చర్చించుకోవడం.. సమస్యలను పరిష్కరించుకోవడం బీజేపీకి ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై న తర్వాత రాంచందర్రావు తొలిసారి చేపట్టిన జిల్లా పర్యటనలో నేతల మధ్య విభేదాలు బహిరంగ సమావేశంలో రచ్చకెక్కడంపై ఆ పార్టీ లోని సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో కొత్త సంప్రదాయానికి తెరలేపారని.. ఇది మంచి పద్ధతి కాదని మండిపడుతున్నారు. ఆదిలోనే కట్టడి చేయాలని.. లేకుంటే మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. స్థానిక ఎన్నికల వేళ పార్టీకి నష్టం వాటిల్లేలా ప్రస్తుత పరిణామాలు ఉన్నాయని.. పార్టీ అధిష్టానం దృష్టిసారించి సమస్య సద్దుమణిగేలా చూడాలని కోరుతున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: క్రమశిక్షణకు పెద్దపీట వేసే భారతీయ జనతా పార్టీకి సంబంధించి పాలమూరులో ఇటీవల చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు కలకలం సృష్టిస్తున్నాయి. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్ మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు సమక్షంలో బహిరంగ సమావేశం వేదికగా అంతర్గత పోరు రచ్చకెక్కగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శాంతికుమార్ గో బ్యాక్ అంటూ డీకే అనుచరుల నినాదాలు.. వేదికపై ఆయననుద్దేశించి అరుణ పరోక్షంగా మాట్లాడిన మాటలు పార్టీలో చిచ్చు రాజేశాయి. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన శాంతికుమార్ స్తబ్దుగా ఉండగా.. ఆయన అనుచరులు మాత్రం మండిపడుతున్నారు. ఈ క్రమంలో బీసీ వాదం తెరపైకి రాగా.. పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. రానున్న స్థానిక ఎన్నికల వేళ నష్టం వాటిల్లే అవకాశం ఉందని గ్రామ, మండల, పట్టణ స్థాయి నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 2019 నుంచీ కోల్డ్వార్.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గద్వాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా డీకే అరుణ పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో ఆమెకు పరాజయం ఎదురైంది. అనంతరం రాజకీయ పరిణామాల క్రమంలో ఆమె పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. 2019 ఏప్రిల్లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున మహబూబ్నగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో ఆమెతోపాటు శాంతికుమార్ టికెట్ ఆశించారు. బీజేపీని గెలిపించాలని పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన ఫొటోతో కూడిన ఫ్లెక్సీలు వెలిశాయి. పోటీగా డీకే అరుణ వర్గం కూడా ఫ్లెక్సీలు పెట్టారు. ఇలా అప్పటి నుంచే ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. ఇక 2024 ఎంపీ ఎన్నికల్లో సైతం ఇద్దరూ టికెట్ ఆశించారు. బీజేపీ అధిష్టానం డీకే అరుణ వైపు మొగ్గు చూపగా.. ఆమె పోటీ చేసి గెలుపొందారు. ఇలా రెండు పర్యాయాలు శాంతికుమార్కు టికెట్ చివరలో చేజారింది. అరుణ శాంతికుమార్బీసీ సంఘాల భగ్గు బీజేపీలో తాజా పరిణామాల క్రమంలో బీసీ వాదం తెరపైకి వచ్చింది. మున్నూరు కాపు వర్గానికి చెందిన శాంతికుమార్ను డీకే అరుణ అవమానించారని.. ఇది తగదంటూ పలు సంఘాలు భగ్గుమంటున్నాయి. బీసీ సమాజానికి ఆమె క్షమాపణ చెప్పేలా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. లేకుంటే రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెబుతామని బీసీ సమాజ్, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం, బీసీ మేధావుల సంఘం, మున్నూరు కాపు సంఘం నేతలు హెచ్చరిస్తున్నారు. -
ముగిసిన బాస్కెట్బాల్ పోటీలు
అయిజ: తెలంగాణ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండలంలోని ఉత్తనూరులో ధన్వంతరి వేంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ నాలుగురోజులపాటు నిర్వహించిన జూనియర్ అంతర్ జిల్లా బాస్కెట్ బాల్ చాంపియన్ షిప్ పోటీలు సోమవారంతో ముగిశాయి. బాలిక విభాగంలో రంగారెడ్డి జట్టు విన్నర్ కాగా మేడ్చేల్ మల్కాజిగిరి జట్టు రన్నర్గా నిలిచింది. అదేవిధంగా బాలుర విభాగంలో హైదరాబాద్ జట్టు విన్నర్ కాగా.. మేడ్చల్ మల్కాజిగిరి జట్టు రన్నర్గా నిలిచింది. విజేతలకు నిర్వాహకులు షీల్డ్లు అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. హోరీహోరీగా తలపడుతున్న బాలికల జట్టు -
సాగు.. సగమే!
3.21 లక్షల ఎకరాలకు.. 1.61 ఎకరాల్లోనే వ్యవసాయ పంటల సాగు వానాకాలం పంటల వివరాలిలా.. (ఎకరాల్లో) పంట సాగు అంచనా సాగు చేసింది పత్తి 1,42,410 1,27,884 వరి 95,762 5,644 కంది 42,585 15,224 మొక్కజొన్న 12,887 7,144 వేరుశనగ 11,180 2,495 పొగాకు 10,878 2,300 ఆముదాలు 1,031 201 మినుములు 1,160 132 సజ్జ 450 54 జొన్న 184 30 కొర్ర 503 15 చెరుకు 318 10 ఇతర పంటలు 1,454 0 గద్వాల వ్యవసాయం: నడిగడ్డ రైతులకు ఈ ఏడాది కలిసిరాలేదు. (2025–26) వానాకాలం సీజన్కు ముందు మే నెలలో వర్షాలు కురిశాయి. దీంతో అన్నదాతలు సీజన్ బాగుంటుందని ఆశించారు. అయితే ఆ తర్వాత వరుణుడు ఆశించిన స్థాయిలో కరుణించకపోవడంతో సాగుకు కష్టాలు వచ్చాయి. జిల్లాలో 3,21,305 ఎకరాల్లో వ్యవసాయ పంటలు సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా ఇప్పటివరకు సగమే సాగు కాగా, 45,906 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు అంచనా ఉండగా ఇప్పటి వరకు పది శాతం అయ్యింది. గడిచిన ఏడాది సాఫీగా సాగు గడిచిన ఏడాది (2024–25) వానాకాలం, యాసగి సీజన్లలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురిశాయి. జూన్, జులై, ఆగస్టు నెలల్లో వర్షాలు బాగా పడ్డాయి. దీనివల్ల బోర్లు, బావులు రిజార్జ్ అయ్యాయి. ఇదే సమయంలో ఎగువన కురిసిన వర్షాల వల్ల జూరాల జలాశయం నుంచి అనుకున్న సమయలో నీటి విడుదల జరిగింది. ఇలా అన్ని పరిస్థితులు అనుకూలించడం వల్ల గడిచినేడాది వానాకాలం సీజన్లో అన్ని పంటలు బాగా వచ్చి, దిగుబడులు సైతం బాగా వచ్చాయి. ఇంకా అవకాశం గత కొద్ది రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయని పంటలు వేయడానికి ఇంకా అవకాశం ఉందని, అంచనా మేరకు సాగు అవుతుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. జులై నెలాఖరు వరకు కంది, వేరుశనగ, ఆముదం, మొక్కజొన్న పంటలు వేయవచ్చునని అంటున్నారు. వరి పంటకు సంబంధించి ఆగస్టు వరకు సమయం ఉందని చెబుతున్నారు. అదేవిధంగా ఉధ్యాన పంటలకు సంబందించి కూరగాయలు, ఎండుమిర్చి, ఆయిల్పాం సాగుకు వచ్చే నెల వరకు గడువు ఉందన్నారు. ఎండుమిర్చి 30,305 2262 కూరగాయలు 7650 2543 ఆయిల్పాం 3936 0 ఇతర పంటలు 4045 0 ఉద్యానపంటలు 45,906 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు అంచనా.. నేటికీ 10 శాతం మాత్రమే చేరుకున్న వైనం ఆశించిన మేర కురవని వర్షాలు అంచనా మేరకు సాగుకు అవకాశం జూన్లో వర్షాలు లేకపోవడం, బోర్లు, బావులు రీచార్జ్ కాకపోవడం వల్ల వానాకాలం సీజన్ సాగుపై ప్రభావం చూపింది. అయితే చాలా ప్రాంతాల్లో వరి నారుమడులు రైతులు సిద్ధం చేసుకున్నారు. ఆగస్టు వరకు వరి, ఎండుమిర్చి వేయవచ్చు. ఈ నెలాఖరు వరకు పత్తి మినహా కొన్ని పంటలు వేస్తారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు కాస్త అనుకూలంగా ఉన్నాయి. అంచనా మేరకు పంటలు సాగు అవుతాయని భావిస్తున్నాం. – సక్రియానాయక్, డీఏఓ -
నిరుద్యోగ సమస్యలపై నిరంతర పోరాటం
అమరచింత: నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి డీవైఎఫ్ఐ నిరంతరం పోరాటం చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యువత మత్తు పదార్థాలకు బనిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ఆన్లైన్, ఆఫ్లైన్ గేమ్ల పేరిట తల్లిదండ్రులకు తెలియకుండా అప్పులు చేసి చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి యువతరం చేరుకోవడం శోచనీయమన్నారు. కళాశాల, పాఠశాలల వద్ద జరిగే మత్తు పదార్థాల ముఠాలను అడ్డుకోనేందుకు డీవైఎఫ్ఐ ప్రణాళికతో ముందుకు సాగుతుందని చెప్పారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర, చంటి, తిరుపతి, అశోక్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
భూ సేకరణే అసలు సమస్య..
ముచ్చోనిపల్లె రిజర్వాయర్ అలుగు కాల్వవను రెండున్నర కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉంది. అయితే ఇప్పటికే రెండు రిజర్వాయర్లలో భూములు కొల్పోయిన తప్పెట్లమొర్సు గ్రామ రైతులు మళ్లీ భూములను కాలువ కోసం అప్పగించడానికి సిద్ధంగా లేరు. తప్పెట్లమొర్సు గ్రామ శివారులో మొత్తం 3600 ఎకరాల భూములుండగా ఇందులో 600 ఎకరాలు సాగు పనికిరానివి ఉండగా, తాటికుంట రిజర్వాయర్లో 630 ఎకరాలు, ముచ్చోనిపల్లె రిజర్వాయర్లో 670 ఎకరాలు, కాలువల నిర్మాణం కోసం 200 ఎకరాలు సేకరించినట్లు రైతులు తెలిపారు. ఇది చాలదన్నట్లు ప్రస్తుతం భారత్మాల 6 వరుసల జాతీయ రహదారి నిర్మాణం కోసం భూ సేకరణ చేశారు. రెండు రిజర్వాయర్ల కారణంగా ఎక్కువగా భూములను కొల్పోయిన ఈ రైతులు ఉన్న కొద్ది పాటి భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే బహిరంగ మార్కెట్లో భూమి విలువకు అనుగుణంగా పరిహారం చెల్లిస్తే భూములను అప్పగించేందుకు రైతులు సముఖతను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా, గొర్లఖాన్దొడ్డి–అయిజ రోడ్డు నుంచి ముచ్చోనిపల్లె రిజర్వాయర్ కట్ట కింద నుంచి బల్గెర–అయిజ రోడ్డుకు లింకు కలిపే కొత్త తారు రోడ్డును మాత్రం వేశారు. కొత్తగా తారు రోడ్డు వేసే అధికారులు రిజర్వాయర్ అలుగు కాల్వకు ఎందుకు పరిష్కారం చూపడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. -
కందనూలులో కలకలం
● ఉయ్యాలవాడలోని బీసీ గురుకుల పాఠశాలలో 64 మంది విద్యార్థినులకు అస్వస్థతత ● కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరిక ● గడువుతీరిన పాలు, పెరుగు వల్లే ఘటన ● ఉడకని భోజనం, నాసిరకం సరుకుల వినియోగం ● జిల్లాలోని అన్నిచోట్ల ఇష్టారాజ్యంగా క్యాటరింగ్ నిర్వహణ? అమలుకాని మెనూ.. జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ గురుకుల హాస్టళ్లలో ఎక్కడా డైట్ మెనూ సరిగా అమలుకావడం లేదు. ఉదయం పూట టిఫిన్ కింద పూరి, ఇడ్లి, చపాతి, దోశ ఇవ్వాల్సి ఉండగా.. చాలాసార్లు లెమన్ రైస్, కిచిడీ, పులిహోరతో సరిపెడుతున్నారు. మధ్యాహ్నం భోజన సమయంలో మిక్స్డ్ వెజ్ బిర్యానీ, రెండేసి కూరలతో వడ్డించాల్సి ఉండగా.. పప్పులు, సాంబారుతో నెట్టుకొస్తున్నారు. వారంలో చికెన్, గుడ్డు, స్నాక్స్ విషయంలో కోత విధిస్తున్నారు. వంట గదుల్లో శుచి, శుభ్రత పాటించకపోవడం, శుభ్రమైన నీటిని వినియోగించకపోవడంతో తరుచుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గురుకుల హాస్టళ్ల నిర్వహణపై క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ కొరవడటంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాకేంద్రం సమీపంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో ఆస్పత్రిలో చేరిన ఘటన కలకలం సృష్టించింది. శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత అస్వస్థతతకు గురైన విద్యార్థినులు 64 మందిని జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థినులకు ఆస్పత్రిలో చికిత్స అందించిన వైద్యులు ఆదివారం సాయంత్రానికి డిశ్చార్జి చేశారు. అయితే పాఠశాలలో వంట కోసం వినియోగించిన సరుకులు నాసిరకంగా ఉండటం, గడువు తీరిన పాలు, పెరుగు పదార్థాలను వినియోగించడం వల్లనే ఫుడ్ పాయిజన్ చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. పాఠశాలకు సంబంధించిన క్యాటరింగ్ కాంట్రాక్టర్ బయట నుంచి పాలు, పెరుగు డబ్బాలను కొనుగోలు చేసి విద్యార్థినులకు వడ్డిస్తున్నారు. ఈ క్రమంలో నిర్ణీత కాలం పాటు, రెండు, మూడు రోజుల్లోపే వినియోగించాల్సిన పాలు, పెరుగు డబ్బాలను ఎక్స్పైరీ తేదీ దాటినా వినియోగించడంతోపాటు ప్రధానంగా పెరుగన్నం తిన్న విద్యార్థినులు అస్వస్థతతకు గురైనట్లు తెలిసింది. భయంతో ఇంటిదారి.. ఫుడ్ పాయిజన్తో విద్యార్థినులు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరడంతో పాఠశాలలోని మిగతా విద్యార్థులు సైతం భయాందోళనకు గురయ్యారు. ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలలో 480 మంది విద్యార్థులతోపాటు మరో 360 మంది ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులు చదువుతున్నారు. ఫుడ్ పాయిజన్తో 64 మంది ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోగా, మరో 30 మంది వరకు భయాందోళనకు గురై జనరల్ ఆస్పత్రిలోని ఔట్ పేషెంట్ విభాగంలో చూయించుకున్నారు. విద్యార్థినులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన త ర్వాత కొంతమంది తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్లిపోయారు.చాలామంది విద్యార్థులు భ యాందోళనలో ఉన్న కారణంగా వారి తల్లిదండ్రు లు తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లడం కనిపించింది. -
