breaking news
Jogulamba District News
-
స్వీయ జాగ్రత్తలతోనే రక్షణ
చలికాలంలో పిల్లలు, వృద్ధులపై అప్రమత్తత అవసరం ● నిర్లక్ష్యం వహిస్తే న్యుమోనియా, శ్వాస సంబంధ సమస్యలు తీవ్రం ● గోరువెచ్చటి నీరు, వేడి పదార్థాలతో మేలు ● ‘సాక్షి’ ఫోన్ఇన్లో ఇన్చార్జి డీఎంహెచ్ఓ సంధ్యా కిరణ్మయి ప్రశ్న: చలికాలంలో ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? – కిరణ్, గద్వాల డీఎంహెచ్ఓ: ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడే తీసుకోవడం ఉత్తమం. నిల్వ ఉన్నవి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినవి, బయట దొరికే చిరుతిండ్లు, ఐస్క్రీంల జోలికి వెళ్లొద్దు. చలికాలంలో నీటిని తక్కువగా తీసుకుంటారు. అలా చేయకుండా తగిన మోతాదులో తీసుకోవాలి. లేదంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. మాంసాహారాన్ని తగ్గించి తాజా పండ్లు, ఆకు కూరలు, పీచు పదార్ధాలు తీసుకోవాలి. ప్రశ్న: బీపీ, షుగర్, గుండె జబ్బు రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి.? – ఏడీ అరుణ్కుమార్, గద్వాల డీఎంహెచ్ఓ: బీపి, షుగర్, గుండె జబ్బు ఉన్నవారు చలి ఎక్కువగా ఉన్న సమయంలో తిరగరాదు. చలి ప్రభావంతో రక్త నాళాలు మూసుకుపోయి రక్త ప్రసరణలో ఇబ్బందులు ఏర్పడుతాయి. తద్వారా అకస్మత్తుగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. బీపీ పేషెంట్లకు ఆక్సిజన్ అందక హైపర్ టెన్షన్కు గురవుతారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు రక్తం చలికి చిక్కబడి బ్రెయిన్స్ట్రోక్కు దారి తీస్తుంది. వృద్ధులు, గర్భిణులకు ప్రాణాంతకంగా మారే పరిస్థితులు ఉంటాయి. ఇంట్లోనే ఉన్ని దుస్తులు ధరించి ఉండడం మంచిది. యోగా లేదా తేలికపాటి ఎక్సర్సైజ్లు చేయాలి. గద్వాల క్రైం: చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు, వృద్ధులపై అప్రమత్తంగా ఉండాలని.. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని.. జలుబు, జ్వరం, న్యుమోనియా, ఆస్తమా, శ్వాస సంబంధ వ్యాధుల బారిన పడకుండా స్వీయ జాగ్రత్తలే రక్షణగా నిలుస్తాయని ఇన్చార్జి డీఎంహెచ్ఓ సంధ్యా కిరణ్మయి అన్నారు. సోమవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ఇన్ కార్యక్రమంలో శీతాకాలంలో ఎదురయ్యే సమస్యలు, వ్యాధులపై ప్రజల సందేహాలను నివృత్తి చేయడంతోపాటు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఏదైనా వ్యాధి భారిన పడితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, లేదా జిల్లా ఆస్పత్రిలోని వైద్యులను సంప్రదించి మెరుగైన వైద్యం పొందాలని సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఫోన్ ఇన్లో ప్రజల సందేహాలు, డీఎంహెచ్ఓ సూచనలు ఇలా.. ప్రశ్న: చలికాలంలో ప్రధానంగా వచ్చే వ్యాధులు ఏమిటీ? ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? – విజయ్కుమార్, గద్వాల డీఎంహెచ్ఓ: జలుబు, చలి జ్వరం, ఆస్తమా, న్యుమోనియా, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తాం. ప్రస్తుతం లెప్రసీ సర్వే కొనసాగుతుంది. సర్వేలో భాగంగా ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. ప్రశ్న: మూడు రోజులుగా ఒళ్లు నొప్పులు, తలనొప్పితో ఇబ్బంది పడుతున్నాం. ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలి ? – రవిబాబు నాయుడు, కేటీదొడ్డి డీఎంహెచ్ఓ: వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఇలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సమీపంలోని పీహెచ్సీకి వెళ్లి వైద్యుడిని కలవండి. వ్యాధి నివారణకు మందులు తీసుకోండి. చలి తీవ్రత అధికంగా ఉండే సమయంలో వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉండండి. వ్యాధి తగ్గకుంటే రక్త పరీక్షలు తప్పనిసరిగా చేయించుకుని వైద్యం పొందండి. ప్రశ్న: తరచూ ఇంటిల్లిపాది జ్వరం, జలుబు బారినపడుతున్నాం. వీటి బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? – వసంత, గృహిణి, అలంపూర్ డీఎంహెచ్ఓ: ఉదయం ఎండ వచ్చే వరకు బయటకు రావద్దు. పిల్లలపై మరింత జాగ్రత్తగా ఉండాలి. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంట్లో యోగా చేయడం ఉపశమనంగా ఉంటుంది. ఉన్ని దుస్తులు ధరించాలి. ప్రశ్న: శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంది. బయట పడేదెలా? – సుఫియాన్, ఆనంద్, గద్వాల డీఎంహెచ్ఓ: గోరువెచ్చని నీటితో ఆవిరి తీసుకోండి. వీలైనంత వరకు పౌష్టికాహరం, తాజా పండ్లు, గోరువెచ్చని నీరు తాగండి. మందులు వాడినా సమస్య అలాగే ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. అవసరమైతే చాతీ ఎక్సరే చేయించుకుని మందులు తీసుకోవాలి. చలి గాలులతో ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. చల్లటి గాలిలో ప్రయాణాలు చేయొద్దు. ప్రశ్న: పిల్లలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి..? – ధరణి గృహిణి, గద్వాల డీఎంహెచ్ఓ: కూల్డ్రింక్స్, స్వీట్స్కు దూరంగా ఉంచాలి. వేడి ఆహార పదార్థాలు ఇవ్వాలి. సాయంత్రం నుంచే వెచ్చని దుస్తులు ధరించాలి. ఇంట్లోనే వ్యాయామాలు చేయాలి. చలి పెరిగే సమయాల్లో బయటకు పంపొద్దు. -
సాగునీరు, వైద్య ఇక్కట్లపై అసెంబ్లీలో ప్రస్తావన
అలంపూర్: నియోజకవర్గంలో సాగునీరు అందక రైతులు, మెరుగైన వైద్యం అందక ప్రజలు, పలు గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఈ సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం చొరవ చూపాలని ఎమ్మెల్యే విజయుడు సోమవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. చిన్నోనిపల్లి నుంచి ఆర్డీఎస్ కెనాల్కు లింకు కలపాలని, నెట్టంపాడు 99,100 ప్యాకెజీల పనులు పూర్తి చేయాలని, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ల ప్రముఖ్యతను వివరించినట్లు తెలిపారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం సాగు నీరు అందించడానికి వీలుగా మల్లమ్మ కుంట, జూలకల్, వల్లూరు రిజర్వాయర్ల నిర్మాణాలు చేపట్టకపోవడంతో సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. వైద్యం అందక రోగులు అనేక కష్టాలు పడుతున్నారని, విధిలేక కర్నూల్కు వెళ్తే రాష్ట్రం మారడం, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు వర్తించకపోవడంతో జేబులు ఖాళీ అవుతున్నాయని పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికై న గ్రామ సర్పంచ్లకు ఎక్కువ నిధులిచ్చి గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని, అలంపూర్, అయిజ, వడ్డేపల్లి మున్సిపాలిటీలకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించాలని కోరారు. సంబంధిత మంత్రి ఈ విషయాలపై స్పందించినట్లు తెలిపారు. నేడు జాబ్మేళా జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఎంప్లాయిమెంట్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి మైత్రిప్రియ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మూడు రకాల ప్రైవేట్ కంపెనీలో 200 ఉద్యోగాల భర్తీ కోసం ఈ మేళా నిర్వహిస్తున్నామని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం 89193 80410, 99485 68830 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
నర్సింగ్ కళాశాల పనులు త్వరగా పూర్తి చేయాలి
యూరియా కొరత లేకుండా పూర్తి స్థాయి చర్యలు గద్వాలన్యూటౌన్: జిల్లాలో రబీ సీజన్కు అవసరమైన యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులకు కొరత లేకుండా సరఫరా చేస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. యూరియా సరఫరాపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావ్, ఉన్నతాధికారులు సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వార సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా గద్వాల కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వీసీలో పాల్గొని మాట్లాడారు. రబీ సీజన్కు సంబంధించి జిల్లాలో ప్రస్తుతం 8124 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, ఇప్పటి వరకు 5816 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా చేసినట్లు చెప్పారు. కౌంటర్ల వద్ద రైతులు క్యూలైన్లలో వేచి ఉండకుండా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గద్వాలటౌన్: పట్టణ శివారులో నిర్మించిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవనాల ప్రారంభోత్సవానికి మిగిలిన అసంపూర్తి పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం నర్సింగ్ కళాశాల అకాడమిక్ బ్లాక్ భవనం, వసతి గృహ భవనాల సమూదాయాలను కలెక్టర్ పరిశీలించారు. పనుల పురోగతిని తెలుసుకున్నారు. నర్సింగ్ కళాశాల, వసతి గృహ నిర్మాణాలలో మౌలిక వసతులు కల్పించి, పెండింగ్ పనులను త్వరిరతగతిన పూర్తి చేయాలన్నారు. ముళ్ల పొదలను తొలగించి, పరిసరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. విద్యుత్, తాగునీటి సరఫరాలో లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దాలన్నారు. జనవరిలో నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవం ఉంటుందని, త్వరలోనే తేదీని ప్రకటిస్తామని చెప్పారు. కేంద్రీయ విద్యాలయ స్థల పరిశీలన కేంద్ర ప్రభుత్వం 2026–27 విద్యా సంవత్సరంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల సమీపంలో అయిదు ఎకరాల స్థలంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను నివేదిక రూపంలో రెవెన్యూ అధికారులు అందజేశారు. కేంద్రీయ విద్యాలయం భవనం పూర్తయ్యే వరకు తరగతులను పాత ఎస్పీ కార్యాలయంలో లేదా గద్వాల కేజీబీవీలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అడిషినల్ కలెక్టర్ లక్ష్మినారాయణ, తహసీల్దార్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. -
వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం
గద్వాలటౌన్: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అలంకారాలు, వైకుంఠ ద్వార దర్శనానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈక్రమంలో అగ్రహారంలోని కృష్ణానది చెంతన ఉన్న కల్యాణ లక్ష్మీవెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని తిరుమల శ్రీవారి ఆలయంలోని ఉత్తర ద్వారం తరహాలోనే వైకుంఠ ద్వారాన్ని విద్యుద్దీపాలు, పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. శ్రీవారి దశావతారాల ప్రతిమలతో పాటు అష్టలక్ష్మీదేవి ప్రతిమలను ద్వారంలో ఏర్పాటు చేశారు. బెంగళూరు, హైదరాబాద్, కర్నూలు తదితర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన పుష్పాలతో అలంకరించారు. దర్శనానంతరం వైకుంఠ ద్వారంలోకి వెళ్లిన భక్తులకు గోవింద నామాలు వినపడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గర్భాలయంతో పాటు పరివార దేవతామూర్తల ఆలయాలను సైతం విశేషంగా అలంకరించారు. అదే విధంగా జిల్లాలోని అలంపూర్, మల్దకల్, పాగుంట, ఉత్తనూరు, బీచుపల్లి లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయాలు ముస్తాబయ్యాయి. -
సాగులో నూతన ఒరవడి
పాలమూరులో వినూత్న పంటల వైపు రైతుల మొగ్గు ● పలుచోట్ల ఆయిల్పాం, వాణిజ్య తోటల పెంపకం ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భారీగా తగ్గిన పత్తి సాగు, దిగుబడి ● తీవ్ర నష్టాలు మిగిల్చిన వానాకాలం సీజన్ ● యూరియా కోసం రైతాంగానికి తప్పని పడిగాపులు సాక్షి, నాగర్కర్నూల్: పాలమూరు రైతులు సాగులో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈసారి పత్తి కన్నా.. వరి, మొక్కజొన్న ఇతర పంటలు సాగు చేసేందుకు మొగ్గుచూపారు. పత్తి పంటకు ప్రత్యామ్నాయంగా.. పలుచోట్ల ఆయిల్పాం, ఉద్యాన, వాణిజ్య పంటలు పండించేందుకు ఆసక్తి చూపారు. నాగర్కర్నూల్ జిల్లాలో ఈసారి 900 ఎకరాల్లో ఆయిల్పాం తోటలు సాగైంది. గద్వాల జిల్లాలో పొగాకు, వనపర్తి జిల్లాలో చెరకు, బెబ్బర పంటలు పండించారు. ఈ క్రమంలోనే నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ఈ ఏడాది పత్తి పంట సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. మిగతా మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో రైతులు గతేడాది కన్నా ఈసారి వానాకాలంలో వరి, పత్తి పంటలు అధికంగా సాగుచేశారు. కానీ, జిల్లాలో ఈ ఏడాది పత్తి పంట సాగుచేసిన రైతులకు నష్టాలే మిగిలాయి. అధిక వర్షాల నేపథ్యంలో పత్తి పంట దెబ్బతిని దిగుబడి సగానికి పడిపోయింది. దీంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఇతర పంటలకే ప్రాధాన్యం.. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో రైతులు అధికంగా వరి, పత్తి పంటలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈసారి నాగర్కర్నూల్ మినహా అన్ని జిల్లాల్లోనూ పత్తి పంట సాగు తగ్గించి వరి వైపు రైతులు మొగ్గుచూపారు. మహబూబ్నగర్లో ఈసారి వరి 10 వేల విస్తీర్ణం పెరగగా.. పత్తి 2 వేల ఎకరాలు తగ్గింది. నాగర్కర్నూల్లో వరి విస్తీర్ణం ఏకంగా 66 వేల ఎకరాలు పెరిగింది. అలాగే పత్తి విస్తీర్ణం సైతం గతేడాది కన్నా 4 వేలు అధికంగా సాగైంది. నారాయణపేటలో వరి గతేడాది కంటే 10 వేల ఎకరాల్లో రైతులు అధికంగా సాగుచేశారు. ఇక్కడ అధికంగా 50 వేల ఎకరాల్లో కందిపంట సాగవుతోంది. వనపర్తి జిల్లాలో వరి 8 వేల ఎకరాలు పెరగగా.. పత్తి విస్తీర్ణం 5 వేల ఎకరాలు తగ్గింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఈసారి పత్తి సాగు 70 వేల ఎకరాల వరకు తగ్గగా.. వరి పంట విస్తీర్ణం 7 వేల ఎకరాలు తక్కువగా నమోదైంది. -
రాష్ట్రస్థాయి కబడ్డీ రన్నరప్గా గద్వాల
గద్వాలటౌన్: కరీంనగర్ జిల్లాలో గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న సీనియర్ పురుషుల కబడ్డీ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఈ పోటీల్లో గద్వాల జిల్లా జట్టు రన్నరప్గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో సూర్యాపేట, జోగులాంబ గద్వాల జల్లా జట్లు తలపడ్డాయి. ఇరు జట్ల క్రీడాకారులు హోరాహోరీగా తలబట్టారు. 44–32 పాయింట్ల తేడాతో సూర్యాపేట గెలుపొంది విజేతగా నిలిచింది. గద్వాల జిల్లా జట్టు రన్నర్గా నిలిచింది. రన్నర్గా నిలిచిన గద్వాల కబడ్డీ క్రీడాకారులను కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు డీకే స్నిగ్దారెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సింహ, ట్రెజరర్ చందు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవి, కోచ్ హుస్సేన్ అభినందించారు. ‘ప్రజావాణి’కి 82 వినతులు గద్వాలటౌన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 82 వినతులు అందాయి. కలెక్టర్ సంతోష్, అడిషనల్ కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగరావులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ప్రజావాణి కొనసాగింది. మొత్తం 82 దరఖాస్తులు ప్రజావాణికి వచ్చాయి. ఆసరా పెన్షన్లు, భూసంబంధిత, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, ఉపాధి, విద్యుత్తు తదితర సమస్యలపై వినతులు వచ్చాయి. వినతులను త్వరగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. పోలీస్ గ్రీవెన్స్కు 20 అర్జీలు గద్వాల క్రైం: భూవివాదం, ఆస్తి తగాదాలు, అప్పు తీసుకున్న వ్యక్తులు డబ్బు తిరిగి ఇవ్వడంలేదు.. ఇలా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్కు బాధితులు 20 అర్జీలు అందజేశారు. ఎస్పీ శ్రీనివాసరావు వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని, సివిల్ సమస్యలపై కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలన్నారు. వేరుశనగ క్వింటా రూ.8,600 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు సోమవారం 645 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.8600, కనిష్టం రూ.3570, సరాసరి రూ.6307 ధరలు లభించాయి. అలాగే, 13 క్వింటాళ్ల ఆముదాలు రాగా, గరిష్టం రూ.6060, కనిష్టం రూ.5830, సరాసరి రూ.6060 ధరలు పలికాయి. 53 క్వింటాళ్ల వరి (సోన)కిగాను గరిష్టం రూ. 2509, కనిష్టం రూ. 2146, సరాసరి ధరలు రూ. 2250 వచ్చాయి. అలాగే, 294 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ. 6639, కనిష్టం రూ. 1719, సరాసరి రూ. 6619 ధరలు లభించాయి. వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి : ఎస్పీ గద్వాల క్రైం: నూతన సంవత్సర వేడుకలను జిల్లా ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి నుంచి వేడుకలపై ప్రత్యేక నిఘా ఉంటుందని, మద్యం సేవించి అల్లర్లకు పాల్పడినా, పెద్ద శబ్దంతో సౌండ్బాక్సులు ఏర్పాటు చేసినా సామాన్యులకు అసౌకర్యం కలిగిస్తే చర్యలు తప్పవని తెలిపారు. -
ఒకటే పార్టీ.. రెండు కార్యక్రమాలు
● గద్వాల కాంగ్రెస్లో అదే తీరు ● మరోసారి వర్గ రాజకీయాలకు వేదికగా మారిన పార్టీ ఆవిర్భావం గద్వాలటౌన్: గద్వాల కాంగ్రెస్ అంటేనే గ్రూపు రాజకీయాలకు పెట్టింటి పేరని మరోసారి రుజువైంది. పార్టీ ఒక్కటే.. కానీ కార్యక్రమాలు మాత్రం రెండు చోట్ల పోటాపోటీగా జరిగాయి. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు గ్రూపు రాజకీయాలకు మరోసారి వేదికయ్యాయి. ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుండగా.. తాజాగా డీసీసీ అధ్యక్షుడు రాజీవ్రెడ్డి నియామకంతో మరో శిబిరం ఏర్పడింది. రాజీవ్రెడ్డికి ఎమ్మెల్యే వర్గీయులు మద్దతుగా ఉండటంతో సరిత వర్గీయులు గుర్రుగా ఉన్నారు. మొదటి నుంచి రాజీవ్రెడ్డి కార్యక్రమాలకు సరిత వర్గీయులు దూరంగా ఉన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వేటు తప్పదు :డీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వేటు తప్పదని డీసీసీ అధ్యక్షుడు రాజీవ్రెడ్డి హెచ్చరించారు. డీసీసీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రతి కార్యకర్త పార్టీ నిబంధనల ప్రకారమే పని చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఒక్కటే ఉందని, అది డీసీసీ కార్యాలయమే అన్నారు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ పేరుతో కార్యాలయాలు ఏర్పాటు చేసి, కార్యక్రమాలు నడిపితే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. రాబోవు ఎన్నికల్లో పార్టీ బీ–ఫామ్ టిక్కెట్లు ఇచ్చేది నేనేనని చెప్పారు. జనవరి 5 నుంచి గ్రామాలలో పర్యటన చేస్తానన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వర్గీయులు, తదితరులు పాల్గొన్నారు. -
రైతుబంధు పాలన పోయి.. రాబంధుల పాలన వచ్చే
● బీఆర్ఎస్ హయాంలో ఆగిన వలసలు మళ్లీ మొదలయ్యాయి ● పాలమూరు ప్రాజెక్టును పండబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ● సర్పంచ్ల సన్మాన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాగర్కర్నూల్: రాష్ట్రంలో రైతుబంధు పాలన పోయి.. రాబంధుల పాలన వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించగా.. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి పాలమూరులో ఆగిన వలసలు తిరిగి మొదలయ్యాయన్నారు. ఈ ఘనత రేవంత్రెడ్డికే దక్కుతుందని విమర్శించారు. ఎప్పుడూ పండబెట్టి తొక్కుతా అంటూ మాట్లాడే రేవంత్రెడ్డి.. పాలమూరు ప్రాజెక్టును పండబెట్టి రైతులను తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. పాలమూరు ప్రాజెక్టును కాపాడుకొని రైతన్నలకు అండగా నిలిచేందుకు కేసీఆర్ మరో పోరాటానికి సిద్ధమయ్యారని వెల్లడించారు. త్వరలోనే పాలమూరుకు కేసీఆర్ రాబోతున్నారని.. ఆయన చేపట్టే పోరాటానికి పాలమూరు బిడ్డలు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. రెతులు యూరియా బస్తాల కోసం గోస పడుతున్నారని కేటీఆర్ అన్నారు. చలిలో చెప్పులు క్యూలో పెట్టి నిలబడాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. రేవంత్రెడ్డికి రైతులపై ప్రేమ ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని ఇచ్చామని గుర్తుచేశారు. కేసీఆర్ గ్రామాలను ఎంతో అభివృద్ధి చేశారన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబితే రేవంత్కు సోయి వచ్చిందన్నారు. ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ను ఓడిస్తేనే వాళ్లకు బుద్ధి వస్తుందని.. జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలు సెమీ ఫైనల్, అసెంబ్లీ ఎన్నికలు ఫైనల్ అని పేర్కొన్నారు. -
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే లక్ష్యం
గద్వాలటౌన్: ఎస్జీటీ యూనియన్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ఆవిష్కరించారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఎస్జీటీ యూనియన్ ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి ఉపాధ్యాయడు పనిచేయాలన్నారు. అక్షరాస్యతలో జిల్లాను అగ్రగామిగా నిలపాలన్నారు. విద్యా అభివృద్ధిలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం అన్ని వర్గాల ప్రజలకు మంచి చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంకితభావంతో విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాలని కోరారు. పదిలో మంచి ఫలితాలు తీసుకరావాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్జీటీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గోపాల్, ప్రధాన కార్యదర్శి వినోద్, నాయకులు వెంకటయ్య, బాలరాజ్, సుమిత్ర, నిమినా నాయక్, జీవన్కుమార్, సోమసుందర్రెడ్డి, రవీందర్రెడ్డి మల్లికార్జున్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
కూల్పై కూపీ..!
‘సాక్షి’ కథనాలపై కదిలిన ‘అధికార’ యంత్రాంగం దుకాణాల కేటాయింపులపై.. నగరంలోని రోడ్లపై చిరు వ్యాపారాలతో నిత్యం ట్రాఫిక్ ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిరు వ్యాపారుల కోసం నగరంలోని క్లాక్టవర్ వద్ద పది.. మార్కెట్ రోడ్డులో మరో మూడు షెటర్లు నిర్మించిన విషయం తెలిసిందే. వీటిని వీధి వ్యాపారులకు కేటాయించాల్సి ఉండగా.. ఇందులో దుకాణానికి ఒక్కో రేటు చొప్పున ఫిక్స్ చేసి కొందరు నాయకులు వసూళ్లకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోననే భయంతో మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన కొందరు ఉద్యోగులు ముఖ్య నేత దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో సదరు ముఖ్య నేత ఆదేశాలతో ఆ శాఖ అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ‘ఇంటెలిజెన్స్’ అధికారుల ఆరా.. కూల్ పాయింట్లకు సంబంధించి మద్యం షాపుల యజమానులపై ఎలాంటి ఒత్తిళ్లు తీసుకొచ్చారు.. ఎలా ఇబ్బందులు పెట్టారు.. ఏమని బెదిరించారు.. ఎవరా నాయకులు..? షటర్ల వ్యవహారంలో వసూళ్లకు పాల్పడింది ఎవరు.. ఇందులో నాయకులు, మున్సిపల్, మెప్మా శాఖల సిబ్బంది పాత్ర ఏమిటి? అని పోలీస్ ఇంటెలిజెన్స్ అధికారులు సైతం ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ముఖ్య నేత ఆదేశాలతోనే వారు కూపీ లాగుతున్నారా.. లేకపోతే పై నుంచి ఆదేశాలు వచ్చాయా అనేది తెలియడం లేదు. ఇప్పటికే కూపీ లాగిన ఇంటెలిజెన్స్ అధికారులు కూల్ పాయింట్ల తతంగంలో ఓ నాయకుడి దు రుసు ప్రవర్తనే ఇందుకు ప్రధాన కారణమనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆయనతోపాటు పలువురు నాయకుల చిట్టాను వెలికితీసే పనిలో వారు నిమగ్నమైనట్లు సమాచారం. ఈ వ్యవహారాలకు సంబంధించి ఆయా శాఖల అధికారుల ను ఫోన్లో సంప్రదించేందుకు ‘సాక్షి’ ప్రయత్ని ంచగా.. అధికారులు అందుబాటులోకి రాలేదు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి జిల్లాలోని వైన్స్ షాపుల్లో కూల్ పాయింట్లు, వీధి వ్యాపారులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుకాణాల కేటాయింపుల్లో చోటుచేసుకున్న దందాపై ‘అధికార’ యంత్రాంగం దృష్టిసారించింది. ప్రధానంగా మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొనసాగిన బాగోతాలపై ‘కూల్శ్రీగా దోపిడీ’, ‘నేతల వసూళ్ల పర్వం’ శీర్షికన ‘సాక్షిశ్రీలో ప్రచురితమైన వరుస కథనాలు సంచలనం సృష్టించాయి. అధికార కాంగ్రెస్లోని కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు నడిపించిన ఈ వ్యవహారం వెలుగులోకి రాగా.. ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు కూపీ లాగుతున్నారు. దీంతో అసలేం జరుగుతోంది.. ఈ వివాదాలకు ఎవరెవరు కారణం అని పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు సైతం నేరుగా రంగంలోకి దిగారు. తమకు పార్టీలో అత్యంత నమ్మకంగా ఉన్న వేగుల ద్వారా సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో.. మహబూబ్నగర్ నగర పరిధిలో 13 వైన్స్ షాపులు ఉన్నాయి. వీటిలో కూల్ పాయింట్ల ద్వారా తమ ముఖ్య అనుచరులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కొందరు కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతలు పంచుకున్నారు. అయితే మాట వినని నిర్వాహకులను పలువురు ఇబ్బందులకు గురిచేయడం వివాదానికి దారితీసింది . దీనిపై కొందరు యజమానులు రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్ ముఖ్యులు, ఎకై ్సజ్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రూ.లక్షలు, కోట్లు పెట్టాం.. లక్ష్యం మేరకు అమ్ముతున్నాం.. నిర్ణీత కోటా దాటిన తర్వాత ఒరిగేదేమీ లేదని.. ఇప్పుడు ఇలా వేధిస్తే ఎలా అని వారు ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎకై ్సజ్ శాఖ జిల్లా అధికారులకు ఉన్నతాధికారులు చీవాట్లు పెట్టడంతోపాటు ప్రాథమిక సమాచారం తీసుకున్నారు. పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో వారు ఆయా వైన్స్ యజమానుల నుంచి గుట్టుచప్పుడు కాకుండా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. మద్యం షాపుల్లో కూల్ పాయింట్ల వివాదంపై నజర్ నేరుగా రంగంలోకి దిగిన ‘ఎకై ్సజ్’ ఉన్నతాధికారులు వెన్స్ దుకాణాల ఓనర్ల నుంచి వివరాల సేకరణ ‘షెటర్ల’ కేటాయింపుల్లో అక్రమాలపైనా విచారణ పురపాలక శాఖకు ముఖ్య నేత ఆదేశాలు ఇంతకు ఎవరా నాయకులు.. ‘ఇంటెలిజెన్స్’ ఆరా? -
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ : 8008297534
తేదీ : 29–12–2025 సమయం : మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు గద్వాల క్రైం: రోజురోజుకు చలి తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యం బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఈ నెల 29న ఇన్చార్జి డీఎంహెచ్ఓ సంధ్యా కిరణ్మైతో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించనుంది. దగ్గు, జలుబు, జ్వర పీడితులకు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్యం, మందులు, ఇతర సేవలపై తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ఫోన్లో ఇన్చార్జి డీఎంహెచ్ఓను సంప్రదించవచ్చు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. నేడు డీఎంహెచ్ఓతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ -
రేపు బీచుపల్లిలో ఉత్తరద్వార దర్శనం
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఈ నెల 30న ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేయనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా ప్రజలు ఉత్తర ద్వార దర్శనంలో స్వామి, అమ్మవార్ల దివ్య అనుగ్రహానికి పాత్రులు కాగలరని ఆయన కోరారు. ముక్కోటి ఏకాదశికి మన్యంకొండ ముస్తాబు మహబూబ్నగర్ రూరల్: ముక్కోటి ఏకాదశికి మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానం ముస్తాబు అయ్యింది. ప్రతి ఏడాది దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మంగళవారం జరిగే వేడుకలకు దేవస్థానంలో అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారు హనుమద్దాసుల మండపంలో కొలువుదీరి ఉత్తరద్వారం ద్వారా భక్తులకు దర్శనం ఇస్తారు. ఉదయం 6.30 గంటలకు స్వామివారి శేషవాహన సేవ నిర్వహిస్తారు. దిగువకొండ వద్దను న్న అలివేలు మంగతాయారు దేవస్థానంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని చైర్మన్ మధుసూదన్కుమార్ తెలిపారు. యువత వ్యవసాయంలో రాణించాలి మరికల్: దేశంలో అతిపెద్ద రంగమైన వ్యవసాయ రంగంలో యువత రాణించాల్సిన సమయం వచ్చిందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆత్మీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని మరికల్లో రైతు మహోత్సవ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారుతున్నా రైతుల తలరాత మారకపోవడం బా ధారమన్నారు. దుకాణంలో విక్రయించే వస్తువుకు ఒక ధర నిర్ణయించి అమ్ముతారు కానీ, రైతు పండించిన ధాన్యానికి వ్యాపారులు నిర్ణయించిన ధరకే విక్రయించాల్సిన పరిస్థితులు దేశంలో ఉండటంతో వ్యవసాయం రంగం అభివృద్ధి చెందడం లేదన్నారు. రైతు తాను పండించిన పంటను స్వేచ్ఛగా విక్రయించుకునే రోజులు రావాలని, అప్పుడే వారి జీవితాలు బాగుంటాయన్నారు. -
పల్లికి రికార్డు ధర..
● రెండు వారాల నుంచి ధరలు పైకి.. ● జిల్లా నుంచి చైన్నె, మహారాష్ట్రకు ఎగుమతి ● క్వింటా రూ.8,821 పలికిన వైనం మంచి ధరలు వేరుశనగను మట్టి పెల్లలు లేకుండా నాణ్యతగా తీసుకొస్తుండడంతో యార్డులో మంచి ధరలు వస్తున్నాయి. ఇక్కడికి వస్తున్న వేరుశనగను విత్తనానికి వినియోగిస్తున్నారు. అందువల్లే ధరలు బాగా వస్తున్నాయి. – పుష్ప, జిల్లా మార్కెటింగ్ అధికారి రెండు ఎకరాల్లో పంట సాగుచేశా యాసంగికి ముందే రెండు ఎకరాల్లో వేరుశనగ వేశాను. చేతికి వచ్చిన పంటను కొద్ది రోజుల క్రితం విక్రయానికై యార్డుకు తీసుకెళ్లాను. క్వింటాలుకు రూ. 7800 వచ్చింది. ధర మంచిగా రావడంతో పంట ఖర్చులు పోను కొంత మిగిలింది. – సూరి, రైతు, శెట్టిఆత్మకూర్, గద్వాల మండలం ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం నేను వేరుశనగ సాగు చేస్తాను. మా మండలంతో పాటు కొన్ని మండలాల్లో సంవత్సరంలో మూడు సార్లు వేరుశనగ సాగు చేస్తారు. ఏటా నవంబర్, డిసెంబర్లో ఇతర యార్డులకు వేరుశనగ రాదు. ఇక్కడ మాత్రమే వస్తుంది. దీనివల్ల ధరలు బాగా వస్తున్నాయి. ఆనందంగా ఉంది. – కృష్ణన్న, రైతు, అమరవాయి, మల్దకల్ మండలం గద్వాల వ్యవసాయం: పల్లి ధరలు పరుగెత్తుతున్నాయి. నడిగడ్డ రైతులు యాసంగి సీజన్కు ముందుగా వేరుశనగ వేయగా.. ఈ పంట చేతికి రావడంతో విక్రయానికి గడిచిన మూడు నెలల నుంచి గద్వాల మార్కెట్యార్డుకు తీసుకవస్తున్నారు. ఇలా వస్తున్న వేరుశనగకు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు పోల్చితే నెల నెలా రికార్డు ధరలు పలుకుతున్నాయి. గరిష్టంగా రూ.8821 పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా, వేరుశనగ పంట 90 నుంచి 100 రోజులకు చేతికి వస్తుంది. ఎకరాకు రూ.12వేల నుంచి రూ.15వేల వరకు ఖర్చు అవుతుంది. అయితే ఈసారి వానాకాలం సీజన్లో అధిక వర్షాల వల్ల వేరుశనగ బాగా దెబ్బతినడంతో కొన్ని చోట్ల పంటను తీసివేశారు. జిల్లాలో పలుచోట్ల అనుకున్న స్థాయిలో దిగుబడులు రాలేదు. అయితే విస్తారంగా కురిసిన వర్షాల వల్ల బోర్లు, బావులు రీచార్జ్ అయ్యాయి. దీంతో ఆగస్టు, సెప్టెంబర్లో దాదాపు 7వేల నుంచి 10వేల ఎకరాల్లో ముందస్తు యాసంగి సీజన్ పంటలో బాగంగా మల్దకల్, కేటీదొడ్డి, గట్టు, గద్వాల, ఇటిక్యాల, అయిజ మండలాల్లో పంట వేశారు. ఇలా వేసిన వేరుశనగ పంట అక్టోబర్ నుంచి యార్డుకు అమ్మకానికి వస్తోంది. యా, వ,వే: యార్డుకు వచ్చిన వేరుశనగ గద్వాల మార్కెట్యార్డుకు విక్రయానికి వచ్చిన వేరుశనగ కొనుగోళ ్లు ఇలా.. -
విశ్రాంత ఉద్యోగుల సంక్షేమానికి కృషి
గద్వాలటౌన్: విశ్రాంత ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. స్థానిక పాత హౌసింగ్బోర్డు కాలనీలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఏర్పాటు చేసిన పెన్షనర్ డే వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించేలా చూస్తామన్నారు. శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని, సుదీర్ణ కాలంగా సేవలందించిన తమ అనుభవాలను నేటితరం ఉద్యోగులు మార్గదర్శకంగా ఉపయోగించుకోవాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ విద్యుక్త ధర్మాన్ని పాటించే ఉద్యోగులు ఎల్లప్పుడు గుర్తుండిపోతారన్నారు. ప్రతి ఉద్యోగి తమ జీవిత కాలంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకుంటే ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు. ఉద్యోగుల వైద్య చికిత్సలకు సంబంధించి కర్నూల్లో ఈహెచ్ఎస్ సౌకర్యం త్వరలోనే సాకారం అవుతుందని హామీ ఇచ్చారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో సైతం వైద్యసేవలు మెరుగు పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్త పీఆర్సీని ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని, పాత పీఆర్సీ, డీఆర్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. అనంతరం పలువురు సీనియర్ విశ్రాంత ఉద్యోగులను ఎమ్మెల్యే శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజరీ అధికారిణి గాయత్రి, ఏటీఓ వెంకట్రెడ్డి, సీనియర్ అధికారి మురళీ, విశ్రాంతి ఉద్యోగుల సంఘం నాయకులు చక్రధర్, హనుమంతు, బాలకిషన్రావు, రామన్గౌడ్, వీరవసంతరాయుడు, సవారన్న, బీసీరెడ్డి పాల్గొన్నారు. -
వణికిస్తున్న చలి..
