breaking news
Jogulamba District News
-
ఫీజు తగ్గించాలి..
గత ఐదేళ్ల నుంచి అయిజలో పశువుల సంత నిర్వహిస్తున్నారు. పశువులను కొనుగోలు చేసిన వారి నుంచి మార్కెట్ అధికారులు మొదట్లో ఫీజుగా గొర్రెలు, మేకలకు ఒక్కొక్క దానికి రూ.10, ఆవులు, గేదెలకు ఒక్కొక్క దానికి రూ.50 వసూలు చేశారు. కానీ, 2024 నుంచి నూటికి రూ.1 చొప్పున వసూలు చేస్తుండడంతో రైతులకు భారంగా మారింది. మార్కెట్ ఫీజును తగ్గిస్తే బాగుంటుంది. – తిక్కన్న, రైతు, తొత్తినోనిదొడ్డి వసతులు కల్పించాలి పశువుల సంతలో అధికారులు మౌలిక వసతులు కల్పించలేదు. కనీసం పశువులకు తాగునీరు, నీడ కూడా లేదు. వర్షం కురిస్తే చెట్ల కిందకు పరుగెత్తాల్సి వస్తుంది. క్రయవిక్రయాల ద్వారా వస్తున్న ఆదాయంను మౌలిక వసతులు కల్పించేందుకు వినియోగిస్తే అభివృద్ధి జరుగుతుంది. – లింగన్న, రైతు, అయిజ ● -
కార్మికుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు
అమరచింత: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, కర్షకుల హక్కులను కాలరాస్తున్నాయని సీపీఐ (ఎంఎల్)మాస్లైన్ పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి సీహెచ్ రాంచందర్ అన్నారు. అమరచింతలోని మార్క్స్ భవనంలో బుధవారం నిర్వహించిన మాస్లైన్ ఉమ్మడి జిల్లా శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. దేశంలో అనేక సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నా పాలకులు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. రైతుల పోరాటంతో నల్ల చట్టాల అమలుపై వెనక్కి తగ్గిన కేంద్రం.. మళ్లీ నల్ల చట్టాలను అమలు చేయాలని చూడటం సరికాదన్నారు. కార్మికులు జీతాల పెంపు కోసం, పనిగంటల కోసం పోరాటాలు చేస్తుంటే.. లేబర్ కోడ్స్ తీసుకొచ్చి పనిగంటలను పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలతో జంజీ ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాడేందుకు మాస్లైన్ కార్యకర్తలు, నాయకులు ముందుండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి హనుమంతు, వెంకటేశ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి
అలంపూర్ రూరల్: వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం దగ్గర బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, రైతు సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింహ మాట్లాడుతూ దేశంలో కేంద్ర ప్రభుత్వం వీబీజీ రాంజీ చట్టాన్ని అమలు చేస్తుందని దీనికి వ్యతిరేకంగా మూడు సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేయడం జరిగిందన్నారు. వీబీజీ రాంజీ చట్టం అమలుతో దేశంలో 30 కోట్ల మంది వ్యవసాయ కూలీలు ఉపాధి కోల్పోతారని, పని అడిగే హక్కును సైతం కోల్పోతారని, వ్యవసాయ కూలీలు మళ్లీ వలస పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం తర్వాత పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడంతో కార్మికుల ఉద్యోగ భద్రత, ట్రేడ్ యూనియన్ హక్కులు, పని పరిస్థితులు, సంక్షేమ ప్రయోజనాలు ఒక దెబ్బతో నిర్వీర్యం చేసేందుకే ఈ కోడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్, సంక్షేమ చర్యలను కూడా ప్రమాదంలోకి నెట్టి వేస్తుందని, విద్యుత్ ప్రైవేటీకరణ పేరుతో ప్రజలపై మరో కొత్త భారాన్ని మోపే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. బుధవారం నుంచి అమలవుతున్న వీబీజీ రాంజీ, విద్యుత్ రంగ విభజన, ప్రైవేటీకరణ చట్టాలను రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఏమెలమ్మ, వెంకటస్వామి, ఏలియా తదితరులు పాల్గొన్నారు. -
ఎగువన కొత్త పథకాలు..
తెలంగాణ వాటాలో 5 నుంచి 6 టీఎంసీలకు మించి ఏనాడూ వాడుకోలేదు. కర్ణాటకలో కేవలం దీని కింద 5,880 ఎకరాలు ఉన్నా.. అక్రమంగా నీటిని వాడుకుంటూ 15 వేల ఎకరాల దాకా సాగుచేస్తున్నారు. కాగా.. కర్ణాటకలో ఆర్డీఎస్పై అక్రమ కట్టడాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అనధికారికంగా జలవిద్యుత్ ప్రాజెక్ట్ నిర్మించారు. తాజాగా ఆర్టీఎస్ హెడ్వర్క్ వద్ద తాగునీటి అవసరాల కోసమని 100 మీటర్ల దూరంలో ఎగువన 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా కురిడి ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నారు. దీంతో నడిగడ్డ రైతుల్లో ఆందోళన నెలకొంది. -
అభివృద్ధికి అందలం
అయిజ: జిల్లాలోని అయిజ మార్కెట్ సబ్ యార్డు అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 2018 నుంచి కొనసాగుతున్న అయిజ మార్కెట్ సబ్ యార్డులో పశువుల సంత ఉమ్మడి జిల్లాలోనే పేరుగాంచింది. పశువులు, గొర్రెలు విక్రయించడం ద్వారా గత కొన్నేళ్లుగా ఏటా సుమారు రూ.లక్షల్లో ఆదాయం ఆర్జిస్తోంది. ఇంతటి ప్రాధాన్యత గల యార్డులో ఎక్కడా సరైన వసతులు కనిపించవు. దీనికితోడు సంత నిర్వహించే మైదానంలో మోకాళ్ల లోతు గుంతలు పడ్డాయి. వర్షాకాలంలో మురుగు చేరి దుర్వాసన వెదజల్లుతుంది. పశువుల క్రయవిక్రయాలు మైదానంలో జరిగినా.. గొర్రెల విక్రయాలు మాత్రం మార్కెట్ సబ్ యార్డు పక్కనున్న అయిజ– ఎక్లాస్పురం రోడ్డుపై నిర్వహిస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం రూ.45 లక్షలు మంజూరు చేయడంతో త్వరలోనే టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నడిగడ్డ ప్రాంతంలో.. నడిగడ్డలో వ్యవసాయ ఆధారంగా జీవించేవారు ఎక్కువగా ఉండడం, రైతులు పంటలు పండించేందుకు సంప్రదాయపరంగా ఎద్దులను ఉపయోగించడం, వ్యవసాయ అనుబంధంగా పాడితోపాటు సేంద్రియ ఎరువుల కోసం పశువులను పెంచడంతో ఈ ప్రాంతంలో పశువుల సంఖ్య ఎక్కువగానే ఉంది. వాటి క్రయవిక్రయాలకు అయిజ మార్కెట్ సబ్ యార్డులో 2018 అక్టోబర్ 18న పశువుల సంత ఏర్పాటు చేశారు. సంతను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఐదేళ్లపాటు గొర్రెలు, మేకలు ఒక్కొక్క దానికి రూ.10, ఆవులు, గేదెలు, ఎద్దులకు రూ.50 చొప్పున విక్రయ రుసుం వసూలు చేశారు. ఆ తర్వాత 2023 సంవత్సరం నుంచి పశువులను విక్రయించిన ధరలో నూటికి రూ.1 చొప్పున కొనుగోలుదారుతో వసూలు చేస్తున్నారు. మార్కెట్ సబ్ యార్డుకు నిధులు మంజూరు వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం రూ.45 లక్షలు కేటాయింపు త్వరలోనే టెండర్ల ప్రక్రియకు చర్యలు సబ్ యార్డు ఆవరణలోనే పశువుల సంత నిర్వహణ ఆధునిక వసతులు కల్పించాలంటున్న రైతులు -
జోగుళాంబ సన్నిధిలో శృంగేరి పీఠాధిపతి పూజలు
అలంపూర్ రూరల్: అష్టాదశ శక్తిపీఠాలలో ఐదో శక్తిపీఠమైన జోగుళాంబదేవి ఆలయాన్ని బుధవారం శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీవిధుశేఖర భారతిస్వామి సందర్శించారు. ముందుగా జగద్గురు శ్రీ విధుశేఖర భారతిస్వామి వారికి ఆలయ సంప్రదాయ ప్రకారం పూర్ణకుంభంతో ఆలయ ఈఓ దీప్తిరెడ్డి, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన జోగుళాంబ సన్నిధిలో శ్రీ చక్రయంత్ర ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా అమ్మవారి అలయంలో పూజలు నిర్వహించి మంగళహారతి సమర్పించారు. అలాగే యాగశాల ప్రవేశం చేసి పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా.. శ్రీ చక్రయంత్ర ప్రతిష్టాపన సందర్భంగా అమ్మవారి ఆలయంలో రెండోరోజు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించగా.. గురువారం మూడోరోజు శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ విధుశేఖర భారతి స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ చక్ర యంత్ర ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. పీఠాధిపతి రాక తెలిసిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పల్లీ క్వింటా రూ.7,342 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు బుధవారం 1,067 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటా గరిష్టంగా రూ.7,342, కనిష్టంగా రూ.3,129, సరాసరిగా రూ.5,899 ధరలు లభించాయి. -
ప్రతిసారి నిరాశే..
ఆర్డీఎస్ కెనాల్లో సాగునీటిపై ఆశలు పెట్టుకున్న ప్రతిసారి నిరాశే ఎదురవుతుంది. ఏ ఈడాది నీరు వస్తాయనుకునే సరికి ఏదో రకంగా నీటి విడుదలకు బ్రేక్ పడుతుంది. మేము ఉన్న సమయంలో ఆర్డీఎస్ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ముగ్గురు సీఎంలు కలిసి కూడా ఏదీ స్పష్టత రాలేదు. – నాగార్జున, రైతు, ఉండవెల్లి ప్రాజెక్టులను నిలిపేయాలి కర్ణాటకలో తుంగభద్ర నదిపై కడుతున్న అక్రమ ప్రాజెక్టులను వెంటనే నిలిపేయాలి. ఆర్డీఎస్ రైతుల కోసం నిర్మించిన తుమ్మిళ్ల లిఫ్టు పూర్తి కాలేదు. అప్పుడే వారు నీటిని దిగువకు రానివ్వకుండా అక్రమ ప్రాజెక్టులు నిర్మించి పూర్తిచేసే స్థాయికి వచ్చినా మన ప్రభుత్వం ఏమి చేస్తున్నట్లు. వెంటనే మల్లమ్మకుంట నిర్మించడంతో పాటు, కర్ణాటకలోని కురిడిలో నిర్మిస్తున్న ప్రాజెక్టును నిలిపేయాలి. – మధుసూదన్గౌడ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు -
నిందితులకు శిక్ష పడాలి
గద్వాల క్రైం: జిల్లా ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్ చక్రవర్తిని బుధవారం ఎస్పీ శ్రీనివాసరావు మర్యాద పూర్వకంగా కలిసి పూలబొకే అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని నమోదైన పలు కేసులపై మాట్లాడారు. కేసుల నమోదుతోపాటు నిందితులకు శిక్ష పడేలా అ ధికారులు వీలైనంత త్వరగా కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసేలా చూడాలని న్యాయమూర్తి ఎస్పీకి సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుశాఖ జాప్యం కనబర్చకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. మత్తు పదార్థాల రహిత సమాజ స్థాపనకు కృషి ధరూరు: మత్తు పదార్థాల రహిత సమాజ స్థాపనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి సునంద అన్నారు. బుధవారం ధరూరులోని ప్రభుత్వ జూనియర్ కళా శాలలో ‘నిషా ముక్త్ భారత్ అభియాన్– వికసిత్ భారత్కి పెహచాన్’ వారోత్సవాల సందర్భంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్ర మ రవాణా నిరోధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం సమాజానికి ఒక పెద్ద శాపమని, ముఖ్యంగా పిల్లలు, యువత భవిష్యత్ను తీవ్రంగా దెబ్బ తీస్తుందన్నారు. మత్తు పదార్థాల వ్యసనం వల్ల కుటుంబాలు ఆర్థిక, సామాజిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని, సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం, ఐక రాజ్య సమితి మాదక ద్రవ్యాలు, నేరాల కార్యాలయం (యూఎన్ఓడీసీ) ప్రకటించిన బ్రేక్ ది సైకిల్– స్టాప్ ఆర్గనైజ్డ్ క్రైం అనే థీమ్తో దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. అనంతరం ప్రొజెక్టర్ ద్వారా వీడియోలు చూపించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే మాదకద్రవ్యాల రహిత సమాజ స్థాపనకు తమవంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ, అధ్యాపకులు పాల్గొన్నారు. సర్వీస్ పెన్షన్ సాధించడమే లక్ష్యం గద్వాల న్యూటౌన్: సర్వీస్ పెన్షన్ సాధించడమే తమ అంతిమ లక్ష్యంగా పోరాటం చేస్తామని టీఎస్ సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని టీఎన్జీఓ భవనంలో నిర్వహించిన యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల పెన్షన్ హక్కుల సాధన కోసం పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా సీపీఎస్ రద్దే ధ్యేయంగా వచ్చే నెలలో జిల్లావ్యాప్తంగా జనజాగరణ యాత్ర నిర్వహిస్తామని చెప్పారు. ఈ యాత్ర విజయవంతం చేసేందుకు ‘సామాజిక భద్రత– మన జన్మ హక్కు’ నినాదంతో ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో చైతన్యం తేవాలన్నారు. ప్రతి మండలంలో యూనియన్ సభ్యత్వ నమోదు పెంచాలన్నారు. సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు నిరంతర కార్యాచరణ రూపొందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షుడు బుచ్చన్న, రాష్ట్ర సహధ్యక్షుడు విష్ణు, ఉపాధ్యక్షులు ప్రతాప్రెడ్డి, ఎల్లస్వామి, లక్ష్మీనారాయణ, శ్రీనివాసులు, పరశురాముడు, పుట్ట నాగరాజు తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కొత్తకోట రూరల్: మోజర్ల ఉద్యాన కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి అండర్ గ్రా డ్యుయేట్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల అసోసియేట్ డీన్ వీణ జోషి ఒక ప్రకటనలో తెలిపారు. బైపీ సీ విద్యార్థుల కోసం నాలుగేళ్ల బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ డిగ్రీ ప్రోగ్రాంలో ప్రవేశా లు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైందని.. ఈ నెల 29లోగా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని.. దరఖాస్తుల సమర్పణకు 30 వరకు గడువు ఉందన్నారు. దరఖాస్తులోని వివరాల సవరణకు ఆగస్టు 1న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. అర్హత గల విద్యార్థులు విశ్వవిద్యాలయ వెబ్సైట్ skltghu.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని.. పూర్తి వివరాలకు 89771 29027, 76830 53157 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
పట్టించుకోవడం లేదు..
జూరాల ప్రధాన ఎడమకాల్వకు వారాబంధి విధానంలో ఆయకట్టుకు సాగునీటిని వదులుతున్న అధికారులు.. సమాంతర కాల్వలో ఏడాది పొడవునా నీరు వృథాగా పారుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టు ముందుభాగంలో ఉన్న అమరచింత, ఆత్మకూర్ మండలాల రైతులకు సైతం సాగునీరు అందడం లేదు. కేవలం వరదలు వచ్చినప్పుడే నీటిని తరలించేందుకు ఏర్పాటు చేసిన కాల్వ ద్వారా ఏడాది పొడవునా నీరు పారుతోంది. – భాస్కర్రెడ్డి, రైతు, నందిమళ్ల మరమ్మతులు పూర్తి చేస్తాం.. సమాంతర కాల్వ ప్రధాన షట్టర్ల మర్మతులకు రూ.60 లక్షలు మంజూరయ్యాయి. ఈ వేసవిలో మరమ్మతులు పూర్తి చేయడానికి నీటిని నిలిపేందుకు రింగ్బండ్ వేశాం. అది నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. త్వరగా మరమ్మతులు పూర్తిచేసి నీటివృథాకు అడ్డుకట్ట వేస్తాం. – కేశవరావు, ఈఈ, భీమా ఫేజ్–2 ● -
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చర్యలు
గద్వాల క్రైం: జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు పోలీసుశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పలు శా ఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం నుంచి జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ చేపట్టనున్నట్లు తెలిపారు. వ్యాపార సముదాయాలు, పంట పొలాలు, హోట ళ్లు, మెకానిక్ షాపులు తదితర వాటిలో పనిచేస్తున్న బాలలను గుర్తించి.. పాఠశాలల్లో చేర్పించాలన్నా రు. ఎవరైనా పిల్లలను పనిలో పెట్టుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఆపరేషన్ ముస్కాన్–14 ద్వారా బాలకార్మికులతో పాటు నిరాశ్రయులైన పిల్లలు, భిక్షాటనలో బంధిలైన వారిని రక్షించి.. పునరావాసం కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతామన్నారు. సమావేశంలో ఏఎస్పీ శంకర్, వివిధ శాఖల అధికారులు సహదేవుడు, నర్సింహానాయుడు, రాజు, శివలీల ఉన్నారు. -
ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం
● పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి కృషి ● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గద్వాలన్యూటౌన్: ఇందిరమ్మ రాజ్యమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి మొదటి ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజయుడు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు సేవకులుగా పనిచేస్తేనే ప్రజాపాలనకు సార్థకత ఉంటుందన్నారు. ముఖ్యంగా భూ భారతి దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా.. ఎప్పటికప్పుడు పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదలకు లబ్ధి చేకూరేలా చూడాలన్నారు. వానాకాలంలో ప్రభుత్వం సూచించిన వరి వంగడాలనే రైతులు సాగుచేసేలా ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. క్లస్టర్ల వారీగా ఏఈఓలు తమ పరిధిలోని రైతులకు వ్యవసాయశాఖ సమాచారాన్ని చేరవేసేందుకు రైతుల ఫోన్ నంబర్లతో వాట్సప్ గ్రూప్లను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తిచేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఆర్డీఎస్ పరిధిలోని మల్లమ్మకుంట రిజర్వాయర్ సామర్థ్యాన్ని 4 – 5 టీఎంసీలకు, గుడ్డెందొడ్డి రిజర్వాయర్ను 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అంతకుముందు 9 మంది దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలను మంత్రి పంపిణీ చేశారు. ● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించడమే కాకుండా, సిబ్బంది మెరుగైన పనితీరు కనబరిచేలా పర్యవేక్షిస్తున్నామన్నారు. పలు చోట్ల విత్తన మేళాలను నిర్వహించి.. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించామని తెలిపారు. ● ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో రూ.10కోట్ల అంచనాతో నిర్మిస్తున్న ఆడిటోరియానికి అదనపు నిధులు మంజూరు చేయించి, త్వరలోనే ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు. అమృత్ పథకంలో చేపట్టిన పనుల్లో మొదట పంప్హౌజ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర గొర్రెలు, మేకలు అభివృద్ధి సహకార సంస్థ చైర్పర్సన్ సరిత మాట్లాడుతూ.. మండలాల్లో జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ వసతిగృహాల్లో సీట్ల సంఖ్య పెంచాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, జిల్లా గ్రంథాయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు హనుమంతు, దొడ్డప్ప, అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగ్రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు ఉన్నారు. -
రిజిస్ట్రేషన్లు ఢమాల్!
మెట్టుగడ్డ: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్వర్ మొరాయింపుతో రిజిస్ట్రేషన్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోజుకు వందల సంఖ్యలో జరిగే దస్తావేజుల రిజిస్ట్రేషన్లు.. మంగళవారం కేవలం పదుల సంఖ్యలో మాత్రమే జరిగాయి. మక్తల్, అలంపూర్, ఆత్మకూర్, కొల్లాపూర్, అచ్చంపేట రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. ప్రభుత్వానికి రూ.లక్షల్లో ఆదాయం అందించే కార్యాలయాల్లో లావాదేవీలు జరగక వెలవెలబోయాయి. ఒక్కసారిగా అన్ని కార్యాలయాల్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో క్రయ, విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండు రోజులుగా ప్రధాన సర్వర్లు మొరాయిస్తుండటంతో ప్లాట్లు, ఇళ్లు, ఇతర స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. కొత్త స్లాట్ బుకింగ్లు, చలాన్ చెల్లింపులు, ఈ కేవైసీ వంటి కీలక ఆన్లైన్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రతిరోజూ 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 550 నుంచి 650 మధ్య రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా.. మంగళవారం 74 రిజిస్ట్రేషన్లు మాత్రమే అయ్యాయి. స్పష్టత కరువు.. ముందుగానే స్లాట్ బుక్ చేసుకుని సాక్షులతో కలిసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చేరుకున్న క్రయ, విక్రయదారులకు పనులు జరగకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో అధికారులకు స్పష్టమైన సమాచారం లేకపోవడంతో ప్రజలకు వారు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. సేవలు పూర్తిస్థాయిలో ఎప్పుడు పునరుద్ధరింపబడతాయనే అంశంపై ఇంకా అధికారులకు ఎలాంటి స్పష్టత లేకపోవడం గమనార్హం. జూన్ 26 నుంచి 28 వరకు సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసేందుకు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. కానీ సోమవారం సైతం కార్యాలయాల్లో తిరిగి మళ్లీ అదే సమస్యలు ఉత్పన్నం కావడంతో రిజిస్ట్రేషన్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తరచుగా ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నా పరిష్కారం చూపడంలో అధికారులు విఫలమవుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షల ఆదాయం అందించే కార్యాలయాల్లో ఇలాంటి సమస్యలు తలెత్తడంతో క్రయ, విక్రయదారులు విస్తుపోతున్నారు. గద్వాల 9 మహబూబ్నగర్ 8 జడ్చర్ల 8 వనపర్తి 3 కల్వకుర్తి 18 నారాయణపేట 11 నాగర్కర్నూల్ 17 మక్తల్, కొల్లాపూర్, అచ్చంపేట, అలంపూర్, ఆత్మకూర్ – 0 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్వర్ మొరాయింపు పదుల సంఖ్యల్లో మాత్రమే దస్తావేజులు క్రయ, విక్రయదారుల తీవ్ర ఇబ్బందులు సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నారు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవల్లో అంతరాయం ఏర్పడిన మాట వాస్తవమే. కానీ సర్వర్లలో నెలకొన్న సమస్యలను తొలగించేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు మరింత సులువుగా రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తుండటంతోనే కొంత అంతరాయం ఏర్పడింది. బుధవారం నుంచి పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి వస్తాయి. – డి.ఫణిందర్, ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మంగళవారం జరిగిన రిజిస్ట్రేషన్లు ఇలా.. -
ఆరోగ్య కార్యక్రమాల్లో నిర్లక్ష్యాన్ని సహించం
అయిజ: ప్రభుత్వం చేపట్టే ఆరోగ్య కేంద్రాలను క్షేత్రస్థాయిలో వందశాతం పూర్తిచేయడంలో వైద్యసిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించమని డీఎంహెచ్ఓ సంధ్యా కిరణ్మయి అన్నారు. మంగళవారం అయిజ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు రోగులతో మాట్లాడి వైద్యసేవలను తెలుసుకున్నారు. అనంతరం స్థానిక బుడుగజంగాల కాలనీలో పల్స్పోలియో నిర్వహణపై ఆరా తీశారు. పీహెచ్సీ సిబ్బంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన విధానాన్ని కాలనీవాసులతో తెలుసుకున్నారు. పోలియో చుక్కలు వేయించుకోకుండా ఎవరైనా మిగిలి ఉంటే, వారికి వెంటనే చుక్కల మందు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పీహెచ్సీ వైద్యులు, సిబ్బంది ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలని.. నిబంధనలు ఉల్లంఘిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ హెచ్చరించారు. వేరుశనగ @ రూ.7,400 గద్వాలవ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు మంగళవారం 507 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 7,400, కనిష్టంగా రూ. 4,256, సరాసరి రూ. 5,866 ధరలు లభించాయి. క్వింటా ఆముదాలు రాగా.. రూ. 1,819 ధర వచ్చింది. క్వింటా వరి (సోన) రాగా.. రూ. 2,356 ధర లభించింది. గ్రామస్థాయిలో పార్టీని పటిష్టం చేయాలి : సీపీఎం వనపర్తి రూరల్: గ్రామస్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పిలుపునిచ్చారు. పెబ్బేరులో నిర్వహిస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం మంగళవారం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను సందర్శించి సమస్యలు గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు, పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణమే స్పందించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్, డి.బాల్రెడ్డి, రాజు, జీఎస్ గోపి, జిల్లా కమిటీ సభ్యులు ఆర్ఎన్ రమేష్, మేకల ఆంజనేయులు, ఎస్.రాజు, మహబూబ్పాషా, గోపాల్దిన్నె, తెల్లరాళ్లపల్లి సర్పంచులు దొడ్ల కవిత, జంబులయ్య, అమరచింత మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యుడు అజయ్, సీపీఎం మండల నాయకులు పాల్గొన్నారు. -
‘నీరు’గారుతున్న లక్ష్యం
జూరాల సమాంతర కాల్వ షట్టర్లకు లీకేజీలు ● నిత్యం 150 క్యూసెక్కుల నీరు వృథా ● ఏడాది పొడవుగా పారుతున్న వైనం ● జలాశయంలో తగ్గుతున్న నీటిమట్టం ● నిధులున్నా.. మరమ్మతులు కరువు అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం సమాంతర కాల్వ ప్రధాన షట్టర్ల లీకేజీలతో సాగునీరు నిత్యం వృథాగా పారుతున్నా.. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఏడాది పొడవునా జలాశయం వెనుక జలాలు కాల్వ వెంట వృథాగా పారుతుండటంతో ఆయకట్టు రైతులు, ప్రాజెక్టుపై ఆధారపడిన గ్రామాల రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వానాకాలం వచ్చినా.. ఎగువన వర్షాలు కురవకపోవడంతో జలాశయంలో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఈసారి ఆయకట్టుకు సాగునీరు అందుతుందో లేదోన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఉన్న నీటినైనా సంరక్షించుకునే ప్రయత్నాలు అధికారులు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జూరాల ప్రధాన ఎడమ కాల్వ ద్వారా చుక్కనీరు కూడా ముందుకు పారకుండా అడ్డుకట్ట వేసిన ప్రాజెక్టు అధికారులు సమాంతర కాల్వ గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు. జలాశయానికి ఎగువ నుంచి వెయ్యి, 1,500 క్యూసెక్కుల వరద వస్తుండటంతో సమాంతర కాల్వ నుంచి భీమా ఫేజ్–2కు నీటిని తరలిస్తున్నా.. జూరాల ప్రాజెక్టు అధికారులు మాత్రం కుడి, ఎడమ కాల్వలకు నీటిని వదలలేని పరిస్థితులు నెలకొన్నాయి. మరమ్మతులు కరువు.. సమాంతర కాల్వ ప్రధాన షట్టర్ల లీకేజీ కారణంగా నిత్యం 150 క్యూసెక్కులకు పైగా నీరు వృథాగా పారుతున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. 5 ఏళ్లుగా ఇదేతంతు కొనసాగుతున్నా.. మరమ్మతులు చేపట్టి నియంత్రణకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ప్రతి వేసవిలో వరదలు లేకపోయినా షట్టర్ల లీకేజీతో పాటు అధికారుల అత్యుత్సాహం కారణంగా 15 రోజులకోసారి మూడురోజుల పాటు షట్టర్లు తెరిచి ఉన్న నీటిని తరలించుకుంటున్నారని.. జూరాల అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 17 కిలోమీటర్ల పొడవు.. జూరాల జలాశయం ఎడమ కాల్వకు సమీపంలో సమాంతర కాల్వ నిర్మించారు. ప్రాజెక్టు నుంచి రామన్పాడు రిజర్వాయర్ వరకు 17 కిలోమీటర్ల పొడవునా కాల్వ నిర్మించారు. అమరచింత, ఆత్మకూర్ మండలాల మీదుగా కాల్వ రామన్పాడు రిజర్వాయర్కు చేరుకుంటుంది. ఇక్కడి నుంచి భీమా ఫేజ్–2, కొల్లాపూర్ వరకు పారుతూ అక్కడక్కడ నిర్మించిన రిజర్వాయర్లు, చెరువులు, నీటికుంటలు నింపి మళ్లించుకుంటారు. -
మొదట నష్టపోయేది పాలమూరే
● మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు జడ్చర్ల: సాగునీరుకు సంబంధించి సీఎం రేవంత్రెడ్డి చర్యల వల్ల మొదటగా పాలమూరు జిల్లానే నష్టపోతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు పేర్కొన్నారు. ఒట్టుకు నిజంగా ప్రాణం ఉండి ఉంటే సీఎం రేవంత్ దేవుళ్ల మీద వేసిన ఒట్లకు.. ఒట్లే ఉరి వేసుకునే పరిస్థితి ఉండేదని విమర్శించారు. జడ్చర్లలో సర్, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఒట్ల మీద ఒట్లు వేసి మంచి పాల వంటి మనసు ఉన్న పాలమూరు ప్రజల గౌరవాన్ని సీఎం రేవంత్రెడ్డి దిగజారుస్తున్నారని మండిపడ్డారు. పెండింగ్ ప్రాజెక్ట్లను ఆన్గోయింగ్ ప్రాజెక్ట్లుగా మార్చి 10 లక్షల ఎకరాలకు సాగు నీరిచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు.కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 3.30 లక్షల ఎకరాలకు సాగు నీరిచ్చామని, నెట్టెంపాడుకు 1.60 లక్షల ఎకరాలకు, భీమా ప్రాజెక్ట్ ద్వారా 1.75 లక్షల ఎకరాలకు నీరు అందించామని, కోయిల్సాగర్ పూర్తి చేసి సాగు నీరు ఇచ్చామని గుర్తిచేశారు. రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరులో ఒక్క ఎకరానికై నా నీరిచ్చావా అని నిలదీశారు. ఇటీవల జిల్లాకు వచ్చి సీఎం మాట్లాడుతూ తమకు అర్థం కావడానికే రెండేళ్ల సమయం పట్టిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మరి ఆయా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఇంకెన్నాళ్లు పడుతుందని ప్రశ్నించారు. సమావేశంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గుడిసెలో నివాసముంటున్నాం..
నేను గుడిసెలో నివాసముంటున్నా. వానాకాలంలో వ ర్షానికి గుడిసె మొత్తం తడిసిపోతుంది. ఇదివరకే పెద్ద గాలివానాలకు రెండుసార్లు గుడిసె కప్పు కొట్టుకుపోయింది. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ రాలేదు. – బి.నర్సన్న, బస్వాపురం, ఉండవెల్లి మండలం లేని కారు ఉన్నట్టు చూపారు.. నాకు ఎలాంటి కారు కానీ నాలుగు చక్రాల వాహనం కాని లేదు. నేను ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా. అయితే నాకు కారు ఉందనే కారణం చూపెడుతూ నన్ను లిస్ట్–3లో అనర్హత జాబితాలో చేర్చారు. దీనిపై పలుమార్లు అధికారులను కలిసి విన్నవించా. కానీ సమస్య పరిష్కారం కాలేదు. లేని కారు ఉన్నట్టు చూపెట్టడంతో నాకు అన్యాయం జరిగింది. దీనిపై విచారణ జరిపి నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. – జకరయ్య, పైపాడు, వడ్డేపల్లి మున్సిపాలిటీ -
ఆర్థిక చేయూత.. అందని ద్రాక్షేనా?
● ఈఆర్ఎస్కు దివ్యాంగుల ఎదురుచూపులు ● అధికారుల చుట్టూ ప్రదక్షిణలు ● నెలలు గడిచినా ఫలితం శూన్యం ● ఉమ్మడి జిల్లాలో 120 మంది లబ్ధిదారులు వనపర్తి: దివ్యాంగుల ఆర్థిక బలోపేతానికిగాను ప్రభుత్వం అమలు చేస్తున్న ఈఆర్ఎస్ (ఎకనామిక్ రిహాబిలిటేషన్ స్కీం) ఏడాది కాలంగా డోలాయమానంలో పడినట్లయింది. క్షేత్రస్థాయిలో ప్రక్రియ షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతున్నా.. వందశాతం రాయితీతో వచ్చే ఆర్థిక చేయూతకు రాష్ట్ర ఖజానా గేట్లు మూసివేసింది. గతేడాది ఆగష్టులో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించి మండల, జిల్లాస్థాయి కమిటీలు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి 2026, ఫిబ్రవరిలో నిధుల మంజూరుకు ట్రెజరీకి టోకెన్లు పంపించారు. 2026 ఏడాదికిగాను దరఖాస్తు చేసుకునే సమయం వచ్చినా.. లబ్ధిదారుల చేతికి మాత్రం నేటికీ డబ్బులు అందలేదు. అసలు ఏమైంది.. లోపం ఎక్కడుందనే విషయం తెలియక అమాయకులైన దివ్యాంగులు ప్రతి సోమవారం ప్రజావాణికి, ఇతర రోజుల్లో డీడబ్ల్యూఓ కార్యాలయాలకు ప్రదక్షిణలు చేయడం తప్పా నెలలు గడుస్తున్నా చేకూరిన ప్రయోజనం శూన్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న మండలాలు, మున్సిపాలిటీల సంఖ్య ప్రకారం లబ్ధిదారుల సంఖ్య 120కి పైగానే ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. పథకం ముఖ్య ఉద్దేశం.. 40 శాతం కంటే ఎక్కువ వికలత్వం.. 21 ఏళ్ల నుంచి 55 మధ్య వయసు వారికి రాష్ట్ర ప్రభుత్వం ఈఆర్ఎస్ అమలు చేస్తోంది. మున్సిపాలిటీ, మండలానికి ఒకరు చొప్పున వారి కుటుంబ పరిస్థితుల ఆధారంగా మండల, జిల్లా కమిటీల నిర్ణయం మేరకు వందశాతం రాయితీపై గరిష్టంగా రూ.50వేల రుణం మంజూరు చేస్తారు. ఈ రుణంతో ఆ కుటుంబం టైలరింగ్, మొబైల్ రిపేరు, డెయిరీ, కంప్యూటర్ సెంటర్, ఇతర చిన్న తరహా వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవాలి. -
పోలీసు ప్రజావాణికి 15 ఫిర్యాదులు
గద్వాల క్రైం: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ గ్రామాలకు చెందిన 15మంది పలు సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకురాగా.. సానుకూలంగా స్పందించారు. ఫిర్యాదులపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. సివిల్ సమస్యలను కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. విద్యార్థుల సామర్థ్యాలు వెలికితీయాలి: డీఈఓ మానవపాడు: విద్యార్థుల సామర్థ్యాలను వెలికితీయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని డీఈఓ విజయలక్ష్మి అన్నారు. మండలంలోని బోరవెల్లి, పల్లెపాడు ప్రాథమికోన్నత పాఠశాలల్లో సోమవారం ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుశాతం పరిశీలించడంతో పాటు తరగతుల నిర్వహణను పరిశీలించారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో రాణించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పాఠశాలను రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఈఓ వెంట ఎంఈఓ శివప్రసాద్ ఉన్నారు. ఆర్థికాభివృద్ధి సాధించాలి అలంపూర్ రూరల్: మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని మున్సిపల్ కమిషనర్ రాజేశ్ అన్నారు. అలంపూర్లోని మెప్మా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన పట్టణ మహిళా సమాఖ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణాలతో చిన్నచిన్న వ్యాపారులను ప్రారంభించేలా మెప్మా సిబ్బంది ప్రోత్సహించాలని సూచించారు. వ్యక్తిగత వ్యాపారాలతో పాటు సంఘం సభ్యులంతా కలిసి పెద్ద వ్యాపారాలను ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు. మున్సిపాలిటీలోని స్వయం సహాయక మహిళా సంఘాలకు అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. సమావేశంలో టీఎంసీ శ్రీకర్ ఉన్నారు. కనులపండువగా ఆదిశిలావాసుడి కల్యాణం మల్దకల్: ఆదిశిలా క్షేత్రంలో సోమవారం పౌర్ణమిని పురస్కరించుకొని ఆదిశిలావాసుడి కల్యాణోత్సవం వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు మధుసూదనాచారి, రవిచారి, శశాంక స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి హోమాలు చేశారు. వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ చైర్మన్ ప్రహ్లదరావు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఈఓ సత్యచంద్రారెడ్డి, చంద్రశేఖర్రావు, రాముడు, సిబ్బంది రంగనాథ్, శ్రీను, ఉరుకుందు, చక్రి, కృష్ణ, శివమ్మ తదితరులు పాల్గొన్నారు. పీయూలో కొనసాగుతున్న పరీక్షలు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో బీపెడ్ మొదటి సెమిస్టర్, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ 8వ సెమిస్టర్, బీఫార్మసీ 6 సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈమేరకు పరీక్షలను కంట్రోలర్ ప్రవీణ, పీయూ ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి తనిఖీ చేశారు. కాపీయింగ్కు అవకాశం లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ఇన్విజిలేటర్లకు సూచించారు. -
మాతృదేవోభవ..
● గర్భిణుల నమోదు నుంచే వైద్యుల పర్యవేక్షణ ● అత్యవసర సమయాల్లో జిల్లా ఆస్పత్రికి రెఫర్ ● ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగుపడిన వైద్య సదుపాయాలు జిల్లాలో మాతాశిశు మరణాలు తగ్గుముఖం గద్వాల క్రైం: జిల్లాలో మాతాశిశు మరణాల నివారణే లక్ష్యంగా వైద్యారోగ్యశాఖ చర్యలు తీసుకుంటోంది. గర్భిణుల నమోదు నుంచి మొదలుకొని కాన్పు అయ్యే వరకు ప్రత్యేక దృష్టిసారిస్తోంది. అందులో భాగంగా గర్భిణులకు మెరుగైన వైద్యసదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. గతంలో ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తే సరైన మౌలిక వసతులు లేకపోవడంతో పాటు సకాలంలో వైద్యం అందకపోవడం.. వైద్యుల కొరత కారణంగా మాతాశిశు మరణాల రేటు అధికంగా ఉండేది. 2024లో 8మంది బాలింతలు, 89 శిశువుల మరణాలు చోటు చేసుకోగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 9మంది శిశువుల మరణాలు సంభవించాయి. జిల్లాలో మాతాశివు మరణాలను పూర్తిగా తగ్గించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పించి.. మెరుగైన వైద్యసేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫలితంగా క్రమేణా మాతాశిశు మరణాల రేటు తగ్గుతోంది. మరోవైపు జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా మెడికల్ కళాశాల ఏర్పాటుచేసి.. అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు, గైనకాలజిస్టులు, స్టాఫ్ నర్సులతో సేవలు అందిస్తున్నారు. అత్యవసర సమయాల్లో వైద్య పరీక్షల కోసం అత్యాధునిక పరికరాలను ప్రభుత్వం సమకూర్చింది. మాతాశిశు ఆరోగ్యకేంద్రంలో గర్భిణులు, నవజాత శిశువులకు అవసరమైన ఐసీయూ, కేఎంసీతో పాటు అన్ని విభాగాలను ఏర్పాటుచేసి, వైద్యసేవలను మెరుగుపర్చింది. గద్వాల, ధరూరు, గట్టు, అలంపూర్, అయిజ, మానవపాడు తదితర ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. వైద్యసేవల్లో జాప్యం లేకుండా.. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు ప్రసవాల కోసం వెళ్లిన వారికి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే, అత్యవసర చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. ఆ వెంటనే ఆస్పత్రి సూపరింటెండెంట్కు వాట్సప్ గ్రూప్లో గర్భిణుల వివరాలు, వారు పడుతున్న ఇబ్బందులు, అందించాల్సిన వైద్యం వివరాలను తెలియజేస్తున్నారు. తద్వారా గైనిక్ హెచ్ఓడీ, చిన్నపిల్లల విభాగం సిబ్బంది వెంటనే అప్రమత్తమవుతున్నారు. గర్భిణి రాగానే సకాలంలో వైద్యం అందిస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలో కూడా వైద్యం అందించలేని పరిస్థితి ఉంటే, మహబూబ్నగర్, హైదరాబాద్, కర్నూలు ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. వారి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి విపత్తు సమయంలో విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వీ పాటిల్ సూచించారు. –8లో uనమోదు నుంచే.. మహిళలు గర్భం దాల్చిన దగ్గర నుంచి ప్రసవం తర్వాత తల్లీబిడ్డను ఇంటికి చేర్చే వరకు జిల్లా వైద్యారోగ్యశాఖ నిత్యం పర్యవేక్షిస్తోంది. క్షేత్రస్థాయిలో ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు గర్భిణుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటున్నారు. వారిని ఆస్పత్రులకు ప్రతినెలా తీసుకొచ్చి టీకాలు, ఆరోగ్య పరీక్షలు చేయించి.. రక్తహీనత అధిగమించేందుకు అవసరమైన మందులను ఇప్పించడంతో పాటు పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. నెలలు నిండగానే ప్రభుత్వం ఏర్పాటుచేసిన 102 వాహనంలో సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకెళ్తున్నారు. కాన్పు జరిగిన అనంతరం తల్లీబిడ్డను ప్రభుత్వ వాహనంలోనే ఇంటికి చేరవేస్తున్నారు. నిత్య పర్యవేక్షణతో మాతాశిశు మరణాల సంఖ్య తగ్గుతుందని వైద్యారోగ్యశాఖ చెబుతోంది. -
పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలి
గద్వాలన్యూటౌన్: ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేయాలని ఉమ్మడి మహబూబ్నగర్ పెండింగ్ ప్రాజెక్ట్ల సాధన జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు పోరాడి సాధించుకున్న 72 జీఓ ప్రకారం జూరాల ఎగువ నుంచి పీఆర్ఎల్ఐకు లిఫ్ట్ పనులు చేపట్టాలన్నారు. డిండి లిఫ్ట్ పేరుతో చేస్తున్న అక్రమ పనులు నిలిపివేసి.. పీఆర్ఎల్ఐ నీటిని తరలించే విధానం ఆపాలన్నారు. నల్లగొండ జిల్లా భూములకు అవసరమైన నీటిని కృష్ణానది మీద అత్యంత పెద్దదైన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి గొట్టిముక్కల లిఫ్ట్ చేపట్టి తీసుకోవాలన్నారు. అదే విధంగా గోకారం, గొల్లపల్లి, చీర్కపల్లి రిజర్వాయర్ల నిర్మాణ ప్రతిపాదన ఆపాలన్నారు. వరద జలాల పేరుతో చేపట్టిన కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్ట్లను సత్వరం పూర్తి చేయడంతో పాటు వీటికి నికర జలాలు సాధించాలన్నారు. జస్టిస్ బచావత్, రాజారావు కమిటీలతో నికర జలాల కేటాయింపులున్న ఆర్డీఎస్, జురాల, భీమా–1, 2, కోయిల్సాగర్ పథకాలకు నీటిని పూర్తిస్థాయిలో ఉపయోగించే విధంగా పూర్తి చేయాలని కోరారు. చంద్రసాగర్–అమ్రాబాద్ ఎత్తిపోతల, వెల్టూరు, గొందిమల్ల బ్యారేజ్, జూరాల–గట్టు ఎత్తిపోతల పథకాలను సత్వరం పూర్తిచేయాలన్నారు. తుంగభద్ర ఎడమ కాల్వను తెలంగాణలోకి పొడగించి.. కృష్ణా–తుంగభద్ర నదుల నడుమ నడిగడ్డకు గ్రావిటీతో నీరివ్వాలన్నారు. కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి, ఆర్డీఎస్ ఆనకట్టను సుంకుసుల ప్రాజెక్ట్లా ఆధునికీకరించాలని అన్నారు. కార్యక్రమంలో యూఎంపీపీఎస్ జేఏసీ చైర్మన్ వీరభద్రప్ప, కన్వీనర్ ఆలూరు ప్రకాశ్గౌడ్, రామ్మోహన్, వినోద్కుమార్, విజయభాస్కర్రెడ్డి, సుభాన్, ప్రభాకర్, నాగన్న, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. -
కొడుకులు మోసం చేశారు..
నాకు బోయలగూడెం శివారులోని సర్వేనంబర్ 533/1లో 1.20 ఎకరాల భూమిని నా భర్త వీరేష్గౌడ్ రిజిస్ట్రేషన్ చేశారు. అయితే నాకు తెలియకుండా నా కొడుకులు అక్రమంగా వారి పేరిట భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మళ్లీ వారి బావమరదుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. దీనిపై అడిగితే నాపై దాడిచేశారు. దీనిపై విచారణ జరిపి నాకు న్యాయం చేయాలి. – వెంకటేశ్వర్మ, బోయలగూడెం, గట్టు మండలం ప్రభుత్వం ఆదుకోవాలి.. నాకు ఇద్దరు పిల్లలున్నారు. ఇటీవల అనారోగ్యంతో నా భర్త మరణించారు. దీంతో నా ఇద్దరు పిల్లల పోషణ భారంగా మారింది. నేను ఎంఏ, బీఈడీ చేశాను. ప్రభుత్వం స్పందించి ఆదుకుంటే కుటుంబాన్ని పోషించుకుంటాను. – సుజాత, గద్వాల -
బోరుబావుల కింద మాత్రమే..