ఆరుగ్యారంటీలతో ప్రజలను వంచన చేశారు
గద్వాల: అధికారంలోకి రావటానికి అమలు సాధ్యపడని ఆరుగ్యారెంటీల పథకాల పేరుతో అధికారంలోకి వచ్చి తరువాత ప్రజలను వంచన చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచంద్రరావు అన్నారు. ఆదివారం ఆయన గద్వాలలో పర్యటించారు. ముందుగా ఆయన ఉదయం పెద్ద అగ్రహారంలోని అహోబిలం నరసింహస్వామి దేవాలయంలో పూజలు చేసి అనంతరం ఎంపీ డీకేతో కలిసి ప్రైవేటు ఫంక్షన్ హాలులో జిల్లా కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు రూ.15వేలు ఇస్తామని రూ.6వేలకే సరిపెట్టారని, త్వరలో స్థానిక సంస్థలు రానున్నడంతో బీసీ రిజర్వేషన్, రైతుబంధు, రుణమాఫీ అంటూ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు యత్నిస్తున్నారన్నారు. నడిగడ్డ అభివృద్ధి చెందాలంటే అది బీజేపీతోనే సాధ్యమన్నారు. తెలంగాణలో డబుల్ఇంజిన్ సర్కార్ వస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి : ఎంపీ డీకే అరుణ మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ దేశంలో తిరుగులేని నాయకుడు భారత ప్రధాని నరేంద్రమోడీ అని కొనియాడారు. అన్ని వర్గాల సంక్షేమభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు వెళ్తున్నాడన్నారు. రైతులకు కిసాన్ సమ్మాన్ నిధులు, నిరుపేదలకు ఉచితంగా 6కిలోల బియ్యం, ఎరువులను సబ్సిడీ ధరలకు, రైతులకు గిట్టుబాటు ధరలు వంటి అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. ఈ విషయాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి కేంద్రప్రభుత్వం చేస్తున్న సంక్షమాభివృద్ధి పథకాలు వివరించాలన్నారు. రాబోయే 2028లో రాష్ట్రంలో వచ్చేది ఖచ్చితంగా డబుల్ఇంజిన్ సర్కారు అని చెప్పారు. నడిగడ్డలో గడచిన పదకొండేళ్లల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులు కేవలం కుర్చీలు, అధికారం కోసమే కొట్లాడుతున్నారని విమర్శించారు. అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేసి ఆదిపత్యం ప్రదర్శనలు చేస్తున్నారన్నారు. లోకల్బాడీ ఎన్నికల్లో సర్పంచులు, జట్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మున్సిపాలిటీలను గెలుచుకుని బీజేపీ సత్తాచాటాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు డీకే ిస్నిగ్ధారెడ్డి, భరత్ప్రసాద్, అప్సర్పాషా, రామాంజనేయులు, బండల వెంకట్రాములు, రాంచంద్రారెడ్డి, అక్కలరమాదేవి, రజక జయశ్రీ, పద్మావతి, కృష్ణవేణి, శివారెడ్డి, రాజగోపాల్, జయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచంద్రరావు -
బీచుపల్లిని సందర్శించిన టాస్క్ఫోర్స్ ఎస్పీ
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని ఆదివారం హైదరాబాద్ టాస్క్ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా అభయాంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈఓ రామన్గౌడ్ ఆయనను శేషవస్త్రాలతో సత్కరించగా ఆలయ అర్చకులు మారుతిచారి తీర్థ ప్రసాదాలను అందించి ఆలయ వివిష్టత వివరించారు. ఆయన వెంట అర్చకులు అనిల్శర్మ, కుటుంబ సభ్యులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు. పెన్షనర్ల సమస్యలుపరిష్కరించాలి గద్వాల: రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తుందని పెన్షనర్ల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇక్బాల్ పాషా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరికి రాష్ట్ర జేఏసీ నోటీసులు ఇవ్వాలని తీర్మానం చేసినట్లు తెలిపారు. సీఎంతో జరిపిన చర్చల్లో ఒప్పుకున్న తీర్మానాలను అమలు చేయాలని, సత్వరమే పెండింగ్లో ఉన్న పెన్షన్ బెనిఫిట్లు, డీఏలు, పీఆర్సీలు, నగదురహిత ఆరోగ్య చికిత్స వంటి హామీలు అమలు చేయాలని కోరారు. రామన్పాడులో నిలకడగా నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో ఆదివారం సముద్రమట్టానికి పైన 1,020 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కులు, సమాంతర కాల్వ నుంచి 200 క్యూసెక్కుల వరద జలాశయానికి చేరుతుండగా.. ఎన్టీఆర్ కాల్వకు 679 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 30 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 872 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. -
తాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన
రాజోళి: వారం రోజులుగా నీరు రావడం లేదని కనీస అవసరాలకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ప్రజలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిదిలోని రామచంద్రానగర్ కాలనీలో గత వారం రోజులుగా మిషన్ భగీరథ ద్వారా నీరు అందడం లేదు. కనీసం తాగేందుకు, ఇతర అవసరాలకు కూడా నీరు లేదు. అధికారులను అడిగితే మోటార్లు రిపేరు చేస్తున్నామని చెప్పి మాట దాటేస్తుండటంతో విసిగిపోయిన కాలనీ వాసులు ఆదివారం కాలనీలోని రోడ్డెక్కి ఖాళీ బిందెలను ప్రదర్శిస్తూ, నిరసన తెలిపారు. అనంతరం కర్నూల్–రాయచూరు ప్రధాన రహదారిపైన ధర్నా చేసేందుకు సమాయత్తం అయ్యారు. గత వారం రోజులుగా నీరు లేక ఇళ్లలో బడికి వెళ్లే పిల్లలు, పనులకు వెళ్లే పెద్దలు స్నానాలు చేయడం లేదని కాలనీవాసులు వాపోయారు. మోటార్లు రిపేరు ఉన్నాయని తెలిసిన అధికారులు కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసైనా ప్రజలకు నీరు అందించాలి కదా, ఆ పని కూడా చేయకపోతే నీటి అవసరాలు ఎలా తీరతాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నెలలో రెండు మూడు సార్లు ఇలా జరుగుతూనే ఉంటుందని, దీనిపై అధికారులకు చెప్పినా ప్రయోజనం లేదని అన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ధర్నాకు ఉపక్రమించారు.ఈ క్రమంలో విషయం తెలసుకున్న బీఆర్ఎస్ యువకులు బార్గవ్ యాదవ్, నాయకులు గడ్డం శ్రీను అక్కడకు చేరుకుని మున్సిపల్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించగా ట్యాంకర్ కాలనీకి చేరుకుంది. దీంతో కాలనీ వాసులు ధర్నా విరమించారు. కనీసం చేతిపంపులు కూడా లేవని, శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. -
ప్రశాంతంగా జీపీఓ, సర్వేయర్ల పరీక్ష
గద్వాల: గ్రామ పాలనఅధికారి, లైసెన్స్డ్ సర్వేయర్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఉదయం జీపీవో, మధ్యాహ్నం లైసెన్స్డ్ సర్వేయర్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. జీపీవో పరీక్ష ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు, లైసెన్డ్స్ సర్వేయర్ పరీక్ష మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరిగినట్లు తెలిపారు. ఎలాంటి మాస్కాపీయింగ్ ఆస్కారం లేకుండా పకడ్బందీగా నిర్వహించినట్లు తెలిపారు. ఉదయం పరీక్షను అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, మధ్యాహ్నం పరీక్షను కలెక్టర్ బీఎం సంతోష్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో అధికారులు రాంచంద్రం, తహసీల్దార్ మల్లిఖార్జున్, ప్రియాంక, రేణుకాదేవి తదితరులు పాల్గొన్నారు. -
ముచ్చోనిపల్లికి ముప్పు..!
రిజర్వాయర్కు అలుగు కాల్వ లేక ఇబ్బందులు ●గట్టు: రూ.38.25 కోట్లు వెచ్చించి.. 1.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ముచ్చోనిపల్లి రిజర్వాయర్ను ఏళ్లుగా సగం నీటితో నింపి సరిపెట్టాల్సిన దుస్థితి నెలకొంది. ప్రధానంగా ప్రతి రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టంతో నిండిన తర్వాత ఎక్కువైన నీరు అలుగు కాల్వ ద్వారా బయటకు వెళ్లాల్సి ఉండగా.. ఈ రిజర్వాయర్కు అసలు అలుగు కాల్వనే నిర్మించకపోవవడం గమనార్హం. ఒకవేళ వరదొస్తే పరిస్థితి ఏంటి అనే ప్రశ్న రేకెత్తుతోంది. ఈ ముప్పును ఇప్పటికై నా అధికారులు గమనించాలని రైతులు కోరుతున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో 109 ప్యాకేజీలో భాగంగా ముచ్చోనిపల్లె గ్రామం వద్ద రూ.38.25 కోట్లతో 1.5 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి కాంట్రాక్టర్ 2007లో ఒప్పందం చేసుకోగా, 2015లో రిజర్వాయర్ పనులు పూర్తి చేశారు. పదేళ్ల క్రితమే రిజర్వాయర్ నిర్మాణం పూర్తయినప్పటికీ అలుగు కాలువ నిర్మాణం మాత్రం అసంపూర్తిగా వదిలేశారు. రిజర్వాయర్ను నిర్మించిన ఇంజినీరింగ్ అధికారులు కేవలం అలుగు కాల్వను నిర్మించలేక పోతున్నారు. అలుగు (సర్ప్లస్ చానల్) కాల్వవ ఉంటేనే రిజర్వాయర్ నిండిన తర్వాత ఎక్కువైన నీరు అలుగు ద్వారా బయటకు వెళ్లిపోతుంది. అలుగు కాల్వ నీరు పారేందుకు సుమారుగా 90 ఎకరాల మేరకు భూములు అవసరమున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక్కడ మాత్రం అధికారులు ఏళ్లు గడుస్తున్నా అలుగు కాలువను మాత్రం ఏర్పాటు చేయలేక పోతున్నారు. తద్వారా ముచ్చోనిపల్లె రిజర్వాయర్లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేక పోతున్నారు. మొక్కుబడిగా ఏటా కొద్ది పాటి నిటిని మాత్రమే నింపి చేతులు దులుపుకొంటున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. అలుగు ద్వారా పారే నీరు బయటకు వెళ్లడానికి వీలుగా కాలువ నిర్మాణం చేపట్టలేదు. 1.5 టీఎంసీల సామర్థ్యం కల్గిన ముచ్చోనిపల్లె రిజర్వాయర్ను సాగు నీటి శాఖ అధికారులు ఇప్పటి దాకా కేవలం 60 శాతం మేరకు మాత్రమే నీటిని నింపుతూ వచ్చారు. భారీ వర్షాలకు రిజర్వాయర్పై భాగంలోని గట్టు, మాచర్ల, బల్గెర, యల్లందొడ్డి, చింతలకుంట గ్రామాల నుంచి వరద నీరు పెద్ద ఎత్తున తరలివచ్చి ముచ్చోనిపల్లె రిజర్వాయర్లోకి చేరితే పరిస్థితి ఎంటనే ప్రశ్న రైతుల్లో నెలకొంది. భూములు అమ్మి ఎలా బతకాలి ఈ భూములను విడిచి ఎలా బతకాలి. సేద్యం తప్పా మరో పని చేతకాదు. కాల్వ కోసం సేకరించే భూములకు మార్కెట్ రేట్ ప్రకారం ఎకరాకు రూ.12లక్షలు చెల్లించాలి. బయట మార్కెట్లో రేటు ఇంకా ఎక్కువగానే ఉంది. ప్రభుత్వం చెల్లించే పరిహారంతో మరో చోట భూములను కొనలేం. తప్పెట్లమొర్సు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మాకు న్యాయమైన పరిహారం చెల్లిస్తేనే భూములను అప్పగిస్తాం. – పగిడాల నర్సింహులు, తప్పెట్లమొర్సు భూ సేకరణపై రైతులతో చర్చిస్తాం ముచ్చోనిపల్లె రిజర్వాయర్ అలుగు కాలువ నిర్మాణం విషయంలో రైతులతో సంప్రదింపులు చేస్తున్నాం. అడిషనల్ కలెక్టర్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ద్వారా తప్పెట్లమొర్సు గ్రామస్తులతో భూ సేకరణకు రైతులు సహకరించేలా చర్చలు జరిపాం. రైతులు అంగీకరించడం లేదు. అలైన్మెంట్ ప్రకారమే ముచ్చోనిపల్లె అలుగు కాలువను నిర్మించాల్సి ఉంటుంది. భూ సేకరణ సమస్య కారణంగా అలుగు కాలువ ఏర్పాటులో జాప్యం నెలకొంది. రైతులు సహకరిస్తే త్వరగా పూర్తి చేసి, రిజర్వాయర్ను పూర్తి స్థాయిలో నీటితో నింపి ఆయకట్టుకు నీరందిస్తాం. – నవీన, డీఈ వెంటాడుతున్న వరదల భయం ముచ్చోనిపల్లె రిజర్వాయర్కు వరద నీరు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఈ రిజర్వాయర్ కింద ఉన్న ఎక్లాస్పూర్, అయిజ పట్టణాల ప్రజలను వరదల సమయంలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతుంటారు. 2009 వరదలు అయిజ పట్టణ ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. అప్పట్లో వరదల సందర్భంలో అసంపూర్తిగా ఉన్న ముచ్చోనిపల్లె రిజర్వాయర్లోకి మాచర్ల, గట్టు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. దీంతో వాగు దగ్గర అసంపూర్తిగా ఉన్న మట్టి కట్ట వరద నీటి ఉధృతికి తెగిపోయింది. అప్పట్లో అర టీఎంసీ నీరు వృథాగా వాగు ద్వారా తుంగభద్ర నదికి చేరుకుంది. ప్రస్తుతం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున వరదలు వస్తే రిజర్వాయర్ కింద ఉన్న గ్రామాల పరిస్థితి ఏంటని ఆయా గ్రామాల ప్రజలు అందోళన చెందుతున్నారు. వరదొస్తే నీరు బయటికి పారే దారే కరువు జఠిలంగా మారిన భూసేకరణ 1.5 టీఎంసీల సామర్థ్యం.. రూ.38.25 కోట్లతో రిజర్వాయర్ నిర్మాణం సగం నీటితోనే సరిపెట్టేస్తున్న అధికారులు -