● రెండు వారాలుగా పెరిగిన తీవ్రత ● ఉష్ణోగ్రతల మార్పులతో పెరుగుతున్న వ్యాధులు ● అప్రమత్తతే ముఖ్యమంటున్న వైద్యులు ●చలి గాలులతో ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు వీటి నుంచి కోలుకోవాలంటే సమయం పడుతుంది. ఆసుపత్రికి దగ్గు, జలుబు తదితర బాధిత చిన్నారులు, వృద్ధులు ఎక్కువగా వస్తున్నారు. సమస్య తీవ్రమైతే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. గోరు వెచ్చని నీటిని తాగించాలి. తాజా ఆహారం తీసుకోవాలి. – డాక్టర్ వంశీ, ప్రభుత్వ వైద్యుడు గద్వాలటౌన్: జిల్లా ప్రజలను చలి వణికిస్తోంది. శీతాకాలం ఆరంభంలో మొదట చలి తీవ్రత తక్కువగా ఉన్నప్పటికి.. గడిచిన రెండు వారాలుగా చలి తీవ్రత పెరిగింది. ఇటీవల కాలంలో పగటి ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. ఇప్పటి వరకు కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల స్థాయికి పడిపోయింది. ముందు ముందు పగటి ఉష్ణోగ్రతలు ఘననీయంగా పడిపోయే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి చలి మొదలవుతుండగా ఉదయం 9 గంటల వరకు కొనసాగుతోంది. పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది స్వెటర్లు, శాలువాలు, దుప్పట్లతో చలి నుంచి రక్షణ పొందడానికి యత్నిస్తున్నారు. వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ఆరోగ్య పరమైన సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. జలుబు, దగ్గు, వైరల్జ్వరాలు సొకుతున్నాయి. శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉన్నవారు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. వయోబేధం లేకుండా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో చలికాలం ఎదురయ్యే ఇబ్బందులు, ఆరోగ్య పరిరక్షణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి. చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నిరోదకశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వాతావరణ మార్పుల వలన వారు త్వరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఉదయం, సాయంత్రం వారిని బయటతిరగనీయొద్దు. గ్రామాల నుంచి పట్టణాల్లోని పాఠశాలలకు ఉదయం సమయాల్లో బస్సులో, ఆటోల్లో వెళ్లే విద్యార్థులకు విధిగా స్వెటర్లు, మంకీ క్యాప్లు దరించాలి. పిల్లలకు ఎక్కువగా జలుబు చేస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. దీంతోపాటు పొడి చర్మం ఉన్నవారు ఎక్కువ ఇబ్బందిపడే అవకాశం ఉంది. చర్మం పగుల్లిచ్చి మంట పుడుతుంది. అందువల్ల చర్మం పొడిబారి పోకుండా చూసుకోవాలి. ఇందుకోసం వ్యాస్లెన్, పెట్రోలియంజెల్లి, మాయిశ్ఛరైజర్లు వాడాలి. స్నానానికి కూడా గ్లీజరిన్, మాయిశ్ఛరైజర్ ఉన్న సబ్బులు వాడటం ఉత్తమం. పొగమంచు.. రోడ్డు ప్రమాదాలు అధికం తెల్లవారుజామున పొగమంచు కురుస్తుంది. ఒక్కసారి మంచు చాలా దట్టంగా కురిసి దారి కనిపించకుండా పోతోంది. దీనివల్ల ముందుగా వచ్చే వాహనాలు దగ్గరకు వచ్చే వరకు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందువల్ల మంచుకురిసేటప్పుడు వాహనాలు నడిపేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లైట్లు వేసుకోవడంతో పాటు తక్కువ వేగంతో వాహనాలు నడపాలి. చలికాలం మామూలుగా ఉంటేనే చలితో వణికిపోతాం. అలాంటిది వాహనాలపై ప్రయాణిస్తే వణుకు పుడుతుంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో ముఖ్యంగా ద్విచక్రవాహనాలపై ప్రయాణించాల్సి వస్తే వెచ్చగా ఉండే జర్కిన్లు, తలకు, చెవులకు రక్షణగా మంకీక్యాప్, చేతులకు గ్లౌజులు తప్పక ధరించాలి. జిల్లాలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత వివరాలు.. తేదీ కనిష్ట ఉష్ణోగ్రత 23వ తేదీ 13.4 24వ తేదీ 13.7 25వ తేదీ 13.6 26వ తేదీ 14.0 27వ తేదీ 12.8 -
సైబర్.. టెర్రర్
–8లో uసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: సైబర్ నేరగాళ్లు సామాజిక మాధ్యమాలే వేదికగా వల పన్ని దోపిడీకి పాల్పడుతున్నారు. ఆయా వర్గాల వ్యక్తుల బలహీనత అయిన అత్యాశను ఆసరాగా చేసుకుని రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. రకరకాల పేర్లతో ఏపీకే లింక్లు పంపించి నిలువునా దోచుకుంటున్నారు. ఈ ఏడాది ఎక్కువగా ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట యువత నుంచి భారీగా డబ్బులు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. వారి మాయలో చిక్కుకున్న వారిలో అమాయకులే కాకుండా.. రైతులు మొదలుకొని విద్యాధికులు, రాజకీయ నాయకులు సైతం ఉన్నారు. ఈ క్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లాను సైబర్ మాయ కమ్మేసిన తీరుపై ‘సాక్షి’ క్రైం రౌండప్.. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల పరిధిలో సైబర్ నేరాలకు సంబంధించి గతేడాది (2024)లో మొత్తం 3,003 ఫిర్యాదులు రాగా.. 236 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత 2025 సంవత్సరంలో 3,625 ఫిర్యాదులు అందగా.. 454 కేసులు నమోదైనట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఈ లెక్కన గతేడాదితో పోలిస్తే 622 ఫిర్యాదులు.. 218 కేసులు పెరిగినట్లు తెలుస్తోంది. గత సంవత్సరంలో నమోదైన కేసులతో పోలిస్తే మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో సైబర్ నేరాల సంఖ్య అధికంగా ఉంది. జిల్లాలో గణనీయంగా పెరిగిన సైబర్ నేరాలు ఉమ్మడి పాలమూరులోని 4 జిల్లాల్లో ఇదే పరిస్థితి ఈసారి మొత్తం 3,625 ఫిర్యాదులు.. 454 కేసులు నమోదు అత్యధికంగా మహబూబ్నగర్లో.. అత్యల్పంగా వనపర్తిలో.. ఈ ఏడాది కేటుగాళ్లు కొల్లగొట్టింది రూ.9.29 కోట్లు గతంతో పోల్చితే కాస్త మెరుగుపడిన రికవరీ -
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ : 8008297534
తేదీ : 29–12–2025 సమయం : మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు గద్వాల క్రైం: రోజురోజుకు చలి తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యం బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఈ నెల 29న ఇన్చార్జి డీఎంహెచ్ఓ సంధ్యా కిరణ్మైతో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించనుంది. దగ్గు, జలుబు, జ్వర పీడితులకు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్యం, మందులు, ఇతర సేవలపై తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ఫోన్లో ఇన్చార్జి డీఎంహెచ్ఓను సంప్రదించవచ్చు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. రేపు డీఎంహెచ్ఓతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ -
పాలమూరులో 18,446 కేసులు పెండింగ్
పాలమూరు: మహబూబ్నగర్ జిల్లాలో ఈ ఏడాది నవంబర్ 30 నాటికి 18,446 కేసులు పెండింగ్లో ఉన్నాయని, మౌళిక సదుపాయాల కల్పనతో కోర్టులలో పెండింగ్ కేసులు తగ్గించే విధంగా న్యాయవాదులు కృషిచేయాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలన ఇన్చార్జి న్యాయమూర్తి జస్టిస్ శ్రావణ్కుమార్ అన్నారు. నగరంలోని బండమీదిపల్లి సమీపంలో రూ.81 కోట్లతో నూతనంగా నిర్మించనున్న కోర్టు సముదాయ భవన నిర్మాణానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి, జస్టిస్ టి.మాధవిదేవి, జస్టిస్ నర్సింగ్రావులతో కలిసి జస్టిస్ శ్రావణ్కుమార్ శంకుస్థాపన చేసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రావణ్కుమార్ మాట్లాడుతూ మహబూబ్నగర్ నగరంలో 16, జడ్చర్లలో 3 మొత్తం 19 కోర్టులు ఉండగా.. 293 మంది సిబ్బందికి గాను 252 మంది ఉన్నారని వెల్లడించారు. 504 మంది న్యాయవాదులు ఉండగా 35 మంది మహిళా న్యాయవాదులు ప్రాక్టీస్ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న కోర్టు భవనం 2.5 ఎకరాల స్థలంలో సరిపోని విధంగా ఉందని, నూతన కోర్టు భవన సముదాయం విశాలంగా నిర్మించాలని ప్రభుత్వం 2024 నవంబర్ 14న ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. 10.5 ఎకరాల స్థలంలో రూ.81 కోట్లతో మూడు అంతస్తులలో 12 కోర్టుల ఒకే భవన సముదాయం ఒకేదగ్గర నిర్మాణం అవుతుందన్నారు. ఈ నూతన భవన నిర్మాణం రాబోయే 24 నెలల్లో పూర్తిచేయనున్నట్లు తెలిపారు. జిల్లాకు భౌగోళికంగా, పరిపాలన పరంగా ప్రాముఖ్యత ఉందని, వ్యవసాయ జీవనోపాధిగా, పట్టణీకరణతో అభివృద్ధి చెందుతున్న జిల్లా అన్నారు. నూతన కోర్టు భవన సముదాయంతో కోర్టుకు వచ్చే కక్షిదారులకు సత్వర న్యాయం లభించాలని, ఈ దిశగా న్యాయవాదులు, న్యాయమూర్తులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. రెండేళ్లలో కోర్టు భవన నిర్మాణం పూర్తికావాలి రూ.81 కోట్లతో ఒకే సముదాయంలో 12 కోర్టులు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రావణ్కుమార్ -
భక్తులతో కిటకిటలాడిన ఆదిశిలా క్షేత్రం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయం శనివారం భక్తులతో పోటేత్తింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. క్యూలైన్లలో బారులుతీరారు. భక్తులు దాసంగాలు సిద్ధం చేసి స్వామివారికి సమర్పించగా.. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సత్యచంద్రారెడ్డి, అరవిందరావు, నాయకులు మధుసూధన్రెడ్డి, నరేందర్ , వీరారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శిరీష, అర్చకులు మధుసూదనాచారి, రవిచారి, ధీరేంద్రదాసు, చంద్రశేఖర్రావు భక్తులు పాల్గొన్నారు. -
అలివిలవిల..
కృష్ణానది తీరం వెంట తనిఖీలను ముమ్మరం చేస్తాం. కృష్ణానదిలో అలివి వలలతో చేపల వేటను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటాం. ఇందుకు ప్రధానంగా స్థానిక మత్స్యకారులు అధికారులకు సహకరించాలి. – నర్సింహారావు, ఏడీ, మత్స్యశాఖ కొల్లాపూర్: అలివి వలలతో చేపల వేట నిషేధం. అయినప్పటికీ కొందరు వ్యాపారులు తమ స్వలాభం కోసం కృష్ణానదిలో అలివి వలలతో వేట సాగిస్తూ.. చిన్న చేప పిల్లలను యథేచ్ఛగా పట్టేస్తున్నారు. ఫలితంగా సంప్రదాయ మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో అలివి వలలను పూర్తిస్థాయిలో నిషేధిస్తామని.. అవసరమైతే ఏపీ అధికారుల సమన్వయంతో అలివి వలలతో చేపల వేటను కట్టడి చేస్తామని ఇటీవల కొల్లాపూర్లో నిర్వహించిన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ సభలో రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. చాలాకాలంగా అలివి వలల వినియోగంపై మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికార యంత్రాంగంలో మాత్రం స్పందన కనిపించడం లేదు. కృష్ణానదిలో విచ్చలవిడిగా అలివి వలల వినియోగం జరుగుతోంది. దీనిపై ప్రజాప్రతినిధులు చెబుతున్న మాటలకు, అధికారులు చేతలకు పొంతన లేకుండాపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా కృష్ణానదిలో వదులుతున్న చేప పిల్లలను కొన్ని రోజుల్లోనే అలివి వలలతో పట్టేస్తుండటంతో క్రమేణా మత్స్య సంపద తగ్గుతూ వస్తోంది. కృష్ణాతీరంలోనే గుడారాలు.. కొల్లాపూర్ నియోజకవర్గ సరిహద్దు గుండా కృష్ణానది ప్రవహిస్తోంది. వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల పరిధిలో ఉన్న కృష్ణానది తీరం వెంట పదుల సంఖ్యలో అలివి వలలతో చేపల వేట సాగించే వారి గుడారాలు ఉన్నాయి. చిన్నంబావి, పెంట్లవెల్లి, కొల్లాపూర్ మండలాల్లోని నది తీర ప్రాంతాల్లో విస్తృతంగా అలివి వలలతో చేపల వేట సాగుతోంది. వైజాగ్, కర్నూలు, కొల్లాపూర్ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు నదీ తీరంలోని పట్లు (చేపలు అధికంగా లభించే ప్రాంతాలు) కొనుగోలు చేసి దందా సాగిస్తున్నారు. పర్యాటక ప్రాంతాల చెంతనే.. పర్యాటక ప్రాంతమైన సోమశిలకు నిత్యం జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తుంటారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులు, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు ఇక్కడికి రావడం.. కృష్ణానదిలో బోట్ల ద్వారా విహరించడం కనిపిస్తుంది. అయితే సోమశిలలోని టూరిజం కాటేజీలు, పుష్కరఘాట్ల వద్ద నుంచి కనుచూపు మేరలోనే అలివి వలలతో చేపల వేట సాగించే మత్స్యకారుల గుడారాలు ఉన్నాయి. నదీ తీరానికి రెండు వైపులా గుడారాలు, ఆరబెట్టిన చేపపిల్లలు కనిపిస్తాయి. కానీ, ఎవరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మంచాలకట్ట, మల్లేశ్వరం, జటప్రోల్, అమరిగిరిలోని నదీ తీర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా అలివి వలల గుడారాలే కనిపిస్తాయి. అలివి వ్యాపారులకు స్థానిక రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. అందుకే అటువైపు అధికారులు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్మికుల నిర్బంధం.. అలివి వలలు లాగేందుకు చాలామంది కార్మికులు అవసరం పడతారు. దీంతో వ్యాపారులు బలవంతంగా కార్మికులను ఇక్కడికి తీసుకొచ్చి నిర్బంధిస్తున్నారు. ఈ ఏడాది స్వచ్ఛంద సంస్థల జోక్యంతో 100 మందికిపైగా బాండెడ్ లేబర్కు విముక్తి కల్పించారు. అయినప్పటికీ కార్మికశాఖ అధికారులు ఎప్పుడు కూడా స్వయంగా వచ్చి తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. జిల్లాలోని నీటి వనరుల్లో ఈ ఏడాది 2.50 కోట్ల చేపపిల్లలను వదలాలని మత్స్యశాఖ నిర్ణయించింది. ఇప్పటి వరకు కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్కర్నూల్ నియోజకవర్గ కేంద్రాల్లో చేపపిల్లల విడుదలను లాంచనంగా ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 23 లక్షల చేపపిల్లలను విడుదల చేశారు. సోమశిల వద్ద కృష్ణానదిలో మంత్రి జూపల్లి కృష్ణారావు 58 వేల చేపపిల్లలను వదిలారు. నదిలో 30 లక్షల చేపపిల్లలను వదిలేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణానదిలో యథేచ్ఛగా సాగుతున్న చిన్నసైజు చేపల వేట ఇలా వదిలితే.. అలా పట్టేస్తున్న అక్రమార్కులు అటువైపు కన్నెత్తి చూడని అధికారులు స్వయంగా మంత్రులు హెచ్చరించినా కనిపించని స్పందన క్రమంగా తగ్గిపోతున్న మత్స్య సంపద కృష్ణానది తెలంగాణ, ఏపీ సరిహద్దులో ప్రవహిస్తోంది. తాము తనిఖీలకు వెళ్లే సమయానికి అలివి గుడారాలను ఏపీ సరిహద్దులోకి మారుస్తున్నారంటూ తెలంగాణ అధికారులు చెబుతూ.. తమ బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారు. సోమశిల, మల్లేశ్వరం, మంచాలకట్ట, వేంకల్, జటప్రోల్, అమరగిరి ప్రాంతాల్లో నెలల తరబడి గుడారాలు తెలంగాణ సరిహద్దులోనే ఉంటాయి. అధికారులు అనుకుంటే ఏ క్షణమైనా వారిని పట్టుకోవచ్చు. కానీ అలా జరగడం లేదు. -
జిల్లాను సందర్శించిన ట్రైనీ ఐపీఎస్లు
గద్వాల క్రైం: జిల్లాను నలుగురు ట్రైనీ ఐపీఎస్లు రాహుల్కాంత్, మానిషానెహ్రా, సోహం సునీల్, ఆయషా ఫాతిమా శుక్రవారం సందర్శించారు. ఈమేరకు మొదట ఎస్పీ శ్రీనివాసరావును కలిసి జిల్లాలో నమోదు అవుతున్న కేసులు, రాష్ట్ర సరిహద్దులు, జిల్లా భౌగోళిక విషయాలు, విద్యా, వైద్యం, సాగు, తాగునీటి, రాజకీయ అంశాలు, ప్రాచీన ఆలయాలు, సందర్శించే ప్రాంతాలు, పురాతన నిర్మాణాలు, ప్రాజెక్ట్లు, పోలీసు స్టేషన్లు తదితర విషయాలపై ఆరా తీశారు. అనంతరం వారు జోగుళాంబ ఆయలం, జిల్లా కేంద్రంలోని చేనేత కార్మికులను కలిసి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆ బాలవీరుల త్యాగం స్ఫూర్తిదాయం గద్వాలన్యూటౌన్: జిల్లా కేంద్రంలోని బాల సదనంలో శుక్రవారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీర్ బాల దివస్ను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు సమావేశంలో బాలల సంరక్షణ అధికారి నరసింహ మాట్లాడుతూ.. అతి చిన్న వయస్సులో స్వేచ్ఛ, ధర్మ పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన సాహిబ్ గురు గోబింద్ సింగ్ కుమారులు జోరవర్ సింగ్ (7 ఏళ్లు), బాబా ఫతే సింగ్ (9 ఏళ్లు)ల వీరత్వం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పారు. అతి చిన్న వయస్సులో వారు మొఘల్ పాలకుల ఆజ్ఞలకు లొంగకుండా, తమ ధర్మాన్ని కాపాడుకుంటూ వీరమరణం పొందారని, ఈ బాలవీరుల స్మారకంగా ఏటా డిసెంబర్ 26న వీర్ బాల్ దివస్ నిర్వహిస్తున్నారని వివరించారు. చిన్నారులు ధైర్యంగా ఉండాలని సూచించారు. నైతిక విలువలు పాటిస్తూ ధర్మ మార్గంలో నడవాలని చెప్పారు. అనంతరం ఢిల్లీలో జరిగిన వీర్ బాల్ దివస్ కార్యక్రమాన్ని ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించారు. చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సురేష్, బాలసదనం సూపరింటెండెంట్ వెంకటేశ్వరీ, సోషల్ వర్కర్ పద్మ, స్నేహ, నిర్మల బాలబాలికలు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్ జట్ల ఎంపికలు మన్ననూర్: స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయం క్రీడా మైదానంలో శుక్రవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బ్యాడ్మింటన్ బాలబాలికల జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్గౌడ్, ప్రధాన కార్యదర్శి వెంకటరామిరెడ్డి సమక్షంలో నిర్వహించిన పోటీల్లో గద్వాల, పెబ్బేరు, వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, తెలకపల్లి, మన్ననూర్ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఉమ్మడి జిల్లా బాలబాలికల జట్లకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. జట్ల వివరాలు.. బాలుర జట్టుకు ప్రణీత్ (గద్వాల), రంజిత్ (పెబ్బేరు), ఎం.చరణ్ (గద్వాల), భాస్కర్ (పెబ్బేరు), మణికంఠ (అచ్చంపేట), సుదర్శన్ (గద్వాల), జి.చరణ్ (గద్వాల), మోహన్ (వనపర్తి), బాలికల జట్టుకు అక్షిత (మన్ననూర్), అను (పెబ్బేరు), కావేరి (మన్ననూర్), మేరీ (మన్ననూర్), రాధిక (మన్ననూర్), రేణుక (కల్వకుర్తి), మహాలక్ష్మి (కల్వకుర్తి), శ్రావణి (మన్ననూర్), సమారిన్ బేగం (గద్వాల), యశస్విని (తెలకపల్లి) ఎంపికై నట్లు నిర్వాహకులు తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ రూపాదేవి, అలీం, చుక్క చంద్రశేఖర్, డా.నరేందర్రెడ్డి, శ్యామ్, బాబునాయక్, పీఈటీలు అస్మత్, అనిత, స్నేహ పాల్గొన్నారు. ముగిసిన రాష్ట్రస్థాయి హాకీ పోటీలు వనపర్తి రూరల్: మండలంలోని కడుకుంట్ల క్రీడా మైదానంలో కొనసాగిన ఎస్జీఎఫ్ అండర్–14 బాలికల రాష్ట్రస్థాయి హాకీ పోటీలు శుక్రవారం ముగిశాయి. చివరి మ్యాచ్లో మహబూబ్నగర్ జట్టుపై నిజామాబాద్ జట్టు 1–0 గోల్స్తో విజయం సాధించింది. ప్రథమ స్థానంలో నిజామాబాద్, ద్వితీయ స్థానంలో మహబూబ్నగర్, మూడో స్థానంలో హైదరాబాద్ జట్లు నిలిచాయని ఎస్జీఎప్ కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.నిరంజన్గౌడ్ తెలిపారు. గ్రామంలో హాకీ క్రీడలు నిర్వహించడానికి సహకరించిన గ్రామస్తులు, యువతకు కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
వనపర్తి: అహంకారపూరిత అధికారం, మద్యం, డబ్బు ఏవీ నిబద్ధత ఎదుట నిలబడలేవని స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు నిరూపించాయని.. బీఆర్ఎస్ మద్దతుదారులు అధికార పార్టీకి ధీటుగా విజయం సాధించడం గర్వంగా ఉందని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాపార్టీ కార్యాలయంలో కృష్ణానది జలాల హక్కుల సాధన, పార్టీ గ్రామపంచాయతీ పాలకవర్గాల సన్మాన కార్యక్రమానికి ఆయనతో పాటు మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి హాజరయ్యారు. ముందుగా మాజీ మంత్రి నివాసం నుంచి జిల్లా పార్టీ కార్యాలయం వరకు గులాబీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు రెండేళ్లకే విరక్తి వచ్చిందని పంచాయతీ ఫలితాలతో స్పష్టమవుతోందన్నారు. రైతులు యూరియా కోసం కష్టాలు పడుతుంటే పాలకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 45 రోజుల పాటు వచ్చిన జూరాల జలాలను సముద్రానికి వదిలేశారని.. వరద జలాలను ఒడిసి పట్టుకునే చేతగాని పాలకులని ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడలేక యాసంగి సాగుకు క్రాప్ హాలిడే ప్రకటించారన్నారని విమర్శించారు. ఖిల్లాఘనపురం మండలం సోళీపురం, వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామపంచాయతీ ఫలితాలపై అనుమానం ఉందని.. రీ కౌంటింగ్ కోసం కోర్టును ఆశ్రయించామని వెల్లడించారు. జిల్లాలోని అన్ని ప్రధాన గ్రామాల్లో పార్టీ మద్దతుదారులు విజయఢంకా మోగించారని తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన గోపాల్పేటలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు బీఆర్ఎస్కు మద్దతునిచ్చారని గుర్తుచేశారు. అభివృద్ధి చేసి చూపండి.. విమర్శలు కాదు.. ఇచ్చిన హామీలు అమలుచేసి, అభివృద్ధి పనులు చేసి చూపించాలని మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి అధికార పార్టీకి సవాల్ విసిరారు. కేసీఆర్ మిషన్ భగీరథ పథకంతో ఊరూరా ట్యాప్లు ఏర్పాటు చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్పై దృష్టి సారించిందని ఆరోపించారు. గ్రామ పాలకులకు విశేష అధికారాలు ఉంటాయని, చట్టం తెలుసుకొని ప్రజలకు మంచి పాలన అందించాలని సర్పంచులు, వార్డు సభ్యులకు సూచించారు. 2018లో అప్పటి ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చిందని, కేంద్రం నిధులు నేరుగా గ్రామపంచాయతీలకు వస్తాయని వివరించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్య, వైద్యంపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, పట్టణ అధ్యక్షుడు రమేష్గౌడ్, మాజీ ఎంపీపీ కృష్ణానాయక్, నాయకులు మాణిక్యం, విజయ్, కురుమూర్తి యాదవ్, చిట్యాల రాము తదితరులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర
గద్వాలటౌన్: మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, కొత్తగా తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవిత మిషన్ పథకం వల్ల ప్రజలు, కార్మికుల వేతనాలు పెరగకుండా కేంద్రం అడ్డుకునే చర్యలకు పాల్పడుతుందని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఉప్పేర్ నర్సింహా, వీవీ నర్సింహా ఆరోపించారు. శుక్రవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నల్లబ్యాడ్జీలు ధరించి సీఐటీయూ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత ఉపాధి పథకంలో నిధుల కోత పెట్టిందని, ప్రస్తుతం పేరు మార్చుతున్నారని మండిపడ్డారు. ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తన వాటాను 60 శాతానికి తగ్గించి, మిగిలిన 40 శాతం భారాన్ని రాష్ట్రాలపై మోపడం అన్యామన్నారు. కేంద్ర ప్రభుత్వ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు నరేష్, బాబన్న, రామకృష్ణ, మల్లేష్, వీరేష్, వెంకటన్నపాల్గొన్నారు. -
పెరిగిన చోరీలు..!
సైబర్ నేరాలు రెట్టింపు.. రోడ్డు ప్రమాదాలు, అత్యాచార కేసులు సైతం పెంపు గద్వాల క్రైం: జిల్లాలో గతేడాదితో పోల్చితే చోరీ కేసులు.. సైబర్ నేరాలు.. అత్యాచార కేసులు.. రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తించి తగు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. పలు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 135 మంది దుర్మరణం చెందగా.. 189 మంది క్షతగాత్రులయ్యారు. ఈ ఏడాది మొత్తంగా 2,410 కేసులు నమోయ్యాయని, గతేడాది నమోదైన 2703 కేసులతో పోల్చితే కొంత కేసుల శాతం తగ్గిందని ఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం వార్షిక నేర సమీక్షలో వెల్లడించారు. ఇక చోరీ కేసుల్లో 67 శాతం సొమ్ము రికవరీ చేశామని, దొంగల ముఠాలను, రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పలు హత్య కేసులను ఛేదించి నిందితులను పట్టుకున్నామని తెలిపారు. ఇదిలాఉండగా, జిల్లాలో సుపారీగ్యాంగ్ హత్యలు.. చోరీ ఘటనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. ముఖ్యంగా జూలై 12న అయిజలోని ఓ గోదాం షట్టర్లు పగలగొట్టి రూ.18 లక్షల విలువ చేసే సిగరెట్ల చోరీ.. జూన్ 5న గద్వాల వ్యవసాయ మార్కెట్లో నిలిపి ఉంచిన రూ.25 లక్షల విలువైన 10 టైర్ల లారీ అపహరణ.. ఆగస్టు 17న జిల్లా కేంద్రంలో హమాలీకాలనీలోని ఓ ఇంట్లోకి చొరబడి 16 తులాల బంగారు ఆభరణాలను దొంగలు చోరీ చేయడంతో ప్రజలకు కంటిమీద కునుకు కరువైంది. సైబర్ నేరాలు రెట్టింపు జిల్లాలో గతేడాది 161 దొంగతనాలకుగాను రూ.1.94 కోట్లు చోరీ అయ్యింది. ఇందులో రూ.63 లక్షలు రికవరీ చేశారు. ఈ ఏడాది 184 దొంగతనాలకుగాను రూ.1.43 కోట్లు చోరీ అయ్యింది. ఇందులో రూ.96 లక్షలు రికవరీ చేశారు. ఇక సైబర్ నేరాల విషయానికి వస్తే.. స్వల్పంగా పెరిగాయి. గతేడాది 50 కేసులు కాగా.. ఈ ఏడాది 95 నమోదయ్యాయి. ఈ 95 కేసుల్లో రూ.2.60 కోట్లు అపహరించగా.. సాంకేతికతను ఉపయోగించి బ్యాంక్ ఖాతాల నుంచి రూ.47,62లక్షల నగదును ఫ్రీజ్ చేశారు. రూ.11.24లక్షల నగదును రికవరీ చేశారు. ఇక రోడ్డు ప్రమాదాలు సైతం స్వల్పంగా పెరిగాయి. మొత్తం 204 రోడ్డు ప్రమాదాల్లో 135 మంది మృతి చెందారు. జిల్లాలో తొలి వైట్కాలర్ కేసు నమోదైంది. నందిన్నె రైసుమిల్లు యాజమాని మిల్లు వీరన్న రూ.40 కోట్ల ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు విజెలెన్స్ అధికారుల దాడుల్లో బయటపడింది. ఈమేరకు కేటీదొడ్డి పోలీసు స్టేషన్లో అధికారులు ఫిర్యాదు చేయగా.. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు. హత్య కేసుల ఛేదన జిల్లాలో సంచలనం సృష్టించిన పలు హత్య కేసులను పోలీసులు ఛేదించారు. ప్రధానంగా నవంబర్ 21న కేటీదొడ్డి మండలం నందిన్నెకు చెందిన మాజీ సర్పంచ్ బీమరాయుడు హత్య.. జూన్ 15న గద్వాలకు చెందిన ఓ ప్రైవేటు సర్వేయర్ హత్య.. ఏప్రిల్ 17న కేటీదొడ్డి మండలం గంగన్పల్లి హత్య.. ఫిబ్రవరి 12న వడ్డేపల్లి మండలం తనగాలకి చెందిన రమేష్ హత్యలు సంచలనం సృష్టించాయి. ఈ హత్య కేసులను పోలీసులు ఛాలెంజ్గా తీసుకుని ఛేదించి నిందితులను కటకటాల్లోకి పంపించారు. కేటగిరీ నమోదైన కేసులు 2024 2025 బీఎన్ఎస్ యాక్టు 1052 846 రోడ్డు ప్రమాదాలు 194 204 దొంగతనాలు 161 184 మిస్సింగ్ 187 177 ఇసుక రవాణా 133 112 సైబర్ క్రైమ్ 50 95 గ్రేవ్ కేసులు 69 92 చీటింగ్ 169 77 పేకాట 35 64 పోక్సో 44 51 మహిళా వేధింపులు 196 50 అత్యాచారం 31 41 రేషన్ బియ్యం 53 40 ఎస్సీ, ఎస్టీ 40 32 హత్యలు 10 10 ఎన్డీపీఎస్ యాక్టు 4 5 ఇతర కేసులు 325 425 నమోదైన మొత్తం కేసులు 2,410 గతేడాదితో పోల్చితే 293 కేసులు తగ్గుదల జిల్లా వార్షిక నేర సమీక్షలో ఎస్పీ శ్రీనివాసరావు లోక్ అదాలత్ ద్వారా 22,426 కేసులు పరిష్కారం 985.8 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం గేమింగ్ యాక్టు కేసులో రూ.7.75 లక్షలు స్వాధీనం 7056 డ్రంకెన్ డ్రైవ్ కేసులకుగాను రూ.33.96 లక్షలు జరిమానా వసూలు మోటార్ వెహికిల్ యాక్టు ద్వారా 1.05 లక్షల కేసులకుగాను జరిమానా రూపంలో రూ.6.49 కోట్లు వసూలు -
నట్టల నివారణతో జీవాలు సురక్షితం
● జిల్లాలో ఇప్పటివరకు 35 శాతం మందుల పంపిణీ గద్వాలవ్యవసాయం: జీవాల్లో (గొర్రెలు, మేకలు) నట్టలు ఏర్పడకుండా ముందస్తుగా వాటికి ఉచిత నివారణ మందులు వేసే కార్యక్రమం జిల్లాలో కొనసాగుతోంది. పశుసంవర్ధకశాఖ ఈనెల 22 నుంచి ఆరంభించింది. ఇప్పటి వరకు 35శాతం పూర్తి అయ్యింది. జీవాల్లో నట్టలు.. బాహ్య, అంతర్ పరాన్నజీవులుగా నట్టలు రెండు రకాలుగా ఉంటాయి. అంతర్ పరాన్న జీవులు (నులిపురుగులు, పొట్టజలగలు, బద్దెపురుగులు) బాహ్య పరాన్న జీవులు (టిక్స్, ఫ్లైస్,మైక్స్)ను నట్టలు అని పిలుస్తారు. నట్టలు ప్రధానంగా వర్షాకాలం, చలికాలంలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఏర్పడతాయి. ఈ వ్యాదిగ్రస్థ జీవాలు ఆరుబయట మేతపైన కాని, తాగునీటిపైన కానీ మల విసర్జనచేస్తే.. ఆ మేతను తిన్న, ఆనీటిని తాగిన ఇతర ఆరోగ్యకరమైన జీవాల్లో కూడా నట్టలు ఏర్పడతాయి. నట్టలు ఏర్పడితే జీవాలు మేత తినక బలహీనంగా మారుతాయి. తర్వాత రక్తహీనతకు గురి అయి తీవ్ర అనారోగ్యానికి గురి అవుతాయి. బరువు తగ్గిపోతాయి. కొన్ని సందర్బాల్లో మృతి చెందుతాయి. కొనసాగుతున్న కార్యక్రమం పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో నట్టల నివారణ మందులు వేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ప్రతి బృందంలో పశువైద్యాధికారి, పార్యవేట్ ఉన్నారు. వీరు ఆయా గ్రామాల్లో ముందస్తుగా పెంపకందారులకు సమాచారం అందించి జీవాలకు నట్టల నివారణ మందులను వేస్తున్నారు. జిల్లాలో 5,40,650 గొర్రెలు ఉండగా 1,28,165 వాటికి, 65,355 మేకలు ఉండగా 10,784 వాటికి ఇప్పటి వరకు వేసినట్లు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నట్టల నివారణ కార్యక్రమం మరో వారం రోజుల పాటు నిర్వహిస్తామని, పెంపకందారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
పద్యకృతుల ఆవిష్కరణ మహోత్సవం
స్టేషన్ మహబూబ్నగర్: జాతీయ సాహిత్య పరిషత్ పాలమూరు జిల్లాశాఖ ఆధ్వర్యంలో ప్రముఖ కవి రాచాలపల్లి బాబుదేవిదాస్రావు రచించిన ‘రామచంద్ర ప్రభో’, ‘చిత్రాంగద– సారంగధరుడు’ పద్యకృతుల ఆవిష్కరణ మహోత్సవాన్ని గురువారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించారు. జాతీయ సాహిత్య పరిషత్ జిల్లాశాఖ అధ్యక్షుడు ఇరివింటి వెంకటేశ్వరశర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ సాహిత్యం జగద్వితం కోసం సృష్టించబడుతుందన్నారు. కవులు సమాజ హితాన్ని కోరుకుంటారని తెలిపారు. ముఖ్య అతిథి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రామచంద్ర ప్రభో కావ్యం సరళమైన, సుందరమైన సుమధుర తెలుగు భాషలో అందించినట్లు తెలిపారు. ఇందులో ప్రాచీన కవుల గుంబనం, లలిత పదజాతం ఆకట్టుకుంటుందన్నారు. రామచంద్రప్రభో మకుటంతో ఆద్యంతం పద్యాలను ఎంతో శ్రావ్యంగా చదువుతూ బాబుదేవిదాసును అభినందిస్తూ సమీక్ష చేశారు. డాక్టర్ పొద్దుటూరు ఎల్లారెడ్డి రామచంద్రప్రభో మకుటం ఉన్న 131 పద్య కావ్యాన్ని, పద్యాలను చదువుతూ రామ కథను అసాంతం పరిచయం చేశారు. డాక్టర్ తంగెళ్లపల్లి శ్రీదేవి చిత్రాంగద–సారంగధరుడు కథను 126 ప్యదాల కృతిని సమీక్ష చేస్తూ చక్కగా వివరించారు. అదేవిధంగా ప్రముఖ న్యాయవాది వి.మనోహర్రెడ్డి, అవధాని చుక్కాయపల్లి శ్రీదేవి, డాక్టర్ కె.బాలస్వామి, తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షురాలు రావూరి వనజ పద్యకృతులపై ప్రసంగించారు. పాలమూరు నగర అధ్యక్షులు జి,శాంతారెడ్డి, కవులు ప్రభులింగంశాస్త్రి, దేవదానం, రవీందర్రెడ్డి, ఖాజా మైనొద్దీన్, జగపతిరావు, గడ్డం వనజ, డాక్టర్ కృష్ణవేణి, జమున, ఈశ్వరమ్మ, గుముడాల చక్రవర్తి, శ్యాంప్రసాద్, అనురాధ, వీరేందర్గౌడ్, శ్రీరాములు పాల్గొన్నారు. -
గాంధీ ప్రతిష్టను తగ్గించడానికే పేరు తొలగింపు
● డీసీసీ కార్యాలయ ప్రారంభంలో వీహెచ్ ● కార్యక్రమానికి సంపత్, సరిత వర్గీయులు దూరం గద్వాలటౌన్: జాతిపిత మహాత్మాగాంధీ ప్రతిష్టను తగ్గించడం కోసమే ఉపాధి హామీ పథకానికి ఆయన పేరును తొలగించారని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వీ.హనుమంతురావు ఆరోపించారు. గద్వాలలోని రాజీవ్మార్గ్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీసీ కార్యాలయాన్ని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వీ హనుమంతురావు గురువారం ప్రారంభించారు. డీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన రాజీవ్రెడ్డి బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు తీసుకున్న వెంటనే రాజీవ్రెడ్డిని పలువురు నాయకులు వేర్వేరుగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వీహెచ్ మాట్లాడారు. ఉపాధి పథకానికి గాంధీ పేరు తొలగింపు చర్య దేశ ప్రతిష్టకు భంగం కలిగించే అంశమన్నారు. పేదల కడుపు నింపే లక్ష్యంతో యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పఽథకాన్ని తెచ్చిందన్నారు. ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడానికి చట్టసభల నుంచి అన్ని స్థాయిల్లో ప్రయత్నం చేయటం జరుగుతుందన్నారు. చివరిగా ప్రజా కోర్టులో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజా బంగ్లాగా డీసీసీ కార్యాలయం నడిగడ్డలో నడుస్తున్న బంగ్లా రాజకీయాలకు రోజులు దగ్గర పడ్డాయని.. ఇప్పుడు డీసీసీ కార్యాలయమే ప్రజా బంగ్లాగా ప్రజలకు అండగా ఉంటుందని డీసీసీ అధ్యక్షుడు రాజీవ్రెడ్డి పేర్కొన్నారు. బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. డీసీసీ కార్యాలయానికి ప్రజా బంగ్లాగా నామకరణం చేస్తున్నామని చెప్పారు. ప్రజా బంగ్లా ప్రతి కాంగ్రెస్ కార్యకర్తది అన్నారు. నడిగడ్డలో ఎవరికి ఇబ్బందులు కలిగిన ప్రజా బంగ్లాకు వస్తే న్యాయం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ప్రాధాన కార్యదర్శి మిథున్రెడ్డి, మహబూబ్నగర్ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ తదితరులు సన్మానించిన వారిలో ఉన్నారు. అంతకుముందు డీసీసీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జెండాను ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆవిష్కరించారు. సంపత్, సరిత వర్గీయులు దూరం డీసీసీ అధ్యక్షుడు రాజీవ్రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి సరిత దూరంగా ఉన్నారు. వారి వర్గీయులు సైతం కార్యక్రమానికి హాజరు కాలేదు. సంపత్, సరిత వర్గీయులు ఇరువురు గద్వాలలో ఉన్నప్పటికి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాకపోవడంపై చర్చ మొదలైంది. ఫ్లెక్సీలలో ఫొటోలు వేయలేదనే చర్చ సైతం జరుగుతుంది. ఉద్దేశ్య పూర్వకంగానే ప్రమాణ స్వీకారానికి తమను పిలవలేదని, బంగ్లా డైరెక్షన్లోనే డీసీసీ అధ్యక్షుడు పనిచేస్తున్నారని సరిత వర్గీయులు ఆరోపించారు. అయితే ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి మినహా ఆయన వర్గీయులు ప్రమాణ స్వీకారానికి హాజరై, రాజీవ్రెడ్డిని పూలమాలలతో సన్మానించారు. గద్వాలలో కాంగ్రెస్ పార్టీ మూడు గ్రూపులుగా చీలిపోయిందనే చర్చ సాగుతోంది. -
భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు
గద్వాలటౌన్: క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గురువారం జిల్లా పరిధిలోని ఆయా చర్చిలలో వేడుకల సందర్భంగా చర్చిలను అందంగా తీర్చిదిద్దారు. చర్చి పాస్టర్లు, మత పెద్దలు, ఇతర రాజకీయ నాయకులు వేరువేరుగా జిల్లా కేంద్రంతోపాటు మండలాల పరిధిలోని పలు చర్చిలలో పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయా చర్చిలలోని పాస్టర్లు సందేశాన్ని ఇచ్చారు. ప్రేమ, కరుణలతో ప్రపంచాన్ని జయించవచ్చని తెలిపి సర్వ మానవాళికి శాంతి సందేశాన్ని వినిపించిన యేసు ప్రభువును ప్రతి ఒక్కరూ అనుసరించాలని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇదిలాఉండగా, క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా చర్చిలు రంగురంగుల విద్యుద్దీపాలతో తేజరిల్లాయి. ప్రపంచానికి శాంతి సందేశం అందించిన యేసుక్రీస్తు ఆగమనవేళ.. జిల్లా అంతటా చర్చిలు ప్రార్థనలతో ప్రతిధ్వనించాయి. బుధవారం అర్థరాత్రికి ముందే చర్చిలన్నీ విద్యుద్దీపాలంకరణ నడుమ సందడిగా మారాయి. బాలయేసును స్వాగతించడానికి చిన్నా, పెద్ద అంతా ఉత్సాహంగా ఎదురుచూశారు. ‘పరిశుద్ధాత్ముని కృప వల్ల అంతా శుభమే జరగాలంటూ’ మత పెద్దలు ఆకాంక్షించగా, భక్తులంతా జీసస్కు జేజేలు పలికారు. పొద్దు పోయేదాక క్రిస్మస్ వేడుకలను ఆనందోత్సహాలతో జరుపుకొన్నారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వివిధ పార్టీల నాయకులు వేర్వేరుగా పలు చర్చిలలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. -
ఆదిశిలా క్షేత్రంలో జడ్జీల ప్రత్యేక పూజలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం జిల్లా సీనియర్ సివిల్ జడ్జీ లక్ష్మి, వనపర్తి జిల్లా ప్రిన్సిపల్ సబ్కోర్టు జడ్జీ కళార్చన వేర్వేరుగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ నిర్వాహకులు అరవిందరావు, అర్చకులు వారికి సాదర స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ విశిష్టతలను వివరించి స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించి మెమోంటో అందజేశారు. వారి వెంట ఆలయ నిర్వాహకులు చంద్రశేఖరరావు, అర్చకులు మధుసూధనాచారి, రమేషాచారి, రవిచారి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కోయిల్సాగర్ నీటి విడుదల షెడ్యూల్ ఖరారు దేవరకద్ర: ప్రస్తుత యాసంగి సీజన్లో కోయిల్సాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదలకు షెడ్యూల్ ఖరారు చేశారు. కలెక్టరేట్లో మంగళవారం సాగునీటి సలహా మండలి సమావేశం కలెక్టర్ విజయేందిర, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా ఇరిగేషన్శాఖ అధికారులు, ఆయకట్టు రైతులతో చర్చించి నీటి విడుదల చేసే తేదీలను ఖరారు చేశారు. ప్రాజెక్టు పాత ఆయకట్టు కింద కుడి, ఎడమ కాల్వలకు నీటిని వదులుతారు. గతేడాది రూపొందించిన షెడ్యూల్లో తేదీలను అటు ఇటుగా మార్చి అయిదు తడులుగా నీటిని వదలడానికి నిర్ణయించారు. రెండేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల వడ్డీ చెల్లించాం వనపర్తి: గడిచిన 64 ఏళ్లలో 22 మంది సీఎంలు రూ.63 వేల కోట్ల అప్పు చేస్తే.. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని.. ఆయన చేసిన అప్పుల కోసం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.1.50 లక్షల కోట్లు వడ్డీ చెల్లించామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన వనపర్తిలో విలేకరులతో మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతల డీపీఆర్కు కేంద్రం అనుమతి లభించలేదనే విషయం పక్కన పెడితే.. ఉమ్మడి పాలమూరులో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన, నిధులు వెచ్చించింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనేనని పునరుద్ఘాటించారు. సాగునీటి ప్రాజెక్టుల పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దోపిడి, అధికారం కోల్పోయాక చేస్తున్న అబద్ధపు ఆరోపణలపై నూతనంగా ఎన్నికై న సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలతో నిజాలు సవివరింగా చర్చించాలని సూచించారు. దరఖాస్తుల ఆహ్వానం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన జనమంచి గౌరీశంకర్ (గౌరీజీ) పేరిట ఏటా అందజేసే యువ పురస్కార్కు దరఖాస్తు చేసుకోవచ్చని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరేష్తేజ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సమాజంపై సానుకూల ప్రభావం చూపే సేవా కార్యక్రమాలు, నూతన ఆవిష్కరణలు, ప్రముఖ రంగాల్లో విశేష కృషి చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలిచే జాతీయ భావాలు కలిగిన 40 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. -
రైతులను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
ఉండవెల్లి: రైతులు రెక్కలు ముక్కలు చేసుకొని సాగుచేసిన పంటలను కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని, రైతులను అసలు పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యే విజయుడు ఆరోపించారు. గురువారం మండలంలోని బొంకూరులో మొక్కజొన్న పంట విక్రయానికి వెళ్లి కొనుగోలు కేంద్రం వద్దే మృతిచెందిన జమ్మన్న ఇంటికి వెళ్లి రైతు మృతదేహానికి నివాళులర్పించారు. వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు పంటను విక్రయించడానికి వెళ్లి రోజుల తరబడి పడిగాపులు కాచాడని, చలికి ఎండకు కేంద్రం వద్దే గుండెపోటుతో మృతిచెందడంపై ప్రభుత్వ నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్లు కనబడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముమ్మాటికి రైతు మృతికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని అన్నారు. ఆయన వెంట బొంకూరు సర్పంచు దేవన్న, బీఆర్ఎస్ నాయకులు గజేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, భరత్ కుమార్ రెడ్డి, పల్లయ్య, చంద్రన్న, సురేష్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, రంగస్వామి ఉన్నారు. -
బంగ్లాదేశ్లో హింసాకాండకు వ్యతిరేకంగా ఆందోళన
గద్వాలటౌన్: బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై గద్వాలలో నిరసన వ్యక్తమైంది. గురువారం సాయంత్రం వీహెచ్పీ, భజరంగ్దళ్, బీజేపీ సంయుక్త ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్థానిక కోటలోని ఆలయం నుంచి నిరసన ప్రదర్శన చేపట్టారు. బంగ్లాదేశ్లో జిహాదీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం స్థానిక కృష్ణవేణి చౌరస్తాలో బంగ్లాదేశ్ దేశ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు అల్లూరి ఫణిమోహన్రావు, ధర్మ ప్రసార సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి మాట్లాడారు. బంగ్లాదేశ్లో హిందువులపై కొనసాగుతున్న దాడులను అడ్డుకునేందుకు కేంద్రం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. హిందువులపై జరుగుతున్న హింసాకాండను దేశ ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలన్నారు. బంగ్లాదేశ్లో జిహాదీ శక్తుల నుంచి హిందువులకు రక్షణ కల్పించాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలు ఒక్కతాటిపైకొచ్చి బంగ్లాదేశ్లో ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మతోన్మాదుల దాడిలో మృతిచెందిన దీప్ చంద్రదాస్కు నివాళులర్పించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు రామంజనేయులు, బండల వెంకట్రాములు, భాస్కర్, తిరుపతి, నర్సింహా, మణికృష్ణ, శ్రీకాంత్, జనార్థన్, మనోజ్, జయశ్రీ, రమాదేవి, శ్యామ్, దేవదాసు తదితరులు పాల్గొన్నారు. -
హత్యల పరంపర..