బోరుబావులు తదితర నీటి వనరులు ఉన్నచోట మాత్రమే సాగు కొంత ప్రారంభమైంది. అయితే బోరుబావుల కింద సాగుచేసిన రైతులు సైతం కొంత ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం.. వర్షాలు లేకపోవడంతో పంటలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇక జిల్లాలో కురిసిన ఒకటి, రెండు మోస్తరు వర్షాలకు మెట్ట పొలాల్లో పంటలు వేసిన రైతులు మరింత ఆందోళనలో ఉన్నారు. వర్షాలు లేక కొన్నిచోట్ల విత్తనాలు భూమిలోనే ఎండిపోయాయి. మరికొన్ని చోట్ల విత్తనం నుంచి మొక్క ఆశించిన స్థాయిలో రాలేదు. ఇంకొన్ని చోట్ల మొక్క వచ్చినప్పటికీ వర్షాలు లేక, నీటిని అందివ్వలేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. మొత్తమ్మీద ఈ ఏడాది సాగుపై రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. గతంలో జూన్ చివరి వారం నాటికి వానాకాలం సాగు అంచనాలో కనీసం 40 నుంచి 50శాతం సాగయ్యేది. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. ఈ వానాకాలంలో 4,35,252 ఎకరాల్లో పంటసాగు అంచనా ఉండగా.. ఇప్పటి వరకు అన్నిరకాల పంటలు కలిపి 82,302 ఎకరాల్లో మాత్రమే సాగయ్యాయి. -
ప్రతి చిన్నారికీ చుక్కల మందు వేయించాలి
అలంపూర్ రూరల్: రెండు చుక్కల పోలియో మందు చిన్నారుల నిండు జీవితాన్ని నిలుపుతుందని.. ప్రతి చిన్నారికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే విజయుడు కోరారు. జాతీయ పల్స్పోలియో సందర్భంగా ఆదివారం అలంపూర్లో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ ప్రసూనరాణి, మండల వైద్యాధికారిణి రాధిక ఆధ్వర్యంలో చిన్నారులకు చుక్కల మందు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వైద్యసిబ్బంది గుర్తించిన ప్రతి చిన్నారికీ పోలియో చుక్కలు వేయాలని సూచించారు. కాగా, అలంపూర్ మున్సిపాలిటీ, మండలంలో 95శాతం చిన్నారులకు చుక్కల మందు వేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. -
జూలై 4న మిడ్జిల్కు సీఎం రేవంత్రెడ్డి
జడ్చర్ల/మిడ్జిల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తొలిసారి రాజకీయ ఆరంగేట్రం చేసి, జెడ్పీటీసీగా ఎన్నికై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన వచ్చేనెల 4వ తేదీన మిడ్జిల్లో పర్యటించనున్నారు. అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ స్థలంలో బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహంతో పాటు మాజీ డీసీసీబీ చైర్మన్ద్యాప గోపాల్రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. సీఎం సభ ఏర్పాట్లును, హెలిప్యాడ్ స్థలం, పార్కింగ్తో పాటు విగ్రహాల ఏర్పాటు స్థలాలను ఎస్పీజానకి ఆదివారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. బహిరంగసభ ఏర్పాట్లకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ కమలాకర్, ఎస్ఐ శ్రీనివాసులు ఉన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై దృష్టి సారించండి అయిజ: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రత్యేక దృష్టిసారించాలని డీసీసీ అధ్యక్షుడు రాజీవ్రెడ్డి సూచించారు. ఆదివారం అయిజలో పార్టీ నాయకులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, ఓటు హక్కు పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో పార్టీ బీఎల్ఏలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదే విధంగా 18ఏళ్లు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాలని తెలిపారు. సమావేశంలో నాగర్ర్నూల్ పార్లమెంట్ ఇన్చార్జి సిద్ధేశ్వర, అలంపూర్ ఇన్చార్జి శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. కోటిలింగేశ్వరస్వామికి లక్ష పుష్పార్చన కొత్తకోట రూరల్: మండలంలోని కానాయపల్లి స్టేజీ సమీపంలో ఉన్న కోటిలింగేశ్వర దత్తక్షేత్రం 19వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం లక్ష పుష్పార్చన, బిల్వార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రెండోరోజు జరిగిన పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ పుష్పాలు, బిల్వ దళాలు స్వామివారికి సమర్పించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపట్టారు. -
హిందూ సమాజం ఏకం కావాలి
గద్వాలన్యూటౌన్: హిందూ సమాజం ఏకమై సంప్రదాయాలు, ఆచారాలను పరిరక్షించాలని తెలంగాణ సాదు పరిషత్ అద్యక్షుడు శంకర్ స్వామీజీ సూచించారు. ఆదివారం స్థానిక జములమ్మ ఆలయ ప్రాంగణంలో తెలంగాణ సాదు పరిషత్ ఆధ్వర్యంలో మహాజన శక్తి కార్యక్రమం నిర్వహించగా.. పలువురు సాధువులు, హిందూ సామాజిక వర్గాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ధార్మిక విలువలు, సామాజిక ఐక్యత, సంప్రదాయాల పరిరక్షణ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛను కల్పించిందన్నారు. హిందూ దేవాలయాల్లో దర్శ నం చేసుకునే హక్కు భక్తులందరికీ ఉందన్నారు. ఇటీవల మల్దకల్ మండలం మద్దెలబండలో పోలీసులు త నను నిర్బంధించిన ఘటనపై అధికారులు చట్టబద్ధంగా విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలన్నారు. జముల మ్మ అమ్మవారిపై భక్తుల కు ఉన్న విశ్వాసాలను గౌరవించాలన్నారు. ఆలయ సంప్రదాయాలను, ఆచారాలను పరిరక్షించాలని సూచించారు. అంతకుమందు శంకర్ స్వామీజీ, ఇతర సాధువులు అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పురందర్ కుమార్, వేదయోగి మహారాజ్, ఆత్మ రామస్వామి, సీవీఆర్ ప్రసాద్, డా.పురుషోత్తం, కీర లింగేశ్వరస్వామి, ప్రియా చౌదరి, స్థానిక వీహెచ్పీ, బజరంగ్దళ్ నాయకులు పాల్గొన్నారు. -
పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
గద్వాల క్రైం: ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలి యో చుక్కలు వేయించి.. జోగుళాంబ గద్వా లను పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దుదామ ని ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అదనపు కలెక్టర్ నర్సింగ్రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్లో పల్స్పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి.. పిల్లలకు చుక్కల మందు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో ఐదేళ్లలోపు వయసు కలిగిన 69,383 మంది చిన్నారులను గుర్తించడం జరిగిందన్నారు. పల్స్పోలియోను విజయవంతంగా నిర్వహించేందుకు 1,884 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి చిన్నారులకు చుక్కల మందు వేస్తారని.. తల్లిదండ్రులు విధిగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఎంహెచ్ఓ సంధ్యా కిరణ్మయి, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
ప్రతిపాదనలు పంపాం..
ప్రభుత్వం జిల్లాలో ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపాలని సూచించిన ప్రకారం జిల్లాలో అనువైన స్థలాలు ఎంపిక చేశాం. జానంపేటలో పాత పీహెచ్సీ భవనం తొలగించి దాని స్థానంలో 30 పడకలతో ట్రామా కేర్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపించాం. బాలానగర్ వద్ద హైవేపై ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. ఉమ్మడి జిల్లాలో మొదటి రెండు ట్రామా కేర్ సెంటర్లు జిల్లాలో ఏర్పాటు కానున్నాయి. అలంపూర్ చౌరస్తా వరకు మరో నాలుగు ట్రామా కేర్ సెంటర్లు వచ్చే అవకాశం ఉంది. – డాక్టర్ శ్రీనివాసులు, డీఎంహెచ్ఓ -
ఏరు రాకపాయే!
ఏరువాక వచ్చే..గద్వాల వ్యవసాయం: ఏరు ముందా.. ఏరువాక ముందా.. అని ప్రతి ఏడాది నడిగడ్డ రైతులు ఎదు రుచూడటంతో పాటు ఒకరికొకరు మాట్లాడుకుంటారు. ఏరువాక పౌర్ణమి నాటికి వర్షాలు కురిసి.. ఇక్కడి కృష్ణానది జలకళ సంతరించుకునేది. వర్షాల కు చాలా చోట్ల విత్తనాలు వేసేవారు. అయితే ఈసా రి జూన్ ముగుస్తున్నా.. ఇంతవరకు ఆశించిన స్థాయి లో ఒక్క వాన రాలేదు. కృష్ణానది నీరు లేక వెలవెలబోతోంది. రైతులు దుక్కులు దున్ని వరుణదేవుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. ఏరువాక వ చ్చే.. ఏరు రాకపాయే అని ఆవేదన చెందుతున్నారు. గతేడాది నిరాశే.. గతేడాది వానాకాలం రైతులకు కన్నీరు తెప్పించింది. ప్రారంభంలో వర్షాలు కురవకపోగా.. ఆ తర్వాత జూలై, ఆగస్టు నెలల్లో కురిసిన అధిక వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లింది. పలుచోట్ల నీరు నిలిచి మొక్కల ఎదుగదలపై ప్రభావం పడింది. సెప్టెంబర్లోనూ కురిసిన వర్షాలతో పంటలు బాగా దెబ్బతిన్నాయి. దాదాపు అన్ని రకాల పంటలకు తెగుళ్లు, రకరకాల పురుగులు ఆశించాయి. ఎక్కువగా సాగుచేసిన పత్తిపంట దిగుబడులు సగానికి పడిపోయా యి. పత్తి, వరి, వేరుశనగ, కంది ఇలా వానాకాలంలో సాగుచేసిన అన్ని పంటల దిగుబడులు తగ్గి.. రైతులు ఆర్థికంగా నష్టాలపాలయ్యారు. కూరగాయ ల సాగుపై సైతం తీవ్ర ప్రభావం పడింది. ఆయా కూరగాయల తోటలకు కాయలు కాసే దశలో వర్షాలు రావడంతో మొక్కపైనే మురిగిపోయాయి. ఈసారి సాగని సాగు.. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ ముందే చెప్పింది. తద్వారా రుతుపవనాలు ఆలస్యం కావడంతో పాటు ఆశించిన స్థాయిలో వర్షాలు ఉండవని హెచ్చరించింది. దీంతో పాటు ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పింది. ఈ నేపథ్యంలో జిల్లాలో అక్కడక్కడ మాత్రమే ఒకటి, రెండు మోస్తరు వర్షాలు కురిశాయి. జూరాల ఎగువన భారీ వర్షాలు కురిస్తేనే నారాయణపూర్ డ్యాం నుంచి జూరాల జలాశయానికి వరద చేరుతుంది. ఆ తర్వాతే జూరాల ఆయకట్టుతో పాటు నెట్టెంపాడు ఎత్తిపోతల కింద సాగు ప్రారంభమవుతుంది. అయితే ఈఏడాది ఇప్పటివరకు ఎగువన వర్షాలు రాకపోవడంతో జూరాలకు వరద రాలేదు. ఓవైపు వర్షాలు లేపోవడం.. మరోవైపు జూరాలకు నీరు రాకపోవడంతో జిల్లాలో సాగు ముందుకు సాగడం లేదు. ఆందోళనలో నడిగడ్డ రైతులు ఈసారి ఒకటి, రెండు వర్షాలు మాత్రమే.. వరద రాక వెలవెలబోతున్న కృష్ణానది ముందుకుసాగని వానాకాలం సాగు విత్తనాలు వేసిన చోట తప్పని అగచాట్లు జూన్లో సాధారణ వర్షపాతం: 71.2 మి.మీ. నమోదైన వర్షపాతం: 50.9 మి.మీ. -
చే‘నేత’ ఎన్నిక
జూలై 10న నిర్వహణకు అధికారుల ఏర్పాట్లు అమరచింత చేనేత ఉత్పత్తిదారుల సంఘం అమరచింత: చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జూలై 10 నాటికి సంఘాల ఎన్నికలు పూర్తి చేయాలని ప్రకటన జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం వెలువడనుంది. ఈ నెల 12న 50 మంది సభ్యులున్న సంఘాలకు ఎన్నికలు పూర్తి చేసిన అధికారులు మిగిలిన సంఘాలకు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 4 నుంచి మే 15 వరకు ఓటరు జాబితాను చేనేత జౌళిశాఖ యుద్ధప్రాతిపదికన పూర్తి చేసింది. అయితే సంఘాల్లో ఎలాంటి అప్పులు లేని సభ్యులకు మాత్రమే పోటీ చేసే, ఓటు వేసే హక్కు ఉంటుందని ప్రకటించడంతో ఆశావహు లు సంఘాలు, బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను చెల్లించి ఓటు హక్కును కాపాడుకున్నారు. 50 మంది సభ్యులున్న చేనేత సంఘాల్లో 9 మంది డైరెక్టర్లను ఎన్నుకొని అందులో నుంచే అధ్యక్షు డు, ఉపాధ్యక్షుడిని ఎన్నుకోవడం పూర్తయింది. వందమంది కంటే అధికంగా సభ్యులున్న సంఘాలకు జూలై 10న ఓటింగ్ విధానంలో ఎన్నిక ఉంటుందని అధికారులు వెల్లడించారు. 2013లో చివరిసారి.. రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ఎన్నికలు 2013, ఫిబ్రవరిలో చివరిసారి జరిగాయి. 2018లోనే ఆయా సంఘాల కాల పరిమితి ముగియగా.. తిరిగి ఎన్నికలు జరగలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాటు 16 పర్యాయాలు పాత పాలకవర్గాల పదవీ కాలన్ని పొడిగిస్తూ వచ్చింది. చివరిసారి గతేడాది మార్చి 9 నుంచి మే నెల 10 వరకు పొడిగించారు. జిల్లాలోని పలు సొసైటీల్లో అక్రమాలు జరిగాయని నిర్ధారణ కావడంతో పీఏసీఎస్ చట్టం సెక్షన్ 51 కింద అధికారులను పర్సన్ ఇన్చార్జ్లుగా నియమించారు. రెండురకాల బ్యాలెట్ పత్రాలు.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 44 చేనేత సహకార సంఘాలు ఉండగా.. తుది జాబితా ప్రకారం 8,727 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహబూబ్నగర్ జిల్లాలోని వెంకటాయపల్లి, రాజాపూర్, పెద్ద ఆదిరాల, ఎదిర సంఘాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 40 సంఘాలకు ఎన్నికలు జరగనుండగా.. జూలై 2 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమై 10న ఎన్నికలు నిర్వహించి అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు. మూడురోజుల తర్వాత అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక జరుగుతుందని అధికారులు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా బ్యాలెట్ పత్రాలను రెండురంగుల్లో ముద్రించనున్నారు. మహిళా రిజర్వ్ స్థానాలకు లేత గులాబీ, ఓపెన్ కేటగిరీకి తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలను వినియోగించనున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. జిల్లా సంఘాలు ఓటర్లు జోగుళాబ గద్వాల 16 4,116 నారాయణపేట 12 739 వనపర్తి 8 2,014 నాగర్కర్నూల్ 3 96 మహబూబ్నగర్ 1 146 జూన్ 29న నోటిఫికేషన్ జారీ జూలై 2 నుంచి 4 వరకు నామినేషన్ల స్వీకరణ జూలై 5న పరిశీలన జూలై 6న ఉపసంహరణ అనంతరం తుది అభ్యర్థుల జాబితా, గుర్తుల కేటాయింపు జూలై 10న ఉదయం పోలింగ్.. మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన జిల్లాల వారీగా ఇలా నేడు వెలువడనున్న ప్రకటన పూర్తయిన ఓటరు జాబితా 50 మంది సభ్యులున్న సంఘాలకు ముగిసిన ఎన్నికలు ఉమ్మడి జిల్లాలో 44 చేనేత సహకార సంఘాలు చేనేత సహకార సంఘాల ఎన్నికల ప్రక్రియ సజావు గా సాగేలా ప్రణాళికతో ముందుకుసాగుతున్నాం. సోమవారం ఎన్నికల షె డ్యుల్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్ వరకు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నాం. రిటర్నింగ్ అధికారులను నియమించి నామినేషన్ల స్వీకరణ, పరిశీలన చేపడతాం. – ఇందిర, ఏడీ, చేనేత జౌళిశాఖ, జోగుళాంబ గద్వాల -
పోలియోను నిర్మూలిద్దాం
చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యానికి రెండు చుక్కలు ● నేటి నుంచి పల్స్పోలియో ● అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన వైద్యారోగ్యశాఖ ● జిల్లాలో 69,383 మంది చిన్నారులకు చుక్కల మందు వేయాలని లక్ష్యం గద్వాల క్రైం: జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించే పల్స్పోలియో కార్యక్రమానికి వైద్యారోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇప్పటికే వ్యాక్సినేటర్లకు శిక్షణ ఇవ్వడంతో పాటు పోలియో వ్యాక్సిన్ను పీహెచ్సీలు, ఉప కేంద్రాలకు చేరవేసింది. జిల్లాలో ఐదేళ్లలోపు వయసు కలిగిన 69,383 మంది చిన్నారులకు చుక్కల మందు వేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. మొదటి రోజు పల్స్పోలియో కేంద్రాల వద్ద చుక్కల మందు వేయనున్నారు. సోమ, మంగళవారాల్లో 1,38,219 గృహాలను సందర్శించి, మిగిలిపోయిన పిల్లలకు చుక్కల మందు వేసేలా ప్రణాళికలు రూపొందించారు. 471 కేంద్రాల ఏర్పాటు.. జిల్లాలోని 13 మండలాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు 91 సబ్ సెంటర్స్, ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఏరియా ఆస్పత్రి, 3 అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో మొత్తం 471 పోలియో బూత్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 4,085 వ్యాక్సిన్ వాయిల్స్ రాగా.. జిల్లాను 53 రూట్లుగా విభజించి, 45మంది పర్యవేక్షకులను నియమించారు. 15 మొబైల్ బృందాలు, 1,884 మంది వ్యాక్సినేటర్లు, 471 మంది ఏఎన్ఎంలు, 300 మంది ఆశలు, మరో 400 మంది వలంటీర్లు పోలియో చుక్కల మందు పంపిణీలో పాల్గొననున్నారు. ప్రతి సెంటర్లో ఉదయం 7గంటల నుంచి చుక్కల మందు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆశావర్కర్లే ఇంటికి వచ్చి చుక్కల మందు వేస్తారని చాలా మంది తల్లులు నిర్లక్ష్యంగా ఉంటారు. ఇలా ఉండటం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. ప్రతి చిన్నారిని పోలియో బూత్ వద్దకు తీసుకెళ్లి చుక్కల మందు వేయించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. చిన్నారులకు భవిష్యత్లో ఎలాంటి శారీరక వికలత్వం రాకుండా ఉండేందుకు పల్స్పోలియో వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నిర్లక్ష్యం వద్దు.. పోలియో రహిత జిల్లాగా.. జిల్లావ్యాప్తంగా పోలియో చుక్కల మందు పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. ప్రతి పట్టణ, గ్రామంలో ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కల మందు వేయించాలి. పోలియో రహిత జిల్లాగా మార్చడమే జిల్లా వైద్యారోగ్యశాఖ లక్ష్యం. – సంధ్యా కిరణ్మయి, ఇన్చార్జి డీఎంహెచ్ఓ -
పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న జిల్లా జడ్జి
అలంపూర్(అలంపూర్ రూరల్)/ఎర్రవల్లి: జిల్లాలోని అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి, బీచుపల్లి అభయాంజనేయస్వామి క్షేత్రాలను శనివారం జిల్లా జడ్జి కళ్యాణ్ చక్రవర్తి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి అర్చక స్వాములు పూర్ణకుంభంతో స్వాగతం పలికి.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి, వేద ఆశీర్వాదం పలికారు. జిల్లా జడ్జి వెంట జూనియర్ సివిల్జడ్జి వెంకటేశ్ ధ్రువ, అలంపూర్ కోర్టు జూనియర్ సివిల్జడ్జి మిథున్ తేజ, ఎస్ఐ రామకృష్ణ, జూనియర్ అసిస్టెంట్ చిన్నరాజు, అర్చకుడు అనిల్శర్మ ఉన్నారు. అందుబాటులో యూరియా అలంపూర్(అలంపూర్ రూరల్): జిల్లాలో రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచుతున్నట్లు డీఏఓ వీరప్ప అన్నారు. శనివారం అలంపూర్ పట్టణంతో పాటు భీమవరం, కోనేరు గ్రామాల్లోని ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎరువులు, విత్తనాల స్టాక్తో పాటు పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అలంపూర్ మండలంలో ప్రస్తుతం 1,350 బస్తాల యూరియా అందుబాటులో ఉందన్నారు. యాప్లో బుక్ చేసుకున్న రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఫర్టిలైజర్ డీలర్లు ప్రభుత్వ నిబంధనల మేరకు విత్తనాలు, ఎరువులు విక్రయించాలని సూచించారు. ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఏఓ వెంట ఇన్చార్జి ఏడీఏ సుబ్బారెడ్డి, ఏఓ నాగార్జున్రెడ్డి ఉన్నారు. వేరుశనగ క్వింటా రూ.6,841 గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు శనివారం 1,339 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 6,841, కనిష్టంగా రూ. 3,556, సరాసరి రూ. 5,600 ధరలు పలికాయి. అదే విధంగా 2 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. రూ. 4,811 ధర వచ్చింది. -
అజిత్రెడ్డికి మరో కీలక పదవి
కొల్లాపూర్: నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని ముత్తిరెడ్డిపల్లికి చెందిన ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్కు చెందిన బి.అజిత్రెడ్డికి మరో కీలకపదవి దక్కింది. గడిచిన రెండున్నర సంవత్సరాలుగా సీఎం రేవంత్రెడ్డి ఫేసీలో స్పెషల్ సెక్రటరీగా పనిచేసిన ఆయనకు తాజా బదిలీల్లో ఇన్వెస్ తెలంగాణ సీఈఓ బాధ్యతలు ఇవ్వగా, శనివారం ప్రభుత్వం మరో జీఓ 920ని విడుదల చేస్తూ.. కీలకమైన హైదరాబాద్ మెట్రోరైల్ అడిషనల్ మేనేజింగ్ డైరెక్టర్గా(ఎఫ్ఏసీ)గా నియమించింది. ఐఐటీ మద్రాస్ నుంచి డిగ్రీ పట్టా పొందిన అజిత్రెడ్డి 2012 సివిల్ సర్వీస్కు ఎంపికై రక్షణ శాఖలో డెహ్రాడూన్, చైన్నె, ఆగ్రా, సికింద్రాబాద్ కంటోన్మెంట్, బెంగళూరులలో పనిచేశారు. సీఎం రేవంత్రెడ్డికి అత్యంత నమ్ముకస్తుడిగా వ్యవహరిస్తున్న అజిత్రెడ్డికి కీలకమైన మెట్రో బాధ్యతలు అప్పగించటంపై ఉమ్మడి జిల్లాలో హర్షం వ్యక్తం అవుతోంది. -
పులుల ఖిల్లా.. నల్లమల
2,611.39 చ.కి.మీ. విస్తీర్ణంలో అభయారణ్యం.. నల్లమల అభయారణ్యం 2,611.39 చదరపు కి.మీ. విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో 2,166.37 చదరపు కి.మీ. అభయారణ్యం కాగా.. 445.02 చదరపు కి.మీ. బఫర్ జోన్గా ఉంది. దేశంలోనే రెండో అతిపెద్ద టైగర్ రిజర్వుగా ఏటీఆర్ నిలిచింది. ఈ అడవిలో జీవ వైవిధ్యానికి పెద్దపులులు, చిరుతలే కీలకం. పులుల రక్షణకు చేపట్టిన చర్యలతో అమ్రాబాద్ అభయారణ్యంలో ఏటేటా వాటి సంఖ్య పెరుగుతోంది. దాదాపు 200 పైగా పులులు స్వేచ్ఛగా సంచరించేందుకు సరిపడా అభయారణ్యం ఉంది. సాధారణంగా పులులు రెండున్నరేళ్ల తర్వాత సంతానోత్పత్తికి సిద్ధంగా ఉంటాయి. అయితే ఏటీఆర్లో సంతానోత్పత్తికి అనుకూలంగా ఉన్న ఆడపులుల సంఖ్య పెరిగిందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏటీఆర్లో పరహా, భౌరమ్మ, తారా, ఎఫ్–53, ఎం–19, ఎఫ్–6, ఎఫ్–7, ఎఫ్–26 పేర్లతో ఆడ పులులకు నామకరణం చేశారు. ఒక్కో ఆడపులి సంవత్సరంలో నాలుగు పిల్లలను కంటుంది. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు పులులు ఏకాంతాన్ని కోరుకుంటాయని.. ఇదే సమయంలో ప్రసవిస్తాయని.. మూడు నెలలపాటు పర్యాటకుల రాకపోకలను నిలిపివేస్తుంటారు. అచ్చంపేట: నల్లమలలో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అఖిలభారత పులుల అంచనా–2026 ప్రకారం అమ్రాబాద్ టైగర్ రిజర్వు (ఏటీఆర్)లో వాటి సంఖ్య 36 నుంచి 42కు చేరిందని అటవీశాఖ వార్షిక నివేదికలో పేర్కొంది. 2024–25లో ఇక్కడ 36 పులులు ఉండగా.. ఏడాది కాలంలో ఆరు పెరిగాయి. మొత్తం 18 ఆడ పులులు, 14 మగ, 2 ఉప–వయోజన, 8 పులి పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. తల్లి పులుల సంఖ్య గణనీయంగా పెరగడంతో పునరుత్పత్తి వ్యవస్థ మరింత బలోపేతం అవుతోంది. 2017లో జాతీయ పులుల గణాంక అథారిటీ అధికారుల లెక్కల ప్రకారం ఇక్కడ ఆరు పులులుండగా.. ప్రస్తుతం 42కు చేరడం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది అటవీ ప్రాంతంలో మనుషుల సంచారం, ప్రవేశం తగ్గుతుందనేందుకు సూచన అని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఇక్కడ పెరుగుతున్న పులుల సంతతిలో ఆడ పులుల సంతతి పెంచేందుకు అటవీశాఖ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తుండటంతో మరో నాలుగు, ఐదేళ్లలో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గణన ఇలా.. ఏటీఆర్ పరిధిలో గత నవంబర్ నుంచి జూన్ వరకు చేపట్టిన సర్వేకు 10 రేంజ్లను నాలుగు బ్లాక్లుగా విభజించారు. ప్రతి బ్లాక్లో 30 రోజుల పాటు కెమెరా ట్రాప్లను ఏర్పాటు చేశారు. మొత్తం 1,120 ప్రాంతాల్లో 2,240 కెమెరాల ట్రాప్తో 8 నెలల పాటు సర్వే నిర్వహించారు. ఇందుకోసం రిజర్వ్ను 2 చ.కి.మీ. గ్రిడ్లుగా విభజించారు. పులుల కాళ్ల ముద్రలు, మల విసర్జన, స్క్రాప్, రేక్ మార్కులు వంటి ప్రత్యక్ష ఆధారాలను నమోదు చేశారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ జీవశాస్త్ర నిపుణులు, హైటికోస్ సాంకేతిక, పరిశోధనా బృందం సహకారంతో ఈ కెమెరా ట్రాప్ సర్వే జాతీయ పులుల అంచనాలో కీలక భాగంగా నిలిచింది. పులుల సంఖ్య, వాటి వ్యాప్తి, ఆహార జంతువుల సమృద్ధి, నివాస ప్రాంతాల పరిస్థితులపై శాసీ్త్రయ సమాచారాన్ని సేకరించింది. కెమెరాలతో నిఘా.. నల్లమల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు కెమెరాలను అమర్చి నిఘా పెంచారు. ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేని చోట రేడియో ఫ్రీక్వెన్సీతో 360 డిగ్రీల పరిధిలో 24 గంటల పాటు సర్వే లెన్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. రేడియో ఫ్రీక్వేన్సీ నెట్వర్క్ నుంచి ఇంటర్నెట్కు దృశ్యాలను అందుబాటులోకి వచ్చే వెసులుబాటు ఉండటంతో పర్యవేక్షణ మరింత పెరిగింది. అదే విధంగా వాకీటాకీలు పనిచేసేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేశారు. 10 రేంజ్లు, 30 బేస్ క్యాంపుల పరిధిలో ఒక డ్రోన్, 350 కెమెరా ట్రాప్ లతో పులుల కదలి కలను పర్యవేక్షిస్తున్నారు. 300 ఎకరాల్లో గడ్డి క్షేత్రాలు.. ఏటీఆర్లో వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పులులకు ఆహారంగా శాకాహార జంతువుల సంఖ్యను పెంచేందుకు గాను అటవీ ప్రాంతంలో 300 ఎకరాల్లో గడ్డి క్షేత్రాలను పెంచుతున్నారు. వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు సోలార్ పంపుసెట్లతో నీటి కుంటలను ఏర్పాటు చేశారు. అక్రమ చొరబాట్లను నియంత్రించడం, వన్యప్రాణుల కదలికలపై పటిష్ట పర్యవేక్షణ చేపట్టారు. దీంతో చుక్కల దుప్పులు, సాంబర్, నీల్గాయి, జింకల సంఖ్య పెరిగింది. అడవిలో శాఖాహార జంతువులు పెరగడం.. పులులకు సరిపడా ఆహారం లభిస్తుండటంతో వాటి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం 180 చిరుతలు, 42 పెద్ద పులులు, 300 ఎలుగుబండ్లు, 12 వేలకు పైగా ఇతర వన్యప్రాణులు ఉన్నాయి. పులి పిల్లలు 8 మొత్తం మగ పులులు 14 ఉపయోజన పులులు : 2 అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో 42కు చేరిన పెద్ద పులులు 2024–25తో పోల్చితే ఆరు అధికం గణనీయంగా పెరిగిన ఆడ పులుల సంతతి సత్ఫలితాన్నిస్తున్న అటవీశాఖ చర్యలు గుర్తింపు ఇలా.. పెద్దపులులను ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫొటోగ్రాఫ్ల డేటాటేస్తో పాటు పులుల చారల ఆధారంగా మ్యాచ్ చేస్తారు. మగ, ఆడ పులులను వాటి శరీర భాగాలను బట్టి గుర్తిస్తారు. పులులను గుర్తించాక, వాటికి ప్రత్యేక ఐడీ కేటాయిస్తారు. ఏ రెండు పులుల చారలు ఒకే విధంగా ఉండవు. మనుషుల వేలిముద్రల మాదిరిగానే వాటి స్ట్రైప్ ప్యాటర్న్ ప్రతి పులికి ప్రత్యేకంగా ఉంటుంది. ఆడపులులు 18 సంతానోత్పత్తి పెరిగింది.. అఖిల భారత పులుల అంచనా–2026 విజయవంతంగా ముగిసింది. ఏటీఆర్లో మొత్తం 42 పులులు నమోదయ్యాయి. ఇక్కడ పులుల సంతానోత్పత్తి ఏటేటా పెరుగుతోంది. ఆరోగ్యకరమైన పులుల జనాభా ఉందని ఇది సూచిస్తోంది. అటవీ అధికారులు, ఫ్రంట్లైన్ సిబ్బంది, పరిశోధకులు, సంరక్షణ భాగస్వాముల సమష్టి కృషితోనే సాధ్యమైంది. ఏటీఆర్లో పులుల సంరక్షణ, శాసీ్త్రయ వన్యప్రాణి పర్యవేక్షణను మరింత బలోపేతం చేస్తోంది. – రేవంత్చంద్ర, జిల్లా అటవీశాఖ అధికారి -
పకడ్బందీగా ఎస్ఐఆర్ ప్రక్రియ
గద్వాల: ప్రతి ఇంటికీ ఎన్యూమరేషన్ పత్రాలు అందించి.. ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ అధికారులకు సూచించారు. శనివారం జిల్లాకేంద్రంలోని 22, 23 వార్డుల్లో బీఎల్ఓలు చేపట్టిన ఇంటింటి సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్యూమరేషన్ ఫారాలను ఎలా పూరించాలో ఓటర్లకు స్పష్టంగా వివరించాలని సూచించారు. అదే విధంగా ఫారాలు ఇచ్చేటప్పుడు ఓటర్ల అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. 2002 ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుని తప్పులు లేని సమగ్ర ఓటరు జాబితాను రూపొందించాలని ఆదేశించారు. అదే విధంగా 18ఏళ్లు నిండిన అర్హులైన వారిని ఫారం–6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేయించాలన్నారు. మరణించిన వారి పేర్లు, డబుల్ నమోదులు, ఇతర సవరణల కోసం ఫారం–7 వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఓటరు భాగస్వాములు కావాలని తెలిపారు. -
బతుకు.. భారం!
వనపర్తి: రాష్ట్రవ్యాప్తంగా టీసీసీఓ(టైపీస్ట్ కం కంప్యూటర్ ఆపరేటర్)ల తొలగింపుతో వందలాది కుటుంబాల్లో జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారింది. సుమారు 20 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారిని సైతం తొలగించడం గమనార్హం. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో విధులు నిర్వర్తించే సుమారు 73 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతూ.. ఇటీవల ఆయా జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. 2006 నుంచి తహసీల్దార్ కార్యాలయాల్లో టైపిస్ట్ కం కంప్యూటర్ ఆపరేటర్లుగా వీరు సేవలందిస్తుండేవారు. ధరణి ప్రవేశపెట్టి భూ రిజిస్టేషన్లను తహసీల్దార్ కార్యాలయాల్లో చేయడం ప్రారంభించాగా కొత్తగా రిజిస్ట్రేషన్ విభాగంలో పని చేసేందుకు కంప్యూటర్ ఆపరేటర్లను ఔట్ సోర్సింగ్ పద్ధతిన తీసుకున్నారు. ఇటీవల గ్రూప్– 3 ,4 ఉద్యోగుల భర్తీలో భాగంగా ప్రతి తహసీల్దార్ కార్యాలయానికి నలుగురుకంటే ఎక్కువ మంది టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్లు వచ్చారు. గత ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి వారిని వేర్వేరు శాఖలకు పంపించింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వారిని జీపీఓలుగా తిరిగి తహసీల్దార్ కార్యాలయాలకు పంపించింది. దీంతో తహసీల్దార్ కార్యాలయాల్లో కుల, ఆదాయ, స్థానిక, ఇతర ధ్రువపత్రాలు, రిపోర్టులు తయారు చేసేందుకు సరిపడా రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న వారి ఆవశ్యత అవసరం లేదని భావించిన ప్రభుత్వం వారిని మార్చి 31 తర్వాత పునరుద్ధరించవద్దని ఆదేశాలిచ్చింది. పాత తేదీల్లో ఉత్తర్వులు.. సీసీఎల్ఏ ఉత్తర్వుల మేరకు టైపిస్టు కం కంప్యూటర్ ఆపరేటర్లుగా పని చేస్తున్న 73 మంది టీసీసీఓలను మార్చి 31 తర్వాత రెన్యువర్ నిలిపివేస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు 2026, మార్చి 31న జారీ చేసినట్లు వెలువరించడం శోచనీయం. పెండింగ్లో ఏడు నెలల వేతనాలు.. ఉమ్మడి జిల్లాలో టీసీసీఓల విధుల పునరుద్ధరణను నిలిపివేసిన ప్రభుత్వం వారికి చెల్లించాల్సిన ఏడునెలల వేతనాల విషయంలో ఎందుకు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుందన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఎవరి కోసమో తమను బలి చేశారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నారాయణపేట 13 గద్వాల 11ఉమ్మడి జిల్లాలో 73 మంది టీసీసీఓలకు ఉద్వాసన తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో పనిచేసే వారిని తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు గ్రూప్–3, 4 ఉద్యోగుల చేరికలు, జీపీఓల నియామకంతోనే.. నడి వయస్సులో ఉద్యోగ వెతలు ప్రభుత్వ ఆదేశాల మేరకే.. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూశాఖలో పని చేస్తున్న టైపిస్టు కం కంప్యూటర్ ఆపరేటర్లు కొందరి వార్షిక రెన్యూవల్స్ను నిలిపివేశాం. ఇప్పటికే.. ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లో రెగ్యూలర్ టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్లను నియమించినందుకు వీరి అవసరం లేదని ప్రభుత్వం తొలగించినట్లుంది. – భానుప్రకాష్, ఏఓ, వనపర్తి కలెక్టరేట్ -
రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం
గద్వాల/గద్వాలవ్యవసాయం: రైతు సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తూ.. అనేక పథకాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల డివిజన్కు సంబంధించి యూరియా బుకింగ్ యాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాప్ ద్వారా రైతులు ఇంటి నుంచే యూరియాను బుక్ చేసుకోవచ్చన్నారు. ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద క్యూలైన్లో నిలబడాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రతి రైతు తమ మొబైల్లో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. యాప్ ద్వారా యూరియా, ఇతర ఎరువుల పంపిణీ పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. బ్లాక్ మార్కెట్ను నివారించవచ్చన్నారు. అదే విధంగా జిల్లా కేంద్రంలోని గంజిపేటలో కొలువుదీరిన పీర్లను ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో డీఏఓ వీరప్ప, ఏఓ ప్రతాప్, నాయకులు చంద్రశేఖర్, సత్యం, తుమ్మల నర్సింహులు, రాజేంద్ర, బంగి సుదర్శన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యారంగంపై ప్రభుత్వం చిన్నచూపు
అమరచింత: కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో కనీస సౌకర్యాలు కొరవడి విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆరోపించారు. శుక్రవారం మండలంలోని పాంరెడ్డిపల్లి శివారులో ఉన్న కస్తూర్బాగాంధీ పాఠశాల, కళాశాలను ఆయన సందర్శించి విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే వంటగదితో పాటు తరగతి గదులు, డైనింగ్ హాల్ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో ఆరోతరగతి నుంచి పదోతరగతి వరకు అదేవిధంగా జూనియర్ కళాశాలలో మొత్తం 400 మంది బాలికలు విద్య అభ్యసిస్తున్నట్లు ఆయన తెలిపారు. హిందీ ఉపాధ్యాయురాలు లేరని, తాగునీరు, స్నానాలకు నీటివసతి లేక విద్యార్థినులు ఇబ్బందులు పడటం బాధాకరమన్నారు. శుద్ధజల యంత్రం మరమ్మతుకు గురికావడంతో బోరునీటినే తాగుతున్నారని.. మంచాలు లేకపోవడంతో కిందనే పడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్లో కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని.. అప్పుడే విద్యారంగ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. బడులతో పాటు గురుకులాలు, సాంఘిక సంక్షేమ పాఠశాలలు, కస్తూర్బాల్లో మౌలిక వసతులు సైతం కల్పించలేని దీన స్థితిలో రాష్ట్ర సర్కార్ ఉండటం శోచనీయమన్నారు. సరిపడా తరగతి గదులతో పాటు ఉపాధ్యాయులను నియమించలేని దుస్థితి ఉందని తెలిపారు. సీఆర్టీలకు కనీస వేతనం నెలకు రూ.25 వేలు చెల్లించకపోవడం, విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా స్కావెంజర్లను నియమించకపోవడంతో బాలికలే తమ తరగతి గదులను శుభ్రం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు ల్యాబ్లను ఏర్పాటు చేయడం లేదని, క్రీడాసామగ్రి సమకూర్చి పీఈటీలను నియమించి విద్యతో పాటు క్రీడా నైపుణ్యాలు పెంపొందించాలని డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, కస్తూర్బా, గురుకులాలను సందర్శించే కార్యక్రమం చేపట్టామని.. సమస్యలు తెలుసుకొని త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి విన్నవిస్తామని చెప్పారు. ఆయా సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఆందోళనలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు ఎండీ జబ్బార్, మహిమూద్, జీఎస్ గోపి, అజయ్, వెంకటేష్, రాఘవేంద్ర, కౌన్సిలర్ డీసీ మాధవి, పాంరెడ్డిపల్లి ఉపసర్పంచ్ వెన్నెల, చంటి, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
పల్స్పోలియోను విజయవంతం చేయాలి
గద్వాల క్రైం: జిల్లాలో ఈ నెల 28 నుంచి పల్స్పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్చార్జి వైద్యాధికారి సంధ్యా కిరణ్మయి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో మొత్తం 69,383 మంది చిన్నారులను గుర్తించామని.. వారికి చుక్కల మందు వేసేందుకు 471 పోలియో బూత్లను ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వర కు సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా చుక్కల మందు వేయించి, పల్స్పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. గచ్చిబౌలికి బస్సు సర్వీసు గద్వాల క్రైం: జిల్లాకేంద్రం నుంచి గచ్చిబౌలికి ప్రత్యేకంగా బస్సు సర్వీసు నడిపిస్తున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీధర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రోజు ఉదయం 4గంటలకు బస్సు ప్రారంభమై కర్నూలుకు చేరుకుంటుందన్నారు. అక్కడి నుంచి 5:30 గంటలకు బయలుదేరి.. అలంపూర్ క్రాస్రోడ్డు, ఎర్రవల్లి, పెబ్బేరు, వనపర్తి మీదుగా గచ్చిబౌలికి చేరుకుంటుందని తెలిపారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పీసీసీ పార్లమెంట్ కో–ఆర్డినేటర్ల నియామకం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పార్టీపరంగా పర్యవేక్షించేందుకు గాను పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా కంట్రోల్ రూం కో–ఆర్డినేటర్లను నియమిస్తూ తాజాగా పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒబేదుల్లా కొత్వాల్, మహబూబ్నగర్కు టి.రేవతిగౌడ్ నియమితులయ్యారు. ఓబీసీ, ఎస్పీ మోర్చా అధ్యక్షుల నియామకం పాలమూరు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఓబీసీ మోర్చా, ఎస్సీ మోర్చా అధ్యక్షులను నియమి స్తూ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు ఉత్తర్వు లు జారీ చేశారు. మహబూబ్నగర్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా పి.యాదయ్య, వనపర్తి కొమ్ము శ్రీను, నాగర్కర్నూల్ జెట్టి వెంకటేష్ను నియమించారు. అలాగే మహబూబ్నగర్ బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడిగా మిట్టమీది నాగరాజు, వనపర్తి జిల్లాకు ప్రవీణ్, నాగర్కర్నూల్ జిల్లాకు భూషయ్య, గద్వాల జిల్లా ఆంజనేయులును నియమించారు. దీర్ఘకాలిక ఉద్యాన సాగుపై పరిశోధనలు చేయాలి కొత్తకోట రూరల్: ఉద్యాన కళాశాల విద్యా ర్థులు ఉసిరి, చింత, నేరేడు వంటి దీర్ఘకాలిక ఉద్యాన పంటలపై మరిన్ని పరిశోధనలు చేపట్టాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి కోరారు. వనపర్తి జిల్లాలోని మోజర్లలో ఉన్న ఉద్యాన కళాశాల 19వ వార్షికోత్సవాన్ని గురువారం రాత్రి నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన సాగు కు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు పంటల మార్పిడీ విధానాన్ని అనుసరిస్తూ ఉద్యాన పంటలపై దృష్టి సారించాలని సూచించారు. ఉద్యాన విభాగం డీన్ డా. జె.చీనానాయక్ మాట్లాడుతూ.. కళాశాల విద్యార్థులు విద్యారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తున్నారన్నారు. ఉన్నత ర్యాంకులు సాధించి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఎంఎస్సీ చదివే లక్ష్యంతో విశ్వవిద్యాలయ పరిధిలో జేఆర్ఎఫ్ కోచింగ్ సెంటర్ను ప్రారంభించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ వీణాజ్యోషి పాల్గొన్నారు. రెండ్రోజులకే నిలిచిన నీటి పంపింగ్ మరికల్: జూరాల నుంచి కోయిల్సాగర్కు నీటి పంపింగ్ రెండురోజులకే నిలిచిపోయింది. గత వారం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి చిన్నచింతకుంట మండలం ఉంద్యాల స్టేజీ–1 దగ్గర జూరాల నీటి పంపింగ్ను ప్రారంభించి రెండురోజుల పాటు పర్ధీపూర్ చెరువుకు చేపట్టారు. పర్ధీపూర్ చెరువు నిండి కోయిల్సాగర్కు నీళ్లు రావాలి. ఆ చెరువు నిండటానికి నాలుగు రోజుల సమయం పడుతుంది. కొన్ని రోజులుగా వర్షాలు కురువకపోవడంతో జూరాలకు వరద రావడం లేదు. దీంతో జూరాలలో నీరు అందకపోవడంతో రెండురోజులు మాత్రమే నీటిపంపింగ్ చేసి నిలిపివేశారు. ప్రస్తుతం కోయిల్సాగర్లో పది అడుగుల నీటిమట్టం మాత్రమే ఉంది. గతేడాది ఇదివరకే నీటిపంపింగ్ ప్రారంభించారు. -
గిరిజనులకు అండగా కాంగ్రెస్
● 50 ఏళ్ల క్రితమే రిజర్వేషన్ ఫలాలు ● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్: మొదటి నుంచి ఆదివాసీ గిరిజనులకు అండగా ఉన్నది కాంగ్రెస్ పార్టీయేనని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఇందిరమ్మ ఆశీర్వాద బస్సుయాత్ర శుక్రవారం కొల్లాపూర్లోని ఎన్టీఆర్ చౌరస్తాకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యేలు రాంచందర్నాయక్, బాలునాయక్, ఎమ్మెల్సీ శంకర్నాయక్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్, మాజీ ఎంపీ రవీందర్నాయక్లతో కలిసి మంత్రి మాట్లాడారు. 50 ఏళ్ల క్రితమే ఆదివాసీ, గిరిజనులందరికీ రిజర్వేషన్ ఫలాలు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. రిజర్వేషన్ల ఫలితంగా సమాజంలో ఆదివాసీ గిరిజనులు అసమానతలకు లోనుకాకుండా ఉన్నారని వివరించారు. కేంద్రంలోని బీజేపీతో పాటు రాష్ట్రంలోని బీఆర్ఎస్ గిరిజనుల సంక్షేమానికి ఎలాంటి కృషిచేయలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. -
3 మోటార్లతోనే అద్భుతం
●రోజువారీగా ఎత్తిపోస్తున్నాం.. వర్షాకాలంలో మినహాయిస్తే.. మిగతా కాలంలో ఎల్లూరు పంప్హౌజ్లోని మూడు మోటార్ల ద్వారా రోజువారీగా నీటిని పంపింగ్ చేస్తున్నాం. సాగునీటితో పాటు, మిషన్ భగీరథకు కూడా ఈ ప్రాజెక్టు ద్వారానే నీటిని ఎత్తిపోస్తున్నాం. దీంతో మోటార్లపై భారం పడుతోంది. అయినా తప్పడం లేదు. పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలు ప్రారంభమైతే కేఎల్ఐపై భారం తగ్గుతుంది. 2024–25లో 50 టీఎంసీల నీటిని ఎత్తిపోయగా.. 2025–26 సీజన్లో 43.5 టీఎంసీల నీటిని ఎత్తిపోశాం. – లోకిలాల్నాయక్, డీఈఈ కొల్లాపూర్: మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఈసారి కూడా నీటి పంపింగ్ పెద్దమొత్తంలో జరిగింది. గత సీజన్లో 50.72 టీఎంసీల నీటిని ఎత్తిపోసి రికార్డు సృష్టించగా.. ఈసారి మాత్రం వేర్వేరు కారణాలతో 43.5 టీఎంసీలను ఎత్తిపోశారు. కానీ ఇది కూడా ప్రాజెక్టు స్థాయికి మించిన ఎత్తిపోతలే. సాగునీటికే కాకుండా తాగునీటికి కూడా ఎంజీకేఎల్ఐ మీదనే ఆధారపడటం.. ప్రాజెక్టులోని మూడు మోటార్లతోనే ఈస్థాయి ఎత్తిపోతలు జరగడం అద్భుతమని నీటిపారుదలశాఖ నిపుణులు చెబుతున్నారు. ఒక్కో మోటారుతో 800 క్యూసెక్కులు.. ప్రాజెక్టు పరిధిలో ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లి గట్టు పంప్హౌజ్లు ఉన్నాయి. ఒక్కో పంపుహౌజ్లో 5 మోటార్ల చొప్పున ఏర్పాటు చేశారు. వీటిలో 4 మోటార్లు రెగ్యులర్ పంపింగ్ కోసం కాగా.. 1 మోటార్ స్పేర్లో ఉంచుతారు. 30 మెగావాట్ల సామర్థ్యం గల ఒక్కో మోటార్ ద్వారా రోజూ 800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. కేఎల్ఐ ద్వారా కొల్లాపూర్, నాగర్కర్నూల్, వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. మిషన్ భగీరథకు సైతం.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలోని పలు మండలాలకు తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ స్కీంకు కూడా కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారానే నీటి పంపింగ్ చేస్తున్నారు. ఎల్లూరు సమీపంలోనే మిషన్ భగీరథ స్కీం ఏర్పాటుచేశారు. ఇక్కడి నుంచే అన్ని ప్రాంతాలకు తాగునీరు సరఫరా అవుతోంది. ప్రతి సంవత్సరం మిషన్ భగీరథ కోసం 7 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు. మరమ్మతుకు గురైనా.. ఎల్లూరు పంప్హౌజ్లో 5 మోటార్లకు గాను ప్రస్తుతం 3 మోటార్లు మాత్రమే పని చేస్తున్నాయి. 2011లో ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలు ప్రారంభమైన సమయంలో 5 మోటార్ల ద్వారా 0.0086 టీఎంసీ నీటిని మాత్రమే ఎత్తిపోశారు. 2015 వరకు ప్రతి ఏడాది 2.5 టీఎంసీల లోపు మాత్రమే ఎత్తిపోతలు జరిగాయి. 2016 నుంచి నీటి పంపింగ్ భారీగా పెరుగుతూ వచ్చింది. మూడు మోటార్లతోనే రికార్డు స్థాయిలో పంపింగ్ జరుగుతోంది. 2024–25లో అత్యధికంగా 50 టీఎంసీల మేరకు నీటి ఎత్తిపోతలు జరగగా.. 2019–20లో 49.99 టీఎంసీలు, 2025–26లో 43.5 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. సాగు, తాగు నీటికి కేఎల్ఐ ప్రాజెక్టే దిక్కవడంతో మోటార్లపై పంపింగ్ భారం పెరుగుతోంది. నీటి పంపింగ్ రికార్డు స్థాయిలో జరుగుతోందని ఓవైపు ఆనందపడుతున్న అధికారులు.. మరోవైపు మోటార్లపై భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు భారం పడుతున్నా తగ్గేదేలే.. రికార్డు స్థాయిలో కేఎల్ఐ నీటి పంపింగ్ గత సీజన్లో 50.72 టీఎంసీలు.. ఈసారి 43.5 టీఎంసీల నీటి ఎత్తిపోత 2016 నుంచి భారీగా పెరిగిన పంపింగ్ -
విత్తనం.. భారం!