‘నెట్టెంపాడు’ పెండింగ్ పనులు పూర్తిచేయాలి
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు ఎర్రవల్లి: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ సంతోష్ అధికారులకు సూచించారు. శనివారం మండలంలోని కోండేర్ ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవల గురించి ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల నియంత్రణ కొరకు గ్రామాల్లో నీరు నిలిచి ఉండే ప్రదేశాల్లో దోమలు పెరగకుండా కిరోసిన్ చల్లడం, దోమల మందు కొట్టడం, బ్లీచింగ్ పౌడర్, ఆయిల్ బాల్స్ వేయడం వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గతంలో అధిక కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే గర్భిణులను సురక్షితంగా జిల్లా ఆసుపత్రికి తరలించాలన్నారు. ప్రజలు కాచిన వేడి నీటిని తాగడంతో పాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. అనంతరం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్ధాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస రావు, జిల్లా వైద్యాధికారి సిద్దప్ప, హౌసింగ్ డీఈ శ్రీనివాసులు, ఏఈ ప్రియాంక, ఎంపీడీఓ అజార్ మొహియుద్దీన్ పాల్గొన్నారు. గద్వాల: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పరిధిలో పెండింగ్లో ఉన్న భూసేకరణ ప్రక్రియ, నిలిచిన సివిల్వర్క్సను పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో పెండింగ్ పనులపై అధికారులతో సమీక్షించారు. నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కుడికాలువ పరిధిలో భూసేకరణ ప్రక్రియ చేయకపోవడంతో పనులు పెండింగ్లో ఉన్నాయన్నారు. 99బీ, 100 ప్యాకేజీల కింద చేయాల్సిన భూసేకరణ ప్రక్రియకు సంబంధించి ఆయా రైతులకు నోటీసులు ఇచ్చి వారి నుంచి భూసేకరణను పూర్తి చేయాలన్నారు. సేకరణ అనంతరం అక్కడ చేపట్టాల్సిన సివిల్వర్క్స్ పనులు వేగవంతంగా చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, ఎస్డీసీ శ్రీనివాస్రావు, ఇరిగేషన్శాఖ డీఈ, ఏఈలు, తహసీల్దార్ మల్లిఖార్జున్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. మాతృమరణాలు ఆపడమే లక్ష్యం.. ప్రభుత్వ ఆసుపత్రులలో మాతృమరణాలు సంభవించకుండా మెరుగైన వైద్యసేవలు అందించాలని.. వైద్యసిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు కలిసి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ బీఎం సంతోస్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో డీఎంహెచ్వో డాక్టర్ సిద్ధప్పతో కలిసి గట్టు, ఇటిక్యాల పీహెచ్సీల వైద్యులు, వైద్యసిబ్బందితో సమీక్షించారు. వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని, ఆర్ఎంపీలు కేవలం ప్రాథమిక చికిత్సను మాత్రమే అందించాలన్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వరాదని ఒకవేళ ఇస్తే అలాంటి ఆర్ఎంపీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అయిజ మండలం బింగిదొడ్డి గ్రామంలో బాలింతకు ఆర్ఎంపీ డాక్టర్ ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా ఇంజక్షన్ చేయడంతో బాలింత మృతిచెందడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించిన ఆర్ఎంపీ డాక్టర్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రసూనరాణి, డాక్టర్లు రమేష్, రాధిక, ఆరోగ్యశాఖ వైద్యసిబ్బంది తిరుమలేష్రెడ్డి, ఏఎస్వో నర్సయ్య హెల్త్అసిస్టెంట్లు, సూపర్వైజర్లు, ఆరోగ్యకార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆదాయానికి గండి
అనమతులు లేకుండా భారీగా మట్టి తరలిస్తు అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఒక టిప్పర్ వంటి వాహనాలకు ప్రభుత్వం నుంచి 19.5 మెట్రిక్ టన్నుల వరకు పాసింగ్ లోడ్ అనుమతులు ఉంటాయి. ఈ లెక్కన ఒక్కో టిప్పర్ మట్టి తరలింపునకు ప్రభుత్వానికి రూ.900 వరకు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇవేవి లేకుండానే మట్టి తరలింపులు చేస్తున్నారు. రోజుకు వందల సంఖ్యలో టిప్పర్ల ద్వార మట్టిని తరలిస్తుండటంతో ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తుండటంతో స్థానికంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. -
ఆగని మట్టి దందా..!
అనుమతుల్లేకుండానే ఎర్రమట్టి తరలింపు విజిలెన్స్ అధికారులు పరిశీలించినా.. ఎర్రమట్టి తరలింపుపై పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించి ఇటీవల రాష్ట్ర విజిలెన్స్ అధికారులు ర్యాలంపాడు, సుల్తానాపురం గుట్టలను పరిశీలించారు. దీంతో కొన్ని రోజులు తాత్కాలికంగా నిలిచాయి. ఆ తర్వాత యథావిధిగానే మట్టి తరలింపులు కొనసాగిస్తున్నారు. గుట్టల నుంచి తరలిన మట్టి వివరాలు ఇవ్వాలని జిల్లా మైనింగ్ అధికారులను రాష్ట్ర విజిలెన్స్ అధికారులు కోరినట్లు సమాచారం. ఆ మేరకు జిల్లా మైనింగ్ అధికారులు 648 మెట్రిక్ టన్నుల మేర మట్టి తవ్వకాలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులకు నివేదికలు ఇచ్చినట్లు తెలిసింది. కానీ స్థానికంగా మాత్రం ఈ నివేదికపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. 10 వేల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువగానే ఎర్రమట్టి తరలింపులు జరిగినట్లు స్థానికంగా చర్చకొనసాగుతుంది. అలంపూర్: ధనార్జనే ధ్యేయంగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండానే ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. అలంపూర్ మండలంలోని సుల్తానాపురం, ర్యాలంపాడులోని ప్రభుత్వ గుట్టలే లక్ష్యంగా గత కొన్ని నెలలుగా ఎర్ర మట్టి తరలింపులు కొనసాగుతున్నాయి. కనీస అనుమతులు లేకుండానే మట్టి తరలింపులు కొనసాగిస్తున్నారు. నియంత్రించాల్సిన మైనింగ్, రెవెన్యూ, పోలీస్శాఖల అధికారుల ముందే భారీ వాహనాల ద్వారా తరలింపులు జరుగుతున్నా కట్టడి చేయడానికి చేపట్టే చర్యలు శూన్యంగా కనిపిస్తున్నాయి. రాత్రింబవళ్లు మట్టి తరలింపులు సుల్తానాపురం గ్రామ శివారులోని 29/11 సర్వే నంబర్లోని గుట్టల నుంచి ఎర్రమట్టి తరలింపులు జోరుగా కొనసాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే రాత్రి పగలు అక్రమార్కులు ఎర్రమట్టిని తరలిస్తున్నారు. రోజుకు 50 నుంచి 60 టిప్పర్ల ద్వార మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికంగా ఉన్న అధికారులు సైతం భారీ స్థాయిలో మట్టి తరలి వెళ్తున్నా.. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం మిన్నకుండటంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న అక్రమార్కులు మైనింగ్ అధికారుల నివేదికలపై స్థానికంగా చర్చ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు అలంపూర్ మండలం ర్యాలంపాడు, సుల్తానాపురం గ్రామాల శివారు నుంచి ఎర్రమట్టి తరలింపునకు ఎలాంటి అనమతులు లేవు. అనుమతుల కోసం ఎవరూ మైనింగ్ శాఖను సంప్రదించలేదు. అక్రమంగా మట్టి తరలింపు చేస్తే చర్యలు తీసుకుంటాం. – సత్యనారాయణ, మైనింగ్ ఆర్ఐ -
సమయపాలన పాటించని వైద్యులకు నోటీసులు
గద్వాల: జిల్లాలోని పలు ఆస్పత్రుల్లో సమయపాలన పాటించని వైద్యులపై జిల్లా వైద్యాధికారి చర్యలకు ఉపక్రమించారు. జిల్లా ఆస్పత్రితోపాటు పలు పీహెచ్సీలను శుక్రవారం ‘సాక్షి’ విజిట్ చేయగా.. పలువురు వైద్యులు, సిబ్బంది విధులకు ఆలస్యంగా హాజరుకావడంతో రోగులు గంటల పాటు వైద్యం కోసం నిరీక్షించారు. దీనిపై ‘వైద్యం కోసం నిరీక్షణ’ శీర్షికన శనివారం ‘సాక్షిశ్రీలో కథనం ప్రచురితమైంది. దీంతో కథనానికి డీఎంహెచ్ఓ సిద్ధప్ప స్పందించారు. సమయపాలన పాటించని గట్టు, అయిజ, మల్దకల్, అలంపూర్, మానవపాడు, వడ్డేపల్లి, ఇటిక్యాల మండలాల పీహెచ్సీ మెడికల్ అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఈమేరకు వివరణ కోరామని.. వారు ఇచ్చే వివరణల ఆధారంగా చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ ‘సాక్షి’తో తెలిపారు. భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి గద్వాల: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి జి.రవి అన్నారు. శనివారం కలెక్టర్ బీఎం సంతోష్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తున్నందున చెరువులు, కుంటలు, రిజర్వాయర్ల వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలని, సీజనల్ వ్యాధులతోపాటు చికున్గున్యా, డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా అవసరమైన తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్ బీఎం సంతోష్ మాట్లాడుతూ.. కృష్ణా, తుంగభద్ర నదీపరివాహారక ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు చేపట్టామని, తాగునీరు కలుషితం కాకుండా పైప్లైన్ లీకేజీలను గుర్తించి వాటికి మరమ్మతులు చేపట్టామని, క్లోరినేషన్, పారిశుద్ధ్య పనులు చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులను తనిఖీలు నిర్వహిస్తూ ప్రజలకు అవరమైన వైద్యసేవలు అందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, డీఏవో సక్రియానాయక్, ఇరిగేషన్శాఖ ఈఈ శ్రీనివాస్రావు, ఆర్అండ్బీ ఈఈ ప్రగతి, డీపీవో నాగేంద్రం, డీఎస్వో స్వామికుమార్, ఉద్యావనశాఖ అధికారి అక్బర్, డీఎస్పీ మొగులయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స గద్వాల క్రైం: జిల్లా ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇందిర తెలిపారు. జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ రెండు రోజుల క్రితం ఆస్పత్రికి రాగా వైద్య పరీక్షలు నిర్వహించామని, వైద్యులు అన్ని పరీక్షు నిర్వహించగా హెర్నియా అని గుర్తించారన్నారు. సదరు మహిళ కొన్నేళ్లుగా దీని వల్ల బాధపడుతూ ఉన్నారన్నారు. ఈమేరకు శనివారం ఏడుగురితో కూడిన వైద్య బృందం నాలుగు గంటల పాటు శ్రమించి శస్త్ర చికిత్స చేశారన్నారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. అలాగే, ప్రసవం కోసం వచ్చిన ఓ గర్భిణి ఆరోగ్య పరిస్థితి సైతం విషమంగా ఉండగా వైద్య బృందం శస్త్రచికిత్స చేశారని, తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారన్నారు. శస్త్ర చికిత్సలో వైద్యులు విపంచి, కేచరి, విజయభాస్కర్, స్పందన, షఫి తదితరులు ఉన్నారన్నారు. -
కేసుల్లో పురోగతి సాధించాలి
● ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి ● జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ గద్వాల క్రైం/ఎర్రవల్లి: కేసుల విచారణలో వీలైనంత త్వరగా పురోగతి సాధించి బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాల్సిందిగా జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ అన్నారు. శనివారం వార్షిక తనిఖీలో భాగంగా జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని, ఎర్రవల్లి మండలంలోని కోదండాపురం సిఐ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాసరావుతో శాంతిభద్రతల పరిరక్షణలో తీసుకున్న చర్యలు, సిబ్బంది పనితీరుపై, జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలో నమోదవుతున్న కేసులపై ఆరా తీశారు. ఎస్సీ, ఎస్టీ కేసులు, నిషేధిత మత్తు పదార్థాలు, నకిలీ విత్తనాలు తదితర వాటికి సంబంధించి వివరాలు వాకబు చేశారు. విధుల్లో సిబ్బంది ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదని, రెండు రాష్ట్రాల సరిహద్దుల వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. జిల్లాకు ప్రవేశపెట్టిన బడ్జెట్ నుంచి ఇప్పటి వరకు చేసిన ఖర్చులు, వాటికి సంబంధించిన నివేదికలను పరిశీలించారు. అనంతరం జిల్లా సాయుధ బలగాల కార్యాలయం, గద్వాల రూరల్ పోలీసు స్టేషన్ డీఐజీ సందర్శించి స్టేషన్ సిబ్బందితో మాట్లాడారు. ● అదేవిధంగా కోదండాపురం సిఐ కార్యాలయం ఆవరణలో డీఐజీ, ఎస్పీ మొక్కలు నాటారు. ప్రతి పోలీస్శాఖ భూములలో, పోలీస్స్టేషన్ ఆవరణలో వనమహోత్సవంలో భాగంగా విరివిగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డీఐజీ సూచించారు. సర్కిల్ పరిదిలోని అన్ని పీఎస్లలో డయల్ 100 కాల్ రాగానే వెంటనే ఆయా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించేలా చూడాలన్నారు. అలాగే బ్లూకోర్ట్, పెట్రోల్ కార్ నిరంతరం గస్తీ నిర్వహించేలా ఆయా ఎస్ఐలు చర్యలు చేపట్టాలని సిఐ రవిబాబుకి సూచించారు. డీఐజీ వెంట ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీలు మొగిలయ్య, నరేందర్రావు, సీఐలు నాగేశ్వరెడ్డి, శ్రీను, టాటాబాబు, రవిబాబు, ఎస్ఐలు శ్రీకాంత్, కళ్యాణ్కుమార్ తదితరులు ఉన్నారు. జోగుళాంబ ఆలయ సన్నిధిలో డీఐజీ అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన అలంపూర్ జోగుళాంబ ఆలయాన్ని శనివారం డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఎస్పీ శ్రీనివాస్రావు దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం డీఐజీ, ఎస్పీ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం పలికారు. వీరితోపాటు డీఎస్పీ మొగులయ్య, ఎస్ఐ వెంకటస్వామి తదితరులు ఉన్నారు. -
మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ధరూరు: మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇదిరా మహిళా శక్తి, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యేతోపాటు కలెక్టర్ బీఎం సంతోష్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకే ప్రాధాన్యతనిస్తోందని, కోటి మందిని కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం లక్ష్యమన్నారు. ప్రమాద బీమా, రుణ బీమా కల్పనతో పాటు మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్టీసీ బస్సులు, పాఠశాలల నిర్వహణ, పెట్రోలు బంకులు, స్కూల్ యూనిఫాం తయారీ, వరి ధాన్యం కొనుగోలు నిర్వహణ వంటి అనేక అవకాశాలను కల్పిస్తుందని, ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆర్థికంగా రాణించాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మండలంలో మొత్తం 632 సంఘాల్లో 7వేల మంది మహిళలు ఉన్నారని, ఇంకా అనేక మంది సభ్యులుగా చేరాలని అన్నారు. మండలానికి మంజూరైన 800 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. మండలానికి కొత్తగా 600లకు పైగా రేషన్ కార్డులు మంజూరి కావడం జరిగిందన్నారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులకు రూ.4.70 కోట్ల బ్యాంకు రుణాల చెక్కులను, రూ.49.41 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులను, కొత్త రేషన్ కార్డులను అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, బండారి భాస్కర్, కృష్ణారెడ్డి, సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు. గద్వాల మార్కెట్యార్డు అభివద్దికి కృషి గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డు అభివృద్ధికి చిత్తశుద్దితో కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం యార్డులో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ, కాంపౌడ్వాల్ నిర్మాణాల పనులకు భూమిపూజ నిర్వహించి, పనులు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. యార్డు రాష్ట్రంలోనే ప్రసిద్దిగాంచిందని, ఏడాదిపొడవున పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరుగుతుంటాయన్నారు. ఇక్కడికి వచ్చే రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం దడవాయిలు, హమాలీలు, చాటకూలీలకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, జిల్లా మార్కెటింగ్ అధికారి పుష్ప. యార్డు కార్యదర్శి నర్సింహులు, యార్డు వైస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యాన పంటల సాగుతో అధిక లాభాలు
ఇటిక్యాల: రైతులు ఉద్యాన పంటలను సాగు చేసి అధిక లాభాలు పొందవచ్చునని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి అక్బర్ అన్నారు. శుక్రవారం మండలంలోని మునగాలలో రైతు కుర్వ మల్లేష్ సాగుచేస్తున్న కూరగాయల పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు అధిక ఆదాయం ఇచ్చే కూరగాయలు, ఆయిల్పాం పంటలపై ప్రత్యేక దృష్టి సారించాలని, కూరగాయల సాగుకు ప్రభుత్వం వివిధ పధకాల నుంచి రాయితీని అందిస్తుందన్నారు. కలుపు సమస్య లేకుండా నీటిని ఆదా చేసుకుంటూ ప్లాస్టిక్ మల్చింగ్ పథకానికి 50 శాతం రాయితీ లభిస్తోందన్నారు. ఒక హెక్టార్కు రూ.20 వేల చొప్పున ఒక్కో రైతుకు రెండు హెక్టార్ల వరకు అందిస్తామని, అదే విధంగా తీగజాతి కూరగాయలు బీర, కాకర, సొరకాయ సాగు రైతులకు శాశ్వత పందిళ్ల నిర్మాణానికి అర ఎకరానికి రూ. 50 వేలు రాయితీని కల్పించబడుతుందని అన్నారు.కార్యక్రమంలో డివిజినల్ ఉద్వాన అధికారి రాజశేఖర్, సిబ్బంది ఇమ్రానా, మహేష్, రైతులు,తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు ధరూరు: మండల కేంద్రంతో పాటు మండల పరిదిలోని ఆయా గ్రామాల్లోని ఫర్టిలైజ్ దుకాణాలను జిల్లా యవసాయ శాఖ అధికారి సక్రియా నాయక్ తనిఖీ చేవారు. శుక్రవారం ఆయన చింతరేవుల, మాల్దొడ్డి, గుడ్డెందొడ్డి, నెట్టెంపాడు తదితర గ్రామాల్లో ఏఓ శ్రీలతతో కలిసి తనిఖీలు చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. రైతుల ఆధార్కార్డులు తీసుకుని అవసరమైన మందులు ఇవ్వాలని, వారికి ఇబ్బందులు కలగకుండా యూరియాను అందించాలని, గట్టి మందులను అంటగట్టే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. నిర్ణీ త ధరలకే అమ్మకాలు జరపాలని, అధిక ధరలకు విక్రయించినట్లు రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని, ప్రతి కొనుగోలుకు సంబంధించి రషీదు అందించాలన్నారు. స్టాక్, ధరల పట్టికకు సంబంధించి బ్లాక్ బోర్డులను ఏర్పాటు చేయాలని, రైతులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో పర్టిలైజర్ డీలర్లు, ఏఈఓలు పాల్గొన్నారు. -
పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పెండింగ్లో ఉన్న పెన్షన్, జీపీఎఫ్ ఫైనల్ విత్ డ్రాయల్ కేసుల సత్వర పరిష్కారానికి పెన్షన్ అదాలత్ నిర్వహించి పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిత్ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అకౌంటెంట్ జనరల్ (ఏఅండ్ఈ), కలెక్టరేట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెన్షన్, జీపీఎఫ్ అదాలత్లో కలెక్టర్ విజయేందిరతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్లు, జీపీఎఫ్ అందజేతలో ఏమైనా సందేశాలు ఉంటే అదాలత్లో నివృత్తి చేసుకోవాలని సూచించారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పెన్షన్ పత్రాలు, సాధారణ భవిష్య నిధి పత్రాలు అందిన వెంటనే వాటిని పరిశీలించి మంజూరు ఉత్తర్వులు అందిస్తామన్నారు. ప్రభుత్వ శాఖలలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్, జీపీఎఫ్ ఫైనల్ విత్ డ్రాయల్ ఉత్తర్వులు అందేలా ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు. కలెక్టర్ విజయేందిర మాట్లాడుతూ పింఛన్ ప్రభుత్వ ఉద్యోగుల హక్కు, పదవీ విరమణ చేసిన రోజున ఉద్యోగులకు పెన్షన్ ఉత్తర్వులు అందేలా చూడాలన్నారు. అలాగే పెన్షన్ అదాలత్ ఏర్పాటు చేసి పెన్షన్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. కాగా.. పెన్షన్ అదాలత్లో 116 అధికారులు, 50 మంది పెన్షనర్లు, 28 మంది చందాదారులు పాల్గొన్నారు. మంజూరు పత్రాలు, ప్రొసీడింగ్స్ అందజేత.. ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్తో కలిసి కలెక్టర్ 20 మందికి పెన్షన్ మంజూరు పత్రాలు, 16 జీపీఎఫ్ ఆథరైజేషన్ ప్రొసీడింగ్స్లను రిటైర్డ్ ఉద్యోగులకు అందజేశారు. పదవీ విరమణ పొందనున్న ఉద్యోగులకు త్వరగా పేమెంట్ ఆర్డర్ అందజేతకు చర్యలు రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిత్ -
జములమ్మ హుండీ ఆదాయం రూ.29 లక్షలు
గద్వాలన్యూటౌన్: గద్వాల ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన జములమ్మ ఆలయ హుండీని శుక్రవారం లెక్కించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకురాలు వెంకటేశ్వరి, ఆలయ ఈఓ పురంధర్కుమార్, చైర్మన్ వెంకట్రాములు యూనియన్ బ్యాంక్ అధికారుల సమక్షంలో భక్తులు నాలుగు నెలలకుగాను హుండీ లెక్కింపు నిర్వహించారు. హుండీ ద్వారా నగదు రూ. 29.34లక్షలతో పాటు అర కేజీ మిశ్రమ వెండి ఆలయానికి ఆదాయంగా సమకూరింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.5560 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డ్కు శుక్రవారం 723 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. ధరల విషయానికి వస్తే గరిష్టం రూ.5560, కనిష్టం రూ. 2270, సరాసరి రూ. 4910 ధర పలికాయి. అయిజలో మార్కెట్ యార్డు ఏర్పాటు చేయండి అలంపూర్: అయిజలో కొత్త మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కోరారు. హైదరాబాద్లో శుక్రవారం ఆయనను కలిసి కొత్త మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో ప్రస్తుతం ఒక మార్కెట్యార్డు మాత్రమే ఉందని, కొత్తగా వచ్చిన నిబంధనల మేరకు మరొక మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అయిజ పెద్ద మండలం కావడంతో ఈ ప్రాంతంలో ఉన్న రైతులు ఏపీలోని కర్నూల్, ఎమ్మిగనూరు, కర్ణాటకలోని రాయచూరుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు తెలిపారు. ఈ ప్రాంత రైతులకు ప్రయోజనం జరిగే విధంగా కొత్త మార్కెట్ యార్డును అందుబాటులోకి తేవాలన్నారు. కొత్త మార్కెట్ యార్డు అందుబాటులోకి వస్తే రైతులకు ఎంతో ప్రయోజనం చేకురుతుందన్నారు. అనంతరం చైర్మన్ కోదండరెడ్డిని ఏఐసీసీ కార్యదర్శి శాలువాతో సత్కరించారు. వీరితోపాటు కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్షావలి ఆచారి, నాయకులు శ్రీరాంరెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు. రాష్ట్ర నీటి హక్కుల కోసం జంగ్ సైరన్ అలంపూర్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర నీటి హక్కుల కోసం జంగన్ సైరన్ మోగించారని బీఆర్ఎస్వి జిల్లా కో–ఆర్డీనేటర్ కుర్వ పుల్లయ్య అన్నారు. అలంపూర్, అలంపూర్ చౌరస్తా, మానవపాడులోని కళాశాలలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కో–ఆర్డినేటర్ మాట్లాడుతూ.. గోదావరి నదిలో జరుగుతున్న జల దోపిడీని అడ్డుకుందామని, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు వత్తాసు పలుకుతున్న రేవంత్రెడ్డి కుట్రలను తిప్పికొడదామన్నారు. కేసీఆర్ సారథ్యంలో నీళ్లు, నిధులు, నియామకాలే ఏజెండాగా తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. రాష్ట్ర సాధన సాకరమైన తర్వాత బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ పచ్చని మణిహారంగా మారిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జల దోపిడీ కొనసాగుతుందన్నారు. ఏపీ సీఎం గోదావరి నుంచి అక్రమంగా 200 టీఎంసీల నీటిని తరలించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి అడ్డుకోవడానికి బదులు సహకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గోదావరి, కృష్ణా నదుల యాజమాన్య బోర్డులు, కేంద్ర జల సంఘం అనుమతులు లేకుండా, అపెక్స్ కౌన్సిల్లో చర్చ జరగకుండా ప్రాజెక్టులు నిర్మించరాదన్నారు. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని కేసీఆర్ దిశానిర్ధేశం చేశారన్నారు. అలాగే, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వి నాయకులు మద్దిలేటి, బాలరాజు, మాధవ్, యువరాజ్, రేపల్లె చిన్న, రాజు పాల్గొన్నారు. -
వైద్యం కోసం నిరీక్షణ