నడిగడ్డలో 11 నెలల్లో 9 హత్యలు –8లో u●అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు.. వ్యాపారుల మధ్య వైరం.. భార్యభర్తల మధ్య వివాహేతర సంబంధాలు.. ఇలా కారణం ఏదైనా సదరు వ్యక్తులను అడ్డుతొలగించుకునేందుకు వెనకాడడంలేదు. ఇతర రాష్ట్రాలకు చెందిన సుపారీగ్యాంగ్లతో చేతులు కలిపి సొంతవారిని హత్య చేయించే విష సంస్కృతికి జిల్లాలో అడుగులు పడుతున్నాయి. జిల్లాలో గడచిన 11 నెలల వ్యవధిలో 9 హత్యలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వరుస హత్యలు జిల్లాతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. సమస్య ఏదైనా చర్చించి సామరస్యంగా పరిష్కరించేలా ప్రజలకు అవగాహన కల్పిస్తాం. గ్రామాల్లో కళాజాత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దాడులు, హత్యలకు పాల్పడడం సరికాదని వివరిస్తున్నాం. ప్రజల్లో మార్పునకు చర్యలు తీసుకుంటాం. జిల్లాలో శాంతియుత వాతావారణం కల్పిస్తాం. ఎవరూ అధైరపడొద్దు. విపత్కర కేసుల ఛేదనలో ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికి ప్రజలు పోలీసు వ్యవస్థపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితిలో చెదరని ముద్ర వేయాలనే ధృఢ సంకల్పంతో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. – శ్రీనివాసరావు, ఎస్పీ -
డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలి
ఎర్రవల్లి: రైతులు ఉద్యానశాఖ ద్వారా అందిస్తున్న వివిధ పథకాలను సద్వినియోగించుకోవాలని, గ్రూపులుగా కలిసి మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసి లాభసాటిగా మార్చుకోవచ్చునని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మహ్మద్ అలీ అక్బర్ అన్నారు. బుధవారం మండలంలోని బీచుపల్లి ఆయిల్పాం నర్సరీలో వర్షాధార ప్రాంత అభివృద్ధిలో భాగంగా రైతులకు కూరగాయలు బుట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై కొండేరు, కుర్తి రాయలచెర్వు క్లస్టర్లకు చెందిన 110మంది రైతులకు రూ.11లక్షల విలువగల కూరగాయల బుట్టలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు వైవిద్యమైన పంటలు సాగుచేస్తూ సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంభించి మెరుగైన ఆదాయాన్ని పొందేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎండీడీకేవై పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. దీని ద్వారా జిల్లాలో ఉద్యాన, పశు, మత్స్య, తదితర రంగాలకు చెందిన లబ్దిదారులు సైతం తమ వృత్తుల్లో గణనీయమైన అభివృద్ధిని సాదించేందుకు ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో అలంపూర్ డివిజన్ ఉద్యానశాఖ అధికారిణి ఇమ్రానా, సర్పంచులు ఈరన్న, మద్దిలేటి, నాయకులు సోమనాద్రి, వెంకటేష్, రాముడు, మద్దిలేటి పాల్గొన్నారు. -
అభివృద్ధి చేసుకుందాం
పార్టీలు, పంతాలు వద్దు.. చదువుతోనే వెలుగులు ‘చదువుతోనే వెలుగు, మార్పు వస్తుంది. నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నాం. కొడంగల్ నియోజకవర్గంలో 25 వేల మంది విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. రాష్ట్రం మొత్తం అన్ని పాఠశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం పెట్టించి చదువు చెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపండి. విద్యా, వసతులు, భోజనం అందిస్తేనే విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. నియోజకవర్గంలోని లగచర్లలో 250 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్ కడుతున్నాం. రాష్ట్రంలో ఎక్కడా లేని సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నాం. దేశంలోని ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేలా విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రాంతం నుంచి ఉన్నత చదువులు చదివి ఐఏఎస్, ఐపీఎస్లు అయ్యి తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలి.’ అని సీఎం సూచించారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/కోస్గి: గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం సమగ్ర అభివృద్ధి చెందినట్లనే విషయాన్ని గుర్తించి నూతనంగా ఎన్నికై న సర్పంచులు గ్రామాల అభివృద్ధికి తమవంతు కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. సమష్టి కృషితో దేశంలోనే కొడంగల్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఎన్నికలు వచ్చినప్పుడే పార్టీలు, రాజకీయాలుంటాయని, ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీలు, పంతాలు పక్కన బెట్టి అభివృద్ధియే ఏకై క ఎజెండాగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. బుధవారం నారాయణపేట కోస్గి పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో కొడంగల్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికై న సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్లను సన్మానించారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ‘ మీరు ఆశీర్వదించిన మీ బిడ్డ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. బెట్టి గ్రామాలను అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా నూతన సర్పంచ్లు పాలకవర్గాలతో కలిసి పని చేయాలి. అభివృద్ధికి ఎన్ని నిధులైన మంజూరు చేస్తా. గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు కాకుండా చిన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ.10 లక్షలు ప్రత్యేక ముఖ్యమంత్రి నిధులు అందిస్తా. ప్రజలు మీపై నమ్మకంతో ఓట్లు వేసి సర్పంచులుగా గెలిపించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు అందించే బాధ్యత నూతన సర్పంచ్లుగా మీపైనే ఉంది. గ్రామస్థాయి మొదలు మండలస్థాయి నాయకుల వరకు రాజకీయాలు పక్కనబెట్టి అన్ని పార్టీల సర్పంచ్లను కలుపుకొని గ్రామాల అభివృద్ధియే ఏకై క లక్ష్యంగా పని చేయాలి.’ అని పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్టులను పట్టించుకోలేదు.. పాలమూరు జిల్లాలో ఇల్లు లేకపోయినా ఇక్కడి ప్రజలు నమ్మి చంద్రశేఖర్రావును ఎంపీగా గెలిపిస్తే జిల్లాకు చేసింది శూన్యమని ముఖ్యమంత్రి అన్నారు. గత పాలకులు పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పట్టించుకోకపోవడంతోనే గత పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారన్నారు. 2014లో తెచ్చిన జీఓ 69ను మంజూరు చేయిస్తే గత ప్రభుత్వం తొక్కి పెట్టిందన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన గత ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఏ ప్రాజెక్టును పూర్తి చేయకుండానే కమీషన్లు దండుకుందన్నారు. పాలమూరుపై చిన్నచూపుతోనే పదేళ్లలో నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, డిండి, కోయిల్సాగర్, ఎస్ఎల్బీసీతో పాటు ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారన్నారు. తొడుక్కోవడానికి చెప్పులు, వేసుకోవడానికి బట్టలు లేని వాళ్లకు వేల కోట్ల ఆస్తులు వచ్చాయి తప్ప పాలమూరుకు నీళ్లు రాలేదన్నారు. నారాయణపేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించుకుంటుంటే కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారన్నారు. కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణలో ఎకరాకు 14 లక్షలు సరిపోవడం లేదని మంత్రి శ్రీహరి వచ్చి అడిగి ఎకరాకు రూ.18 లక్షలు ఆశిస్తున్నారని చెబితే.. ముఖ్యమంత్రిగా నేను ఎకరాకు రూ.20 లక్షలు ఇవ్వాలని నిర్ణయించగా కేబినెట్ ఆమోదం పొందిందన్నారు. పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 96 శాతం మంది రైతులు భూములు ఇస్తున్నారన్నారు. దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కొడంగల్ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తా ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికీ అందించే బాధ్యత సర్పంచులదే నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పాదయాత్ర చేసి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చి పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేశారని, అలాగే పదేళ్లు అభివృద్ధిలో వెనుకబడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధియే లక్ష్యంగా నేడు రేవంతన్న అలుపెరగని పోరాటం చేసి కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చి పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రేవంతన్న హయాంలో దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డి, కాలె యాదయ్య, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ప్రతిక్ జైన్, అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రాంచందర్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్రెడ్డి, నాయకులు కుంభం శివకుమార్రెడ్డి, వార్ల విజయ్కుమార్, రఘువర్ధన్రెడ్డి, విక్రంరెడ్డి, నర్సిములు, మహేందర్రెడ్డి, యూసూఫ్, శేఖర్, మద్దప్ప దేశ్ముఖ్, అన్న కిష్టప్ప, నాగులపల్లి నరేందర్, తదితరులు పాల్గొన్నారు. -
‘కంది’పోయిన రైతు
● చీడపీడలతో తగ్గనున్న దిగుబడులు ● రెండేళ్లుగా ఆర్థికంగా నష్టపోయిన కంది రైతు –8లో uగద్వాల వ్యవసాయం: ఈ ఏడాది సైతం కంది పంట రైతులను నిరాశ పర్చింది. 2023–24లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలతో, 2024–25లో వాతావరణం అనుకూలించలేదు. ఫలితంగా పంట దిగుబడులు గణనీయంగా తగ్గి రైతులు ఆర్థికంగా నష్టాలు చవిచూశారు. ఈ ఏడాది 2025–26 వానాకాలంలో ఇష్టంగా సాగు చేసిన ఈపంటకు పూత, గింజ దశలో చీడపీడలు ఆశించి పంటపై ప్రబావాన్ని చూపడం వల్ల ఈ ఏడాది సైతం దిగుబడులు తగ్గే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదిలాఉండగా, ఆహార పంట అయిన కంది పప్పుకు మార్కెట్లో ఎప్పుడు డిమాండ్తో మంచి ధరలు ఉంటాయి. కంది పంటను ఈ ప్రాంత రైతులు చాలా ఇష్టంగా సాగు చేస్తారు. వర్షాలు కొంత మేర వచ్చినా.. చలితో పంట బాగా వస్తుందని సాగు చేస్తుంటారు. కంది పంట సాగు చేయడానికి ఎకరాకు రూ.18వేల నుంచి 20వేల వరకు ఖర్చు వస్తుంది. ఆరు నెలలు పంట కాలం. వాతావరణం సహకరిస్తే నీటి లభ్యత ఉన్న చోట 8నుంచి 10 క్వింటాళ్లు, వర్షాదారం కింద అయితే ఎకరాకు 3నుంచి 5 క్వింటాళ్లు పంట దిగుబడి వస్తుంది. అనుకూలించని వాతావరణం.. నష్టం జిల్లాలో 2023–24 వానాకాలం సీజన్లో కంది పంటను 22,503 ఎకరాల్లో సాగు చేశారు. అయితే ఇందులో వర్షాధారం కింద, నీటి లభ్యత ఉన్న రెండు చోట్ల వేశారు. ఈ సీజన్లో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవలేదు. వర్షాకాలం ముగిసిన తర్వాత శీతాకాలంలో సైతం చలి తీవ్రత తక్కువగానే ఉండింది. ఇలా వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు. ఫలితంగా వర్షాధారం కింద ఎకరాకు 3 నుంచి 5 క్వింటాళ్లు రావాల్సి ఉండగా, కేవలం రెండు నుంచి రెండున్నర క్వింటాళ్లు, నీటి లభ్యత ఉన్న చోట 8నుంచి 10 క్వింటాళ్లు రావాల్సి ఉండగా 5 నుంచి 6 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. వర్షాలు బాగా కురుస్తాయన్న అంచనాతో 2024–25లో 41,235 ఎకరాల్లో కంది సాగు చేశారు. వర్షాలు బాగా కురిశాయి. దీంతో కంది మొక్కలు బాగా ఏపుగా పెరిగాయి. అయితే అక్టోబర్లో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పాటు, పూత దశలో ముసురు వర్షాలు రావడం వల్ల పూతకు తెగుళ్లు, నల్లి, దోమ ఆశించాయి. దీంతో వర్షాధారం కింద ఎకరాకు 2 క్వింటాళ్లు నీటి లభ్యత ఉన్న చోట 6 నుంచి 7 క్వింటాళ్లు వచ్చాయి. ఇలా గడిచిన రెండు సీజన్లలో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక ఆర్థికంగా నష్టపోయారు. ఈ ఏడాది సైతం తగ్గిన దగుబడులు గడిచిన రెండేళ్ల నష్టాన్ని దిగమింగుకొని ఈఏడాది గంపెడు ఆశతో జిల్లా వ్యాప్తంగా 23,484 ఎకరాల్లో కంది పంట వేశారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అధిక వర్షాలు కొంత ప్రభావాన్ని చూపాయి. అక్టోబర్ నవంబర్ నెలల్లో పూత దశలో మోడాలు, వర్షాలకు పూతలు రాలాయి. గుళ్ల, పచ్చపురుగులు విపరీతంగా ఆశించాయి. ఇక గింజ దశలో కాయతొలుచు, పచ్చ పురుగులు ఆశించాయి. రూ.వేలకు వేలు మందులకు ఖర్చు చేసినా పురుగు ఉధృతి కొనసాగింది. ఫలితంగా పంట దిగుబడిపై ప్రభావం చూపింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పంట కోతలు ఆరంభం అయ్యాయి. చాలా చోట్ల వచ్చే నెలలో కోతలు ఉంటాయి. కాగా గింజలను బట్టి పంట దిగుబడులు తగ్గినట్లు అంచనాకు వచ్చామని రైతులు అంటున్నారు. వర్షాధారం కింద ఎకరాకు 2 క్వింటాళ్లు, నీటి లభ్యత ఉన్న చోట ఎకరాకు 3 నుంచి 5 క్వింటాళ్లు మాత్రమే వస్తోందనిఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన రెండేళ్లు నష్టాలు వచ్చాయని, ఈ ఏడాది సైతం దిగుబడులు తగ్గి ఆర్థికంగా కోలుకోలేకున్నామని వాపోతున్నారు. ఈ ఏడాది 5ఎకరాల్లో కంది పంట వేశాను. గుళ్ల, పచ్చపురుగులు విపరీతంగా ఆశించాయి. ఆరు సార్లు మందులు కొట్టాను. రూ.వేలకు వేలు ఖర్చు అయ్యింది. కానీ, దిగుబడి మాత్రం తగ్గింది. ఐదు ఎకరాలకు కేవలం 15 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. – సూరి, కంది రైతు, శెట్టిఆత్మకూర్, గద్వాల మండలం ఈసారి వానాకాలం సీజన్లో వేసిన కంది పంట ఆరంభంలో బాగా వచ్చింది. అయితే అక్టోబర్, నవంబర్ నెలల్లో పూత దశలో పురుగు, తెగుళ్లు ఆశించాయి. వీటి నివారణ కోసం రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు చేశాం. దిగుబడులు బాగానే వస్తాయని అంచనా వేస్తున్నాం. – సక్రియానాయక్, డీఏఓ -
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరం
● ‘మీ డబ్బు.. మీ హక్కు’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి ● కలెక్టర్ సంతోష్ గద్వాలన్యూటౌన్: బ్యాకింగ్ లావాదేవీలు సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి ప్రజలందరికి ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరమని కలెక్టర్ సంతోష్ అన్నారు. ఫైనాన్షియల్ రంగంలో క్లెయిమ్ చేయని ఆస్తుల సమస్యలను పరిష్కరించడానికి ఉద్దేశించి ఏర్పాటు చేసిన ‘మీ డబ్బు మీ హక్కు’ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు బుధవారం కలెక్టరేట్లోని ఐడీఓసీ హల్లో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పదేళ్లు, ఆపైబడి వివిధ బ్యాంకులు, ఇన్సూరెన్స్ తదితర కంపెనీల్లో ఖాతాదారులకు సంబందించి క్లెయిమ్ చేయకుండా మిగిలిన డిపాజిట్లను తిరిగి పొందేందుకు, ఆయా ఖాతాలను మళ్లీ పునరుద్దరించుకోవడానికి ‘మీ డబ్బు మీ హక్కు’ సువర్ణ అవకాశంగా పేర్కొన్నారు. జిల్లాలో సుమారు లక్షకు పైగా ఖాతాలకు చెందిన రూ. 16.39కోట్లు క్లైయిమ్ చేయని డిపాజిట్లు ఉన్నాయని, వీటిని తిరిగి చెల్లించేందుకు ఆర్బీఐ అధికారులు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో సాధారణ ప్రజలతో పాటు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఖాతాలు కూడా ఉన్నాయని ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొదట బ్యాంకుల్లో అత్యధిక డిపాజిట్లు కల్గిన వెయ్యి మంది ఖాతాధారులను గుర్తించి, వారు తమ డబ్బులను క్లెయిమ్ చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. తర్వాత మిగతా ఖాతాదారులకు అవగాహన కలిగించి, తమ డిపాజిట్లను తిరిగే పొందేలా బ్యాకింగ్ అధికారులు ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. వినియోగంలో లేని ఖాతాల పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఉద్గం పోర్టల్ సహకరిస్తుందన్నారు. సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి సైబర్ నేరాలకు పాల్పడే వాళ్లు తాము బ్యాంకుల నుంచి మాట్లాడుతున్నామని చెప్పి, వివిధ లింకులు పంపించి, ఖాతాలకు సంబందించిన వివరాలు అడుగుతూ ఓటీపీలు చెప్పాలని మోసం చేస్తుంటారని, ఏ బ్యాంకు అధికారులు కూడా ఇలా అడగరని, ప్రతి ఖాతాదారుడు తెలుసుకుంటే సైబర్ నేరాల ఉచ్చులో చిక్కుకోకుండా జాగ్రత్త పడవచ్చునని చెప్పారు. బ్యాంకులకు సంబందించిన యాప్ల ద్వారానే నగదు బదిలీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈసందర్భంగా ఇటీవల క్లెయిమ్ చేసుకున్న పలువురు ఖాతాదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందించారు. అనంతరం ఆర్థిక అక్షరాస్యతపై రూపొందించిన కరదీపికలను కలెక్టర్ బ్యాంకింగ్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్బీఐ జనరల్ మేనేజర్ సుప్రభాత్, యూబీఐ జోనల్ హెడ్ అరవింద్ కుమార్, డీజీఎం సత్యనారాయణ, నాబార్డ్ డీడీఎం మనోహర్రెడ్డి, ఎల్డీఎం శ్రీనివాసరావ్, వివిధ బ్యాంకుల మేనేజర్లు, భీమా రంగ సిబ్బంది పాల్గొన్నారు. -
క్రిస్మస్ వేడుకలకు ముస్తాబు
● విద్యుద్దీపాలతో చర్చిల అలంకరణ ● ముందస్తు సంబరాలు షురూ.. గద్వాలలో విద్యుద్దీపాలతో ముస్తాబైన ఎంబీ మిస్పా చర్చి గద్వాలటౌన్: క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని కరుణామయుడి కోవెలలు ముస్తాబు అయ్యాయి. గురువారం పండగకు మరి కొన్ని గంటలు మాత్రమే గడువు ఉండటంతో ఇప్పటికే చర్చిలకు రంగులు వేసి విద్యుద్దీపాలతో అలంకరించారు. ముఖద్వారాలను అందంగా ఏర్పాటుచేశారు. చర్చిలు, ఇళ్లపై రంగురంగుల విద్యుద్దీపాలను ఉంచిన నక్షత్రాలను ఏర్పాటు చేశారు. స్థానిక ఎంబీ మిస్ఫా చర్చిలో ఏసుక్రీస్తు జననం, శాంతి సందేశాలు, జీవిత విషయాలతో కూడిన చిత్రవర్ణ పటాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆయా చర్చిలలో ముందస్తుగా క్రిస్మస్ సంబురాలు మొదలయ్యాయి. క్రైస్తవులు పండగ నిమిత్తం కొత్త దుస్తులు, వస్తు సామగ్రి కొనుగోలు చేశారు. కొంతమంది ఇళ్లల్లో క్రిస్మస్ చెట్టును పెంచుకుంటుండగా మరికొందరు చెట్లను కొనుగోలు చేసి ఇంటి ఆవరణలో విద్యుద్దీపాల మధ్య అలంకరిస్తున్నారు. కోలాహలంగా చర్చిలు.. జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో ఉన్న చర్చిల్లో ముందస్తుగానే ముస్తాబు చేపట్టడంతో పండగ వాతావరణం నెలకొంది. విద్య, ఉద్యోగ, కార్మిక, వ్యాపార రంగాల్లో ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్న వారు సైతం పండగకు సొంత గ్రామాలకు వచ్చారు. పట్టణంలోని పలు వ్యాపార సంస్థలు వినియోగదారులకు పండగకు సంబంధించిన వస్తువులను అందుబాటులో పెట్టారు. అదే విధంగా క్రిస్టియన్ యువజన సంఘాల సభ్యులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో క్రిస్మస్ సంబురాలు జరుపుకొంటున్నారు. విద్యార్థులకు మిఠాయిలు, కేక్లు పంచిపెడుతూ ఆనందోత్సవాల మధ్య పండగకు సిద్ధమవుతున్నారు. చర్చిల ఆవరణలో ఏసుక్రీస్తు జననం, దేవుని జీవిత చరిత్ర, తదితర అంశాలను వివరిస్తున్నారు. ప్రతి సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుండటంతో పలు చర్చిలు సందడిగా మారాయి. -
చేనేత మగ్గం నేసి..
గద్వాల జరీ చీరల ప్రాముఖ్యత తెలుసుకున్న గవర్నర్ చేనేత స్టాల్ దగ్గర కార్మికులతో మాట్లాడారు. నెలకు ఎన్ని చీరలు నేస్తారు.. కూలీ ఎంత వస్తుందని ఆరాతీశారు. ఖండాంతర ఖ్యాతి ఘడించిన గద్వాల జరీ చీరల ప్రాముఖ్యతను మరింత ఇనుమడింపజేయాలని సూచించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్లో మగ్గంపై కూర్చొని చీర నేసే విధానాన్ని పరిశీలించి.. రాట్నం ద్వారా ధారం చుట్టారు. అనంతరం మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించి రుణాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన రక్తదాన శిబిరాల వివరాలు తెలుసుకుని ప్రశంసించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో రాజ్భవన్ను లోక్భవన్గా మార్చామన్నారు. అంతకు ముందు కలెక్టర్ సంతోష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా భౌగోళిక స్వరూపం, చరిత్ర, ప్రసిద్ధ క్షేత్రాలు, ప్రాముఖ్యత, సాధించిన ప్రగతిని వివరించారు. అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు గద్వాల జరీ చీర ఫ్రేమ్ను జ్ఞాపికగా అందజేశారు. -
నేడు కోస్గికి సీఎం రాక
కోస్గి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం కోస్గికి రానున్నారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలో పంచాయతీ పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంగళవారం ఎస్పీ వినీత్తో కలిసి నారాయణపేట, వికారాబాద్ కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ప్రతీక్ జైన్ పరిశీలించారు. పంచాయతీ పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించే స్థానిక లక్ష్మీనర్సింహ ఫంక్షన్హల్తోపాటు సభాస్థలం, హెలీప్యాడ్, సీఎం కాన్వాయ్ రూట్, వాహనాల పార్కింగ్, బారికేడ్లు తదితర భద్రతాపరమైన అంశాలను పరిశీలించి.. అధికారులకు సూచనలు చేశారు. అనంతరం వికారాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల నుంచి సీఎం పర్యటన బందోబస్తుకు వచ్చిన 800 మంది పోలీసులతో ఎస్పీ వినీత్ సమావేశమై మాట్లాడారు. మొత్తం 10 సెక్టార్లుగా విభజించి.. ఏఎస్పీలు, డీఎస్పీలను ఇన్చార్జిలుగా నియమించామని తెలిపారు. ప్రత్యేక బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం జరిగే ప్రదేశంలో అదనపు బలగాలతో భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. సీఎం కాన్వాయ్ రూట్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, ప్రజలకు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. -
బీచుపల్లి క్షేత్రంలో దేవాదాయశాఖ కమిషనర్
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని మంగళవారం రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ హరీశ్ సందర్శించారు. అభయాంజనేయస్వామిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ సిబ్బంది ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ఈఓ రామన్గౌడ్ కమిషనర్ను శేషవస్త్రంతో సత్కరించగా.. అర్చకులు మారుతీచారి తీర్థప్రసాదాలను అందజేశారు. జాతీయ కబడ్డీ టోర్నీకి జిల్లా క్రీడాకారిణి గద్వాలటౌన్: కలకత్తాలో ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలకు జిల్లా క్రీడాకారిణి రాజేశ్వరి ఎంపికయ్యారు. అయిజ మండలం పులికల్కు చెందిన రాజేశ్వరి ఎంఏఎల్డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఇటీవల నల్లగొండ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు తరఫున ఆమె పాల్గొని అత్యంత ప్రతిభకనబర్చడంతో జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలో రాజేశ్వరిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు డీకే స్నిగ్ధారెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సింహ, కోశాధికారి చందు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవి, ఉపాధ్యక్షులు నగేశ్, వెంకటేశ్, సంయుక్త కార్యదర్శులు జగదీశ్, పాషా, రాజేందర్ పాల్గొన్నారు. నట్టల నివారణతోనే జీవాల్లో ఎదుగుదల గద్వాల(ఇటిక్యాల): జీవాలు ఆరోగ్యంగా ఎదిగేందుకు నట్టల నివారణ ముఖ్యమని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డా.శివానందస్వామి అన్నారు. మంగళవారం ఇటిక్యాలలో సర్పంచ్ జీవన్రెడ్డితో కలసి జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జీవాల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న నట్టల నివారణ మందును పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మేకలు, గొర్రెల్లో నట్టలను నివారించడం వల్ల ఆకలి గుణం పెరిగి, మేత అధికంగా తీసుకుంటాయని తెలిపారు. యజ మానులకు అధిక మాంసం ఉత్పత్తి జరిగి, ఆర్ధికంగా లాభాలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి భువనేశ్వరి, సిబ్బ ంది మాసుమన్న, కార్తీక్, మురళి పాల్గొన్నారు. కుష్టు నిర్మూలనకు కృషి చేద్దాం ఎర్రవల్లి: కుష్టివ్యాధిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని రాష్ట్ర ఎల్సీడీసీ ప్రోగ్రాం అధికారిణి డా.జరీనా భాను అన్నారు. ఎల్సీడీసీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎర్రవల్లి మండలం కొండేరులో ఆశావర్కర్లు చేపట్టిన ఇంటింటి సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చర్మంపై మచ్చలు ఏర్పడి, స్పర్శ కోల్పోతే సస్పెక్టెడ్ కేసుగా నమోదు చేయాలని సూచించారు. ఆ కేసులను మండల వైద్యాధికారి పరీక్షించిన తర్వాత నిర్దారణ చేసుకోవాలన్నారు. లెప్రసీ వ్యాధిపై అందరికీ అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో లెప్రసీ నోడల్ పర్సన్ రమేశ్, ఏఎన్ఎం నర్మద పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.8,090 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు మంగళవారం 326 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటా గరిష్టంగా రూ. 8,090, కనిష్టంగా రూ. 5,299, సరాసరి రూ. 6,890 ధరలు లభించాయి. అదే విధంగా క్వింటా ఆముదాలు అమ్మకానికి రాగా.. రూ. 5,877 ధర పలికింది. 286 క్వింటాళ్ల వరి (సోన) అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 2,570, కనిష్టంగా రూ. 2,110, సరాసరి రూ. 2,368 ధరలు వచ్చాయి. 86 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,469, కనిష్టంగా రూ. 4,526, సరాసరి రూ. 5,829 ధరలు లభించాయి. -
యేసు జననం.. గొప్ప సందేశం
గద్వాలటౌన్: పరిశుద్ధాత్మ కుమారుడిగా యేసుక్రీస్తు జననం ప్రపంచ మానవాళికి శాంతి సందేశం ఇచ్చిందని.. ఆ కరుణామయుడి జన్మదినం అందరికీ శుభదినమని పలువురు సందేశకులు అన్నారు. క్రిస్మస్ పర్వదనాన్ని పురస్కరించుకొని మంగళవారం స్థానిక ఎంబీ మిస్పా చర్చిలో ప్రదర్శించిన ‘క్రీస్తు జననం’ నాటిక ఆకట్టుకుంది. స్వాగత నృత్యంతో పాటు వైవిధ్య ఆహార్యం, అభినయంతో పండగ ప్రత్యేకతను సండే స్కూల్ విద్యార్థులు ప్రదర్శన ద్వారా చాటి చెప్పారు. అనంతరం స్కిట్ల ప్రదర్శన సుమారు గంటపాటు సాగింది. ఈ సందర్భంగా చర్చి కమిటీ చైర్మన్ ప్రభుదాస్, పాస్టర్ చార్లెస్ శాంతిరాజ్, కార్యదర్శి సైమన్ సుధాకర్ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ యేసు చూపిన బాటలో నడుచుకొని సేవాభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. -
దేశం గర్వించే స్థాయికి ఎదగాలి
గద్వాలటౌన్: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విద్యార్థులు దేశం గర్వించే స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజయుడు సూచించారు. మంగళవారం స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. రాష్ట్రం, దేశం అభివృద్ధిలో ముందుకుసాగాలంటే పరిశోధనలు ఎంతో ముఖ్యమన్నారు. విద్యార్థులను తరగతి గదిలో కంటే ప్రయోగశాలల్లోనే ఎక్కువగా ఉంచి.. కొత్త విషయాలను తెలియజేయాలన్నారు. విద్యార్థులు విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తి పెంచుకొని భవిష్యత్లో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. డీఈఓ విజయలక్ష్మి మాట్లాడుతూ.. నేటి బాలబాలికల్లో భావి శాస్త్రవేత్తలు ఎంతోమంది ఉంటారని.. వారిని గుర్తించాల్సిన బాధ్యత గురువులదేనని అన్నారు. కాగా, సీనియర్, జూనియర్ విభాగాల్లో ఏడుగురు చొప్పున, టీచర్ ఎగ్జిబిట్, సెమినార్, ఇన్స్ఫెయిర్ మనక్ విభాగాల్లో విజేతలను ఎంపిక చేశారు. వచ్చే నెల హైదరాబాద్లో ప్రారంభమయ్యే రాష్ట్రస్థాయి ప్రదర్శనలో వీరు పాల్గొంటారని జిల్లా సైన్స్ అఽధికారి బాస్కర్ పాపన్న తెలిపారు. అనంతరం జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనల్లో అత్యుత్తమ ప్రదర్శన చాటిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెమోంటోలను అందజేశారు. -
వణుకుతోన్న సంక్షేమం
ప్రభుత్వ వసతిగృహాల్లో చన్నీళ్లే దిక్కు ● జిల్లాలో అధికమైన చలి తీవ్రత ● ఉదయాన్నే స్నానం చేసేందుకు విద్యార్థుల అవస్థలు ● కొన్ని హాస్టళ్లకు కిటికీలు, డోర్లు కూడా సరిగా లేని వైనం రోజు శుభ్రంగా స్నానం చేసి పాఠశాలకు వెళ్లడం మంచి అలవాటు. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. అయితే శీతాకాలం భానుడు 9 గంటల వరకు కూడా మబ్బులను దాటుకొని రావడం లేదు. దీంతో మంచుదుప్పటి పరిచినట్లుగా ఉంటుంది. దీంతో విద్యార్థులు చన్నీటితో స్నానం చేసేందుకు జంకుతున్నారు. కొందరు విద్యార్థులు ఉదయం స్నానం చేయకుండానే వెళ్లి, సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన తర్వాత చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే.. ఉదయం చలికి తట్టుకోలేకపోతున్నామనే సమాధానం చెబుతున్నారు. ఇక రోజు చన్నీటితో ఉదయం, సాయంత్రం స్నానాలు చేయడం వల్ల ఆయాసం, ఉబ్బసం, ఇతర శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉన్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థతి కాస్త ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంది. వారం రోజులుగా మరీ తీవ్రం.. రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంటోంది. జిల్లా అంతటా మబ్బులు ప ట్టింది. వారం రోజులుగా వాతావరణంలో మార్పుల కారణంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోజు ఉదయం 8 గంటల వరకు పొగమంచు కురుస్తుంది. దీంతో వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు చాలా ఇబ్బందుల తో పాటు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఊడిన కిటకీ తలుపులు.. జిల్లాలోని 30 వసతిగృహాల్లో 3,881 మంది విద్యార్థులు ఉన్నారు. అనేక వసతిగృహాల్లో విద్యార్థులకు సరైన గదులు, వెచ్చదనాన్నిచ్చే దుప్పట్లు లేక చలికి గజగజ వణికిపోతున్నారు. కొన్ని గదులకు కిటికీ తలపులు ఊడిపోయాయి. చలి తీవ్రత భరించలేక కొన్ని చోట్ల విద్యార్థులు అట్టలు, చెక్కలను అడ్డుపెట్టారు. చల్లటి బండలపై పలచని దుప్పట్లను వేసుకుని వణుకుతూ పడుకుంటున్నారు. ఇప్పటి వరకు కళాశాల విద్యార్థులకు దుప్పట్లు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 9:40 గంటలకే పాఠశాల ప్రారంభమవుతుంది. వేకువజామున 6 గంటలకే కాలకృత్యాలు తీర్చుకొని జావ తాగాలి. అనంతరం స్టడీ అవర్స్కు హాజరుకావాలి. ఆ తర్వాత స్నానాలు చేసి.. ఆల్పాహారం ఆరగించి బడికి బయలుదేరివెళ్లాలి. ఇదీ ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లోని విద్యార్థుల దైనందిన కార్యక్రమాలు. ఇవన్నీ క్రమం తప్పకుండా జరగాలంటే విద్యార్థులు రోజు ఉదయం 5 గంటలకే నిద్రలేవాలి. అప్పుడే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని పాఠశాలకు చేరుకుంటారు. ఇది బాగానే ఉన్నప్పటికీ.. చలికాలం విద్యార్థుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. చలిపులి విజృంభిస్తుండటంతో ఉదయం నిద్రలేవాలంటేనే జంకుతున్నారు. ఇక కాలకృత్యాలతో మొదలుకొని స్నానాలు పూర్తయ్యే వరకు ప్రతి అవసరానికి చన్నీళ్లనే ఉపయోగించాల్సి వస్తోంది. ఈ పరిస్థితి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో నెలకొంది. మంగళవారం పలు వసతిగృహాలను ‘సాక్షి’ పరిశీలన చేయగా.. అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. – గద్వాలటౌన్/అయిజ/మానవపాడు/ఉండవెల్లి విద్యార్థులు 120 మంది ఎస్టీ వసతిగృహాలు 1 గత వారం నుంచి నమోదైన ఉష్ణోగత్రలు జిల్లా కేంద్రంలోని బాలుర బీసీ కళాశాల వసతిగృహాంలో వణుకుతూ పడుకున్న విద్యార్థులు -
ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి
గద్వాలన్యూటౌన్: ఓటర్ల జాబితా సవరణకు చేపట్టిన ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)ను ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలతో ఎస్ఐఆర్ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. జిల్లా నుంచి పాల్గొన్న కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ మ్యాపింగ్ ప్రక్రియపై ఇప్పటికే జిల్లాలోని బీఎల్ఓలు, సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 45శాతం మ్యాపింగ్ పూర్తి అయ్యిందని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని చెప్పారు. 40శాతం కన్నా తక్కువ మ్యాపింగ్ జరిగిన పోలింగ్ స్టేషన్లను గుర్తించి, అక్కడ వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీనారాయణ, ఆర్డీఓ అలివేలు, ఎన్నికల విభాగం అధికారి కరుణాకర్, తహశీల్దార్లు పాల్గొన్నారు. ప్రజావాణిలో అర్జీదారుల మొర గద్వాలటౌన్: ప్రజల ముంగిటకు పాలన రావడంతో గద్వాల కలెక్టరేట్ కిటకిటలాడింది. కలెక్టర్, అడిషినల్ కలెక్టర్లకు వినతులు, సమస్యలు చెబితే పరిష్కారం అవుతాయనే ఉద్దేశ్యంతో బాధితులు తరలివచ్చారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ప్రజావాణికి వచ్చారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో అడిషినల్ కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగరావులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ప్రజావాణి కొనసాగింది. మొత్తం 42 దరఖాస్తులు అందాయి. ప్రజావాణిలో అధికారులు బాధితుల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించి వారి సమస్యలను విన్నారు. సంబంధిత శాఖల అధికారులను పిలిపించి పరిష్కరించాలని సూచించారు. వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆసరా పెన్షన్లు, భూసంబంధిత, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, ఉపాధి, విద్యుత్తు తదితర సమస్యలపై వినతలు వచ్చాయి. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పట్ల అలసత్వం వద్దని అడిషినల్ కలెక్టర్లు సంబంధిత అధికారులకు సూచించారు. పోలీస్ గ్రీవెన్స్కు 10 వినతులు గద్వాల క్రైం: ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్కు 10 వినతులు అందగా.. ఎస్పీ శ్రీనివాసరావు వారితో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. భూ వివాదం, ఆస్తి తగదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడంలేదు తదితర కారణాలతో 10 మంది వినతులు చేశారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కారం చేకూరుస్తామని బాధితులకు వివరించారు. సివిల్ సమస్యలపై కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలన్నారు. -
సమాజానికి మేలు చేసే ప్రాజెక్టులు రూపొందించాలి
● కలెక్టర్ సంతోష్ ● ఘనంగా జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం గద్వాలటౌన్: విద్యార్థులు ప్రకృతితో మమేకమవుతూ సమాజానికి మేలు చేసే ఆవిష్కరణలు, ప్రాజెక్టులు రూపొందించాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నేటి తరం విద్యార్థులు విజ్ఞాన ఆవిష్కరణలపై ఆసక్తిని చాటుతూ పలు సమస్యలకు పరిష్కారాన్ని చూపించేలా వాటిని రూపొందించాలని పేర్కొన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో భారతదేశం గర్వించే స్థాయికి విద్యార్థులు ఎదగాలని, ఆ దృష్టితో విద్యార్థులు పరిశోధనలు సాగించాలన్నారు. గద్వాలలో సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ● గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసి సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రదర్శనలను ఆవిష్కరించాలని సూచించారు. విద్యార్థులలో శాస్త్ర విజ్ఞానానికి కొదవ లేదని, దీనిని ప్రజాపరం చేసే ఆలోచన ప్రభుత్వాలకు ఉన్నప్పుడే పలు సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయన్నారు. ● అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ విద్యార్థులు నిర్మాణాత్మక ఆలోచనలతో ఎదుగుతూ వారు తయారు చేసే ఆవిష్కరణలతో దేశం పులకించిపోవాలని పేర్కొన్నారు. డీఈఓ విజయలక్ష్మి మాట్లాడుతూ విజ్ఞాన శాస్త్రాన్ని మానవాళి మనుగడకు ఉపయోగించాలని కోరారు. శాసీ్త్రయ విద్యా ప్రమాణాలు ఉన్న విద్యార్థులను మరో కోణంలో నిలబెడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్గౌడ్, జిల్లా సైన్స్ అధికారి భాస్కర్పాపన్న తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల్లో నవశకం..