కూరగాయల రైతుకు లభించని రాయితీలు ● ఏటేటా పెరుగుతున్న పెట్టుబడులు ● ఎకరా విత్తనాల కోసమే రూ.7వేల వరకు వ్యయం ● అటకెక్కిన ఆర్కేవీవై పథకం గద్వాల వ్యవసాయం: కూరగాయల రైతుకు తిప్పలు తప్పడం లేదు. పెరుగుతున్న పెట్టుబడులతో సతమతమవుతున్న రైతులకు విత్తనాల ధరలు మరింత ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కేవీవై) పథకం కింద ఈ ఏడాదైనా రాయితీపై కూరగాయల విత్తనాలు, ట్రేలు లభిస్తాయన్న ఆఽశ ఉండేది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా 10వేల ఎకరాల్లో.. జిల్లాలో ఉద్యాన పంటల సాగుకు నేలలు అనుకూలంగా ఉన్నాయి. వాతావరణం సైతం సాధారణంగానే ఉంటుంది. దీంతో ఇక్కడ రైతులు సాధారణ పంటలతో పాటు కూరగాయలను ఏటా విస్తారంగా పండిస్తారు. రెండు సీజన్లతో కలిపి దాదాపు 10వేల ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు సాగుచేస్తున్నారు. గద్వాల మండలంలో వంకాయ, బెండ, పచ్చిమిర్చి, చిక్కుడు, క్యాలీఫ్లవర్, క్యాబేజీ.. ధరూర్ మండలంలో బెండ, టమాటా.. మల్దకల్ మండలంలో చిక్కుడు, టమాటా, బీర, సోరకాయ, బెండ, కాకర.. అయిజలో బెండ, చిక్కుడు.. వడ్డేపల్లిలో వంకాయ, బెండ, కాకర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఉల్లి.. అలంపూర్లో ఉల్లి.. రాజోళిలో పచ్చిమిర్చి, ఉల్లి, టమాటా.. గట్టు, కేటీదొడ్డి మండలాల్లో టమాటాతో పాటు ఆకుకూరలు సైతం పండిస్తున్నారు. రాయితీపై నారా అందిస్తున్నాం.. ఆర్కేవీవై ద్వారా రాయితీపై కూరగాయల విత్తనాలు, ట్రేలు రావడం లేదు. అయితే హైదరాబాద్లోని జీడిమెట్ల ప్రాంతంలోని సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రంలో రాయితీపై టమాటా, వంకాయ తదితర కూరగాయల నారు అందిస్తున్నాం. – ఎంఏ అక్బర్, జిల్లా ఉద్యానశాఖ అధికారి -
3.4లక్షల ఎకరాలకు సాగునీరందించేలా..
ఎంజీకేఎల్ఐ ద్వారా 2.50 లక్షల ఎకరాల ఆయకట్టు సాగుకు 25 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా మొదట డిజైన్లు రూపొందించారు. 2005లో ఆయకట్టు విస్తీర్ణాన్ని 3.40 లక్షలకు పెంచారు. 2011లో నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. ఎల్లూరు పంప్హౌజ్లోని 5 మోటార్ల ద్వారా రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోసి.. అక్కడి నుంచి సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లి గట్టు రిజర్వాయర్లకు నీటిని తరలించేలా డిజైన్లు చేశారు. 2016లో ప్రాజెక్టుకు 40 టీఎంసీల నీటి కేటాయింపులు జరిగాయి. దీంతో ఆయకట్టు విస్తీర్ణాన్ని 4.24 లక్షల ఎకరాలకు పెంచారు. -
వీధివ్యాపారుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు
గద్వాల న్యూటౌన్: వీధి వ్యాపారుల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని మున్సిపల్ చైర్పర్సన్ జయలక్ష్మి అన్నారు. గురువారం మున్సిపల్ సమావేశ మందిరంలో మెప్మా ఆధ్వర్యంలో స్వానిధి మహోత్సవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వీధి వ్యాపారాలు కనీస పెట్టుబడికి ఆర్థికపరమైన ఇబ్బందులు పడకుండా బ్యాంకుల ద్వారా రుణ సహాయం అందిస్తున్నారని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గద్వాల పట్టణంలో వీధి వ్యాపారులు తమ వ్యాపారాలు నిర్వహించుకోవడంలో వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్ కమిషనర్ జానకిరాం సాగర్ మాట్లాడుతూ 2019లో కరోనా వ్యాధి సమయంలో చిరు, వీధి వ్యాపారులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడ్డారని, వారికి ఆర్థికపరమైన చేయూతను అందించేందుకు అప్పుడు ప్రభుత్వం భారత్ ఆత్మ నిర్భర్ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. ఈ పథకం కింద బ్యాంకుల ద్వారా మూడు విడతలుగా రూ.10 వేలు, రూ.20 వేలు, రూ.50 వేలు రుణాలు అందించామని గుర్తుచేశారు. ఈ రుణ మొత్తాలను ఇటీవల కొంత పెంచారని, వీధి వ్యాపారులు అధిక వడ్డీలకు ప్రైవేట్గా అప్పులు తీసుకోకుండా, వీధి వ్యాపారిగా నమోదై బ్యాంకు ద్వారా రుణాలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఉత్తమ వీధి వ్యాపారులుగా ఎంపికై న వారిని చైర్పర్సన్, కమిషనర్ శాలువా, జ్ఞాపికలతో సన్మానించారు. అంతకు ముందు ఆవరణలో ఏర్పాటు చేసిన ఫుడ్, వస్తువుల స్టాల్స్ను సందర్శించారు. కార్యక్రమంలో మెప్మా ఏడీఎంసీ వెంకటేశ్వర్లు, సీఓలు నిజాముద్దీన్, మహాలక్ష్మి, తిమ్మన్న తదితరులు పాల్గొన్నారు. -
వడివడిగా గుడ్డెందొడ్డి
తొలగనున్న ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల నీటి కష్టాలు గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణానది సుమారు 93 కిలోమీటర్ల మేర పారుతుంది.. కృష్ణాబేసిన్ పరిధిలోనే 9 లక్షల ఎకరాల ఆయకట్టుతో వివిధ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు చేశారు. ఏటా వానాకాలం ఖరీఫ్ సీజన్లో ఈ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీటిని అందిస్తున్నారు. ఈ ప్రాజెక్టులన్నింటికీ పెద్దన్నగా ఉన్న జూరాల ప్రాజెక్టు జలాశయం నుంచి నీటిని తరలిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అయితే ఇదే ప్రాజెక్టుల కింద రబీ సీజన్లో నీటికష్టాలు తలెత్తుతున్నాయి. పెద్దన్నగా చెప్పుకొనే జూరాల జలాశయం నీరులేక అడుగంటిపోవడమే ప్రధాన కారణం. దీంతో ఏటా తాగునీటి అవసరాలకు సైతం పైనున్న కర్ణాటకను ప్రాధేయపడాల్సి వస్తుంది. ఈ క్రమంలో నీటి కష్టాలను అధిగమించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించింది. జూరాల జలాశయానికి సమీపంలో నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో నిర్మించిన గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం జలాశయం 1.5 టీఎంసీలు కాగా.. దీనిని 15 టీఎంసీలకు పెంచేందుకు సర్వే ప్రక్రియ పూర్తయి డీపీఆర్ను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి కష్టాలు తొలగనున్నాయి. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ రిజర్వాయర్ పెంపు సర్వే పనులు చేస్తున్న అధికారులు (ఫైల్) 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంపు వరద సమయంలో రోజుకు అర టీఎంసీ ఎత్తిపోసేలా చర్యలు రబీ సీజన్లో రివర్స్ పంపింగ్ విధానంలో జూరాల జలాశయంలోకి ఎత్తిపోత సర్వే పనులు పూర్తి.. త్వరలోనే ప్రభుత్వానికి డీపీఆర్ నివేదిక -
సమగ్ర ఓటర్ల జాబితా సిద్ధం చేయాలి
విజయవంతం చేయాలి.. సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలు సహకరించాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. జిల్లా కేంద్రంలో 217, 218 పోలింగ్ వద్ద సర్లో భాగంగా ఇంటింటికి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్న బీఎల్ఓల పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం స్థానికులతో మాట్లాడి.. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రాముఖ్యతను వివరించారు. ప్రజల సహకారంతోనే సమగ్ర విశ్వసనీయ ఓటరు జాబితా రూపకల్పన సాధ్యమవుతుందని చెప్పారు. ప్రజలందరూ ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణలో చురుకుగా పాల్గొని ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. గద్వాల: ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియతో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా ఓటరు జాబితాను రూపొందించేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్బాషాషేక్ అన్నారు. సర్పై ఓటర్లకు కల్పించేందుకు గురువారం కలెక్టరేట్ నుంచి కృష్ణవేణిచౌరస్తా వరకు నిర్వహించిన 2కే రన్ను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అధికారులు, విద్యార్థులు, ఓటర్లు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని ఓటరు చైతన్యానికి సంబంధించిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఓటరు చైతన్య నినాదాలు చేస్తూ ఉత్సాహంతో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సర్ను విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలన్నారు. మరణించిన వారు, అనర్హుల ఓట్లు తొలగించి ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించేందుకు ఎస్ఐఆర్ ప్రక్రయ దోహదపడుతుందన్నారు. ఈనెల 26వ తేదీన అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సం పురస్కరించుకుని వారోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగ్రావు, ఏఎస్పీ శంకర్, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఏఓ భూపాల్రెడ్డి, శిక్షణ డీసీలు మనోజ్కుమార్రెడ్డి, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
యువత భవిష్యత్కు ఏటీసీ బలమైన పునాది
రాజాపూర్: ఆధునిక, సాంకేతిక శిక్షణతో యువత భవిష్యత్కు రంగారెడ్డిగూడ గ్రామంలో నిర్మించబోతున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) బలమైన పునాది అవుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకట్స్వామి అన్నారు. గురువారం రాజాపూర్ మండల రంగారెడ్డిగూడలో రూ.42 కోట్ల నిధులతో ఏటీసీ సెంటర్కు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ యువతకు విద్యా, ఉద్యోగవకాశాలను అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్ని నియోజకవర్గాల్లో ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేయాలని చెప్పరని. అందులో భాగంగా తొలివిడతలో రూ.2 వేల కోట్లతో 55 ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల పాలుజేసి అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ.. నేడు ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేస్తలేరని చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. 730 క్వింటాళ్ల వేరుశనగ రాక గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవ సాయ యార్డుకు గురువారం 730 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాల్ గరిష్టంగా రూ.7,399, కనిష్టంగా రూ.4,341, సరాసరిగా రూ.6,520 ధరలు లభించాయి. రీ–టెండర్ నిర్వహించాలి గద్వాల: గద్వాల మున్సిపాలిటీ పరిధిలో వెజ్, నాన్ వెజ్ షాపులకు నిర్వహించిన టెండర్ ప్రక్రియలో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని తిరిగి రీ–టెండర్ నిర్వహించాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు కోరారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ నర్సింగ్రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తం 38 షాపులకు టెండర్ నిర్వహించగా, ఇందులో 15 షాపులను ఎస్సీ, ఎస్టీలకు, మరో 23 షాపులకు జనరల్కు కేటాయించారన్నారు. ఇందుకు సంబంధించి 118 దరఖాస్తులు రాగా.. మున్సిపల్ అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి వివిధ కారణాలు చూపెడుతూ మొత్తం 59 దరఖాస్తులను తిరస్కరించారని ఆరోపించారు. ఫలితంగా ఎలాంటి పోటీ లేకుండానే వేలం జరిగి మున్సిపల్ ఆదాయానికి భారీగా గండిపడిందని, అలాగే షాపు నంబర్లు 1, 30లకు వేలం నిర్వహించలేదని విమర్శించారు. ఈ షాపులకు ఎప్పుడు వేలం నిర్వహిస్తారో స్పష్టం చేయలేదని, వేలం నిర్వహించి ఆరు రోజులు గడిచినా ఏయే షాపులు ఎంతెంత వేలం పోయాయి.. ఎవరికి కేటాయించారు.. అనే వివరాలు చెప్పలేదన్నారు. ఇంకా ఎన్నో సందేహాలు, అక్రమాలు చోటుచేసుకున్నప్పుడు తిరిగి షాపులకు రీటెండర్ నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కిరణ్, హన్మంతు, వెంకటేష్, రాము, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ ప్రాజెక్టులు ఆపాలి గద్వాల: తుంగభద్ర నదిపై ఆర్డీఎస్కు తూట్లు పొడుస్తూ కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న కురిడి లి్ఫ్ట్ ఇరిగేషన్ను తక్షణమే ఆపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఆయన జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్డీఎస్ ద్వారా తెలంగాణకు రావాల్సిన 15.9 టీఎంసీల నీటిని ఎన్నడూ వినియోగించుకోలేదన్నారు. కేవలం 25 వేల ఎకరాలకు మించి సాగునీరు అందని పరిస్థితి నెలకొందన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న కురిడి ప్రాజెక్టును తక్షణమే ఆపాలని, ఆర్డీఎస్ రావాల్సిన నీటి వాటాను పూర్తిగా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎకై ్సజ్ డీసీగా విజయ్భాస్కర్రెడ్డి మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో అబ్కా రీ శాఖలో ఉన్నతాధికారులకు స్థానచలనం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్గా ఉంటూ ఇన్చార్జి డీసీగా ఉన్న విజయ్భాస్కర్రెడ్డిని ఇక్కడే ఉమ్మడి జిల్లా రెగ్యులర్గా డిప్యూటీ కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఖాళీ అయిన ఆ స్థానానికి హైదరాబాద్ నుంచి జి.శ్రీనివాస్ బదిలీపై ఉమ్మడి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్గా వచ్చారు. నాగర్కర్నూల్ ఈఎస్గా పని చేస్తున్న గాయత్రి మెదక్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్గా బదిలీపై వెళ్లారు. ఆమె స్థానంలో నాగర్కర్నూల్ ఈఎస్గా వి.వేణుగోపాల్రెడ్డి ఖమ్మం నుంచి పదోన్నతిపై వచ్చా రు. భూపాలపల్లి నుంచి వనపర్తి ఈఎస్గా ఎం.లింగచారి, కొత్తగూడెం ఏఈఎస్గా ఉన్న పి.కరమ్చంద్ పదోన్నతిపై గద్వాల ఈఎస్గా వచ్చారు. మహబూబ్నగర్ జిల్లాలో ఏఈఎస్గా ఉన్న నర్సింహారెడ్డి పదోన్నతిపై మెదక్ ఈఎస్గా వెళ్లారు. -
సమగ్ర అభివృద్ధికే ప్రజాపాలన
గద్వాల: ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమాభివృద్ధి పథకాలు అర్హులందరికీ దక్కేలా, అన్నిరకాల అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని జిల్లా ప్రత్యేకాధికారి శృతిఓజా అన్నారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆమె కలెక్టర్ రిజ్వాన్బాషాషేక్తో కలిసి మాట్లాడారు. ప్రభుత్వం 10 థీములతో షెడ్యూల్ ప్రకారం ఆయా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు విజయవంతం అయ్యాయన్నారు. వివిధ శాఖల్లో గుర్తించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాలన్నారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా మరుగుదొడ్లు, అమ్మ ఆదర్శ పాఠశాలలో మరమ్మతు, గట్టు మండలం ఆస్పిరేషనల్ బ్లాక్కు ఎంపిక కావడం, నిర్దేశిత పారామీటర్స్లో చెప్పుకోదగ్గ ప్రగతి సాధించడం జరిగిందన్నారు. బాల్యవివాహాలు అరికట్టేలా కృషి చేశామన్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో అరైవ్, అలైవ్ వారోత్సవాలు నిర్వహించి రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల వివరాలతో రూపొందించిన పుస్తకాలను విడుదల చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు. -
రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలి
గద్వాల (మల్దకల్): పంటల సాగులో రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలని వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జగ్గునాయక్ అన్నారు. గురువారం మండలంలోని పెద్దపల్లి గ్రామంలో ఏఓ రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు కంపెనీ గుర్తింపు కలిగిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని, నానో యూరియా, నానోడీ డీఏపీల వాడకం పెంచాలని వివరించారు. ముఖ్యంగా జీవ ఎరువుల ప్రాముఖ్యత, జీవామృతం, వర్మీ కంపోస్టు, బయో ఫర్టిలైజర్ల వినియోగం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడి పంటల దిగుబడి పెరుగుతుందన్నారు. రైతులు వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటించి.. పంట మార్పిడితో అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. రసాయనిక ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువులు వాడితేనే మంచి దిగుబడులు పొందవచ్చని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచు శిరీష, ఏఈఓ సుధారాణి, రైతులు పాల్గొన్నారు. -
యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలి
గద్వాల: యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజు అన్నారు. గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోదక దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత దేశ భవిష్యత్కు పునాది అని, యువత డ్రగ్స్కు అలవాటు పడితే వారి వ్యక్తిగత ఆరోగ్యమే కాకుండా భవిష్యత్, కుటుంబం మొత్తం నాశనమవుతుందన్నారు. అంతేకాకుండా సమాజానికి సైతం నష్టం కలిగిస్తుందన్నారు. విద్యార్థులు చెడు స్నేహాలు, ఆకర్షణలకు లోనుకాకుండా విద్యపై దృష్టి కేంద్రీకరించాలని, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానం అలవాటు చేసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం వంటివి చేస్తే చట్టపరంగా కఠిన శిక్షలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, లక్ష్మణస్వామి, అధ్యాపక బృందం పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లాలో..
కృష్ణాబేసిన్ పరిధిలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 2 లక్షలు, భీమా కింద 2 లక్షలు, కల్వకుర్తి కింద 3.65 లక్షలు, కోయిల్సాగర్ కింద 30 వేలు, జూరాల కింద 1.09 లక్షల ఎకరాలు కలుపుకొని మొత్తం సుమారు 9 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికింద ప్రతిఏటా వానాకాలంలో సుమారు 6.50 – 7 లక్షల ఎకరాలు వరకు సాగవుతుంది. రబీలోనే కష్టాలు.. వానాకాలంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పరిధిలోఏడు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు పారుతున్నప్పటికీ రబీ సీజన్లో మాత్రం అన్ని ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీటి కష్టాలు ఎదురవుతాయి. ఇటీవల కాలంలో ఏకంగా ప్రాజెక్టుల కింద క్రాప్ హాలిడే సైతం ప్రకటించే పరిస్థితి నెలకొంది. జూరాల ఎడమ కాల్వ పరిధిలో క్రాప్ హాలిడే ప్రకటించగా.. కుడి కాల్వ పరిధిలో ఆయకట్టు సగానికి కుదించేయడం చూస్తే సాగునీటి కష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టమవుతుంది. -
పోటీల్లో క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలి
ధరూరు: క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమి గెలుపునకు పునాది రాయి లాంటిదని తెలంగాణ రాష్ట్ర షీప్స్ అండ్ గోట్స్ కార్పొరేషన్ చైర్మన్ సరిత అన్నారు. మండలంలోని గార్లపాడులో పోలమ్మ అవ్వ పండుగను పురస్కరించుకొని మూడు రోజులుగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు మంగళవారం అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగాయి. సరిత పోలమ్మ అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. విజేతగా నిలిచిన మూలమళ్ల జట్టుకు ప్రథమ బహుమతి రూ.30,116 నగదును మాజీ జెడ్పీటీసీ పద్మావెంకటేశ్వరరెడ్డి దంపతులు అందజేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన హైదరాబద్ జట్టుకు సర్పంచు పరిమళ శివరాజ్ రూ.20,016 నగదు అందజేశారు. మూడో విజేతగా నిలిచిన ప్రకాశం జిల్లా జట్టుకు రూ.15,016 నగదును శివకుమార్రెడ్డి అందజేశారు. అలాగే నాల్గోవ స్థానంలో నిలిచిన గార్లపాడు జట్టుకు రంగస్వామి నగదు ఆందజేశారు. ఉత్సాహంగా సందెరాళ్ల పోటీలు.. గార్లపాడులో నిర్వహించిన సందెరాళ్ల పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. మంగళవారం రాత్రి జరిగిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి నగదు బహుమతులతో పాటు షీల్డులను సర్పంచు పరిమళ శివరాజ్ అందజేశారు. -
‘చెత్త’స్టాండ్..!
‘మొత్తం 18 ప్లాట్ఫాంలు కలిగి.. ఉమ్మడి పాలమూరుతోపాటు రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్, కర్ణాటక రాష్ట్ర డిపోలతో కలిపి కనీసం 250 బస్సులు.. సుమారు 60 వేల మంది నిత్యం రాకపోకలు సాగించే మహబూబ్నగర్ కొత్త బస్టాండ్ చెత్త ప్రాంగణంగా మారింది. పెద్ద నాలా నుంచి వచ్చే దుర్వాసన, ఆరుబయటే మూత్రవిసర్జన, ఆవరణలో పందుల సంచారం, హోటల్ నుంచి వచ్చే వ్యర్థజలాలతో కూడిన కాల్వ, ఎక్కడికక్కడే పేరుకున్న చెత్తాచెదారంతో బస్టాండులోకి వెళ్లే వారు ముక్కు మూసుకోవాల్సి వస్తుందంటే పరిస్థితిని అర్థం చేసుకోచవచ్చు. ఫలితంగా బస్సులు వచ్చే వరకు ప్రాంగణంలో కూర్చోవాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు. దుర్గంద భరితమైన వాసన మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.’ – మహబూబ్నగర్ మున్సిపాలిటీ కొత్త బస్టాండు ప్రాంగణం, డిపో మధ్యలో నుంచి పెద్దనాలా (మురుగు కాల్వ) వెళ్తోంది. ఈ కాల్వ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ కవర్లు, సీసాలతో ఎప్పుడూ నిండిపోయి కనిపిస్తుంది. దీనిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసే మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది చుట్టపు చూపులా వచ్చి అప్పుడప్పుడు చెత్తాచెదారం తొలగిస్తుంటారు. అందులోనే జీవనం సాగించే పందులు.. అప్పుడప్పుడు ప్రాంగణంలో సంచరిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు బస్టాండు ఎన్హెచ్–167కు 5 అడుగుల కిందికి ఉండటంతో వర్షాకాలంలో ప్రాంగణమంతా వరదతోపాటు మురుగు ఏరులై పారుతుంది. భారీ వర్షాలు కురిసిన సందర్భంగా పెద్దనాలా పొంగి పొర్లుతుండటంతో డిపోలోకి ఆర్టీసీ అధికారులు, సిబ్బంది రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ముందుకు కదలని మురుగు.. వాస్తవానికి బస్టాండు ప్రాంగణంతోపాటు డిపో ఆవరణ, గ్యారేజీ పరిసరాలను నిత్యం శుభ్రం చేయడానికి ఆర్టీసీకి చెందిన కాంట్రాక్ట్ పారిశుద్ధ్య సిబ్బంది సుమారు 25 మంది ఉన్నారు. వీరు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారని అధికారులు చెబుతున్నా.. చాలా వరకు పరిసరాలన్నీ అపరిశుభ్రంగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏడాదిన్నర క్రితం నిర్మించిన కొత్త షాపింగ్ కాంప్లెక్స్ సెల్లార్ పూర్తిగా చెత్తాచెదారంతో నిండిపోయింది. మరోవైపు ఇక్కడి హోటల్ నుంచి వెలువడే వ్యర్థ జలాలు మురుగు కాల్వలో ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడ నిలిచి దుర్గంధభరితంగా మారడంతో ప్రయాణికులు ముక్కు మూసుకుని లోపలికి వస్తూ పోవాల్సి వస్తుంది. అలాగే బహిరంగ మూత్రశాలలు రెండుచోట్ల ఉన్నా కొందరు పెద్ద నాలా వద్దే మూత్రవిసర్జన చేస్తుండటం గమనార్హం. రోజూ సేకరించే చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను ఆర్టీసీ కాంట్రాక్ట్ సిబ్బంది ఇక్కడ ఓ మూలన ఉన్న పెద్ద డస్ట్బిన్లో వేసేస్తున్నారు. అది నిండిపోయి ఆరుబయట పడినా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది వచ్చి తీసుకెళ్లడంలో అలసత్వం వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పాలమూరు బస్టాండులోకి వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే.. ప్రాంగణంలో ఎక్కడబడితే అక్కడే చెత్తాచెదారం దర్శనం కంపుకొడుతున్న బహిరంగ మూత్రశాలలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయిన పెద్దనాలా పట్టించుకోని ఆర్టీసీ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు -
సర్.. వస్తున్నారు!
అచ్చంపేట: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ ప్రక్రియ గురువారం నుంచి వచ్చేనెల 24 వరకు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టింది. ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు (ఈఆర్ఓలు), అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు(ఏఈఆర్ఓఎస్), బూత్లెవల్ అధికారులు (బీఎల్ఓ)లను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చి సన్నాహక సమావేశాలు నిర్వహించి సన్నద్ధం చేసింది. బుధవారం మండలాల వారీగా చివరగా బీఎల్ఓలకు శిక్షణ ఇచ్చి గురువారం నుంచి ఇంటింటికి వెళ్లేలా సన్నద్ధం చేశారు. బీఎల్ఓలు ఇంటింటికి తిరిగి 2002, 2025 ఓటర్ల జాబితాను పోల్చి చనిపోయిన, డూప్లికేట్, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగించి స్థానికంగా నివశిస్తున్న అర్హుల పేర్లను యాప్లో అప్లోడ్ చేయనున్నారు. బీఎల్ఓల పాత్ర కీలకం.. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలో గురువారం నుంచి ఇంటింటి సర్వే చేయనున్నారు. ఓటరు జాబితా సవరణలో ఇంటింటి ధ్రువీకరణ ప్రక్రియ అత్యంత ముఖ్యమైంది. దీనిలో బీఎల్ఓల పాత్ర ఎంతో కీలకం కానుంది. జూలై 24 నాటికి పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ, 31న ఓటర్ల ముసాయిదా విడుదల, జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారంపై నోటీసుల జారీ, అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురణ ఉంటుంది. చనిపోయిన వారు, డూప్లికేట్, శాశ్వతంగా వలస వెళ్లినవారు, అనర్హుల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించి.. అర్హులతో మాత్రమే తుది జాబితా రూపొందిస్తారు. ఉమ్మడి జిల్లాలో 80.15 శాతమే.. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ప్రస్తుతం మొత్తం 27,39,12 లక్షల మంది ఓటర్లున్నారు. ఇందులో 21,95,269 (80.15 శాతం) ఓటర్ల మ్యాపింగ్ పూర్తయింది. సర్–2002తో భాగంగా మ్యాపింగ్ చేయగా ఏకంగా 9,16,059 మంది ఓటర్లకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేవు. ఇందుకోసం మండలాల్లో స్పెషల్ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి వారికి సంబంధించిన 2002 ఓటరు జాబితా ఈపీఐసీ నంబర్ కోసం వెతుకుతున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక బీఎల్ఓను నియమించారు. వీరంతా నెల రోజుల్లో ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించనున్నారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ తక్కువగా నమోదు కావడానికి మెజార్టీ ఓటర్లు సొంత గ్రామంలో నమోదు చేయించుకుంటామని చెప్పడమే ప్రధాన కారణం. 2002, 2025 ఓటర్ల జాబితాల్లో పేర్లు ఉంటే.. ఓటర్లు ఆధారాల కోసం ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు చూపాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాపింగ్లో ధ్రువపత్రాలు సమర్పించాల్సిన వారు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్న 11 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవచ్చు.. ఓటర్లకు ముందుగా ముద్రించిన ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తారు. ఇంటింటి సర్వే సందర్భంగా బీఎల్ఓలు వచ్చినప్పుడు పూర్తి వివరాలతో ఎన్యుమరేషన్ ఫారం సమర్పించి తప్పనిసరిగా రశీదు తీసుకోవాలి. ఇల్లు తాళం వేసి ఉంటే బీఎల్ఓలు మూడుసార్లు సందర్శిస్తారు. డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోతే ఫారం–6 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 31న డ్రాఫ్ట్ ఎస్ఐఆర్ ఓటరు జాబితాను విడుదల చేస్తాం. ప్రతి ఓటరు తన పేరు డ్రాఫ్ట్ జాబితాలో ఉందో.. లేదో.. పరిశీలించి, అభ్యంతరాలు లేదా కొత్త క్లెయింలు ఉంటే ఆగస్టు 30లోగా సమర్పించాలి. సెప్టెంబర్ 28 నాటికి అన్ని అభ్యంతరాలు పరిష్కరించి అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేస్తాం. – హేమంత కేశవ్ పాటిల్, కలెక్టర్, నాగర్కర్నూల్ నేటినుంచి ఓటరు జాబితా ఇంటింటి సమగ్ర సవరణ ఇప్పటికే బూత్లెవల్ అధికారులకు శిక్షణ పూర్తి ఉమ్మడి జిల్లాలో 80.15 శాతం పూర్తయిన మ్యాపింగ్ జూలై 24 వరకు ప్రక్రియ ముగించేలా కసరత్తు 31న ముసాయిదా, అక్టోబర్ 1న తుది జాబితా ప్రచురణ -
డ్రగ్స్.. వ్యక్తికే కాదు కుటుంబానికి ముప్పు
గద్వాల క్రైం: మత్తు పదార్థాలకు బానిసలైన వ్యక్తులకు కౌన్సెలింగ్ ద్వారా పునరావాస కార్యాక్రమాలను అందజేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ‘మన డ్రగ్స్ డీ అడిక్షన్ – రిహాబిటేషన్ సెంటర్’ను ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వ్యసనం వ్యక్తులను మాత్రమే కాకుండా కుటుంబాలను, సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయన్నా రు. వ్యసనాలకు బానిసైలన వారికి సరైన సమయంలో చికిత్స, కౌన్సెలింగ్, యోగా, ధ్యానం వంటి శిక్షణ ఇవ్వాలన్నారు. సెంటర్లో ఏర్పాటు చేసిన మౌలిక వసతులు, సదుపాయాలను సొసైటీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈగల్ ఫోర్స్ ద్వారా జిల్లాకు వచ్చిన క్యారమ్, చెస్, పెయింటింగ్ బోర్డు, సృజనాత్మక కార్యకాలపాలకు ఉపయోగపడే సామగ్రిని అందజేశారు. కార్యక్రమాంలో సీఐ శ్రీను, ఎస్ఐ కల్యాణ్కుమార్, సెంటర్ నిర్వాహకులు కృష్ణయ్య తదితరులు ఉన్నారు. పనులు నాణ్యతగా చేపట్టాలి ఉండవెల్లి: మండలంలోని 11 పంచాయతీల్లో చేపడుతున్న నీటి సంరక్షణ పనుల్లో భాగంగా జల్ సంచయ్ జన్ భగీదారి కార్యక్రమంలో భాగంగా 31 పనుల్లో 28 పనులను కేంద్ర నోడల్ అధికారి సత్యమూర్తి, జిల్లా టెక్నికల్ కోఆర్డినేటర్ విద్యాధర్, ఏపీడీ శ్రీనివాసులు పరిశీలించారు. గ్రామ పంచాయతీల్లో ఇంకుడు గుంతలు, చెక్డ్యాములు, బోరు బావులు, రూప్టాప్ హర్వెస్టింగ్ పనులను తనిఖీ చేశారు. పనుల్లో నాణ్యత లోపిస్తే వెంటనే వాటికి మరమ్మతులు చేయించాలని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పనులను త్వరగా పూర్తి చేయించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ తిరుపతన్న, ఏపీఓ సౌజన్య, టీఏలు రామచంద్రుడు, విజయ్ పాల్గొన్నారు. లంపిస్కిన్ నివారణ టీకాలు వేయించండి గద్వాల వ్యవసాయం: గోజాతి పశువులైన ఎద్దు లు, ఆవులు, కోడెలు లంపిస్కిన్ (ముద్ద చర్మం) వ్యాధి బారిన పడకుండా ముందుస్తుగా నివారణ టీకాలు వేయించాలని జిల్లా పశువైద్య, పశు సంవర్ధకశాఖ అధికారి డాక్టర్ వెంకటనారాయణ ఒక ప్రకటనలో పాడి రైతులకు సూ చించారు. బుధవారం నుంచి ఈ కార్యక్రమం జిల్లాలో ప్రారంభమైందన్నారు. జూలై 8 వరకు ఆయా గ్రామాల్లో పశువైద్య సిబ్బంది పశువులకు టీకాలు వేస్తారని పేర్కొన్నారు. 2 నుంచి 3 నెలల దూడలు కూడా ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందన్నారు. దోమలు, ఈగ లు, రక్తం పీల్చే కీటకాల ద్వార, వ్యాధి సోకిన పశువుల నీరు, మేత ద్వారా కూడా వ్యాధి సంక్రమిస్తుందని తెలిపారు. అధిక జ్వరం, కళ్లు, ముక్కు నుంచి నీరుకారడం ఈ వ్యాధి లక్షణాలుగా పేర్కొన్నారు. -
త్వరలో పనులు పూర్తి చేస్తాం
అనేక కారణాల వల్ల ట్యాంక్ బండ్ నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ట్యాంక్ బండ్పై రోడ్డు నిర్మించాల్సి ఉంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ పోల్స్, బెంచీలు ఏర్పాటు చేయాలి. అలుగును కాంక్రీట్ చేయాలి. ఫీడర్ చానల్ను అభివృద్ధి చేయాలి. ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయి. త్వరలో నిర్మాణం పూర్తి చేసేందుకు కృషిచేస్తాం. – నాగరాజు, ఇరిగేషన్ డీఈ సగం కూడా పూర్తికాలే.. ట్యాంక్ బండ్ నిర్మాణం పనులు ప్రారంభించి సుమారు ఏడేళ్లవుతోంది. ఇప్పటి వరకు సగం పనులు కూడా పూర్తి కాలేదు. అధికారులు చొరువ తీసుకొని పనుల్లో వేగం పెంచాలి. – జగన్నాథరెడ్డి, అయిజ ఆధునిక హంగులతో నిర్మించాలి మినీ ట్యాంక్బండ్ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చూడడంతో పాటు ఆధునిక హంగులు ఏర్పాటు చేయాలి. దీంతోపాటు వాకింగ్ ట్రాక్, ఒపెన్ జిమ్ వంటివి సమకూర్చితే ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయమం చేసుకునే అవకాశం ఉంటుంది. – గోవిందు, అయిజ ● -
శుభ్రం చేయిస్తున్నాం..
ఆర్టీసీ బస్టాండు ప్రాంగణంతోపాటు డిపో పరిసరాలను ఎప్పటికప్పుడు కాంట్రాక్ట్ సిబ్బందితో శుభ్రం చేయిస్తున్నాం. పెద్దనాలాతోనే అసలు సమస్య తలెత్తుతోంది. దీనిని శుభ్రం చేయాల్సిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య సిబ్బందిది. వారంలో రెండుసార్లు వచ్చి ఒకచోట చెత్తాచెదారంతోపాటు పెద్ద కాల్వలోని ప్లాస్టిక్ వ్యర్థాలను పోగుచేసి వెళ్లిపోతున్నారు. దీంతో తిరిగి అందులోనే గాలికి కొట్టుకొస్తున్నాయి. ఎప్పటికప్పుడు డంపింగ్కు తరలించాలని సూచిస్తున్నా పట్టించుకోవడం లేదు. – అశోక్కుమార్, డీఎం, మహబూబ్నగర్ అపరిశుభ్ర వాతావరణమే.. నేను ఓ ప్రైవేట్ మార్కెటింగ్ సంస్థలో పనిచేస్తాను. నిత్యం ఆర్టీసీ బస్సులలోనే రాకపోకలు సాగిస్తుంటాను. కొత్త బస్టాండులోకి వెళ్లగానే అంతా అపరిశుభ్ర వాతావరణమే కనిపిస్తుంది. ప్లాట్ఫాం వరకు దుర్గంధం మధ్య అలాగే వెళ్లాల్సి వస్తుంది. ఎక్కడబడితే అక్కడ చెత్తాచెదారం ఉండటంతో ఇబ్బందిగా ఉంటుంది. బస్సు వచ్చే వరకు అక్కడ ఉన్నంత సేపు దుర్వాసన భరించాల్సిందే. ఆర్టీసీ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి. – నాగరాజు, పాతపాలమూరు, మహబూబ్నగర్ ● -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : ఎస్పీ
గద్వాల క్రైం: నిషేధిత మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం గద్వాల మండలంలోని అనంపురం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. యువత, చిన్నారులు, పెద్దలు మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారన్నారు. ఈ అలవాటు కుటుంబ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని చెప్పారు. ఎక్కడైనా మత్తు పదార్థాలు రవాణా చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసు శాఖకు సమాచారం అందించాలని కోరారు. అనంతరం వివిధ సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్ నిత్య, సీఐ శ్రీను, ఎస్ఐ శ్రీకాంత్ పాల్గొన్నారు. గద్వాల జిల్లా జడ్జిగా కల్యాణ్ చక్రవర్తి పాలమూరు: మహబూబ్నగర్ జిల్లా కోర్టు మొదటి అదనపు న్యాయమూర్తిగా పని చేసిన కల్యాణ్ చక్రవర్తి జోగుళాంబ గద్వాల జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై బదిలీ అయ్యారు. జిల్లాలో దీర్ఘకాలికంగా పని చేసి గద్వాలకు బదిలీపై వెళ్తున్న న్యాయమూర్తి కల్యాణ్ చక్రవర్తిని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత హాజరై సత్కరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనందరావు, కార్యదర్శి నర్సింహారెడ్డి, వెంకటయ్య, చంద్ర మౌలి, అనంతరెడ్డి, అనిల్కుమార్, ఎన్పీ వెంకటేష్, స్వదేష్, న్యాయవాదులు పాల్గొన్నారు. రంగారెడ్డిగూడలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ రాజాపూర్: జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని రంగారెడ్డిగూడెం గ్రామంలో రూ.12 కోట్లతో నాలుగు ఎకరాల స్థలంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను ఈనెల 25న మంత్రి వివేక్ వెంకట్స్వామి ప్రారంభించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దూసుకుపోతున్న ఈ కంప్యూటర్ యుగంలోయువతకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను రంగారెడ్డిగూడలో ప్రారంభించుకోవడం ఎంతో శుభపరిణామమన్నారు. గ్రామశివారులో ఎస్సీ కాలనీ పక్కన టాటా కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో ఈ కేంద్రం కార్యరూపం దాల్చబోతోందని పేర్కొన్నారు. ఇప్పటికే బాలానగర్ మండలం పెద్దాయపల్లి వద్ద యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్తో పాటు నవోదయ పాఠశాలను మంజూరు చేయించామని, జడ్చర్ల మండలం చిట్టెబోయిన్పల్లి వద్ద ట్రిపుల్ ఐటీ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 612 క్వింటాళ్ల వేరుశనగ రాక గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవ సాయ మార్కెట్ యార్డుకు మంగళవారం 612 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.7,819, కని ష్టంగా రూ.3,549, సరాసరిగా రూ.5,700 ధరలు లభించాయి. అలాగే 5 క్వింటాళ్ల వరి (సోన) క్వింటాల్ రూ.2,567ధర పలికింది. జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్లో మంగళవారం క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. ధాన్యం ఆర్ఎన్ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,626, కనిష్టంగా రూ.2,001 ధరలు లభించాయి. అలాగే మొక్కజొన్న క్వింటా గరిష్టంగా రూ.2,222, కనిష్టంగా రూ.2,177 ధరలు పలికాయి. -
వేల సంఖ్యలో సంచారం..