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సమయపాలన పాటించని వైద్యులు కలెక్టర్ హెచ్చరించినా.. రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్యశాఖపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, అత్యవసర కేసులకు సంబంధించి వైద్యాన్ని సైతం అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈక్రమంలోనే గురువారం కలెక్టర్ బీఎం సంతోష్ వైద్యారోగ్యశాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఖచ్చితంగా సమయపాలన పాటించాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. అయితే హెచ్చరికలు జారీ చేసి 24గంటలు గడవకముందే కలెక్టర్ హెచ్చరికలు బేఖాతరు చేస్తూ తమకు అలవాటైన సమయంలో విధులకు హాజరు కావడం కొసమెరుపు. ప్రసవాలు, డయాలసిస్ సేవలు మెరుగు ఇదిలాఉండగా, జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలకు సంబంధించి రాష్ట్రంలోనే ఉత్తమ సేవలు అందిస్తున్నారు. 2024 ఏప్రిల్–2025 మార్చి వరకు 10 పీహెచ్సీలలో 2,540 సాధారణ ప్రసవాలు, జిల్లా ఆస్పత్రి, అలంపూర్, అలంపూర్ చౌరస్తాలోని ఆస్పత్రుల్లో 3,688 సాధారణ ప్రసవాలు చేసి రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిచారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ రోగులకు ఉత్తమ సేవలందించడంతో రాష్ట్రంలోనే మూడో స్థానం సాధించారు.చిత్రంలో ఖాళీ కుర్చీ కనిపిస్తున్నది జిల్లా ఆస్పత్రిలోని సూపరింటెండెంట్ గది. ఉదయం 9 గంటలకు హాజరుకావాల్సిన అధికారి 9.48 గంటల వరకు హాజరుకాలేదు. జిల్లా ఆస్పత్రి వైద్యులు సైతం కొందరు 9.30 తర్వాత మరికొందరు 10 గంటల తర్వాత తీరిగ్గా రావడం కనిపించింది. ఆస్పత్రిలోని పరిసరాలు సైతం అపరిశుభ్రంగా దర్శనమిచ్చాయి. 150 పడకల సామర్థ్యం గల ఈ ఆస్పత్రికి జిల్లా నలుమూలల నుంచి పలువురు వైద్యం కోసం వచ్చారు. వైద్యులు సమయానికి రాకపోవడంతో వారికి ఎదురుచూపులు తప్పలేదు. ఇదిలాఉండగా, గతంలో వైద్యవిధానపరిషత్ కింద ఉన్న జిల్లా ఆస్పత్రి.. ప్రస్తుతం ప్రభుత్వ మెడికల్ కళాశాల వచ్చి మరింత మెరుగైన వసతులు కల్పించినప్పటికీ వైద్యులు, వైద్యసిబ్బంది తీరులో మాత్రం మార్పు రాలేదు. పాత ఆనవాయితీనే ఒంట పట్టించుకుని ఆలస్యంగా విధులు హాజరుకావడం కనిపించింది. రోగుల ఇబ్బందులు వైద్యం అందించాల్సిన వైద్యులు సమయపాలన పాటించకపోవడంవో వివిధ రకాల రోగాలతో వైద్యం కోసం వచ్చిన రోగులు ఆసుపత్రి ఆవరణలలో నిరీక్షిస్తూ కనిపించారు. ప్రధానంగా 24గంటల పాటు వైద్యసేవలు అందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలైన అయిజ, గట్టు, వడ్డేపల్లి, మానవపాడు, క్యాతూరు, ఉప్పేరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలలో వైద్యులు, వైద్య సిబ్బంది 10గంటలకు విధులకు హాజరు కావడం కనిపించింది. దీంతో ఆయా ఆసుపత్రులలో వైద్యం కోసం వచ్చిన రోగులు వైద్యుల కోసం పడిగాపులు కాస్తూ కనిపించారు. జిల్లా ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గద్వాల/సాక్షి నెట్వర్క్: ‘వైద్యో నారాయణ హరి’.. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం. కానీ, కొందరు ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యుల నిర్వాకం వల్ల ఈ అర్థాన్నే పూర్తిగా మార్చేశారు. ఆలస్యంగా విధులకు హాజరుకావడం.. కలెక్టర్ ఆదేశాలు సైతం బేఖాతరు చేయడం పరిపాటిగా మారింది. ప్రభుత్వాలు వైద్యశాఖలో పలు సంస్కరణలు తీసుకొచ్చి ఎప్పటికప్పుడు రోగులకు మెరుగైన వైద్యం అందించే దిశగా చర్యలు చేపడుతున్నా.. అమలు చేయాల్సిన వైద్యులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎన్నో ఇబ్బందుల నడుమ వైద్యం కోసం వచ్చిన రోగులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పతిలో వైద్యులు, వైద్య సిబ్బంది ఉదయం 10 గంటల తర్వాతే విధులు హాజరుకావడం గమనార్హం. చాలా చోట్ల అత్యవసర వైద్యం కోసం జిల్లా కేంద్రం, అక్కడ కాకపోతే కర్నూల్, హైదరాబాద్కు పోవాల్సిన పరిస్థితి దాపురించింది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, జిల్లా ఆస్పత్రిని ‘సాక్షి’ విజిట్ చేసినపుడు పలు విషయాలు వెలుగు చూశాయి. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు.. 10 పీహెచ్సీలు, రెండు టీవీవీపీ, ఒక జీజీహెచ్.. జిల్లా వ్యాప్తంగా ప్రజలకు వైద్యం అందించేందుకు మొత్తం 10 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలున్నాయి. జిల్లా కేంద్రంలో జిల్లా ఆస్పత్రి, అలంపూర్, అలంపూర్చౌరస్తాలో ప్రభుత్వ వైద్యవిధానపరిషత్ ఆస్పత్రులు ఉన్నాయి. జిల్లాలో మొత్తం జనాభా సుమారు 6లక్షల వరకు ఉండగా, అన్ని మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రతిరోజు వెయ్యికి పైగా వివిధ రోగాలకు సంబంధించి వైద్యం కోసం అవుట్ పేషంట్లుగా వెళ్తుంటారు. ఇందులో సుమారు 200మందికి పైగా ఇన్పేషంట్లు చేరుతుంటారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు సుమారు 800మంది అవుట్పేషంట్లు వస్తుండగా.. 150మంది వరకు ఇన్పేషంట్లుగా చేరుతుంటారు. చిత్రంలో కనిపిస్తున్నది అయిజ పీహెచ్సీ. ఉదయం 10.30 గంటలు అయినా కూడా ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు (డాక్టర్లు), ఫార్మసిస్టు విధులకు హాజరుకాలేదు. అయిజ మండలంతోపాటు గట్టు, మల్దకల్, వడ్డేపల్లి మండలాల నుంచి అధికంగా గర్భిణులు వైద్యం కోసం వచ్చారు. అలాగే, కుక్కకాటు వ్యాక్సిన్ నిమిత్తం మరో ఇద్దరు అక్కడికి చేరుకున్నారు. కానీ, 9 గంటలకు విధులు హాజరుకావాల్సిన వైద్యులు గంటన్నర ఆలస్యమైనా రాకపోవడంతో అటు గర్భిణులు, ఇటు ఇతర రోగులకు ఎదురుచూపులు తప్పలేదు. వైద్యులు సమయపాలన పాటించి మెరుగైన వైద్యం అందిస్తే బాగుంటుందని అక్కడికి వచ్చిన రోగులు, వారి బంధువులు పేర్కొన్నారు. 10 గంటల తర్వాతే విధులకు హాజరు రోగులకు తప్పని పడిగాపులు జిల్లా ఆస్పత్రిలోనూ అదేతీరు కలెక్టర్ హెచ్చరికలు సైతం బేఖాతరు ‘సాక్షి’ విజిట్లో వెలుగుచూసిన వైనం సమయపాలన పాటించకుంటే చర్యలు వైద్యులు సమయపాలన పాటించకపోతే వారిపై తప్పకుండా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ సిద్దప్ప తెలిపారు. అదేవిధంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇందిర మాట్లాడుతూ గతంలో పేషంట్లు ఉదయం 10గంటలకు ఓపీకి వస్తుండడంతో వైద్యులు కూడా అదే సమయంలో రావడం అలవాటైందని, ఇక మీదట ఉదయం 9గంటలకు ఖచ్చితంగా విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలి : ఎస్పీ
గద్వాల క్రైం: వివిధ సమస్యలపై పోలీస్స్టేషన్కు వచ్చే ప్రజలతో సిబ్బంది స్నేహ పూర్వకంగా మెలగాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్స్టేషన్లో ఎస్పీ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. .. బాధితుల ఫిర్యాదు మేరకు కేసుల నమోదులో నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఫిర్యాదులపై వేగవంతంగా విచారణ చేపట్టి బాధితులకు పోలీసుశాఖపై నమ్మకం పెంచాలని సూచించారు. పట్టణంలో నిత్యం గస్తీ, పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. సైబర్ క్రైమ్స్, మహిళలపై వేధింపులు, లైంగిక దాడులు, మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. స్టేషన్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాల పనితీరుపై ఆరా తీశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్పీ వెంట సీఐ శ్రీను, ఎస్ఐ కళ్యాణ్కుమార్ ఉన్నారు. -
లక్ష్యం.. నిర్దేశం
ఆర్థికంగా చేయూత.. ప్రతి ఆర్థిక సంవత్సరంలో వివిధ రంగాల్లో అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అందించి.. ఆర్థికంగా చేయూత అందించడంతో పాటు పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు జిల్లా లీడ్ బ్యాంక్ అధికారులు వార్షిక రుణ ప్రణాళిక రూపొందించారు. ఇటీవల కలెక్టర్ అధ్యక్షతన జరిగిన డీసీసీ సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సర రుణ ప్రణాళికను ఖరారు చేశారు. అయితే 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిద రంగాల్లో లబ్ధిదారులకు దాదాపు రూ. 5వేల కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించగా.. ఇందులో 90శాతం పైగా అందించారు. ● విద్య, వ్యవసాయం, వ్యాపారాలు, గృహనిర్మాణాలకు ఆర్థిక తోడ్పాటు ● జిల్లాలో 2,01,300 మందికి రూ. 6472.29 కోట్లు అందించేలా కార్యాచరణ ● లక్ష్యం మేరకు రుణాలు అందిస్తేనే ప్రయోజనం జిల్లాలో రుణ లక్ష్యం ఇలా.. ●టార్గెట్ మేరకు.. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హులైన లబ్ధిదారులకు లక్ష్యం మేరకు రుణాలు అందించాం. ఇటీవల జరిగిన డీసీసీ సమావేశంలో 2025–26 వార్షిక రుణ ప్రణాళికను ఆమోదించారు. ఆయా రంగాలకు ఉన్న అవసరం మేరకు రుణ లక్ష్యాలను నిర్దేశించాం. ఆయా రంగాల్లో అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అందేలా చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరావు, ఎల్డీఎం గద్వాలన్యూటౌన్: జిల్లాలో వివిధ రంగాలు, వాటి విభాగాలకు 2025–26 సంవత్సరం అందించాల్సిన రుణాలపై వార్షిక ప్రణాళిక ఖరారైంది. విద్య, వ్యవసాయం, అనుబంధ రంగాలు, గృహనిర్మాణాలు, వివిధ వ్యాపారాలు, సంస్థల నిర్వహణకు అవసరమైన రుణాలను బ్యాంకుల ద్వారా అందించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. ఆయా రంగాల్లోని విభాగాల్లో 2,01,300 మంది లబ్ధిదారులకు రూ. 6472.29 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ● జిల్లాలో గోదాములు, శీతలీకరణ కేంద్రాల ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. వీటి నిర్మాణాల కోసం అవసరమైన వారికి రుణాలు అందించి.. ప్రోత్సహించాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉంది. ఏళ్ల తరబడి పాడిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న రైతులకు విరివిగా రుణాలు అందిస్తేనే జిల్లాలో పాలు, పాలపదార్థాల ఉత్పత్తి పెరిగి.. రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ● ఇక పౌల్ట్రీ రంగంపై ఎంతో మంది ఔత్సాహికులు ఉన్నప్పటికీ తగినంత పెట్టుబడి లేక ముందుకు రాలేకపోతున్నారు. ఇలాంటి వారికి రుణాలు అందించి.. పౌల్ట్రీ రంగాన్ని జిల్లాలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ● జిల్లాకు చెందిన చాలా మంది విద్యార్థులు, యువత ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని ఉన్నా.. ఆర్థిక పరిస్థితుల కారణంగా వెళ్లలేకపోతున్నారు. ఇలాంటి విద్యార్థులు, యువతకు బ్యాంకర్లు రుణాలు అందిస్తేనే వారు ఉన్నత చదువులు చదుకొని అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుతారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన నడిగడ్డ రెండు జీవనదుల నడుమ ఉంది. జిల్లాలో మొత్తం 1,76,860 మంది రైతులు ఉండగా.. వీరిలో 90శాతం సన్న, చిన్నకారు రైతులే ఉన్నారు. రైతుభరోసా, కిసాన్ సమ్మాన్ యోజన లాంటి పెట్టుబడి సాయం పథకాలు ఉన్నప్పటికీ రైతులకు అన్ని అవసరాలు తీరడం లేదు. వారంతా బ్యాంకులు అందించే పంట రుణాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. రైతులకు సకాలంలో పంట రుణాలు అందిస్తేనే ప్రయోజనం చేకూరుతుంది. ● ఇక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల స్థాపనను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉంది. స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక చాలా మంది నిరుద్యోగ యువత ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సంస్థల స్థాపనకు ముందుకొచ్చే వారికి రుణాలు అందించడం వల్ల నిరుద్యోగ సమస్య కాస్త తగ్గుతుంది. పునరుత్పాదక రంగానికి రుణాలు అందించి చేయూతనివ్వాలి. ● మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చుకోవాలని ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో గృహనిర్మాణానికి అవసరమైన వస్తువుల ధరలు బాగా పెరిగాయి. గృహనిర్మాణానికి చేతినిండా డబ్బు ఉంటేనే సాధ్యపడుతుంది. ఈ నేపథ్యంలో బ్యాంకుల ద్వారా రుణాలు పొంది గృహాలు నిర్మించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చాలా మందికి గృహనిర్మాణ రుణాలు పొందడంలో ఇక్కట్లు పడుతున్నారు. అర్హులైన వారికి రుణాలు అందించాల్సిన అవసరం ఉంది. వార్షిక రుణ ప్రణాళిక ఖరారు -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం
గద్వాల: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాలులో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ శాతం ఎక్కువగా ఉండేలా సేవలు అందించాలని సూచించారు. వైద్యులతో పాటు సిబ్బంది సమయపాలన పాటిస్తూ.. బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. జిల్లా ఆస్పత్రితో సహా సీహెచ్సీలు, పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టీబీ ముక్త్భారత్లో భాగంగా క్షయవ్యాధి నిర్మూలనకు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డా.సిద్ధప్ప, ప్రోగ్రాం అధికారులు హెల్త్ సూపర్వైజర్లు ఉన్నారు. ఉన్నతస్థాయిలో నిలిపేది చదువే.. గద్వాలటౌన్: జీవితంలో ఉన్నత స్థితికి చేరాలంటే చదువు ఎంతో ముఖ్యమని.. క్రమశిక్షణ, జిజ్ఞాసతో కూడిన విద్య నేర్చుకున్నప్పుడే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ సంతోష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచితంగా స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చదువును కష్టంగా భావించకుండా ఇష్టంగా చదివితేనే అద్భుతాలు సృష్టిస్తారన్నారు. ప్రతి విద్యార్థి వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకోవాలని సూచించారు. విద్యార్థులను లక్ష్యసాధన దిశగా ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. పదో తరగతి విద్యార్థులు పాఠ్యాంశాలపై పట్టు సాధించి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. కాగా, కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్, హార్ట్ఫుల్ నెస్ ఎడ్యుకేషన్ ట్రస్టు నుంచి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు ప్రశంసలు రావడంపై ఉపాధ్యాయ బృందాన్ని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ట్రస్టు వ్యవస్థాపకురాలు మమత, రత్నసింహారెడ్డి, ఎంఈఓ శ్రీనివాస్గౌడ్, హెచ్ఎం రేణుకాదేవి, కృష్ణకుమార్, మహేశ్వర్రెడ్డి, కృష్ణవర్ధన్రెడ్డి పాల్గొన్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి కలెక్టర్ బీఎం సంతోష్ -