పంచాయతీల్లో కొలువుదీరిన పాలక వర్గాలు సంబురంగా ప్రమాణ స్వీకారాలు జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల ప్రమాణ స్వీకారం సంబురంగా నిర్వహించారు. కొత్త పాలక వర్గం ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకొని కొన్ని చోట్ల పంచాయతీ భవనాలకు రంగులు వేసి ముస్తాబు చేశారు. మరికొన్ని చోట్ల రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. పండగ వాతవరణంలో సర్పంచ్లు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లాలోని 255 పంచాయతీలు, 2390 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మూడు విడతల్లో 40 మంది సర్పంచ్లు, 719 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా స్థానాలకు ఎన్నికలు జరగగా.. 215 మంది సర్పంచ్లు, 1668 మంది వార్డుమెంబర్లు విజయం సాధించారు. ఇదిలాఉండగా, ఉండవెల్లిలోని బస్వాపురంలో మూడు వార్డులకు నామినేషన్ల తిరస్కరణతో 3 వార్డులకు ఎన్నికలు జరగలేదు. ఏకగ్రీవంగా, ఎన్నికల బరిలో నిలిచిన వారిలో ఒక్క జల్లాపురం మినహా మిగిలిన చోట సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డుల సభ్యులు ప్రమాణ స్వీకారాలు చేసి పదవి బాధ్యతలు స్వీకరించారు. అలంపూర్: పంచాయతీల పాలక వర్గం కొలువుదీరింది. రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పంచాయతీల్లో పాలక వర్గం సందడి ఆరంభమైంది. కొత్త పాలక వర్గం సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవంతో పల్లెల్లో పండగా వాతవరణం నెలకొంది. జిల్లాలో పంచాయతీల సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం సోమవారం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల ప్రమాణ స్వీకారాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. పంచాయతీల పాలక వర్గ ప్రమాణ స్వీకారంలో వింతలు విశేషాలు చోటు చేసుకున్నాయి. విధులు.. బాధ్యతలు గ్రామ పంచాయతీల పరిపాలకులుగా సర్పంచులు వ్యవహరిస్తూ గ్రామసభలు నిర్వహించాలి. ఎన్నిక తర్వాత 15 రోజుల్లో తొలి గ్రామసభ జరపాలి. 15వ ఆర్థిక సంఘం నిధులు రాబట్టుకునేలా చొరవ తీసుకోవాలి. బడ్జెట్ ఆమోదం, అభివృద్ధి పనులు, రోడ్డు, నీటి సరఫరా, ఆరోగ్యం, విద్య, వీధి దీపాలు, పారిశుద్ధ్యం పర్యవేక్షణ, గ్రామీణాభివృద్ధి, ఉపాధిహామీ, స్వచ్ఛభారత్ వంటి కేంద్ర, రాష్ట్ర పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత సర్పంచులపైనే ఉంటుంది. పంచాయతీ ఆర్థిక నిర్వహణ, లాభనష్టాల రిపోర్టులు సమర్పించాల్సి ఉంటుంది. పీఎం ఆవాస్ యోజన వంటి పథకాల్లో పారదర్శకత ఉండాలి. ఇదిలాఉండగా, ఎన్నో ఆశలు, ఆశయాలతో కొలువుదీరిన పంచాయతీల పాలకవర్గాలకు నిధులలేమి అసలు సమస్యగా కనిపిస్తోంది. బాధ్యతలు చేపట్టిన 255 మంది సర్పంచులు, 2387 మంది వార్డు మెంబర్లు జల్లాపురంలో సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం వాయిదా జీపీ భవనాల్లేక చెట్ల కింద, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణ స్వీకారం -
కూల్గా దోపిడీ..!
మద్యం షాపులే టార్గెట్గా అ(న)ధికార దందా రూ.2 వేల నుంచి రూ.4 వేలు.. వైన్స్ దుకాణాల్లో ఏర్పాటు చేసిన పర్మిట్ రూంలలో నిబంధనల ప్రకారం మద్యం ప్రియులు నిల్చొనే మందు తాగి వెళ్లాలి. ఇలా అయితే తగిన ఆదాయం సమకూరదని పర్మిట్ రూంలలో సిట్టింగ్లు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఏటేటా జిల్లాలకు మద్యం అమ్మకాల లక్ష్యం పెంచుతున్న క్రమంలో ఎకై ్సజ్ శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో పర్మిట్ రూంల పక్కనే కూల్ పాయింట్లు (స్నాక్స్, నీళ్లు, గ్లాసులు, కూల్ డ్రింక్లు అమ్మేవి) తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు కూల్ పాయింట్లను కొన్ని చోట్ల మద్యం షాపుల యజమానులే నడిపిస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో పలువురికి అప్పగించి నడిపిస్తున్నారు. ఇతరులు నడిపిస్తున్న వాటికి సంబంధించి ప్రాంతం, గిరాకీని బట్టి కూల్ పాయింట్ల నిర్వాహకులు రోజుకు రూ.2 వేల నుంచి రూ.4 వేలను మద్యం దుకాణాల యజమానులకు చెల్లిస్తున్నారు. వాటిపై కన్ను.. వెంటాడి దారికి.. మద్యం షాపులకు దీటుగా కూల్ పాయింట్ల వ్యాపారం నడుస్తుండడంతో పలువురు రాజకీయ నేతల కన్ను వాటిపై పడినట్లు తెలుస్తోంది. ప్రధానంగా కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాల యజమానులతో పలువురు నాయకులు వేర్వేరుగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కూల్ పాయింట్లను తమ అనుచరులు, ముఖ్య నాయకులకు ఇవ్వాలని అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మద్యం వ్యాపారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు సమా చారం. ఈ క్రమంలో మాట వినని వారిపై పరోక్షంగా వేధింపులకు దిగడం చర్చనీయాంశంగా మారింది. కొందరు అలా.. మరి కొందరు ఇలా.. కూల్ పాయింట్లకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో ఐదారుగురు ద్వితీయ శ్రేణి నేతలు పంచుకున్నట్లు సమాచారం. తమ ముఖ్య అనుచరులకు ఇవ్వాలని కోరిన పలువురు నేతలు.. రోజు వారీగా చెల్లించే దానిలో గతం కంటే కొంత తక్కువగా ఇస్తారని.. రెండు, మూడు నెలల తర్వాత వారు కరెక్ట్గా ఇస్తేనే ఉంచుకోవాలని సూచించారు. కరెక్ట్గా ఇవ్వకున్నా, సరిగ్గా నడవకున్నా.. వారిని తీసేయొచ్చని చెప్పారు. ఇలాంటి చోట్ల పెద్దగా ఇబ్బంది లేదు. ఎవరైతే కూల్పాయింట్ల నుంచి ఒక్క రూపాయి ఇవ్వరు అని చెప్పడం.. మాట వినని మద్యం షాపుల యజమానులపై ఒత్తిళ్లు పెంచడంతో వివాదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో ముఖ్య నేతలు సైతం ఆ నాయకులకే మద్దతు పలకడంతో మద్యం షాపుల యజమానుల్లో అసహనం వ్యక్తమవుతోంది. చిచ్చు.. దుమారం.. మరో వైపు కూల్ పాయింట్ల వ్యవహారం పలు ప్రాంతాల్లో ‘అధికార’ నాయకుల మధ్య చిచ్చు రాజేసినట్లు శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. తమకు అవకాశం ఇవ్వకుండా కొందరికే అప్పగించేలా నేతలు చొరవ చూపడం వారిని నొప్పించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే అన్ని సర్దుకోగా.. కూలింగ్ పాయింట్లను దక్కించుకున్న వారు వేరే వారికి నెలకు కొంత మొత్తం చొప్పున చెల్లించేలా వారితో ఒప్పందాలు కుదర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపైనా దుమారం చెలరేగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇదిలా ఉంటే వేధింపులపై ఒకరిద్దరు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయినా.. ఎవరూ స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూలింగ్ పాయింట్లపైపలువురు నాయకుల నజర్ తమ ముఖ్య అనుచరులకు ఇచ్చేలా పావులు కొన్ని చోట్ల రోజు వారీ చెల్లింపులు ఎగవేసేలా యత్నాలు? ఒత్తిళ్లతో వైన్స్ దుకాణాల ఓనర్లలో ఆందోళన పట్టించుకోని ఎకై ్సజ్ శాఖ అధికారులపై ఆగ్రహం -
వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో జాగృతి
గద్వాల టౌన్/అలంపూర్/ధరూరు/కేటీదొడ్డి/: ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కచ్చితంగా జాగృతి వైపు నుంచి మేం పోటీలో ఉంటాం.. పేరు అదే ఉంటదా.. ఇంకొకటి ఉంటదా.. అనేది సెకండరీ.. 2029లో సాధారణ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని అనుకుంటున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రెండు రోజుల జాగృతి జనంబాట కార్యక్రమం అనంతరం సోమవారం గద్వాల జిల్లాకేంద్రంలోని హరిత హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే తనకు, తన ఫ్యామిలీకి మధ్య అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయని వివరించారు. తన భర్త ఫోన్ ట్యాపింగ్ చేశారని, తీన్మార్ మల్లన్న తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు పార్టీ నుంచి ఏ ఒక్కరూ మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా పార్టీ నాయకులే నాపై కుట్ర చేసి ఎంపీగా ఓడించారని, వద్దంటే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారని చెప్పారు. తిరిగి బీఆర్ఎస్లో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పదవిలో ఉన్నా.. లేకున్నా ఎప్పటికీ ప్రజల మధ్యనే ఉంటామని చెప్పారు. ఎంపీగా ఉన్న సమయంలో ‘మన ఊరు– మన ఎంపీ’ పేరుతో అనేక కార్యక్రమాలు చేపట్టానని గుర్తుచేశారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి చేసే ప్రకటనలు శుద్ధ అబద్దమని విమర్శించారు. తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అక్షరాస్యతలో గద్వాల ప్రాంతం అత్యంత వెనకబడి ఉండటం చాలా బాధాకరమన్నారు. సీఎం రేవంత్రెడ్డి గద్వాలపై ప్రత్యేక దృష్టిపెట్టి విద్యారంగం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలో ఫుడ్ పాయిజన్ నిత్యం జరుగుతున్నా ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. గురుకుల పాఠశాలల అద్దెలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉండటం దారుణమన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారం కోసం జాగృతి జనం బాట చేపట్టిందని వివరించారు. ● అంతకుముందు ధరూరు మండలంలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమైన గుడ్డెందొడ్డి పంపుహౌస్, రిజర్వాయర్ను, కేటీదొడ్డి మండలం మల్లాపురం తండా శివారులో నిర్మిస్తున్న గట్టు ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ పనులను ఆమె పరిశీలించారు. అలాగే, అలంపూర్ జోగుళాంబ ఆల యాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. -
గాంధీజీ పేరు తొలగించడం అనైతికం
గద్వాలటౌన్: జాతిపిత మహాత్మాగాంధీ ప్రతిష్టను తగ్గించడం కోసమే ఉపాధి హామీ పథకంలో ఆయన పేరును తొలగించారని డీసీసీ అధ్యక్షుడు రాజీవ్రెడ్డి ఆరోపించారు. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్ముని పేరును తొలగించడాన్ని నిరసిస్తూ ఆదివారం స్థానిక గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పథకానికి గాంధీ పేరు తొలగింపు చర్య దేశ ప్రతిష్టకు భంగం కలిగించే అంశమన్నారు. ఇలాంటి చర్యల ద్వారా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు, మనువాద రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు కుట్ర పన్నుతుందని ఆరోపించారు. పేదల కడుపు నింపే లక్ష్యంతో యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పఽథకాన్ని తెచ్చిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత ఉపాధి పథకంలో నిధుల కోత పెట్టిందని, ప్రస్తుతం పేరు మార్చతున్నారని మండిపడ్డారు. ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తన వాటాను 60 శాతానికి తగ్గించి, మిగిలిన 40 శాతం భారాన్ని రాష్ట్రాలపై మోపడం అన్యామన్నారు. కేంద్ర ప్రభుత్వ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ గాంధీ పేరును పెడుతామని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నరహరిగౌడ్, శ్రీనివాసులు, కృష్ణ, సుదర్శన్, వెంకటేష్, శ్రీనివాస్యాదవ్, అన్వర్, రిజ్వాన్, గోవిందు, ప్రవీణ్, నాగులు, మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్డీఎస్ సాగునీటి కోసం పాదయాత్ర చేస్తా
అలంపూర్/గద్వాల టౌన్: ఆర్డీఎస్ పూర్తిస్థాయి సాగునీటి వినియోగం కోసం పాదయాత్ర చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జనంబాటలో భాగంగా ఆదివారం అలంపూర్ నియోజకవర్గం మానవపాడు, అయిజ, గద్వాల, ధరూరు మండలాల్లో పర్యటించారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్డీఎస్ వాటా 16 టీఎంసీలు వాడుకోవడానికి ఆయకట్టు స్థిరీకరణకు తుమ్మిళ్ల ఎత్తిపోతల నిర్మించారని చెప్పారు. ఇక్కడ మూడు మోటార్లు ఉంటే ఒక్కటే వాడుతున్నారని, మిగిలిన రెండు మోటార్లు వాడుకోవాలంటే కాల్వ విస్తరణ, భూ సేకరణతోపాటు రైతులు ఒక ఏడాది పంట మానుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ ప్రాజెక్ట్ను బీఆర్ఎస్ నిర్మించిన కనీసం అందులో సగం కెపాసిటి నీటిని వాడుకోలేకపోతున్నామని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై నిర్లక్ష్యంగా వహిస్తుందన్నారు. గతంలో ఆర్టీఎస్ అంశంపై కేసీఆర్ పాదయాత్ర చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారని, దీనిని వెంటనే పూర్తి చేయకపోతే తాను కూడా పాదయాత్ర చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. అలాగే ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా స్థానిక రైతులతో కలిసి ఉద్యమిస్తానని భరోసా ఇచ్చారు. గుండ్రేవుల, ప్రాజెక్ట్, ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దయ్యే వరకు మీతో కలిసి పోరాటం చేస్తానని వారికి భ రోసానిచ్చారు. సీడ్పత్తి రైతుల సమస్యలపై సీఎంతో మాట్లాడుతా సీడ్పత్తి రైతులు నష్టపోకుండా కంపెనీలు అగ్రిమెంట్ చేసుకోవాలని, ఈ విషయంలో అవసరమైతే సీఎంతో మాట్లాడుతానని అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆస్పత్రిలో సమస్యలు అధికంగా ఉన్నాయని, నాసిరకంగా నిర్మించడం వల్ల మూడేళ్లుగా నిరుపయోగంగా ఉంచారన్నారు. పాలమూరు సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా అయినా ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రులపై దృష్టిసారించడం లేదని దుయ్యబట్టారు. ఈ ప్రాంతంలో రోడ్లు భయంకరంగా ఉన్నాయని, గద్వాలలో చేనేత కార్మికులు, విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. పర్యటనలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కొలువుదీరనున్నారు..!
నేడు సర్పంచ్, వార్డుమెంబర్ల ప్రమాణ స్వీకారం● ప్రత్యేక అధికారుల పాలనలో ఎక్కడి సమస్యలు అక్కడే ● కొత్త సర్పంచ్లపైన కోటి ఆశలు ● జిల్లాలో 255 మంది సర్పంచ్లు.. 2,387 మంది వార్డు సభ్యులు అలంపూర్: గ్రామాల్లో కొత్త పాలకవర్గం కొలువుదీరనుంది. జిల్లా వ్యాప్తంగా 255 గ్రామ పంచాయతీలు, 2387 వార్డు మెంబర్ల సభ్యులకు ఎన్నికలు జరగగా.. విజయం సాధించిన సర్పంచ్లు, వార్డుమెంబర్లు ఈ నెల 22న (నేడు) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎట్టకేలకు సోమవారం నుంచి నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీల పాలన సాగనుంది. దాదాపు రెండేళ్లపాటు ఖాళీగా ఉన్న పంచాయతీలు సర్పంచ్ల రాకతో కళకళాడనున్నాయి. ప్రజా మద్దతు కూడగట్టి పాలన పగ్గాలు చేతబట్టిన సర్పంచ్లు ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోగా.. కొత్త సర్పంచ్ల రాకతో అయినా సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని ప్రజలు ఆశిస్తున్నారు. రెండేళ్లు ప్రత్యేక అధికారుల పాలన జిల్లాలోని గ్రామ పంచాయతీలు దాదాపు రెండేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగాయి. పంచాయతీలకు సర్పంచ్లు, వార్డు సభ్యులు లేకుండానే కొనసాగాయి. ప్రభుత్వం ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడంతో పంచాయతీల పాలకవర్గం కొలువుదీరనుంది. 2019 జనవరి 30వ తేదీన సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ముగిశాయి. ఆ తర్వాత 2019 ఫిబ్రవరి 2వ తేదీన గత సర్పంచ్లు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2024 ఫిబ్రవరి నుంచి పంచాయతీల పాలన పూర్తిగా ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేక అధికారులు గ్రామ పాలన సాగిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో ఈ నెల 22వ తేది నుంచి సర్పంచ్ల పాలన ఆరంభం కానుంది. కొత్త వారిపైనే కోటి ఆశలు.. గ్రామాల్లో దాదాపు రెండేళ్లుగా నెలకొన్న సమస్యల పరిష్కారంపై కొత్తగా బాధ్యతలు స్వీకరించే సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులపైనే ప్రజలు ఆశలు ఉంచారు. కొత్తగా వచ్చిన సర్పంచ్లు గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తారని ఆకాంక్షిస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే అన్నట్లుగా మారింది. పారిశుద్ధ్యం లోపించి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అస్తవ్యస్తంగా మారిన డ్రెయినేజీ వ్యవస్థతో గ్రామాల్లో కాలనీలు మురికి కుంటలుగా మారాయి. రోడ్ల నిర్మాణాలు లేక అంతర్గత రోడ్లపై నడవడానికి సాహసం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో వీధి లైట్లు లేక రాత్రిళ్లు చీకట్లు కమ్మేస్తున్నాయి. గ్రామాల్లో తాగునీటి వసతి లేక శీతాకాలంలోనే తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. ఇలా అనేక సమస్యలతో గ్రామ పాలన కుంటుపడింది. అత్యధిక స్థానాల్లో అధికార పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్ధులే గ్రామాలను జేజిక్కించుకున్నారు. స్వతంత్రులుగా గెలిచిన వారు సైతం కొన్ని పార్టీలకి జైకొట్టే అవకాశం ఉంది. మరీ గ్రామాల్లో ఎలాంటి అభివృద్ది ఉంటుందో వెచి చూడాలి మరి...! -
వైజ్ఞానిక ప్రదర్శనకు వేళాయే..
● నేటి నుంచి గద్వాల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహణ ● పాల్గొననున్న 175 పాఠశాలల విద్యార్థులు ● ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా విద్యాశాఖ అధికారులు గద్వాలటౌన్: జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 22వ తేదీ నుంచి 23వ తేదీ వరకు స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాట్లను డీఈఓ విజయలక్ష్మితో పాటు పలువురు సైన్స్ అధికారులు, జీహెచ్ఎంలు ఆదివారం పరిశీలించారు. జిల్లాలోని అన్ని యాజమాన్య పరిధిలోని ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రదర్శనల్లో పాల్గొంటున్నాయి. జిల్లాలోని 13 మండలాల పరిధిలోని 175 పాఠశాలల నుంచి సుమారు 250 వరకు ప్రయోగాలను విద్యార్థులు ప్రదర్శించనున్నారు. ఇందులో 2024–25 సంవత్సానికి సంబంధించిన ఇన్స్పైర్ ప్రాజెక్టుల ప్రదర్శన తప్పనిసరి చేశారు. జూనియర్ (6,7 తరగతులు), సీనియర్ (8,9,10 తరగతులు) రెండు విభాగాలుగా విభజించి వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ప్రదర్శనకు వచ్చే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు భోజనం, వసతి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. సీనియర్, జూనియర్ విభాగాల నుంచి ప్రతి అంశంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మొత్తం 14 ప్రదర్శనలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. ‘అభివృద్ధి చెందిన భారతదేశం– స్వయం సమృద్ధి భారతదేశం’ అనే ప్రధాన అంశంపై నిర్వహిస్తున్న వైజ్ఞానిక ప్రదర్శనలో ఏడు ఉప అంశాలను చేర్చారు. ఏయే అంశాలపై.. సుస్థిర వ్యవసాయం వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయం హరిత శక్తి అభివృద్ది చెందుతున్న సాంకేతికలు వినోద గణిత నమూనా ఆరోగ్య, పరిశుభ్రదత నీటి సంరక్షణ, నిర్వహణ కలెక్టర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా.. జిల్లాస్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనకు కలెక్టర్ సంతోష్, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ముఖ్యఅతిథులుగా హాజరవుతున్నారు. సోమవారం ఉదయం స్థానిక అనంత ఫంక్షన్హాల్లో జరిగే ప్రారంభోత్సవానికి వీరందరూ హాజరవుతున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేయాలని అధికారులు కోరారు. ఈ ప్రదర్శనకు ‘శ్రీనివాస రామానుజన్’ అనే పేరును నామకరణం చేశారు. -
నూతన విద్యా విధానంతో తీవ్ర నష్టం
గద్వాలటౌన్: నూతన విద్యావిధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుందని, దీని వలన పేద, మధ్య తరగతి ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిడంతో పాటు నాణ్యమైన విద్యా దూరమవుతుందని యూటీఎఫ్ రాష్ట్ర నాయకుడు రవిప్రసాద్గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించే, ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతిసేలా ఉన్న జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నూతన విద్యావిధానం రద్దు అయ్యే వరకు మన పోరాటం ఉండాలన్నారు. పార్లమెంటులో పెన్షన్ బిల్లు ఆమోదం పొందడం వలన ప్రస్తుతం ఉన్న పెన్షన్దారులకు నష్టం వాటిల్లుతుందని చెప్పారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లోని డీఏలును, పీఆర్సీ ఆరియర్లను, ఇతర ట్రైజరీ బిల్లులను త్వరగా క్లియర్ చేయాలని కోరారు. కేజీబీవీ, గురుకుల, మోడల్ స్కూల్, గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలన్నారు. సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు కిష్టయ్య, రామన్గౌడ్, స్వామి, జిల్లా అధ్యక్షుడు రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్, నాయకులు కుమార్నాయుడు, బీసన్న, తిమ్మప్ప, రాజశేఖర్, చంద్రకాంత్, తిలక్, రాజశేఖర్ పాల్గొన్నారు. తపస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక గద్వాలటౌన్ : తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకున్నారు. ఆదివారం స్థానిక ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన తపస్ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. తపస్ జిల్లా అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాగరాజులను ఎన్నికయ్యారు. ఎన్నికై న అధ్యక్ష, కార్యదర్శులను ఘనంగా సన్మానించారు. ఎన్నికల పరిశీలకులుగా వెంకటరెడ్డి, శ్రీనివాస్గౌడ్, నరేష్ వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ..ఉపాధ్యాయులకు రావాల్సిన అయిదు డీఏలతో పాటు ఈ–కుబేర్లో ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పీఆర్సీని ప్రకటిస్తామన్న హామీ ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తకపోవడం ఏంటని ప్రశ్నించారు. సమస్యల సాధన కోసం దశల వారీగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఐద్వా మహాసభలను జయప్రదం చేయండి నాగర్కర్నూల్ రూరల్: ఐద్వా 14వ జాతీయ మహాసభలు హైదరాబాద్లో వచ్చే నెల 25 నుంచి 28 వరకు కొనసాగుతాయని.. పెద్దఎత్తున మహిళలు పాల్గొని జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందికొండ గీత పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలో ఆమె మాట్లాడారు. మహాసభల్లో దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొనే ప్రధానమైన సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించి పోరాటాలు చేపడుతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
కుష్టు సర్వే పక్కాగా నిర్వహించాలి
ఖిల్లాఘనపురం: రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో కుష్టు వ్యాధిగ్రస్తులు, అనుమానితుల సర్వే పక్కాగా నిర్వహించాలని రాష్ట్ర మానిటరింగ్ అధికారి డా. జరీనా భాను అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో కొనసాగుతున్న కుష్టు అనుమానితుల సర్వే విధానాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 31 వరకు అన్ని గ్రామాల్లో సర్వే కొనసాగుతోందని, వ్యాధి సోకినట్లు అనుమానం వచ్చినా, ఒంటిపై మచ్చలు కనిపించినా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ అయితే మందులు వాడి నివారించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఇంటి వద్దకు ఆశా కార్యకర్తలు వచ్చినప్పుడు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆశా కార్యకర్తలు నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఇల్లూ తిరిగి సర్వే చేయాలని ఆదేశించారు. ఆమె వెంట మండల ఆరోగ్య కేంద్రం వైద్యుడు డా. ప్రవీణ్, డీపీఎంఓలు కృష్ణ, సంజీవ్, సూపర్వైజర్ విజయ, ఆశా కార్యకర్తలు ఉన్నారు. రాష్ట్ర మానిటరింగ్ అధికారి డా. జరీనాభాను -
పంటకు నీరు ఇవ్వాలి..
ఆర్డీఎస్ ప్రాజెక్టు గేట్లు రిపేరు చేయాలనే పేరుతో క్రాప్ హాలిడే ప్రకటించి నీళ్లు వదలకుండా భూములను బీళ్లుగా మార్చడం అన్యాయం. అధికారులు ఇలా చేయడం వారికి అలవాటుగా మారింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి త్వరితగతిన మరమ్మతు పూర్తిచేసి పూర్తిస్థాయిలో సాగునీటిని విడుదల చేయాలి. – భాను రైతు, శాంతినగర్ త్వరగా పూర్తిచేయాలి.. ర్యాలంపాడు రిజర్వాయర్కు లీకేజీలు ఏర్పడి నాలుగేళ్లు అవుతుంది. ఇప్పటి వరకు వాటికి రిపేర్లు చేసింది లేదు. కేవలం సర్వేలు చేస్తూ అధికారులు తిరిగి పోతున్నారు. నాలుగేళ్లుగా రిజర్వాయర్ కింద యాసంగిలో నీటిని నిలిపివేశారు. దీంతో ఒక్క పంటనే వేసుకుంటున్నాం. ఇప్పటికై నా అధికారులు నిర్లక్ష్యం వీడి వెంటనే రిపేర్లు పూర్తిచేసి రెండు పంటలకు నీటిని విడుదల చేయాలి. – వెంకట్రామిరెడ్డి, రైతు ర్యాలంపాడు మరమ్మతు చేపడుతాం.. తుంగభద్ర డ్యాం గేట్లకు మరమ్మతు చేయాల్సి ఉండడంతో ఆర్డీఎస్ పరిధిలో క్రాప్హాలిడే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ర్యాలంపాడు రిజరా్వాయర్ రిపేర్లకు సంబంధించి నివేదిక ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది. జూరాల ప్రాజెక్టు గేట్ల మరమ్మతు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది నాటికి పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాం. – రహీముద్దీన్, ఎస్ఈ జిల్లా ఇరిగేషన్ శాఖ ●● నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా 4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ర్యాలంపాడు జలాశయం అడుగు భాగాలలో పలుచోట్ల, తూము నిర్మాణాల వద్ద లీకేజీలు ఏర్పడడంతో జలాశయం ఉనికికే ప్రమాదం పొంచి ఉంది. దీంతో 4 టీఎంసీల సామర్థ్యాన్ని కాస్త 2 టీఎంసీలకు కుదించి గత నాలుగేళ్లుగా ఏటా ఖరీఫ్ పంటకే నీళ్లు వదులుతున్నారు. -
ఉపాధి హామీ పథకంపై కేంద్రం కుట్ర
అలంపూర్: కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని మార్చే కుట్ర చేస్తోందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు శ్రీరామ్ నాయక్ ఆరోపించారు. అలంపూర్ చౌరస్తాలోని జాతీయ రహదారిపై సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీని ఒక పథకంగా మార్చే ప్రయత్నం చేస్తుందని, పేదలకు పనిదినాలు వేతనాన్ని పెంచి గ్యారంటీ ఇవ్వాల్సి ఉండగా అందుకు భిన్నంగా పేరు మార్చి పనిదినాలు తగ్గించేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై మోపడం అన్యాయమన్నారు. దేశంలో మౌళిక వసతుల కల్పనలో కీలకపాత్ర పోషిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి మాట్లాడుతూ... ఉపాధిహామీ పథకం వచ్చిన సమయంలో వంద శాతం నిధులు కేంద్రమే భరించాలనే నిబంధన ఉందన్నారు. కానీ నేడు కేంద్ర ప్రభుత్వం 40 శాతం రాష్ట్రాలు భరించాలని చెప్పడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీలో నిధుల కోత విధించి కూలీలకు తీరని అన్యాయం చేసిందన్నారు. రాష్ట్రాలపై భారాన్ని వేసి కేంద్ర ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తోందన్నారు. ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని, ఉపాధి హక్కులను కాపాడుకోవడానికి ప్రజలు ఐక్యంగా ఉద్యమించడానికి సిద్దమవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కమిటి సభ్యులు రేపల్లె దేవదాసు, పరం జ్యోతి మద్దిలేటి, రాజు, వీవీ నరసింహ్మా, ఉప్పేర్ నరసింహ్మా, వెంకటేశ్వర్లు, వెంకటస్వామి, రఫీ, నరసింహ్మ, విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు. -
విపత్తు సమయాల్లో సమర్థవంతమైన సేవలు
గద్వాల: విపత్తు సమయాల్లో ప్రజలకు అవసరమైన సేవలందించేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో గుర్రంగడ్డ గ్రామం చుట్టూ కృష్ణానదికి వరద ఎక్కువగా వచ్చే సమయంలో బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండవని తెలిపారు. ఈ సమయంలో గ్రామస్తులకు ముందస్తుగానే మాట్లాడి అప్రమత్తం చేసి వారికి అవసరమైన అన్ని రకాల సాయం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్వో స్వామికుమార్, ఆర్అండ్బి ఈఈ ప్రగతి, డీఎంహెచ్వో డాక్టర్ సంధ్యా, ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఎస్ఈ శ్రీనివాస్, పరిశ్రమలశాఖ మేనేజర్ రామలింగేశ్వర్, వివిధశాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
మరమ్మతుకు గ్రహణం.. పంటలకు శాపం
నడిగడ్డ ప్రాజెక్టుల కింద స్థిరీకరణ ఆయకట్టు 3.35 లక్షల ఎకరాలు ● ఈసారికి 49 వేల ఎకరాలకే సాగునీటి విడుదల ● ప్రస్తుత యాసంగిలో ఆర్డీఎస్, ర్యాలంపాడు కింద క్రాప్ హాలిడే ప్రకటన ● జూరాల, తుంగభద్రలో గేట్లు, ర్యాలంపాడులో లీజీకేల పరంపర ● వరుసగా ఈసారి కూడా సాగునీటి నిలిపివేత.. ఆందోళనలో అన్నదాతలు ర్యాలంపాడు జలాశయం గద్వాల: నడిగడ్డలోని ప్రాజెక్టులకు మరమ్మతు గ్రహణం వెంటాడుతుంది. తుంగభద్ర, కృష్ణానదుల మధ్య ఉన్న జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కింద 1.09 లక్షలు, నెట్టెంపాడు కింద 1.42 లక్షలు, ఆర్డీఎస్ కింద 83 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా ఆయకట్టును స్థిరీకరించారు. కానీ, ఈ ప్రాజెక్టులు మరమ్మతుకు నోచుకోకపోవడంతో స్థిరీకరించిన ఆయకట్టుకు సాగునీరు నిలిచిపోయింది. ఫలితంగా ఏటా రెండు పంటలతో కళకళలాడాల్సిన భూములు కాస్త బీళ్లుగా మారుతున్నాయి. యాసంగిలో కేవలం 49 వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందిస్తున్నారంటే ఆయా ప్రాజెక్టుల దుస్థితి ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతుంది. తుగభద్ర నది పరిధిలోని రాజోలి బండ డైవర్షన్ పథకం కింద యాసంగిలో పూర్తిగా పంటలకు క్రాప్ హాలిడే ప్రకటించారు. అలాగే కృష్ణానది పరిధిలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద ఉన్న ర్యాలంపాడు జలాశయం అడుగు భాగాల్లో పలుచోట్ల లీకేజీలు ఏర్పడడంతో యాసంగిలో పూర్తిగా క్రాప్హాలిడే ఇస్తున్నారు. అదేవిధంగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన గేట్ల ఇనుప రోపులు తెగిపోవడంతో మరమ్మతు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఫలితంగా కేవలం 49 వేల ఎకరాలకు సాగునీరు పారుతుండడంతో ఆయకట్టుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతు పూర్తిచేయడంలో ఇటు పాలకులు, అటు అధికారుల అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నడిగడ్డ ప్రాజెక్టుల కింద ఆయకట్టు వివరాలు ఇలా.. -
ఉత్సాహంగా జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
గద్వాలటౌన్: గెలుపోటముల కంటే పోటీల్లో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడం ప్రధానమని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బీసన్న, ప్రధాన కార్యదర్శి సతీష్కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల కోసం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. శుక్రవారం స్థానిక మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో అండర్– 8, 10, 12, 14, 20 విభాగాలలో బాలురు, బాలికలకు వేర్వేరు జిల్లాస్థాయి ఎంపిక పోటీలు జరిగాయి. పరుగు పందెంతో పాటు లాంగ్జంప్, హైజంప్ విభాగాలలో క్రీడాకారులు పోటీపడ్డారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 150 మంది విద్యార్థులు పోటీలలో పాల్గొన్నారు. పోటీల ప్రారంభమనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. పట్టుదల, శ్రద్ధ అనేది క్రీడల వల్ల అలవడతాయన్నారు. జిల్లాస్థాయిలో ప్రతిభ చాటిన 30 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఎంపికై న వారందరూ జనవరి 15వ తేదీ నుంచి అదిలాబాద్ సేడియంలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు బషీర్, నర్సింహరాజు, ప్రణిత, శాంతి, అశోక్, అంజి తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కష్టాలకు చెక్..!