జిల్లాకేంద్రంలోని కాలనీలు, రోడ్డు మార్గంలో వెళ్తున్న వాహనదారులు, మనుషులపై వీధికుక్కలు విచ్చలవిడిగా దాడులు చేస్తున్నాయి. దీంతో మున్సిపల్ అధికారులు వీధికుక్కలను నిలువరించేందుకు 8 మంది సిబ్బందిని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో శివారు ప్రాంతాలు, కాలనీలు, ప్రధాన రహదారుల వెంట తిరుగుతున్న 60 వీధికుక్కలను గుర్తించి వాటిని పశు సంవర్ధకశాఖ అధికారులకు అప్పగించారు. అయితే జిల్లాకేంద్రంలో వేల సంఖ్యలో కుక్కలు ఉన్నట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. వేల సంఖ్యలో కుక్కలు ఉండగా.. నామమాత్రంగా చర్యలు తీసుకుంటుండటంతో పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడటం లేదు. -
‘మిగులు’తో సర్దుబాటు..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ సబ్జెక్ట్లకు సంబంధించి ఉపాధ్యాయుల కొరతను అధిగమించేలా సర్కారు చర్యలకు ఉపక్రమించింది. ఆయా స్కూళ్లలో మిగులు (సర్ప్లస్) ఉన్న ఉపాధ్యాయులను కొరత ఉన్న చోట్ల సర్దుబాటు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది 20 నాటికి ప్రభుత్వ బడుల్లో చేరిన విద్యార్థుల సంఖ్య.. 2021లో జారీ చేసిన జీఓ నంబర్ 25 ఆధారంగా సర్దుబాటు చేపట్టేలా మార్గదర్శకాలు విడుదల చేసింది. కేవలం ఆయా జిల్లాల పరిధిలో కలెక్టర్ల (చైర్మన్లు) అనుమతితో మాత్రమే డిప్యూటేషన్ల తంతు చేపట్టనున్నారు. సుమారు 650 మందికి.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2,225 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. ఇందులో 1.90 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇప్పటివరకు జీరో ఎన్రోల్మెంట్ కారణంగా మూతపడిన సర్కారు పాఠశాలలు 135 ఉన్నాయి. సర్దుబాటులో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 650 మంది ఉపాధ్యాయులను డిప్యూటేషన్లపై ఆయా పాఠశాలల్లో సర్దుబాటు చేసే అవకాశం ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘాలు అంచనా వేస్తున్నాయి. జూనియర్లను సర్దుబాటుపై బదిలీ చేయాలని.. ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ విరమణకు దగ్గర ఉన్న ఉపాధ్యాయులకు సర్దుబాటు నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. పలు సబ్జెక్ట్ టీచర్ల కొరతే అసలు సమస్య.. ప్రతి సంవత్సరం ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందడం, బదిలీలు, పదోన్నతుల మూలంగా చాలా హైస్కూళ్లలో పలు సబ్జెక్ట్లను బోధించే ఉపాధ్యాయుల కొరత వేధిస్త్తోంది. ప్రాథమిక (ప్రైమరీ) పాఠశాలల్లో అన్ని సబ్జెక్ట్లను ఒకే ఉపాధ్యాయుడు బోధించే వెసులుబాటు ఉన్నప్పటికీ.. ఉన్నత (హైస్కూల్) పాఠశాలల స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరం 130 పాథమిక పాఠశాలలు మూతపడగా.. ఆయా ఉపాధ్యాయులను అవసరం ఉన్న చోట హైస్కూళ్లకు బదిలీ చేస్తున్నారు. అయితే ఇంగ్లిష్, హిందీ, తెలుగు వంటి లాంగ్వేజెస్ బోధించే ఉపాధ్యాయుల కొరత పీడిస్తోంది. దీంతో చాలా పాఠశాలల్లో అనివార్యంగా ఆయా సబ్జెక్ట్లను బోధిస్తున్న టీచర్లతోపాటు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా కొన్నేళ్లుగా రెగ్యులర్ నియామకాలు చేపట్టకపోవడంతో అధిక సంఖ్యలో ఖాళీలు ఏర్పడగా.. హైస్కూళ్లలో సమస్యగా మారింది. శాశ్వత పరిష్కారం చూపించాలి.. ఉమ్మడి జిల్లాలోని పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం.. కొన్నింటిలో తగ్గడం వంటి కారణాల చేత సర్దుబాటు చేయడం తప్పని సరిగా మారింది. అయితే ప్రతి సంవత్సరం సర్దుబాటు చేస్తున్న పలు పాఠశాలలు మూతబడుతున్నాయని, హైస్కూల్ స్థాయిలో సబ్జెక్ట్లు బోధించే ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోందని.. శాశ్వతంగా ఈ సమస్యను పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. జోగుళాంబ గద్వాల 10 నాగర్కర్నూల్ 0 ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్లకు డిప్యూటేషన్లు ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకే అవకాశం.. జిల్లా పరిధిలో కలెక్టర్ల అనుమతితో మాత్రమే తాత్కాలిక బదిలీ జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలు ఈ సారి ఒక్కటీ తెరుచుకోనట్లే.. ఉమ్మడి జిల్లాలో ప్రశ్నార్థకంగా 135 స్కూళ్ల భవితవ్యం ప్రశ్నార్థకంగా 135 స్కూళ్లు.. ఉమ్మడి జిల్లాలో జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలకు సంబంధించి గత సంవత్సరం డిప్యూటేషన్పై వేరే పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయులు ఈ విద్యాసంవత్సరంలో తిరిగి ఆయా స్కూళ్లకు రాలేదు. దీంతో ఆయా పాఠశాలల్లో ఈ సంవత్సరం ఒక్క అడ్మిషన్ కూడా కాలేదు. బడిబాట కార్యక్రమం నిర్వహించి ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా.. ఆయా ఉపాధ్యాయులు, ఎంఈఓలు దృష్టి పెట్టకపోవడంతో 135 పాఠశాలల్లో ఒక్కటి కూడా తిరిగి తెరుచుకోలేదు. ఈ నేపథ్యంలో ఆయా స్కూళ్ల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. -
వరుసబెట్టి.. కరిచేస్తున్నాయి
● జిల్లాలో పెరుగుతున్న కుక్కకాటు కేసులు ● గడిచిన మూడు నెలల్లో 429 మందిపై దాడి ● తాజాగా జమ్మిచేడ్లో 10 మందిపై దాడి ● ఆరుబయటకు రావాలంటేనే జంకుతున్న జనం ● పూర్తిస్థాయిలో నిలువరించలేకపోతున్న అధికారుల కట్టడి చర్యలు గద్వాల క్రైం: జిల్లాలో వీధికుక్కలు చెలరేగిపోతున్నాయి. ఆరుబయట కనబడిన వారిపైనల్లా అమాంతం ఎగబడి దాడులు చేస్తున్నాయి. ఇంటి ఆవరణ.. రోడ్డు మార్గంలో.. వీధుల్లో ఎక్కడ చూసినా వీధి కుక్కల బెడద తప్పడం లేదు. జిల్లాలో గత కొన్ని రోజులుగా కుక్కలు మనుషులపై దాడులు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. విచక్షణారహితంగా కరిచే కుక్క కాటుతో వచ్చే (రేబిస్ వ్యాధితో మరణం) ప్రమాదాన్ని గుర్తెరిగి ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. తాజాగా మంగళవారం ఉదయం జమ్మిచేడ్ కాలనీలో ఓ పిచ్చి కుక్క కనిపించిన వారిపైనల్లా విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ దాడిలో 10 మందికిపైగా తీవ్ర రక్తగాయాల పాలైన సంఘటన తీవ్ర కలకలం రేపింది. గడిచిన మూడు నెలల వ్యవధిలో 429 మందికిపైగా కుక్కలు దాడులు చేశాయి. మరోవైపు గద్వాల మున్సిపల్ అధికారులు వీధికుక్కలను నిలువరించేందుకు 8 మంది సిబ్బందిని ఏర్పాటు చేసి 60 కుక్కలను కట్టడి చేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. -
128వ రోజుకు చేరిన నిరసన దీక్షలు
గట్టు: మండల పరిధిలో కొత్తగా నిర్మిస్తున్న భారత్మాల రోడ్డుకు మండలానికి కనెక్టివిటీ కల్పించే అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, రాయాపురం స్టేజీ డబుల్ రోడ్డును మూసివేయకుండా వంతెన నిర్మాణం చేపట్టాలని గట్టు, రాయాపురం, ఆలూరు, తుమ్మలచెరువు గ్రామస్తులు నిరసన దీక్షలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు రాముడు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలు మంగళవారం నాటికి 128వ రోజుకు చేరుకుంది. రవాణా సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్న గట్టు మండలంలో భారత్మాల రోడ్డు నిర్మాణం ఈ ప్రాంతవాసులకు కొత్త ఆశలను చిగురింపజేసినట్లు తెలిపారు. అయితే రోడ్డుకు ఇరువైపులా ప్రహరీ నిర్మిస్తుండటం వల్ల ఈ ప్రాంత ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారన్నారు. దీంతో మండల ప్రజలు నిరసన దీక్షలకు పూనుకున్నారని చెప్పారు. భారత్మాల రోడ్డుకు గట్టు మండలానికి కనెక్టివిటీ ఇచ్చే అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, రాయాపురం స్టేజీ దగ్గరున్న డబుల్ రోడ్డును మూసివేసి.. రాకపోకలు లేని పాత ఆలూరు రోడ్డు మార్గంలో వంతెనను తక్కువ ఎత్తులో నిర్మించడం ద్వారా భారీ వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందన్నారు. దీనికి తోడు రోడ్డు మలుపు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆరోపించారు. జాతీయ రహదారి నిర్మాణ సంస్థ, కాంట్రాక్టర్, కేంద్ర ప్రభుత్వం స్పందించి గట్టు మండలానికి కనెక్టివిటీ ఇవ్వడంతోపాటు నూతనంగా వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహదేవప్ప, అమ్మన్న, వీరేష్, వెంకటన్న, తిమ్మప్ప, కృష్ణయ్య, సాలెకర్రెప్ప, జనార్దన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేయాలి
ఎర్రవల్లి: ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేస్తేనే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. ఎర్రవల్లిలోని పదవ బెటాలియన్ పోలీస్ సెమినార్ హాల్లో మంగళవారం జ్ఞానదీప్తి పేరుతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలకు నిర్వహించిన పాఠశాలల ప్రారంభ మార్గదర్శక శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. విద్యాశాఖకు సంబంధించిన 32 పారా మీటర్స్లో మన జిల్లా మంచి ర్యాంకింగ్ సాధించేలా ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో తమ విధులను నిర్వర్తించాలన్నారు. యూడైస్ అప్డేట్ పక్కాగా ఉండాలని, ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఇటీవలే విద్యా శాఖాధికారులతో కలిసి ఆయన ఫిన్లాండ్ దేశంలో పర్యటించి, అక్కడి విద్యా వ్యవస్థను అద్యయనం చేయడం జరిగిందని, కొన్ని అంశాలను మన వద్ద కూడా అమలు చేసి మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎంఈఓలు తమ పరిధిలోని పాఠశాలలను ప్రతినెలా 15లోగా సందర్శించి నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ఉపాధ్యాయులు లీవ్ లెటర్ ఇవ్వకుండా పాఠశాలలకు గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందన్నారు. పోషణ్ యాప్లో ఎప్పటికప్పుడు వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు. ప్రత్యేక పునశ్చరణ తరగతుల ద్వారా చదువులో వెనకబడిన విద్యార్థులు మెరుగుపడేందుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా పీపీటీ ద్వారా మాస్టర్ ట్రైనర్ అగస్టీన్ వివిధ అంశాలపై ఎంఈఓలు, హెచ్ఎంలకు సమగ్రంగా శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో శిక్షణ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్కుమార్రెడ్డి, రాజ్కుమార్, డీఈఓ విజయలక్ష్మి, కమాండెంట్ జయరాజు, అసిస్టెంట్ కమాండెంట్ పాణి,సెక్టోరియల్ అధికారులు, ఎంఈఓలు, హెచ్ఎంలు పాల్గొన్నారు. -
భయం వేసింది..
ఉదయం ఆరుబయట నిలబడి ఉన్నాను. అయితే ఓ కుక్క అకస్మాత్తుగా వచ్చి ఒక్కసారిగా ఎగబడి దాడి చేసింది. ఈ ఘటనలో మెడ, చేయి, కాలు ఇతర శరీర భాగాలకు తీవ్రగాయాలయ్యాయి. తప్పించునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. కేకలు వేయడంతో స్థానికులు, కుటుంబ సభ్యుల వచ్చి కుక్కను తరిమేయడంతో బటయ పడ్డాను. వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఒక్కసారిగా చనిపోతానేమోననే భయం వేసింది. వీధికుక్కల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలి. – ఈశ్వర్, కుక్కకాటు బాధితుడు, జమ్మిచేడ్కాలనీ, గద్వాల ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి.. నల్లకుంట, రాజీవ్మా ర్గ్ కాలనీల్లోని రహదారులపై వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నా యి. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభమయ్యా యి. రహదారుల వెంట పిల్లలు పాఠశాలలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో కుక్కలు దాడులకు పాల్పడే ప్రమాదం ఉంది. బైక్లపై వెళ్లే వారిని వెంబడించి కరుస్తున్నాయి. కుక్కలు పట్టేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆశించిన ఫలితం లేదు. కాలనీలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వాటి బెడద నుంచి కాపాడాలి. – నందకిషోర్, నల్లకుంట కాలనీ, గద్వాల మూడు శాఖల ఆధ్వర్యంలో.. పట్టణంలో వీధికుక్కల నియంత్రణకు ఇప్పటికే చర్యలు చేపట్టాం. వివి ధ వార్డులలో తిరుగుతున్న 60 కుక్కలను పట్టుకుని పశు సంవర్ధక శాఖ అధికారులకు అప్పగించాం. అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి కుక్కలను పట్టుకునేలా చర్యలు తీసుకుంటాం. వీలైనంత త్వరగా వాటిని కట్టడి చేస్తాం. గాయపడిన వారికి యాంటీ రేబిస్ టీకాలు, వైద్య సేవలు అందిస్తున్నాం. వైద్య, పశు సంవర్ధక, మున్సిపల్ శాఖల సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నాం. – జానకిరాంసాగర్, మున్సిపల్ కమిషనర్, గద్వాల -
కసరత్తు చేపట్టాం..
జిల్లా కేంద్రంలో పెరుగుతున్న జనాభా, నేరాల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖ వినూత్న చర్యలు తీసుకుంది. పట్టణ పోలీసు స్టేషన్లో ముగ్గురు ఎస్ఐలు విధులు నిర్వహిస్తుండగా.. వారికి ఒక్కో సెక్టార్ను కేటాయించాం. వారు నిరంతరం ఆయా సెక్టార్లపై నిఘా ఉంచి, బాధితులకు సత్వర న్యాయం చేసేలా కృషి చేస్తారు. వీరిని ఎస్హెచ్ఓ మానిటరింగ్ చేస్తూ.. అవసరమైన సలహాలు ఇస్తుంటారు. ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జిల్లాలో నేరాల నియంత్రణకు కృషి చేస్తాం. – మొగిలయ్య, డీఎస్పీ, గద్వాల -
బాల్యం గాడి తప్పుతోంది!
నేరాలకు ఒడిగడుతున్న మైనర్లు –8లో uగద్వాల క్రైం: తెలిసి తెలియని యుక్త వయస్సు.. స్మార్ట్ఫోన్లు, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్, డ్రగ్స్కు బానిసలై కొందరు మైనర్లు దారి తప్పుతున్నారు. బాల్యంలోనే దురలవాట్లు, దొంగతనాలు, హింసాత్మక ఘటనలకు పాల్పడి బాల నేరస్తులుగా పోలీసుల రికార్డులోకి ఎక్కుతున్నారు. బంగారు భవిష్యత్ ఉన్న చిన్నారులు జోగుళాంబ గద్వాల జిల్లాలో మద్యం, గంజాయి, అత్యాచారాలు, పొగ తాగడం వంటి జల్సాలకు అలవాటు పడుతున్నారు. ఇటీవల ఓ దొంగతనం కేసులో పట్టుబడిన మైనర్ బాలుడిని పోలీసులు జువైనల్ స్టేట్ హోంకు తరలించారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. చేజారి పోతున్నారు.. జిల్లా కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని పలువురు మైనర్లు చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. కొందరు మద్యానికి మరి కొందరు పొగతాగడం, గంజాయి పీలుస్తున్నారు. వ్యసనాలకు డబ్బులు లేకపోవడంతో దొంగతనాలను ప్రవృత్తిగా ఎంచుకుంటున్నారు. స్మార్ట్ఫోన్లకు బానిసలై ఇంట్లో ఎవరూ లేని సమయంలో అశ్లీల వీడియోలను చూస్తూ విచక్షణ కోల్పోయి రోడ్డుపై వెళ్తున్న మహిళల్ని వేధిస్తున్నారనే ఫిర్యాదులు అందుతున్నాయి. కాలనీల్లోని ఇతర మైనర్లతో దురుసుగా వ్యవహరించడం వంటి ఘటనలు ఉన్నాయి. పిల్లల నడవడిక విషయంలో తల్లిదండ్రులు నిత్యం గమనించాలి. స్నేహితుల్లో చెడు వ్యసనాలు కలిగిన ఒక్కరున్నా వారి ప్రభావం ఇతర చిన్నారులపై పడుతుంది. గంజాయి కేసులు సైతం నమోదయ్యాయి. వారికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి చెడు వ్యసనాల నుంచి విముక్తి కల్పించేలా కృషి చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు కొన్నాళ్లకు మళ్లీ అదే దారిలోకి వెళ్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డబ్బుల కోసం దొంగతనాలు అత్యాచార కేసుల్లోనూ నిందితులుగా.. గంజాయి, డ్రగ్స్ కోరల్లో చిక్కుతున్న వైనం తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం ఓ కారణమే.. జిల్లా కేంద్రానికి చెందిన ఓ మైనర్ బాలుడు జల్సాలకు అలవాటు పడి, దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. నూతన గృహా నిర్మాణాలకు యజమానులు తెచ్చిన విలువైన విద్యుత్ వైర్లను అపహరించి వాటిని బయటి మార్కెట్లో తక్కువ ధరకు విక్రయించగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేయడం అలవాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో 2025 లో దొంగతనం చేస్తూ కాలనీవాసులకు పట్టుబడగా.. వారు పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారించిన క్రమంలో మైనర్ బాలుడు తండ్రి ఓ పోలీసు కావడంతో మందలించి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. ఇతడితో పాటు మరికొంత మంది మైనర్లు ఉండడం కొసమెరుపు. జూన్ 10, 2026లో చేనుగోనిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు జిల్లా కేంద్రంలోని ఓ ఇంట్లో బంగారు, వెండి ఆభరణాలు, నగదును అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే పోలీసులు ఇద్దరిని అరెస్టు చేయగా.. అందులో ఒకరు మైనర్గా ఉన్నాడు. దీంతో పోలీసులు బాల నేరస్తుడిని జువైనల్ స్టేట్ హోంకు తరలించారు. అతడు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న క్రమంలో దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఇదే తరహాలో వారం రోజుల క్రితం ఓ మైనర్ బాలుడు పట్టణ శివారుల్లోని చిరు దుకాణంలో చోరీలకు పాల్పడ్డాడు. కాలనీవాసులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. 2025లో జిల్లా కేంద్రానికి చెందిన కొందరు గుర్తుతెలియని యువకులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పలు ద్విచక్ర వాహనలను ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో బాధితుల ఫిర్యాదు మేరకు ముమ్మరంగా గాలించిన పోలీసులు చోరీలకు పాల్పడిన 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు మైనర్లుగా పోలీసులు గుర్తించారు. మరి కొందరు గంజాయికి అలవాటు పడ్డారు. నెల క్రితం ఓ మైనర్ బాలుడు అత్యాచార కేసులో పోలీసులకు పట్టుబడగా.. పోలీసులు జువైనల్ స్టేట్ హోంకు తరలించారు. ఏడాది కాలంగా జిల్లాలో 20 మందికి పైగా మైనర్లు వివిధ కేసుల్లో పాలుపంచుకోవడం ఆందోళన కలిగిస్తోంది. -
చెరువుల్లో దళారుల పాగా
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మత్స్యకారుల జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదు. మార్కెటింగ్ కష్టాలు, అందని ఉచిత చేపవిత్తనా లు, బయట మార్కెట్లలో చేప విత్తనాల ధరల పెంపుతో నిస్సహాయ స్థితిలో దళారులను ఆశ్రయించే పరిస్థితి నెలకొంది. మత్స్యకారుల అవసరాలను ఆసరా చేసుకొని దళారులు చెరువుల్లో పాగా వేస్తున్నారు. వేలం పాటల్లో చెరువులు దక్కించుకొని తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క చేపల మార్కెట్ కూడా లేకపోవడంతో అమ్ముకోలేని దీనస్థితిలో మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. సౌకర్యాల లేమితో రోడ్లపై చేపల విక్రయాలు చేస్తున్నా ప్రభుత్వాలు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యక్తే మత్స్య శాఖ మంత్రిగా ఉన్నా ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. స్టోరేజీ, మార్కెట్లు ఏవి? జిల్లాలో ఉత్పత్తి అవుతున్న చేపలను అమ్ముకునేందుకు మార్కెట్లు, నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీలు లేక మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెటింగ్ కష్టాలను ఎదుర్కోలేని మత్స్యకారులు దళారులను ఆశ్రయించి చెరువులను వేలం ద్వారా విక్రయించడం జిల్లాలోని చాలా గ్రామాల్లో కనిపిస్తుంది. మహబూబ్నగర్, జడ్చర్ల పట్టణాల్లో గతంలో ఉన్న చేపల మార్కెట్లను తొలగించి.. వాటి స్థానంలో మున్సిపాలిటీల ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నా.. అవేమీ అందుబాటులోకి రాలేదు. అలాగే భూత్పూర్ మున్సిపాలిటీ సమీపంలో చేపల మార్కెట్కు ప్రభుత్వం 5 గుంటల భూమిని గతంలోనే కేటాయించగా.. నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేసింది. అయితే ఈ స్థలం అనువైనదిగా లేకపోవడంతో నిర్మాణ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఆయా పట్టణాల్లో చౌరస్తాలు, పలు కూడళ్లలో మత్స్యకారులు చేపల విక్రయాలు చేస్తున్నారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు పంపిణీ చేయాల్సిన చేప విత్తనాలు 1.92 కోట్లు మొత్తం సభ్యులు 13,066 కోయిల్సాగర్ ప్రాజెక్టుతోపాటు చెరువులు, కుంటలు 910 242 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు మొత్తం సభ్యులు 817 22 పంపిణీ చేసిన చేప విత్తనాలు 66,925 జిల్లా పరిధిలో ఇలా.. మత్స్యకారుల బలహీనతను ఆసరాగా చేసుకొని యథేచ్ఛగా వ్యాపారం కొందరు అధికారుల సహకారంతో వేలం ద్వారా చెరువుల లీజు జిల్లాలో మార్కెట్లు లేకపోవడమూ శాపంగా మారిన వైనం తీవ్రంగా నష్టపోతున్న అర్హులైన మత్స్యకారులు మరోవైపు చేప విత్తనాల పంపిణీలోనూ లక్ష్యాన్ని కుదిస్తున్న ప్రభుత్వం ఇబ్బందులు వాస్తవమే.. జిల్లాలో చేపల విక్రయానికి ఇబ్బందులున్నది వాస్తవమే. మహబూబ్నగర్, జడ్చర్ల పట్టణాల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాల నిర్మాణం కొనసాగుతోంది. వాటి నిర్మాణం పూర్తయ్యాక చేపల మార్కెట్కు కొంత భాగం కేటాయిస్తారు. భూత్పూర్ మున్సిపాలిటీలో చేపల మార్కెట్ నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరయ్యాయి. సరైన స్థలం లేకపోవడంతో నిర్మాణ పనులు నిలిచాయి. త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. – రాధారోహిణి, జిల్లా మత్స్యశాఖ అధికారి -
కొనసాగుతున్న నిరసన దీక్షలు
గట్టు: రాయాపురం స్టేజీ డబుల్ రోడ్డు వద్ద వంతెన నిర్మాణం చేపట్టాలని, భారత్మాల రోడ్డు నుంచి గట్టు మండలానికి కనెక్టివటీ ఇచ్చే అఫ్రోచ్ రోడ్డు నిర్మించాలని గట్టు, రాయాపురం, ఆలూరు, తుమ్మలచెరువు గ్రామస్తులు డిమాండ్ చేశారు. పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు రాముడు ఆధ్వర్యంలో నాలుగు గ్రామాల ప్రజలు చేపట్టిన రిలే నిరసన దీక్షలు ఆది వారం నాటికి 126వ రోజుకు చేరుకున్నాయి. రా యాపురం స్టేజీ వద్ద డబుల్ రోడ్డు మూసివేసి, రాకపోకలు లేని పాత ఆలూరు రోడ్డులో తక్కువ ఎత్తు లో వంతెన నిర్మాణం సాగించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు ఆరోపించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, భారీ వాహానాలు ఈ వంతెన ద్వారా రాకపోకలను సాగించే అవకాశం లేదన్నారు. రవాణా సౌకర్యాలు తక్కువగా ఉన్న గట్టు మండలంలో ఆరు వరుసల జాతీయ రహదారికి కనెక్టివిటీ ఏర్పాటు చేస్తే, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కార్యక్రమంలో మహాదేవప్ప, అమ్మన్న, వీరేష్, వెంకటన్న, తిమ్మప్ప, కృష్ణయ్య, సాలె కర్రెప్ప, జనార్దన్, సుధాకర్ పాల్గొన్నారు. రాయాపురం స్టేజీ వద్ద ఆందోళన చేస్తున్న ప్రజలు -
వాటాదారులకు మెరుగైన సేవలు
స్టేషన్ మహబూబ్నగర్: ది పాలమూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ వాటాదారులు, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు బ్యాంక్ చైర్మన్ కండె కుమారస్వామి అన్నారు. ది పాలమూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ 28వ సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. బ్యాంక్ చైర్మన్ కుమారస్వామి మాట్లాడుతూ 2025–26 ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్ రూ.1,29,68,995 లాభాలు ఆర్జించిందని చెప్పా రు. ఇందులో వాటాదారులకు 25 శాతం డివిడెండ్ ఇవ్వాలని నిర్ణయించామని సీనియర్ వైస్ చైర్మన్ గుండ్ల కృష్ణయ్య ప్రకటించారు. తెలంగాణలో 25 శాతం డివిడెండ్ ఇస్తున్న ఏకై క కోఆపరేటివ్ బ్యాంక్ మనదేనని పేర్కొన్నారు. సీఓఈ రాచూరి రాజేంద్రకుమార్ 2025–26 సంవత్సరానికిగాను జమ అయిన ఖర్చుల వివరాలను సమా వేశంలో వివరించగా సభ్యులందరూ ఆమోదం తెలిపారు. 28 ఏళ్ల తర్వాత బ్యాంక్ సొంత భవన నిర్మాణానికి స్థలం కొనుగోలు చేయనున్నామని, అలాగే 2026– 27 ఆర్థిక సంవత్సరంలో మరో నూతన శాఖను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు డైరెక్టర్లు వెల్లడించారు. సమావేశంలో బ్యాంక్ వైస్ చైర్మన్ కలకొండ సూర్యనారాయణ, డైరెక్టర్లు పుల్లా శ్రీనివాసులు, గుండా వెంకటేశ్వర్లు, రాగిరి తిరుపతయ్య, ఎదిర తమ్మయ్య, కల్వ కన్నయ్యశెట్టి, నీల సంగమేశ్వర్, హకీమ్ విశ్వప్రసాద్, దామరగిద్ద జ్యోతి, బ్యాంక్ మేనేజర్ జనుంపల్లి రమేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
తల్లిదండ్రుల నిర్లక్ష్యమే..
పిల్లలు యుక్త వయస్సుకు వచ్చే సమయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. వారితో ఎక్కవ సమయం గడుపుతూ.. మంచి, చెడు విషయాల గురించి చర్చించాలి. చదువుకుంటే సమాజంలో వారికుండే గౌరవం, భవిష్యత్ గురించి వివరించాలి. చదువు పేరుతో వారిపై ఒత్తిడి చేయకుండా స్నేహపూర్వకంగా మెలిగి సరైన సూచనలు ఇవ్వాలి. తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి గురైన పిల్లలే ఎక్కువగా నేరాల బాట పడుతున్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలల్లో నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. తప్పులు ఎవరూ చేసినా పోలీస్ శాఖ కఠినంగానే వ్యవహరిస్తుంది. మైనర్లకు ఎలాంటి మినహాయింపులు ఉండవు. – శ్రీనివాసరావు, ఎస్పీ ● -
యోగాతో మానసిక ఒత్తిడి దూరం
గద్వాల క్రైం: మానసిక ఒత్తిడి.. నిలకడ లేని ఆలోచనల నుంచి విజయం సాధించాలంటే యోగాతో నే సాధ్యమవుతుందని ఎస్పీ శ్రీనివాసరావు అన్నా రు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవా న్ని పోలీసు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ తీవ్రమైన వేదన, చిరా కు, ఒత్తిళ్లు, ఆందోళనతో కుంగిపోతున్నారన్నారు. స్థిరత్వం లేని ఆలోచనలు, క్షణికావేశంతో చేస్తున్న పొరపాట్లతో ఇబ్బందులకు గురవతున్నారని పేర్కొన్నారు. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే ప్రతి రోజు యోగా చేసేందుకు కొద్ది సమయం కేటాయించాలని సూచించారు. దీంతో మానసిక ప్రశాంతత, ఆనందం, సమయానుకూలంగా తీసు కోవాల్సిన నిర్ణయాలు, చేస్తున్న పనుల్లో సంతోషం ఉంటుందన్నారు. యోగా చేసేందుకు ఎలాంటి వ యో పరిమితి లేదని, ఎవరైనా సాధన చేయొచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య, సీఐ శ్రీను, సిబ్బంది ఉన్నారు. -
పేదల సొంతింటి కల సాకారం
మల్దకల్/కేటీదొడ్డి: పేదలకు సొంతింటి కలను నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ఆదివారం మల్దకల్ మండలంలోని నీలిపల్లి, కేటీదొడ్డి మండలంలోని ఈర్లబండ గ్రామంలో నూతనంగా నిర్మించుకున్న ఇందిర మ్మ గృహ ప్రవేశాలకు ముఖ్య అతి థిగా హాజరై ప్రారంభించారు. ఇల్లు ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. అర్హులైన పేదలందరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గద్వాల నియోజకవర్గంలో మొదటి విడతలో 3500 ఇళ్లు మంజూరు కాగా.. 2 వేల ఇళ్లు వివిధ ద శల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, త్వర లో వాటి పనులు పూర్తి చేసుకుని గృహ ప్రవేశం చేసుకోనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కానీ వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రెండో విడతలో అర్హు లందరికీ కేటాయిస్తామన్నారు. మల్దకల్ మండలంలోని దాసరపల్లిలో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అనంతరం గ్రామ దేవత అయిన సవారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజారెడ్డి, చక్రధర్రెడ్డి, విష్ణు, ప్రవీణ్, ఆంజనేయులు, ఏలేష్, శేఖర్రెడ్డి, మధురెడ్డి, పరశురాముడు, భరత్రెడ్డి, అమరేష్, గోపాల్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జూరాలకు నిలిచిన వరద
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో పూర్తిగా తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. స్థానికంగా కురిసిన వర్షాలతో 15 రోజులుగా స్వల్పంగా వస్తున్న ఇన్ఫ్లో ఆదివారం పూర్తి గా తగ్గింది. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో రెండు పంపులతో పంపింగ్ చేస్తుండగా.. ఒక పంపును నిలిపేసి కేవలం ఒక పంపు ద్వారా నీటి పంపింగ్ చేస్తున్నట్లు పీజేపీ అధికారులు పేర్కొన్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 749 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 41 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 569 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–2 ద్వారా 873 క్యూసెక్కులు, ఇతర అవసరాలకు 537 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 740 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 2,951 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 3.061 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. -
కేజీబీవీల్లో బోధన మెరుగుపర్చాలి
మల్దకల్: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి విద్యాభివృద్ధికి కృషిచేయాలని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు ఉపాధ్యాయులకు సూచించారు. శనివారం మల్దకల్లోని కేజీబీవీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించడంతోపాటు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల సామర్థ్యాలను నిరంతరం పర్యవేక్షిస్తూ వారికి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి విజయలక్ష్మి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నిబంధనల మేరకు పనిచేయండి అయిజ: వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది నిబంధనల మేరకు పనిచేయాలని, ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. మండలంలోని వేణిసోంపురంలో ఈజీఎస్ పనులను పరిశీలించారు. ఈజీఎస్ కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలకు చేరుకొని మధ్యాహ్న భోజనం పరిశీలించారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజలతో మాట్లాడారు. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన కూరగాయల విత్తనాలను సాగుచేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ శంకరమ్మ, ఎంపీడీఓ భాస్కర్, ఎంపీఓ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
జోగుళాంబ గద్వాల
పాలమూరు: ఆడపిల్లలను పదో తరగతి వరకు చదివించడమే గగణమైన ఆ రోజుల్లో మా నాన్న.. భవిష్యత్లో పిల్లలకు చదువు ఎంత అవసరమో ముందే గ్రహించాడు. ఉన్నత చదువుతో మంచి ఉద్యోగాలు వస్తాయనే నమ్మకంతోనే మా ముగ్గురిని కష్టపడి చదివించారని చెబుతోంది మహబూబ్నగర్ ఎస్పీ డి.జానకి. మాది నల్లగొండ జిల్లా కోదాడ పట్టణం. దిగువ మధ్య తరగతి కుటుంబం కాగా.. నాన్న పాండు, అమ్మ ఉషకు మేం ముగ్గురం సంతానం (ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి). మా చిన్నతనం నుంచి నాన్న ఒక్కరే కష్టపడేవారు. మాకు ఊళ్లో కనీసం సెంటు భూమి కూడా లేకపోవడంతో నాన్న వ్యవసాయం కాకుండా కోదాడలో చికెన్ సెంటర్ నడిపేవారు. దీని ద్వారా వచ్చిన అరకొర ఆదాయంతో కొంత అద్దె చెల్లించడంతోపాటు మిగిలిన దాంట్లో సర్దుబాటు చేస్తూ ప్రణాళిక ప్రకారం కుటుంబాన్ని పోషిస్తూ మమల్ని చదివించారు. చిన్ననాటి నుంచి నాన్నకు ఒక విజన్ ఉండేది.. ఉన్నత చదువు వల్ల పిల్లల జీవితాలు బాగుంటాయని పదే పదే మాకు చెబుతూ బాగా చదవాలని ప్రోత్సహించారు. ఆయన మార్గదర్శకంలోనే నేను ఈ ఉద్యోగం సాధించగలిగాను. మా చెల్లి వైద్యురాలిగా స్థిరపడింది. మా అన్నయ్య ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇలా కుటుంబంలో ఉన్న ముగ్గురం ఉన్నత స్థాయికి చేరుకోవడం వెనుక మా తండ్రి కష్టం ఎంతో దాగి ఉంది. ఆదివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2026 -
ట్రాఫిక్ విధులు సమర్థవంతంగా నిర్వహించాలి
గద్వాల క్రైం: జిల్లాకేంద్రంలో ట్రాఫిక్ సమస్యల వల్ల ఎవరూ ఇబ్బందులు పడకుండా సిబ్బంది విధులు సమర్థవంతంగా నిర్వహించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా సందర్శించి మాట్లాడారు. ప్రధాన కూడళ్లలో నిత్యం వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతున్నారని, ఇలాంటి వారిని ట్రాఫిక్ సిబ్బంది కట్టడి చేయాలన్నారు. జరిమానాలు విధించడంతోపాటు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించాలన్నారు. మరోవైపు మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడిన క్రమంలో వారి తల్లిదండ్రులకు తెలియజేసి కౌన్సిలింగ్తోపాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ట్రాఫిక్ ఆర్ఎస్ఐ బాలచంద్రుడు ట్రాఫిక్ నియంత్రణకు చేపట్టిన చర్యలను ఎస్పీకి వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐ శ్రీను సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 993 క్వింటాళ్ల వేరుశనగ రాక గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం 993 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటా గరిష్టంగా రూ.7,599, కనిష్టంగా రూ.3,266, సరాసరిగా రూ.5,499 ధరలు లభించాయి. అలాగే క్వింటా ఆముదాలు రాగా రూ.5,819 ఒకే ధర పలికింది. జూరాలకు తగ్గిన ఇన్ఫ్లో ధరూరు/ రాజోళి: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో పూర్తిగా తగ్గినట్లు పీజేపీ అధికారులు చెప్పారు. శనివారం ప్రాజెక్టుకు కేవలం 547 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 1,500 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 43 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–2 ద్వారా 554 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 600 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 2,457 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.316 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ● సుంకేసుల డ్యాం నుంచి ఒక గేటు ద్వారా నీటిని దిగువకు విడుదల చేసినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. శనివారం ఎగువ నుంచి 1,500 క్యూపెక్కుల ఇన్ఫ్లో రాగా.. ఒక గేటను 30 మీటర్ల మేర ఎత్తి 1,140 క్యూసెక్కులను దిగువకు, కేసీ కెనాల్కు 1,290 క్యూసెక్కులు వదిలినట్లు ఆయన పేర్కొన్నారు. చేనేత కార్మికుల అభ్యున్నతికి తోడ్పడాలి గద్వాల న్యూటౌన్: జిల్లాలోని చేనేత కార్మికుల అభ్యున్నతికి తోడ్పాటు అందించాలని కౌన్సిలర్ రామలింగేశ్వర్ కాంళ్లే, చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ హ్యండ్లూమ్ ఏడీ ఇందిరను కోరారు. పలువురు చేనేత కార్మికులతో కలిసి శనివారం ఆమెను కార్యాలయంలో కలిశారు. చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగించే కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముద్ర రుణాలు అందించాలని విన్నవించారు. అలాగే నూతనంగా మగ్గాలు ఏర్పాటు చేసుకునే వారికి జియో ట్యాగ్ నంబర్లు సకాలంలో అందించాలని, గద్వాల హ్యాండ్లూమ్ పార్క్ను అభివృద్ధి చేయాలని కోరారు. అంతకు ముందు ఏడీని శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చేనేత కార్మికులు వెంకటేష్, జగన్, వీరేష్, రవి, వీరన్న తదితరులు పాల్గొన్నారు. -
భూసేకరణ ప్రక్రియ వేగిరం చేయాలి
కందనూలు: రాష్ట్రంలో సాగునీటి రంగ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నిర్మాణంలో ఎలాంటి జాప్యం లేకుండా భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పాలమూరు– రంగారెడ్డి, కేఎల్ఐ ఎత్తిపోతలు, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్తోపాటు నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల పరిధిలో కొనసాగుతున్న వివిధ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ తదితర అంశాలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులు, నియోజకవర్గాల వారీగా భూ సేకరణ పురోగతిని క్షుణ్ణంగా సమీక్షించారు. ఇప్పటి వరకు ఎంత భూమి సేకరించారు, ఎంత భూమి ప్రాథమిక నోటిఫికేషన్ దశలో ఉంది, ఎంత భూమి పీఎం స్థాయిలో ఉంది, ఎన్ని అవార్డులు ప్రకటించారు, ఎంత పరిహారం చెల్లించారు, ఇంకెన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయనే అంశాలపై అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి ఇటీవల జిల్లాలో నిర్వహించిన సమీక్షాలో సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారని గుర్తు చేశారు. ఈ దిశగా అధికారులు మరింత బాధ్యతతో పనిచేసి పెండింగ్లో ఉన్న సమస్యలను సెప్టెంబర్ 15లోగా పూర్తిస్థాయిలో పరిష్కరించాలని సూచించారు. పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి, డిండి వంటి ప్రాజెక్టులు పూర్తయితే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా భూగర్భ జలాల మట్టం పెరిగి వ్యవసాయ రంగానికి కొత్త ఊపు వస్తుందన్నారు. దశాబ్దాలుగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతుల ఆశలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. రైతులకు న్యాయమైన పరిహారం.. భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం న్యాయమైన పరిహారం అందించడమే కాకుండా వారి సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీలించాలని మంత్రి సూచించారు. రైతుల అభ్యంతరాలు, భూ వివాదాలు, పరిహారం చెల్లింపులకు సంబంధించిన అంశాలను ప్రత్యేకంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సహకారంతోనే ప్రాజెక్టులు పూర్తవుతాయని, అందుకే రైతుల విశ్వాసాన్ని పొందేలా అధికారులు వ్యవహరించాలన్నారు. ప్రతి 15 రోజులకోసారి పురోగతిని సమీక్షిస్తూ నిర్ణీత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ● రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల పూర్తితోనే వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని, నీటి లభ్యత, పంటల ఉత్పాదకత పెరిగి రైతుల ఆదాయం గణనీయంగా వృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో సాగునీటి ప్రాజెక్టుల పాత్ర అత్యంత కీలకం అని స్పష్టం చేశారు. ● ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ జిల్లాలో కొనసాగుతున్న ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే రైతాంగానికి శాశ్వత ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. సాగునీటి వనరులు పెరగడంతో వలసలు తగ్గి గ్రామీణ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు. ● నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల కలెక్టర్లు హేమంత కేశవ్ పాటిల్, ఆదర్శ్ సురభి, రిజ్వాన్బాషా షేక్ తమ తమ జిల్లాల పరిధిలో కొనసాగుతున్న భూ సేకరణ ప్రక్రియపై నివేదికలను అందజేశారు. ఇప్పటి వరకు జరిగిన భూసేకరణ, పరిహారం చెల్లింపులు, పెండింగ్లో ఉన్న కేసులు, కోర్టు వివాదాలు, రైతుల అభ్యంతరాలు తదితర అంశాలపై వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ 15లోగా పెండింగ్ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి, డిండి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష -
భూములు అమ్మి చదివించారు
‘‘తండ్రిని అయ్యాకే నాన్న అంటే ఏంటో తెలిసింది. రాత్రిళ్లు నిద్రలేక పిల్లల కోసం ఎదురుచూడటం.. వాళ్ల చిన్న చిరునవ్వు కోసం రోజంతా అలసటను మర్చిపోవడం.. ప్రతి అడుగులో వారి భవిష్యత్ గురించే ఆలోచించడం.. ఇవన్నీ అనుభవించిన తర్వాతే నా తండ్రి చేసిన త్యాగాల విలువ పూర్తిగా అర్థమైంది. పిల్లలకు ఆస్తులు కాదు.. విలువలు, ధైర్యం, మంచి వ్యక్తిత్వం ఇవ్వడమే ప్రతి తండ్రి నిజమైన విజయం. మా నాన్నకు ముగ్గురం పిల్లలం. నాకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. తనకు ఉన్న పదెకరాల భూమిని అమ్మి మమ్మల్ని చదివించారు. కూతుళ్లను భారం అనుకోలేదు.. భవిష్యత్ అనుకున్నారు. నాతోపాటు వారిని సైతం వైద్యవిద్య చదివించారు. మేం సంపాదించింది ఆస్తి కాదు.. విద్య. నేడు మా కుటుంబంలో అందరూ వైద్యులుగా సమాజానికి సేవ చేయడం వెనుక మా తల్లిదండ్రుల త్యాగమే అసలు కారణం. జీవితంలో మొదటి క్రమశిక్షణ ఇంట్లోనే మొదలవుతుంది. నిజాయితీగా జీవించడం.. మాట నిలబెట్టుకోవడం.. ఇతరులను గౌరవించడం వంటి విలువలను మా నాన్న చిన్నప్పటి నుంచే అలవాటు చేశారు. పోలీసు అధికారిగా నేను తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆ విలువల ప్రభావం కనిపిస్తుంది. ఆయన నేర్పిన విలువలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి.’’ అని నారాయణపేట ఎస్పీ డా.వినీత్ అన్నారు. తండ్రి గంగన్నతో నారాయణపేట ఎస్పీ డా.వినీత్ -
అన్నీ తానై.. నడిపించాడు
వెల్దండ: తమ పిల్లలకు నాన్నే సర్వస్వం. ఎన్నికష్టాలు ఎదురైనా.. అన్నీ తానై వారి భవిష్యత్కు బంగారు బాటలు వేస్తారు. ఈ క్రమంలోనే నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని పోచమగడ్డతండాకు చెందిన వడ్యావత్ ఉమాపతినాయక్ తన ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. పెద్ద కుమారుడు యశ్వంత్నాయక్ ఐఏఎస్ ఎంపికై ప్రస్తుతం చత్తీస్ఘడ్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. పిల్లలను ఉన్నత చదువులు చదివించగా.. తన నమ్మకాన్ని నిలబెట్టిన కుమారులను చూస్తే గర్వకారణంగా ఉందని తండ్రి ఉమాపతినాయక్ ‘సాక్షి’తో చెప్పారు. నమ్మకాన్ని నిలబెట్టుకున్నా: యశ్వంత్నాయక్, ఐఏఎస్ నాపై ఎంతో నమ్మకంతో ఉన్నత చదువులు చదివించారు. నా ఆశయ సాధనకు ఎంతో కృషి చేశారు. ఆయనే అన్నీ ముందుండి నడిపించారు. నా విజయానికి మూలం నాన్న. ఆయన చూపిన మార్గంలో క్రమశిక్షణ, విలువలతో కూడిన మార్గదర్శకత్వం, నిరంతర ప్రోత్సాహం నన్నెంతో ప్రభావితం చేశాయి. నన్ను ఈస్థాయిలో నిలబెట్టిన నాన్నకు తండ్రుల దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. తండ్రి చూపిన దారి, బిడ్డ సాధించిన విజయం, అదే కుటుంబ గౌరవం, సమాజానికి స్ఫూర్తిదాయకం. -
లోక్ అదాలత్లో 7,046 కేసులు పరిష్కారం
గద్వాల క్రైం: లోక్ అదాలత్లో వివాదాలను పరిష్కరించుకుంటే కక్షిదారుల్లో సోదరభావం పెంపొందడంతోపాటు సమయం, డబ్బు ఆదా అవుతుందని జిల్లా కోర్టు న్యాయమూర్తి రవికుమార్ అన్నారు. సుప్రీంకోర్టు అదేశాల మేరకు శనివారం గద్వాల కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించామని న్యాయమూర్తి తెలిపారు. ఏళ్ల తరబడి కేసులు పరిష్కారం చేసుకోకుంటే ప్రయోజనం లేదన్నారు. ప్రస్తుత సాంకేతిక విప్లవంలోనూ కేసుల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ఇరువర్గాలకు చెందిన కక్షిదారులు తమ విలువైన భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని కేసుల నుంచి విముక్తి పొందే దిశగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్లో 7,046 కేసులు పరిష్కరించినట్లు ఆయన పేర్కొన్నారు. క్రిమినల్, సివిల్, సైబర్ క్రైం, బ్యాంకు లిటిగేషన్, ప్రమాద తదితర పెండింగ్ కేసులలో ఇరువర్గాల వారికి రాజీ కుదిర్చినట్లు వెల్లడించారు. -
163 సెక్షన్ అమలు: ఎస్పీ
గద్వాల క్రైం: జిల్లాకేంద్రంలో ఆదివారం జరిగే నీట్ నేపథ్యంలో 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని నాలుగు కేంద్రాల్లో నీట్ కొనసాగుతుందని.. పరీక్ష ముగిసే వరకు కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలన్నారు. గుంపులు గుంపులుగా ఎవరైనా తిరిగితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. పరీక్ష రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పల్లీ క్వింటా రూ.7,659 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు శుక్రవారం 1,448 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 7,659, కనిష్టంగా రూ. 2,449, సరాసరి రూ. 6,399 ధరలుపలికాయి. జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. ధాన్యం ఆర్ఎన్ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ.2,708, కనిష్టంగా రూ.1,601 ధరలు లభించాయి. అలాగే మొక్కజొన్న క్వింటాకు గరిష్టంగా రూ.2086, కనిష్టంగా రూ.1,710 చొప్పున పలికాయి. టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి గద్వాలన్యూటౌన్: 2010 ఆగస్టు 23 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపుతో సేవా రక్షణ కల్పించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి గౌరిశెట్టి నాగరాజు కోరారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్కు వినతిపత్రం అందజేశారు. ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో టెట్ వర్తింపజేయడంతో దశాబ్దాలుగా సేవ చేస్తున్న లక్షలాది ఉపాధ్యాయుల భవిష్యత్ అభద్రతలో పడిందన్నారు. 2010 కంటే ముందు చేరిన ఉపా ధ్యాయులందరికీ టెట్ నుంచి శాశ్వత మినహాయింపు ఇవ్వడంతో పాటు సర్వీస్ సీనియార్టీ ప్రకారం పదోన్నతులు కల్పించాలన్నారు. ఈ మేరకు పార్లమెంట్ ద్వారా చట్ట సవరణ చేసి.. రాష్ట్రాలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో తపస్ నాయకులు మోహన్రెడ్డి, ఆంజనేయులు, రాఘవేంద్ర, శంకర్, మహేందర్, మల్లిఖార్జున్, శివప్రసాద్, ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. -
‘ఉపాధిహామీ’కి తూట్లు పొడుస్తున్న కేంద్రం
● వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పాన్గల్: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం రద్దుకు స్వస్తి పలికి పాత చట్టాన్నే కొనసాగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని రేమద్దులలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ పార్టీ ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం 90 శాతం పేదల పొట్ట నింపే ఉపాధిహామీ చట్టాన్ని నీరుగార్చేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఆ చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలో వీబీజీ రాంజీ చట్టాన్ని తీసుకొచ్చి బడ్జెట్ను తగ్గించి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనుందని.. దీంతో సామాన్య కూలీలు ఇబ్బందులకు గురవుతారని తెలిపారు. గతంలో ఉన్న పాత చట్టాన్నే కొనసాగిస్తూ పనిదినాలు 200 రోజులకు పెంచాలని, బయోమెట్రిక్ విధానం రద్దు చేసి ఉపాధి కూలి రూ.600కు పెంచాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచడంతో నిత్యావసరాల ధరలు అకాశాన్నంటుతున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్ అన్నారు. ఉపాధి కూలీలకు సక్రమంగా కూలి డబ్బులు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పని ప్రదేశంలో ఉపాధి కూలీల సమస్యలపై ఆరా తీశారు. ఈ నెల 20, 21, 22 తేదీల్లో మహబూబ్నగర్లో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం 4వ రాష్ట్ర మహాసభలకు జిల్లా నుంచి కార్మికులు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ నిరంజన్, కోదండరాములు, పార్టీ గ్రామ కార్యదర్శి వెంకటయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎం.వెంకటయ్య, రైతు సంఘం నాయకులు భాస్కర్, మల్లేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
యూనివర్సిటీకే రావాలి..