పాలమూరులో పోకిరీలు
మహమ్మదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికపై జీలకరపురం కృష్ణయ్య లైంగిక దాడి చేయడంతో 376(2) ఐపీసీతో పాటు పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. దీనిపై చార్జీషీట్ దాఖలు చేసి కోర్టులో హాజరుపరచగా ఈ నెల 17న ప్రత్యేక సెషన్స్ కోర్టు న్యాయమూర్తి నిందితుడు కృష్ణయ్యకు జీవితఖైదుతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. ●అవగాహన కల్పిస్తున్నాం.. జిల్లాలో షీటీం బృందాలు విద్యార్థినులు, అమ్మాయిలను వేధిస్తున్న ఆకతాయిలను అదుపులోకి తీసుకుని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఘటనలు తీవ్రంగా ఉంటే కేసులు నమోదు చేస్తున్నాం. అన్ని రకాల పాఠశాలల్లో పోక్సో, అమ్మాయిల రక్షణ, గుడ్ టచ్– బ్యాడ్ టచ్, ఈవ్ టీజింగ్ వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నాం. అమ్మాయిలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిఫెన్స్ వంటివి మెరుగుపరుచుకోవాలి. సోషల్ మీడియా వల్ల జరుగుతున్న నష్టాలపై చైతన్యం చేస్తున్నాం. – జానకి, ఎస్పీ, మహబూబ్నగర్ అండగా సఖి కేంద్రం.. వివిధ రూపాల్లో దాడులకు గురైన మహిళలకు సఖి కేంద్రం అండగా ఉంటుంది. మైనర్లపై అత్యాచారాలు, లైంగిక దాడులు, పరువు హత్యలు, యాసిడ్ దాడులు, వరకట్నం వంటి అన్ని రకాల వేధింపుల నుంచి రక్షించడానికి కృషి చేస్తోంది. 18 ఏళ్ల లోపు బాలికలతో పాటు మహిళలకు ఏదైనా సమస్య వస్తే సఖి కేంద్రాన్ని ఆశ్రయిస్తారు. అలాగే టోల్ఫ్రీ నం.181కు ఫోన్ చేసి సమస్యను చెప్పవచ్చు. – సౌజన్య, సఖి కేంద్రం కో–ఆర్డినేటర్, మహబూబ్నగర్ 2022 నుంచి ఉమ్మడి జిల్లాలో నమోదైన పోక్సో కేసులు జిల్లా నమోదైన కేసులు 2022 2023 2024 2025 (జూన్) మహబూబ్నగర్ 133 116 133 69 వనపర్తి 47 46 54 42 జోగుళాంబ గద్వాల 74 73 51 36 నాగర్కర్నూల్ 86 91 105 45 నారాయణపేట 50 42 80 39 -
పరిహారం కోసం రైతుల ఆందోళన
గట్టు: భారత్మాల రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి రెండో విడత పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం రైతులు ఆందోళనకు దిగారు. గంగిమాన్దొడ్డి వద్ద నిర్మాణంలో ఉన్న భారత్మాల రహదారిపై గట్టు, గంగిమాన్దొడ్డి గ్రామాల రైతులు బైఠాయించి పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. కొత్తగా చేపట్టిన ఆరు వరుసల భారత్మాల రహదారి నిర్మాణంలో భూములను కోల్పోయిన తమకు ప్రభుత్వం చాలీచాలని పరిహారం అందించి చేతులు దులుపుకొందన్నారు. తమకు న్యాయమైన పరిహారం అందించి ఆదుకోవాలని ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. తమకు రెండో విడత పరిహారం అందించే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. రోడ్డు నిర్మాణం చేపడుతున్న సైట్ ఇన్చార్జి అఫ్జల్తో పాటు పోలీసులు అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. రైతుల ఆందోళనకు ఎమ్మార్పీఎస్ మండ ల అధ్యక్షుడు ఏసన్న, కాంగ్రెస్ పార్టీ మండల అ ధ్యక్షుడు మహబూబ్ పాషా, రైతులు సంతోష్, వెంకట్రాములు, నర్సింహులు, తిమ్మప్ప పాల్గొన్నారు. -
అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు
అలంపూర్: ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియా నాయక్ అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని ఎరువుల విక్రయ కేంద్రాల్లో గురువారం ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు ఎరువుల స్టాక్ను పరిశీలించారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ.. అన్ని ఫర్టిలైజర్ దుకాణాల్లో రైతులకు కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. యూరియా 5052.52 మెట్రిక్ టన్నులు, డీఏపీ 1330.23, ఎంఓపీ 935.58, ఎస్ఎస్పీ 807.56, కాంప్లెక్స్ ఎరువులు 17734.92 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. రైతులకు ఎరువుల స్టాక్, ధరల వివరాలు తెలిసే విధంగా దుకాణాల్లో బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. అదే విధంగా కొనుగోలు చేసిన ఎరువులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డీఏఓ వెంట ఏఓ సీహెచ్ అనిత తదితరులు ఉన్నారు. -
కమనీయం.. రాములోరి కల్యాణం
ఎర్రవల్లి: శ్రీరాముడి జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో గురువారం సీతారాముల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు భువనచంద్ర, దత్తుస్వాముల ఆధ్వర్యంలో సీతారాముల ఉత్సవమూర్తులను ముస్తాబుచేసి.. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కల్యాణం జరిపించారు. రాములోరి కల్యాణాన్ని భక్తులు కనులారా తిలకించి తన్మయం చెందారు. అదే విధంగా అమావాస్య సందర్భంగా బీచుపల్లి అభయాంజనేయస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి అంజన్న దర్శనానికి క్యూ కట్టారు. ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రామన్గౌడ్, మేనేజర్ సురేందర్రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఎరువులు అందుబాటులో ఉంచాలి
మల్దకల్: ఎరువులు, విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచడంతో పాటు అధిక ధరలకు విక్రయించే ప్రైవేటు డీలర్లపై కఠన చర్యలు తప్పవని కలెక్టర్ బీఎం. సంతోష్ హెచ్చరించారు. బుధవారం మల్దకల్లోని సింగిల్విండో కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోదాంలో నిల్వ ఉన్న 35 బస్తాల యూరియాను పరిశీలించి ఎరువుల పంపిణీ ఎలా నిర్వహిస్తున్నారని సీఈఓ కిరణ్కుమార్రెడ్డిని ఆరా తీశారు. ప్రభుత్వ ధరకే ఎరువులు విక్రయించాలన్నారు. రైతులు సింగిల్విండో ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని వివిధ ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి ప్రతి కొనుగోలుకు రషీదులు ఇవ్వాలని, ఈ –పాస్ మెషిన్ ద్వారానే పంపిణీ చేయాలని, స్టాక్ వివరాలను ఎప్పటికప్పడు రికార్డులలో పొందుపరచాలన్నారు. అనుమతులు లేని ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పడు ఎరువులు దుకాణాలను తనిఖీలు చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాల సంఖ్య పెంచాలి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. మల్దకల్ పీహెచ్సీని తనిఖీ చేసి వైద్య సిబ్బంది హాజరు రిజిస్టార్ రికార్డులను పరిశీలించారు. గర్భిణులకు, బాలింతలకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని విధిగా తీసుకునేలా అవగాహన కల్పించాలని, ప్రజలకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో సింగిల్విండో అధ్యక్షుడు తిమ్మారెడ్డి, జిల్లా కో ఆపరేరిటివ్ అధికారి శ్రీనివాసులు, డీఎంహెచ్ఓ సిద్దప్ప, ఇన్చార్జి డీఏఓ సక్రియనాయక్, ఏడీఏ సంగీతలక్ష్మీ, తహసీల్దార్ ఝూన్సీరాణి, ఎంపీడీఓ సాయిప్రకాష్, ఎంపీఓ రాజ శేఖర్, డాక్టర్ స్వరూపరాణి పాల్గొన్నారు. అధిక ధరలకు విక్రయిస్తే ప్రైవేట్ డీలర్లపై చర్యలు స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు రికార్డుల్లో పొందుపర్చాలి కలెక్టర్ బీఎం సంతోష్ -
వైద్య సేవలు ప్రారంభం
● వంద పడకల ఆస్పత్రిలో కాంగ్రెస్ నాయకుల సంబరాలు బీజేపీ పోరాటంతోనే.. బీజేపీ పోరాట ఫలితంగానే అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆస్పత్రిలో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వంద పడకల ఆస్పత్రి కోసం గతంలో అనేక ఉద్యమాలు, అందోళనలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో గత నెల జూన్లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి అధికారులపై తీవ్ర ఒత్తిడికి తెచ్చినట్లు తెలిపారు. దీంతో అధికారులు వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారని వివరించారు. అలంపూర్: రెండేళ్ల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆస్పత్రిలో బుధవారం వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. ముందుగా ఓపీ సేవలను ప్రారంభించారు. ఈమేరకు ఆస్పత్రికి ఏడుగురు వైద్యులు, 12 మంది నర్సులు, వార్డు బాయ్స్, ఇతర సిబ్బందిని నియమించారు. వైద్య విధాన పరిషత్ ఉమ్మడి జిల్లా అధికారి రమేష్ చంద్ర ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలోని ఓపీ సేవలను ఆయన పరిశీలించారు. ఇదిలాఉండగా, గద్వాల ఆస్పత్రి నుంచి ఏడుగురు వైద్యులు వచ్చారని, ప్రస్తుతం ఓపీ సేవలు కొనసాగుతాయని సివిల్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్ తెలిపారు. గైనకాలజిస్టు, కంటి, చిన్న పిల్లల, జనరల్ వంటి సేవలు అందించేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించడానికి మరో రెండు మూడు నెలలు పట్టనుందని, పూర్తి స్థాయి వైద్యులు, నర్సులు, సిబ్బంది నియామకానికి ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందన్నారు. ఎమర్జన్సీ సేవలు సైతం త్వరలో అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యులు అమీర్, జెమ్స్, శ్యామ్, సిస్టర్స్, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు. ప్రజా పాలనలోనే అందుబాటులోకి వైద్య సేవలు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలోనే వంద పడకల ఆస్పత్రిలో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు, మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ దొడ్డెన్న, మండల అధ్యక్షుడు గోపాల్ అన్నారు. ఆస్పత్రిలో ఓపీ సేవలు ప్రారంభం కావడంతో సంబరాలు నిర్వహించారు. అనంతరం వైద్య పరీక్షలు చేయించుకొని, వైద్యులను, వైద్య సిబ్బందిని సత్కరించి మిఠాయిలను పంపిణీ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి ఆస్పత్రిని హడావుడిగా ప్రారంభించి తర్వాత వదిలేసిందన్నారు. వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఎంతో కృషి చేశారన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్, మాజీ జడ్పీటీసీ మద్దిలేటి, కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షుడు గోపాల్, జగన్మోహన్ నాయుడు, అడ్డాకుల రాము, భైరాపురం రమణ, నాయకులు నర్సన్ గౌడు, నగేష్, శంకర్, శ్రీకాంత్, కృష్ణ, మక్బుల్, మోక్తార్ బాష తదితరులు ఉన్నారు. -
స్వర్ణ మల్లికను ఆదర్శంగా తీసుకోవాలి
గద్వాల క్రైం: గట్టుకి చెందిన సంఘం స్వర్ణ మల్లికను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా జడ్జి ప్రేమలత అన్నారు. బుధవారం జిల్లా బార్ అసోషియేషన్ సమావేశంలో ఇటీవల జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై న మల్లికను బార్ అసోషియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు.కార్యక్రమానికి జిల్లా జడ్జి హాజరై మాట్లాడారు. తండ్రి గట్టు సురేష్ గద్వాల కోర్టులోనే సీనియర్ న్యాయవాదిగా ఉండడం ఎంతో అభినందనీయమన్నారు. జిల్లా చరిత్రలో మహిళ న్యాయమూర్తిగా ఎంపిక కావడం మొదటిసారన్నారు. అక్షరాభ్యాసంలో వెనుకబడిన గట్టు మండలం నుంచి మల్లిక అత్యన్నత స్థానంలో ఉండడం బార్ అసోషియేషన్కు ఎంతో గర్వించదగ విషయమని, జిల్లాకు మంచి పేరు తీసుకురావల్సిందిగా ఆమెకు సూచించారు. న్యాయమూర్తిగా ఎంపికై న మల్లికను న్యాయమూర్తులు రవికుమార్, లక్ష్మీ, ఎన్విహెచ్ పూజిత, ఉదయ్నాయక్, బార్ అసోషియేషన్ సభ్యులు, సిబ్బంది శాలువ, పూలమాలతో ఘనంగా సంత్కరించారు. -
అప్పుడే.. లోకల్ ఫైట్!