●యూరియా కొరత ఉండదు వ్యయసాయ శాఖ రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా రైతులు నేరుగా తమ ఇంటి నుంచే యూరియాను బుక్ చేసుకోవచ్చు. డీలర్ల వద్ద ఎంత స్టాక్ ఉందో తెలుసుకొని యూరియాను బుక్ చేసుకోవచ్చు. పంట విస్తీర్ణం మేరకు యూరియా తీసుకునే అవకాశం ఉంటుంది. – జాన్సుధాకర్, డీఏఓ గద్వాల వ్యవసాయం/నారాయణపేట: సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేసేందుకు ఇదివరకు కపస్ యాప్ తీసుకువచ్చి సక్సెస్ కావడంతో .. ఇక యూరియా బుక్ చేసుకునేలా వ్యవసాయ శాఖ ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫర్టిలైజర్స్ యాప్ ద్వారా రైతులు తమ ఇంటి నుంచి మైబెల్ ఫోన్లో యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకునే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది యాసంగిలో 1.95 లక్షల ఎకరాల వరకు పంటలు సాగు చేయనుండగా, అందులో 86,529 ఎకరాల్లో వరి సాగు చేయనున్నారని అధికారులు అంచనా వేశారు. ఎకరాకు 3 బస్తాల చొప్పున యూరియా అవసరం ఉండడంతో 5191.74 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళికలు సిద్దం చేసి ప్రభుత్వానికి నివేదించింది. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు, డీలర్లకు అవగాహన సదస్సులు సైతం చేపట్టారు. 22 నుంచి యాప్తో యూరియా సరఫరా వ్యవసాయ శాఖ తయారు చేసిన ప్రత్యేక యాప్ ద్వారా రైతు డీలర్ల వద్ద యూరియా ఉన్న స్టాక్ వివరాలు తెలుస్తాయి. రైతులు తమకు దగ్గరలో ఉన్న డీలర్ నుంచి యూరియా తీసుకునేలా బుక్ చేసుకోవచ్చు. వెంటనే ఐడీ వస్తుంది. ఇందుకనుగుణంగా డీలర్ వద్ద నుంచి యూరియా కొనుగోలు చేసే వీలు కలుగుతుంది. రైతులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి హెల్ప్ లైన్ నంబర్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. భూవిస్తీర్ణం, వేసిన పంటకనుగుణంగా యూరియా తీసుకునే అవకాశం, పరి మితికి మించి యూరియా వాడకుండా, పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టనున్నారు. ఎకరాకు మూడు బస్తాల చొప్పున రెండు ఎకరాలకు ఎక్కువ ఉంటే 15 రోజుల తర్వాత కోనుగోలు చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నారు. పట్టాపాసు బుక్లేని రైతులు పట్టాపాస్ బుక్ ఆప్షన్లో ఆధార్ నంబర్ ఎంట్రీ చేసి, ఓటీపీ కన్ప ర్మేషన్ ఇచ్చిన తర్వాత వివరాలు నమోదు చేయాలి. కౌలు రైతులు సైతం యూరియా తీసుకోవచ్చు. ఇక యాప్ విషయానికి వస్తే మొబైల్లో ప్లేస్టోర్లోకి వెళ్లి ఎరువుల యాప్ ఓపెన్ చేయగానే, రైతులు, వ్యవసాయశాఖ, డీలర్ల కోసం లాగిన్లు కనిపిస్తాయి. లాగిన్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేయగానే డీలర్లు, యూరియా స్టాక్ వివరాలు కనిపిస్తాయి. పట్టాపాసుపుస్తకం నంబర్, పంట విస్తీర్ణం వివరాలు నమోదు చేయాలి. సాగు చేసే పంట విస్తీర్ణం ఆధారంగా అవసరమైన మోతాదులో యూరియా బ్యాగుల కానవస్తుంది. యూరియా బుక్ చేసిన తర్వాత 4 దశల్లో యూరియా అందేలా చర్యలు తీసుకున్నారు. ఫర్టీలైజర్ యాప్ మొబైల్ యాప్లో బుకింగ్ చేసుకునే అవకాశం కపస్ యాప్ సక్సెస్తో యూరియా యాప్ అందుబాటులోకి.. జిల్లాలో 86,529 ఎకరాల్లో వరి సాగు యాసంగికి 5,191 మెట్రిక్ టన్నులు యూరియా అవసరమవుతాయని అంచనా ఎకరాకు 3 బస్తాల చొప్పున సరఫరా -
రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేయాలి
గద్వాలటౌన్: జిల్లాలో చేనేత రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేయాలని చేనేత ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడం రామక్రిష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ చేనేత రుణమాఫీ ప్రకటించి ఏడాదిన్నర అవుతున్న, జిల్లాలో ఇప్పటి వరకు అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రుణమాఫీ ప్రక్రియ నత్తనడకన సాగుతుందని విమర్శించారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలన్నీ సక్రమంగా కార్మికులకు అందడం లేదన్నారు. నేతన్న భరోసా పథకంపై అధికారులు దృష్టిసారించాలన్నారు. చేనేత త్రిఫ్ట్ ఫండ్ పథకం కింద ప్రతి నెల కార్మికుల ఖాతాలో డబ్బులు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం నాయకులు నిషాక్, వీరేష్, వీరన్న, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం గద్వాల: విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించే మైనారిటీ విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మైనారిటీ సంక్షేమశాఖ జిల్లా అధికారి నుషిత ప్రకటనలో తెలిపారు. ఏదైన విభాగంలో పీజీ కోర్సులకు సంబంధించి 1.7.2025 నుంచి 31.12.2025 వరకు అడ్మిషన్ పొందిన వారు మాత్రమే అర్హులని తెలిపారు. అర్హులైన వారు ఆన్లైన్ వెబ్సైట్ httpr.telangan aeparr.chf.g ov.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నివాస ధ్రువీకరణపత్రాలతో పాటు టెన్త్, ఇంటర్, డిగ్రీలతో పాటు అవసరమైన ఇతర పత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. దరఖాస్తు చేసుకొనటకు చివరి తేదీ 19.1.2026 ఉందని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వారి హార్డ్కాపీలను జనవరి 20వ తేదీలోపు తమ కార్యాలయంలో సమర్పించాలని, ఇతక వివరాలకు సెల్ నం.8099059007 ను సంప్రదించాలని పేర్కొన్నారు. సంతోష్ ట్రోఫీకి వినోద్కుమార్ ఎంపిక గద్వాలటౌన్: ప్రతిష్టాత్మకమైన సంతోష్ ట్రోఫి ఫుట్బాల్ పోటీలకు గద్వాలకు చెందిన యువ క్రీడాకారుడు వినోద్కుమార్ ఎంపికయ్యారు. ఈ నెల 21 నుంచి 28 వరకు ఛత్తీస్ఘడ్లో జరిగే 79వ జాతీయస్థాయి ఫుట్బాల్ ఛాంపియన్ షిప్ సంతోష్ ట్రోఫి పోటీలు జరగనున్నాయి. సంతోష్ ట్రోఫి కోసం 22 మంది క్రీడాకారులతో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఫుట్బాల్ జట్టును ఎంపిక చేశారు. ఇందులో గద్వాలకు చెందిన క్రీడాకారుడు వినోద్కుమార్ ఉండటం గర్వకారణం. సంతోష్ ట్రోఫి కోసం గత అక్టోబర్లో ప్రాబబుల్స్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఇందులో 50 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. తరువాత వారికి నెల రోజుల పాటు హైదరాబాద్లోని ఫుట్బాల్ క్రీడా మైదానంలో శిక్షణ ఇచ్చారు. ప్రాబబుల్స్ పోటీలలో అత్యంత క్రీడా నైపుణ్యం కనభర్చిన వినోద్కుమార్ను రాష్ట్ర తుది జట్టులోకి తీసుకున్నారు. వినోద్కుమార్ స్థానిక ఎంఏఎల్డీ డిగ్రి కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఈ ఎంపికపై ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పాల్గుణ, జిల్లా అధ్యక్షుడు బండల వెంకట్రాములు, ప్రధాన కార్యదర్శి విజయ్కుమార్, టీం కోచ్ వెంకట్రాములు, ఇంటెలిజెన్స్ సీఐ నర్సింహారాజు హర్షం తెలిపారు. -
సమష్టి కృషితోనే విజయం
అలంపూర్: మూడో విడతలో బీఆర్ఎస్ మద్దతుతో విజయం సాధించిన సర్పంచ్లు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిని గురువారం కలిశారు. కర్నూల్లోని ఆయన నివాసంలో అలంపూర్, ఉండవెల్లి, మానవపాడు, ఇటిక్యాల, ఎర్రవల్లి మండలాలకు చెందిన నూతన సర్పంచ్లు, నాయకులు మద్దతుదారులు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ నూతన సర్పంచ్లను సన్మానించారు. క్షేత్ర స్థాయిలో అందరి సమష్టి కృషితోనే బీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించారన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను చూసిన ఓటర్లు తమ ఓటుతో సర్పంచ్లను గెలిపించి మద్దతుగా నిలిచారన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా నిలిచిన ఓటర్లకు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీన కలిసిన వారిలో ఆయా మండలాల నాయకులు తదితరులు ఉన్నారు. -
22 నుంచి జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన
గద్వాలటౌన్: విద్యార్థులలో దాగివున్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని, సృజనాత్మకతను వెలికితీసి వారిని భావి శాస్త్రవేత్తలుగా తయారు చేసే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి ఏటా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్స్పైర్ మనక్ పోటీలను ఏర్పాటు చేస్తుందని డీఈఓ విజయలక్ష్మి పేర్కొన్నారు. గురువారం స్థానిక బాలభవన్లో జరిగిన వైజ్ఞానిక ప్రదర్శన కమిటీ సభ్యుల సమావేశంలో డీఈఓ పాల్గొని మాట్లాడారు. అనంతరం వైజ్ఞానిక ప్రదర్శన వివరాలను విలేకర్లకు వెల్లడించారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన వైజ్ఞానిక, గణిత, పర్యావరణ జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలను డిసెంబర్ 22, 23వ తేదీలలో స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని యాజమాన్య పరిధిలోని ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రదర్శనల్లో తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. 13 మండలాలు.. 175 పాఠశాలలు జిల్లాలోని 13 మండలాల పరిధిలోని 175 పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రదర్శనలు ఇస్తున్నారని చెప్పారు. జూనియర్ (6,7 తరగతులు), సీనియర్ (8,9,10 తరగతులు) విభాగాలుగా వైజ్ఞానిక ప్రదర్శనలు ఉంటాయన్నారు. ప్రదర్శనకు హాజరైన విద్యార్థులకు సాయంత్రం వేళల్లో ప్రత్యేక పోటీ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. క్విజ్, వ్యాసరచన, ఉపన్యాస, సెమినార్, సైన్స్ సంబంధిత డ్రామాలు ఉంటాయన్నారు. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మొత్తం 14 ప్రదర్శనలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులలో దాగివున్న నైపుణ్యాలను వెలికి తీస్తూ భావి శాస్త్రవేత్తలుగా తయారు కావడానికి ఇవి వేదికలుగా ఉపయోగపడతాయన్నారు. అదనపు సమాచారం కోసం జిల్లా సైన్స్ అధికారి సెల్: 9502647200కు సంప్రదించాలని సూచించారు. జిల్లా సైన్స్ అధికారి భాస్కర్ పాపన్న, శ్రీనివాస్గౌడ్, ప్రతాప్రెడ్డి, శాంతిరాజు, హంపయ్య పాల్గొన్నారు. జాతరలో దుకాణాల ఏర్పాటుపై వివాదం గద్వాల క్రైం: గద్వాల సంతాన వేణుగోపాల్ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా చిరు వ్యాపారులు ఏర్పాటు చేసే దుకాణాలపై వివాదం నెలకొంది. ప్రతి సంవత్సరం పట్టణంలోని భీంనగర్ రోడ్డు మార్గంలో చిరు వ్యాపారులు, వలస వ్యాపారం చేసే వారు జాతర అంగళ్లు ఏర్పాటు చేసుకుని భక్తులకు, ప్రజలకు వివిధ తిను బండారాలు, ఆటవస్తువులు, వస్తు సామగ్రి క్రయ విక్రయాలు చేస్తారు. అయితే ఇటీవల రోడ్డు మార్గంలో వెలసిన వ్యాపార, వాణిజ్య కాంప్లెక్స్ నిర్మాణ యాజమానులు ఈ వీధి వ్యాపారులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈక్రమంలోనే గురువారం భీంనగర్ రోడ్డు మార్గంలో జాతరలో దుకాణాలు ఏర్పాటు చేస్తున్న క్రమంలో కొందరు వ్యాపారులు అడ్డుకున్నారు. ఏళ్లుగా బ్రహ్మోత్సవాల్లో 10 – 15 రోజుల పాటు దుకాణాలు ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందుతున్న తరుణంలో ఇలా వ్యతిరేకించడంపై వీధి వ్యాపారులు ఆందోళన చెందారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వీధి వ్యాపారులతో దుకాణాలు వేయించారు. అడ్డుకున్న వ్యాపారులను మందలించి సామరస్యంగా ఉండాలని, లేని తరుణంలో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
77 మంది సర్పంచులు మా మద్దతుదారులే..
రాజోళి: అలంపూర్ నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని గెలుపును కాంగ్రెస్ మద్దతుదారులు సాధించి, చరిత్ర సృష్టించారని.. 124 గ్రామ పంచాయతీల్లో 77 మంది కాంగ్రెస్ మద్దతుదారులే గెలిచారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ అన్నారు. శాంతినగర్ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేఽశంలో మాట్లాడారు. అలంపూర్ నియోజకవర్గంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కుట్రలు, కుతంత్రాలతో తనను ఓడించినా, ప్రజలు మాత్రం సర్పంచు ఎన్నికల్లో తమ అభిమానాన్ని చూపి కాంగ్రెస్ మద్దతుదారులకే పట్టం కట్టారన్నారు. 77 మంది కాంగ్రెస్ మద్దతుదారులే గెలిచారని, కాని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ పార్టీ తరపున గెలిచారని అసత్య ప్రచారాలు చేసుకుంటున్నారని అన్నారు. తమ మద్దతుతో ఏకగ్రీవమైన సర్పంచు స్థానాలను స్వతంత్య్ర అభ్యర్థులుగా చెప్పడం, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారిని కూడా తమ మద్దతుదారులని చెప్పుకుంటూ, పబ్బం గడుపుతున్నారని అన్నారు. గెలిచిన వారందరూ తమ పార్టీ కండువా కప్పుకుంటుంటే చూసి కూడా తమ ఖాతాలో గెలిచిన వారని చెప్పడం చూస్తే వారి పార్టీపై వారికి ఎంత నమ్మకం ఉందో అర్ధమవుతుందని అన్నారు. రేవంత్రెడ్డి సీఎంగా ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాలు ప్రజలను కాంగ్రెస్ వైపు నడిపించాయని అన్నారు. నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ తరపున, ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి ఏదీ లేదని అన్నారు. వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించిన ఘనత తమదేనన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఖాతాలో మరిన్ని విజయాలు నమోదవుతాయని, బీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఆయన అన్నారు. కార్యక్రమంలో షేక్షావళి,జగన్గౌడ్,గంగి రెడ్డి,కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,గెలిచిన సర్పంచులు పాల్గొన్నారు. -
కోవర్ట్స్.. రెబల్స్!
నారాయణపేట నియోజకవర్గం, మహబూబ్నగర్ జిల్లా పరిధి కోయిల్కొండ మండలంలో పేరు చివర నగర్ ఉన్న గ్రామానికి రెండో విడతలో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన వ్యక్తి ఓటమి పాలయ్యాడు. ఈయన ఓటమి వెనుక స్థానిక ‘హస్తం’ నాయకులే ఉండడం గమనార్హం. లోపాయికారిగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి మద్దతు తెలిపారు. ఇది గ్రహించక అంతా ఖర్చు చేసిన సదరు అభ్యర్థి తలపట్టుకుంటున్నాడు. ‘నా పనేందో నేను చేసుకుంటున్నా. హైదరాబాద్కు వచ్చి నన్ను ఒప్పించి వారే సర్పంచ్గా నిలబెట్టారు. వారే ఖర్చు చేయించారు. చివరకు వారే ఓడించారు. నా కొంప ఆర్సిండురోయ్.’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇదే మండలంలో మరో గ్రామంలో సైతం ఇలాగే జరిగినట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పల్లె రాజకీయాలు ఎప్పుడూ విభిన్నమే. స్థానిక పరిస్థితులు ప్రభావం చూపించే ఈ ఎన్నికలు ఎప్పటికై నా ఆసక్తికరమే. పార్టీ గుర్తులపై కాకుండా జరిగే సంగ్రామమైనప్పటికీ.. వాటి ప్రభావం ఊరి ప్రజలపై చెరగని ముద్ర వేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు స్థానిక ఎన్నికల్లో కలిసి వస్తుందనే దానికి గతంలో వెలువడిన ఫలితాలే నిదర్శనం. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ సైతం పల్లె పోరులో పైచేయి సాధించింది. కానీ వరుసగా అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో సత్తా చాటడం హస్తం నేతలను బెంబేలెత్తిస్తోంది. ఆశించిన ఫలితాలు రాకపోవడం వారిని కుంగదీస్తోంది. దీనికంతటికీ పార్టీలోని కోవర్టులు, రెబల్స్ కారణం కాగా.. ఎవరు గెలిచినా తమ వారే అన్నట్లు వ్యవహరించడం కూడా ఫలితాలపై ఎఫెక్ట్ పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రులతో పాటు ‘అధికార’ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కోవర్టులు, రెబల్స్ ప్రభావం చూపిన తీరుపై ‘సాక్షి’ కథనం.. రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంలో నాగర్కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు, వనపర్తి జిల్లాలోని చిన్నంబావి, వీపనగండ్ల, పాన్గల్ మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 137 జీపీలు ఉండగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ నడిచింది. 69 మంది హస్తం మద్దతుదారులు గెలుపొందగా.. 44 మంది కారు, ఆరు చోట్ల బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో అధిక జీపీల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒకరికొకరు మద్దతు తెలుపుకోగా.. మొత్తంగా 50 స్థానాల్లో గెలుపొందారు. స్వతంత్రులు పది మంది విజయం సాధించగా.. వీరిలో ఎక్కువగా ఉమ్మడి (కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ) అభ్యర్థులే ఉన్నారు. వీరికి అధికార పార్టీలోని గ్రామ, మండలస్థాయి ముఖ్యులు లోపాయికారిగా సహకరించినట్లు తెలుస్తోంది. ఈ సెగ్మెంట్లో రెబల్స్తో పాటు ముఖ్య నాయకుల మధ్య వర్గపోరు సైతం గెలుపు ఫలితాలపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఇంకా ఎక్కడెక్కడ అంటే.. నారాయణపేట నియోజకవర్గంలో 95 జీపీలు ఉన్నాయి. ఇందులో 43 చోట్ల కాంగ్రెస్, 16 పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. హస్తం ఆధిక్యతను సాధించినా.. ఇక్కడ రెబల్స్ ఐదుగురు, ఉమ్మడి అభ్యర్థులు తొమ్మిది మంది విజయం సాధించారు. గెలుపొందిన ఉమ్మడి అభ్యర్థుల్లో అధిక శాతం మందికి ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు సహకరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఇతర పార్టీల సర్పంచ్ అభ్యర్థులతో ముందుగానే లోపాయికారీ ఒప్పందం చేసుకుని.. సొంత పార్టీ అభ్యర్థులకు వెనున్నపోటు పొడిచినట్లు తెలుస్తోంది. ప్రధానంగా కోయిల్కొండ మండల పరిధిలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఎమ్మెల్యేకు, నియోజకవర్గ ముఖ్యనేతకు సంబంధించి మండలాల వారీగా షాడో నాయకులుగా వ్యవహరిస్తున్న వారి నిర్వాకం వల్ల పలు జీపీలు చేజారిపోయినట్లు తెలుస్తోంది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో 172 గ్రామపంచాయతీలు ఉండగా.. శంకరాయపల్లి తండి మినహా అన్నింటిలో ఎన్నికలు జరిగాయి. 83 జీపీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందగా.. ఆ పార్టీ ఆధిక్యతను కనబరిచింది. బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వగా.. 72 స్థానాల్లో ఆ పార్టీ మద్దతుదారులు సర్పంచ్లుగా గెలుపొందారు. అయితే ఎమ్మెల్యేకు షాడో నేతగా వ్యవహరిస్తున్న ఒకరి నిర్వాకం.. పాత కాంగ్రెస్ నాయకులకు దక్కని ప్రాధాన్యం, నియోజకవర్గంలో ఒంటెద్దపోకలు ఫలితాలపై ప్రభావం చూపించినట్లు పార్టీ శ్రేణుల్లో చర్చజరుగుతోంది. వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు షాడో నేతలుగా వ్యవహరిస్తున్న వారికి ఈ పంచాయతీ ఎన్నికల్లో షాక్ తగిలింది. గోపాల్పేట మండలంలోని ఓ నాయకుడి స్వగ్రామం, పెబ్బేరు మండలంలోని మరో గ్రామం, ఖిల్లాఘనపురం మండలంలోని ఓ పల్లెలో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. ఆయా ప్రాంతాల్లో అధికార నేతకు షాడో నాయకులుగా వ్యవహరిస్తున్న తీరుతో ప్రజలతో పాటు కాంగ్రెస్ అభిమానులు సైతం కారు బలపరిచిన అభ్యర్థులను గెలిపించినట్లు తెలుస్తోంది. గద్వాల నియోజకవర్గంలో మొత్తంగా కాంగ్రెస్ ఆధిపత్యమే కొనసాగింది. అయితే పార్టీలో రెండు వర్గాలుగా ఉన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ వర్గాలకు చెందిన వారే సర్పంచ్లుగా ఎన్నికయ్యారు. ఇందులో బండ్ల వర్గం సత్తా చాటినట్లు తెలుస్తోంది. నారాయణపేట మండలం ఓ జీపీ సర్పంచ్ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. పాత కాంగ్రెస్ నుంచి ఒకరు పోటీ చేశారు. కొత్త కాంగ్రెస్ నుంచి ఓ నాయకుడు తన భార్యతో నామినేషన్ వేయించి.. ఒత్తిళ్లతో విరమించుకున్నాడు. తాను 8వ వార్డులో బరిలో నిలిచాడు. తన వార్డు వరకే ఆ నాయకుడు పరిమితం కాగా.. అక్కడ గెలుపొందాడు. కాంగ్రెస్ సర్పంచ్ మద్దతుదారు ఓడిపోగా.. బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. నా కొంప ఆర్సిండురోయ్..! కొల్లాపూర్: రెబల్స్, వర్గ పోరుతో.. మక్తల్: ‘వాకిట’ మెజార్టీపై ఎఫెక్ట్.. మక్తల్ నియోజకవర్గంలో నారాయణపేట జిల్లాలో మక్తల్, మాగనూరు, కృష్ణ, నర్వ, ఊట్కూరు.. వనపర్తి జిల్లాలో అమరచింత, ఆత్మకూరు మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 138 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ మద్దతుదారులు 70, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 31 మంది గెలుపొందారు. హస్తం ఆధిక్యం సాధించినా.. పది స్థానాల్లో అదే పార్టీకి చెందిన రెబల్స్ విజయం సాధించారు. రెబల్స్ ప్రభావానికి ఇది నిదర్శనం కాగా.. ఐదారు స్థానాల్లో కాంగ్రెస్, కాంగ్రెస్ రెబల్స్ మధ్య పోటీతో బీజేపీ, బీఆర్ఎస్కు లాభించింది. అంతేకాకుండా పలు చోట్ల స్థానిక కాంగ్రెస్ నాయకులే.. ఆ పార్టీ బలపరిచిన వారికి కాకుండా లోపాయికారిగా కారు, కమలం బలపరిచిన వారికి సహకరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ను దెబ్బతీసింది వీరే.. పలు చోట్ల షాడోల తీరు సైతం.. నారాయణపేట, వనపర్తి, జడ్చర్లలో అధిక ప్రభావం మంత్రి జూపల్లి ఇలాకా కొల్లాపూర్లో అత్తెసరు ఫలితాలే.. మరో అమాత్యుడి సెగ్మెంట్ మక్తల్లో మెజార్టీపై ఎఫెక్ట్ గద్వాల నియోజకవర్గంలో విభిన్నం.. స్వపక్షంలోని వర్గాలదే విజయం -
తాతదే జయకేతనం
మూసాపేట మండలం చక్రాపూర్ సర్పంచ్ ఎన్నికల్లో మనువడిపై తాత గెలుపొందాడు. ఈ గ్రామంలో 1285 ఓట్లకు 1175 పోలయ్యాయి. ఇందులో బీఆర్ఎస్ మద్దతుదారుడు గంటెల రఘురాములుకు 639 ఓట్లు, కాంగ్రెస్ మద్దతుదారుడు లక్ష్మినారాయణకు 484 ఓట్లు వచ్చాయి. దీంతో 155 ఓట్ల మెజార్టీతో మనువడిపై తాత నెగ్గాడు. రఘురాములుకు ముగ్గురు సంతానం ఉండటంతో గతంలో ఆయన పోటీ చేసే అవకాశం లేకపోవడంతో ఆయన తన తల్లిని పోటీ చేయించి రెండు సార్లు సర్పంచ్గా విజయం సాధించాడు. తాజాగా ప్రభుత్వం ముగ్గురు పిల్లలు ఉన్న వారికి అవకాశం ఇవ్వడంతో స్వయంగా రఘురాములు పోటీలో నిలిచి తొలిసారి విజయం సాధించాడు. – అడ్డాకుల -
అన్నపై తమ్ముడి పై‘చేయి’
అడ్డాకుల మండల కేంద్రంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అన్నపై తమ్ముడు విజయం సాధించారు. బీఆర్ఎస్ తరఫున బొక్కలపల్లి తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి అతడి తమ్ముడు దశరథ్రెడ్డి పోటీపడ్డారు. హోరాహోరీ పోరులో తిరుపతిరెడ్డి 758 ఓట్లతో మూడో స్థానానికి పరిమితం కాగా.. దశరథ్రెడ్డి 888 ఓట్లతో తన సమీప ప్రత్యర్థి అయిన స్వతంత్ర అభ్యర్థి ఖాజామైనొద్దీన్ (840)పై 48 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గ్రామంలో 3,142 ఓట్లకు గాను 2,829 ఓట్లు పోలయ్యాయి. – అడ్డాకుల -
కోడలిపై అత్త విజయం
జడ్చర్ల మండలం మాటుబండతండా పంచాయతీలో కోడలిపై అత్త విజయం సాధించింది. తండా ఎస్టీ మహిళకు రిజర్వు కాగా నేనావత్ లక్ష్మిని ఆమె పెద్ద కుమారుడు దీపక్రాథోడ్ సర్పంచ్గా పోటీలో ఉంచారు. అయితే లక్ష్మి చిన్న కుమారుడు నేనావత్ బాలకోటి తన భార్య పల్లవిని సర్పంచ్ బరిలో దింపాడు. వీరితోపాటు ఆంగోతు రూప్లి అనే మహిళ సైతం బరిలో నిలిచింది. ఈ క్రమంలో ఎన్నికల్లో 228 ఓట్లు పోలు కాగా లక్ష్మికి 98, పల్లవికి 72, రూప్లికి 56 ఓట్లు వచ్చాయి. చివరికి అత్త లక్ష్మి 26 ఓట్ల తేడాతో విజయం సాధించారు. – జడ్చర్ల టౌన్ -
అక్కడక్కడ..
● వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం కాళ్లూరు గ్రామంలో ఆరో వార్డులో ఒక్క ఓటు ఎక్కువగా వచ్చింది. దీంతో ఫలితాలు తారుమారు చేస్తున్నారని రోడ్డుపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు. పోలీస్లు అక్కడకు చేరుకుని వారిని సముదాయించారు. చివరకు బీఆర్ఎస్ మద్దతుదారు గెలవడంతో వారు ఆందోళనను విరమించారు. ● నారాయణపేట జిల్లా నర్వ మండలం జంగంరెడ్డిపల్లిలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. సర్పంచ్గా బీఆర్ఎస్ మద్దతుదారు మెట్ల తిరుపతమ్మ గెలుపొందారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. బ్రహ్మం అనే వ్యక్తిపై ‘కారు’ కార్యకర్తలు దాడికి పాల్పడగా.. అక్కడున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. -
మూడో విడత ఎన్నికలు ప్రశాంతం
● పారదర్శకంగా ఓట్ల లెక్కింపు ● కలెక్టర్ బీఎం సంతోష్ అలంపూర్: జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. జిల్లాలోని 5 మండలాల్లో పోలింగ్ బుధవారం నిర్వహించగా.. మానవపాడు, బోరవెల్లి, జల్లాపురం పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ సరళి, ఓటర్ల వివరాలు, బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల వివరాలను పరిశీలించారు. దివ్యాంగులు, నడలేని వారికి, వృద్ధులకు వీల్ చైర్ ఏర్పాటు చేయడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. క్యూలైన్లలో ఉన్న ఓటర్లతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. ● ఓట్ల లెక్కింపులో ఖచ్చితత్వం అత్యంత ముఖ్యమని, కౌంటింగ్ కేంద్రాల్లో అధికారులు ముందుగా పోస్టల్ బ్యాలెట్ పత్రాలు, ఆతర్వాత వార్డు సభ్యులు, సర్పంచ్ బ్యాలెట్ పత్రాలను లెక్కించాలని కలెక్టర్ ఆదేశించారు. ఫలితాల అనంతరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ అనంతరం పోలింగ్ సామగ్రిని రిసెప్షన్ కౌంటర్ల వద్ద అందజేయాలన్నారు. వీరితోపాటు ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నర్సింగరావు, పదో బెటాలియన్ కమాండెంట్ జయరాజు, అసిస్టెంట్ కమాండెంట్ నరేందర్ రెడ్డి, ఎన్నికల అధికారులు రామలింగేశ్వర్, రాఘవ, శ్రీనివాస్ జోషి, శివప్రసాద్, అగస్టీన్ ఉన్నారు. ● ఉండవెల్లి మండలం పుల్లూరులో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి.. ఎమ్మెల్యే విజయుడు సతీమణితో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జల్లాపురంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత, వల్లూరులో మాజీ ఎమ్మెల్యే వీఎం అబ్రహం ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
నేటి నుంచి ధనుర్మాస ఉత్సవాలు
అలంపూర్: జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రంలో వెలసిన శ్రీయోగా నరసింహస్వామి ఆలయంలో బుధవారం నుంచి ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ దీప్తి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా రోజు ఉదయం 4:30 గంటలకు సుప్రభాత సేవ, 5 గంటలకు తిరుప్పావై పఠనం, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 30న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉదయం 6 గంటల నుంచి ఉత్తరద్వార దర్శనాలు, విష్ణు సహస్త్రనామార్చన, కుంకుమార్చన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల 14న శ్రీ భూనీలా సమేత యోగా నరసింహస్వామి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. టీ–20 క్రికెట్ టోర్నీకి జిల్లా జట్టు ఎంపిక గద్వాలన్యూటౌన్: హెచ్సీఏ ఆద్వర్యంలో నిర్వహించే జి. వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ టోర్నీ పాల్గొనే జిల్లా జట్టును మంగళవారం స్థానిక స్టేడియంలో ఎండీసీఏ, జీసీఏ ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల జట్లతో జిల్లా జట్టు ఆడనుంది. ఇందులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఉమ్మ డి జిల్లా జట్టుకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జీసీఏ అధ్యక్షుడు శరత్చంద్రకుమార్, కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి వెంకటేశ్, ఖలీమ్ పాల్గొన్నారు. విద్యార్థిని కొట్టాడని.. ● హెచ్ఎంతో గ్రామస్తుల వాగ్వాదం అయిజ: మండలంలోని ఎక్లాస్పురం ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం బాబు ఓ విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తోటి విద్యార్థుల ద్వారా విషయం తెలుసుకున్న గ్రామస్తులు మంగళవారం పాఠశాలకు చేరుకొని హెచ్ఎంతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు హెచ్ఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే, ఓ వ్యక్తి తనపై దాడి చేశాడని పాఠశాల హెచ్ఎం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎంఈఓను వివరణ కోరగా.. హెచ్ఎం బాబుకు షోకాజు నోటీసు జారీ చేస్తామని, సమగ్ర విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిస్తానని ఆయన తెలిపారు. వేరుశనగ క్వింటా రూ.7,978 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు మంగళవారం 318 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి రాగా.. గరిష్టంగా రూ. 7,978, కనిష్టంగా రూ. 4,576, సరాసరి రూ. 5,670 ధరలు లభించాయి. అదే విధంగా 19 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 5,960, కనిష్టంగా రూ. 5,730, సరాసరి రూ. 5810 ధరలు వచ్చాయి. 507 క్వింటాళ్ల వరి (సోన) అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 2,769, కనిష్టంగా రూ. 1,802, సరాసరి ధర రూ. 2,769 పలికింది. 30 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,673, కనిష్టంగా రూ. 6,129, సరాసరి రూ. 6,129 ధరలు లభించాయి. ఉత్సాహంగా బ్యాడ్మింటన్ ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో మంగళవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అండర్–19 విభాగం బాలబాలికల బ్యాడ్మింటన్ ఎంపికలు ని ర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పీడీ, స్పోర్ట్స్ ఇన్చార్జి వేణుగోపాల్ మాట్లాడుతూ క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వ్యా యామ ఉపాధ్యాయులు సాదత్ఖాన్, బాల్రాజు, సీనియర్ క్రీడాకారులు సయ్యద్ ఎజాజ్అలీ, ఎండీ ఉస్మాన్ పాల్గొన్నారు. -
తుది విడతకు కట్టుదిట్టమైన భద్రత
అలంపూర్: జిల్లాలో జరిగే మూడో విడత పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. ఎర్రవల్లి మండలం పదో బెటాలియన్లో మంగళవారం మూడో విడత ఎన్నికల విధులపై నిర్వహించిన సమగ్ర సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. మూడో విడత ఎన్నికలు జరిగే 68 జీపీల్లో 28 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు కోసం 370 మంది పోలీస్ ఫోర్స్, 20 రూట్ మొబైల్ పార్టీలు, 6 స్ట్రైకింగ్ ఫోర్స్, 2 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 6 క్యూఆర్టీలు, 14 మందితో రూట్ ఇన్చార్జీలను నియమించినట్లు వివరించారు. ఎవరైనా ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అభ్యర్థులు, ఏజెంట్లు, రాజకీయ కార్యకర్తల ఒత్తిడి, ప్రలోభాలకు లోనుకావొద్దన్నారు. ఎన్నికల విధుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు, మద్యం, డబ్బు పంపిణీపై నిఘా ఉంచాలన్నారు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణం కల్పించాలన్నారు. ఎన్నికల సందర్భంగా చిన్నపాటి గొడవలను కూడా నిర్లక్ష్యం చేయొద్దన్నారు. సోషల్ మీడియాలో పుకార్లు, తప్పుడు సమాచారాన్ని పర్యవేక్షించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి పోలీస్ అధికారి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా వ్యవహరించాలన్నారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రవి తదితరులు ఉన్నారు. ● అలంపూర్లో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని అడిషనల్ ఎస్పీ శంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఉండవెల్లిలో పోలీసు విధుల నిర్వహణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. -
‘తుది’ పోరుకు సై..
● 563 సర్పంచ్.. 5,016 వార్డు స్థానాల్లో ఎన్నికలు ● ఏకగ్రీవం పోనూ 504 సర్పంచ్, 4,016 వార్డుల్లో పోలింగ్ ● 5 జిల్లాలు, 27 మండలాల్లో పకడ్బందీ ఏర్పాట్లు ● ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం ఉండవెల్లి నుంచి పోలింగ్ కేంద్రానికి వెళ్తున్న ఎన్నికల సిబ్బంది నేడు చివరి విడత సం‘గ్రామం’ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: తుది విడత సంగ్రామం క్లైమాక్స్కు చేరింది. ఉమ్మడి పాలమూరులోని 27 మండలాల పరిధిలో బుధవారం చివరి దశ పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఐదు జిల్లాల అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్ సెంటర్లలో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి ఆయా మండల కేంద్రాల్లో శనివారం ఏర్పాటు చేసిన సెంటర్లలో పోలింగ్ సామగ్రిని పంపిణీ చేసింది. ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభం కానుండగా.. మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. ఆ తర్వాత రెండు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి.. అదే రోజు ఫలితాలను వెల్లడించనుంది. ముందుగా వార్డు సభ్యుల ఓట్లు, ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లు లెక్కించనున్నారు. అనంతరం ఉప సర్పంచ్ను ఎన్నుకోనున్నారు. రెండు విడతల్లో పలు చోట్ల ఓట్ల లెక్కింపు ఆలస్యం అయిన నేపథ్యంలో చివరి దఫాలో ఎక్కడా జాప్యం జరగకుండా ఎన్నికల విధులు నిర్వర్తించే అధికార యంత్రాంగానికి ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు పలు సూచనలు చేశారు. ఇటిక్యాల నుంచి ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న సిబ్బంది -
సర్వం సిద్ధం..
అలంపూర్: పంచాయతీ ఎన్నికల పోరు చివరి అంకానికి చేరింది. మరికొన్ని గంటల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల భవిష్యత్ను నిర్దేశించే పోలింగ్ ప్రారంభం కానుంది. మూడో విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో పోలింగ్ నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి, ఇటిక్యాల, మానవపాడు, ఉండవెల్లి, అలంపూర్ మండలాల్లో బుధవారం ఎన్నికల పోలింగ్ జరనుంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రితో అధికారులు, సిబ్బంది మంగళవారమే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. బరిలో నిలిచిన సర్పంచ్, వార్డు అభ్యర్థుల భవిష్యత్ను తేల్చడానికి ఓటర్లు సిద్ధమయ్యారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించనున్నారు. మూడో విడత ఇలా.. మూడో విడతలో మొత్తం 75 సర్పంచ్, 700 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. మానవపాడు మండలంలోని గోకులపాడు, చెన్నిపాడు, చంద్రశేఖర్నగర్, చండూరు సర్పంచ్ స్థానాలతో పాటు 50 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇటిక్యాల మండలంలో వావిలాల, మొగలిరావులచెరువు సర్పంచ్ స్థానాలు, 43 వార్డులు, ఎర్రవల్లి మండలంలో రాజశ్రీ గార్లపాడు సర్పంచ్ స్థానంతో పాటు 23 వార్డులను ఏకగ్రీవం చేసుకున్నారు. అలంపూర్ మండలంలో 6 వార్డులు, ఉండవెల్లిలో 14 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఉండవెల్లి మండలంలోని బస్వాపురంలో 1, 5, 6 వార్డులకు ఎన్నికలు జరగడం లేదు. ఆయా వార్డులకు ఇద్దరు చొప్పున నామినేషన్లు దాఖలు చేసినా వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. ఇక మిగిలిన 68 సర్పంచ్, 561 వార్డు స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ● మూడో విడత ఎన్నికలు జరిగే జీపీల్లో సర్పంచ్ స్థానాలకు 216 మంది, వార్డు స్థానా ల్లో 1,287 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఎన్నికల నిర్వహణకు 638 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయగా.. 1,430 మంది అధికారులు పోలింగ్ విధులకు నియమించారు. 1,00,372 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నువ్వా..నేనా అన్నట్టుగా బరిలో ని లిచిన అభ్యర్థుల భవితవ్యం నేటితో తేలిపోనుంది. నేడు ఐదు మండలాల్లో పంచాయతీ ఎన్నికలు 68 సర్పంచ్, 561 వార్డు స్థానాల్లో పోలింగ్ 638 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న అధికారులు -
పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగాలి
అలంపూర్: మూడో విడత జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం ఎర్రవల్లిలోని పదో బెటాలియన్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆయన పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది తమకు ఇచ్చే పోలింగ్ సామగ్రిని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని సూచించారు. ఏమైనా పొరపాట్లు జరిగితే రిటర్నింగ్ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. పోలింగ్, కౌటింగ్ నిర్వహణకు అవసరమైన ప్రతి సామగ్రి తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. పోలింగ్ విధులు నిర్వర్తించే అధికారులు కేంద్రాల్లో రిపోర్టు చేసిన తర్వాత రూట్ల వారీగా జోనల్ అధికారులు సహకారం అందిస్తారన్నారు. ఇప్పటికే శిక్షణ పొందిన పీఓలు, ఓపీఓలు, ఇతర అధికారులకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలన్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు తగు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత రిసెప్షన్ సెంటర్లకు తిరిగి వచ్చే వరకు పోలీస్ బందోబస్తు ఉంటుందన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అధికారులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చివరి దశ పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పూర్తిచేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎన్నికల అధికారులు నుషిత, నరేశ్ ఉన్నారు. -
జూపల్లి ఇలాకాలో ఉత్కంఠ..