యూనివర్సిటీలో జాతీయ స్థాయి సెమినార్ నిర్వహిస్తున్నామని, దీనికి సీఎం రేవంత్రెడ్డి వస్తున్నారని అధికారులు మొదట తెలిపారు. దీంతో సీఎం సొంత జిల్లాలో ఉన్న యూనివర్సిటీకి వస్తే.. ఇక్కడ సమస్యలను పరిశీలించి నిధులు కేటాయిస్తారని అందరూ భావించారు. కానీ, సెమినార్ను హైదరాబాద్ శివారుకు మార్చడం బాధాకరం. సీఎం యూనివర్సిటీకే రావాలి.. ఇక్కడే సెమినార్ నిర్వహించాలి. అధిక నిధులు యూనివర్సిటీకి కేటాయించాలి. – తాయప్ప, బీసీ సంఘం పీయూ అధ్యక్షుడు గతంలో ప్రభుత్వాలు యూనివర్సిటీని పెద్దగా పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పీయూ నిర్వహించే నేషనల్ సెమినార్ను హైదరాబాద్ శివారుకు మార్చడంలో అధికారుల ఉద్దేశం ఏమిటి. ఇక్కడే సెమినార్ నిర్వహిస్తే యూనివర్సిటీకి సొంత జిల్లాలో సీఎం ఎక్కువ నిధులు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు వేదిక మార్పుపై పునరాలోచించాలి. – రవికిషోర్, పీయూ ఏబీవీపీ సెక్రెటరీ ● -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
కేటీదొడ్డి: ఎరువులు, విత్తన డీలర్లు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని డీఏఓ వీరప్ప హెచ్చరించారు. శుక్రవారం కేటీదొడ్డి మండలం కుచినెర్లలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విత్తన నిల్వల రికార్డులతో పాటు స్టాక్ బోర్డులో పొందుపరిచ్చిన వివరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫర్టిలైజర్ దుకాణాల్లో స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్లలో నమోదు చేయాలన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మాత్రమే విక్రయించాలని.. నకిలీ విత్తనాలు అంటగట్టి మోసంచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు నానో ఎరువుల వైపు మొగ్గు చూపాలని ఆయన సూచించారు. ప్రస్తుత కాలంలో రైతులు సాగు ఖర్చులను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డీఏఓ వెంట ఏఓ రాజవర్ధన్రెడ్డి ఉన్నారు. -
భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి
గద్వాల: జిల్లాలో వివిధ ప్రాజెక్టుల కింద చేపట్టాల్సిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో కలిసి భూసేకరణ ప్రక్రియపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నెట్టెంపాడు, గట్టు, ఆర్డీఎస్ ప్రాజెక్టుల పరిధిలో చేపట్టాల్సిన భూ సేకరణలో జాప్యంపై ప్రభుత్వం సీరియస్గా ఉందన్నారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి.. నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తిచేయాలని ఆయన సూచించారు. ● ఓటరు జాబితాలో తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన వీసీలో ఆయన మాట్లాడారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై బీఎల్ఓలు, బీఎల్ఏలకు ఈ నెల 24వ తేదీలోగా శిక్షణ పూర్తిచేయాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం 25 నుంచి బీఎల్ఓలు పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేయాలన్నారు. అక్టోబర్ 1 నాటికి తుది ఓటరు జాబితా ప్రకటించే వరకు షెడ్యూల్ ప్రకారం చేపట్టాలన్నారు. ● ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమాల సమగ్ర డేటాను సిద్ధం చేయాలని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్ వీసీ హాల్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పది అంశాలపై నిర్వహించిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల పూర్తి వివరాలు, మంచి ఫొటోలతో కూడిన బుక్లెట్ సిద్ధం చేయాలన్నారు. అదే విధంగా ఈ నెల 28న నిర్వహించే పల్స్ పోలియో దినోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశాల్లో ఎస్డీసీ కృష్ణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్కుమార్రెడ్డి, రాజ్కుమార్, ఏఓ భూపాల్రెడ్డి ఉన్నారు. -
మార్పు ఎందుకో..?
పీయూలో జాతీయ సెమినార్ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: అన్నిరంగాల్లో వెనుకబాటుకు గురైన పాలమూరు జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేయాలనే సదుద్దేశంతో 2008లో అప్పటి సీఎం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలమూరు యూనివర్సిటీని ప్రారంభించారు. ఈ క్రమంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ.. దినదినాభివృద్ధి చెందుతూ.. ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ.. వారి బంగారు భవిష్యత్కు బాటలు వేస్తోంది. ఈ క్రమంలోనే పీయూకు కేంద్ర ప్రభుత్వం ఉషా స్కీం కింద ఏకంగా రూ.100 కోట్లు ప్రకటించడంతో నేపథ్యంలో రెండు రోజుల జాతీయ సెమినార్ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో సెమినార్ను పీయూలో నిర్వహిస్తున్నామని, ముఖ్య అతిథిగా సీఎం రేవంత్రెడ్డిని ఆహ్వానిస్తున్నామని గతంలో యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పీయూకు వచ్చే మొదటి సీఎం, ఉమ్మడి జిల్లాకు చెందిన రేవంత్రెడ్డి వస్తే.. ఎంతో మేలు జరుగుతుందని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా అధికారులు సెమినార్ వేదికను హైదరాబాద్ శివారులోని కన్హా శాంతివనంలోకి మారుస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఓయూకు వెళ్లిన సీఎం వసతుల అభివృద్ధి కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించారని.. సొంత జిల్లాలోని పీయూకు కూడా వస్తే కనీసం రూ.200 కోట్లు అయినా కేటాయిస్తారనుకున్న వారి ఆశలు నిరాశగా మారాయి. దక్షిణ భారతదేశంలో జాతీయ స్థాయి సెమినార్ నిర్వహిస్తున్న మొదటి యూనివర్సిటీ పీయూ కానుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సహా రాష్ట్ర మంత్రులు, వివిధ సెంట్రల్, రాష్ట్రంలోని యూనివర్సిటీలకు సంబంధించిన వీసీలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోపాటు పారిశ్రామికవేత్తలు, రీసెర్చ్స్కాలర్స్, ప్రొఫెసర్లు హాజరుకానున్నారు. ఇందులో భాగంగా పలువురు విద్యార్థులు పారిశ్రామికవేత్తలు, రీసెర్చ్స్కాలర్స్ స్టాళ్లను ఏర్పాటు చేయనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మొత్తం 15 కమిటీలను ఏర్పాటు చేశారు. ఇందులో వీసీ శ్రీనివాస్ ప్యాట్రన్గా, రిజిస్ట్రార్ రమేష్బాబు కన్వీనర్గా, కంట్రోలర్ ప్రవీణ, వీసీ ఓఎస్డీ మధుసూదన్రెడ్డి కన్వీనర్లుగా వ్యవహరించనున్నారు. వీరితో పాటు బ్రోచర్ల రూపకల్పన, ఆహ్వాన పత్రాలు, అకడమిక్ సెషన్లు, ప్రతినిధుల వసతి, రవాణా, భోజనం, సాంకేతిక సమాచారం, ఆర్థిక వ్యవహారాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, డాక్యుమెంటేషన్ వంటి కార్యక్రమాల కోసం మొత్తం 15 మంది సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేశారు. పాలమూరు యూనివర్సిటీ ముఖద్వారం మొదట్లో యూనివర్సిటీలోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించిన అధికారులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం హాజరవుతారని వెల్లడి అనూహ్యంగా కన్హా శాంతివనంకు మారిన సెమినార్ నిర్వహణ వేదిక తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాలు, జిల్లావాసులు పీయూ నిర్వహించే జాతీయ సెమినార్లో సీఎం రేవంత్రెడ్డి పాల్గొనున్న నేపథ్యంలో యూనివర్సిటీలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా పీయూలో విద్యార్థుల కోసం శాశ్వత ఆస్పత్రి, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ముఖ్యంగా పీయూలో రెగ్యులర్ ప్రాతిపదికన టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది నియామకం చేపట్టాల్సి ఉంది. రెగ్యులర్ టీచింగ్ సిబ్బంది లేకపోవడంతో రీసెర్చిలో తక్కువ అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఇక పీజీ సెంటర్లలో, విద్యార్థులకు తరగతి గదులు, హాస్టళ్ల నిర్మాణం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. వీటిని పరిష్కరించి పీయూలో మరిన్ని కొత్త కళాశాలలు, కొత్త కోర్సులు ప్రవేశపెట్టి జిల్లాలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కనీసం రూ.200 కోట్లు కేటాయించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పీయూ ఆధ్వర్యంలో ఆగస్టు 7, 8 తేదీల్లో హైదరాబాద్లో సమీపంలోని కన్హా శాంతివనంలో నిర్వహించే నేషనల్ సెమినార్కు సీఎం హాజరుకానున్నారు. యూనివర్సిటీలో సెమినార్ నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో హాళ్లు, అతిథులకు హోటళ్లు, ఇతర సౌకర్యాలు లేకపోవడంతో సెమినార్ వేదికను మార్చాం. యూనివర్సిటీకి ప్రభుత్వం ఏమైనా ఇస్తే అక్కడ కూడా ప్రకటించే అవకాశం ఉంది. వేదిక మార్పులో ఎలాంటి దురుద్దేశం లేదు. – రమేష్బాబు, పీయూ రిజిస్ట్రార్ -
క్రాప్హాలిడే ప్రకటించాం..
నేను ఐదేళ్లుగా కొంత పొలాన్ని కౌలుకు తీసుకొని సీడ్పత్తిని సాగు చేసుకుంటూ వచ్చా. గతేడాది పండించిన సీడ్పత్తి గింజల డబ్బులు ఇంకా చేతికందలేదు. ఈసారి సీడ్పత్తి గింజలను ఆర్గనైజర్ ఇవ్వకపోవడంతో సాగు నిలిపివేశా. చాలా మంది క్రాప్హాలిడే ప్రకటించారు. – తిమ్మప్ప, రైతు, సల్కాపురం, గట్టు మండలం పదేళ్లుగా సీడ్ పత్తి సాగుచేస్తున్నా. గతేడాది ఎకరన్నర విస్తీర్ణంలో సీడ్ పత్తి పండించా. ఈసారి పెట్టుబడితో పాటు సీడ్ పత్తి గింజలను ఇవ్వకపోవడంతో చేసేదేమీ లేక సాగును నిలిపివేశాం. సీడ్ పత్తి పంటకు బదులు టమాటా సాగు చేద్దామని పొలాన్ని సిద్ధం చేసుకున్నా. వర్షం కురిస్తే టమాటా నారు నాటుకుంటా. – నర్సింహులు, రైతు, రాయాపురం, గట్టు మండలం సీడ్ కంపెనీలు రైతులకు అందజేసే విత్తనాలను తగ్గించుకున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈసారి ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాబావ పరిస్థితులు ఉండొచ్చనే ముందస్తు ఉహాగానాల నేపథ్యంలో సాగుపై ప్రభావం పడింది. రైతులు సీడ్పత్తి సాగుపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. సీడ్ పత్తి సాగుపై ఈ నెలాఖరు వరకు ఓ అంచనాకు రావొచ్చు. – వీరప్ప, డీఏఓ ● -
కేసుల నమోదులో అలసత్వం వహించొద్దు
గద్వాల క్రైం: వివిధ సమస్యలపై పోలీస్స్టేషన్కు వ చ్చే బాధితులపై సిబ్బంది స్నేహపూర్వకంగా ఉంటూనే.. నేరస్తులపై కఠినంగా వ్యవహరించాలని ఎ స్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం డీఎస్పీ మొగిలయ్యతో కలిసి గద్వాల పట్టణ పోలీస్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసుల దర్యాప్తులో పురోగతిని తెలుసుకున్నారు. పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదులపై వేగవంతగా విచారణ చేపట్టి, బాధితులకు పోలీసుశాఖపై నమ్మకం పెంచాలని సూచించారు. జిల్లాకేంద్రంలోని అన్ని కాలనీల్లో గస్తీ, పెట్రోలింగ్ను ము మ్మరం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, చోరీ లు, సైబర్ క్రైం, మహిళలపై వేధింపులు, దాడులు, మిస్సింగ్ కేసుల అంశాలపై ప్రత్యేక నిఘా ఉంచి.. నివారణకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. పూర్తి సాక్ష్యాధారాలతో కోర్టులో చార్జ్షీట్ దాఖలుచేసి, నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేయాలన్నారు. డయల్ 100 కాల్స్ విషయంలో త్వరగా స్పందించాలని తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. వారి వెంట సీఐ శ్రీను, ఎస్ఐలు కళ్యాణ్కుమార్, జహంగీర్, కుమార్ ఉన్నారు. వేరుశనగ క్వింటా రూ.7,239 గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు గురువారం 1022 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 7,239, కనిష్టంగా రూ. 3,066,సరాసరి రూ. 6,199 ధరలు పలికాయి. ఆర్టీసీ డీఎంగా బాధ్యతల స్వీకరణ గద్వాల క్రైం: జిల్లాకేంద్రమైన గద్వాల ఆర్టీసీ డిపో మేనేజర్గా శ్రీధర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారిస్తామని.. బస్టాండ్లో మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించి, ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తామన్నారు. అనంతరం పలు కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు డీఎంను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర మహాసభలకు తరలిరండి గద్వాల క్రైం: మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలో ఈ నెల 20 నుంచి 22 వరకు నిర్వహించే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 4వ రాష్ట్ర మహాసభలకు కర్షక, కార్మికులు అధిక సంఖ్యలో తరలిరావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.వెంటకస్వామి కోరారు. గురువారం గద్వాల మండలం గోనుపాడులో వ్యవసాయ, ఉపాధి హామీ కూలీలతో ఆయన సమావేశమై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ తీరని అన్యాయం చేస్తున్నాయన్నారు. రాష్ట్ర మహాసభల్లో భవిష్యత్ కార్యాచరణ రూపాందించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని కర్షక, కార్మికులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో వీవీ నర్సింహ, ఉప్పేరు నర్సింహ పాల్గొన్నారు. జూరాలకు కొనసాగుతున్న ఇన్ఫ్లో ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లో కొనసాగుతోంది. గురువారం సాయంత్రం వరకు 1,473 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమైన లిఫ్టు –1 గూడ్డెందొడ్డి పంప్హౌజ్ మోటార్ల ద్వారా రిజర్వాయర్లకు నీటి పంపింగ్ చేస్తున్నారు. నెట్టెంపాడుకు 1,500 క్యూసెక్కులు, భీమా లిప్టు–1కు 1,192 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 43 క్యూసెక్కులతో కలిపి మొత్తం 2,735 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.682 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. -
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
● ప్రభుత్వం సూచించిన వరి వంగడాలనే విక్రయించాలి ● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గద్వాలన్యూటౌన్: రైతులకు నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు. జిల్లాకేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో గురువారం ఆయన ఆకిస్మక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీలకు చెందిన పలు రకాల విత్తన పాకెట్లు, రశీదు పుస్తకాలు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, కేఎన్ఎం 1638, డబ్ల్యూజీఎల్ 44, జేజీఎల్ 1798, జై శ్రీరామ్, హెచ్ఎంటీ (సోనా) రకాలకు మాత్రమే ప్రభుత్వం ఈఏడాది బోనస్ చెల్లిస్తుందన్నారు. వ్యవసాయశాఖ సూచించిన వంగడాలను మాత్రమే రైతులు సాగుచేయాల్సి ఉందన్నారు. విత్తన డీలర్లు వాటిని మాత్రమే విక్రయించాలని ఆదేశించారు. అదే విధంగా నానో యూరియా వినియోగించేలా రైతులను ప్రోత్సహించాలని చెప్పారు. ప్రతి పెస్టిసైడ్, సీడ్ దుకాణాల వద్ద స్టాక్ బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటుచేసి, అందులో సమగ్రంగా వివరాలు పొందుపర్చాలని సూచించారు. కాగా, రైతులకు ఇచ్చే రశీదులను డీలర్లు ఇష్టానుసారం సొంతంగా ముద్రించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంలో సంబందిత డీలర్లకు నోటీసులు జారీ చేయాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. కాగా, స్థానిక పాత బస్టాండ్ ప్రాంతంలో ఇష్టానుసారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని గమనించిన కలెక్టర్.. అనుమతులు లేకుండా ఏర్పాటుచేసిన ప్రకటనల బోర్డులను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ జానకీరాం సాగర్కు సూచించారు. ఆయన వెంట డీఏఓ వీరప్ప, ఏఓ ప్రతాప్కుమార్, టెక్నికల్ ఏఓలు చంద్రశేఖర్, భవాని ఉన్నారు. ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. గద్వాల మండలం గోనుపాడు వద్ద ఉన్న పాల్టెక్నిక్ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు విభాగాలను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఆయన ల్యాబ్లను పరిశీలించి మాట్లాడారు. విద్యార్థులకు అర్థమయ్యేలా శిక్షణ ఇవ్వాలని.. సెమినార్లు నిర్వహించి వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని అధ్యాపకులకు సూచించారు. ఈఏడాది నూతనంగా సైబర్ ఫిజికల్ సిస్టం సెక్యూరిటీ కోర్సు ప్రారంభించనున్నట్లు తెలిపారు. పాలిసెట్ కౌన్సెలింగ్ సందర్భంగా ఇప్పటికే వివిద కోర్సుల్లో చేరిన విద్యార్థులు కొత్త కోర్సులోకి మారేందుకు అవకాశం ఉంటుందన్నారు. వడ్డేపల్లి ప్రభుత్వ పాల్టెక్నిక్ కళాశాలలో ఎలక్ట్రికల్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో 60 సీట్ల చొప్పున అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అనంతరం సమీపంలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. సిబ్బంది హాజరు, కొత్త విద్యార్థినుల అడ్మిషన్లపై ఆరా తీశారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు రోజులైనా విద్యార్థినులు పూర్తిస్థాయిలో రాకపోవడమేమిటని సిబ్బందిని ప్రశ్నించారు. అనంతరం విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ విజయలక్ష్మి, సెక్టోరియల్ అధికారి జ్యోతి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహన్, ఎస్ఓ గోపిలత పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
గట్టు/ధరూరు: పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అడిషనల్ కలెక్టర్ నర్సింగ్రావు అన్నారు. వనమహోత్సవంలో భాగంగా గురువారం ముసంపల్లి రిజర్వు ఫారెస్టులో డీఆర్డీఓ ముషాహిదా బేగం, ఫారెస్టు రేంజర్ ఫర్వేజ్ అహ్మద్లతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్ తరాల కు స్వచ్ఛమైన వాతావరణం అందించాలనే లక్ష్యంతో వనమహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అ డవులు పెరిగితేనే వర్షాలు సమృద్ధిగా కురిసి అందరికీ మేలు చేకూరుతుందన్నారు. ప్రతి ఒక్కరూ విధి గా మొక్కలు నాటి పెంచాలని కోరారు. అదే విధంగా ధరూరు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పాఠశాల పరిసరాలతో పాటు మధ్యాహ్న భోజనం, వంట గది, మరుగుదొడ్లు, వసతి సౌకర్యం, తరగతి గదు లు, తాగునీటి సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థినులకు మెరుగైన విద్య అందించడంతో పాటు అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమాల్లో ఎస్ఓ గోమతి, డీఆర్వో జాకిరుద్దీన్, సుమలత, ఎఫ్ఎస్ఓ ప్రసూన మన్యమయ్య, ఎఫ్బీఓ శ్వేత, ఎంపీడీఓ చెన్నయ్య, సర్పంచ్ సాకే డేవిడ్, ఉపసర్పంచ్ బాసు గోపాల్ పాల్గొన్నారు. -
సర్.. ఉన్నారా.. లేరా?
అర్హులందరికీ ఓటుహక్కు కల్పించడమే ఎస్ఐఆర్ ప్రధాన ఉద్దేశం. డ్రాఫ్ట్ ఓటరు జాబితాను జూలై 31న విడుదల చేస్తాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, ప్రజాప్రతినిధుల చట్టం–1950లోని సెక్షన్ 21 ప్రకారం 2026 అక్టోబర్ 1 నాటికి అర్హత తేదీగా నిర్ణయించి.. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరణించి వారు, ఇతర ప్రాంతాలకు మారినవారు, డూప్లికేట్ ఓట్ల తొలగింపు ఉంటుంది. 2002 నాటి ఎస్ఐఆర్ జాబితాతో మ్యాపింగ్ చేస్తున్నాం. ప్రస్తుత ఓటరు పేరు పాత జాబితాలో లేకపోతే వారి తల్లిదండ్రులు లేదా తాతముత్తాల పేర్లు, ఈపిక్ నంబరు వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 25నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహించి.. కొత్త ఓటర్ల నుంచి నమోదు ఫారాలు స్వీకరిస్తారు. – హేమంత కేశవ్ పాటిల్, కలెక్టర్, నాగర్కర్నూల్ అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్– ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఎలక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. ఒక ఓటరు 2002 జాబితాలో ఉన్న ఈపీఐసీ నంబర్తో ప్రస్తుత ఓటర్ల జాబితాలోని పేర్లతో సర్–2026లో మ్యాపింగ్ చేస్తున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో ఏకంగా 9,16,059 మంది ఓటర్లకు సంబంధించిన 2002లో ఓటరు జాబితాలో వివరాలు అందుబాటులో లేవు. దీంతో వీరంతా 2002లో ఎక్కడ ఓటర్లుగా ఉన్నారనే దానిపై అన్వేషిస్తున్నారు. ఇందుకోసం మండలాల్లో స్పెషల్ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి వారికి సంబంధించిన 2002 ఓటరు జాబితా ఈపీఐసీ నంబర్ కోసం వెతుకుతున్నారు. గతంలో 2002లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ జరగగా..24 ఏళ్ల తర్వాత మళ్లీ నిర్వహిస్తున్నారు. అప్పటి జాబితాను పరిగణలోకి తీసుకుని సవరణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ప్రస్తుతం మొత్తం 27,39,12 లక్షల మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 21,95,269 మంది ఓటర్లకు సంబంధించిన ఈపీఐసీ నంబర్లు 2002 ఓటరు జాబితాలోని ఈపీఐసీ నంబర్తో మ్యాపింగ్ పూర్తయింది. మ్యాపింగ్ జరిగిన ఓటర్లలో ఏకంగా 9,16,059 మంది పేర్లు/ తల్లిదండ్రుల పేర్లు/ బంధుత్వం/ చిరునామా ఇతర వివరాల్లో తేడాలున్నట్లు ఎన్నికల సంఘం రూపొందించిన సాఫ్ట్వేర్ గుర్తించింది. దీంతో 2002 నాటి వివరాలు లభించక బీఎల్ఓలు ఇబ్బందులు పడుతున్నారు. సర్లో భాగంగా జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 మధ్య వారికి స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వో) నోటీసులు జారీ చేసి వివరణ కోరనున్నారు. ఆయా అనుమానాల నివృత్తికి ఎన్నికల సంఘం నిర్దేశించిన 13 రకాల పత్రాలను ఆధారాలుగా చూపాలని కోరే అవకాశం ఉంది. అంతకంటే ముందు ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 మధ్యలో వారితోపాటు రాష్ట్రంలోని ఓటర్లందరికీ రెండు ఎన్యుమరేషన్ ఫారాలు అందిస్తారు. వాటిని నింపాక ఒక ప్రతిని వెనక్కి తీసుకోనున్నారు. స్థానిక బీఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఈప్రక్రియ నిర్వహిస్తారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటన తర్వాత మ్యాపింగ్లో వ్యత్యాసాలున్న గుర్తించిన ఓటర్లకు నోటీసులు జారీ చేసి నిర్దేశిత గడువులో విచారణకు హాజరు కావాలని కోరనున్నారు. అక్షర దోషాలున్నా.. సర్ నిర్వహణకు ఎన్నికల సంఘం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించింది. ఓటర్ల వివరాల్లో ఎలాంటి తేడాలున్నా పట్టేసి అనుమానాస్పద జాబితాలో చేరుస్తోంది. 2002 జాబితాకు ఇప్పటి జాబితాకు పేర్ల అక్షరాల్లో మార్పులు, బంధుత్వం పొరపాటుగా నమోదై ఉండటం (ఉదాహరణ తండ్రికి బదులు భర్త) తండ్రికి బిడ్డకు మధ్య వయసులో అసాధారణ తేడాలుండటం, ఒకే కుటుంబంలో ఆరుగురు కంటే ఎక్కువ మంది సంతానం ఉండటం, క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు తప్పుడు మ్యాపింగ్ చేయడం వంటి లోపాలను సాఫ్ట్వేర్ గుర్తిస్తోందని అధికారులు తెలిపారు. ఇలాంటి కారణాలతోనే ఉమ్మడి జిల్లాలో 9,16,059 మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. మరో అవకాశం.. అర్హులైన వారిని కూడా ఈసారి ఓటరు జాబితాలో చేర్చుతారు. 18 ఏళ్ల నిండిన వారు ఎన్యుమరేషన్ ఫాం పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ నెల 12 నాటికి ఓట ర్లుగా నమోదైన వారికే ఎన్యుమరేషన్ ఫారాలు అందజేయనుండగా.. జాబితాలో పేరు లేని వారికి సై తం ఓటరుగా నమోదు చేసుకోవడానికి సర్ ప్రక్రియలో అవకాశం కల్పిస్తారు. వీరికోసం బీఎల్ఓలు ఫారం–6తోపాటు స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 మధ్య దరఖాస్తులు, అభ్యంతరాల పరిష్కారం ప్రక్రియలో భాగంగా కొత్త ఓటర్ల నమోదు దరఖాస్తులను ఈఆర్వోలు పరిశీలించి అర్హులకు తుది జాబితాలో చోటు కల్పిస్తారు. 2002 జాబితా ఈపీఐసీ నంబర్లతో ప్రస్తుత ఓటర్ల మ్యాపింగ్ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 80.15 శాతం పూర్తయిన ప్రక్రియ 9,16,059 మంది అనుమానాస్పద ఓటర్ల వివరాల కోసం ఆరా ఎస్ఐఆర్–26లో నోటీసులు జారీ చేసి ఆధారాలు చూపాలని కోరే అవకాశం అప్పటి ఈపీఐసీ నంబర్లు లభించక బీఎల్ఓల ఇక్కట్లు -
విత్తన విపత్తి!
నడిగడ్డలో 70శాతం తగ్గిన సీడ్ పత్తి సాగు గట్టు: రైతుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే సీడ్పత్తి సాగు ఈసారి సంకట స్థితిని ఎదుర్కొంటోంది. రెండు, మూడేళ్లుగా పండించిన పత్తి విత్తనాలు కంపెనీల వద్ద పేరుకుపోవడానికి తోడు ఆర్గనైజర్ల కొర్రీల కారణంగా నడిగడ్డ ప్రాంతంలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఫలితంగా రాష్ట్రంలోనే పేరెన్నిక గల పత్తి విత్తనాలను అందిస్తూ వస్తున్న ఇక్కడి రైతులు చాలామంది పత్తి విత్తనోత్పత్తికి దూరమయ్యారు. గతేడాది సీడ్ పత్తిని 22,783 ఎకరాల్లో సాగుచేయగా.. ఈసారి కేవలం 30శాతం మేర మాత్రమే సాగైందని అధికారు ల అంచనా. కమర్షియల్ పత్తి మాత్రం 1,05,101 ఎకరా ల్లో సాగు అవుతోంది. నడిగడ్డ నేలలు అనుకూలం.. జిల్లాలోని ఎత్తు పల్లాలు కలిగిన మెట్ట భూములు సీడ్ పత్తి సాగుకు అనుకూలంగా ఉన్నాయి. జూన్ ప్రారంభంలో సీడ్ పత్తిని సాగు మొదలుపెడతారు. జూలై చివరి వారం నుంచి క్రాసింగ్ పనులు (మగ పువ్వు పుప్పోడిని ఆడ పువ్వుతో క్రాసింగ్) ప్రారంభిస్తారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చే వారు. జిల్లాలో సీడ్ పత్తి సాగు విస్తీర్ణం పడిపోవడంతో కూలీలకు పనుల కొరత నెలకొంది. ఆరు మాసాల్లో చేతికొచ్చే ఎకరా పంట సాగుకు రైతులు రూ.లక్ష నుంచి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెడతారు. విత్తనాల నాణ్యత మేరకు రైతులకు రూ. 2.5లక్షల నుంచి రూ. 4లక్షల వరకు ధర వస్తుంది. ముందస్తు హెచ్చరికలు.. గతంలో ఎన్నడూ లేని విధంగా గతేడాది నుంచి సీడ్పత్తి రైతులను ఆర్గనైజర్లు హెచ్చరిస్తూ వచ్చారు. ముందుస్తు ఒప్పందం మేరకు జూన్ మొదటి వారంలోనే రైతులకు విత్తనాలతో పాటు పెట్టుబడి కోసం కొంత డబ్బులను అందజేసిన ఆర్గనైజర్లు.. 45 రోజుల తర్వాత ఎకరాకు కేవలం 150 నుంచి 200 పాకెట్లు మాత్రమే కొంటామని.. అంతకన్నా ఎక్కువ తాము కొనలేమని తేల్చిచెప్పారు. సీడ్ పత్తి పంట ఎకరాకు 4 నుంచి 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుండగా.. క్వింటన్నర, రెండు క్వింటాళ్లు మాత్రమే కొంటామని ఆర్గనేజర్లు రైతులను హెచ్చరిస్తూ వచ్చారు. పెట్టుబడులను సైతం ఇవ్వడం నిలిపివేయడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. కంపెనీల వద్ద పేరుకుపోయిన నిల్వలు బకాయిపడిన రైతులకే విత్తనాల సరఫరా ఈసారి గణనీయంగా పడిపోయిన సాగు విస్తీర్ణం ధర సైతం తగ్గింపు.. పత్తి విత్తన కంపెనీల ఆర్గనైజర్లతో గతేడాది జరిగి న ముందస్తు ఒప్పందం మేరకు కేజీ విత్తనాల పాకెట్ ధర రూ.600 ఇవ్వగా.. ఈసారి రూ.500కే కొంటామని చెబుతున్నట్లు తెలిసింది. ప్రతి ఏటా ధరలను పెంచాల్సిందిపోయి.. తగ్గిస్తుండడంతో కొందరు రైతులు సాగుకు ముందుకు రావడంలే దు. మరోవైపు విత్తన కంపెనీలు సీడ్ సాగు పెట్టుబడుల కోసం ఆర్గనైజర్లకు ఇచ్చే డబ్బులను చెల్లించేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఆర్గనైజర్ల వద్ద గతేడాది బకాయిపడిన రైతులకు మాత్రమే కంపెనీల ద్వారా విత్తనాలను అందజేస్తున్నట్లు తె లుస్తోంది. ఈ ఏడాది పండించిన పంటకు సంబంధించిన డబ్బులను రెండేళ్ల తర్వాత తీసుకునేలా అంగీకరిస్తేనే విత్తనాలను రైతులకు అందిస్తున్నట్లు తెలిసింది. ఇలా ఆర్గనైజర్ల కొర్రీలతో రైతులు ఈసారి సీడ్పత్తి సాగును 70శాతం మేర తగ్గించేశారు. సీడ్ పత్తి స్థానంలో కమర్షియల్ పత్తితో పాటు ఇతర పంటలపై రైతులు దృష్టిసారించారు. -
ప్రజలను మభ్యపెడుతున్న ప్రభుత్వాలు
ఎర్రవల్లి: ఉచిత హామీల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెడుతున్నాయని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు మణికుమార్ విమర్శించారు. బుధవారం ఎర్రవల్లిలో ఏర్పాటుచేసిన ఆ పార్టీ ఉమ్మడి ఇటిక్యాల మండలస్థాయి సమావేశానికి ఆయన హాజరై మహానీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజల్లో సామాజిక పరివర్తన తీసుకురావడానికి కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. దేశంలో విద్యారంగ అభివృద్ధికి కృషిచేసిన మహాత్మా పూలే దంపతుల త్యాగాన్ని, దేశానికి రాజ్యాంగాన్ని అందించిన డా.బీఆర్ అంబేడ్కర్ భావాజాలాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఓటు చైతన్యంతో ప్రజల్లో సామాజిక పరివర్తన తీసుకొచ్చి, పార్టీని బలోపేతం చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. సమావేశంలో రాంబాబు, నగే శ్, శాంతిరాజు, జీవన్, బొజ్జన్న, సురేశ్, రామకృష్ణ, హుస్సేన్, యువరాజు ఉన్నారు. -
రైతన్న సంక్షేమానికి పెద్దపీట
గట్టు: రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. బుధవారం గట్టు మండలం చాగదోన గ్రామంలో వ్యవసాయ గోదాం నిర్మాణానికి ఆయన భూమిపూజ చేసి మాట్లాడారు. రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకునేందుకు ఉపాధిహామీ పథకం నిధులు రూ. 30లక్షలతో వ్యవసాయ గోదాం నిర్మిస్తున్నట్లు తెలిపారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించే వరకు వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకోవచ్చన్నారు. ప్రతి రైతు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం చిన్నోనిపల్లె పునరావాస కేంద్రంలో ఐదుగురు లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు ఎమ్మెల్యే హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జంబు రామన్గౌడ్, మాజీ ఎంపీపీ విజయ్కుమార్, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, సర్పంచులు వీరేశ్, దేవేందర్, ఉపసర్పంచ్ రంగన్న, కార్యదర్శి ఆంజనేయులు, మాజీ సర్పంచ్ శంకరన్న, శివప్ప, హరిశ్చంద్రగౌడ్, నర్సింహులు, వడ్డే హుస్సేని, మునిస్వామి పాల్గొన్నారు. -
జూరాలకు 1,999 క్యూసెక్కుల ఇన్ఫ్లో
ధరూరు/రాజోళి: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లో కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం వరకు 1,999 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైనట్లు పీజేపీ అధికారులు తెలిపారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో రెండు పంపులను రన్ చేసి.. రిజర్వాయర్లను నింపుతున్నట్లు పేర్కొన్నారు. నెట్టెంపాడుకు 1,500 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్–1కు 1,300, ఆవిరి రూపంలో 44 క్యూసెక్కులతో కలిపి మొత్తం 2,844 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 3.791 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. ● సుంకేసుల డ్యాం వద్ద రెండు గేట్లను ఎత్తారు. ఉదయం ఎగువ నుంచి 7,650 క్యూసెక్కులు ఇన్ఫ్లో రాగా.. ఒక గేటును ఒక మీటర్ మేర, మరో గేటును అర మీటర్ మేర తెరిచి 6,759 క్యూసెక్కులను దిగువకు విడుదల చేసినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. పెరిగిన ఉల్లి ధర దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధర మరింత పెరిగింది. వివిధ గ్రామాల నుంచి దాదాపు వెయ్యి బస్తాల ఉల్లి అమ్మకానికి రాగా.. వ్యాపారులు వేలం వేసి ధరలు నిర్ణయించారు. వేలంలో క్వింటాల్ ఉల్లి గరిష్టంగా రూ.2,110, కనిష్టంగా రూ.1,200 వరకు ధరలు లభించాయి. అలాగే 50 కిలోల బస్తా గరిష్టంగా రూ.1,100, కనిష్టంగా రూ.600 వరకు విక్రయించారు. మార్కెట్లో కేవలం ఉల్లి వ్యాపారం మాత్రమే కొనసాగింది. ఆర్ఎన్ఆర్ @ రూ.2,756 జడ్చర్ల: బాదేపల్లిలోని వ్యవసాయ మార్కెట్లో బుధవారం క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. ధాన్యం ఆర్ఎన్ఆర్ రకం క్వింటా గరిష్టంగా రూ.2,756, కనిష్టంగా రూ.1,706 ధరలు లభించాయి. అలాగే మొక్కజొన్న క్వింటా గరిష్టంగా రూ.2,056, కనిష్టంగా రూ.1,601 చొప్పున పలికాయి. నేడు లక్కీ డ్రా కందనూలు: జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతిలో ఎస్సీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు గాను గురువారం లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధిశాఖ అధికారి ఉమాపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో ఉదయం 10 గంటలకు డ్రా తీయడం జరుగుతుందని.. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరుకావాలని ఆయన సూచించారు. -
జిల్లాలో ఐపీ పెట్టిన ఘనులు..
జిల్లాలో ముగ్గురు వ్యాపారులు నల్లన్న, కురుమన్న, శ్రీనివాస్రెడ్డి వడ్డీ వ్యాపారం పేరుతో సామాన్య ప్రజలు, రైతులు, ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పెట్టుబడులు తీసుకున్నారు. వారి మాటలు నమ్మి సుమారు 377 మంది సభ్యులు డబ్బులను పొదుపు చేసుకున్నారు. ఇలా మొత్తం రూ. 50కోట్లు వసూలుచేసి.. పెట్టుబడులు పెట్టిన వారికి తిరిగి డబ్బులు చెల్లించకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. చెల్లించిన వారి నుంచి ఒత్తిడి, దాడులు, బెదిరింపులు ఇతరత్రా వంటి వాటి నుంచి తప్పించుకునేందుకు ఐపీ పెట్టారు. క్రిమినల్ కేసులు నమోదు.. జిల్లాలోని పలువురు వ్యక్తులు వడ్డీ వ్యాపారం, చిట్ఫండ్ పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలుచేసి, మోసం చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలాంటి వ్యాపారంచేసే వ్యక్తుల వద్ద పెట్టుబడులు పెట్టొద్దు. తెలిసిన వ్యక్తే కదా అని నమ్మితే చివరకు మోసపోవడానికి దారి తీస్తుంది. అనుమతి లేకుండా ఎక్కడైనా వడ్డీ వ్యాపారం, చిట్ఫండ్ నిర్వహిస్తున్నట్లు తెలిస్తే పోలీసుశాఖకు సమాచారం అందించాలి. అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరావు, ఎస్పీ ● -
చదువుకు ‘స్వస్తి’ !
అరకొర ‘వసతి’..● సామర్థ్యానికి మించి ఎక్కువ మంది విద్యార్థులకు వసతి కల్పన ● మరో 6 సంక్షేమ హాస్టళ్ల కోసం ముగ్గురు ఎమ్మెల్యేల ప్రతిపాదనలు ● కొల్లాపూర్లోని 2 నాన్ వర్కింగ్ హాస్టళ్ల తరలింపునకు యత్నం ● ఆదిలోనే ఆగిన ప్రక్రియ.. ఏడాదిగా ఫైల్ పెండింగ్లోనే.. ఎంవీఎస్ ప్రాంగణంలోని ఎస్సీ కళాశాల బాలుర హాస్టల్ బీలో విద్యార్థులు దేవరకద్రలో ఇప్పటివరకు ప్రభుత్వ కాలేజీలు లేవు. సంక్షేమ హాస్టళ్లు లేవు. నేను ఎమ్మెల్యేగా ఎన్నికై న తర్వాతే డిగ్రీ కళాశాలకు అనుమతులు వచ్చాయి. ఆ వెంటనే సంక్షేమ హాస్టల్ కోసం ప్రతిపాదనలు పంపాను. ప్రభుత్వం సానుకూలంగా ఉంది. మరో పది, 15 రోజుల్లో కల సాకారమయ్యే అవకాశం ఉంది. – జి.మధుసూదన్రెడ్డి, ఎమ్మెల్యే, దేవరకద్ర ప్రభుత్వ సంక్షేమ కళాశాలల హాస్టళ్లలో వసతి కోసం విద్యార్థుల నుంచి ప్రతి ఏటా అధిక మొత్తంలో దరఖాస్తులు వస్తున్నాయి. దీంతో ఎస్సీ, బీసీ వసతి గృహాలు అదనంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. గత కలెక్టర్ విజయేందిర హయాంలోనే పంపడం జరిగింది. అనుమతులు రావాల్సి ఉంది. – సునీత, డీడీ, ఎస్సీ సంక్షేమ శాఖ ప్రస్తుతం 3 వేల మందికే.. మహబూబ్నగర్ జిల్లాలో ప్రభుత్వ ఎస్సీ సంక్షేమ కళాశాల వసతి గృహాలు ఆరు, బీసీ హాస్టళ్లు ఐదు, గిరిజన హాస్టళ్లు మూడు ఉన్నాయి. వీటిలో సుమారు 3 వేల మంది వసతి పొందుతున్నారు. లెక్క ప్రకారం ఆయా హాస్టళ్లలో మొత్తంగా 2 వేల మందికి సరిపోను సౌకర్యాలు ఉండగా.. స్థాయికి మించి మరో వెయ్యి మందికి పైగా వసతి కల్పిస్తున్నారు. ప్రధానంగా బీసీ, ఎస్సీ విద్యార్థులు అధిక శాతం మంది వివిధ విద్యా సంస్థల్లో సీట్లు వచ్చినప్పటికీ.. ప్రభుత్వ హాస్టళ్లలో వసతి పొందలేకపోతున్నారు. అదనంగా 10 హాస్టళ్లు అవసరం.. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి వందకు పైగా కళాశాలల స్థాయి విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిలో మొత్తంగా సుమారు 25 వేల నుంచి 28 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో కేవలం మూడు వేల మందికే ప్రభుత్వ వసతి గృహాల్లో చోటు దక్కుతోంది. అంతకుముందు ఏడాది 2,500 మందికి వసతి కల్పించగా.. డిమాండ్ పెరిగిన నేపథ్యంలో గత సంవత్సరం మరో 500 మందికి అవకాశం ఇచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. మొత్తంగా మరో 10 వేల మంది వరకు ప్రభుత్వ హాస్టళ్లలో వసతి కోసం ఎగబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన మరో పది సంక్షేమ హాస్టళ్ల అవసరం ఉందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏడాదిగా ప్రతిపాదనలకే పరిమితం.. సంక్షేమ కళాశాలల హాస్టళ్లకు పేద విద్యార్థుల నుంచి డిమాండ్ పెరగడంతో మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు వసతి గృహాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మొత్తం ఆరు ఎస్సీ సంక్షేమ హాస్టళ్ల కోసం వారు ప్రపోజల్స్ పంపినట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర స్థాయిలో అధికారులు పరిశీలించి.. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లోని రెండు నాన్ వర్కింగ్ హాస్టళ్ల (విద్యార్థులు లేరు)ను మహబూబ్నగర్కి తరలించేలా ప్రయత్నించారు. ఈ ప్రక్రియకు ఆదిలోనే అడ్డంకి ఏర్పడగా.. ప్రభుత్వ హాస్టళ్ల ఏర్పాటు ఏడాదిగా ప్రతిపాదనలకే పరిమితమైంది. ప్రస్తుతం ఈ విద్యాసంవత్సరంలోనే అందుబాటులోకి వచ్చేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని విద్యార్థులు కోరుతున్నారు. మహబూబ్నగర్లో ఒక్కొక్కటిగా అన్ని రకాల టెక్నికల్, నాన్ టెక్నికల్, న్యాయ, వైద్య విద్యా సంస్థలు వెలియడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రం విద్యాహబ్గా మారింది. దీంతో నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల నుంచి విద్యార్థులు మహబూబ్నగర్ వైపు ఆసక్తి చూపుతున్నారు. ఆయా కోర్సుల్లో కౌన్సెలింగ్ ద్వారా సీట్ల భర్తీ జరుగుతండడంతో రాష్ట్రస్థాయిలో వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు ఇక్కడకు వస్తున్నారు. ఈ క్రమంలో ఆయా ప్రభుత్వ కళాశాలల్లో అనుబంధంగా వసతి గృహాలు లేకపోవడం, ప్రైవేట్ హాస్టళ్లలో ఉండే స్థోమత లేకపోవడంతో అధిక సంఖ్యలో పేద విద్యార్థులు ప్రభుత్వ సంక్షేమ కళాశాలల హాస్టళ్లలో వసతికి మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించి ఐదు, బీసీ రెండు, గిరిజన రెండు, మైనార్టీ వసతి గృహాలు ఒకటి మాత్రమే ఉన్నాయి. ఇవి సరిపోకపోవడంతో పలువురు పేద విద్యార్థులు ప్రైవేట్ హాస్టళ్లలో నెలనెలా ఫీజులు కడుతూ.. చివరకు వచ్చే సరికి ఆర్థిక భారం కావడంతో చదువుకు మధ్యలోనే స్వస్తి చెబుతున్నారు. గత విద్యాసంవత్సరం మహబూబ్నగర్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో రెస్పిరేటరీ కోర్సులో చేరాను. కళాశాలకు అనుబంధంగా వసతి లేకపోవడంతో ఎస్సీ వసతి గృహంలో దరఖాస్తు చేసుకున్నా. కానీ సీట్ల కొరతతో నాకు అవకాశం రాలేదు. నా కుటుంబానికి ఆర్థిక భారమైనా విధిలేని పరిస్థితుల్లో ఓ ప్రైవేట్ హాస్టల్లో నెలకు రూ.3,500 కడుతూ విద్యనభ్యసిస్తున్నా. ఇంకా మూడేళ్లు చదవాల్సి ఉంది. ఈ సంవత్సరమైనా ప్రభుత్వ వసతి గృహాల సంఖ్య పెంచితే మాలాంటి పేద విద్యార్థులకు మేలు చేకూరుతుంది. – సాయిరాం, రెస్పిరేటరీ విద్యార్థిని, నాగర్కర్నూల్ -
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు
ఉండవెల్లి: అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆస్పత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే విజయుడు అన్నారు. బుధవారం వంద పడకల ఆస్పత్రిలో డీసీహెచ్ఓ రమేశ్చంద్ర అధ్యక్షతన జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశానికి అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, డీఎంహెచ్ఓ సంధ్యా కిరణ్మయితో పాటు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఆస్పత్రి అభివృద్ధికి సహకరించాలని ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు విన్నవించగా.. ఆరోగ్యశ్రీ పథకం నిధుల నుంచి రూ. 38లక్షలు మంజూరు చేశారని చెప్పారు. ఈ నిధులతో ఎన్టీ మెషన్, ఎండోస్కోపీ, మైక్రోస్కోప్ బ్లడ్ బ్యాంక్, డయాలసిస్ కేంద్రం, ఆస్పత్రి ప్రహారి నిర్మాణం, ప్రత్యేక డ్రెయినేజీ వ్యవస్థ, మిషన్ భగీరథ నీటి సౌకర్యం, ఇన్వర్టర్లు తదితర వాటిని ఏర్పాటుచేయాలని వైద్యాధికారులకు సూచించారు. ఆస్పత్రికి వచ్చే ప్రజలకు వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. ఇక్కడి ప్రజలు ఎక్కువగా వైద్యం కోసం పక్క రాష్ట్రానికి వెళ్తున్నారని.. ఇక్కడే మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. అదనపు కలెక్టర్ నర్సింగ్రావు మాట్లాడుతూ.. వంద పకడల ఆస్పత్రిలో అన్నిరకాల వైద్యసేవలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆస్పత్రి శుభ్రతపై పలు సూచనలు చేశారు. అనంతరం ఆస్పత్రి గదులను పరిశీలించడంతో పాటు ఆవరణలో మొక్కలు నాటారు. మున్సిపల్ చైర్మన్ జయరాములు, ఆస్పత్రి డీఈ శ్రీనివాసులు, ఎంపీడీఓ తిరుపతన్న, సర్పంచ్ సునీత, కలుగోట్ల పీఏసీఎస్ చైర్మన్ గజేందర్రెడ్డి ఉన్నారు. -
విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యం
మానవపాడు: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా అధ్యాపకులు పనిచేయాలని డీఐఈఓ హృదయరాజు సూచించారు. మానవపాడు శ్రీగంగు వెంకటకృష్ణారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరును పరిశీలించారు. అనంతరం అధ్యాపకులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రభుత్వ కళాశాలల బలోపేతమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ విద్యా సంవత్సరం 15 నుంచి 25శాతం అడ్మిషన్లు పెరిగేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధ్యాపకులకు సూచించారు. విద్యార్థుల హాజరు 80, 95శాతం ఉండేలా చూడాలన్నారు. తరగతి గదిలో ఫోన్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలన్నారు. మెరిట్ విద్యార్థులకు ఎన్ఈఈటీ, ఐఐటీ, సీఎల్ఏటీ, సీఏ ఫౌండేషన్ వంటి జాతీయస్థాయి పోటి పరీక్షలకు సిద్ధం చేయాలని సూచించారు. చదువులో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించాలని.. పరీక్షల్లో ప్రతిభకనబరిచిన వారిని మరింత ప్రోత్సహించాలన్నారు. అడ్మిషన్లు పూర్తయిన వెంటనే కేర్ టేకర్ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలని.. గైర్హాజరయ్యే విద్యార్థుల వివరాలను తల్లిదండ్రులకు వెంటనే చేరవేయాలని ఆదేశించారు. సమావేశంలో ప్రిన్సిపాల్ పద్మావతి తదితరులు ఉన్నారు. -
పట్టించుకోవడం లేదు..