స్థానిక ఎన్నికల వేళ వేడెక్కిన రాజకీయం ● ముఖ్య నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు ● షెడ్యూల్ విడుదలకు ముందుగానే చేరికలకు తెరలేపిన పార్టీలు ● గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పక్షాల కసరత్తు ● సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో ‘హస్తం’ ముందడుగు● ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా ‘కారు’ కార్యాచరణ ● పట్టు సాధించాలనే తపనతో ‘కమలం’ జడ్చర్లలో 100 పడకల ఆస్పత్రి వద్ద మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుటుంబసభ్యులు అక్రమంగా తీసుకున్న అసైన్డ్ ల్యాండ్ను ప్రభుత్వానికి అప్పగించాలి. సిగ్నల్గడ్డ రోడ్డు విస్తరణకు సంబంధించి పాత బస్టాండ్ వైపు నేరుగా వాహనాలు వెళ్లేందుకు మార్గం లేదు. డిజైన్ లోపంతో ఇబ్బందులు వస్తాయి. – జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి సొంత ఊరు రంగారెడ్డిగూడ దేవాలయం భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలి. సిగ్నల్గడ్డ రోడ్డు విస్తరణ పనుల డిజైన్లో ఎలాంటి లోపాలు లేవు. పోలేపల్లి సెజ్ నుంచి నా ఖాతాకు డబ్బులు వచ్చాయని ఆరోపణలను రుజువు చేయాలి. లేకపోతే క్షమాపణలు చెప్పాలి. – లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు.. ఆ తర్వాత మున్సిపల్, కార్పొరేషన్, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేలా ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఉమ్మడి పాలమూరులోని ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తగిన కసరత్తు ప్రారంభించాయి. గెలుపే లక్ష్యంగా రూపొందించుకున్న ప్రణాళికకు అనుగుణంగా ఆయా పార్టీల ముఖ్యనేతలు పావులు కదుపుతున్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో అధికార పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో ప్రచారం ప్రారంభించగా.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలలను ఎండగట్టే కార్యాచరణతో ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ముందుకుసాగుతున్నారు. మరో రెండు రోజులు లేదంటే ఈ నెలాఖరులోపు ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందనే అంచనాతో పార్టీల్లో చేరికలు ఊపందుకోగా.. స్థానికంగా సందడి నెలకొంది. చేరికల పరంపర స్థానిక ఎన్నికల వేళ ఉమ్మడి పాలమూరులోని పలు నియోజకవర్గాల పరిధిలో వివిధ పార్టీల్లో చేరికలు ఊపందుకున్నాయి. ఇటీవల నాగర్కర్నూల్, గద్వాల, వనపర్తి జిల్లాల్లో కాంగ్రెస్ నుంచి పలువురు బీఆర్ఎస్లో చేరారు. ఈ నెల 18న బీఆర్ఎస్కు చెందిన జడ్చర్ల తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోనేటి పుష్పలత సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఇటీవల నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం నర్వ మండలానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీలో చేరారు. తాజాగా మహబూబ్నగర్ చెందిన రైతుబంధు జిల్లా సమితి మాజీ చైర్మన్ గోపాల్యాదవ్, మాజీ కౌన్సిలర్ పద్మజ బీఆర్ఎస్కు రా జీనామా చేశారు. వా రు కాంగ్రెస్లో చేరే అవ కాశం ఉన్నట్లు ప్రచా రం జరుగుతోంది. బీజేపీ సైతం.. స్థానిక ఎన్నికల్లో ఈ సారి పట్టు సాధించాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతోంది. మహబూనగర్ ఎంపీ డీకే అరుణ పార్లమెంట్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో క్రమం తప్పకుండా పర్యటిస్తున్నారు. షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, మక్తల్, నారాయణపేట, దేవరకద్ర నియోజకవర్గ పరిధిలో పలు మండలాల్లో సమావేశాలు నిర్వహిస్తూ.. కేడర్లో జోష్ నింపుతున్నారు. ఇటు కాంగ్రెస్.. అటు బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మేరకు ఆయా నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ కేడర్లో జోష్ నింపుతున్నారు. ప్రధానంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ గెలుపు గుర్రాల వడబోత చేపట్టినట్లు తెలుస్తోంది. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మార్నింగ్వాక్ పేరిట వార్డుల్లో పర్యటిస్తుండగా.. ఆయన ముఖ్య అనుచరులు మండలాల వారీ సమావేశాలు నిర్వహిస్తూ కేడర్లో జోష్ నింపుతున్నారు. నాగర్కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నేతలు, ప్రధాన అనుచరులు మండలాలు, పట్టణాల వారీగా నిత్యం పర్యటిస్తూ.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు వివరిస్తూ.. ప్రజలకు తెలియజేసేలా ప్రచారం చేపట్టాలని శ్రేణులకు సూచిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు సైతం పోటాపోటీగా నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ.. ప్రచారం మొదలుపెట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజల్లోకి వెళ్లేలా గ్రామ, మండలస్థాయి కీలక నాయకులను సమాయత్తం చేస్తున్నారు. కాగా, జోగుళాంబ గద్వాల జిల్లాకు సంబంధించి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రధానంగా గద్వాల నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్లో అంతర్గత పోరు కొనసాగుతుండడంతో ఆయా పార్టీల శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. దేవరకద్ర, జడ్చర్లలో మాటల తూటాలు దేవరకద్ర నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఆ తర్వాత ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మధ్య విమర్శల పర్వం నామమాత్రంగా కొనసాగింది. నిన్న, మొన్నటి వరకు రాజకీయ వాతావరణం స్తబ్దుగా ఉండగా.. స్థానిక ఎన్నికలు వస్తాయనే క్రమంలో ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల తూటాలు మంటలు రేపాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో పాటు వ్యక్తిగత విమర్శలతో ప్రస్తు తం రాజకీయ సెగ రాజుకుంది. జడ్చర్ల నియోజకవర్గంలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మధ్య నిత్యం మాటల తూటాలు పేలుతుండగా.. రాజకీయం రసవత్తరంగా మారింది. -
మావాడే వదిలెయ్..!
మావాడే వదిలేయ్..! అద్దె బకాయి వసూళ్లలో మోకాలడ్డుతున్న నాయకులు దూకుడు పెంచిన అధికారులు గద్వాల మున్సిపాలిటీ పరిధిలో 236 దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా రూ.1.13 కోట్లు ఆదాయం అద్దె రూపంలో రావాల్సి ఉంది. అయితే కొంత మంది దుకాణాదారులు నెలలు, ఏళ్ల తరబడి అద్దెలు చెల్లించకుండా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. సుమారు రూ.3 కోట్ల వరకు అద్దె బకాయిలు ఉన్నాయి. దీనిపై ఈ నెల 19న ‘పేరుకుపోయిన బకాయిలు అనే శీర్షికతో ‘సాక్షిశ్రీలో కథనం ప్రచరితం అయింది. ఈ కథనానికి ఉన్నతాధికారులు స్పందించి బకాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా గత నాలుగు రోజుల నుంచి అద్దె బకాయిల లిస్టు చేత పట్టి వసూళ్లపై దూకుడు పెంచారు.. బకాయిలు చెల్లించని దుకాణాలకు తాళాలు వేశారు. దుకాణ అద్దె బకాయి చెల్లించే వరకు మున్సిపల్ సిబ్బంది కట్టు కదలడం లేదు. ఈ క్రమంలో దుకాణాదారులు మున్సిపల్ అధికారులు, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మాజీ కౌన్సిలర్లు, రాజకీయ నాయకుల అధికారులు, సిబ్బందిపై హెచ్చరికలు జారీ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఉన్నతాధికారులు రోజువారి లక్ష్యాలు నిర్దేశిస్తుండటం.. నాయకులు భయబ్రాంతులకు గురిచేస్తుండటంతో మున్సిపల్ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. గద్వాలటౌన్: కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం.. అన్న చందంగా తయారైంది మున్సిపల్ అధికారుల పరిస్థితి. పట్టణంలో మున్సిపల్ దుకాణాల అద్దె బకాయి వసూళ్లకు ఉన్నతాధికారులు లక్ష్యాలు విధించారు. రోజువారి వసూళ్లకు రాజకీయ నేతలు మోకాలడ్డుతున్నారు. ఎవరి దగ్గరకు వెళ్లినా మాజీ కౌన్సిలర్లు, లేదా పెద్ద రాజకీయ నాయకులతో సిఫార్సులు చేయిస్తున్నారు. లేదా చెల్లించమని బెదిరిస్తున్నారు. దీంతో దుకాణాల అద్దెలు వసూలు కాక ఉన్నతాధికారులకు సమాధానాలు చెప్పలేక నలిగిపోతున్నారు. ఇదీ జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రమైన మున్సిపాలిటీలో అధికారుల పరిస్థితి. ఇరువైపులా ఒత్తిళ్లు ఇలా పన్నుల వసూలు చేసే అధికారులకు, సిబ్బందికి మున్సిపల్ దుకాణదారులు అద్దె బకాయి చెల్లింపుల్లో మున్సిపాలిటీ అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. మరోవైపు రోజుకు ఎన్ని లక్షలు వసూలు చేశారని పుర ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. దుకాణాల అద్దె వసూళ్ల రూపంలో వచ్చే ఆదాయమే ప్రధానం. పట్టణంలో ఏ అభివృద్ధి పనులు చేయాలన్నా... పారిశుద్ధ్యం, తాగునీరు సరాఫరా వంటి సేవలు అందించాలన్నా పన్నులు, దుకాణాల అద్దె వసూళ్లు బాగుంటేనే సాధ్యమవుతుంది. కానీ భవన నిర్మాణదారులు ఆస్తిపన్ను ఎలాగోలా చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. కొందరు దుకాణదారులు మాత్రం అద్దె బకాయిలు చెల్లించడానికి ససేమిరా అంటున్నారు. చెల్లింపుల్లో రాజకీయ నాయకులు, మాజీ కౌన్సిలర్లతో సిఫార్సులు చేయిస్తున్నారు. దీంతో అద్దె బకాయి వసూళ్లకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. గద్వాలలో దాదాపు రూ.కోటికిపైగా పెండింగ్.. ‘సాక్షి’ కథనంతో దూకుడు పెంచిన అధికారులు -
జోగుళాంబ ఆలయంలో మాజీ ఎంపీ పూజలు
అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠమైన జోగుళాంబ ఆలయాలను మాజీ ఎంపీ బీ. వినోద్ కుమార్ సతీసమేతంగా మంగళవారం దర్శించుకున్నట్లు కార్యనిర్వహణ అధికారి పురేందర్ కుమార్ తెలిపారు. ముందుగా అర్చకులు మాజీ ఎంపీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వారికి తీర్చ ప్రసాదాలను అందజేశారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి అలంపూర్: ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని.. అందుకే వంద పడకల ఆస్పత్రిలో వైద్య సేవలు ప్రారంభిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. గత బీఆర్ఎస్ హయాంలో కేవలం ఓట్ల కోసమే ఆస్పత్రిని వాడుకున్నారని పేర్కొన్నారు. ఆస్పత్రిలో వైద్య సేవల ప్రారంభంతో నియోజకవర్గ ప్రజల ఇబ్బందులు తీరతాయని తెలిపారు. చైతన్య సారథి..‘దాశరథి’ గద్వాలటౌన్: దాశరథి కృష్ణమాచార్యులు ఉద్యమ కవి అని, ఆయన కవితలతో ప్రజలను చైతన్యం చేశారని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ షేక్ కళాందర్బాషా పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఎంఏఎల్డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దాశరథి జయంతిని ఘనంగా నిర్వహించారు. దాశరథి చిత్రపటానికి ప్రిన్సిపల్ షేక్ కళాందర్ బాషా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దాశరథి కవిగానే కాదు జాతీయ ఉద్యమంలో పాల్గొన గొప్ప విప్లవకారుడు అన్నారు. కలానికి పదునుపెట్టి దొరతనానికి వ్యతిరేకంగా పోరాడిన దైర్యశాలి అని కొనియాడారు. దాశరథి రచనలకు ప్రభావితం అయిన ప్రజలు నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడారని వివరించారు. చంద్రమోహన్, నాగభూషణం, రాధిక, శంకర్ పాల్గొన్నారు. ట్రాన్స్జెండర్లకు ఉచిత నైపుణ్య శిక్షణ గద్వాల: జిల్లాలోని నిరుద్యోగులైన ట్రాన్స్జెండర్లకు ప్రైవేటు సంస్థలలో ఉపాధి అవకాశాల కోసం వివిధ రంగాల్లో ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి సునంద ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు ఈనెల 23వ తేదీలోపు wdsc.telangana. gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ట్రాన్స్జెండర్ల కోసం గరిమా గే షెల్టర్ హోమ్ల స్థాపన కోసం నేషనల్స్మైల్ ప్రాజెక్టు కింద దరఖాస్తు చేసకోవటానికి సీబీవో లేదా ఎన్జీవో సంస్థల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు https.grants-msje.gov.in వెబ్సైట్లో ఆగస్టు 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అందుకు సంబంధించిన ధ్రువపత్రాలను కలెక్టరేట్లోని రూమ్–జి33లో సమర్పించాలని, వివరాలకు 040–24559050 నంబర్ను సంప్రదించాలని తెలిపారు. దరఖాస్తు గడువు పొడిగింపు గద్వాల: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం దరఖాస్తు తేదీని ఆగస్టు 31వ తేదీవరకు పొడిగించినట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి నుషిత ప్రకటనలో తెలిపారు. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకంలో ఈ విద్యా సంవత్సరం నుంచి 210 సీట్ల నుంచి 500 సీట్ల వరకు పెంచినందున ఆసక్తి గల ఎస్సీ అభ్యర్థులు www.epass.cgg.gov.in వెబ్సైట్లో ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పాత కమిటీని పురుద్ధరించాలి అలంపూర్ రూరల్: మండలంలోని హరిహర ఎత్తిపోతల పథకం క్యాతూర్ –2 పాత బెనిఫిట్ కమిటీని పునరుద్ధరించాలని క్యాతూర్, భీమవరం రైతులు ఎస్ఈ రహీముద్దీన్, ఈఈ శ్రీనివాస్కు మంగళవారం వినతిపత్రాలు అందించారు. ఇదే విషయాన్ని కలెక్టర్కు కూడా విన్నవించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఎటువంటి రైతుల మద్దతు లేకుండా ఆగస్టు 2019లో తమకు తాము ఎన్నుకున్న రిజిస్టర్ లేని బెనిఫిషర్ కమిటీని పూర్తిగా రద్దు చేయాలన్నారు. ఆరేళ్ల నుంచి లిఫ్ట్ నిర్వహణ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివరించారు. రిజిష్టర్ ఆఫ్ సొసైటీ వద్ద రిజిష్టర్ పొందిన –786ఆఫ్ 2013 ఆయకట్టు దారుల సంఘాన్ని పునరుద్దించాలని కోరారు. -
పీయూలో ఏం జరుగుతోంది?