● ఆయన స్వగ్రామం పెద్ద దగడ ఫలితంపై సర్వత్రా ఆసక్తి ● కొల్లాపూర్లోని వీపనగండ్ల, చిన్నంబావి, పాన్గల్లో తుదివిడత ఎన్నికలు ● ఆయా మండలాల్లో పొడిచిన పొత్తులతో రసవత్తరంగా పోరు ● ఒక్క ‘చిన్నంబావి’లోనే 12 జీపీల్లో కారుకు కమలం మద్దతు.. ● మిగిలిన 4 పంచాయతీల్లో బీజేపీకి బీఆర్ఎస్ తోడ్పాటు ● మిగతా మండలాల్లోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గ ప్రజాప్రతినిధుల స్వగ్రామాల్లో ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటివరకు రెండు విడతలు జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల, వనపర్తి, దేవరకద్ర, నారాయణపేట నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్కు చెందిన ఆయా ఎమ్మెల్యేల సొంతూళ్లలో విపక్ష పార్టీల మద్దతుదారులు గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తుది విడతలో రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంపై అందరూ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆయన స్వగ్రామం చిన్నంబావి మండలంలోని పెద్ద దగడ గ్రామానికి బుధవారం పోలింగ్ జరగనుండగా.. ఫలితం ఏ విధంగా ఉంటుందోననే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పెద్దదగడ గ్రామ సర్పంచ్ అన్రిజర్వ్డ్ స్థానం కాగా.. ప్రధానంగా కాంగ్రెస్ బలపరిచిన ఉడుతల భాస్కర్, బీఆర్ఎస్ మద్దతుదారు గొంది నిరంజన్రెడ్డి తలపడుతున్నారు. ఎవరికి వారు తమదే గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తుండగా.. ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు.. ఈ నియోజకవర్గ పరిధిలో చివరి దఫాలో ఎన్నికలు జరిగే మండలాల్లో పోరు ఆసక్తికరంగా మారింది. చిత్రవిచిత్ర పొత్తులే ఇందుకు కారణం. వేర్వేరుగానే.. కానీ ఒక్కటై.. తాజాగా మూడో విడతలో కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వీపనగండ్ల, చిన్నంబావి, పాన్గల్ మండలాల పరిధిలో మొత్తంగా 56 జీపీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మెజార్టీ స్థానాల్లో వేర్వేరుగానే.. కానీ ఒక్కటై అన్నట్లు బీఆర్ఎస్, బీజేపీ ఒక అవగాహనతో ఉమ్మడి అభ్యర్థులనే రంగంలోకి దింపాయి. గ్రామాల్లో బలాబలాల ప్రకారం సర్పంచ్ సీట్లు విభజన చేసుకుని.. ఆయా చోట్ల ఒకరికొకరు మద్దతుగా నిలుస్తూ ముందుకుసాగారు. ఇందుకు చిన్నంబావి మండలమే ఉదాహరణగా నిలుస్తోంది. ఈ మండలంలో 17 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇందులో బస్వాపురం జీపీ ఏకగ్రీవం కాగా.. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్ అయ్యాడు. గూడెం, బెక్కం, మియాపూర్, లక్ష్మీపల్లిలో సర్పంచ్లుగా బీజేపీకి చెందిన వారు.. మిగతా 12 గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు పోటీలో ఉన్నారు. పాన్గల్ మండలంలో బీఆర్ఎస్, బీజేపీ పొత్తుతో రేమద్దుల, చిక్కపల్లి, షాగాపూర్ పంచాయతీల్లో ఆయా అభ్యర్థులు సర్పంచ్లుగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తు చిత్తవుతుందా.. ఆ పొత్తు కాంగ్రెస్ను చిత్తు చేస్తుందా అనేది చర్చనీయాంశమైంది. మరోవైపు అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా స్వగ్రామమైన ఉండవెల్లి మండలం పుల్లూరులో కూడా చివరి విడతలో ఎన్నికలు జరనున్నాయి. అక్కడ ‘కారు’ దూసుకెళ్తుందా.. ‘హస్తం’ గాలి వీస్తుందా అనేది హాట్ టాపిక్గా మారింది. 2వ విడతలో నువ్వా.. నేనా.. రెండో విడతలో కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి మండలాల్లో 71 జీపీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ పైచేయి సాధించినా.. బీఆర్ఎస్ పోటాపోటీగా సర్పంచ్ స్థానాలను సాధించింది. హస్తం బలపరిచిన అభ్యర్థులు 36 మంది.. బీఆర్ఎస్ మద్దతుదారులు 29 మంది సర్పంచ్లుగా గెలుపొందారు. బీజేపీకి చెందిన ఇద్దరు.. స్వతంత్రులు మరో నలుగురు సర్పంచ్ పీఠాలను కై వసం చేసుకున్నారు. ఇందులో మండల కేంద్రాలైన పెద్దకొత్తపల్లి, పెంటవెల్లి జీపీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందగా.. కోడేరులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. పోలింగ్ జరుగుతున్న రోజు ఆ స్వతంత్ర అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. -
ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి
ఇటిక్యాల: ప్రజాస్వామ్య వ్యవస్ధలో కీలకమైన ఓటు హక్కును ప్రతిఒక్కరూ వినియాగించుకోవాలని శిక్షణ కలెక్టర్లు మనోజ్కుమార్ రెడ్డి, రాజ్ కుమార్ అన్నారు. సోమవారం స్ధానిక మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో మూడో విడత ఎన్నికల విధులకు హాజరయ్యే వివిధ శాఖల ఉద్యోగులకు ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి అక్కడ వసతులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగులు సర్పంచ్కు 37 ఓట్లు, వార్డ్ మెంబర్లకు 31 ఓట్లను వినియోగించుకున్నట్లు ఎంపీడీఓ అజార్ మొహియుద్దీన్ తెలిపారు. -
మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి
గద్వాల: జిల్లాలో మూడవ విడత పోలింగ్ ప్రక్రియకు సంబంధించి మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాలులో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఎన్నికల సాధారణ పరిశీలకులు గంగాధర్తో కలిసి మూడో విడత పోలింగ్ సిబ్బందికి సంబంధించి మూడో ర్యాండమైజేషన్ను విజయవంతమైనట్లు ఈ నెల 17వ తేదీన ఎన్నికలు జరిగే అలంపూర్, ఇటిక్యాల, మానవపాడు, ఉండవెల్లి, ఇటిక్యాల, ఎర్రవల్లి మండలాల్లో 700 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఏకగ్రీవాలు అనంతరం మిగిలిన 638 పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించినట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో 1,00,372 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. ఇందుకు సంబందించి అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో శ్రీకాంత్, ఈడీఎం శివ, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రచారానికి తెర
● ముగిసిన మూడో విడత ప్రచార పర్వం ● ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో మద్దతు పార్టీలు ● ఐదు మండలాల్లోని 75 పంచాయతీలు, 700 వార్డుల్లో ఎన్నికలు ● రేపటి పోలింగ్కు అధికార యంత్రాంగం సన్నద్ధం అలంపూర్: పంచాయతీ పోరులో మూడో విడత ప్రచారానికి తెర పడింది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నువ్వా నేరా అన్నట్లుగా సర్పంచ్, వార్డుసభ్యులు ప్రచారంలో పోటీపడ్డారు. ప్రచార పర్వంలో చివరి రోజైన సోమవారం అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా ఎక్కువ మంది ఓటర్లను కలిసి ఓటును అభ్యర్థించారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సోమవారం ప్రచారానికి గడువు ముగిసింది. అనంతరం ఎన్నికల అధికారుల అదేశాలు, పోలీసుల సూచనల మేరకు సాయంత్రం 5 గంటలకు తమ ప్రచారాన్ని ముగించారు. గత కొన్ని రోజులుగా ప్రచారంతో సందడిగా మారిన గ్రామాలు సమయం ముగియడంతో ఒక్కసారిగా నిశబ్ద వాతావరణంలోకి వెళ్లాయి. ప్రచార పర్వంలో ప్రసన్నం చేసుకున్న ఓటర్లు చేదాటకుండా అభ్యర్థులు ప్రయత్నాలు మొదలెట్టారు. 75 పంచాయతీలకు ఎన్నికలు జిల్లాలో మూడో విడత ఎన్నికల్లో ఐదు మండలాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అలంపూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అలంపూర్ మండలంలోని 14 గ్రామ పంచాయతీలు, 120 వార్డులు, ఉండవెల్లిలో 15 జీలు, 142 వార్డులు, మానవపాడులో 17 జీపీలు, 164 వార్డులు, ఇటిక్యాలలో 14 జీపీలు, 130 వార్డులు, ఎర్రవల్లి మండలంలో 15 జీపీలు, 144 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 3వ తేదీ నుంచి 5 వరకు నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్ల అమోదం, పరిశీలన అనంతరం 9న నామినేషన్ల ఉపసంహరణ ముగించారు. 9న పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. అప్పటి నుంచి అభ్యర్థులు 6 రోజులపాటు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పోటా పోటీగా ప్రచారం నిర్వహించారు. మూడో విడతలో 75 పంచాయతీలు, 700 వార్డులకు ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేశారు. నామినేషన్ల స్వీకరణ, నామినేషన్ల ఉపసంహరణ వరకు 7 గ్రామ పంచాయతీలు, 136 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ప్రస్తుతం 68 గ్రామ పంచాయతీలు, 564 వార్డులకు ఈ నెల 17వ తేదీన పోలింగ్ జరగనుంది. ప్రచారం పర్వం ముగియడంతో అధికారులు పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పోలీసులు సైతం ప్రచార సమయం ముగిసిన తర్వాత గ్రామాల్లో పర్యటించారు. ఎన్నికల నిబంధనల మేరకు సమయం ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం చేయరాదని ప్రజలకు అవగాహన కల్పించారు. -
బీమా రంగంలో ఎఫ్డీఐ పరిమితి పెంపు అనవసరం
గద్వాలన్యూటౌన్: బీమా రంగంలో ఎఫ్డీఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) పెంపు అనవసరమని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ) బ్రాంచ్ కార్యదర్శి బంగి రంగారావు అన్నారు. సోమవారం గద్వాల ఎల్ఐసీ బ్రాంచ్ ఆవరణలో విలేఖర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2025 డిసెంబర్12న కేంద్ర ప్రభుత్వం ప్రో క్యాపిటెల్ ఆర్థిక సంస్కరణలకు ఆమోదం తెలిపిందని, ఇందులో బాగంగా బీమా రంగంలో ఎఫ్డీఐ పరిమితిని వంద శాతానికి పెంచడంతో పాటు బీమా చట్టాల (సవరణ) కూడా ఉందన్నారు. అయితే 1999లో ఐఆర్డీఏ బిల్లును ఆమోదించడం ద్వార బీమా రంగాన్ని జాతియీకరణ నుంచి విముక్తి చేశారని చెప్పారు. అప్పటి నుంచి విదేశీ భాగస్వాములతో కూడిన అనేక ప్రైవేట్ బీమా సంస్థలు జీవిత బీమా, సాధారణ బీమా రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. ఈసంస్థలకు వ్యాపారం నిర్వహించడానికి మూలధనం సమస్య కాలేదన్నారు. వాస్తవానికి బీమా రంగంలో వినియోగిస్తున్న మొత్తం మూలధనంలో ఎఫ్డీఐ వాటా సుమారు 32శాతం మాత్రమే అని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీమా రంగంలోఎఫ్డీఐ పరిమితిని వంద శాతానికి పెంచచి మూలధనానికి సంపూర్ణ స్వేచ్ఛ ఇవ్వడం మంచి నిర్ణయం కాదన్నారు. ఈ నిర్ణయం బీమా సంస్థలపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తుందని చెప్పారు. దీనివల్ల బీమారంగం క్రమబద్దంగా అభివృద్ధి చెందకుండా, లాభాలపై మాత్రమే దృష్టి కేంద్రీకృతమవుతుందని, ప్రజలకు, వ్యాపార రంగానికి అవసరమైన భద్రత అందించడంలో వెనకబడుతుందన్నారు. కార్పొరేట్ పక్షపాతంతో కూడిన ఆర్థిక విధానాల నుంచి ప్రజా కేంద్రీకృత విధానాల వైపు ప్రభుత్వం మళ్లాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాఘవేంద్ర, ఉదయ్ కుమార్, సూరజ్, లక్ష్మీకాంత్, కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు. -
ఓటర్లకు తాయిలాలు..
● పోలింగ్కు ఒక్కరోజే సమయం ● ప్రలోభాలకు తెరలేపిన సర్పంచ్, వార్డు అభ ్యర్థులు ● రాత్రికి రాత్రే కాలనీల్లో గ్రామాల్లో మద్యం, డబ్బులు పంపిణీ గద్వాలటౌన్: పోలింగ్కు ఒక్క రోజే సమయం ఉండడంతో సర్పంచ్, వార్డుసభ్యులు ప్రలోభాలకు తెరలేపారు. ఓటర్లకు తాగినంత మద్యం పోస్తూ.. అడిగినన్ని డబ్బులు ఇస్తున్నారు. ప్రస్తుతం ఓటరు చొప్పున విడదీస్తూ రూ.500 నుంచి రూ.2000 వరకు చెల్లిస్తూ వారి ఓట్లను ఆశిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలోని ఓటర్లను ఆకట్టుకునేందుకు నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. రాత్రికి రాత్రే కాలనీల్లో రహస్యంగా పర్యటిస్తూ మద్యం, డబ్బులను విచ్చలవిడిగా ఓటర్లకు అందిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల వాతావరణంలో ఓటర్లు సైతం నాయకులు, కార్యకర్తలను తమ ఇష్టాలకు ఉపయోగించుకుంటున్నారు. తమ ఇంట్లో ఇన్ని ఓట్లు ఉన్నాయంటూ అభ్యర్థులను నమ్మిస్తూ డబ్బులు ఆశిస్తున్నారు. అభ్యర్థులు సైతం అడిగిందే తడవుగా వేలాది రూపాయలు గుప్పిస్తున్నారు. డబ్బులు, మద్యంతో పాటు కాలనీల్లో యువకులకు అవసరమయ్యే క్రికెట్ కిట్లు, ఇతర వస్తు సామగ్రిని అభ్యర్థుల నుంచి బలవంతంగా అడిగి పుచ్చుకుంటున్నారు. మహిళలకు ఇంటికి వెళ్లి చీరలను అందజేశారు. ఓట్లను ఆశిస్తున్న నాయకులు సైతం కాదనకుండా అందిస్తున్నారు. 17న జిల్లాలో మూడో విడత ఎన్నికలు జరిగే ఐదు మండలాల్లో భారీగా ఓటర్లకు మద్యం అందజేసేందుకు.. రహస్యంగా మద్యం నిల్వలను ఇప్పటికే ఏర్పాటు చేసి పంపిణీ చేశారు. దాదాపు అన్ని గ్రామాలలో ‘ఓటుకు నోటు’ అనే సంప్రదాయం కొనసాగుతోంది. డబ్బులు, మద్యాన్ని వివిధ పార్టీల అభ్యర్థులు ఎర చూపుతుండటంతో కార్యకర్తల్లో కూడా డబ్బులు సందడి స్పష్టంగా కనిపిస్తోంది. ఫోన్లతో ఉక్కిరిబిక్కిరి.. ఇదిలా ఉండగా నాయకుల ఫోన్లు బిజీగా మారాయి. ఒక్కో గ్రామం నుంచి ఛోటా మోటా నేతలు, కార్యకర్తలు, వివిధ సంఘాల నాయకుల నుంచి వచ్చే ఫోన్లతో అభ్యర్థులు ఉక్కిరి బిక్కిరయ్యారు. ‘అన్నా ఇప్పుడే అవతలి పార్టీకి సంబంధించిన వారు వచ్చి ఇక్కడ డబ్బు పంచారు..’ ‘అన్నా ఫలానా వారికి మందు సీసాలు సఫ్లై చేయాలి’ అన్న వార్తలతో నేతల ఫోన్లు నిర్విరామంగా మోగాయి. -
ఇంటికే ‘పోల్ చీటీ’
● ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు ● బీఎల్ఓల ద్వారా నేరుగా ఓటర్లకు అందజేత వనపర్తి: పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ఓటర్లకు పోలింగ్ సిప్ల్లను అందజేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు నేరుగా పోల్ చీటీలు అందజేస్తున్నారు. ఈ నెల 17న మూడో విడత ఎన్నికలు జరగనున్న అలంపూర్, ఉండవెల్లి, మానవపాడు, ఇటిక్యాల, ఎర్రవల్లి మండలాల్లో మరో రెండు రోజుల్లో పూర్తిచేసేలా కార్యాచరణ సిద్ధం చేసిన యంత్రాంగం ఈ దిశగా ముందుకు సాగుతోంది. నిరక్షరాస్యులు.. వృద్ధులు ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోల్ చీటీలు దోహదపడుతాయి. వీటిని గతంలో రాజకీయ పార్టీలే ముంద్రించి ఎన్నికలకు ముందు రోజున ప్రచారం చేసుకుంటూ ఓటర్లకు అందించేవారు. అయితే వీరు ఓటర్లు అందరికీ ఇచ్చేవారు కాదు. దీంతో తమ పోలింగ్ కేంద్రం ఎక్కడుందో తెలియక ఓటర్లు పోలింగ్ రోజున ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ముఖ్యంగా నిరక్షరాస్యులు, వృద్ధులు ఎక్కువగా సతమతమయ్యేవారు. ఈ క్రమంలో ఓటర్లు సులువుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘమే పోల్ చీటీలను అందజేస్తోంది. ఓటర్లు ఇళ్లలో లేకుంటే.. సిబ్బంది ఇళ్లకు వెళ్లిన సమయంలో లేనివారి పోల్ స్లిప్లు పోలింగ్ రోజున సంబంధిత పోలింగ్ కేంద్రం వద్ద అందుబాటులో ఉంచుతారు. వారితోపాటు చిరునామాలో లేనివారివి, డూప్లికేట్లుగా భావించిన వారివి అందుబాటులో ఉంటాయి. అక్కడ తగిన ఆధారం చూపి పోల్ చీటీ తీసుకోవచ్చు. పోల్ చీటీ లేకపోయినా ఎన్నికల సంఘం పేర్కొన్న 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక దానిని చూపించి ఓటరు జాబితాలో పేరుంటే ఓటరు వేయవచ్చు. -
ప్రాతఃకాల మంగళహారతి వేళలు మార్పు
అలంపూర్: దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాల్లో ప్రాతఃకాల మహా మంగళ హారతి వేళలు మార్పు చేస్తున్నట్లు ఆలయ ఈఓ దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. ధనుర్మాసం ఈ నెల 17వ తేదీన ప్రారంభమై 2026 జనవరి 14 న ముగుస్తుందని, దీంతో ధనుర్మాసంలో ప్రాతఃకాల మహా మంగళ హారతి వేళలు మార్పు చేస్తునట్లు తెలిపారు. జోగుళాంబ అమ్మవారి ఆలయంలో ప్రాతః కాల మహా మంగళ హారతి ఉదయం 6.30 గంటలకు ఉందని.. ఆ సమయాన్ని 5.30 గంటలకు మార్పు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా శ్రీబాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలోనూ ప్రాతఃకాల మహా మంగళహారతిని ఉదయం 6 గంటల నుంచి 5.45గా మార్పు చేసినట్లు తెలిపారు. క్షేత్రానికి వచ్చే భక్తులు ఈ మార్పులను గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
గ్రామాలు పోటెత్తాయి..!
● 2వ విడతలోనూ భారీగా పోలింగ్ ● 87.08 ఓటింగ్ శాతంతో మళ్లీ గద్వాల జిల్లానే టాప్ ● అత్యల్పంగా నాగర్కర్నూల్లో 84 శాతం.. మేకలసోంపల్లిలో సర్పంచ్ జయరాములతో కలిసి నాయకుల సంబరాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రెండో విడత పల్లె పోరులోనూ ఓటర్లు పోటెత్తారు. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో 26 మండలాల పరిధిలోని 26 గ్రామాల్లో ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవం పోనూ మిగిలిన జీపీలకు నిర్వహించిన పోలింగ్లో మొత్తంగా 85.80 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. చలి నేపథ్యంలో నామమాత్రంగానే ఓటర్లు వచ్చారు. రెండు గంటల తర్వాత ఓటర్ల రాక ఊపందుకుంది. 11.30 గంటల తర్వాత ఒకేసారి భారీ ఎత్తున ఓటర్లు రావడంతో పోలింగ్ కేంద్రాలు కిక్కిరిశాయి. కొన్ని చోట్ల ఒంటి గంట దాటినా పోలింగ్ కొనసాగింది. నిర్ణీత సమయంలోపు కేంద్రాలకు వచ్చి క్యూలో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఇచ్చారు. 84 శాతం.. ఆపైనే.. ఉమ్మడి జిల్లాలో 2వ విడతకు సంబంధించి సగటున 85.80 శాతం పోలింగ్ నమోదైంది. నాగర్కర్నూల్ జిల్లాలో పోలింగ్ శాతం 84 కాగా.. మిగిలిన అన్ని జిల్లాల్లోనే అంతకు పైగానే నమోదైంది. తొలి విడతలోటాప్ స్థానంలో నిలిచిన జోగులాంబ గద్వాల 87.08 శాతంతో మళ్లీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వనపర్తి 87, మహబూబ్నగర్ 86.62, నారాయణపేట జిల్లాలో 84.33 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులతో పోలిస్తే అన్ని జిల్లాల్లోనూ మహిళల ఓటింగ్ శాతం తక్కువగా ఉంది. -
చెయ్యెత్తిన పల్లెలు..
మహబూబ్నగర్: 98 కాంగ్రెస్.. 39 బీఆర్ఎస్ జిల్లాలోని 151 జీపీల్లో రెండో విడతలో పోలింగ్ జరిగింది. మహబూబ్నగర్ నియోజకవర్గంలోని హన్వాడ, దేవరకద్రలోని సీసీకుంట, కౌకుంట్ల దేవరకద్ర.. జడ్చర్లలోని మిడ్జిల్.. నారాయణపేటలోని కోయిల్కొండ మండలాల పరిధిలో 98 మంది కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్లుగా విజయం సాధించారు. 39 జీపీల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీకి చెందిన ఎనిమిది మంది, ఆరు చోట్ల ఇతరులు సర్పంచ్ పీఠాలను కై వసం చేసుకున్నారు. నారాయణపేట : కాంగ్రెస్దే పైచేయి.. జిల్లాలోని ఈ నియోజకవర్గ పరిధిలో దామరగిద్ద, ధన్వాడా, నారాయణపేట, మరికల్ మండలాల్లో 95 పంచాయతీలకు పోలింగ్ నిర్వహించారు. 52 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు.. 18 పంచాయతీల్లో బీఆర్ఎస్, 13 జీపీల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. 12 గ్రామాల్లో ఇతరులు సర్పంచ్ పీఠాన్ని దక్కించుకున్నారు. -
ప్రశాంతంగా రెండోవిడత పోలింగ్
గద్వాల: జిల్లాలో రెండు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో జరిగిన రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ప్రక్రియను ఆదివారం కలెక్టర్ బీఎం సంతోష్ ఉదయం 7గంటలకు వెబ్కాస్ట్ ద్వారా అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన పలు పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. రెండో విడతలో భాగంగా మల్దకల్, రాజోలి, వడ్డేపల్లి, అయిజ మండలాల్లో మొత్తం 57 గ్రామపంచాయతీలకు పోలింగ్ జరిగింది. మొత్తం 567 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాయు. మొత్తం 1,12,807 మంది ఓటర్లకుగాను 57,094 మహిళలు, 55,710 పురుషులు ఉన్నారు. వీరిలో 49,145 మహిళాళ ఓటర్లు, 49,086 మంది పురుష ఓటర్లు, ముగ్గురు థర్డ్జెండర్ ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 87.08శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు రాజోళి/మల్దకల్: స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టామని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. రాజోళి, వడ్డేపల్లి, మల్దకల్ మండలాల్లో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ బీఎం సంతోష్తోపాటు ఎస్పీ పరిశీలించారు. ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు, సభలు, ఊరేగింపులు చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఎన్నికల కోడ్ ఇంకా అమలులోనే ఉందని తెలిపారు. అల్లరి మూకలపై ప్రత్యేక నిఘా ఉందని, ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోట చేసుకున్నా, వారిపై కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. సమస్యాత్మక గ్రామాలపై డేగ కన్ను ఉంచినటు తెలిపారు. అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఏఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య పాల్గొన్నారు. -
‘స్వగ్రామాలే’ సవాల్..!
● ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విపక్షాలు ● జడ్చర్ల, వనపర్తి ఫలితాలతో ‘అధికార’ నేతల్లో కలవరం ● స్వీయ పర్యవేక్షణతోపాటు వేగుల ద్వారా పావులు ● ఎత్తులకు పైఎత్తులతో రసవత్తరంగా మారిన పోరు ఆదివారం శ్రీ 14 శ్రీ డిసెంబర్ శ్రీ 2025–8లో uజడ్చర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న జనంపల్లి అనిరుధ్రెడ్డి సొంతూరు రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడెంలో సర్పంచ్గా బీజేపీ మద్దతుదారు కాటేపాట రేవతి విజయం సాధించారు. తొలుత ఆమెకు ఆరు ఓట్ల మెజార్టీ రాగా.. రీకౌంటింగ్లో ఆధిక్యం 31కి పెరిగింది. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సొంతూరు ఖిల్లాఘనపురం మండలంలోని సల్కెలాపురంలో బీఆర్ఎస్ బలపరిచిన గుళ్ల గిరమ్మ ఏడు ఓట్ల తేడాతో సర్పంచ్గా గెలుపొందారు. ..ఇలా తొలి విడత సం‘గ్రామంశ్రీలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు అధికార కాంగ్రెస్ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో చతికిలపడ్డ బీఆర్ఎస్ పంచాయతీ పోరులో అనూహ్యంగా పుంజుకోవడం వారిని కలవరానికి గురిచేస్తోంది. రచ్చ గెలిచినా.. ఇంట గెలవకపోతే పరువు పోతుందని బెంబేలెత్తుతున్నారు. విపక్షాలు ఆయా నియోజకవర్గాల ముఖ్య ప్రజాప్రతినిధుల సొంతూళ్లే లక్ష్యంగా పావులు కదుపుతుండగా.. ఆ నాయకులకు గెలుపు సవాల్గా మారింది. దీంతో తమ తమ పల్లెలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆయా నేతల స్వగ్రామాల్లో నెలకొన్న పోరు పరిస్థితులపై ‘సాక్షి’ కథనం.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ తూడుకుర్తి: నువ్వా.. నేనా.. ప్రభావిత వర్గాలు.. బోయ, ఎస్సీ, ముస్లిం, ముదిరాజ్, ఉప్పరి మహిళలు 2,706 పురుషులు 2,658 మొత్తం ఓటర్లు 5,364 నాగర్కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్రెడ్డి, ఆయన తండ్రి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి స్వగ్రామం తూడికుర్తి. నాగర్కర్నూల్ మండలంలోని ఈ గ్రామ సర్పంచ్ పదవి అన్రిజర్వ్డ్ మహిళకు కేటాయించారు. ఇక్కడ రెండో విడతలో ఎన్నికలు జరుగుతుండగా.. మొత్తంగా సర్పంచ్ పీఠానికి ఎనిమిది మంది పోటీపడుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ బలపరిచిన లక్ష్మీ, బీఆర్ఎస్ మద్దతుదారు విమల మధ్యనే పోటీ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తొలి నుంచీ ఈ గ్రామం కూచుకుళ్ల కుటుంబానికి కంచుకోట. ప్రస్తుతం ఈ కుటుంబానికి నమ్మకస్తుడిగా పేరొందిన కరుణాకర్రెడ్డి భార్య లక్ష్మీ కాగా.. ఎమ్మెల్సీ దామోదర్రెడ్డికి గతంలో ప్రధాన అనుచరుడిగా ఉన్న నర్సింహారెడ్డి భార్య విమల. నర్సింహారెడ్డి గతంలో ఒకమారు ఎంపీపీ, గ్రామ సర్పంచ్గా పనిచేశారు. దామోదర్రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరగా.. ఆయన ‘కారుశ్రీలోనే ఉండిపోయారు. ప్రస్తుతం లక్ష్మీ, విమల మధ్యే పోరు నువ్వా.. నేనా అన్నట్లు కొనసాగుతోంది. ముస్లింలు, ఎస్సీల్లో ఎక్కువగా కాంగ్రెస్కు మద్దతుగా నిలుస్తుండగా.. మిగతా బీసీ సామాజిక వర్గాలు రెండు పార్టీలకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల సొంతూళ్లలో పోటాపోటీ -
ధన్వాడ: అత్తాకోడళ్ల మధ్యే..!
నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ సొంతూరు ధన్వాడ. మండలకేంద్రమైన ఈ గ్రామ సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ రెండో విడతలో జరుగుతున్న ఎన్నికల్లో సర్పంచ్లుగా కాంగ్రెస్ మద్దతుదారు చిట్టెం జ్యోతి, బీజేపీ బలపరిచిన పంది జ్యోతి, బీఆర్ఎస్కు చెందిన గుండు శ్రీదేవి బరిలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మద్దతుదారులైన చిట్టెం జ్యోతి, పంది జ్యోతి మధ్యే పోరు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. హస్తం మద్దతుతో బరిలో నిలిచిన చిట్టెం జ్యోతి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందగా.. ఆమెను చిట్టెం రాఘవేందర్రెడ్డి వివాహమాడారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తోందంటూ బీజేపీ ముమ్మర ప్రచారం నిర్వహించింది. తానూ ఈ గ్రామవాసినేనని.. బీసీ బిడ్డనేనని.. పదేళ్ల క్రితమే తమకు వివాహమైందంటూ చిట్టెం జ్యోతి విస్తృత ప్రచారం చేశారు. ఎక్కువ శాతం ఉన్న ముస్లింలు కాంగ్రెస్ వైపు నిలుస్తుండగా.. పద్మశాలి, కుర్వ, ఎస్సీలు బీజేపీకి మద్దతుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరువురూ తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.ప్రభావిత వర్గాలు.. పద్మశాలి, ఎస్సీ, ముదిరాజ్, ముస్లిం, కుర్వ, గౌడ, బోయ వాల్మీకి, రెడ్డి పురుషులు 4,034 మహిళలు 4,293 మొత్తం ఓటర్లు 8,327 -
దమగ్నాపూర్: ఇద్దరూ.. ఇద్దరే
దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి సొంత గ్రామమైన చిన్నచింతకుంట మండలంలోని దమగ్నాపూర్ సర్పంచ్ అన్రిజర్వ్డ్ మహిళకు కేటాయించారు. ఈ పంచాయతీలో కాంగ్రెస్ మద్దతుదారు భారతమ్మ.. బీఆర్ఎస్ బలపరిచిన ఇ.పావని సర్పంచ్గా బరిలో నిలిచారు. వ్యవసాయం చేసుకుంటూ అందరితో మమేకమై ఉండే బాలకృష్ణారెడ్డి భార్య భారతమ్మ కాగా.. కిరాణం కొట్టు నడిపిస్తూ గ్రామ ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న కృష్ణయ్య శెట్టి భార్య పావని. ఈ ఇద్దరి మధ్యనే గట్టి పోరు నెలకొంది. భారతమ్మకు అధికార పార్టీ అండదండలు ఉండడం.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు మొగ్గు చూపడం ఆమెకు ప్లస్గా మారే అవకాశం ఉంది. అదేవిధంగా పావనికి బోయ సామాజిక వర్గం మద్దతుగా నిలుస్తుండడంతో పాటు ప్రచారం హోరు కొనసాగించడం కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఎస్సీలు, యాదవులు ఇరు పార్టీల్లో ఉండగా.. వారు ఎటు వైపు మొగ్గు చూపితే అటు వైపు విజయా వకాశాలు ఉన్నట్లు తెలు స్తోంది. -
‘రెండో’ పోరుకు రెడీ
నేడు 2 విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ● ఉమ్మడి జిల్లాలో 45 మంది సర్పంచ్లు, 1,004 వార్డు స్థానాలు ఏకగ్రీవం ● 520 జీపీలు.. 4,202 వార్డులకు పోలింగ్ ● అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రెండో విడత పంచాయతీ పోరు తుది ఘట్టానికి చేరుకుంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాల్లో 26 మండలాల పరిధిలో 565 గ్రామ పంచాయతీలు, 5,212 వార్డులకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. 45 జీపీలు ఏకగ్రీవం పోనూ 520 సర్పంచ్.. 1,004 ఏకగ్రీవం పోనూ 4,202 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల విధులు నిర్వర్తించనున్న ప్రభుత్వ సిబ్బందికి శనివారం పోలింగ్ సామగ్రిని అందజేశారు. రెండో విడతలో ఇలా.. 520 సర్పంచ్లకు 1,709 మంది పోటీ.. ఉమ్మడి జిల్లాలో పోలింగ్ జరగనున్న 520 జీపీల్లో 1,709 మంది అభ్యర్థులు సర్పంచ్లుగా పోటీపడుతున్నారు. సగటున ఒక్కో స్థానానికి ముగ్గురు బరిలో నిలిచినట్లు తెలుస్తోంది. అదేవిధంగా 4,202 వార్డు స్థానాలకు 10,826 మంది బరిలో నిలిచారు. ఈ లెక్కన ఒక్కో స్థానానికి సగటున అటుఇటుగా ముగ్గురు పోటీపడుతున్నట్లు స్పష్టమవుతోంది. సర్పంచ్ పదవులకు సంబంధించి ప్రధానంగా గద్వాల, మహబూబ్నగర్, వనపర్తిలో ఇద్దరికి మించి అభ్యర్థులు నువ్వా, నేనా అన్నట్లు ప్రచారంలో దూకుడుగా వ్యవహరించగా.. ఆయా జిల్లాల్లో పలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి
అయిజ/మల్దకల్/రాజోళి: రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం అయిజ, మల్దకల్లో ఎన్నికల విధులకు హాజరయ్యే పోలీసులతో సమావేశమయ్యారు. ఓటింగ్ సమయంలో గుంపులుగా కేంద్రాల్లోకి అనుమతించవద్దని, పోలింగ్ కేంద్రం సమీపంలో దుకాణాలు మూసివేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ బూత్లలో భద్రత, రూట్ ఇన్చార్జీ, రూట్ మొబైల్టీంలు, క్యూఆర్టీ, స్పెషల్ ఫోర్స్ బృందాలు చేపట్టాల్సిన పనులను స్పష్టంగా వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదే విధంగా అభ్యర్థులు, ఏజెంట్లు, రాజకీయ కార్యకర్తల ఒత్తిడులకు ప్రలోభాలకు లోనుకాకుండా పూర్తి నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు. చిన్న గొడవలైనా నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించి శాంతిభద్రతలకు భంగం లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల భద్రతే మన ప్రధాన ధ్యేయమని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలను అణిచి వేయాలన్నారు. డీఎస్పీ మొగులయ్య, సీఐ టంగుటూరి శ్రీను, ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలి ఎన్నికల విధుల్లో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని, కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని ఏఎస్పీ శంకర్ అన్నారు. రాజోళి, వడ్డేపల్లి మండలాల్లో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్బంగా ఓటింగ్ మొదలుకుని కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఎలాంటి కార్యచరణను అమలు చేయాలనే అంశాలపై వడ్డేపల్లి, రాజోళి మండలాల పోలీస్ సిబ్బందికి అవగాహన కల్పించారు. పోలింగ్ కేంద్రాల వద్ద తనిఖీలు చేశాకే లోపలకు అనుమతించాలని సూచించారు. -
పెద్ద దగడ: విద్యావంతుడు, స్థానికత మధ్యే పోటీ..
పురుషులు 1,071 మహిళలు 1,021 మొత్తం ఓటర్లు 2,092ప్రభావిత వర్గాలు.. యాదవులు, ఎస్సీలు, మంగలి, తెలుగు, బోయ, గౌడ, రెడ్డి రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వగ్రామం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని పెద్దదగడ గ్రామ సర్పంచ్ అన్రిజర్వ్డ్కు కేటాయించారు. మూడో విడతలో జరగనున్న ఎన్నికల్లో సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన ఉడుతల భాస్కర్ యాదవ్, బీఆర్ఎస్ మద్దతుదారు గొంది నిరంజన్ రెడ్డి తలపడుతున్నారు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న భాస్కర్ యాదవ్ రాజకీయ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. నిరంజన్రెడ్డి స్థానిక నాయకుడు కాగా.. గతంలో వార్డు సభ్యుడిగా, ఉప సర్పంచ్గా పనిచేశాడు. స్థానికత, సానుభూతి కలిసి వస్తుందని.. గతంలో గ్రామ అభివృద్ధి కోసం పనిచేశానని, అదే తనను గెలిపిస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు. విద్యావంతుడిగా తనకు అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధికి పాటుపడతానని భాస్కర్ యాదవ్ విస్తృత ప్రచారం నిర్వహించారు. మెజార్టీగా ఉన్న యాదవ సామాజికవర్గం ఓట్లు తనకు లాభిస్తాయని.. తన గెలుపు ఖాయమని ఆయన నమ్మకంగా ఉన్నారు. -
120 సీట్లు.. 7,115 విద్యారు్థలు
గద్వాలటౌన్: నవోదయ విద్యాయాల్లో ప్రవేశం కోసం ఎంతోమంది విద్యార్థులు కష్టపడుతుంటారు. తల్లిదండ్రులు సైతం ఆ దిశగా పిల్లలను ప్రోత్సహిస్తుంటారు. గ్రామీణ, పట్టణం తేడా లేకుండా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని నవోదయలో చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఉమ్మడి మహబుబ్నగర్ జిల్లా (రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కొన్ని మండలాలు)లో నవోదయ ప్రవేశాలకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 29 కేంద్రాలలో 7,115 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయనున్నారు. అంటే 120 సీట్లకు అంత మంది పోటీ పడాల్సి వస్తోంది. డిసెంబర్ 13న నవోదయ ప్రవేశ పరీక్ష జరగనుంది. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. గంట ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. అరగంట ముందు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. రెండు విద్యాలయాలలో.. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరిగిన నేపథ్యంలో కొత్త నవోదయ విద్యాలయాలు వస్తే పోటీ తగ్గి ఎక్కువమంది విద్యార్థులకు అవకాశం వస్తుందని అనేకమంది ఎదురుచూశారు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం గతేడాది మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో కొత్త నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందుకోసం మహబూబ్నగర్ శివారులో స్థల పరిశీలన చేశారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేసి తరగతులు కొనసాగిస్తున్నా రు. అందులో 40సీట్లను భర్తీ చేశారు. వట్టెం జవహ ర్ నవోదయ విద్యాలయంలో 80సీట్లు ఉన్నాయి. మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న 120సీట్ల కోసం విద్యార్థులు పోటీ పడుతున్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల మోత.. అర్హులైన అధ్యాపకుల లేమి.. తదితర సమస్యలు పూర్తిస్థాయి లో నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో ప్ర వేశాలకు నిర్వహించే అర్హత పరీక్షలో ఒకసారి ప్రవే శం లభిస్తే 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూ ర్తయ్యే వరకు అందులోనే నాణ్యమైన విద్య అందు తుంది. క్రీడలకూ ఇక్కడ ప్రాధాన్యం ఇస్తారు. వస తి, భోజనం, పుస్తకాలు, స్టేషనరీ, ఏకరూప దుస్తు లు తదితర అన్నీ కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది. నాణ్యమైన విద్య.. నవోదయలోప్రవేశాలకు డిమాండ్ ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు నేడే ప్రవేశ పరీక్ష -
జనరల్లో బీసీల హవా!