ఫీజుల విషయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా విద్యాధికారులు పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు చేసిన ప్రతిసారి కంటితుడుపు చర్యలు తీసుకొని వదిలేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు నిద్రమత్తు వీడి ప్రైవేటు పాఠశాల అక్రమ వసూళ్లున అడ్డుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేయాలి. – ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ, సంఘం రాష్ట్ర నాయకుడు చర్యలు తీసుకుంటాం.. ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. పాఠశాలల్లో ఎలాంటి స్టేషనరీ, యూనిఫాంలు అమ్మకూడదు. వీటితోపాటు పుస్తకాలను కేవలం ఎమ్మార్పీకే అమ్మాలి. అలాగే పాఠశాల సమయంలో సిలబస్ మాత్రమే బోధించాలి. ఐఐటీ, నీట్ వంటివి చెప్పడానికి వీల్లేదు. – విజయకుమారి, డీఈఓ, మహబూబ్నగర్ ● -
ఆ మాట వింటే.. ‘ఫీజులు’ ఎగరాల్సిందే!
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: సామాజిక సేవతో నిర్వహించాల్సిన ప్రైవేటు పాఠశాలలు కొందరు వ్యాపారంగా మార్చడంతో పేద విద్యార్థుల తల్లిదండ్రులకు గుదిబండగా మారింది. ఉమ్మడి జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రైవేటు పాఠశాలల్లో.. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నా.. విద్యాశాఖ అధికారులు నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలో పెద్దఎత్తున ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలు ప్రారంభం కావడంతో తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే ఫీజులు, ఇతర ఖర్చులు అమాంతం పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఒకపక్క ఫీజుల నియంత్రణ చట్టం తీసుకువస్తుందన్న చర్చ జరుగుతుంది. మరోవైపు అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ పుస్తకాలకు మంగళం.. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన పుస్తకాలను అమ్మడం వల్ల దానిపై ఉన్న నిర్దిష్ట ధరకు మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. వీటిని కొనుగోలు చేస్తే కేవలం రూ.600 లోపు మాత్రమే ఖర్చు అవుతుంది. కానీ, ఇక్కడ 70 శాతం పాఠశాలలు ఐదో తరగతి వరకు ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలను విద్యార్థులకు అందించడం లేదు. వివిధ ప్రైవేటు పబ్లికేషన్లు ప్రచురించిన పుస్తకాలనే తీసుకోవాలని సూచిస్తూ.. వాటికి ఎడాపెడా ధరలు నిర్ణయించి బహిరంగంగా విక్రయించడం గమనార్హం. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలకు అసలు పాఠ్యపుస్తకాలు, సిలబస్ను ప్రభుత్వం నిర్ణయించలేదు. అయినప్పటికీ ప్రైవేటు సంస్థలు సిలబస్ రూపొందించి ప్రత్యేకంగా పుస్తకాలను విక్రయించడం కొసమెరుపు. వీటిని కొన్ని పాఠశాలలు అక్కడే డంప్ చేసి అమ్ముతుండగా.. మరికొన్ని పాఠశాలలు సమీపంలోని బుక్ సెంటర్ల ద్వారా విక్రయిస్తున్నారు. అధిక ఫీజులు ఒక ఎత్తయితే.. యూనిఫాంలు, టై, బెల్టులు కొనడం మరో ఎత్తుగా మారింది. ఒక్కో విద్యార్థికి కనీసం రెండు యూనిఫాంల చొప్పున రూ.2,500ల నుంచి రూ.3 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. టై, బెల్టులు, ఇతర నోట్ పుస్తకాలు కూడా చాలా పాఠశాలల్లోనే విక్రయించడం కొసమెరుపు. ఐఐటీ, నీట్కు అదనం.. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలలోని అంశాలు కాకుండా సంబంధం లేని ఐఐటీ, నీట్ బోధిస్తామని.. రూ.10–20 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇందులో స్టడీ మెటీరియల్కు అదనపు ఫీజులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఐఐటీ, నీట్ బోధించేందుకు వారంలో రెండు, మూడు రోజులు ఉదయం, లేదా సాయంత్రం వేళల్లో అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పీఈటీ తరగతులను ఎత్తివేసి వాటికి సమయం కేటాయిస్తున్నారు. దీంతో విద్యార్థులు శారీరకంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లోఇష్టానుసారంగా ఫీజుల వసూళ్లు ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి రూ.35– 50 వేల వరకు.. స్కూల్స్థాయిలో ఐఐటీ, నీట్ ఫౌండేషన్ కోర్సుల పేరిట అదనం టై, బెల్టు, పుస్తకాలు, యూనిఫాం,షూ పేరుతో నిలువుదోపిడి పాఠశాలల్లోనే విక్రయిస్తున్నాపట్టింపులేని విద్యాధికారులు -
మద్యం అమ్మితే రూ.90 వేల జరిమానా
అలంపూర్ రూరల్: మద్యం అమ్మకాలు చేపట్టడానికి వేలం పాటలు నిర్వహించే ప్రస్తుత పరిస్థితుల్లో.. మండలంలోని గొందిమల్ల గ్రామస్తులు మాత్రం మద్యం అమ్మకాలు నిషేధిస్తూ తీర్మానం చేశారు. గొందిమల్లలో మద్యం అమ్మితే రూ.90 వేల జరిమానా విధించాలని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మంగళవారం తీర్మానం చేసినట్లు పంచాయతీ కార్యదర్శి జరీనా తెలిపారు. గ్రామంలో మద్యం అమ్మకాలు నిషేధిస్తూ.. బెల్ట్షాపులు లేకుండా పంచాయతీ పాలక మండలి తీర్మానం చేసిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పుష్పలత, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
డైవర్షన్లోనే రాజోళి బండ
గద్వాల: కర్ణాటక ప్రాంతంలో నిర్మించిన రాజోళి బండ డైవర్షన్ పథకాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్ సుబ్రాన్షు బిశ్వాస్ మంగళవారం సందర్శించారు. హెడ్వర్క్స్ వద్ద నిర్మించిన ఆనకట్ట, స్లూయిస్, ప్రధాన కాల్వలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఎస్ మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో రైతులు చైర్మన్ను కలిశారు. గడిచిన ఐదు దశాబ్దాలుగా ఆర్డీఎస్ పరిధిలో అలంపూర్కు జరుగుతున్న అన్యాయాన్ని సవివరంగా వివరించారు. అలాగే హెడ్వర్క్స్ వద్ద రెండు దశాబ్దాల కిందట చేపట్టిన ప్యాకేజీ–1, 2 పనులు పెండింగ్లో కొనసాగుతున్న వైనాన్ని చైర్మన్ దృష్టికి తెచ్చారు. ఆర్డీఎస్కు పూర్తిస్థాయిలో న్యాయం జరగాలంటే హెడ్వర్క్స్ పరిధిలో 30 టీఎంసీల సామర్థ్యంతో కూడిన జలాశయం, అదేవిధంగా రాజోళి మండల పరిధిలో నిర్మించతలపెట్టిన మల్లమ్మకుంట రిజర్వాయర్ను పూర్తిచేయాలని చైర్మన్కు విన్నవించారు. ఇదీ ఆర్డీఎస్ నేపథ్యం.. నిజాం హయాంలో అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో 87,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు కర్ణాటకలోని రాజోళి వద్ద హెడ్వర్క్స్ నిర్మాణం చేపట్టారు. ప్రధానంగా అయిజ, రాజోళి, వడ్డేపల్లి, మానవపాడు, ఉండవెల్లి, అలంపూర్ మండలాల పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నారు. భాషాప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా తెలంగాణను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసిన తర్వాత ఆర్డీఎస్కు నీటి కష్టాలు మొదలయ్యాయి. మనకు రావాల్సిన 15 టీఎంసీల నీటివాటా పూర్తిస్థాయిలో దక్కడం లేదు. దీనికి హెడ్వర్క్స్ నిర్మాణం, మనవైపు నీరు రావాల్సిన ప్రధానకాల్వ మొత్తం కర్ణాటక పరిధిలో ఉండటమే ఇందుకు కారణం. ఫలితంగా నీటివాటా కేటాయింపుల అన్యాయం జరుగుతోంది. ప్రధానంగా ఆర్డీఎస్ ఆనకట్ట స్లూయిస్ నిర్మాణాలు ఏపీకి సమీపంలో ఉన్నాయి. దీంతో మనకు రావాల్సిన నీటివాటాను ఏపీ రైతులు తరలించుకువెళ్లడంతో ఆర్డీఎస్ వివాదాస్పదంగా మారింది. ఫలితంగా మన రైతులు ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకో చేయడంతోపాటు ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద ఏకంగా మారణాయుధాలతో పెద్దఎత్తున ఘర్షణకు సైతం దిగారు. ఆ తర్వాత ఆర్డీఎస్కు శాశ్వత పరిష్కారం చూపెడుతూ అిప్పటి సీఎం, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్లూయిస్ రంద్రాలను మూసివేయడంతోపాటు ఆనకట్ట, ప్రధాన కాల్వల మరమ్మతుకు నిధులు మంజూరు చేశారు. దీంతో ఆర్డీఎస్కు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న తరుణంలో మాజీ సీఎం వైఎస్సార్ అకాల మరణంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఆనకట్ట వద్ద రెండు ప్యాకేజీ పనులు నేటికీ అసంపూర్తిగానే కొనసాగుతుండగా.. మిగిలిన పనులు సైతం తూతూమంత్రంగా చేపట్టారు. ఇదంతా ఉమ్మడి ఏపీలో జరిగిన ఘట్టం. దీంతో సుమారు ఐదు దశాబ్దాలుగా కేవలం 50వేలలోపు ఆయకట్టుకే సాగునీరు అందిస్తున్న పరిస్థితి నెలకొంది. తుమ్మిళ్ల ఎత్తిపోతలు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్డీఎస్ కింద ఉన్న ఆయకట్టుకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో రాజోళి వద్ద తుమ్మిళ్ల ఎత్తిపోతలు చేపట్టారు. వరద సమయంలో తుంగభద్ర నది నీటిని తుమ్మిళ్ల ఎత్తిపోతల నుంచి నేరుగా ఆర్డీఎస్ ప్రధాన కాల్వలకు ఎత్తిపోసి 50 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చు. అయితే వానాకాలంలో వరద ఉన్న సమయంలో మాత్రమే సాగునీరు అందుతుండగా.. మిగిలిన రబీ సీజన్లో క్రాప్హాలిడే ప్రకటిస్తున్నారు. ఆర్డీఎస్ సమస్యకు లభించని శాశ్వత పరిష్కారం నేటికీ అసంపూర్తిగానే ప్యాకేజీ–1, 2 పనులు ఏళ్లతరబడిగా తేలని నడిగడ్డ రైతుల నీటివాటా తాజాగా హెడ్వర్క్స్ను సందర్శించిన కేఆర్ఎంబీ చైర్మన్ 30 టీఎంసీల రిజర్వాయర్ నిర్మించాలని రైతుల వినతి -
పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు
రాజోళి: ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. మంగళవారం ఆయన రాజోళితోపాటు తుమ్మిళ్ల గ్రామంలో పర్యటించారు. ముందుగా రాజోళి పీహెచ్సీని తనిఖీ చేసి.. మందులు, రిజిష్ట్రర్ను పరిశీలించారు. రోగుల సంఖ్య తక్కువగా ఉందని, వైద్య సిబ్బంది ఇంతకు సేవలు అందిస్తున్నారా.. లేదా.. అని అడిగి తెలుసుకున్నారు. రిజిష్ట్రర్ నమోదుపై అసహనం వ్యక్తం చేశారు. విధులకు సక్రమంగా హాజరు కాకపోవడం, వైద్యసేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్య సిబ్బంది రంజిత్కుమార్, కిష్టమ్మకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సదుపాయాలను ప్రజలకు అందించకపోతే ఎలా అని నిలదీశారు. నెలరోజుల్లోగా పనితీరు మార్చుకుని, మెరుగైన సేవలు అందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం కేజీబీవీని సందర్శించారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇంకా విద్యార్థులు రాకపోవడం ఏమిటని సిబ్బందిని ప్రశ్నించారు. అడ్మిషన్ల కోసం వచ్చే విద్యార్థులకు కూడా భోజన సదుపాయం కల్పించాలని సూచించారు. పాఠశాల భవనంలో నెలకొన్న సమస్యలపై అధికారులతో మాట్లాడారు. పూర్తిస్థాయిలో విద్యార్థులు హాజరయ్యేలోగా డ్రెయినేజీ, ఇతర వసతుల పనులు పూర్తిచేయాలని చెప్పారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఎస్ఐఆర్పై అధికారులతో మాట్లాడి, ఎలాంటి అవకతవకలు లేకుండా నిర్వహించాలని, బీఎల్ఓలకు ప్రత్యేకంగా సూచనలు అందించాలని తెలిపారు. మండలంలోని తుమ్మిళ్లలో టీజీఎండీసీ ద్వారా నడుస్తున్న ఇసుక తోడివేతను పరిశీలించారు. నిబంధనల మేరకు ఇసుక రవాణా చేయాలని, అక్రమంగా తరలించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఇసుక రీచ్ దగ్గర సీసీ కెమెరాలు నిత్యం పర్యవేక్షణ చేయాలని, మైనింగ్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ డీఎం చంద్రమౌళి, తహసీల్దార్ రామ్మోహన్, ఎంపీడీఓ సయ్యద్ ఖాన్, ఎస్ఐ గోకారి తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలులో ముందంజ గద్వాల: జిల్లాలో వరిధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించడంతోపాటు వందశాతం పూర్తిచేసి రాష్ట్రంలోనే ముందంజలో నిలిచామని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ ఒక ప్రకటనలో తెలిపారు. తనతోపాటు అదనపు కలెక్టర్లు సంబంధిత శాఖల అధికార యంత్రాంగం ఆయా కొనుగోలు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించడంతో రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ చేపట్టామన్నారు. జిల్లావ్యాప్తంగా 76 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి.. రూ.121.18 కోట్ల విలువైన 50,725 మె.ట., ధాన్యం సేకరించామన్నారు. ఇందుకు సంబంధించి రైతులకు ఇప్పటికే డబ్బులు చెల్లించడం జరిగిందన్నారు. -
గ్రామాల సందర్శనకు ప్రాధాన్యం ఇవ్వాలి
హైదరాబాద్ మల్టీ జోన్–2 ఐజీ షానవాజ్ ఖాసీం వనపర్తి: ప్రజలకు న్యాయం అందించడంలో పోలీసుశాఖ కీలక పాత్ర పోషిస్తుందని.. పోలీస్స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడికి అండగా ఉన్నారనే నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ప్రతి పోలీసు అధికారిపై ఉందని హైదరాబాద్ మల్టీ జోన్–2 ఐజీ షానవాజ్ ఖాసీం అన్నారు. ప్రజల సమస్యలను ఓర్పుతో విని సత్వర పరిష్కార చర్యలు చేపడుతూ మర్యాదపూర్వకంగా, మానవీయ దక్పథంతో వ్యవహరించడంతో పోలీసు, ప్రజా సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయాన్ని ఆయనతో పాటు జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ తనిఖీ చేసి జిల్లా పోలీసు పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఎస్పీ సునీతారెడ్డి వారికి పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో నమోదైన యూఐ, గ్రేవ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో, కాంటెస్టెడ్ కేసులు, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల దర్యాప్తు 60 రోజుల్లో పూర్తిచేసి ఛార్జిషీట్లు దాఖలు చేయాలన్నారు. ప్రతి కేసుకు స్పష్టమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, రౌడీషీటర్లు, కేడీలు, అనుమానితుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. రోజు ఉదయం, సాయంత్రం వాహన తనిఖీలు చేపట్టాలని, రాత్రి గస్తీని మరింత పటిష్టం చేయాలని పేర్కొన్నారు. పోలీసు అధికారులు, వీఆర్వోలు, బీట్ అధికారులు క్రమం తప్పకుండా గ్రామాలను సందర్శిస్తూ అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కోరారు. రికార్డులను నిరంతరం నవీకరిస్తూ ఎలాంటి పెండెన్సీ లేకుండా ప్రతి కేసు వివరాలను సీసీటీఎన్ఎస్లో సకాలంలో నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రికార్డుల నిర్వహణలో 5ఎస్ విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎస్పీ చేపడుతున్న చర్యలపై ఐజీ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించి ఆవరణలో మొక్కలు నాటారు. గతంలో ఏఎస్పీగా పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలోఅదనపు ఎస్పీ రాజేష్ మీనా, ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ గిరిబాబు, జిల్లా పోలీసు కార్యాలయ ఏఓ సునంద, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, సీఐలు సుగంధ రత్నం, రాంబాబు, శివకుమార్, సీసీఎస్ సీఐ అశోక్కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా ఓటరు జాబితా సవరణ
గద్వాల: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ రూపకల్పన ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో గద్వాల రూరల్, అర్బన్ బీఎల్ఓలు బీఎల్ఏలు, సూపర్వైజర్లకు ఓటరు జబితా రూపకల్పనపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదర్శకంగా ఓటరు జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ హరికృష్ణ, బీఎల్ఓలు, బీఎల్ఏలు సూపర్వైజర్లు పాల్గొన్నారు. నెట్టెంపాడుకు నీటి పంపింగ్ ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లో కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా ఎగువన కురిసిన వర్షాల ఆధారంగా ప్రాజెక్టుకు మంగళవారం సాయంత్రం వరకు 3,052 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో రెండు పంపులను రన్ చేసి రిజర్వాయర్లను నింపుతున్నారు. నెట్టెంపాడుకు 1,500 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 1,300 క్యూసెక్కులు వదలగా.. మరో 44 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.864 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దివ్యాంగులకు ఆ పార్టీలు చేసిందేమీ లేదు కొల్లాపూర్: దివ్యాంగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య వెల్లడించారు. మంగళవారం కొల్లాపూర్లోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా అనర్హులకు పింఛన్ల తొలగింపు ప్రక్రియ జరుగుతోందని, దాని తర్వాత పింఛన్లను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. దివ్యాంగులకు నెలకు రూ.6 వేల పింఛన్ త్వరలోనే రాబోతుందన్నారు. దివ్యాంగులకు పింఛన్లు ఇచ్చే పథకాన్ని మొదట ప్రారంభించింది.. దివ్యాంగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తుచేశారు. బీఆర్ఎస్, బీజేపీలు దివ్యాంగులకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీల్లో దివ్యాంగులకు స్థానం కల్పించాలని, 5 శాతం ఇళ్లు దివ్యాంగులకు కేటాయించాలని, కొల్లాపూర్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో రిజర్వేషన్ ప్రాతిపదికన దుకాణాలు కేటాయించేలా చూడాలని స్థానిక దివ్యాంగుల సంఘం నాయకులు వీరయ్యకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ వైస్చైర్మన్ రహీంపాష మాట్లాడుతూ మున్సిపల్ దుకాణాల్లో దివ్యాంగులకు కూడా ప్రత్యేక కోటా కల్పించేందుకు పాలకవర్గ సభ్యులతో చర్చించి తీర్మానం చేస్తామన్నారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం నాయకులు హరీష్కుమార్, రాజేందర్, ఆశన్న, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
భూ సేకరణలో చలనం
ప్రక్రియ ఆలస్యంపై సీఎం ఆగ్రహంతో కదిలిన యంత్రాంగం గద్వాల: ఉమ్మడి పాలమూరులో జలయజ్ఞం కింద చేపట్టిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ప్రాజెక్టులతోపాటు పాలమూరు– రంగారెడ్డి, ఆర్డీఎస్, గట్టు ఎత్తిపోతల పథకాల పరిధిలో చేపట్టాల్సిన భూ సేకరణపై సీఎం రేవంత్రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా ప్రాజెక్టుల కింద చేపట్టాల్సిన పెండింగ్ పనులు పూర్తిచేయాలంటే భూ సేకరణ కీలకమని తెలిసినా నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని నిలదీశారు. ముఖ్యంగా గద్వాల జిల్లాలో భూసేకరణ సాగదీతపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయా జిల్లాల కలెక్టర్లతో ఆర్అండ్ఆర్ కమిషనర్ ప్రత్యేక సమీక్షలు నిర్వహించారు. పెండింగ్లో ఉన్న భూ సేకరణను 45 రోజుల్లో పూర్తిచేయాలని లక్ష్యం నిర్ధేశించారు. దీంతో ఇంతకాలం స్తబ్ధుగా ఉన్న అధికారుల్లో చలనం మొదలైంది. నెట్టెంపాడులో ఇలా.. నడిగడ్డలో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన నెట్టెంపాడు ప్రాజెక్టు కింద కేవలం 1.45 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఈ ప్రాజెక్టు కింద 99, 100 ప్యాకేజీల పరిధిలో 541 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇది పూర్తయితే పూర్తిస్థాయి 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. గట్టు ఎత్తిపోతలు.. 2018లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టు ఎత్తిపోతలకు శంకుస్థాపన చేశారు. దీని కింద కుడి, ఎడ మ కాల్వల పరిధిలో 249 ఎకరాలు, రిజర్వాయర్ నిర్మాణానికి మరో 212 ఎకరాలు అవసరం ఉంది. ఈ భూమిని సేకరించాల్సిన ప్రక్రియ మధ్యలోనే ఆగిపోవడంతో పనులకు అడ్డంకిగా మారింది. క్షేత్రస్థాయి పర్యటనతో.. సీఎం రేవంత్రెడ్డి ఇటీవల ఉమ్మడి జిల్లాలో రెండు రోజులపాటు క్షేత్రస్థాయిలో పర్యటించి సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ క్రమంలోనే జలయజ్ఞం కింద చేపట్టిన ఆయా ప్రాజెక్టులు తుది దశలో ఉన్నప్పటికీ మిగిలిన పనులు పూర్తిచేయాలంటే వాటి కింద భూసేకరణ అడ్డంకిగా మారడంపై సీఎం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా గద్వాల జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులలో నెలకొన్న భూ సేకరణ ప్రక్రియ జాప్యంపై అధికారులను క్లాస్ తీసుకున్నారు. భూ సేకరణ ప్రక్రియ పూర్తిచేసి పెండింగ్ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే నెట్టెంపాడు, గట్టు, ఆర్డీఎస్ ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్లో ఉన్న భూ సేకరణను ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి 45 రోజుల్లో పూర్తిచేయాలని ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు.పాలమూరు– రంగారెడ్డిఎత్తిపోతలు.. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పనులు సైతం వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కింద సివిల్, మెకానికల్ పనులతోపాటు, ఇక్కడ కూడా భూ సేకరణ సంబంధించిన పనులు అడ్డంకిగా మారింది. కేఎల్ఐ.. సాగుతోంది కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా రెండు దశాబ్దాలుగా పనులు సాగుతూనే ఉన్నాయి. ఇక్కడ సుమారు 130 ఎకరాల వరకు భూమి సేకరించాల్సి ఉంది. ఫలితంగా ఈ ప్రాజెక్టు కింద కేవలం 2.50 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు పారుతుంది. భీమా.. అదే దారి దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన భీమా ఎత్తిపోతల పథకం కింద రెండు దశాబ్దాలుగా పనులు పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా భూ సేకరణ ప్రక్రియే ప్రధాన అడ్డంకిగా మారింది. నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతల పరిధిలో 1,002, ఆర్డీఎస్ పరిధిలో 567 ఎకరాలు ప్రత్యేక టీంలతో 45 రోజుల్లో పూర్తిచేసేలా అధికారుల కసరత్తు ఆర్అండ్ఆర్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారుల సమీక్షలో స్పష్టమైన ఆదేశాలు -
కమీషన్ల కోసమే కొడంగల్ ఎత్తిపోతల పథకం
● కొడంగల్ ప్రజలకై నా వందశాతం హామీలు అమలు చేయాలి ● మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కోస్గి రూరల్: పాలమూరు –రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.5,000 కోట్ల నిధులను కేటాయిస్తే కొడంగల్ నియోజకవర్గంలోని 1.50లక్షల ఎకరాలకు కాల్వల ద్వారా సాగునీరు సాధించవచ్చని, అలా చేయుకండా కమీషన్ల కోసమే నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం చేపట్టారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి విమర్శించారు. సోమవారం కోస్గిలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హమీలలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, దళితబంధు రూ.12 లక్షలు, రైతు భరోసా రూ.15 వేలు, వందశాతం రుణమాఫీలను కనీసం ఓటేసి గెలిపించిన కొడంగల్ నియోజకవర్గ ప్రజలకై న వందశాతం పూర్తి చేసి చూపించాలన్నారు. జూరాల ప్రాజెక్టులో నీరు లేదనే క్రాప్ హలిడే ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అదే జూరాల నుంచి కొడంగల్ ప్రజలకు సాగునీరు అందిస్తానని చెప్పి ప్రజలను మరోమారు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 2034 వరకు సీఎం నేనే అంటూ ప్రగల్బాలు పలకడం మానుకోవాలని, రాబోయే 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సింగల్ డిపాజిట్ రాదని, సీఎంగా రేవంత్ దిగిపోవడం ఖాయమన్నారు. కోస్గి మున్సిపాలిటీలో అండర్ డ్రెయినేజీ, తాగునీటి సరఫరా పనులలో జాప్యం చేస్తున్నారని అన్నారు. నాయకులు వెంకట్నర్సిములు, జనార్దన్రెడ్డి, నీలప్ప, సాయిలు, నరేందర్రెడ్డి, వెంకట్, శ్రీశైలం తదితరులు ఉన్నారు. -
విద్యార్థుల హాజరుశాతం పెంచాలి
ఎర్రవల్లి: విద్యార్థుల హాజరుశాతం పెంచేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలని డీఈఓ విజయలక్ష్మి అన్నారు. సోమవారం ఆమె మండలంలోని తిమ్మాపురం, పదో బెటాలియన్, ఎర్రవల్లి, కొండేరు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో విద్య, పరిపాలన, మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరును పరిశీలించారు. వంటశాలలు, ఆహార నిల్వలు, వంట సామగ్రి, పరిశుభ్రత ప్రమాణాలను తనిఖీ చేశారు. అలాగే ఆయా పాఠశాలల్లో హెచ్ఎంలు, ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు అందజేశారు. అనంతరం ఎంఈఓ కార్యాలయాన్ని సందర్శించి విద్యా కార్యక్రమాల అమలుపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం అందిస్తున్న సౌకర్యాలను సకాలంలో విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు పూర్తిస్థాయిలో పంపిణీ చేసి, ప్రతి విద్యార్థి విద్యాభ్యాసానికి అవసరమైన వనరులు అందుబాటులో ఉంచాలని చెప్పారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల హాజరు, అభ్యాస ఫలితాల మెరుగుదలపై నిరంతరం దృష్టిసారించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలులో నాణ్యత, పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈఓ అమీర్పాషా తదితరులు పాల్గొన్నారు. -
ఆదిశిలా క్షేత్రంలో అమావాస్య పూజలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం భక్తులు అమావాస్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. అలాగే కుర్తిరావులచెర్వు గట్టు తిమ్మప్పస్వామి, పాల్వాయి అడవి ఆంజనేయస్వామి, అమరవాయి చింతలాముని నల్లారెడ్డిస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా ఆలయాల ఆవరణలో భక్తులకు అన్నదానం చేయడంతోపాటు ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, నాయకులు సీతరామిరెడ్డి, చంద్రశేఖర్రావు, వీరారెడ్డి, రాముడు తదితరులు పాల్గొన్నారు. సుంకేసులకు 7 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాజోళి: సుంకేసుల డ్యాంకు ఇన్ఫ్లో కొనసాగుతుంది. సోమవారం ఎగువ నుంచి వచ్చిన నీటితో డ్యాం అధికారులు, సామర్థ్యం మేర నీరు ఉంచుకుని మిగతా నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ క్రమంలో ఎగువ నుంచి 7,650 క్యూసెక్కులు ఇన్ఫ్లో రాగా.. ఒక గేటును మీటరు మేర, మరో గేటును అర మీటర్ మేర తెరిచి 6,759 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. పీయూ డిగ్రీ ఫలితాలు విడుదల మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో వివిధ సెమిస్టర్లలో చదువుతున్న విద్యార్థుల డిగ్రీ ఫలితాలను వీసీ జీఎన్ శ్రీనివాస్ సోమవారం విడుదల చేశారు. డిగ్రీ రెండో సెమిస్టర్లో 36.24 శాతం మంది ఉత్తీర్ణతను సాధించగా, నాలుగో సెమిస్టర్లో 44.09, ఐదో సెమిస్టర్లో 66.97, ఆరో సెమిస్టర్లో 60.83 మంది ఉత్తీర్ణతను పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని, ఉత్తీర్ణత శాతం పెంచేందుకు మరింత కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు తమ ఫలితాలను పీయూ వెబ్సైట్లో చూసుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, అనురాధారెడ్డి, అరుంధతిరెడ్డి, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రోత్సాహం లింగాల: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడంతోపాటు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని టీజీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శివాజీ అన్నారు. సోమవారం లింగాల సమీపంలో కొల్లాపూర్ వెళ్లే మార్గంలో నూతనంగా ప్రారంభించిన సోలార్ ప్లాంట్ను ఆయన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. మారుమూల ప్రాంతంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వలన ఈ ప్రాంత వినియోగదారులకు ఇక విద్యుత్ సమస్య ఉండదన్నారు. ఈ ప్లాంట్ను మండలంలోని మగ్తూంపూర్, అంబట్పల్లి సబ్స్టేషన్లకు అనుసంధానం చేయడం జరిగిందని డైరెక్టర్ తెలిపారు. సాంకేతిక లోపాలు ఏర్పడితే తప్పా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ప్లాంట్ సామర్థ్యం, నిర్వహణ తదితర వివరాలను ఆయన తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎస్ఈ ఆపరేషన్ నర్సింహారెడ్డి, డీఈ ఆపరేషన్ శ్రీధర్శెట్టి, డీఈ రవి, ఎస్ఏఓ పార్థసారథి, ఆంజనేయులు, ఏఈ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రజావాణి’ ఫిర్యాదులు పరిష్కరించాలి
గద్వాల: ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించకుండా అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 55 ఫిర్యాదులు వచ్చాయని, వీటిని ఆయా శాఖల అధికారులకు పంపినట్లు వివరించారు. ప్రతి ఫిర్యాదును నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించాలని, లేనిపక్షంలో అందుకు కారణాలు వివరిస్తూ ఫిర్యాదుదారునికి అక్నాలెడ్జ్మెంట్ను పంపాలని సూచించారు. అదేవిధంగా మండల స్థాయిలో అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తే చిన్నచిన్న సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్కు రావాల్సిన అవసరం ఉండదన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు. -
అధికారులూ.. స్పందించండి!
● 60 రోజులుగా కేంద్రంలోనే వరి ధాన్యం ● మొలకెత్తినా పట్టించుకోని అధికారులు పాన్గల్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని, ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి మోసపోవద్దని అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని తెల్లరాళ్లపల్లి కొనుగోలు కేంద్రానికి తెల్లరాళ్లపల్లితండాకు చెందిన గిరిజన రైతులు లక్ష్మి, గోరి, పట్టెమ్మ, తొలియానాయక్, నర్సింహానాయక్ వరి ధాన్యం తీసుకొచ్చి 60 రోజులు కావస్తుంది. నేటికీ ధాన్యం తూకం చేయకపోవడంతో అకాల వర్షాలకు తడిసి మొలకెత్తింది. సోమవారం కేంద్రంలో మొలకెత్తిన ధాన్యాన్ని చూపుతూ తమ గోడు వెల్లబోసుకున్నారు. ధాన్యం కాంటా చేయడం లేదనే విషయాన్ని మండలస్థాయి అధికారులు, రెవెన్యూ అదనపు కలెక్టర్కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని తెలిపారు. కేంద్రంలోనే రోజుల తరబడి పడిగాపులు పడుతూ ధాన్యం కాపాడుకోవడం కష్టంగా మారిందన్నారు. ఇప్పటికై నా స్పందించి ధాన్యం తూకం చేయాలని లేకుంటే ఆత్మహత్యే శరణ్యమని వాపోతున్నారు. ఈ విషయాన్ని ఐకేపీ ఏపీఎం శ్రీనివాసులు వద్ద ప్రస్తావించగా.. హమాలీల కొరతతో ధాన్యం సేకరణలో జాప్యం జరుగుతోందని, వారి సంఖ్య పెంచి తూకం చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దన్నారు. -
విద్యార్థుల బడిబాట
అలంపూర్: వేసవి ఆటలకు సెలవు పలికిన చిన్నారులు.. పుస్తకాల బ్యాగులతో బడిబాట పట్టారు. జిల్లాలో నూతన 2026– 27 విద్యా సంవత్సరం సోమవారం వైభవంగా ప్రారంభమైంది. మొదటిరోజు పాఠశాలలకు హాజరైన విద్యార్థులు వేసవి ముచ్చట్లతో కాలక్షేపం చేశారు. చాలారోజుల తర్వాత విద్యార్థుల ఆటవిడుపులతో పాఠశాలల ప్రాంగణాలు పులకించిపోయాయి. ఒకవైపు విద్యార్థుల సందడి.. మరోవైపు ఉపాధ్యాయులు, అధికారులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలల్లో మొదట చేపట్టాల్సిన కార్యక్రమాలు నిర్వహించారు. అలంపూర్ ఎంఈఓ అశోక్కుమార్ పునఃప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును పరిశీలించారు. పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు ప్రభుత్వం తరపున ఉచిత పుస్తకాలే అందజేశారు. జిల్లా పరిధిలో ఇలా.. జిల్లాలో తొలిరోజు 12 వేల మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి తెలిపారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు 469, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలు 178 కలిపి మొత్తం 647 విద్యా సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 42,300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో మొదటిరోజు పాఠశాలలకు 12 వేల మంది విద్యార్థులు హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా పునఃప్రారంభమైన పాఠశాలలు జిల్లాలో తొలిరోజు 12 వేల మంది విద్యార్థుల హాజరు చిన్నారులకు పాఠ్య, నోట్ పుస్తకాల అందజేత -
శ్రీశైలం దారిలో..