బదిలీల పరంపర.. ●నాన్ టీచింగ్ సిబ్బందిపై వేధింపుల పర్వం ● ఇటీవల పలువురిపై సస్పెన్షన్ వేటు ● చిన్నపాటి తప్పిదాలకే విచారణ కమిటీల ఏర్పాటు ● వేతనాలపై ప్రశ్నిస్తున్నందుకే ఇదంతా చేస్తున్నారని ఆరోపణలు ● టీచింగ్ సిబ్బందిలో సైతం అధికారుల తీరుపై తీవ్ర అసహనం సిబ్బంది తరఫున పోరాడతాం.. సిబ్బంది చిన్నచిన్న తప్పిదాలు చేస్తే వారిని విచారణ చేయాలి.. నోటీసులు ఇవ్వాలి.. కానీ, నేరుగా సస్పెండ్ చేయడం అనేది సిబ్బందిని వేధింపులకు గురిచేయడమే. బాధిత సిబ్బంది తరఫున మే ము పోరాటం చేస్తాం. అధికారులు అణచివేత ధోరణి అవలంబించడం సరైంది కాదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అధికారుల వ్యవహారశైలిని ఖండిస్తున్నాం. వేతనాలు పెంచకుండా సిబ్బందిని ఇబ్బందులకు గురిచేయవద్దు. – రాము, పీయూ ఎస్ఎఫ్ఐ నాయకులు అందరినీ సమానంగా చూస్తాం.. పీజీ కళాశాలలో సిబ్బంది నేరుగా సంతకం పెట్టి వెళ్లిపోతున్నట్లు తెలిసింది. అప్పటికే సంతకం పెట్టి బయటికి వెళ్తున్న ఓ సిబ్బందిని ఎక్కడికి వెళ్తున్నావని అడిగా.. సంతకం పెట్టి బయటికి పోతే ఎలా అని సస్పెండ్ చేశాం. సిబ్బంది పైనా మాకు కోపం లేదు. అందరినీ సమానంగా చూస్తాం. వేతనాల పెంపునకు కృషి చేస్తున్నాం. వేసవి సెలవుల్లో నాన్ టీచింగ్ సిబ్బందికి సెలవులు ఉండవు. గతంలో ఎలా ఇచ్చారో నాకు తెలియదు. – రమేష్బాబు, రిజిస్ట్రార్, పీయూ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఉన్నతస్థాయి అధికారులు కిందిస్థాయి సిబ్బందిపై వేధింపుల పర్వానికి తెరలేపారు. గత కొన్నిరోజుల వ్యవధిలోనే ముగ్గురు సిబ్బందిపై సస్పెషన్ వేటు వేసి తమలోని అక్కసును బయటపెట్టుకున్నారు. దీంతో పాటు నాన్టీచింగ్ సిబ్బంది చేసే చిన్నపాటి తప్పిదాలకే విచారణ కమిటీలు వేసి భయాందోళనకు గురిస్తున్నారు. వేసవిలో యూనివర్సిటీకి సెలవులు ప్రకటించిన అధికారులు.. నాన్టీచింగ్ సిబ్బందికి మాత్రం ఒక్క సెలవు ఇవ్వలేదు. సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లిన సిబ్బందిని కనీసం అధికారులు వారి చాంబర్లోకి కూడా రానివ్వలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కేవలం తమకు వేతనాలు పెంచమని కోరినందుకే అణచివేత ధోరణికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీయూలో తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న నాన్టీచింగ్ సిబ్బందిలో కిందిస్థాయి వారికి రూ.6 వేల నుంచి మధ్యస్థాయి వరకు రూ.15 వేల వరకు వేతనాలు ఇస్తున్నారు. ఏం మాట్లాడితే ఏం చేస్తారో.. మూడు రోజుల క్రితం విధుల్లో ఉన్న పీయూ పీజీ కళాశాల ఓ మహిళా నాన్టీచింగ్ సిబ్బంది తన కొడుకుకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆస్పత్రికి వెళ్తుండగా.. రిజిస్ట్రార్ అడ్డుకుని సదరు మహిళను సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు. రిజిస్ట్రార్ తీరుతో నాన్టీచింగ్ సిబ్బందిలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎలాంటి విచారణ, హెచ్చరిక, నోటీస్ లేకుండా సస్పెన్షన్ వేటు వేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. దీంతోపాటు గతంలో ఓ టీచింగ్, ఓ నాన్టీచింగ్ గొడవపడిన వ్యవహారంపై ముగ్గురు సభ్యులతో కమిటీ వేసిన అధికారులు నేరుగా నెల రోజుల పాటు సస్పెండ్ చేసినట్లు సమాచారం. మరో ఇద్దరు సిబ్బంది చిన్నచిన్న తప్పిదాలు చేశారన్న ఆరోపణలతో వారిపై ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీలు వేశారు. దీంతో ఏం మాట్లాడితే.. ఏం చేస్తారోనన్న భయాందోళన నాన్ టీచింగ్ సిబ్బందిలో నెలకొంది. నాన్టీచింగ్లో రెగ్యులర్ ప్రతిపాదిక పనిచేస్తున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్కు సైతం వేధింపులు తప్పలేదు. తమకు అనుకూలంగా వ్యవహరించడం లేదని అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఆయనను ఎలాంటి కారణం చెప్పకుండా నేరుగా ఎగ్జామినేషన్ విభాగానికి బదిలీ చేశారు. అంతేకాకుండా మరో నాన్టీచింగ్ సిబ్బందిని సరిగా విధులకు రావడం లేదన్న కారణంతో ఫార్మసీ కళాశాలకు బదిలీ చేసి.. అక్కడి నుంచి గద్వాల పీజీ కళాశాలకు బదిలీ చేసి అక్కడి వెళ్లాలని సూచించారు. చాలా రోజులుగా వైస్ చాన్స్లర్ను కలిసి సమస్యను చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే కనీసం చాంబర్లోకి సైతం రానివ్వలేదని తెలిసింది. అంతేకాకుండా మరో మహిళా సిబ్బందిని ఎలాంటి కారణం లేకుండా నేరుగా ఎగ్జామినేషన్ బ్రాంచ్కు బదిలీ చేశారు. గతంలో తప్పిదాలు చేసి బదిలీపై వెళ్లిన వారిని ప్రస్తుత అధికారులు పైరవీలు చేసి తిరిగి అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్కు రప్పించుకుంటున్నట్లు సమాచారం. మరో ఇద్దరిపై విచారణ కోసం కమిటీలు వేసి, వారి వివరణ సైతం తీసుకుంటున్నారు. ఇలాంటి ధోరణితో సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల అన్ని హాస్టళ్లకు కలిపి ఒక రెగ్యులర్ అధ్యాపకుడిని చీఫ్ వార్డెన్గా నియమించారు. ఇందులో రెండు బాలికల హాస్టళ్లు సైతం ఉన్నాయి. ఈ క్రమంలో బాలికల హాస్టల్కు గతంలో ఉన్న చీఫ్ వార్డెన్ (మహిళ)ను తప్పించి పురుష అధికారిని నియమించారు. బాలికల హాస్టల్లో సమస్యలు, ఇబ్బందులు వస్తే వారు ఆయనకు ఎలా చెప్పుకుంటారనే ప్రశ్న తలెత్తుతోంది. టీచింగ్ సిబ్బందిలోనూ అసంతృప్తి.. పీయూలో ప్రొఫెసర్ స్థాయి లెక్చరర్లు ఉన్నప్పటికీ రిజిస్ట్రార్ను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తీసుకోవడంపై రెగ్యులర్ టీచింగ్ సిబ్బంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాకుండా గతంలో అడ్మినిస్ట్రేషన్లో పనిచేసిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వకుండా వారిని దూరంగా పెట్టడం, సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
గద్వాల: శిక్షణా కాలంలో నేర్చుకున్న నైపుణ్యాలను విధుల నిర్వహణలో పకడ్బందీగా నిర్వర్తించి మంచి పేరు సంపాదించాలని అడిషనల్ కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణ పొందిన అభ్యర్థులకు నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. భూపరిపాలన వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందని, రెవెన్యూ, సర్వే విభాగాలు పరస్పరంగా అనుసంధానమై ఉన్నాయన్నాన్నారు. సర్వే విభాగం బలోపేతంతోనే రెవెన్యూ వ్యవస్థలో సమర్థవంతమైన సేవలందించగలమన్నారు. భూభారతి సాఫ్ట్వేర్ ద్వారా భూమికి సంబంధించిన సర్వేలు, మ్యాపింగ్, డాటా ప్రాసెసింగ్ వంటి సేవలను మరింత ఖచ్చితంగా వేగంగా ప్రజలకు చేరువగా అందించగలుతున్నామని చెప్పారు. జిల్లాలో లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణ పొందిన 151మంది అభ్యర్థులకు హాల్టికెట్లు మెయిల్ నుంచి డౌన్లోడ్ చేసి అందజేయాలని అధికారులను ఆదేశించారు. శిక్షణ పొందిన అభ్యర్థులకు తుదిరాత పరీక్షలు జూలై 27న నిర్వహించనున్నట్లు, జూలై 28–29తేదీన ల్యాబ్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయన్నారు. అంతకు ముందు సర్వే ఏడీ రాంచందర్ సాఫ్ట్వేర్పై అవగాహన కల్పించేందుకు అభ్యర్థులకు పీపీటీ విధానం ద్వారా వివరంగా వివరించారు. కార్యక్రమంలో మండలాలకు చెందిన సర్వేయర్లు, శిక్షణపొందుతున్న అభ్యర్థులు పాల్గొన్నారు. -
హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం
గద్వాల: డైట్ చార్జీలు పెంచిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని సచివాలయం నుంచి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, లక్ష్మణ్కుమార్, సీఎస్ రామకృష్ణారావు నిర్వహించిన వీడియోకా న్ఫరెన్స్లో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ హాస్టళ్ల నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. హాస్టల్ ప్రాంగణాల్లో పచ్చదనం, పరిశుభ్రత వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం నిబంధనల మేరకు అర్హులైన ప్రతిపేవాడికి ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేందుకు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. భూభారతిలో నమోదైన దరఖాస్తులను నిబంధనల మేరకు వెంటనే పరిష్కరించడం జరిగిందన్నారు. వనమహోత్సవం నిర్వహించి క్షేత్రస్థాయిలో విరివిరిగా మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, భూసేకరణ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
గద్వాల క్రైం: శాంతి భద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. అనుమానాస్పద కేసులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. సమస్యలపై వచ్చే బాధితులకు న్యాయం అందేలా చూడాలని, అనుమతి లేకుండా ఇసుక, మట్టి, రేషన్ బియ్యం, నిషేధిత మత్తు పదార్ధాలు, గంజాయిని కట్టడి చేయాలని ఆదేశించారు. ఈమేరకు సరిహద్దు ప్రాంతాల్లో పట్టిష్ట నిఘా ఉంచాలని, స్టేషన్ పరిధిలో సిబ్బంది ఎవరైన ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసిన అనర్హత వేటు తప్పదన్నారు. నమోదైన కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. అనంతరం ఆయా స్టేషన్లో నమోదైన కేసులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐ టాటాబాబు, శ్రీను, రవిబాబు, ఎస్ఐలు, కళ్యాణ్కుమార్, శ్రీకాంత్, వెంకటేష్, శ్రీనివాసులు, నాగశేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
ఆయిల్పాం సాగుతో నిరంతర ఆదాయం
ఎర్రవల్లి: ఆయిల్పాం సాగు ద్వారా రైతులకు నిరంతర ఆదాయం సమకూరుతుందని జిల్లా ఉద్యానశాఖ అధికారి అక్బర్ అన్నారు. మంగళవారం ఎర్రవల్లి మండల పరిదిలోని బీచుపల్లి ఆయిల్ ఫెడ్ నర్సరీలో ఉద్యానశాఖ, తెలంగాణ ఆయిల్ఫెడ్ సహకారంతో జిల్లా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోని వివిద క్షేత్ర స్థాయి అధికారులకు ఆయిల్పాం సాగుపై అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు 3500 ఎకరాల ఆయిల్పాం పంట సాగు లక్ష్యాన్ని కేటాయించడం జరిగిందన్నారు. జిల్లా ఉద్యానశాఖ, తెలంగాణ ఆయిల్ఫెడ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోని వివిధశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. ఆయిల్పాం పంట అనేది ఒకసారి వేసుకుంటే దాదాపు 30 సంవత్సరాల వరకు రైతులకు స్థిరమైన ఆదాయం వస్తుందన్నారు. చీడపీడల బెడద తక్కువగా ఉండి అకాల వర్షాలకు, వడగండ్లకు ఈ పంటకు ఎలాంటి నష్టం జరగకుండా సుస్థిర దిగుబడులకు అవకాశం ఉంటుందన్నారు. రైతుల నుంచి నేరుగా కంపెనీ కొనుగోలు చేస్తారని, నాణ్యమైన మొక్కలను ప్రభుత్వ పరంగా రైతులకు కేవలం రూ.20 లకే ఇస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100శాతం డ్రిప్ సదుపాయంతో సన్న, చిన్న కారు రైతులకు 90శాతం, పెద్దకారు రైతులకు 80శాతం సబ్సిడీపై అందజేయనున్నట్లు వివరించారు. అలాగే పంట నిర్వహణకు రూ.2100, అంతర పంటల సాగుకు రూ.2100.. ఇలా ఎకరానికి రూ. 4200 చొప్పున ఏటా రైతు ఖాతాలో జమ చేస్తామన్నారు. నాలుగేళ్లకుగాను రూ.16,800 రైతులు సబ్సిడీ ద్వారా పొందవచ్చునని, రైతులకు ఎలాంటి మార్కెటింగ్ ఇబ్బందులు కూడా లేకుండా ఉంటుందన్నారు. రైతులు ఈ ఆయిల్పాం సాగువైపు మొగ్గు చూపేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. శివనాగిరెడ్డి, రాజశేఖర్, ఎపీఓలు, ఈసీలు, టీఏలు, ఎఫ్ఏలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.