మొత్తంగా 41.82 శాతం.. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాలోని 24 మండలాల్లో తొలి విడతలో మొత్తం 550 సర్పంచ్, 4,840 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి జిల్లాలో మొదటి దఫాకు సంబంధించి 237 అన్రిజర్వ్డ్ (జనరల్, మహిళ కలిపి) సర్పంచ్ స్థానాల్లో 116 మంది బీసీ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో పాటు 114 బీసీ రిజర్వ్ (బీసీ జనరల్, బీసీ మహిళ కలిపి) స్థానాల్లో ఆయా వర్గాలకు చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తంగా 550 సర్పంచ్లకు గాను 230 మంది (41.82 శాతం) బీసీలు ఎన్నికయ్యారు. తొలివిడతలోసర్పంచ్లుగా విజయం 237 అన్రిజర్వ్డ్ స్థానాల్లో 116 మంది జయకేతనం మొత్తంగా 550 పంచాయతీల్లో 230 మంది గెలుపు బీసీలు పోటీలో ఉన్న జనరల్ స్థానాలపై సంఘాల ప్రత్యేక నజర్ ఆయా అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం -
ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలి
ఎర్రవల్లి: సాంప్రదాయ వంటలతోనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని.. విద్యార్థులు ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని పదో బెటాలియన్ కమాండెంట్ జయరాజు అన్నారు. శుక్రవారం మండలంలోని పదో బెటాలియన్ సాయుధ చైతన్య పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించగా.. కమాండెంట్ హాజరై ఫుడ్ ఫెస్టివల్లో 170మంది విద్యార్థులు ప్రదర్శించిన 80 రకాల ఆరోగ్యకరమైన వంటకాలను సిబ్బందితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకతను, సామూహిక చైతన్య భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆరోగ్యకరమైన ఆహారవు అలవాట్లను అలవర్చుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. పాఠశాలలో ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించడం వల్ల విద్యార్థులలోని ప్రతిభను వెలికితీస్తూ, వారికి ఆనందాన్ని ఇచ్చే వేదికలుగా పనిచేస్తాయని అన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ పాణి, ఆర్ఐలు ధర్మారావు, నరసింహరాజు, పాఠశాల ప్రిన్సిపల్ షేక్షావలి, అధికారులు, ఉపాద్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
మూడో విడత ర్యాండమైజేషన్ పూర్తి
గద్వాల: గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది కేటాయింపు కోసం మూడో ర్యాండమైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఎన్నికల పరిశీలకుడు గంగాధర్తో కలిసి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ నెల 14వ తేదీన అయిజ, మల్దకల్, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లో మొత్తం 716 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఇందులో ఏకగ్రీవాలు మినహాయించి మిగిలిన 567 పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించడం జరిగిందన్నారు. 2వ విడత ఎన్నికల్లో 1,34,601 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల విధుల నిర్వహణ విజయవంతంగా నిర్వహించేందుకు సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బంది వివరాలను సంబంధిత మండలాల తహసీల్దార్లకు వెంటనే అందజేయాలన్నారు. కార్యక్రమంలో డీపీవో శ్రీకాంత్, జెడ్పీ డిప్యూటీ సీఈవో నాగేంద్రం, ఈడీఎం శివ తదితరలు పాల్గొన్నారు. -
తగ్గిన ఏకగ్రీవాలు..!
● జిల్లాలో 40 సర్పంచ్, 719 వార్డులు ఏకగ్రీవం ● 2019 పంచాయతీ ఎన్నికల కంటే 6 స్థానాలు తగ్గిన వైనం ● ప్రత్యేక నిధుల కేటాయింపులో ప్రభుత్వాల నిర్లక్ష్యం ● విధిలేక ఎన్నికల బరిలోకి అభ్యర్థులు అలంపూర్: గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పడం.. ఎన్నికల వ్యయాన్ని గ్రామ అభివృద్ధికి వెచ్చించడం.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలంతా స్నేహపూర్వకంగా కలిసి మెలిసి ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వాలు ఏకగ్రీవాలను ప్రొత్సహిస్తుంటాయి. అందుకు తగ్గట్టుగానే స్థానిక సంస్థల్లో పంచాయతీల ఏకగ్రీవాలు పెరిగాయి. కానీ ప్రభుత్వాలు గ్రామీణ ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధికి బాటలు వేయడం లేదు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రత్యేకంగా కేటాయించాల్సిన నిధులు సైతం పైసా ఇవ్వలేదు. దీంతో రాను రాను పంచాయతీ ఎన్నికల సమరం హోరెత్తుతుంది. గతేడాది పంచాయతీ ఎన్నికలతో పోల్చితే ఈ సారి జరుగుతున్న ఎన్నికల్లో ఏకగ్రీవాల సంఖ్య ఘణనీయంగా తగ్గింది. గతంలో ఏకగ్రీమైన పంచాయతీలో ఈ సారి రసవత్తర పోరు సాగుతుంది. మిగిలిన చోట అదే పరిస్థితి నెలకొంది. దీంతో జిల్లాలో ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికల్లో 40 గ్రామ పంచాయతీలు, 719 వార్డులు మాత్రమే ఏకగ్రీవం అయ్యాయి. అభివృద్ధి కాంక్షించి.. ఏకగ్రీవం వైపు అడుగులు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి విడత పోలింగ్ ముగిసింది. ఇంకా రెండు, మూడో విడత పోలింగ్ జరగనుంది. ఇదిలాఉండగా, కొన్ని గ్రామాల్లో ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ఏకగ్రీవం వైపు మొగ్గుచూపారు. మొదటి విడతలో గద్వాల మండలంలో కుర్వపల్లి, ఈడుగోనిపల్లి, ముల్కపల్లి జీపీలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే, ధరూరు మండలంలో ర్యాలంపాడు, జాంపల్లి, ద్యాగదొడ్డిచ చిన్నపాడు, కేటిదొడ్డిలో చింతలకుంట, రంగాపురం, గట్టు మండలంలో ముచ్చోనినిపల్లి, అరగిద్ద, లింగాపురం, పెంచికలపాడు, తుమ్మలపల్లి, తారాపురం.. మొత్తంగా తొలి విడతలో 15 మంది సర్పంచ్లు, 361 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ● రెండో విడతలో మల్దకల్ మండలంలో సద్దలోనిపల్లి, మంగంపేట, నీల్పల్లి, బిజ్వారం, చర్లగార్లపాడు జీపీలు, 54 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. అయిజలో గుడిదొడ్డి, జడదొడ్డి, కిష్ణాపురం, కుర్వపల్లి, రాజాపురం, తొత్తినోనిదొడ్డి, వెంకటాపురం జీపీలు, 79 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. రాజోలి మండలంలో పడమటి గార్లపాడు జీపీతోపాటు 23 వార్డులు, వడ్డేపల్లి మండలంలో తనగల, కొంకల, జూలెకల్, జక్కిరెడ్డి పల్లె, వెంకట్రామనగర్ జీపీలు, 66 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. రెండో విడతలో మొత్తం 18 గ్రామ సర్పంచ్లు, 222 వార్డుల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ● మూడో విడతలో ఇటిక్యాల వావిలాల, మొగలిరావుల చెరువు జీపీలు, 43 వార్డులు, మానవపాడులో గోకులపాడు, చెన్నిపాడు, చంద్రశేఖర్ నగర్, చండూరు జీపీలు, 50 వార్డులు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఎర్రవల్లిలో రాజశ్రీ గార్లపాడు జీపీతోపాటు, 23 వార్డులు, అలంపూర్లో 6 వార్డులు, ఉండవెల్లిలో 14 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. చివరి విడతలో 7 సర్పంచ్ స్థానాలు, 136 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇదిలాఉండగా, 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో 46 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అప్పట్లో జిల్లాలో 255 సర్పంచ్ స్థానాలకు గతంలోనూ మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. మొదటి విడతలో 30 స్థానాలు, రెండో విడతలో 14 స్థానాలు, మూడో విడతలో 2 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. నజరానా అందక.. జిల్లాలో గడిచిన రెండు సర్పంచ్ ఎన్నికలను పరిశీలిస్తే ఈ సారి 10 స్థానాలు తగ్గాయి. ఏకగ్రీవ పంచాయతీలకు గతంలో ప్రభుత్వం రూ.10 లక్షల నజరానా ప్రకటించింది. కానీ సర్పంచ్ల పదవీ కాలం ఐదేళ్లు ముగిసిన ఏకగ్రీవ పంచాయతీలకు పైసా రాలేదు. గ్రామ అభివృద్ధి కోసం పోటీ లేకుండా ఏకగ్రీవం చేసుకున్న ప్రజలు ఆ తర్వాత తీవ్ర నిరాశ చెందాల్సి వచ్చింది. గత ఏకగ్రీవ పంచాయతీల పరిస్థితిని గమనించిన ప్రజలు ఈ సారి ఏకగ్రీవం కంటే పోటీతోనే అభివృద్ధి సాధించాలని పోరుకు సిద్ధమయ్యారు. ఒకటి రెండు చోట్ల మినహా మిగిలిన గత ఏకగ్రీవ పంచాయతీలు ఈ సారిలో పోరులో నిచిచాయి. -
పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
జవహార్ నవోదయ విద్యాలయం 2026–27 విద్యా సంవత్సరం ఆరో తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహణకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మొత్తం 29 పరీక్ష కేంద్రాలలో 7,115 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులు ఆన్లైన్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి. విద్యార్థులు నిర్ణీత సమయానికి గంట ముందే ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. – భాస్కర్కుమార్, ప్రిన్సిపల్, వట్టెం నవోదయ విద్యాలయం -
ఎన్నికల్లో పోలీసుల సేవలు ప్రశంసనీయం
ఎర్రవల్లి: స్థానిక సంస్థల మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగులకు పోలీస్ సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని బీచుపల్లి పదో బెటాలియన్ కమాండెంట్ జయరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మల్దకల్, రేవల్లి, కోస్గి, తదితర ప్రాంతాల్లో గురువారం జరిగిన ఎన్నికల్లో పదో బెటాలియన్ ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పోలింగ్లో భాగంగా వృద్దులు, దివ్యాంగులకు చేయూతనందించి వారు సురక్షితంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సహకారం అందించారని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకోలేని వారికి, అవసరమైన చోట తగిన సాయం అందిస్తూ మానవతా దృక్పథంతో పోలీస్ సిబ్బంది వ్యవహరించడంపై ప్రజలు ప్రశంసలు కురిపించారని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా సాగేందుకు పోలీసులు ప్రతి స్థాయిలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియ విజయవంతంగా సాగేందుకు తమ బాధ్యతను నిబద్దతతో నిర్వర్తిస్తూ ఓటర్లకు అండగా నిలిచేందుకు సిబ్బంది చూపిన సేవాభావం, క్రమశిక్షణను అభినందించారు. -
ఓటెత్తారు..
● జోగుళాంబ గద్వాల జిల్లాలో అత్యధికంగా 86.77 శాతం ● మహబూబ్నగర్లో అత్యల్పంగా 83.04 శాతం ● అన్ని జిల్లాల్లోనూ పురుషుల ఓటింగ్ శాతమే ఎక్కువ మొట్ట మొదటి సారిగా ఓటు హక్కును వినియోగించుకున్న యువతిసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 24 మండలాల పరిధిలో 492 గ్రామ పంచాయతీలకు జరిగిన తొలి విడత ఎన్నికల్లో సగటున 85.12 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో 86.77 శాతం.. అత్యల్పంగా మహబూబ్నగర్ జిల్లాలో 83.04 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల జరిగిన ఆయా మండలాల పరిధిలో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు ఎక్కువగానే ఉన్నా.. ఓటింగ్లో వెనుకపడ్డారు. మహబూబ్నగర్ జిల్లాలోని ఐదు మండలాల పరిధిలో జరిగిన జీపీ ఎన్నికల్లో 83.04 శాతం పోలింగ్ నమోదైంది. పురుషులు 83.37 శాతం, మహిళలు 82.71 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలోని ఆరు మండలాల పరిధిలో పోలింగ్ నిర్వహించారు. మొత్తంగా 86.32 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో పురుషులు 87.13 శాతం, మహిళలు 85.53 శాతం మంది ఓటు వేశారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని నాలుగు మండలాల్లో తొలి విడత జీపీ ఎన్నికలు జరిగాయి. ఇందులో మొత్తంగా 86.77 శాతం పోలింగ్ నమోదైంది. పురుషులు 87.79 శాతం ఓటు హక్కు వినియోగించుకోగా.. మహిళలు 85.79 శాతం మంది మాత్రమే ఓటు వేశారు. వనపర్తి జిల్లాలోని ఐదు మండలాల పరిధిలో జరిగిన జీపీ ఎన్నికల్లో 84.90 శాతం పోలింగ్ నమోదైంది. పురుషులు 85.91 శాతం, మహిళలు 83.99 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నారాయణపేట జిల్లాలోని నాలుగు మండలాల్లో జరిగిన జీపీ ఎన్నికల్లో మొత్తంగా 84.58 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో పురుషులు 85.55 శాతం, మహిళలు 83.66 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ధరూరులో వృద్ధులకు సాయంగా పంచాయతీ సిబ్బంది -
నువ్వా.. నేనా !
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: నడిగడ్డ.. జోగుళాంబ గద్వాల జిల్లా.. అంటేనే విభిన్న రాజకీయాలకు మారు పేరు. ఈ జిల్లాలో నిర్వహించిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటరు తీర్పు మరోసారి ఆ శైలిని ప్రతిబింబించింది. ఏకగ్రీవం పోనూ మిగిలిన 92 జీపీల్లో సర్పంచ్ స్థానాలకు గురువారం పోలింగ్ జరగగా.. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులే గెలుపొందారు. అయితే గద్వాల నియోజకవర్గంలో పోటీ అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కాకుండా.. ‘హస్తంశ్రీలో వర్గాల మధ్యే కొనసాగినట్లు స్పష్టమవుతోంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సరిత వర్గాలకు చెందిన మద్దతుదారులు నువ్వా, నేనా అన్నట్లు పోటీపడ్డారు. 839 వార్డు స్థానాల్లోనూ ఇదే విధమైన పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. అటు 56.. ఇటు 26 షెడ్యూల్ ప్రకారం జిల్లాలోని గద్వాల, ధరూరు, కేటీదొడ్డి, గట్టు మండలాల పరిధిలో 106 పంచాయతీలకు ఎన్నికలు జరగగా.. 82 జీపీల్లో కాంగ్రెస్ మద్దతుదారులే సర్పంచ్లుగా గెలుపొందారు. ఇందులో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డికి చెందిన మద్దతుదారులు 56.. జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వర్గానికి చెందిన 26 మంది సర్పంచ్లుగా గెలుపొందారు. గద్వాలలో హోరాహోరీగా సాగిన పోరు సర్పంచ్లు, వార్డులు అత్యధికంగా ‘హస్త’గతం ఎమ్మెల్యే, జెడ్పీ మాజీ చైర్పర్సన్ వర్గాల మధ్యే పోటీ 56 జీపీల్లో సర్పంచ్లుగా ఎన్నికై న బండ్ల వర్గీయులు మరో 26 పంచాయతీల్లో సరిత మద్దతుదారుల గెలుపు 2వ స్థానంలో బీజేపీ.. మూడో స్థానంలో బీఆర్ఎస్ -
ప్రశాంతంగా తొలివిడత పోలింగ్
గద్వాల: జిల్లాలో మూడు విడతలలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు తొలివిడతలో భాగంగా శుక్రవారం జరిగిన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. 86.77శాతం పోలింగ్ శాతం నమోదైందని తెలిపారు. మొదటి విడతలో నాలుగు మండలాలైన గద్వాల, ధరూరు, గట్టు, కే.టి.దొడ్డి మండలాల్లో 92 గ్రామపంచాయతీలు, 839వార్డులకు పోలింగ్ జరిగిందన్నారు. 57,476 మంది మహిళలు, 56,786 మంది పురుషులు, ఇతరులు ఒకరు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని తెలిపారు. వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి పరిశీలన జిల్లాలో మొదటి విడతలో జరిగిన ఓటింగ్ ప్రక్రియ సరళిని మొదటగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ ద్వారా కలెక్టర్ పర్యవేక్షించారు. అనంతరం ఆయన గద్వాల, ధరూరు మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా, ఖచ్చితత్వంతో చేయాలని, ముందుగా పోస్టల్బ్యాలెట్ పత్రాలను లెక్కించి తరువాత వార్డు మెంబర్ బ్యాలెట్పేపర్లను వేరుచేసి క్రమపద్దతిలో ఓట్లను లెక్కించాలని ఆదేశించారు. అన్ని వార్డుల లెక్కింపులు పూర్తయ్యాకనే సర్పంచు అభ్యర్థుల లెక్కింపు ప్రక్రియను చేపట్టాలన్నారు. ఫలితాలు వెలువడిన తరువాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసుబందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డీఐజీ, ఎస్పీ పర్యవేక్షణ పోలింగ్ ప్రక్రియను డీఐజీ చౌహాన్ క్షేత్రస్థాయిలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. అత్యంత సమస్యాత్మకంగా గుర్తించిన అనంతపురం పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ శ్రీనివాస్రావుతో కలిసి సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అలాగే, ఆలూరు, రాయాపురం, గట్టు గ్రామాల్లోని పోలింగ్ బూత్లను ఏఎస్పీ శంకర్ పరిశీలించారు. ధరూరు: ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మూడు దశల ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవాలు, ర్యాలీలు నిషేధమని.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా గురువారం మండలంలో పర్యటించిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. తొలిదశ ఎన్నికల ఫలితాలు ప్రకటించినప్పటికీ గెలిచిన అభ్యర్థులు వారి అనుచరులు విజయోత్సవ ర్యాలీలు, భారీ సభలు, బైక్ ర్యాలీలు, శోభాయాత్రలు పూర్తిగా నిషేధమన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఎన్నికల నేపథ్యంలో మూడు దశల ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు మోడల్ కోడ్ ఆప్ కండక్ట్ కొనసాగుతుందని అన్నారు. ప్రజాస్వామ్య ప్రిక్రియ సజావుగా సాగాలంటే నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అన్చి అన్నారు. శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి ప్రజలు, నాయుకులు, అభ్యర్థులు పూర్తి సహకారం అందించాలని అన్నారు. ఓటర్లు శాంతియుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అంతకు ముందు ధరూరులోని ఆయా పోలింగ్ బూత్లను సందర్శించి అక్కడి పరిస్థితిని, వివరాలను సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు. కోడ్ ముగిసే వరకు విజయోత్సవాలు నిషేధం -
విద్యా సంస్థలకు సెలవు
గద్వాల: గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విడతల వారీగా ఎన్నికలు జరిగే ఆయా మండలాల్లో పోలింగ్ రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు విద్యాసంస్థలకు స్థానిక సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో మొదటి విడతలో ఎన్నికలు జరిగే గద్వాల, ధరూరు, గట్టు, కేటీ.దొడ్డి మండలాల్లో పోలింగ్ జరిగే ఈ నెల 11వ తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఇస్తున్నట్లు తెలిపారు. రెండో విడతలో అయిజ, మల్దకల్, రాజోలి, వడ్డేపల్లి, మండలాల్లో పోలింగ్ జరిగే ఈనెల 14న ఆదివారంతో పాటు ముందు రోజు 13వ తేదీన శనివారం సాధారణ సెలవులు ఉంటాయని తెలిపారు. మూడవ విడతలో ఎన్నికలు జరిగే అలంపూర్, ఇటిక్యాల, ఎర్రవల్లి, ఉండవల్లి మరియు మానవపాడు మండలాల్లో పోలింగ్ రోజు ఈనెల 17వ తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ముందు రోజు 16వ తేదీన అన్ని విద్యాసంస్థలకు సెలవులు ఉంటాయని,ప్రజలందరూ తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని తెలిపారు. ఓటింగ్ కోసం 18 రకాల గుర్తింపు కార్డులు గద్వాల: పోలింగ్ కేంద్రాలలో ఓటు వేయడానికి ఓటర్లు 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా చూపవచ్చని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. ఈ నెల 11, 14, 17 తేదీలలో మూడు విడతలలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేటప్పుడు 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా వెంట తీసుకెళ్లాలని సూచించారు. ఇందులో ఓటరుకార్డు, ఆధార్, జాతీయ ఉపాధిహామీ జాబ్కార్డు, ఫొటోతో కూడిన పోస్టాఫీసు లేదా బ్యాంకు పాస్బుక్కు, కార్మికమంత్రిత్వ శాఖ ఇచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్కార్డు, డ్రైవింగ్ లెసెన్స్, పాన్కార్డు, ఫొటోతో కూడిన ఎస్సీ, బీసీ, ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం, ఇండియన్ పాస్పోర్టు, ఫొటోతో కూడి పెన్షన్ డాక్యుమెంట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలచే జారీ చేయబడిన ఉద్యోగ గుర్తింపు కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇచ్చిన అధికారిక గుర్తింపు కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, రేషన్కార్డు, ఫొటోతో కూడిన ఆయుధ లెసెన్స్ పత్రంలో ఏదేని ఒకదానిని చూపి ఓటుహక్కును వినియోగించుకోవచ్చని సూచించారు. ఓటుహక్కు కలిగిన ప్రతిఒక్కరు తప్పకుండా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. మెరుగైన విద్యాబోధన చేయాలి మల్దకల్: విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించి వారి విద్యాభివృద్ధికి కృషి చేయాలని డీఈఓ విజయలక్ష్మి ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం మల్దకల్ కస్తూర్బా బాలికల పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు రిజిష్టర్ను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు ప్రణాళిక బద్దంగా బోధన చేయాలన్నారు. అనంతరం విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వారి వెంట ప్రత్యేకాధికారి విజయలక్ష్మీ, హంపయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఓయూ విద్యార్థి నాయకుల అరెస్టు అక్రమం గద్వాల: ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కుర్వ పల్లయ్య అన్నారు. బుధవారం ఆయన స్థానిక పీజీ సెంటర్ వద్ద నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే గొంతునొక్కే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ప్రభుత్వ తీరును మార్చుకుని విద్యార్థుల డిమాండ్ను నెరవేర్చాలన్నారు. -
ఓటరు తీర్పు నేడే..
గద్వాలటౌన్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కీలక ఘటం మొదలైంది. పల్లె ప్రజలు స్థానిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే సమయం ఆసన్నమైంది. గ్రామాభివృద్ధికి పాటుపడే సరైన వ్యక్తిని సర్పంచ్గా ఎన్నుకోవడానికి ఓటర్లు తీర్పునివ్వనున్నారు. హోరాహోరీగా సాగిన పల్లె పోరులో అభ్యర్థుల భవితవ్యం గురువారం సాయంత్రంతో తేలనుంది. సర్పంచ్గా పగ్గాలు చేపట్టేదెవరో ఓటరు తన తీర్పుతో నిర్ణయించనున్నాడు. జిల్లాలోని గద్వాల, ధరూరు, కేటీదొడ్డి, గట్టు మండలాల్లో ప్రతిష్టాత్మక గ్రామ పంచాయతీ తొలిదశ ఎన్నికలు జరగనున్నాయి. తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే సామగ్రిని సిబ్బందికి అందజేశారు. మధ్యాహ్నం అనంతరం తమకు కేటాయించిన గ్రామాలకు పోలింగ్ అధికారులు, సిబ్బంది ఎన్నికల సామగ్రితో ఆయా పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేక వాహనాలలో తరలివెళ్లారు. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభమవుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ సాగుతుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సర్పంచ్ ఫలితం తేలాక, అధికారులు ఉపసర్పంచ్ ఎన్నిక ప్రక్రియ నిర్వహిస్తారు. తొలిదశ ఎన్నికలు జరిగే నాలుగు మండలాల్లో 2,634 మంది అధికారులు, సిబ్బంది పోలింగ్ క్రతువులో పాల్గొననున్నారు. ఏకగ్రీవమైన వార్డులు 361 తొలి విడత పంచాయతీ సమరానికి సర్వం సిద్ధం నాలుగు మండలాల్లో మొదటి విడత ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం సాయంత్రానికి ఫలితాలు.. వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక 91 సర్పంచ్ పదవులకు 321 మంది పోటీ -
ఎన్నికల సిబ్బంది.. సౌకర్యాల్లేక అవస్థలు
గ్రామ పంచాయతీ తొలివిడత ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పోలింగ్ కేంద్రాల వద్ద సరైన సౌకర్యాల్లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేటీదొడ్డికి మధ్యాహ్నానికి ఎన్నికల సిబ్బంది సామగ్రితో రాగా.. వారికి సరిపడా భోజనం అందకపోవడంతో ఆకలితో ఎదురుచూశారు. అయితే, 800 మంది సిబ్బందికి భోజనాలు చేయగా 1000 మంది వచ్చారని, మరోసారి భోజనం వండి అందించినట్లు ఎంపీడీఓ రమణరావు తెలిపారు. ఇక గట్టు మండలంలో సరిపడా టెంట్లు లేకపోవడంతో సిబ్బంది ఎండలోనే సామగ్రిని సరిచూసుకున్నారు. మహి ళ లు చీర కొంగును తలపై కప్పుకోగా.. మరికొందరు అట్టా పెట్టలను ఎండ నుంచి అడ్డుపెట్టుకోవడం కనిపించింది. – కేటీదొడ్డి/గట్టు -
పకడ్బందీగా పోలింగ్
● సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి ● కలెక్టర్ బీఎం సంతోష్ గద్వాల: మొదటి విడతలో జరిగే పోలింగ్ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ ఆవరణలో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది తమకు ఇచ్చే పోలింగ్ సామగ్రిని సరిచూసుకుని ఎక్కడా కూడా పొరపాట్లకు తావులేకుండా చూడాలన్నారు. పీఓ అందరూ కూడా వారికి కేటాయించిన గ్రామపంచాయతీలకు సాయంత్రంలోగా చేరుకోవాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తిచేసి తిరిగి రిసెప్షన్ కేంద్రానికి వచ్చేవరకు అవసరమైన పోలీస్ బందోబస్తు నియమించినట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగేంద్రం, ఎంపీడీఓ శైలజ, తహసీల్దార్ మల్లీఖార్జున్ ఎంఈఓ శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
హోరాహోరీ.. ప్రచార భేరి
● రెండు, మూడో విడత పంచాయతీల్లో అభ్యర్థుల విస్తృత ప్రచారం ● గెలుపునకు సర్వశక్తులు ఒడ్డుతున్న వైనం అలంపూర్: స్థానిక సంస్థల ఎన్నికల సంగ్రామ ప్రచార హోరుతో అభ్యర్థులు హడలెత్తిస్తున్నారు. మూడు విడతల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఒక విడత పల్లెలు పోలింగ్కు సిద్దం అయ్యాయి. మిగిలిన రెండవ, మూడవ విడతల్లో అభ్యర్థులు ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోనే పనిలో నిమగ్నమయ్యారు. ప్రచార పర్వంలో తమ భవిష్యత్తును చూసుకోని వార్డుల వారిగా ఓట్లను అభ్యర్థిస్తు గెలుపుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. గ్రామాల్లోని తమకు అనుకులించే అంశాలతోపాటు కలిసొచ్చే వారితో ప్రచారంలో దూసుకెళ్తూన్నారు. అధికారులు నామినేషన్ల నుంచి మొదలుకొని అభ్యర్థులకు గుర్తులు కేటాయించే వరకు పనులు ముగించారు. ఇక మిగిలింది పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ కావడంతో వాటిపై దృష్టిసారిస్తున్నారు. అభ్యర్థులు ప్రచార పర్వంలో మునిగిపోగా అధికార యంత్రం ఎన్నికల నిర్వహణపై కసరత్తు చేస్తున్నారు. రెండు విడతల్లో అభ్యర్థుల ప్రచార జోరు జిల్లాలోని 13 మండలాల్లో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి విడతలో గద్వాల, ధరూరు. కేటీదొడ్డి, గట్టు మండలాలు ఉన్నాయి. మొదటి విడతలో నేడు పోలింగ్ నిర్వహించనుండగా.. రెండో విడతలో మల్దకల్, అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ అభ్యర్థులకు ప్రచారానికి రెండు రోజులు మాత్రమే మిగిలింది. దీంతో అభ్యర్థులు ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రచారంతో రక్తి కట్టిస్తున్నారు. మూడో విడతలో అలంపూర్, ఉండవెల్లి, మానవపాడు, ఇటిక్యాల, ఎర్రవల్లి మండలాలకుగాను అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. వచ్చిన గుర్తులతో గత రెండు రోజులుగా ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు. రెండో విడతలో 191 మంది సర్పంచ్ అభ్యర్థులు రెండో విడత ఎన్నికలు జరగనున్న మండలాల్లో 191 మంది సర్పంచ్, 965 మంది వార్డుసభ్యులు పోటీపడుతున్నారు. 18 మంది సర్పంచ్ స్థానాలు, 222 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మల్దకల్ మండలానికి వస్తే.. 25 గ్రామ పంచాయతీలు, 242 వార్డులు ఉండగా... 70 మంది సర్పంచ్, 486 మంది వార్డుసభ్యులు పోటీపడనున్నారు. ఇక్కడ 5 సర్పంచ్, 54 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. అయిజ మండలంలో 28 పంచాయతీలు, 279 వార్డులు ఉండగా.. సర్పంచ్కు 78మంది, వార్డులకు 191 మంది పోటీలో నిలిచారు. ఇక్కడ 7 సర్పంచ్, 79 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. వడ్డేపల్లి మండలంలో 10 గ్రామ పంచాయతీలు, 94 వార్డులకుగాను సర్పంచ్కు 13, వార్డులకు 66మంది పోటీపడుతున్నారు. ఇక్కడ 5 సర్పంచ్, 66 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. రాజోలి మండలంలో 11 గ్రామ పంచాయతీలు, 110 వార్డులు ఉండగా.. సర్పంచ్కు 30మంది, వార్డులకు 222 మంది పోటీపడనున్నారు. ఒక సర్పంచ్, 23 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. -
ఏకగ్రీవమైన పంచాయతీలకు ఎన్నికల సిబ్బంది
గట్టు: సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవమైన పంచాయతీలకు కేటాయించిన ఎన్నికల సిబ్బంది ఎంపీడీఓ చెన్నయ్యతో వాగ్వాదానికి దిగారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయం దగ్గర ఎన్నికలు నిర్వహించే గ్రామాలకు పోలింగ్ సిబ్బందిని కేటాయించి, మెటీరియల్ను అందజేశారు. అయితే 6 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా, ఈ గ్రామాలకు కేటాయించిన సుమారు 120 మంది ఎన్నికల సిబ్బంది కూడా వచ్చారు. వీరికి ఎన్నికల విధులను అప్పగించకపోవడంతో పాటుగా ఎన్నికల భత్యం చెల్లించకపోవడంతో సిబ్బంది అధికారులతో వాగ్వాదానికి దిగారు. చివరికి జిల్లా పంచాయతీ అధికారితో మాట్లాడిన తర్వాత ఏకగ్రీవ పంచాయతీలకు కేటాయించిన ఉద్యోగులకు వారి ఖాతాల్లో డబ్బులను జమ చేయడం జరుతుందని హామీ ఇవ్వడంతో వారు వెనుతిరిగి వెళ్లారు. ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అధికారుల్లో కొంత మందికి భోజనం లభించకపోవడంతో అసంతృప్తిని వ్యక్తం చేశారు. -
తొలి పరీక్ష..!