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం దిశగా అడుగులు ● రూ.18,500 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు ● తాజాగా ప్రధాని మోదీని కలిసిన సీఎం రేవంత్రెడ్డి ● కారిడార్ నిర్మాణంతో బ్రాహ్మణపల్లి– శ్రీశైలం, పెద్దదోర్నాల– శ్రీశైలం మధ్య రవాణా సౌకర్యం మెరుగు ● మరోవైపు ఏపీ ప్రభుత్వం సైతం కేంద్రంపై ఒత్తిడి డీపీఆర్ పూర్తయింది.. ఎలివేటెడ్ కారిడార్కు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్మించే కారిడార్ సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) పూర్తయింది. కేంద్రం జాతీయ వన్యప్రాణి సంరక్షణ బోర్డు అనుమతుల కోసం నివేదిక పంపాం. బోర్డు అనుమతులు వస్తే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. అనుమతుల కోసం ఎంపీల బృందం కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీని కలిసి ప్రతిపాదనలు అందజేయగా సానుకూలంగా స్పందించారు. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, వన్యప్రాణి సంరక్షణ బోర్డు సభ్యుడు అచ్చంపేట: శ్రీశైలం క్షేత్రానికి వెళ్లాలంటే నల్లమల ఘాట్ రోడ్డు ఒక్కటే మార్గం. అందులో అనేక మలుపులు, ఎత్తుపల్లాలు ఉంటాయి. దీనికితోడు ఘాట్ రోడ్డులో రాత్రిళ్లు ప్రయాణం నిషిద్ధం. ఈ నేపథ్యంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. అయితే ఈ ప్రాజెక్టు ఇంకా ప్రతిపాదన దశలోనే ఉండగా.. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కలిసి ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని విన్నవించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం సైతం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిసింది. ఈ కారిడార్ పూర్తయితే బ్రాహ్మణపల్లి (మన్ననూర్)– శ్రీశైలం, పెద్దదోర్నాల– శ్రీశైలం మార్గాల మధ్య దూరం తగ్గి.. రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి.. తెలంగాణ వైపు బ్రాహ్మణపల్లి నుంచి శ్రీశైలం వరకు 45.35 కి.మీ., ఏపీలోని పెద్ద దోర్నాల నుంచి శ్రీశైలం వరకు 41.39 కి.మీ.,తో కలిపి మొత్తం 86.74 కి.మీ. ఎత్తైన కారిడార్ నిర్మించనున్నారు. శ్రీశైలం ఆలయ సమీపం నుంచి వెళ్లేలా మార్పులతో కూడిన డీపీఆర్ ప్రతిపాదనలు కేంద్రానికి పంపించారు. ఇందుకు రూ.18,500 కోట్ల నిధులు అవసరం కాగా.. కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2025 మార్చి 2న సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పూర్తయింది. అలాగే ఈ ప్రాజెక్టులో భాగంగా ఈగలపెంట– సున్నిపెంటల (లింగాలగట్టు) మధ్య తెలంగాణ– ఏపీలను అనుసంధానిస్తూ.. కృష్ణానదిపై రూ.300 కోట్లతో ఐకానిక్ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జాతీయ వన్యప్రాణి బోర్డు అనుమతుల కోసం.. ఈ ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ అధ్యయనం కోసం భారత వన్యప్రాణి సంస్థ సహాయం తీసుకుంటున్నారు. వారి నివేదిక ఆధారంగా జాతీయ వన్యప్రాణి మండలి అనుమతులు పొంది.. త్వరలోనే పనులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్కడి నుంచి అనుమతులు వస్తే.. కారిడార్ పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. నల్లమల అభయారణ్యం ప్రాంతం కావడంతో వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 32 అడుగుల ఎత్తులో కారిడార్ నిర్మించనున్నారు. నిత్యం వెయ్యికిపైగా వాహనాలు.. హైదరాబాద్ నుంచి శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం నిత్యం వెయ్యికిపైగా వాహనాలు వస్తుంటాయి. శని, ఆది, సోమవారాల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోతుంది. గత ఏప్రిల్ 24న కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా ఈ రహదారి మీదుగా శ్రీశైలం వెళ్తూ.. వాహనదారులు పడుతున్న అవస్థలను ప్రత్యక్షంగా చూశారు. ఈ క్రమంలోనే ఎలివేటెడ్ కారిడార్ మంజూరుకు సహకరిస్తామని చెప్పినట్లు తెలిసింది. ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా.. ఈ మార్గంలో అనేక మూల మలుపులు, ఘాట్ రోడ్డు ఉండటంతో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. శ్రీశైలం దైవ దర్శనం కోసం వచ్చి రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నెల 7న కృష్ణగిరి (ఈగలపెంట) సమీపంలో మలుపు వద్ద ఓ ప్రైవేటు టూరిస్టు బస్సు రోడ్డు పక్కనున్న గోతిలో కూరుకుపోవడంతో 10 కి.మీ., మేర వాహనాలు నిలిచిపోయాయి. అటవీశాఖ సహకారంతో హైటికోస్ స్వచ్ఛంద సంస్థ శ్రీశైలం ప్రధాన రహదారిలో 2024 జూలై నుంచి 2025 జూన్ మధ్యకాలంలో ప్రమాదాలపై సర్వే నిర్వహించింది. ఏడాదిలో 51 రకాలకు చెందిన 456 వన్యప్రాణులు మృతిచెందినట్లు తేలింది. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు కారిడార్ ఒక్కటే మార్గమని నిపుణులు చెబుతున్నారు. భూ సేకరణే కీలకం.. ఎలివేటెడ్ కారిడార్ స్తంభాల ఆధారంగా నిర్మించడం వల్ల అటవీ భూమి వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. నల్లమలలో కారిడార్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కీలకంగా మారింది. బ్రాహ్మణపల్లి నుంచి మన్ననూర్, వటువర్లపల్లి, దోమలపెంట, పాతాళగంగ వరకు 147.31 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉండగా.. 128.63 హెక్టార్ల భూమి అటవీశాఖ పరిధిలోనే ఉంది. 18.68 హెక్టార్ల భూమి మాత్రమే పట్టాదారుల నుంచి సేకరించాల్సి ఉంది. -
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలి
● బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మండిపడ్డారు. చివరలో మిగిలిన పాలమూరు ప్రాజెక్టు పనులు చేపట్టకుండా.. రైతులకు సాగునీరు అందించకుండా ద్రోహం చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నివాసంలో ఆదివారం ఆయన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులపై సుదీర్ఘంగా సమీక్షించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమావేశాలు, నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యక్రమాల తీరుపై నేతల వద్ద ఆరా తీశారు. త్వరలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితా సవరణ, పార్టీ చేపట్టనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్పై ప్రజల్లో భారీగా ఆదరణ పెరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిఒక్కరూ గుర్తించారని, ఆ పార్టీ అన్నివర్గాలకు చేస్తున్న మోసం పట్ల తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారని జిల్లా నాయకులు కేటీఆర్కు వివరించినట్లు తెలిసింది. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశా రు. ప్రతి గ్రామంలో బూత్ల వారీగా పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో ఉన్న సానుకూలతను పార్టీకి అనుకూలంగా మలు చుకోవాలని.. ఆ దిశగా కలిసికట్టుగా.. పక్కా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, జైపాల్యాదవ్, అంజయ్యయాదవ్, చిట్టెం రామ్మోహన్రెడ్డి, రావుల చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి
ఎర్రవల్లి: ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్నట్లు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఆదివారం మండలంలోని పుటాన్దొడ్డిలో రూ. 20లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధే తన ప్రథమ కర్తవ్యమని అన్నారు. గ్రామ పంచాయతీల సమగ్ర ప్రగతి ద్వారానే రాష్ట్రం, దేశాబివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నూత నంగా అందుబాటులోకి వచ్చిన పంచాయతీ భవనాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. గ్రామంలో మౌలిక సదు పాయాలు మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ రంగారెడ్డి, మాజీ జెడ్పీటీసీ హనుమంతురెడ్డి, సర్పంచ్ నారాయణ, ఉపసర్పంచ్ విజయలక్ష్మి, నాయకులు పరమేశ్వర్రె డ్డి, మహేశ్వర్రెడ్డి, పరందామిరెడ్డి, రాముడు, మద్దిలేటి, బీసన్న పాల్గొన్నారు. పాలమూరు రెడ్క్రాస్కు మొదటి బహుమతి పాలమూరు: రాష్ట్రంలో అత్యధికంగా 7323 యూనిట్ల రక్త నిల్వలు సేకరించి మొదటి స్థానంలో నిలిచిన మహబూబ్నగర్ ఇండియన్ రెడ్క్రాస్ రక్తనిధి కేంద్రానికి ఆదివారం హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతులమీదుగా రెడ్క్రాస్ చైర్మన్ నటరాజ్ బహుమతి అందుకున్నారు. 2025– 26 సంవత్సరంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు, రక్తమార్పిడి సేవలలో విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు అందించారు. గత 24 ఏళ్లుగా రక్త సేకరణలో మహబూబ్నగర్ రెడ్క్రాస్ రక్తనిధి కేంద్రం అగ్రస్థానంలో నిలుస్తుందని నటరాజ్ వెల్లడించారు. నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలోని నిరుద్యోగ యువతకు అమర్రాజా ఈఎస్ఎస్సీఐ ఆధ్వర్యంలో ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ సెంటర్ మేనేజర్ ఆనంద్కుమార్ ఆదివారం ఒక ప్రకనటలో తెలిపారు. ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రిక్ వెహికిల్ సర్వీస్, ఏసీ టెక్నీషియన్ రంగాల్లో 90 రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనునట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం సెల్ నంబర్లు 73034 44397, 73034 44561లను సంప్రదించాలని సూచించారు. -
మురిపిస్తున్న తొలకరి
అలంపూర్: తొలకరి వర్షం అన్నదాతలను మురిపిస్తోంది. ఇప్పటికే పంటల సాగులో నిమగ్నమైన రైతాంగానికి ఊరట కలిగిస్తోంది. వేసవి ఎండతో నెర్రెలుబారిన పంట పొలాలు వర్షపు నీటిలో ఓళలాడుతున్నాయి. బక్కచిక్కిని వాగులు వరద ప్రవాహంతో పారుతున్నాయి. వర్షానికి తోడు భారీ ఈదురుగాలులు వీస్తుండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. చినుకుపడినా.. గాలి వీచినా విద్యుత్ సమస్యతో అవస్థలు పడుతున్నారు. జిల్లాలో వర్షపాతం ఇలా.. జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున సైతం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షం కురిసింది. కేటీదొడ్డి మండలంలో అత్యధికంగా 82.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. వడ్డేపల్లి మండలంలో అత్యల్పంగా 6.8 మి.మీ. వర్షం కురిసింది. అయిజలో 44.5 మి.మీ., మానవపాడులో 18.5 మి.మీ., ఇటిక్యాలలో 11.8 మి.మీ., రాజోళిలో 25.5 మి.మీ., ఉండవెల్లిలో 15.2 మి.మీ., అలంపూర్ మండలంలో 9.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. అదే విధంగా గద్వాల నియోజకవర్గంలోని ధరూరులో 43.9 మి.మీ., గద్వాలలో 11.3 మి.మీ., మల్దకల్లో 9.6 మి.మీ., గట్టులో 39 మి.మీ. వర్షం కురిసింది. ప్రస్తుతం కురిసిన వర్షానికి అక్కడక్కడ వాగులు, వంకలు పారుతున్నాయి. ఈదురుగాలులకు చెట్లు, కరెంటు స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు అత్యధికంగా కేటీదొడ్డిలో 82.8 మి.మీ. అత్యల్పంగా వడ్డేపల్లిలో 6.8 మి.మీ. తడిసిన పంట పొలాలు.. సాగు పనుల్లో రైతన్నలు -
టెట్ వాయిదా వేయాలి
అయిజ: రాష్ట్రంలో ఈ నెల 17న నిర్వహించే టెట్ను వాయిదా వేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రారెడ్డి కోరారు. ఆదివారం అయిజలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో టెట్, ఆర్ఆర్బీ పరీక్షలు ఒకే రోజు ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాలతో పాటు రైల్వే ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని టెట్ను వాయిదా వేయాలని కోరారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు నర్సింహులు, మాజీ అధ్యక్షుడు భగత్రెడ్డి, లక్ష్మణ్గౌడ్, భీమన్న ఉన్నారు. -
సమస్యల బడి
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగుపడని వసతులు ● నేటి నుంచి బడుల పునఃప్రారంభం ● తరగతి గదులు, మరుగుదొడ్లు, ఇతర వసతులు కరువు ● జిల్లాలో 460 పాఠశాలలు.. 71,780 మంది విద్యార్థులు శిథిలావస్థలోతరగతి గదులు.. అనేక గ్రామాల్లో పాఠశాల భవనాలు శిధిలావస్థలో ఉన్నాయి. పైకప్పు పెచ్చులూడి విద్యార్థులపై పడిన ఘటనలు లేకపోలేదు. తరగతి గదులు శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలు సైతం పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. ఉన్న చోట సైతం కొన్ని నిరుపయోగంగా ఉంటున్నాయి. తాగునీటి వసతి సైతం అంతంత మాత్రంగానే ఉంది. ప్రహరీలు లేని పాఠశాలలు, తరగతి గదుల కొరత తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వం విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడానికి కృషి చేయాల్సిన అవసరముంది. పంపిణీకి సిద్ధంగా పాఠ్యపుస్తకాలు.. ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యా సంవత్సరం విద్యార్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. విద్యార్ధులను ప్రత్యేకంగా ఆకర్షించేలా గోడలపై విద్యా సంబంధిత చిత్రాలు, సూక్తులు, రంగురంగుల పెయింటింగ్ వేయించారు. పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్ పంపిణీకి సైతం ఏర్పాట్లు పూర్తిచేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. అలంపూర్/కేటీదొడ్డి/ఇటిక్యాల: వేసవి సెలవులు ముగిశాయి. సోమవారం నుంచి పాఠశాలు పునఃప్రారంభం కానున్నాయి. ఉన్నత విద్యతో భవిష్యత్ను తీర్చిదిద్దుకోవడానికి విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. దాదాపు నెలన్నర రోజులపాటు కొనసాగిన వేసవి సెలవులకు స్వస్తి పలికి.. ఆట–పాటల మధుర స్మృతులతో పాఠశాలలో అడుగు పెట్టనున్నారు. చాలా వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఎప్పటిలాగే అరకొర వసతుల మధ్యే తమ విద్యాభ్యాసం కొనసాగించనున్నారు. ప్రభుత్వం విద్యాలయాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో దృష్టిసారించకపోవడంతో చదవుకునేందుకు వచ్చే కొత్త, పాత విద్యార్థులకు కష్టాలు తప్పని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని అమల్లోకి తెచ్చినప్పటికీ.. సమస్యలు మాత్రం పూర్తిస్థాయిలో పరిష్కారానికి నోచుకోలేదు. అసంపూర్తిగా పనులు.. గతేడాది మౌలిక వసతుల కల్పనలో భాగంగా ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమానికి 142 బడులను ఎంపిక చేసింది. ఆయా పాఠశాలల అభివృద్ధి కోసం చేపట్టిన అనేక పనులు నేటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. ఫలితంగా విద్యార్థులు మౌలిక వసతులకు నోచుకోక ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది. -
రైతు మురిసేలా.. సాగు మారాల
గద్వాల వ్యవసాయం: సంప్రదాయ పంటలకు స్వస్తిచెబుతూ.. సాగులో వినూత్న ఒరవడిని సృష్టిస్తేనే రైతులకు మేలు జరిగి లాభాలు వస్తాయని నిపుణులు అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. ఈ క్ర మంలో ప్రస్తుత వానాకాలం సీజన్లో పంట మార్పిడిలు చేయాలని, నానో యూరియా వినియోగించాలని, సేంద్రియ పద్ధతులు పాటించాలని వ్యవ సాయ శాఖ గడిచిన నెల రోజుల నుంచి విస్తృతంగా రైతులకు అవగాహన సమావేశాలు నిర్వహిస్తోంది. ఈసారి రైతులు సాగులో కొంతైనా మార్పులు వస్తాయని వ్యవసాయశాఖ భావిస్తోంది. అయితే ప్రస్తుత వానాకాలం సీజన్లో 4,35,252 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మరి ఈసారి జిల్లాలో పంటల మార్పు ఏ మేరకు జరుగుతుందో వేచిచూడాలి. పలు అంశాలపై అవగాహన.. రైతులు ఇష్టానుసారంగా రసాయనిక ఎరువులను వినియోగిస్తున్నారు. దీనివల్ల భూసారం క్షీణిస్తోంది. దీనిని నివారించేందుకు ప్రభుత్వాలు పలుమార్లు ప్రయత్నించినా పెద్దగా ఫలితం రాలేదు. కానీ, ఈసారి వ్యవసాయ శాఖ అధికారులు మే నెలలో రైతులకు దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించారు. రసాయనిక ఎరువుల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ.. సేంద్రియ ఎరువుల ఆవశ్యకత గురించి చెప్పారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ (ఎన్ఎంఎన్ఎఫ్) పథకాన్ని ఈ వానాకాలం సీజన్లో జిల్లాలో అమలు చేయించి రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జిల్లాలో 2,500 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో సేద్యం చేయించి పంటలు పండించనున్నారు. ఇందుకోసం ఐదు నెలల క్రితమే జిల్లాలోని ప్రతి మండలంలో ఒకటి లేదా రెండు క్లస్టర్ల నుంచి, ఒక్కో క్లస్టర్కు 125 ఎకరాల చొప్పున మొత్తం 20 వ్యవసాయ క్లస్టర్ల నుంచి 2500 ఎకరాల భూములు, రైతులను ఎంపిక చేశారు. అయితే ప్రకృతి వ్యవసాయ విధాన పద్దతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలను కృషి సఖిలుగా నియామకం చేశారు. వీరికి సెంటర్ ఫర్ సస్స్టెనబుల్ అగ్రికల్చర్ అనే ఎన్జీఓ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించడంతోపాటు, వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా శిక్షణ అందించారు. కృషి సఖిలు ఎంపిక చేసిన పొలాల్లో క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తారు. పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వారితో వ్యవసాయం చేయించనున్నారు. ఎప్పుడూ ఒకే రకమైన పంట వేయడం వల్ల దిగుబడులు రావని, పంట మార్పిడి చేయాలని రైతులకు అవగాహన కల్పించారు. అలాగే యూరియా ఇబ్బందులను అధిగమించేందుకు నానో యూరియా వినియోగించాలని సూచించారు. దీనివల్ల పంట ఎదుగుదల మెరుగుపడటమే కాకుండా.. దిగుబడి సైతం పెరుగుతుందని వివరిస్తున్నారు. పంట ప్రణాళిక ఖరారు.. వానాకాలం సీజన్కు సంబంధించి పంట ప్రణాళికను వ్యవసాయ అధికారులు సిద్ధం చేశారు. ఈ మేరకు జిల్లాలో 3,92,882 ఎకరాల్లో వ్యవసాయ, 42,370 ఎకరాల్లో ఉద్యాన పంటలు కలిపి మొత్తం 4,35,252 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు అవుతాయని అంచనా వేశారు. వ్యవసాయ పంటలకు సంబంధించి ప్రధానంగా పత్తి, వరి, కంది పంటలను ఎక్కువగా సాగు చేస్తారని భావిస్తున్నారు. అయితే వర్షాలు ఇంకా ఆరంభం కాలేదు. ప్రస్తుతానికి జిల్లాలో మోస్తరుగా రెండుసార్లు మాత్రమే వర్షాలు వచ్చాయి. దీంతో వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే జిల్లాలోని బోర్లు, బావులు ఉన్న రైతులు అక్కడక్కడ సాగు పనులు మొదలుపెట్టారు. ఇప్పటి వరకు 27,074 ఎకరాల్లో పంటలు సాగు అయ్యాయి. వ్యవసాయంలో మార్పులుతీసుకొచ్చేందుకు ముమ్మరంగా కసరత్తు పంటల మార్పిడి, నానో యూరియాపై అన్నదాతలకు అవగాహన సేంద్రియ పద్ధతులపై అధికారుల విస్తృత ప్రచారం ఈసారి 2,500 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయానికి చర్యలు జిల్లాలో ఈసారి 4,35,252 ఎకరాల్లో పంటల సాగు అంచనా సలహాలు, సూచనలు పాటించాలి ప్రస్తుత వానాకాలం సీజన్లో పంటలు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి సేంద్రియ ఎరువులు, నానో యూరియా ఇలా పలు విషయాలపై రైతులకు అవగాహన కల్పించాం. వాటిని తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు తీసుకుంటూ పంటలు సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుంది. – వీరప్ప, జిల్లా వ్యవసాయాధికారి జిల్లాలో సాగైన పంటలు ఇలా.. పంట అంచనా ఇప్పటి వరకు సాగైనవి పత్తి 2,09,144 26,584 వరి 1,21,941 – కంది 23,739 450 మొక్కజొన్న 22,982 – వేరుశనగ 6,396 – ఇతర పంటలు 8,680 – ఉద్యానపంటలు 42,370 40 -
భారీ వర్షం.. రైతన్న హర్షం
● వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన అన్నదాతలు ధరూరు/ అయిజ/ రాజోళి/ ఉండవెల్లి/ అలంపూర్ రూరల్/ మానవపాడు: జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. ప్రధానంగా ధరూరు మండలంలో శనివారం ఉదయం 5 నుంచి 6 గంటల వరకు గంటపాటు కుండపోత వర్షం కురిసింది. అలాగే మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఆరుతడి పంటల సాగుకు అనువుగా మారింది. ముఖ్యంగా ఖరీఫ్ పంట సాగుకు పొలాలను సిద్ధం చేసుకున్న రైతులు పత్తి, ఇతర విత్తనాలు నాటుకునేందుకు ఈ వర్షం అనుకూలంగా మారిందని పేర్కొంటున్నారు. అలాగే మానవపాడు మండలంలో శనివారం 36.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. అలాగే అలంపూర్ మండల పరిధిలో 41.2 మి.మీ., వర్షపాతం నమోదైందని తహసీల్దార్ ప్రభకర్ వెల్లడించారు. ఉండవెల్లి మండలంలోని అన్ని గ్రామాల్లోనూ మోస్తారు వర్షం కురిసింది. దీంతో శనివారం రైతులు పంట పొలాల్లో పత్తి విత్తనాలు నాటడంలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో మండల పరిధిలో జాతీయ రహదారిపై అడ్డుగా పడిన చెట్లను ఎస్ఐ శేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు తొలగించారు. రాజోళి, వడ్డేపల్లి మండలాల్లోనూ శనివారం పలుచోట్ల వర్షం కురిసింది. ఉదయం చినుకులతో మొదలైన వర్షం అక్కడక్కడా మోస్తరుగా కురవడంతో రైతులు సంబరపడ్డారు. అయిజ మండలంలో అత్యల్పంగా 2.4 మి.మీ., వర్షపాతం నమోదయ్యింది. -
ఆదిశిలా క్షేత్రంలో న్యాయమూర్తి ప్రత్యేక పూజలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రం స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం గద్వాల అదనపు జూనియర్ సివిల్ జడ్జి వెంకటేష్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు, చైర్మన్ జడ్జి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం వారిని శేషవస్త్రంతో సత్కరించి మెమోంటోను బహూకరించారు. వారి వెంట అర్చకులు ధీరేంద్రదాసు, మధుసూదనాచారి, శశాంక్, చంద్రశేఖర్రావు, చంద్రశేఖర్రెడ్డి తదితరులున్నారు. జూరాలకు 2,596 క్యూసెక్కుల ఇన్ఫ్లో ధరూరు/ రాజోళి: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లో కొనసాగుతుంది. కొన్ని రోజులుగా స్థానికంగా కురుస్తున్న వర్షాల ఆధారంగా ప్రాజెక్టుకు శనివారం సాయంత్రం వరకు 2,596 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో నెట్టెంపాడు ఎత్తిపోతలకు రెండు పంపులను రన్ చేసి గుడ్డెందొడ్డి, ర్యాలంపాడు రిజకర్వాయర్లను నింపుతున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1,500 క్యూసెక్కులు వదలగా.. మరో 43 43 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.773 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో దాదాపు 3 టీఎంసీల నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. సుంకేసుల డ్యాంలో శుక్రవారం ఒక గేటు తెరిచి దిగువకు నీటిని వదిలిన అధికారులు శనివారం గేటును మూసేశారు. డ్యాంకు శనివారం ఎలాంటి ఇన్ఫ్లో లేకపోవడంతో గేటును మూసినట్లు అధికారులు తెలిపారు. ఆర్టీసీ విలీనానికి ఉన్నత స్థాయి కమిటీ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రభుత్వంలో టీజీఆర్టీసీ విలీనం చేసేందుకు గాను ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైందని ఆర్ఎం సంతోష్ కుమార్ తెలిపారు. శనివారం తన చాంబర్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ గత ఏప్రిల్లో కార్మికుల సమ్మె అనంతరం వివిధ డిమాండ్ల పరిష్కారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ ముఖ్యంగా మూడు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇందులో 2021 వేతన సవరణను ఈనెల నుంచే అమలు చేయడం, కార్మిక సంఘాల పునరుద్ధరణ.. గుర్తింపు సంఘం కోసం ఎన్నికలు, తదుపరి విలీన ప్రక్రియ ఉన్నాయన్నారు. దీనికి సంబంధించి ప్రతి కార్మికుడి అభిప్రాయానికి విలువ ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. త్వరలోనే అన్ని డిపోలలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందన్నారు. ఎన్నికల్లో మెజారిటీ సాధించిన కార్మిక సంఘాల ప్రతినిధులను విలీన ప్రక్రియలో ప్రత్యక్ష భాగస్వాములుగా చేస్తారన్నారు. వారి సూచనలు, సలహాలను కేబినెట్ సబ్ కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. -
పరిహారమిచ్చిన తర్వాతే స్వాధీనం చేసుకోవాలి..
కానుకుర్తి రిజర్వాయర్ ని ర్మాణంలో భాగంగా సర్వే నంబర్ 361, 383 381 382,387లో మొత్తం 10.6 ఎకరాల సాగు భూమిని కోల్పోయా. చివరగా ఉన్న మా భూముల్లో పనులు ఆలస్యంగా ప్రారంభమవుతాయి. ఈ వానాకాలం నారు పోసుకునేందుకు సిద్ధం చేస్తున్నా. పక్క గ్రామంలో ఈ సారి పంట వేయొద్దని చాటింపు వేశారట. మాకై తే ఎవ రూ చెప్పలేదు. పరిహారం పూర్తి స్థాయిలో అందజేసిన తర్వాతే భూమి స్వాధీనం చేసుకోవాలి. అప్పటివరకు సాగు చేస్తాం. – ప్రకాష్ రెడ్డి, కానుకుర్తి, దామరగిద్ద, నారాయణపేట -
ఎన్నటికో..?!
కొల్లాపూర్: పర్యాటక ప్రియులను ఆకర్షించేలా.. కొల్లాపూర్ నుంచి సోమశిలకు వెళ్లే దారిలో నల్లమల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎకో పార్కు ప్రారంభం రెండేళ్లుగా పెండింగ్లో పడుతూ వస్తోంది. అడవులపై అవగాహన, జంతు సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి అందాల గురించి ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో దీనిని నిర్మించారు. నల్లమల అడవిలో ఏర్పాటు చేసిన ఈ పార్కులో వ్యూ పాయింట్ సైతం అందుబాటులో ఉంది. అమ్రాబాద్ వ్యూ పాయింట్ తరహాలో ఎత్తైన కొండపై నుంచి నల్లమల అందాలు, కృష్ణానది ప్రవాహం తిలకించేలా ఇక్కడ వ్యూ పాయింట్ నిర్మించారు. అయితే అన్నిరకాల పనులు పూర్తయ్యాయి అని అటవీ అధికారులు చెబుతున్నప్పటికీ పార్కు అధికారికంగా ప్రారంభానికి నోచుకోవడం లేదు. రూ.1.50 కోట్లతో నిర్మాణం కొల్లాపూర్ నుంచి సోమశిల వెళ్లే దారిలో అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు ఐదేళ్ల క్రితం పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తర్వాతి కాలంలో పార్కుకు సమీపంలోనే అటవీ ప్రాంతంలో వ్యూ పాయింట్ నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.1.50 కోట్ల నిధులను హరిత, టీకేహెచ్ఎస్ ద్వారా కేటాయించారు. ఈ పనులను అటవీ శాఖ ఆధ్వర్యంలోనే చేపట్టారు. రెండేళ్ల క్రితమే నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. అప్పట్లో భారీ వర్షాల కారణంగా పార్కు నుంచి వ్యూ పాయింట్కు వెళ్లే రోడ్డు కోతలకు గురికావడంతో ప్రారంభాన్ని వాయిదా వేసినట్లు సమాచారం. తర్వాతి కాలంలో రోడ్డుకు మరమ్మతు చేసినా.. పార్కు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు. షార్ట్ఫిల్మ్లకు వేదికగా.. పార్కు నుంచి అటవీ ప్రాంతం లోపల ఎత్తైన ప్రాంతంలో వ్యూపాయింట్ నిర్మించారు. పార్కు నుంచి వ్యూపాయింట్కు వెళ్లేందుకు వీలుగా కిలోమీటర్ మేర మట్టి రోడ్డు ఏర్పాటుచేశారు. రోడ్డుకు ఇరువైపులా ట్రెంచ్, కంచె నిర్మించారు. వ్యూ పాయింట్ వద్దకు పర్యాటకులను తీసుకువెళ్లేందుకు రెండు ప్రత్యేక వాహనాలను అటవీ శాఖ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచారు. పార్కు నిర్వహణను పర్యవేక్షించేందుకు సిబ్బందిని సైతం ఏర్పాటు చేశారు. అధికారికంగా పార్కు ప్రారంభం కానప్పటికీ.. అనధికారికంగా పర్యాటకులు వ్యూ పాయింట్ వరకు వెళ్లేందుకు ఇటీవల కాలంలో అనుమతులు ఇస్తున్నారు. పార్కు ప్రారంభమైతే షార్ట్ఫిల్మ్ షూటింగ్లకు వ్యూపాయింట్ వేదికగా మారే అవకాశం ఉంటుంది. త్వరలోనే ప్రారంభిస్తాం.. ఎకో పార్కులో నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయి. వ్యూ పాయింట్ను తిలకించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం పర్యాటకుల కోసం తాగునీటి వసతులు ఏర్పాటు చేశాం. టాయిలెట్స్ నిర్మించాం. మట్టి రోడ్డు కోతలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పర్యాటకుల తాకిడిని బట్టి వసతుల కల్పనకు అవసరమైన చర్యలు చేపడతాం. వచ్చే నెలలో పార్కును అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది. – వాణికుమారి, ఫారెస్టు రేంజర్, కొల్లాపూర్ సోమశిల వెళ్లే దారిలో అటవీ ప్రాంతంలో పార్కు ఏర్పాటు కృష్ణానది, నల్లమల అందాలుతిలకించేలా వ్యూ పాయింట్ నిర్మాణం ఇప్పటికే రోడ్డు నిర్మాణం, వసతుల కల్పన పూర్తి రెండేళ్లుగా ప్రారంభం కోసం ఎదురుచూపులు అందుబాటులోకి వస్తే పర్యాటకులకు మధురానుభూతి -
కనువిందు చేసే అందాలు..
కొల్లాపూర్లోని పర్యాటక ప్రాంతాలను తిలకించేందుకు ఆగస్టు నుంచి మార్చి నెల వరకు పర్యాటకులు వస్తుంటారు. సోమశిలకు వెళ్లే మార్గంలో కొల్లాపూర్ పట్టణానికి దగ్గరలోనే ఉన్న ఎకో పార్కు, నల్లమల వ్యూ పాయింట్ పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ కానుంది. వ్యూ పాయింట్ వద్ద నుంచి చూస్తే సోమశిల గ్రామం, సమీపంలోని కృష్ణానది, కర్నూలు జిల్లా పరిసర ప్రాంతాలు, నల్లమల అభయారణ్యం వంటి దృశ్యాలు కనువిందు చేస్తాయి. పక్షులు, జంతువుల కదలికలు కూడా పర్యాటకులను ఆహ్లాదపర్చనున్నాయి. వ్యూ పాయింట్ ఇదే.. -
సరళాసాగర్లో ఇలా..
సరళాసాగర్ జలాశయం కింద 9 గ్రామాల పరిధిలో 3,200 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో వరి నారు పోసుకోవడానికి రైతులు సిద్ధమవుతున్నారు. మదనాపురం సమీపంలోని ఊకచెట్టు వాగు వద్ద రెండో రైల్వే వంతెన నిర్మాణ పనులు కొనసాగుతుండగా రామన్పాడు వెనుక జలాల నుంచి సరళాసాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలించే ప్రధాన పైప్లైన్ను తొలగించాల్సి వచ్చింది. దీంతో సరళాసాగర్ ప్రాజెక్టుకు సాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి పైప్లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించడంతో పాటు రూ.49.50 లక్షలు మంజూరు చేశారు. కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటికీ పైప్లైన్ ఏర్పాటు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటికిప్పుడు పనులు వేగవంతం చేసినా మరో 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. సమయం దాటిపోతే ఈ ఏడాది వానాకాలం పంటలకు నీరందడం కష్టమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అత్యవసర పరిస్థితుల్లో స్పందించాలి : ఎస్పీ
అలంపూర్: అత్యవసర పరిస్థితుల్లో డైలీ వచ్చే కాల్స్కు తక్షణమే స్పందించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. అలంపూర్ పోలీస్స్టేషన్ను ఎస్పీ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి.. స్టేషన్లోని రిసెప్షన్, రైటర్ సెక్షన్, టెక్ టీం, ఎస్హెచ్ఓ కార్యాలయం, లాకప్, విశ్రాంతి గదులు, వాహనాల పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. సిబ్బంది యూనిఫాం నిర్వహణతోపాటు జనరల్ డైరీ, బీట్ డ్యూటీ బుక్స్, ఉన్నతాధికారుల సందర్శన రికార్డులు తదితర పత్రాలను పరిశీలించారు. అనంతరం ఎస్పీ సిబ్బందితో సమావేశమై పోలీస్స్టేషన్ పరిధిలోని గ్రామాలు, బీట్ వ్యవస్థ, పెట్రోల్ వాహనాల విధుల గురించి తెలుసుకున్నారు. గ్రామాల్లో క్రమం తప్పకుండా పర్యటిస్తూ సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, మూఢనమ్మకాలు, బాల్య వివాహాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను విస్తృతంగా నిర్వహించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఆదేశించారు. డయల్ 100 కాల్ అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సమస్యలను పరిష్కరించడంతోపాటు ప్రజా ఫిర్యాదులపై ఎలాంటి జాప్యం లేకుండా స్పందించాలన్నారు. సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ మినహాయించాలి గద్వాల న్యూటౌన్: న్యాయబద్ధంగా, నోటిఫికేషన్ ప్రకారం నియామకమైన ఉపాధ్యాయులకు 1 ఏప్రిల్ 2010 పూర్వం టెట్ ప్రస్తావన లేదని తపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవీందర్రెడ్డి, నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2010 తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్లో టెట్ అర్హత ఆధారంగా నియామకాలు జరుగుతున్నాయని చెప్పారు. 1 ఏప్రిల్ 2010 ఆర్టీఈ రూల్స్కు అనుగుణంగా ఎన్సీటీఈ టెట్ నిబంధనను చేర్చిందన్నారు. ఈ నిబంధనల ఆధారంగానే 2028 ఆగస్టు 31లోపు ఇన్ సర్వీసు ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఇది దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు ఇబ్బంది కలిగించే అంశం అన్నారు. 1 ఏప్రిల్ 2010 కన్నా ముందు వేసిన నోటిఫికేషన్ ద్వారా నియామకమైన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించేలా తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 523 క్వింటాళ్ల వేరుశనగ రాక గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు శుక్రవారం 523 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ.7,611, కనిష్టంగా రూ. 3,599, సరాసరిగా రూ.6,399 ధరలు లభించాయి. అలాగే 33 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ.1,659, కనిష్టంగా రూ. 1,300, సరాసరిగా ధర రూ.1,659 పలికింది. -
జాతీయ రహదారికి కనెక్టివిటీ కల్పించాలి
గట్టు: జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న ఆరు వరుసల జాతీయ రహదారికి గట్టు మండలానికి కనెక్టివిటీ కల్పించే అప్రోచ్ రోడ్డు, రాయాపురం డబుల్ రోడ్డు దగ్గర వంతెన నిర్మించాలని గట్టు, రాయాపురం, ఆలూరు, తుమ్మలచెరువు గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు రాముడు ఆధ్వర్యంలో నాలుగు గ్రామాల ప్రజలు చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారం నాటికి 116వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగా నిర్మించే జాతీయ రహదారి విషయంలో అధికారులు అవసరమున్న చోట కాకుండా అవసరం లేని చోట వంతెన నిర్మాణం చేపట్డడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. డబుల్ రోడ్డు ఉన్న చోటే వంతెన నిర్మాణం చేపట్టాలని, కొత్త రోడ్డుపైకి గట్టు మండల ప్రాంత ప్రజలు చేరుకునేలా అప్రోచ్ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. రోడ్డు కనెక్టివిటీ వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని ఆయా గ్రామాల ప్రజలు అభిప్రాయపడ్డారు. రిలే దీక్షలను కొనసాగిస్తున్న వారు మహాబూబ్నగర్లోని జాతీయ రహదారి నిర్మాణ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్ అధికారి భన్సల్కుమార్ను కలిసి విన్నవించారు. అధికారుల బృందం పరిశీలన.. గట్టు మండలంలో ఆందోళన కొనసాగుతున్న ప్రాంతాన్ని జాతీయ రహదారి నిర్మాణ సంస్థ రీజినల్ అధికారి శివశంకర్, ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్ మహబూబ్నగర్ అధికారి భన్సల్కుమార్, టెక్నికల్ మేనేజర్ తోటబాబు, మెగా ప్రాజెక్టు మేనేజర్ వినోద్కుమార్, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ అసదుల్లా పరిశీలించారు. రాయాపురం స్టేజీతోపాటు పాత ఆలూరు దారిలో నిర్మించిన వంతెనను అధికారులు పరిశీలించి వెళ్లారు. వంతెన ప్రతిపాదన విషయంలో ఇంజినీరింగ్ అధికారుల తప్పిదాన్ని గుర్తించినట్లు సమాచారం. ఈ ప్రాంత ప్రజల డిమాండ్ను కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు జాతీయ రహదారి నిర్మాణ సంస్థ అధికారులు చెప్పారు. -
సలహాలతో సాగు.. లాభాలు బాగు
● ప్రశ్న: ఎనిమిదేళ్ల నుంచి పత్తి పంట వేస్తున్నాం. దిగుబడులు ఎందుకు ఎక్కువగా రావడం లేదు.? – శ్రీనివాస్రెడ్డి, సుదర్శన్ (గద్వాల), రాజు, తిమ్మన్న (ధరూర్) ● డీఏఓ : ఎప్పుడూ ఒకే రకమైన పంట వేయరాదు. దీని వల్ల దిగుబడులు ఎక్కువగా రావు. పంట మార్పిడి చేయాలి. వ్యవసాయ విస్తరణ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోండి. ● ప్రశ్న: విత్తనాలు కొనేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? – రాజేష్, వెంకట్రెడ్డి (గద్వాల), రాముడు, గోవిందు (అయిజ), గోపాల్, భీమేష్నాయుడు, ఆంజనేయులు (మానవపాడు) ● డీఏఓ : లైసెన్స్ కలిగిన డీలర్ల వద్ద మాత్ర మే విత్తనాలు కొనుగోలు చేయాలి. సీల్ ఉన్న పాకెట్ను తీసుకోవాలి. ఎక్స్పైరీ తేదీ గమనించాలి. రశీదు తప్పక తీసుకొని, పంట పూర్తయ్యే వరకు జాగ్రత్తగా దాచుకోవాలి. గద్వాల వ్యవసాయం: ‘జిల్లాలో ఇప్పటి వరకు ఇంకా సాధారణ వర్షపాతమే నమోదు కాలేదు. తొందరపడి విత్తనాలు వేయొద్దు. జూలై 15 వరకు వేయడానికి అవకాశం ఉంటుంద’ని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరప్ప అన్నారు. శుక్రవారం ఉదయం నిర్వహించిన ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా రైతులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. విత్తనాల ఎంపిక, వాడకం, విత్తనశుద్ధి, దుక్కులు సిద్ధం చేసిన తర్వాత చేయాల్సిన పని, ఏయే భూముల్లో ఏ రకమైన పంటలు వేయాలి.. తదితర అంశాలపై రైతులకు సలహాలు, సూచనలు అందించారు. రైతులు అధికారుల సలహాలు తీసుకొని పంటలు సాగు చేస్తే.. మంచి దిగుబడులతో లాభాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. ● ప్రశ్న: విత్తనాలు వేయక ముందు ఎలాంటి సస్యరక్షణ చేపట్టాలి.? – వెంకటేష్, రంగన్న (గట్టు), రామకృష్ణ, మధుబాబు (మల్దకల్), నర్సింహులు, రాజు (కేటీదొడ్డి) ● డీఏఓ : పాత పంటను పూర్తిగా తొలగించాలి. లోతు దుక్కులు వాలుకు అడ్డంగా దున్నాలి. దీనివల్ల పురుగుల అవశేషాలు చనిపోతాయి. పురుగుల బెడద తగ్గుతుంది. ఆ తర్వాత ఎకరాకు నాలుగు టన్నుల పశువుల ఎరువును వేయాలి. వరి పంటకు అయితే పచ్చిరొట్టె ఎరువులైన జీలుగ, జనుము, పిల్లి పెసర వేయాలి. ● ప్రశ్న: ఏ నేలలో.. ఏ రకమైన పంటలు వేయాలి.? – హన్మంతు, సురేష్ (గట్టు), శ్రీరాములు, నర్సింహ (గద్వాల) ● డీఏఓ : నల్లరేగడి భూముల్లో పత్తి, మిరప, నూనె గింజలు వేయాలి. కందిపంట వేసి అంతర పంటగా పెసర వేయవచ్చు. ఎర్రటి నేలల్లో సాగునీరు అందుబాటులో ఉంటే పత్తి, ఉల్లి, నూనె గింజలు, కంది సాగు చేయవచ్చు. ఇసుక నేల ల్లో పత్తి, మిరప, పప్పు దినుసులు పండించవచ్చు. ● ప్రశ్న: జిల్లాలో అందుబాటులో ఉన్న పత్తి విత్తనాల రకాలు.? – నర్సింహారెడ్డి, పాండురెడ్డి (గద్వాల), త్రివిక్రమ్, గోపాల్రెడ్డి (అయిజ), దేవదాసు,ఆంజనేయులు (శాంతినగర్) ● డీఏఓ : సదానంద, మైకో, యూఎస్, ఆద్య తదితర వాటితోపాటు పలు రకాల పత్తి విత్తనాలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. ● ప్రశ్న: నాలుగేళ్ల నుంచి ఏ పంట వేసినా ఆశించిన మేర దిగుబడులు రావడం లేదు. ఎందుకు? – కృష్ణవర్ధన్రెడ్డి, మనోహర్ (గద్వాల), రామకృష్ణ, కోటేష్ (ఇటిక్యాల) ● డీఏఓ : మీరు నాలుగేళ్లుగా వేసిన పంటల వివరాలు, వాడిన ఎరువులు, మందుల వివరాలు ఏఈఓల దృష్టికి తీసుకెళ్లండి. రైతులందరూ వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. ● ప్రశ్న: పంట పెట్టుబడులు బాగా పెరుగుతున్నాయి.. తగ్గించడానికి గల మార్గాలు తెలియజేయండి..? – రాకేష్, (గద్వాల) ● డీఏఓ : పంట పెట్టుబడుల్లో ప్రధానంగా ఇష్టానుసారంగా రసాయనిక ఎరువులు, పురుగు మందులకు ఖర్చు చేస్తున్నారు. వీటికి బదులుగా సేంద్రియ ఎరువులు వినియోగించాలి. అదేవిధంగా పాత పద్ధతులు కాకుండా నూతన వ్యవసాయ పద్ధతులు అవలంభించాలి. పంటలకు ఏ మందులు వేయాలన్నా విస్తరణాధికారుల సలహాలు, సూచనలు తీసుకోండి. టీజీ టీ–20 లీగ్లో మనోళ్లు ఈ నెల 21 నుంచి జరగనున్న టీజీ టీ–20 క్రికెట్ లీగ్కు ఉమ్మడి పాలమూరుకు చెందిన నలుగురు క్రికెటర్లు ఎంపికయ్యారు. –8లో uసకాలంలో వర్షాలు రాకపోతే ఆరుతడి పంటలు వేయాలి జిల్లాలో అందుబాటులో ఎరువులు, విత్తనాలు లైసెన్స్డ్ డీలర్లతోనే విత్తనాలుకొనుగోలు చేయాలి యూరియాకు బదులుగా నానో యూరియా వినియోగించండి ‘సాక్షి’ ఫోన్ ఇన్లో జిల్లా వ్యవసాయాధికారి వీరప్ప ప్రశ్న: ప్రస్తుత వానాకాలం సీజన్లో ఏ సమయం వరకు విత్తనాలు వేసుకోవచ్చు.? – రాధాకృష్ణ, తిమ్మోతి (ధరూర్), వాసు, కృష్ణ, అంజి (వడ్డేపల్లి), రాజనర్సింహ, గోపాల్ (ఉండవెల్లి) డీఏఓ : వర్షాలు ఇంకా ఆరంభం కాలేదు. కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాలకు భూమి పదును కాలేదు. రైతులు తొందరపడరాదు. జూలై 15 వరకు విత్తనాలు వేయవచ్చు. జూలై 15 వరకు కూడా సాధారణ వర్షపాతం నమోదు కాకపోతే ఏయే రకమైన పంటలు వేయాలో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులు చెబుతారు. వారి సలహాల ప్రకారం పంటలు వేయండి. ప్రశ్న: జిల్లాలో సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయా.? – రాధాకృష్ణ, మాధవ్ (మల్దకల్), గోపాల్, భీంసేన్రెడ్డి (ఎర్రవల్లి) డీఏఓ : జిల్లాలో అన్ని రకాల పంటలకు సంబంధించిన విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ వానాకాలం సీజన్లో 1,11,922 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉంటుందని అంచనా వేశాం. అయితే ఇప్పుడు 50,318 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఎరువుల కొరత రాకుండా అన్నిరకాల ముందస్తు చర్యలు తీసుకుంటాం. నానో యూరియాతో పలు ప్రయోజనాలు ఉన్నాయి. యూరియాకు బదులుగా నానో యూరియాను వాడండి. -
‘సర్’ పై అప్రమత్తంగాఉండండి
కొల్లాపూర్: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ‘సర్’ పట్ల కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఓట్లు తొలగించే ప్రమాదం ఉంటుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సర్పై అవగాహన కోసం డీసీసీ ఆధ్వర్యంలో కొల్లాపూర్లోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణతో కలిసి మంత్రి జూపల్లి పాల్గొని మాట్లాడారు. సర్ అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిదన్నారు. మతం పేరుతో ఓట్లు తొలగించేందుకు ఇదో రకమైన కుట్ర అన్నారు. బూత్ స్థాయిలో ఉండేవారు ఓటరు జాబితాను జాగ్రత్తగా గమనించాలని, ఇతర ప్రాంతాల్లో ఓటర్లు ఉంటే వారితో ఫోన్లో మాట్లాడి వివరాలు రిజిస్ట్రేషన్ చేసేలా చూడాలన్నారు. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు వీటిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని సూచించారు. ఎంపీ మల్లురవి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కారుకు మేలు చేసేలా ఎన్నికల కమిషన్ చర్యలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మీనాక్షి నటరాజన్ వ్యవహారంతోపాటు పలు అంశాల్లో ఇదే జరుగుతోందన్నారు. విపక్షాల ఓటుబ్యాంకును తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, కాంగ్రెస్ శ్రేణులు దీనిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల ఓటుబ్యాంకును తగ్గించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించే బస్సు యాత్రను ప్రారంభించారు. కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి జూపల్లి కృష్ణారావు సూచన -
చర్యలు తీసుకుంటాం..
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. రవాణ, పోలీసు శాఖ సంయుక్తంగా వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా గూడ్స్ వాహనాలలో సరుకులను మాత్రమే ట్రాన్స్పోర్టు చేయాలి. అయితే కొందరు ప్రజలను గూడ్స్ వాహనాలపై ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. ఇలాంటి వాహనదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. రోడ్డు ప్రయాణాలు చేస్తున్న ప్రతిఒక్కరు నిబంధనలు పాటించాలి. మద్యం, నిద్రలేమి, అవగాహన, సామర్థ్యం లేని వ్యక్తులు డ్రైవింగ్ చేయరాదు. అన్ని ప్రధాన రహదారులపై సూచిక బోర్డులు ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. రోడ్డు నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తాం. – మొగిలయ్య, డీఎస్పీ, గద్వాల ● -
రాజధానికి చేరిన ధాన్యం పంచాయితీ
రైస్మిల్లులపై వరుస టాస్క్ఫోర్స్ దాడులు ● కనిపించని రూ.కోట్ల విలువజేసే వరి ధాన్యం ● తూతూమంత్రంగా జిల్లాస్థాయి అధికారుల చర్యలు ● చేసేది లేక రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు ●వనపర్తి: జిల్లాలో గడిచిన పదేళ్లలో వరి సాగు, ఉత్పత్తి రికార్డుస్థాయిలో పెరగగా.. అంతేస్థాయిలో ధాన్యం నిల్వల మాయం, కేటాయింపుల్లో లోపాలు, రవాణా కాంట్రాక్టర్ల అక్రమాలు సైతం పెరిగాయి. కొంతకాలంలో జిల్లా నుంచి టాస్క్ఫోర్స్ అధికారులకు తరుచూ వెళ్తున్న ఫిర్యాదులతో వరుస దాడులు చేస్తుండగా విస్తుపోయే నిజాలు వెలుగు చూడటం గమనార్హం. కొన్ని మిల్లుల్లో రూ.కోట్ల విలువజేసే ధాన్యం కాగితాల్లో కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాయం చేస్తూ ప్రభుత్వానికి కుచ్చుటోపీ పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు శూన్యమనే చెప్పవచ్చు. 2025, నవంబర్ 13న పెద్దమందడి మోజర్ల సమీపంలోని రెండు మిల్లుల్లో టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించగా.. సుమారు రూ.12.50 కోట్ల విలువైన ధాన్యం నిల్వలు మాయమైనట్లు గుర్తించి మిగతా ధాన్యాన్ని సీజ్ చేశారు. గత నెల 22న తిరిగి అవే మిల్లుల్లో అధికారులు తనిఖీలు చేసి సీజ్ చేసిన మిగులు ధాన్యం నిల్వలను పరిశీలిస్తే సుమారు రూ.9 కోట్ల విలువజేసే ధాన్యం అక్కడ లేకపోవడం విస్మయానికి గురిచేసింది. సీజ్ చేసిన ధాన్యం ఎలా మాయమవుతుందనే విషయంపై ఇప్పటి వరకు జిల్లా అధికారులు ఎలాంటి విచారణ చేపట్టకపోవడం, రూ.కోట్ల విలువజేసే ధాన్యం సంరక్షించాల్సిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయాన్ని ఉన్నతాధికారులు వెల్లడించడానికి విముఖత చూపిస్తున్నారు. కొత్తకోట మండలం నాచాంపేట శివారులోని ఓ కొత్త మిల్లుకు గత సీజన్లో రూ.6.50 కోట్ల వరి ధాన్యం అధికారులు కేటాయించారు. వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నెల 9న టాస్క్ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయగా.. సుమారు రూ.2.50 కోట్ల విలువైన ధాన్యం మాయమైంది. ఇది చూసిన జిల్లా ఉన్నతాధికారులతో పాటు టాస్క్ఫోర్స్ అధికారులు అవాక్కయ్యారు. జిల్లాలో కొందరు అధికారులు, మిల్లర్లు కుమ్మకై ్క.. రూ.కోట్ల విలువజేసే వరి ధాన్యం బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటూ బియ్యం అడిగినప్పుడు రీసైక్లింగ్ పద్ధతిన సీఎస్సీకి అప్పగిస్తూ ఒక ప్రణాళికతో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. అధికారులపై ఫిర్యాదుల వెల్లువ.. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులపై మొదటి నుంచి ఫిర్యాదు చేస్తున్న బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు వరుస టాస్క్ఫోర్స్ దాడులు జరిగిన మిల్లుల్లో వరి ధాన్యం నిల్వలు మాయం కావడంపై బుధవారం రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా అవినీతి బాగోతం రాజధాని చేరినట్లయింది. ఈ విషయంపై వారు స్పందించి సమగ్ర విచారణ చేస్తారా? లేక జిల్లా అధికారుల మాదిరిగానే నిమ్మకుంటారనే విషయంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు చేయాలంటే కనీసం పదిశాతం బ్యాంకు గ్యారెంటీ బాండ్లు ఇవ్వాలనే నిబంధన తీసుకొచ్చింది. కానీ జిల్లాలోని కొందరు మిల్లర్లపై అధికారులు ఉదాసీనత కనబరుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల టాస్క్ఫోర్స్ అధికారులు దాడి చేసిన నాచారంపేట శివారులోని మిల్లు యజమాని కేవలం రూ.10 లక్షల బ్యాంకు గ్యారంటీ చెల్లిస్తే రూ.కోటి విలువ చేసే ధాన్యం మాత్రమే ఇవ్వాలి. కానీ అధికారులు సుమారు 6.50 కోట్ల ధాన్యం కేటాయింపులు చేయడం ఆరోపణలకు బలం చేకూరినట్లుగా భావించాల్సి వస్తుంది. ధాన్యం కేటాయింపులు, కొన్ని మిల్లుల్లో నిల్వలు లేకపోవడం తదితర అంశాలపై కొనుగోళ్ల ప్రక్రియ పూర్తికాగానే విచారణ చేపడతాం. అవకతవకలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు. బ్యాంకు గ్యారంటీ విలువ ఆధారంగానే ధాన్యం కేటాయింపులు చేయాలనే నిబంధన ఉంది. కొనుగోలు కేంద్రాలకు అత్యధికంగా ధాన్యం రావడంతో కొన్నిసార్లు ఎక్కువ మోతాదులో కేటాయింపులు చేయాల్సి వచ్చింది. – వినోద్కుమార్, అదనపు కలెక్టర్, వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురం మండలానికి చెందిన ఓ మిల్లర్ ప్రభుత్వం నుంచి సుమారు రూ.120 కోట్ల విలువైన వరి ధాన్యం తీసుకున్నారు. అందులో కనీసం పదిశాతం బియ్యం కూడా ఇవ్వలేదు. ఆయనకే కొనుగోలు కేంద్రాల నుంచి వరి ధాన్యం తరలింపు కాంట్రాక్టును అధికారులు అప్పగించారు. ఈ విషయంపై ప్రతిపక్ష నాయకులు పలుమార్లు విమర్శలు చేసినా.. కనీసం విచారణ చేపట్టకపోవడం గమనార్హం. -
నేల బతికితేనే పంట పండుతుంది
మానవపాడు: రైతుల పంటలు నేల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని ఏటీఎంఏ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ జగ్గు నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసార పరీక్షకు 3 సూత్రలు పాటించాలని సూచించారు. సమతుల్యత ఎరువుల వినియోగం నేల పరీక్షల ఆధారంగానే ఎరువులు వేయాలన్నారు. పచ్చిరొట్ట ఎరువులు పెంచాలని, రసాయనికి ఎరువులు, పురుగు మందులు విచక్షణా రహితంగా వాడొద్దని, అధిక వాడకం వల్ల నేల చనిపోయి దిగుబడి నాణ్యత తగ్గిపోతుందన్నారు. నానో ఎరువులు వాడితే తక్కువ మోతాదులో ఎక్కువ ఫలితం వచ్చి.. నేల పర్యావరణ కాలుష్యం తగ్గుతుందన్నారు. ఎరువుల హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ రవాణా అరికట్టేందుకు పంచాయతీ, మండల, జిల్లా స్థాయిల్లో ‘ఫర్టిలైజర్ నిఘా సమితులు’ ఏర్పాటు చేసినట్లు వివరించారు. గ్రామ కమిటీలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఏఈఓ, పీఏసీఎస్ సిబ్బంది సభ్యులుగా ఉంటారని వివరించారు. దీంతో రైతులకు ఎరువులు సకాలంలో సరైన ధరకు అందుతాయన్నారు. కార్యక్రమంలో బీటీఎం శ్రీధర్రెడ్డి, ఏఓ ప్రదీప్కుమార్, ఇన్పుట్ డీలర్లు, రైతులు పాల్గొన్నారు. -
వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని కృషి
గద్వాల: వికసిత్ భారత్ లక్ష్యంగా దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అహర్నిషలు కృషిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని డీకే బంగ్లాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ప్రధానిగా నరేంద్రమోదీ ఆధ్వర్యంలో భారతదేశం గడిచిన పన్నెండేళ్లలో ఎంతో పురోగతి సాధించిందన్నారు. పన్నెండేళ్ల సేవా ప్రస్థానంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్లు వెల్లడించారు. 58.15 కోట్ల జనధన్ ఖాతాలు, 44 కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డులు, 15.7 కోట్ల కుటుంబాలకు నూతనంగా నల్లానీటి కనెక్షన్లు, 1.46 లక్షల కిలోమీటర్ల రోడ్లు, 12 కోట్ల మరుగుదొడ్లు, 10 కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణం, 2.9 కోట్ల ఇళ్లకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు, కోట్లాది మందికి ఉచిత రేషన్ బియ్యం సరఫరా, జనధన్ ఖాతాలో రూ.3 లక్షల కోట్లకుపైగా డిపాజిట్లు, 9 కోట్లకు పైగా అటల్ పెన్షన్ యోజన సభ్యులు, 58 కోట్లకు పైగా బీమా పథకాల లబ్ధిదారులు వంటి అనేక సంక్షేమాభివృద్ధి పథకాలు అందించినట్లు చెప్పారు. అంతేకాకుండా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సర్జికల్ స్ట్రైక్, ఆపరేషన్ సింధూర్, నక్సల్స్ విముక్తి, కోవిడ్ సమయంలో ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ వంటివి ప్రజలకు, దేశానికి రక్షణ కల్పించే చర్యలు చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో నాయకులు రామాంజనేయులు, డీకే స్నిగ్ధారెడ్డి, బండల వెంకట్రాములు, రమాదేవి, రవికుమార్, దాస్, శాలన్న తదితరులు పాల్గొన్నారు. -
ప్రయాణం.. ప్రాణసంకటం
జిల్లాలో నిత్యకృత్యమైన రోడ్డు ప్రమాదాలు ● మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్తోనే అనర్థాలు ● గడిచిన ఆరు నెలల వ్యవధిలో 54 మంది మృతి ● అవగాహన కల్పిస్తున్నా మారని కొందరు డ్రైవర్లు ● నివారణ చర్యలపై పోలీస్ శాఖ కసరత్తు గద్వాల క్రైం: జిల్లాలో రోడ్డు ప్రయాణం ప్రాణసంకటంగా మారుతోంది. వాహనాలు మృత్యు శకటాలుగా మారుతున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు క్షేమంగా వస్తే చాలనుకునే స్వరం వినిపిస్తోంది. మరోవైపు అవగాహన లేని డ్రైవర్లు వాహనాలను వాయువేగంతో నడుపుతూ ప్రమాదాల కారకులవుతున్నారు. జాతీయ, రాష్ట్ర, పట్టణ రహదారులపై ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. జిల్లాలోని ధరూరు, మానవపాడు, ఇటిక్యాల, అలంపూర్, అయిజ మండలాల్లో ఇటీవల అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గడిచిన ఆరు నెలల వ్యవధిలో 54 మంది మృతి చెందగా.. 70మందికి పైగా గాయాలపాలయ్యారంటే.. ప్రమాదాల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఏటా జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు, పోలీసు శాఖ అరైవ్– అలైవ్ కార్యక్రమాల ద్వారా చైతన్యం తీసుకువచ్చినప్పటికీ కొందరు డ్రైవర్లు, వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిర్లక్ష్యపు వైఖరితోనే.. వాహనాలు నడపడం ఎంత సరదానో.. అంతకంటే మనిషి ప్రాణం ముఖ్యం అనే విషయాన్ని కొందరు డ్రైవర్లు పెడచెవిన పెడుతున్నారు. వాహనాన్ని రోడ్డుపై ఎంత స్పీడ్గా వెళ్లాలి.. ఎటు నుంచి వాహనాలను ఓవర్టెక్ చేయాలి.. ఎదురుగా వస్తున్న వాహనాలు ప్రమాదాలకు గురికాకుండా ఎలా బయట పడాలి అనే విషయాలపై ఏమాత్రం అవగాహన పెంచుకోవడం లేదు. కొందరు యువ డ్రైవర్లు వాహనాలను మితిమీరిన వేగంతో నడుపుతూ ఎదురుగా వచ్చే వాహనాలను ప్రమాదాలకు గురిచేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 13.04.2026న నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన నలుగురు స్నేహితులు గోవా నుంచి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో జిల్లా పరిధిలోని వీరాపురం గ్రామ శివారులో డ్రైవింగ్ చేస్తున్న యువకుడు నిద్రలోకి జారుకోవడంతో రోడ్డు పక్కనున్న భారీ వృక్షాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. 12.05.2026న గద్వాల పట్టణానికి చెందిన ఓ యువకుడు బైక్పై కర్నూలు వైపు వెళ్తుండగా.. ఇటిక్యాల శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. 06.6.2026న కేటీదొడ్డి మండలానికి చెందిన ఓ వ్యక్తి పని నిమిత్తం ఓ గూడ్స్ వాహనంలో గద్వాలకు వస్తుండగా.. గోనుపాడు గ్రామ శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలవడంతో జిల్లా ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు రెఫర్ చేశారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇలా గడిచిన ఆరు నెలల వ్యవధిలోనే 54 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందగా.. 70 మందికి పైగా గాయాల పాలయ్యారు. వాహనాన్ని రోడ్డుపైకి తీసుకురావాలంటే ముందుగా దానిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. రవాణా శాఖ అధికారులచే లైసెన్స్ తీసుకోవాలి. రాత్రివేళలో హెడ్ ల్యాంపు, ఇండిగేటర్లు వేస్తూ ఎదురుగా వస్తున్న వాహనాలకు ముందుగా సంకేతాలు ఇవ్వాలి. కానీ, కొందరు వాహనాలు ఎంత త్వరగా వెళ్తే.. అంత గొప్ప డ్రైవర్గా ఊహించుకుంటున్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం పరిపాటిగా మారింది. అయితే వివిధ వాహనాలు నడపాలంటే లైసెన్స్ ఉండాలి. కానీ, కొంతమంది డ్రైవింగ్ రాకున్నా రవాణా శాఖ కార్యాలయాల్లో లైసెన్స్లు పొందడం కొసమెరుపు. ముందుగా ఇలాంటి వారిని కట్టడి చేస్తే కొంత వరకై నా ప్రమాదాలు నివారించవచ్చు. -
సేవలు విసర్తిసాం..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యూనివర్సిటీ సేవలను విస్తరించి.. జిల్లా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నాం. అందులో భాగంగా నాగర్కర్నూల్ జిల్లాలో పీజీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా.. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆమోదం లభించింది. ప్రభుత్వం నుంచి జీఓ వస్తే ఏర్పాటు చేస్తాం. వీటితోపాటు వనపర్తి పీజీ కళాశాల హాస్టళ్ల నిర్మాణం కోసం 5 గుంటల భూమిని కేటాయిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. – జీఎన్ శ్రీనివాస్, వైస్ చాన్స్లర్, పీయూ ● -
బాధ్యత తీసుకోవాలి..
చాలామంది చిన్నపాటి విషయాలకే మనోవేదనకు లోనవుతున్నారు. అయితే ఒత్తిడిని తగ్గించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆత్మహత్యలు జరగకుండా సమాజంలో బాధ్యత కలిగిన పోలీస్ వ్యవస్థ, స్వచ్ఛంద సంస్థలు, ఇతర మేధావులు ఆత్మహత్యల ద్వారా చిన్నాభిన్నమైన కుటుంబాలు లేకుండా.. ఆత్మహత్యలు లేని సమాజ నిర్మాణానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అందరూ కలిసి దీనిపై శ్రద్ధ పెడితే.. ఆత్మన్యూనతా భావంతో.. క్షణికావేశంతో ఆసువులు బాస్తున్న వారిని రక్షించుకోవచ్చు. ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వ్యక్తికి ఆఖరి నిమిషంలో భరోసా లభించినా తన ప్రయత్నాన్ని విరమించుకుంటాడు. నానాటికి క్షీణించి పోతున్న మౌళిక విలువలు.. పెరుగుతున్న మానసిక సంఘర్షణ ఆత్మహత్యలకు ప్రేరణగా నిలుస్తున్నాయి. మానవ సంబంధాలు బలహీనంగా మారే వాతావరణంలో సకారాత్మక మార్పులు తీసుకురావడం.. జీవన విధానంలో పలు కారణాలతో ఏర్పడుతున్న అగాధాలను పూడ్చడం.. సామాజిక తోడ్పాటు ద్వారా ఆత్మహత్యలు పూర్తి తగ్గుతాయి. – వంగీపురం శ్రీనాథచారి, ప్రముఖ మానసిక విశ్లేషకులు -
రసాయన ఎరువుల వాడకం తగ్గించండి
అయిజ: రైతులు పంటల సాగులో రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి.. సేంద్రియ ఎరువులు వినియోగించాలని ఆత్మ డిప్యూటీ డైరెక్టర్ జగ్గూ నాయక్ సూచించారు. బుధవారం అయిజ మండలం ఈడుగోనిపల్లిలో నిర్వహించిన గ్రామసభకు ఆయన హాజరై.. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. రసాయన ఎరువులను అధికంగా వినియోగించడం ద్వారా పంట పొలం సహజ లక్షణం కోల్పోయి నిస్సారంగా మారుతుందన్నారు. సేంద్రియ ఎరువుల వినియోగంతో అధిక దిగుబడులు సాధించవ్చన్నారు. రైతులు నానో డీఏపీ, యూరియాపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ మంజుల, ఉపసర్పంచ్ గోవిందమ్మ, ఏఓ జనార్దన్, ఏఈఓ అనిల్కుమార్, పంచాయతీ కార్యదర్శి సురేంద్ర పాల్గొన్నారు. అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి గద్వాలన్యూటౌన్: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం బీజేపీ నాయకులు స్థానిక కోటలోని చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ చరిత్రలో అత్యధిక కాలం నిరవధికంగా పరిపాలించిన ప్రధానిగా మోదీ కొత్త చరిత్ర సృష్టించారన్నారు. 12 ఏళ్ల కాలంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, డిజిటల్ విప్లవం, జాతీయ భద్రత బలోపేతం, ఆర్థిక రంగంలో సంస్కరణల ద్వారా దేశం సరికొత్త దిశగా పయనిస్తోందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎక్బోటే రవి, శ్యామ్రావు, కౌన్సిలర్లు చంద్రశేఖర్, శాలన్న, నాయకులు శ్రీమన్నారాయణ, సమత, కృష్ణ, పాండు, నర్సింహ పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.6,279 గద్వాలవ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు బుధవారం 500 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 7,360, కనిష్టంగా రూ. 3,119, సరాసరి రూ. 6,279 ధరలు లభించాయి. 4 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. రూ. 1,875 ధర పలికింది. ముందు ప్రభుత్వంలో విలీనం చేయండి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: టీజీఎస్ఆర్టీసీని ముందుగా ప్రభుత్వంలో విలీనం చేసి, ‘అపాయింటెడ్ డే’ ప్రకటించిన తర్వాతే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాకేంద్రంలో సంఘం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తొలుత కార్మిక సంఘాల ఎన్నికలు జ రపాలని భావించడం సరైన నిర్ణయం కాదన్నా రు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే విలీనం జరగాలన్నారు. గత నెలలో సమ్మెకు ముందు కార్మికుల్లో ఏ మాత్రం బలం లేని జేఏసీ నోటీసు ఇవ్వడంతో ఎలాంటి చల నం రాలేదని, దీంతో మెజారిటీ ఉన్న టీఎంయూ ఆధ్వర్యంలో 16 డిమాండ్లతో నోటీసు ఇచ్చి సమ్మెలోకి వెళ్లామన్నారు. సమ్మె ఉద్ధృతమైన క్రమంలో రెండోరోజే డ్రైవర్ శంకర్గౌడ్ ఆత్మాహుతి చేసుకోవడం దురదృష్టకరమన్నా రు. చివరకు టీఎంయూ కార్మికుల బలంతోనే సమ్మె విజయవంతమైందని, ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి తమ డిమాండ్లను అంగీకరించిందన్నారు. ఇది భరించలేని జేఏసీ నాయకులు ‘ముందే విలీనం వద్దు.. గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలి..’ అని ప్రభుత్వాన్ని తాను కోరినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి బీఎస్ రెడ్డి, రీజియన్ అధ్యక్షుడు కె.రవీందర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు వీసీఎస్ రెడ్డి, రవి, బీవీ రెడ్డి, నారాయణ, నాయకులు శ్రీనివాసులు, భానుప్రకాష్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లా అడ్హాక్ కమిటీ చైర్మన్గా సంజీవరెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చంద్రయ్య, అధ్యక్షుడిగా వి.ఎస్.నారాయణ, రీజినల్ కార్యదర్శిగా మధుసూదన్, అదనపు కార్యదర్శిగా బి.శ్రీనివాసులును ఎన్నుకున్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణ కోసమే ‘అరైవ్ అలైవ్’
● జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ఎర్రవల్లి: రోడ్డు ప్రమాదాల నివారణ కోసమే ప్రభుత్వం అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని చేపట్టిందని జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎర్రవల్లిలో సర్పంచ్ అనితా కృష్ణసాగర్ అధ్యక్షతన జరిగిన గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాసరావు పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన అవగాహన వీడియోలను ప్రదర్శించారు. హెల్మెట్ లేకుండా, మద్యం తాగి వాహనాలను నడపడం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. అదే విధంగా రోడ్డు ప్రమాదాల్లో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి భావోద్వేగాలను ప్రత్యక్షంగా వినిపించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రోజు 70 నుంచి 80 వరకు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటుడగా.. 20 నుంచి 30 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రతి వ్యక్తి బాధ్యతగా వ్యవహరిస్తేనే ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని అన్నారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఇద్దరికి మాత్రమే అనుమతించిన వాహనంపై ముగ్గురు లేదా నలుగురు ప్రయాణించడం ప్రమాదకరమని హెచ్చరించారు. డ్రంకెన్ డ్రైవ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి అలవాట్లు ప్రాణాలకు తీవ్ర ముప్పును కలిగిస్తాయని ఆయన వివరించారు. అనంతరం అక్కడ ఉన్న వారితో డీఐజీ రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. ● ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఫోర్ వీలర్ డ్రైవింగ్చేసే వారు తప్పనిసరిగా సీట్ బెల్టు ధరించాలన్నారు. పరిమిత వేగంతోనే ప్రయాణం చేయాలని.. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. ● పదో పటాలం కమాండెంట్ జయరాజు మాట్లాడుతూ.. జీవితంలో కోల్పోయిన అన్నింటినీ తిరిగి సంపాదించుకోవచ్చని, ప్రాణం పోతే తిరిగి తీసుకురాలేమని అన్నారు. ఎంతో మంది తెలిసి కూడా రాంగ్రూట్, మద్యం తాగి వాహనాలను నడుపుతూ ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డీటిఓ రాధిక, డీఎస్పీ మొగిలయ్య, సీఐ ప్రదీప్కుమార్, ఎస్ఐ రవిరాథోడ్ తదితరులు పాల్గొన్నారు. -
మార్పు గమనించాలి
నేను ఈ కోర్సులో రాణించలేకపోతున్నా.. నేను ఎంచుకున్న లక్ష్యంలో ముందుకు వెళ్లలేకపోతున్నా.. నా చదువుకు సరైన న్యాయం చేయలేకపోతున్నా. కుటుంబ సభ్యులు.. తల్లిదండ్రులు ఇకనన్ను తిడతారు. అనే భావన ఏర్పడిన వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే అప్పటికప్పుడు కాకుండా ఇలాంటి వారు ముందుగానే బలవన్మరణాలకు సిద్ధమవుతారని అంతకు ముందు కొన్ని లక్షణాలను చెబుతుంటారు. కుటుంబ సభ్యులతో ముభావంగా ఉండటం, ఏదో పరలోకంలో ఉన్నట్లు ఆలోచించడం, చిన్న చిన్న విషయాలకు ఏడ్వడం, నేను లేకపోయినా మీరు బాగుండాలని చెబుతుండటం, తోటి విద్యార్థులతో సన్నిహితంగా మెలగకపోవడం, ఒకరిద్దరితో జీవితం అంతమైతే తర్వాత ఏం జరుగుతుందని చర్చించడం, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కలిగినప్పుడే చనిపోవచ్చు. లేదా ఆరు నెలల తర్వాతనైనా అదే మదిలో మెదలవచ్చు. అలాంటి సందర్భాల్లో వారి తీరు మనస్తత్వాలకు విరుద్ధంగా ఉంటుంది. ఎవరితోనూ కలవలేకపోవడం, ఒంటరితనం లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. – అనిల్రాజ్, మానసిక వైద్య నిపుణుడు -
జనగణనలో భాగస్వాములు కావాలి
● అదనపు కలెక్టర్ నర్సింగ్రావుగద్వాల(మల్దకల్): దేశాభివృద్ధికి దిక్సూచిగా నిలిచే జనగణన ప్రక్రియలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు కోరారు. బుధవారం మల్దకల్ మండలం నేతువానిపల్లిలో సర్పంచ్ పద్మమ్మ అధ్యక్షతన జరిగిన గ్రామసభకు ఆయన హాజరై మాట్లాడారు. జనగణన ప్రక్రియలో భాగంగా ఇళ్ల లెక్కింపు చేపట్టడం జరిగిందని.. ప్రతి కుటుంబం తమ వివరాలను ఎన్యూమరేటర్లకు తెలియజేయాలని సూచించారు. అదే విధంగా వ్యవసాయ, ఉద్యానశాఖల ద్వారా రైతులకు అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు త్వరగా నిర్మించుకోవాలని సూచించారు. బడిబయట ఉన్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి.. వారి విద్యాభివృద్ధికి కృషి చేయా లని కోరారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. అనంతరం ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన కల్పించారు. రైతులకు కూరగాయల విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఆంజనేయరెడ్డి, ఉపసర్పంచ్ మునినాయక్, పంచాయతీ కార్యదర్శి నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అధిక ధరలకు హద్దులేకుండా పోయింది
గద్వాలన్యూటౌన్: బీజేపీ పాలనలో ధరల పెంపునకు హద్దులేకుండా పోయిందని సీపీఐ జాతీయ కమిటీ సభ్యురాలు సురవరం విజయలక్ష్మి ఆరోపించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలను నిరసిస్తూ.. బుధవారం సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ముందుగా పీజేపీ క్యాంపు నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పాలనలో సామాన్యుడు ధరల భారాలతో నలిగిపోతున్నాడన్నారు. ధరలను విపరీతంగా పెంచుతూ.. కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచి పెడుతున్నారని విమర్శించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై నోరు మెదపడం లేదన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం.. నిరుద్యోగుల నడ్డి విరిచిందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ, కార్పొరేట్కు కొమ్ము కాస్తున్నారన్నారు. కార్పొరేటర్ల డబ్బుతోనే ఎన్నికల్లో గెలుస్తున్నారని ఆరోపించారు. దేశంలో రూపాయి విలువ పడిపోతున్నా.. పట్టించుకోకుండా సాకులు చెబుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో దేశ ప్రజలంతా ఏకమై బీజేపీని గద్దె దించాలన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ అధికారికి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, నాయకులు రంగన్న, ఊశన్న, నాగార్జున, రవి, ప్రతాప్, ఈశ్వర్, వెంకటేశ్ పాల్గొన్నారు. -
మరిన్ని యూనిట్లు ఇవ్వాలి..
ప్రభుత్వం రైతులకు రాయితీపై ఇస్తున్న యూనిట్లను పెంచాలి. ముఖ్యంగా కోల్డ్రూం స్టాగింగ్, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు మరిన్ని నెలకొల్పాలి. రైతులకు సకాలంలో రాయితీ అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. – నర్సింహారెడ్డి, రైతు, అయిజ రాయితీ శాతం పెంచాలి.. రైతులు పండ్ల తోటలను పెంచేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను మరింతగా పెంచాలి. రైతుల్లో ఎక్కవ శాతం పేదలు ఉన్నారు. రాయితీ శాతం పెంచితే గాని కోల్డ్ స్టోరేజ్, కోల్డ్రూం స్టాగింగ్లను ఏర్పాటు చేసుకోలేరు. రాయితీపై ఇస్తున్న యూనిట్ల సంఖ్యను కూడా పెంచితే మరికొందరు రైతులు పండ్ల తోటలను సాగుచేస్తారు. – దర్శెల్లి, రైతు, అయిజ ● -
45 రోజుల్లో భూసేకరణ పూర్తిచేయాలి
● ఆర్అండ్ఆర్ కమిషనర్శివకుమార్నాయుడు గద్వాల: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా వివిధ ప్యాకేజీల పరిధిలో సేకరించాల్సిన 534 ఎకరాల్లో ఎలాంటి ఇబ్బందులు లేని భూ సేకరణ ప్రక్రియను 45 రోజుల్లోగా పూర్తిచేయాలని ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్తో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై ఇటీవల సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన సమీక్షలో భూ సేకరణ ప్రక్రియ ఆలస్యం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు. గట్టు ఎత్తిపోతల పథకంలో 462 ఎకరాలు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ఫేజ్–2 కింద నిర్మిస్తున్న మల్లమ్మకుంట రిజర్వాయర్ పరిధిలో 567 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందన్నారు. అదేవిధంగా నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో 534 ఎకరాలు సేకరించాల్సి ఉండగా.. ఇందులో కోర్టు కేసులు, సమస్యలు లేని 220 ఎకరాలకు ఈ నెల 15వ తేదీలోగా ప్రిలిమినరీ డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించారు. ఆయా ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణ ప్రక్రియ పూర్తయితేనే పెండింగ్ పనులు వేగవంతమవుతాయని ఆయన గుర్తుచేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. భూసేకరణ ప్రక్రియకు సంబంధించి రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైతే ప్రాజెక్టుల ఆవశ్యకతను వివరించి ఒప్పించాలన్నారు. రెవెన్యూ, సర్వే, ఇరిగేషన్శాఖల అధికారులు సమన్వయంతో త్వరితగతిన భూసేకరణ ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు. సమావేశంలో ఎస్డీసీ కృష్ణ, ఇరిగేషన్శాఖ ఎస్ఈ రహీముద్దీన్, సర్వే ఏడీ నూకరాజు, ఏఓ భూపాల్రెడ్డి, తహసీల్దార్లు ఉన్నారు. -
నకిలీపై చర్యలేవి..?
రాజోళి: కొన్నేళ్లుగా గట్టుచప్పుడు కాకుండా సాగుతున్న నకిలీ ధ్రువపత్రాల దందాను కొన్ని నెలల క్రితం ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. నకిలీ పత్రాలతో మోసపోయిన బాధితులు జిల్లా అధికారులను కలిసి ఫిర్యాదులు సైతం చేశారు. అయినప్పటికీ నకిలీగాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యధోరణి కారణంగానే దొంగచాటుగా చేసే ఫేక్ సర్టిఫికెట్ల దందా.. ప్రస్తుతం యథేచ్ఛగా దుకాణాల్లోనే నిర్వహించే దాక వచ్చిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫేక్ సర్టిఫికెట్లతో తమ ఆస్తులు కబ్జాకు గురయ్యాయని జిల్లా అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా తమకు ఎలాంటి న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ప్రైవేటు బ్యాంకర్లతో కుమ్మకై ్క.. రాజోళి మండలం మాన్దొడ్డి కేంద్రంగా ఫేక్ సర్టిఫికెట్ల దందా జోరుగా సాగుతోంది. గ్రామానికి చెందిన ఓ యువకుడు అయిజలోని పలు ప్రైవేటు బ్యాంకర్లతో కుమ్మకై ్క.. ఫేక్ ఓనర్షిప్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్లు తేలింది. ఫేక్ సర్టిఫికెట్లతో ఒకరి ఇంటిని మరొకరికి రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు సాక్షుల సంతకాలను సైతం ఫోర్జరీ చేశారు. దీనిపై బాధితుడు గతేడాది జూన్లో అధికారులకు పిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఫేక్ సర్టిఫికెట్లు తయారీ చేసిన వ్యక్తి.. అది చేసింది తానేనని మాట్లాడిన ఫోన్ సంభాషణ ఉన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, ప్రైవేటు బ్యాంకుల్లో ఇంటి రుణాలు ఇప్పిస్తే వచ్చే కమీషన్ కోసం, సాధారణ నిరక్ష్యరాసులను లక్ష్యంగా చేసుకొని రుణాల మాయలో పడేస్తున్నారు. సర్టిఫికెట్లు లేని వారి వద్ద కావాల్సినంత డబ్బు దండుకొని నకిలీ ధ్రువపత్రాలు, రిజిస్ట్రేషన్లు, ఇతర తతంగం ముగిస్తున్నట్లు తెలిసింది. ఇతర మండలాల్లో సైతం.. మాన్దొడ్డిలో మొదటి నుంచి ఓ వ్యక్తి ఓనర్షిప్ సర్టిఫికెట్లు తయారు చేస్తుండగా.. ఆయన ద్వారా మరికొందరు లింకులు కలుపుకొని పచ్చర్ల, రాజోళి, తుమ్మిళ్ల, శాంతిగనర్, మానవపాడు తదితర గ్రామాలతో పాటు, గట్టు మండలం వరకు ఫేక్ మేకర్లు తయారయ్యారు. ఇందులో విచిత్రం ఏంటంటే.. ఫేక్ సర్టిఫికెట్లు ఎక్కడ తయారు చేస్తున్నారనేది అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ పట్టించుకోకుండా, అదే సర్టిఫికెట్లతోనే ప్రక్రియను ముగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా గ్రామ పంచాయతీ నుంచి ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గతంలో ఓనర్షిప్ సర్టిఫికెట్ ఇచ్చేవారు. కొన్నేళ్లుగా ఓనర్షిప్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. కాని అదే ఓనర్షిప్ సర్టిఫికెట్లను ఆధారంగా చూపి.. వందల రిజిస్ట్రేషన్లు చేయడం విడ్డూరంగా ఉందని ప్రజలు అంటున్నారు. ఓనర్షిప్ సర్టిఫికెట్లను తాము ఇవ్వలేదని గ్రామ పంచాయతీ అధికారులే చెబుతున్నా.. అందుకు ఆధారాలతో సహా రాతపూర్వకంగా రాసి ఇచ్చినా కూడా కారకులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు వాపోతున్నారు. ప్రాణం ఖరీదు.. వైద్యుల నిర్లక్ష్యంతో మృతిచెందిన ఓ మహిళ కుటుంబానికి రూ.9.50 లక్షల పరిహారం చెల్లించడం చర్చనీయాంశంగా మారింది.–8లో uసంతకాలు ఫోర్జరీ.. గతేడాది పచ్చర్లకు చెందిన వ్యక్తి ఇంటిని ఫేక్ సర్టిఫికెట్లతో మరొకరికి అమ్మారని తెలుసుకున్న బాధితుడు.. ఆధారాలతో సహా జిల్లా అధికారులకు తెలిపారు. ఈ మేరకు మండల అధికారులు విచారణ జరపగా.. గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకాలను కూడా ఫోర్జరీ చేశారని నిర్ధారణ అయ్యింది. ఫోర్జరీలు చేసిన వ్యక్తులు కూడా ఇతరులు చేయమంటేనే చేశామని చెప్పా రు. అయినా కూడా చర్యలు తీసుకోలేదు. బాధితులకు న్యాయం జరగలేదు. దీంతో విసిగిపోయిన బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. ఇలా గ్రామస్థాయి నుంచే ఫేక్ మేకర్లు విచ్చలవిడిగా దందా సాగిస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ దందాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా అధికారులను ఫోన్లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు. ప్రైవేటు బ్యాంకర్లతో కుమ్మకై ్క ఫేక్ ఓనర్షిప్ సర్టిఫికెట్ల దందా బాధితులు ఫిర్యాదు చేసినా పట్టని అధికారులు ఇతర గ్రామాలకు పాకుతున్న ఫేక్ మేకర్లు యథేచ్ఛగా నకిలీ ధ్రువపత్రాల తయారీ -
నేరస్తుల విషయంలో కఠినంగా వ్యవహరించాలి
గద్వాల(గద్వాల క్రైం): నేరస్తుల విషయంలో పోలీసు సిబ్బంది కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షలో ఆయన మాట్లాడా రు. జిల్లాలో శాంతి భద్రతల విషయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తులను గుర్తించి పూర్తిస్థాయిలో విచారించాలని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఉంచడంతో పాటు చెక్పోస్టుల వద్ద ప్రతి గూడ్స్ వాహనం, కంటెయినర్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. పోలీస్స్టేషన్కు సమస్యలపై వచ్చే బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక, మట్టి, రేషన్ బియ్యం, నిషేధిత మత్తు పదార్థాలు, గంజాయి, పేకాట వంటి వాటిని గుర్తించి కట్టడి చేయాలని ఎస్పీ ఆదేశించారు. సిబ్బందిపై బాధితులు ఎవరైనా ఫిర్యాదులు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నమోదైన కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసి.. నిందితులకు శిక్ష పడేలా వ్యవహరించాలన్నారు. అదే విధంగా భరోసా సెంటర్లో బాధితుల సమస్యలను వీలైనంత వరకు పరిష్కరించాలని ఆయన సూచించారు. సమావేశంలో ఏఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య, సీఐలు శ్రీను, ప్రదీప్కుమార్, ఎస్ఐలు కళ్యాణ్కుమార్, శ్రీకాంత్, శ్రీహరి, నాగశేఖర్రెడ్డి తదితరులు ఉన్నారు. -
జనరల్ ఆస్పత్రిలో భారీగా బదిలీలు
పాలమూరు: మహబూబ్నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రిలోపాటు పాలమూరు మెడికల్ కళాశాల లో పనిచేస్తున్న అన్నివిభాగాల హెచ్ఓడీలు హైదరాబాద్కు బదిలీ అయ్యారు. మొత్తం 9 విభాగాల ప్రొఫెసర్ల (హెచ్ఓడీ)లకు స్థానం చలనం కావడం విశేషం. మత్తు విభాగం హెచ్ఓడీ డాక్టర్ మాధవి ఉస్మానియా, రేడియాలజీ విభాగం హెచ్ఓడీ హన్మంతు ప్రసాద్ గాంధీ ఆస్పత్రి, ఈఎన్టీ హెచ్ఓడీ డాక్టర్ శ్రీకాంత్ కోఠి, చిన్నపిల్లల విభాగం (పీడియాట్రిక్) హెచ్ఓడీ డాక్టర్ సురేష్ శ్రీనివాస్ నిలోఫర్, జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ డాక్టర్ అమరావతి ఉస్మానియా, ఎస్పీఎం హెచ్ఓడీ డాక్టర్ ఉషారాణి ఉస్మానియా, ఫిజియాలజీ హెచ్ఓడీ డాక్టర్ సునందిని ఉస్మానియా, ఫోరెన్సిక్ హెచ్ఓడీ డాక్టర్ పార్వతి ఉస్మానియా, మైక్రోబయాలజీ హెచ్ఓడీ డాక్టర్ రమాదేవి నిలోఫర్కు బదిలీ అయ్యారు. అదేవిధంగా జనరల్ ఆస్పత్రిలోని గైనిక్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మీపద్మప్రియ నారాయణపేట, జనరల్ మెడిసిన్లో అసోసియేట్ ప్రొఫెసర్ స్వప్న ఉస్మానియాకు, జనరల్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బాల శ్రీనివాస్ నాగర్కర్నూల్కు బదిలీ అయ్యారు. ఇక జిల్లాకు వచ్చిన వారిలో ఎస్పీఎం హెచ్ఓడీగా డాక్టర్ కోటేశ్వరమ్మ గాంధీ నుంచి బదిలీపై వచ్చారు. మైక్రోబయాలజీ హెచ్ఓడీగా డాక్టర్ శ్రీవాణి, జనరల్ మెడిసిన్ హెచ్ఓడీగా డాక్టర్ శకుంతల రావడం జరిగింది. కొత్తవారు ఎప్పుడో..? జిల్లా జనరల్ ఆస్పత్రితోపాటు మెడికల్ కళాశాలలోని ఆయా విభాగాల్లో పనిచేసే హెచ్ఓడీలు (ప్రొఫెసర్లు) బదిలీ కావడంతో సదరు పోస్టులు ఖాళీ అయ్యాయి. దీంతో ఖాళీ అయిన పోస్టుల్లో కొత్తవారు వచ్చి విధుల్లో చేరే వరకు ఎన్ని రోజులు పడుతుందనే విషయం తెలియడం లేదు. సాధారణంగా హైదరాబాద్ నుంచి బదిలీ అయ్యి వచ్చే వారిలో ఇక్కడ విధుల్లో చేరడానికి ఆసక్తి చూపారు. ఒకవేళ చేరిన నిత్యం హైదరాబాద్ నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో స్థానికంగా వారు అందుబాటులో ఉండే అవకాశం లేదు. డీఎంహెచ్ఓ కృష్ణ బదిలీ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని బదిలీ చేయడం జరిగింది. అలాగే డీఎంహెచ్ఓగా డిప్యూటేషన్పై పనిచేస్తున్న కృష్ణ నాగర్కర్నూల్ డీఎంహెచ్ఓగా బదిలీ కాగా.. ఆయన స్థానంలో జిల్లాకు ఇంకా ఎవరిని కేటాయించలేదు. అలాగే జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారిగా డాక్టర్ సునీతరెడ్డి వికారాబాద్ నుంచి బదిలీపై వచ్చారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి (డీఐఓ)గా డాక్టర్ శైలజ నారాయణపేట నుంచి బదిలీపై వచ్చారు. ఇక పీహెచ్సీల్లో పనిచేస్తున్న వైద్యాధికారులు, ఫార్మాసిస్ట్లు, 24 మంది ఏఎన్ఎంలు, ముగ్గురు ఎంపీహెచ్ఓలు, నలుగురు హెల్త్ ఎడ్యుకేటర్లు, సూపర్వైజర్లు, సీనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అసిస్టెంట్స్, సీహెచ్ఓలు బదిలీ కావడం జరిగింది. కిందిస్థాయి సిబ్బందికి జిల్లాలోని ఆయా పీహెచ్సీలు, మెడికల్ కళాశాల, జనరల్ ఆస్పత్రిలో పోస్టింగ్ ఇవ్వగా.. కొందరు ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లారు. రోగులకు దిక్కెవరు..? ప్రస్తుతం జిల్లా జనరల్ ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, అసోసియేట్లు, అసిస్టెంట్లకు బదిలీ అయిన నేపథ్యంలో కొత్త వారు వచ్చి విధుల్లో చేరడానికి ఇంకా సమయం పట్టనుంది. అలాగే కొంతమందిని ఇక్కడికి బదిలీ చేసిన విధుల్లో చేరడానికి ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో జనరల్ ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు అవస్థలు తప్పవు. అందరూ విధుల్లో ఉన్న రోగులకు సరైన వైద్యం అందక ఇబ్బందులు పడేవారు ప్రస్తుతం అందరూ బదిలీ హడావుడిలో ఉండటంతో రోగులను పట్టించుకునే నాథుడే ఉండరు. దీంతో అడ్మిట్ అయిన రోగులతోపాటు అవుట్ పేషెంట్లకు మెరుగైన చికిత్స అందడం కష్టసాధ్యమే అనిపిస్తోంది. 9 విభాగాల హెచ్ఓడీలు, అసోసియేట్లకు స్థానచలనం డీఎంహెచ్ఓ కృష్ణ నాగర్కర్నూల్కు.. ఆరోగ్య శాఖలో వైద్యాధికారులు,ఏఎన్ఎంలు అందరూ బదిలీ జనరల్ ఆస్పత్రిలో కొత్త వైద్యులు విధుల్లో చేరే వరకు రోగులకు తప్పని అవస్థలు -
‘చేనేత’ ఎన్నికలు
అమరచింత: చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. మొదటి విడతలో 50 మంది సభ్యులున్న సంఘాలకు ఈ నెల 12న ఎన్నికలు నిర్వహించేందుకు చేనేత, జౌళిశాఖ అధికారులు ప్రకటన జారీ చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలో చేనేత సహకార సంఘాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. ● చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ఏప్రిల్ 4 నుంచి మే నెల 15 వరకు సహకార సంఘాల సభ్యుల ఓటరు జాబితా తయారు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. చేనేత జౌళిశాఖ అధికారులు ఓటరు జాబితా సవరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. అయితే సంఘాల్లో ఎలాంటి అప్పులు లేని సభ్యులు మాత్రమే పోటీ చేసే, ఓటు వేసే హక్కు ఉంటుందని ప్రకటించడంతో ఆశావహులు సంఘాలు, బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను చెల్లించారు. ఈ నెల 12న 9 మంది డైరెక్టర్లను ఎన్నుకోవడంతో పాటు వారిలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షులను ప్రకటిస్తారు. ఈ వ్యవహారమంతా అభ్యర్థికి సభ్యులు చేతులెత్తి ఓటేసే ప్రక్రియతో కొనసాగనుందని అధికారులు తెలిపారు. 100 మంది కంటే ఎక్కువ మంది సభ్యులున్న సంఘాలకు ఇదే నెల చివరి వారంలో ఓటింగ్ విధానంలో ఎన్నికలను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 2013లో చివరిసారి.. రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ఎన్నికలు 2013, ఫిబ్రవరిలో చివరిసారి జరగగా.. 2018లో వీటి కాల పరిమితి ముగిసింది. ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు జరగలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఎనిమిది ఏళ్ల పాటు పాత పాలకవర్గాల పదవీ కాలన్ని మొత్తం 16 పర్యాయాలు పొడిగించింది. చివరిసారి 2026, మార్చి 9 నుంచి మే నెల 10 వరకు పదవీ కాలం పొడిగించారు. జిల్లాలోని పలు సొసైటీల్లో అక్రమాలు జరిగాయని తేలడంతో పీఏసీఎస్ చట్టం సెక్షన్ 51 కింద అధికారులను పర్సన్ ఇన్చార్జ్లుగా నియమించారు. మొదటి దశలో 10 సంఘాలకు... చేనేత సహకార సంఘాల ఎన్నికలు దశల వారీగా నిర్వహించనున్నారు. మొదటి విడతలో 50 ఓట్ల కంటే తక్కువ ఉన్న సంఘాలకు ఈ నెల 12న నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని 10 సంఘాలకు ఎన్నికలు జరగనుండగా.. చేతులెత్తే పద్ధతిలో 9 మంది డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అదేరోజు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక ఉండనుంది. నారాయణపేటలోని చేనేత సంఘం, మార్కండేయ మహిళా సంఘం, శ్రీలక్ష్మి సిల్క్స్ సంఘం, ఆదర్శ చేనేత సంఘాలతో పాటు చిన్నజట్రం, కోటకొండ, మద్దూరులోని శ్రీబాలాజీ, పోతిరెడ్డిపల్లిలోని టసర్ ఖాదీ సిల్క్ బోర్డు, గద్వాల జిల్లాలో అనంతపురం పవర్లూమ్ సంఘం, నాగర్కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి సంఘాలకు మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇలా.. జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్, నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 54 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో కొన్ని సంఘాలు పనిచేస్తుండగా.. మరికొన్ని అప్పుడప్పుడు పని చేస్తున్నాయని, కొన్ని సంఘాలు మూతబడ్డాయని చేనేత, జౌళిశాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 25 వేల మంది చేనేత కార్మికులు ఉన్నారు. ఈ నెల 12న నిర్వహణకు ప్రభుత్వం పచ్చజెండా మొదటి విడతలో 50 మంది సభ్యులున్న సంఘాలకే.. ఓటరు జాబితా సిద్ధం చేసిన అధికారులు డిఫాల్టర్లు, మృతిచెందిన వారి ఓటుహక్కు తొలగింపు ఉమ్మడి జిల్లాలో 54 చేనేత సహకార సంఘాలు -
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు..
చేనేత సహకార సంఘా ల ఎన్నికల నిర్వహణకుగాను ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మొదటి విడతలో 50 మంది సభ్యులున్న సంఘాలకు ఈ నెల 12న ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. మిగిలిన సంఘాల ఎన్నికలు ఉన్నతాధికారుల నుంచి నోటిఫికేషన్ వెలువడగానే నిర్వహిస్తాం. సంఘాల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేసి సంఘాలకు పంపించాం. యాక్టివ్గా ఉన్న చేనేత సహకార సంఘా ల్లో చనిపోయిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశాం. – ఇందిర, ఏడీ, చేనేత జౌళిశాఖ, గద్వాల జిల్లా ● -
గోదాంల నిర్మాణానికి ప్రణాళికలు
అయిజ: పట్టణంలో గోదాంల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (ఎన్సీసీఎఫ్) అధికారులు వినయ్, యశ్వంత్ తెలిపారు. మంగళవారం జిల్లా సహకారశాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ మహేశ్కుమార్తో కలిసి పట్టణ సమీపంలో స్థానిక పీఏసీఎస్కు కేటాయించిన రెండెకరాల ప్రభుత్వ స్థలాన్ని వారు పరిశీలించి మాట్లాడారు. ప్రస్తుతం రైతులు పండిస్తున్న అన్నిరకాల పంటల కొనుగోళ్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు. ఈ క్రమంలో పంటల నిల్వకు గోదాంల కొరత తీవ్రంగా ఉందన్నారు. అయిజ పీఏసీఎస్కు కేటాయించిన స్థలంలో 2,500 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన రెండు గోదాంలు నిర్మించవచ్చని అన్నారు. రూ. 3కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ గోదాంలు ఎఫ్సీఐ, గిడ్డంగుల అభివృద్ధి రెగ్యులేటరీ అథారిటీ ప్రమాణాలతో ఉంటాయని తెలిపారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన అనంతరం ఆరు నెలల్లో గోదాంల నిర్మాణం పూర్తిచేసి.. సొసైటీకి అందించే విధంగా కృషిచేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మధుసూదన్రెడ్డి, సీఈఓ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక తెలంగాణే టీఆర్ఎస్ లక్ష్యం గద్వాలన్యూటౌన్: సామాజిక తెలంగాణనే తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర పరిశీలకుడు ఆర్వీఆర్ ప్రసాద్ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పాత బస్డాండ్ ప్రాంతంలో టీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ఇన్చార్జి గొంగళ్ల రంజిత్కుమార్తో కలిసి ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. అన్ని వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్ఎస్ పనిచేస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని.. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ అమరులు, ఉద్యమకారుల ఆశయాలు నెరవేర్చే ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకగా తమ పార్టీ సమస్యలపై పోరాడుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, విష్ణు, బలరాం నాయుడు, వెంకట్రాములు, కృష్ణ, గుండన్న, గోపాల్, కిష్టన్న, ఆశన్న పాల్గొన్నారు. -
జూరాలకు 2,815 క్యూసెక్కుల ఇన్ఫ్లో
● నెట్టెంపాడుకు కొనసాగుతున్న నీటి పంపింగ్ గద్వాల (ధరూరు): ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కు స్వల్పంగా ఇన్ఫ్లో కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం వరకు ప్రాజెక్టుకు 2,815 క్యూ సెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపా రు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో రెండు పంపులను రన్ చేసి.. రిజర్వాయర్లను నింపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నెట్టెంపాడుకు 1,500 క్యూ సెక్కులు, ఆవిరి రూపంలో 42 క్యూసెక్కులతో కలి పి మొత్తం 1,542 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థా యి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.372 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.