డీసీసీ చీఫ్లకు ‘పంచాయతీ’ సవాల్ ● మెజార్టీ జీపీల్లో గెలుపే మొదటి టాస్క్ ● నేతల మధ్య సమన్వయమే ప్రధాన సమస్య ● పలు నియోజకవర్గాల్లో ప్రచారానికి దూరంగా అసంతృప్త నేతలు ● పట్టించుకోని అధిష్టానం తీరుతో అలక ● అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి కాంగ్రెస్ సత్తా చాటుతామంటున్న నూతన అధ్యక్షుల ధీమా సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: నూతనంగా ఎన్నికై న అధికార కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులకు పంచాయతీ పోరు సవాల్ విసురుతోంది. డీసీసీ చీఫ్లుగా నియామకమైన వెంటనే ఎన్నికలకు తెరలేవడం.. వారి సత్తాకు పరీక్షగా మారింది. మెజార్టీ పంచాయతీల్లో గెలుపే వారి తొలి టాస్క్ కాగా.. క్షేత్రస్థాయిలో సంగ్రామం బాట పట్టారు. పలు జిల్లాల్లోని నియోజకవర్గాల్లో గ్రూప్లు.. అంటీముట్టనట్లుగా ఉన్న నేతలతో వారికి సమన్వయం కత్తిమీద సాములా మారినట్లు తెలుస్తోంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో డీసీసీ అధ్యక్షుడిగా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సరిత భర్త తిరుపతయ్య, టీపీసీసీ జనరల్ సెక్రటరీ రాజీవ్రెడ్డి, నల్లారెడ్డి, గడ్డం కృష్ణారెడ్డి ఆశించారు. అధిష్టానం రాజీవ్రెడ్డికి అవకాశం కల్పించింది. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన పలు గ్రామాల్లో పార్టీ మద్దతుదారులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. గద్వాల మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో కలిసి ప్రచారం చేశారు. ఇదివరకే డీసీసీ అధ్యక్ష పదవి ఆశించి భంగపాటుకి గురైన సరిత వర్గం.. తాజాగా ఎమ్మెల్యేతో కలిసి రాజీవ్రెడ్డి ప్రచారంలో పాల్గొనడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ జిల్లాలో పలు గ్రామాల్లో సర్పంచ్ పదవులకు అటు సరిత, ఇటు బండ్ల వర్గానికి చెందిన మద్దతుదారుల మధ్యే పోరు నడుస్తోంది. ఈ క్రమంలో రాజీవ్రెడ్డి.. ఎమ్మెల్యేతో కలిసి ప్రచారం చేయడంపై సరిత వర్గం గుర్రుగా ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. నాగర్కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధిష్టానం అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణకు మళ్లీ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ జిల్లాలోని నాగర్కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎవరికి వారు పంచాయతీ ఎన్నికల్లో చక్రం తిప్పుతున్నారు. డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ తన సొంత నియోజకవర్గం అచ్చంపేటకే పరిమితమయ్యారు. రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంలో పంచాయతీ పోరు హీటెక్కింది. అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఏకమై మెజార్టీ గ్రామాల్లో పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ లోని అసంతృప్త నేతలకు సంబంధించిన వర్గాలు సైతం పోరులో నిలిచాయి. ప్రధానంగా వనపర్తి, గద్వాలలో చేతులు కలవని పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. డీసీసీ పీఠం ఆశించి భంగపడడం ఒకవైపు కాగా.. భర్తీ తరువాత అధిష్టానం కనీసం సంప్రదింపులు చేయకపోవడం, బుజ్జగించకపోవడం అసంతృప్త నేతలను మరింత నారాజ్లోకి నెట్టినట్లు సమాచారం. సమన్వయంతో ముందుకు.. కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న వెంటనే పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. ఇప్పటికే మొదటి విడత గద్వాల నియోజకవర్గంలో గట్టు, కేటీ దొడ్డి, ధరూర్ మండలాల్లో పర్యటించాను. అన్ని చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తోంది. గెలుపు ఖాయం. నాకు ఏ వర్గం లేదు. పార్టీలో అందరూ ఒక్కటే. సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతా. – రాజీవ్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, జోగుళాంబ గద్వాలమహబూబ్నగర్ డీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన సంజీవ్ ముదిరాజ్ పంచాయితీ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన దేవరకద్ర, మహబూబ్నగర్, జడ్చర్ల ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా నుంచి డీసీసీ పీఠాన్ని అధిరోహించాలని ఆశలతో ఉన్న వారిని సైతం కలుసుకొని సహకరించాలని కోరారు. ఆ వెంటనే జీపీ ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ మహబూబ్నగర్ రూరల్ మండల పరిధిలో రెండు రోజులుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకమైన శివసేనారెడ్డి పంచాయతీ ఎన్నికల ప్రచారానికి దూరంగానే ఉన్నారు. ప్రస్తుతం ఆయన స్పో ర్ట్స్ అథారిటీ చైర్మన్గా కొనసాగుతున్నారు. నూతనంగా డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికై న క్రమంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలోనే పంచాయతీ ఎన్నికల తంతు కొనసాగుతుందని చెప్పారు. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పునర్నియామకమైన కె.ప్రశాంత్రెడ్డి కూడా జీపీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. పేటలో ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి.. మక్తల్లో మంత్రి వాకిటి శ్రీహరి అన్నీ తామై మద్దతుదారుల గెలుపునకు వ్యూహాలను అమలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ రెబల్స్ని పోటీ నుంచి విరమింపజేసేలా ప్రశాంత్ చర్యలు చేపట్టారు. -
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ
గద్వాల క్రైం: తొలి విడత సర్పంచ్ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావారణంలో నిర్వహిస్తామని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. గద్వాల, ధరూర్, కేటీదొడ్డి, గట్టు మండలాల్లోని ఎన్నికల నిర్వహణలో జిల్లా పోలీసు బలగాలతో పట్టిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి మండలానికి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారితో ఎప్పటికప్పుడు నివేదికలు, రూట్ మొబైల్స్, క్విక్ రియాక్షన్, స్ట్రయికింగ్ ఫోర్సు, ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపామన్నారు. 106 గ్రామ పంచాయతీలో 14 ఏకగ్రీవం కాగా 92 గ్రామ పంచాయతీల్లో 35 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి సీసీ కెమెరాల పర్యవేక్షణలో భద్రతా చర్యలు చేపట్టామన్నారు. గత ఎన్నికల్లో ఏఏ పోలింగ్ కేంద్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయో అక్కడ ప్రస్తుతం అదనపు బలగాలను ఏర్పాటు చేశామని, అన్ని పార్టీల నాయకులు, ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. సమా వేశంలో ఏఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య, సీఐలు శ్రీను, రవి, నాగేశ్వరెడ్డి తదితరులు ఉన్నారు. -
ప్రలోభాల పర్వం
ముగిసిన తొలి విడత ఎన్నికల ప్రచారం ● గ్రామాల్లో జోరుగా మద్యం, డబ్బుల పంపిణీ ● ఒక్కో వార్డుకు రూ.లక్ష, కుల సంఘాలకు రూ.2 లక్షలు ● చిన్న పంచాయతీల్లోనూ రూ.15 లక్షల వరకు ఖర్చు ● రేపే ఉమ్మడి జిల్లాలోని 550 గ్రామాల్లో తొలి విడత ఎన్నికలు సాక్షి, నాగర్కర్నూల్: పంచాయతీ ఎన్నికలలో భాగంగా తొలి విడత ప్రచారం మంగళవారం సాయంత్రానికి ముగిసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తొలి విడతలో మొత్తం 550 సర్పంచ్, 4,840 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో గురువారమే తొలి విడత పంచాయతీ ఎన్నికలు ఉండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గ్రామాల్లో పెద్దఎత్తున ప్రలోభాలకు దిగుతున్నారు. యథేచ్ఛగా మద్యంతోపాటు డబ్బు పంపిణీతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. చిన్న గ్రామాల్లోనూ భారీగానే.. తొలి విడత ఎన్నికలకు గడువు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతోంది. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలకు దిగుతున్నారు. వెయ్యిలోపు ఓటర్లు ఉన్న చిన్న గ్రామ పంచాయతీల్లోనూ రూ.15 లక్షల వరకు ఖర్చు పెట్టేందుకు వెనకాడటం లేదు. గ్రామాల్లోని వార్డుల వారీగా లెక్కలు వేసి కేటాయింపులు చేస్తున్నారు. ఒక్కో వార్డుకు రూ.లక్ష, ఒక్కో కుల సంఘానికి రూ.2 లక్షల వరకు ముట్టజెప్పుతున్నారు. కుల సంఘాల పెద్దల వద్ద రూ.2–3 లక్షల వరకు ఉంచుతూ గంపగుత్తగా ఓట్లను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓటర్లలో అధిక సంఖ్యలో ఉన్న మహిళలపై అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు. మహిళా సంఘాల సమస్యలపై హామీలు గుప్పిస్తున్నారు. పెద్దసంఖ్యలో మహిళల ఓట్లు పొందేందుకు మహిళా సంఘాలకు రూ.లక్షల్లో ముట్టజెప్పుతూ ప్రలోభాలను సాగిస్తున్నారు. ‘నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ఓ గ్రామ పంచాయతీలో ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. కేవలం 1,200 లోపు ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో ఒక్కో అభ్యర్థి కనీసం రూ.15 లక్షలు ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు. నామినేషన్ రోజునే ఒకరు రూ.3 లక్షల వరకు ఖర్చు చేయగా.. నిత్యం ప్రచారంలో భాగంగా ఇప్పటికే రూ.8 లక్షలు దాటింది. మంగళవారం సాయంత్రంతో ప్రచారం కూడా ముగియడంతో అభ్యర్థులు నేరుగా మద్యం, డబ్బులతో ప్రలోభాలకు దిగుతున్నారు.’ ‘నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని ఓ మేజర్ గ్రామ పంచాయతీలో ఇద్దరు అభ్యర్థుల మధ్య ప్రధానంగా పోటీ నడుస్తోంది. ఇక్కడ సర్పంచ్ స్థానం కోసం అభ్యర్థులు రూ.30 లక్షల దాక ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదని తెలుస్తోంది. ఓటుకో మందు సీసాతో పాటు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల దాక ఇస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.’ మద్యం ప్రవాహం.. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడ చూసినా ఓటర్లకు మద్యం పంపిణీ యథేచ్ఛగా కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం నుంచే మద్యం దుకాణాలు మూసివేయగా.. అంతకు ముందే అభ్యర్థులు భారీ స్థాయిలో మద్యం కొనుగోలు చేసి నిల్వ చేశారు. ఓటరుకో క్వార్టర్ చొప్పున పంపిణీ చేస్తుండగా.. కొన్నిచోట్ల మద్యంతోపాటు డబ్బుల పంపిణీ సైతం కొనసాగుతోంది. చాలా గ్రామాల్లో పోటీని బట్టి ఓటరుకు క్వార్టర్తోపాటు రూ.వెయ్యి వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. -
ఏసీబీ వలలో ఇన్చార్జి విద్యుత్ ఏఈ
వెల్దండ: ఇంటికి విద్యుత్ మీటరు బిగించడానికి లంచం తీసుకుంటూ విద్యుత్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి మహబూబ్నగర్ ఇన్చార్జి డీఎస్పీ జగదీష్చందర్ కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండకు చెందిన ఓ రైతు వ్యవసాయ పొలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం రూ.60 వేలు డీడీ చెల్లించారు. కాంట్రాక్టర్లు ట్రాన్స్ఫార్మర్ బిగించగా.. అక్కడ నిర్మించిన ఓ ఇంటికి విద్యుత్ మీటర్ బిగించాలని బాధితుడు ఇన్చార్జి ఏఈ వెంకటేశ్వర్లుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే మీటర్ బిగించడానికి ఏఈ రూ.20 వేలు లంచం డిమాండ్ చేయడంతో రూ.15 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 5న బాధితుడు ఆన్లైన్లో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి సూచన మేరకు మంగళవారం వ్యవసాయ పొలంలోని ఇంటి వద్ద బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా విద్యుత్ ఏఈను పట్టుకున్నట్లు అధికారులు వివరించారు. అనంతరం ఏఈని వెల్దండ విద్యుత్ కార్యాలయానికి తీసుకువచ్చి విచారణ జరిపారు. ఇదే సమయంలో జడ్చర్లలోని విద్యుత్ ఏఈ ఇంట్లో మరో బృందం తనిఖీలు చేపట్టింది. విద్యుత్ ఏఈని బుధవారం హైదరాబాద్లోని ఏసీబీ కోర్టులో హాజరుపరస్తామని వివరించారు. దాడుల్లో మహబూబ్నగర్ ఏసీబీ సీఐ లింగస్వామి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జడ్చర్లలో సోదాలు జడ్చర్ల: పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న ఏఈ వెంకటేశ్వర్లు అద్దె ఇంటిలో సైతం ఏసీబీ అధికారుల బృందం మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతం నుంచి సోదాలు నిర్వహించారు. ఆ సందర్భంగా పలు ఫైళ్లు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ● ఇంటి మీటరు బిగించడానికి రూ.20 వేల లంచం డిమాండ్ ● రూ.15 వేలు తీసుకుంటూ చిక్కిన వైనం -
‘విజయ్ దివస్’ స్ఫూర్తిని భావితరాలకు అందించాలి
గద్వాలటౌన్/అలంపూర్ : ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో..’ అన్న నినాదంతో ప్రాణాలకు తెగించి కేసీఆర్ చేపట్టిన అమరణ దీక్షతో తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించిందని, తెలంగాణ రాష్ట్ర సాధనలో చరిత్రాత్మక విజయంగా నిలిచిన డిసెంబర్ 9వ చరిత్రలో నిలిచిపోయిందని.. ప్రజల ఆకాంక్ష సాకారానికి తొలి అడుగు అదేనని ఎమ్మెల్యే విజయుడు, బీఆర్ఎస్ నాయకులు హనుమంతు, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ పేర్కొన్నారు. మంగళవారం గద్వాల, అలంపూర్లో బీఆర్ఎస్ నాయకులు విజయ్ దివస్ చేపట్టారు. ముందుగా అలంపూర్లో తెలంగాణ తల్లి చిత్రపటానికి ఎమ్మెల్యే పాలతో అభిషేకించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ స్వరాష్ట్రం కోసం పోరాటం చేశారన్నారు. రాష్ట్ర సాధనే ధ్యైయంగా 11 రోజులు అమరణ దీక్ష చేపట్టి ఢిల్లీ మెడలు వంచిన రోజుగా కొనియాడారు. కేసీఆర్ కఠోర దీక్షతో కదిలిన ఆనాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నేరవేస్తు రాష్ట్ర సాధనకు ప్రకటన చేసిందని గుర్తు చేశారు. అందుకే ఈ రోజు రాష్ట్ర సాధనలో చారిత్రాత్మకంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో నాయకులు కిషోర్, రఘు రెడ్డి, దేవన్న, భాస్కర్ రెడ్డి, లోకారెడ్డి, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. జిల్లా కేంద్రంలో.. జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు హనుమంతు, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళాలర్పించారు. జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం వారు కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ప్రాణాన్ని పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ త్యాగం చిరస్మరణీయమన్నారు. ఉద్యమ నేతగా కేసీఆర్ పదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని చెప్పారు. అబద్దాలు, మాయమాటలు చెప్పి రేవంత్రెడ్డి గద్దెనెక్కిండని విమర్శించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల పేరిట కొండంత రాగం తీసిన సీఎం.. బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన 24 శాతం బీసీ రిజర్వేషన్లను ఊడగొట్టారని ఆరోపించారు. రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నాగర్దొడ్డి వెంకట్రాములు, వెంకటేశ్వర్రెడ్డి, యూసుఫ్, మోనేష్, శ్రీనివాస్రెడ్డి, వెంకటేష్నాయుడు, మధు, జనార్థన్రెడ్డి, రాజు, పల్లయ్య, ప్రేమలత, శ్రీరాములు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి
గద్వాల: గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ సిబ్బందిని కేంద్రాలకు కేటాయించే మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం ఐడీవోసీ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఎన్నికల పరిశీలకులు గంగాధర్తో కలిసి మొదటి విడత పోలింగ్ సిబ్బందికి సంబంధించి మూడో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గద్వాల, ధరూరు, గట్టు, కేటి.దొడ్డి మండలాల్లో మొత్తం 974 పోలింగ్ సేషన్లు ర్యాండమైజేషన్లో భాగమైయ్యాయని, వీటికి సంబంధించిన 1,50,672 మంది ఓటర్ల డాటాను సమగ్రంగా పరిగణలోకి తీసుకున్నామన్నారు. మొదటి విడతలో మొత్తం 974పోలింగ్ కేంద్రాల్లో 135 కేంద్రాలు ఏకగ్రీవ గ్రామాలకు చెందినందున మిగతా పోలింగ్ స్టేషన్లకు కావాల్సిన సిబ్బంది టీంల కేటాయింపు పూర్తి చేయబడిదని తెలిపారు. ర్యాండమైజేషన్ ప్రక్రియలో ఇద్దరు సభ్యులతో కూడిన 601టీములు, ముగ్గురు సభ్యులతో కూడిన 238 టీములు మొత్తం 839పోలింగ్ టీములు సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రతిమండలంలోని పోలింగ్ సేష్టన్ల సంఖ్య, గ్రామపంచాయతీల సంఖ్య, ఓటర్ల వివరాలు, అవసమైన పోలింగ్ సిబ్బంది వంటి అంశాలను పూర్తిగా పరిగణలోకి తీసుకుని సాఫ్ట్వేర్ ద్వారా ఆటోమేటిక్గా పోలింగ్ టీములను కేటాయించినట్లు వివరించారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు పూర్తిగా పారద్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈసమావేశంలో జెడ్పీ సీఈవో నాగేంద్రం, డీపీవో శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి
గద్వాల క్రైం: పెండింగ్ కేసుల విషయంలో పురోగతి సాధించేందుకు సమయస్ఫూర్తితో ముందుకెళ్లాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు, జిల్లా జడ్జి ఎన్.ప్రేమలత అన్నారు. సోమవారం జిల్లా కోర్టులో పోలీసు అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు. జిల్లాలో పెండింగ్ కేసులు, రాజీ అయ్యే కేసుల పరిష్కారం కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టామన్నారు. అందులో భాగంగా ఈ నెల 21న జాతీయ లోక్అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. లోక్అదాలత్లో రాజీ కాదగిన కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం సివిల్, ఎకై ్సజ్, రోడ్డు ప్రమాదాలు, బ్యాంకు రుణాలు, చెక్బౌన్స్ తదితర కేసుల వివరాలను తెలుసుకున్నారు. సమావేశంలో న్యాయమూర్తులు లక్ష్మి, ఎన్వీహెచ్ పూజిత, ఉదయ్నాయక్, ఏఎస్పీ శంకర్ ఉన్నారు. -
కమనీయం.. రాములోరి కల్యాణం
ఎర్రవల్లి: శ్రీరాముడి జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో సోమవారం సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు సీతారాముల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి.. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కల్యాణ వేడుక జరిపారు. సీతారాముల కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీతారాముల కల్యాణోత్సవాన్ని కనులారా తిలకించి తన్మయం చెందారు. అదే విధంగా శివాలయంలో పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, అర్చకులు భువనచంద్ర, దత్తుస్వామి, భానుమూర్తి పాల్గొన్నారు. -
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ
గద్వాల: పంచాయతీ ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బంది తమ సొంత మండలాల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు చేపట్టిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సోమవారం ధరూరు, కేటీదొడ్డి మండలాల్లో పోస్టల్ బ్యాలెట్, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను పరిశీలించారు. మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారనే వివరాలను తెలుసుకున్నారు. హెల్ప్డెస్క్ వద్ద సిబ్బందితో కలెక్టర్ మాట్లాడి సూచనలు చేశారు. పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకొని వినియోగించుకోని వారి వివరాలతో పాటు ఎంతమంది వినియోగించుకున్నారనే వివరాలను పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు. ఆయా గ్రామపంచాయతీల ఓటరు జాబితాలో పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు వచ్చిన వారి వివరాలు సరిచూసుకోవాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ బాక్సుకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీల్ వేయాలన్నారు. ఎలక్ట్రోరల్ తప్పనిసరిగా పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం కేటీదొడ్డి మండల కేంద్రంలో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ చేపట్టాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఎన్నికల పర్యవేక్షణ అధికారి శ్రీనివాసరావు, ఎంపీడీఓలు కృష్ణమోహన్, రమణారావు, తహసీల్దార్లు నరేందర్, హరికృష్ణ పాల్గొన్నారు. -
మాతాశిశు మరణాల నివారణే లక్ష్యం
మానవపాడు: మాతాశిశు మరణాల నివారణే లక్ష్యంగా వైద్యసిబ్బంది పనిచేయాలని డీఎంహెచ్ఓ డా.సంధ్యా కిరణ్మయి సూచించారు. సోమవారం మానవపాడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం ఏఎన్ఎంలు, ఆశావర్కర్లతో డీఎంహెచ్ఓ సమావేశమై మాట్లాడారు. గర్భిణులకు క్రమం తప్పకుండా ప్రతినెలా పరీక్షలు చేయడంతో పాటు వారి ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పు చేయించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. 30 ఏళ్లు పైబడిన వారికి విధిగా ఎన్సీడీ పరీక్షలు చేయాలన్నారు. టీబీ, లెప్రసీ, పాలియేటివ్ కేర్ పేషంట్ల జాబితాను జిల్లా ఆస్పత్రికి పంపించాలని తెలిపారు. పీహెచ్సీ పరిధిలో ఆరోగ్య కార్యక్రమాలను వందశాతం నిర్వహించాలని ఆదేశించా రు. సమావేశంలో డా.శారణ్య, జిల్లా కోఆర్డినేటర్ శ్యాంసుందర్, సూపర్వైజర్లు హెలెన్, అక్కమ్మ, చంద్రన్న, శేఖర్ ఉన్నారు. 10, 11 తేదీల్లో పాఠశాలలకు సెలవు గద్వాల: జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే మండలాల్లో ఈ నెల 10, 11 తేదీల్లో పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు డీఈఓ విజయలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11న మొదటి విడత ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. వేరుశనగ క్వింటా రూ.7,270 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు సోమవారం 311 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాల్ గరిష్టంగా రూ. 7,270, కనిష్టంగా రూ. 4,616, సరాసరి రూ. 5,270 ధరలు లభించాయి. అదే విధంగా 18 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 5,880, కనిష్టంగా రూ. 5,520, సరాసరి రూ. 5880 ధరలు వచ్చాయి. 1,023 క్వింటాళ్ల వరి (సోన) విక్రయానికి రాగా.. గరిష్టంగా రూ. 2,559, కనిష్టంగా రూ. 1,719, సరాసరి ధరలు రూ. 2,489 ధరలు లభించాయి. వందశాతం ఉత్తీర్ణత సాధించాలి గద్వాలన్యూటౌన్: పదో తరగతి చదువుతున్న సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎస్సీ సంక్షేమశాఖ అధికారిణి నుషిత సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతిగృహాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ పరిసరాలతో పాటు టాయి లెట్లు, వంట గది, విద్యార్థినుల కోసం వండిన ఆహార పదార్థాలను ఆమె పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం హాస్టల్ వార్డెన్, సిబ్బందితో ఆమె మాట్లాడుతూ.. విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రతినెలా మెడికల్ క్యాంప్ నిర్వహించి.. విద్యార్థినులకు అవసరమైన మందులు అందించాలన్నారు. ప్రతి మూడు నెలలకు ఒక సారి విధిగా తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటుచేసి.. హాస్టల్లో కల్పిస్తున్న వసతులు, విద్యార్థినుల చదువు పరిస్థితిని తెలియజేయాలని సూ చించారు. విద్యార్థినులు మధ్యలోనే చదువు మానుకొని, స్వగ్రామాలకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత వసతిగృహ అధికారులదేనని చెప్పారు. అనంతరం పదో తరగతి విద్యార్థినులతో ఆమె సమావేశమై అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. ట్యూటర్లు బోధిస్తున్న విధానం, విద్యార్థినుల ప్రగతిపై ఆరా తీశారు. కార్యక్రమంలో వార్డెన్ సుజాత పాల్గొన్నారు. -
మిగిలింది.. రెండు రోజులే
● నేటితో ముగియనున్న తొలి విడత ఎన్నికల ప్రచారం ● అభ్యర్థుల్లో మొదలైన టెన్షన్ గద్వాల: తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ఇంకా రెండు రోజుల సమయమే మిగిలింది. ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే ధరూరు, గద్వాల, గట్టు, కేటీదొడ్డి మండలాల్లో 106 సర్పంచ్, 974 వార్డు స్థానాలకు గాను 14 సర్పంచ్, 120 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన జీపీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా, ఎన్నికల ప్రచారానికి కేవలం ఒకరోజు మాత్రమే సమయం ఉండటంతో తొలి విడత గ్రామాల్లోని అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. 48 గంటల ముందుగానే.. ఎన్నికలకు 48 గంటల ముందుగానే అభ్యర్థుల ఎన్నికల ప్రచార మైక్లు మూగబోనున్నాయి. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రచారానికి బ్రేక్ పడనుంది. అయితే ఇప్పటికే గ్రామాల్లో అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి నుంచి ఈ ప్రలోభపర్వం మరింత ఊపందుకోనుంది. గెలుపే లక్ష్యంగా హామీలు.. గ్రామాల్లో అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా వేగంగా పావులు కదుపుతున్నారు. ఇంటింటి ప్రచారంతో పాటు సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గంపగుత్తగా ఓట్లను పొందేందుకు కుల, మహిళా సంఘాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలో గెలుపు కోసం భారీస్థాయిలో హామీలు గుప్పిస్తున్నారు. గ్రామాల్లో ఆలయాల నిర్మాణం, అభివృద్ధి పనులతోపాటు వ్యక్తిగత పనులపై సైతం హామీలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఒకరికి మించి మరొకరు అన్నట్టుగా ఓటర్ల మెప్పు కోసం ప్రయత్నిస్తున్నారు. మద్యం దుకాణాలు బంద్.. తొలి విడత ఎన్నికల నేపథ్యంలో 48 గంటల ముందుగానే వైన్షాపులు బంద్ కానున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి వైన్షాపులను మూసివేయనున్నారు. ఈ నెల 11న పోలింగ్ నిర్వహించనుండగా.. అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. ఫలితాల వెల్లడి పూర్తయ్యే వరకు వైన్షాపులను మూసివేసి ఉంచనున్నారు. వైన్షాపుల మూసివేత నేపథ్యంలో పలు గ్రామాల అభ్యర్థులు ఇప్పటికే భారీ స్థాయిలో మద్యాన్ని కొనుగోలు చేసి డంపులుగా నిల్వ చేసుకుంటున్నారు. -
ఆరుతడికే సాగునీరు
యాసంగి పంటలకు సాగునీటి ప్రణాళిక ఖరారు ● వారాబందీ పద్ధతిలో విడుదలకు నిర్ణయం ● కనీసం 15 రోజులకు ఒకసారి వదిలేలా చర్యలు ● ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా కేఎల్ఐ కింద 2.81 లక్షల ఎకరాలకు.. ● ఆర్డీఎస్ పరిధిలో పంట విరామం ప్రకటన ●చివరి వరకు అందించాలి.. యాసంగి సీజన్లోనూ వరిపంట పండించేందుకు వీలుగా నీటి సరఫరా చేయాలి. కేవలం మొక్కజొన్న, వేరుశనగ వంటి ఆరుతడి పంటలకే నీరందిస్తే మేం తీవ్రంగా నష్టపోతాం. కాల్వల వెంట నీరు వృథా కాకుండా మరమ్మతు చేపట్టాలి. చివరి దశలో పంటలు ఎండిపోకుండా ప్రణాళిక ప్రకారం నీటిని సరఫరా చేయాలి. – ఆలేటి మారయ్య, గట్టురాయిపాకుల, తెలకపల్లి మండలం రిజర్వాయర్లు నింపుతాం.. కేఎల్ఐ ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన యాక్షన్ ప్లాన్ ప్రకారం సాగునీరు సరఫరా చేస్తాం. ఇందుకోసం ముందుగా జిల్లాలోని ప్రధానమైన సాగునీటి రిజర్వాయర్లను నింపుతాం. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు వహిస్తూ యాసంగి పంటలకు నీటి సరఫరా చేపడతాం. – శ్రీనివాస్రెడ్డి, ఈఈ, నీటిపారుదల శాఖ సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఈసారి యాసంగి సీజన్లో ఆరుతడి పంటలకే సాగునీరు అందించనున్నారు. వారాబందీ పద్ధతిలో నీటి సరఫరా చేపట్టనుండగా.. కనీసం 15 రోజులకు ఒకసారి విడుదల చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల్లో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద అత్యధికంగా 2,81,754 ఎకరాలకు ప్రస్తుత సీజన్లో సాగునీటిని అందించనున్నారు. అలాగే సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న పెండింగ్ పనుల కారణంగా ఈసారి ఆర్డీఎస్ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు అధికారులు క్రాప్ హాలిడే (పంట విరామం) ప్రకటించారు. అత్యధికంగా కేఎల్ఐ.. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద ప్రస్తుతం 3,70,469 ఎకరాలు ఉండగా.. యాసంగి సీజన్లో 2,81,754 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఇందులో 2,01,317 ఎకరాల మేర ఆరుతడి పంటలతోపాటు మరో 80,437 ఎకరాలకు వరి సాగుకు నీటిని అందిస్తారు. అలాగే కోయిల్సాగర్ కింద 35,600 ఎకరాల ఆయకట్టు ఉంటే ఆరుతడి పంటలకు 7,700 ఎకరాలకే పరిమితం చేశారు. భీమా లిఫ్ట్–1 కింద 82,523 ఎకరాలు ఉండగా కేవలం ఆరుతడికి 21,690 ఎకరాల్లో నీరందిస్తారు. భీమా లిఫ్ట్–2 సైతం 92 వేల ఎకరాల ఆయకట్టుకు గాను 5,350 ఎకరాల్లో ఆరుతడి, 4,650 ఎకరాల్లో వరి పంటకు నీరందించనున్నారు. జూరాల ప్రాజెక్టు కింద మొత్తం 1,09,296 ఎకరాలకు గాను ఆరుతడి కింద 20,014 ఎకరాలకు, వరి 6,910 ఎకరాలకు సాగు నీరందించనున్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 1.42 లక్షల ఎకరాలకు గాను ఆరుతడికి 22,800 ఎకరాల మేరకు సాగునీటి సరఫరా చేయనున్నారు. ఈ మేరకు రైతులు పంటలను సాగుచేసేలా అవగాహన కల్పించనున్నారు. ప్రాజెక్టు మొత్తం ప్రతిపాదిత ఆరుతడి వరి ఆయకట్టు ఆయకట్టు పంటలు కేఎల్ఐ 3,70,469 2,81,754 2,01,317 80,437 కోయిల్సాగర్ 35,600 7,700 7,700 – భీమా లిఫ్ట్–1 82,523 21,690 21,690 – భీమా లిఫ్ట్–2 92,000 10,000 5,350 4,650 జూరాల 1,09,296 26,924 20,014 6,910 నెట్టెంపాడు 1,42,000 22,800 22,800 – ఆర్డీఎస్ 83,998 – – – ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల కింద యాసంగి ప్రణాళిక వివరాలు (ఎకరాల్లో) -
నిర్భయంగా ఓటేయండి
ఏకగ్రీవం పేరుతో పదవులను అమ్మొద్దు ● ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు ● జిల్లాలో 102 సమస్యాత్మక గ్రామాలు ● 600 మంది పోలీసులతో బందోబస్తు ● మద్యం, నగదు, సామగ్రి పంపిణీపై నిఘా ● ‘సాక్షి’తో ఎస్పీ టి.శ్రీనివాసరావు గద్వాల క్రైం: ‘‘జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ట ఏర్పాట్లు చేశాం. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో మూడు విడతలుగా నిర్వహించే ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. జిల్లాలో 600 మంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేకంగా నిఘా ఉంచాం. అల్లర్లు సృష్టించే వారిని గుర్తించి బైండోవర్ చేస్తున్నాం. మద్యం, నగదు, వస్తుసామగ్రితో ఓటర్లను మభ్యపెడితే కేసులు నమోదు చేస్తాం.’’ అని ఎస్పీ టి.శ్రీనివాసరావు అన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్పీ వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే.. ● పంచాయతీ ఎన్నికలు గ్రామ స్వరాజ్యం కోసం జరుగుతున్నాయి. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటుహక్కు వినియోగించుకున్నప్పుడే గ్రామాలకు పూర్తి స్వీయపాలన, స్వావలంబన సాధ్యమవుతుంది. సర్పంచ్ స్థానాలకు పోటీచేస్తున్న అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఓటర్లకు బహుమతులు, నగదు, మద్యం ఇచ్చినా.. ఓటర్లు స్వీకరిస్తూ పట్టుబడినా కేసులు నమోదు చేస్తాం. ఏకగ్రీవాల వేలంపై విచారణ.. గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదువులను ఏకగ్రీవం పేరుతో అమ్మొద్దు. జిల్లాలో పలు జీపీల ఏకగ్రీవానికి వేలం నిర్వహించినట్లు తెలిసింది. వాటిపై మూడు కమిటీలను నియమించి.. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టాం. జీపీల ఏకగ్రీవం కోసం వేలం నిర్వహించినట్లు నిజమని తేలితే.. ఆయా గ్రామాల్లో ఏకగ్రీవాలను రద్దుచేసే అవకాశం ఉంటుంది. మొదటి విడతలో 40, రెండో విడతలో 34, మూడో విడతలో 28 జీపీల్లో 102 సమస్యాత్మక గ్రామాలు, 1,048 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. జిల్లాలోని ర్యాలంపాడు, పుల్లూరు, నందిన్నె, బల్గెర వద్ద చెక్పోస్టులను ఏర్పాటుచేసి.. నిత్యం తనిఖీలు చేపడుతున్నాం. ఎన్నికల కోడ్ ప్రకారం సమావేశాలు, ర్యాలీలు, మైక్ పెట్టి ప్రచారం చేసేందుకు తప్పనిసరిగా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత పోలీస్స్టేషన్ నుంచి రెవెన్యూ అధికారులు రిమార్క్స్ తీసుకొని అనుమతి ఇస్తారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తాం. ఎవరైనా ఒత్తిడి చేసినా, ఇబ్బందులకు గురిచేసినా, అక్రమాలు, నేరాలకు పాల్పడినా వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలి. అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరాలి తప్ప.. ఇతరులను వక్రీకరించి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. సామాజిక మాధ్యమాలైన వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి వాటిలో ఇతరుల మనోభావాలు దెబ్బతీసే పోస్టులపై నిఘా ఉంచాం. వాటిని ఫార్వర్డు చేసినా తగు చర్యలు ఉంటాయి. ఎన్నికల నేపథ్యంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశాం. ఏఎస్పీ, డీఎస్పీ, సీఐలు తదితర సిబ్బందితో వివిధ అంశాలపై ఇప్పటికే సమావేశం నిర్వహించి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫోకస్ పెట్టాం. శాంతియత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పక్కా ప్రణాళికలు రూపొందించాం. పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ మానిటరింగ్ ద్వారా పర్యవేక్షణ ఉంటుంది. ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లు తెలిస్తే ప్రజలు పోలీసుశాఖకు సమాచారం అందించాలి. ముందస్తు బైండోవర్.. గత ఎన్నికల సమయంలో గొడవలు సృష్టించిన వారితో పాటు పాత నేరస్తులు, ఎన్డీపీఎస్ కేసులు ఉన్న 287 మందిని గుర్తించి బైండోవర్ చేశాం. మద్యం తరలిస్తున్న వారిపై 73 కేసులు నమోదుచేసి.. రూ. 6.64లక్షల విలువైన మద్యం (906.265 లీటర్లు) సీజ్ చేశాం. జిల్లాలో గన్ లైసెన్స్ పొందిన వారి నుంచి గన్స్ డిపాజిట్ చేసుకున్నాం. ఓటర్లను ఆకర్షించేందుకు గ్రామాల్లో మందు పార్టీలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. వాటిపై పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నాం. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ..
గ్రామాల్లో డబ్బున్నోళ్లు, పెత్తందారులు కలిసి కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారు. చిన్న గ్రామాల్లో సైతం ఆలయాల నిర్మాణం ఇతరత్రా అంటూ రూ.30–50 లక్షలు ఇచ్చిన వారినే సర్పంచ్ అభ్యర్థిగా నిలబెడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ప్రధానంగా సీడ్ మాఫియా, సీడ్ ఆర్గనైజర్లు పదవుల పందేరానికి పాల్పడుతున్నారు. సామాన్యులు, చదువుకున్న యువత ఆశావహులు డబ్బులు పెట్టలేక మిన్నంకుంటున్నారు. జిల్లాలో తొలి దశలో 15 గ్రామాల వరకు సర్పంచ్ పదవులకు వేలం నిర్వహించారు. – గొంగళ్ల రంజిత్, నడిగడ్డ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకుడు ● -
హక్కును కోల్పోతారు..
ప్రజాస్వామ్యంలో పోటీచేసే హక్కు ప్రతిఒక్కరికీ ఉంటుంది. అసలు ఏకగ్రీవమే కరెక్ట్ కాదు. దీంతో మిగతా వాళ్లు పోటీ చేసే హక్కును కోల్పోతారు. గ్రామాల్లో పెత్తందారులే ఏకగ్రీవాల పేరిట కుట్రలు చేస్తున్నారు. గ్రామస్థాయిలో సైతం పదవులకు వేలం అంటే రాజకీయాలు ఎంత దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించి.. ఇవ్వకపోవడం కూడా వేలం పాటల సంస్కృతి పెరిగేందుకు కారణమైంది. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం.. అత్యంత ప్రమాదకరం. – రాఘవాచారి, పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్● -
రుజువైతే జైలు శిక్ష.. అనర్హత వేటు
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు వేలం వేయడం రాజ్యాంగ విరుద్ధం. వేలం వేసిన వారు, వేలం ద్వారా పదవులు పొందిన వారు శిక్షార్హులు. నేరారోపణ రుజువైతే ఏడాది జైలుశిక్షతోపాటు ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడుతుంది. సింగిల్ నామినేషన్లు దాఖలైన చోట.. ఉపసంహరించుకున్న వారి నుంచి డిక్లరేషన్ తీసుకుంటున్నాం. జిల్లాస్థాయి ప్రత్యేక కమిటీ విచారణ చేపట్టి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) ఇచ్చాకే ఏకగ్రీవంపై ముందుకెళ్తాం. – బీఎం సంతోష్, కలెక్టర్, జోగుళాంబ గద్వాల ● -
ఎన్నికల విధులు బాధ్యతగా నిర్వహించాలి
కేటీ దొడ్డి: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహణలో సిబ్బంది అత్యంతం బాధ్యతతో తమ విధులు నిర్వహించాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని రైతు వేదికలలో 2వ సాధారణ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల సామగ్రిని పరిశీలించారు. అనంతరం పోలింగ్ ప్రక్రియ బ్యాలెట్ బాక్సులు, కవర్లు, సీళ్లపై సూచనలు చేస్తు మెటీరియల్ వినియోగంపై సూచనలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని అన్నారు. వారి వెంట ఎంపీడీఓ రమణరావు, జూనియర్ అసిస్టెంట్ గురునాధ్, ఆపరేటర్ ఖయ్యూం, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు. -
భక్తులతో కిటకిటలాడిన ఆదిశిలా క్షేత్రం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. బ్రహ్మోత్సవాలు, జాతర నేపథ్యంలో అర్చకులు ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం సెలవుదినం కావడంతో ఉమ్మడి పాలమూరు నుంచేగాక కర్ణాటక నుంచి భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి చేరుకొని స్వామివారికి దాసంగాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. అలాగే, జాతర మైదానం భక్తులతో సందడిగా మారింది. గృహోపకరణాలు, గాజులు, మిఠాయి దుకాణాలు, ఆట వస్తువులు, రంగుల రాట్నాల వద్ద భక్తుల తాకిడి ఎక్కువగా కనిపించింది. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ ప్రహ్లదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, పట్వారి అరవిందరావు, అర్చకులు మధుసూధనాచారి, రమేషాచారి, రవిచారి, దీరేంద్ర దాసు , రాఘవేంద్ర దాసు తదితరులు పాల్గొన్నారు. ‘ప్రభావిత ఉద్యమశక్తి జయరాజ్’ వనపర్తిటౌన్: సమాజాన్ని ప్రభావితం చేసిన శక్తి ప్రముఖ కవి, ఉద్యమ గాయకుడు జయరాజ్దే అని సాహితి కళావేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్గౌడ్ కొనియాడారు. ఆదివారం జిల్లాకేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ ఉద్యమ కవి, గాయకుడు, రాష్ట్ర కాళోజీ సాహిత్య పురస్కార గ్రహీత జయరాజ్ను సాహితి కళావేదిక ప్రతినిధులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వేదిక జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. కవిగా, గాయకుడిగా తన పంతా మార్చుకోకుండా ముందుకు సాగి తెలంగాణలో తనకంటూ సుస్థిర స్థానం సంపాదించుకున్నారని ప్రశంసించారు. సమాజాన్ని జాగృతం చేసే ఎన్నో పాటలు రచించి ఉద్యమ నిర్మాణంలో తన భక్తిని చాటారని కొనియాడారు. నిరంతరం పేద, బడుగు, బలహీనవర్గాల పక్షాన నిలబడి పోరాటం సాగిస్తున్నారని పేర్కొన్నారు. జయరాజ్ సాహిత్యం ఎంతోమంది వర్ధమాన కవులకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా జయరాజ్ తను రచించిన పలు పుస్తకాలను పలువురు సాహితీవేత్తలకు అందజేశారు. కార్యక్రమంలో కళావేదిక ప్రతినిధులు బైరోజు చంద్రశేఖర్, బండారు శ్రీనివాస్, నరేష్కుమార్, శ్యాంసుందర్, ఉప్పరి తిరుమల్లేశ్, రచయితలు డా. వీరయ్య, పపద్మావతి, డా. కంటే నిరంజనయ్య, మధుకర్, కిరణ్కుమార్, దర్శన్కుమార్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ‘ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రద్దు చేయాలి’ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: విద్యాహక్కు చట్టానికి సవరణ చేసి ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రద్దుచేయాలని టీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్లా అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏతోపాటు పీఆర్సీ అమలుతోపాటు రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలన్నారు. అనంతరం సంఘం జిల్లా నూతన ప్రధాన కార్యదర్శిగా తాహెర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు హమీద్అలీ, కార్యదర్శి మహమ్మద్ రహమతుల్లా, జిల్లా అధ్యక్షుడు సతీష్కుమార్, నాయకులు షేక్ఫరీద్, శశిధర్, మల్లికార్జున్, మోహన్, శరణప్ప, మురళి, శ్రీనివాస్, కృష్ణ పాల్గొన్నారు. ఉచిత శిక్షణ ప్రారంభం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని బీఈడీ కళాశాలలో ఉచిత సైకాలజీ శిక్షణ కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. ఈ మేరకు నారాయణపేట డీఈఓ గోవిందరాజులు మాట్లాడుతూ టెట్ అర్హత పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తరగతులను ఉచితంగా బోధించేందుకు అధ్యాపకుడు జనార్దన్రెడ్డి ముందుకు రావడం గొప్ప విషయం అన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే మొత్తం 70కిపైగా అభ్యర్థులు శిక్షణకు హాజరయ్యారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సరిహద్దులు అప్రమత్తమేనా..?
● ఎన్నికల వేళ మద్యం బార్డర్లు దాటే అవకాశం ● అక్రమ మద్యానికి దారులు వెతుకుతున్న దందారాయుళ్లు ● ఇప్పటికే చెక్పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు ఏపీ మద్యం..? ప్రస్తుతం ఏపీలో కొన్ని రకాల మద్యం బాటిళ్లు తక్కువ ధరకే వస్తున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా అక్కడి ప్రభుత్వం తక్కువ ధరకే చీప్ లిక్కర్ను అందుబాటులో ఉంచింది. కాని దాన్ని ఏపీలో మద్యం ప్రియులు కూడా తిరస్కరిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి లిక్కర్ వ్యాపారులు, జిల్లాలోని కొందరితో కుమ్మకై ్క నది మార్గం ద్వారా ఆ మద్యాన్ని జిల్లాలోకి పంపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రూ.110 కే చీప్ లిక్కర్ క్వాటర్ను ఇస్తుండగా, అందులో పలు రకాల బ్రాండ్లను అక్కడి ప్రభుత్వం మద్యం ప్రియులపైకి నెట్టింది. దాన్నే పేరు మార్చి కాని, బాటిళ్లను మార్చికాని జిల్లాలోకి పంపే అవకాశాలు ఉన్నాయని, తుంగభద్ర నది అవతల ఉన్న కర్నూల్ జిల్లాని ఆయా గ్రామాల నుంచి నది ఇవతలి వైపున ఉన్న జిల్లాలోకి రాకుండా మరింత పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు. కఠిన చర్యలు ఇప్పటికే చెక్పోస్టు ఏర్పాటు చేశాం. గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. ప్రతి గ్రామంలో విధిగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. పక్కా సమాచారం ఇచ్చే వాళ్లతో టచ్లో ఉంటున్నాం. చెక్పోస్ట్ సిబ్బందితో పాటు, గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు, వాహనాలపై నజర్ పెట్టాం. చిన్న అనుమానం వచ్చినా వదిలేది లేదు. అక్రమ మద్యం రవాణా చేసేవారిపై, గతంలో దందా చేసిన వారి కదలికలపై నిఘా ఉంచాం. దందాలు చేస్తే జైలు శిక్ష తప్పదు. – టాటాబాబు, సీఐరాజోళి: ఎన్నికల వేళ అక్రమ దందా రాయుళ్లు వారి వ్యాపారం చేసుకునేందుకు దారులు వెతుకుతున్నారు. గ్రామ పంచాయతీలు ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో ఇప్పటికే హడావుడి మొదలైంది. కాగా ఓటర్ల నుంచి ఓట్లు రాబట్టుకునేందుకు కొన్ని చోట్ల ప్రలోభాలు ఉంటాయనేది బహిరంగ రహస్యమే. అందులో ప్రధానంగా మద్యం పంపిణీ ఎక్కువగా జరిగే అవకాశాలు లేకపోలేదు. దీంతో గ్రామాల్లో ఇప్పటికే పోలీసులు నిఘా పెట్టారు. అయినప్పటికీ, పోటీలో నిలిచేవారు, అక్రమ మద్యం తెచ్చే వారితో కలిసి గ్రామాల్లో మద్యం సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రత్యేకించి నదీ పరివాహక గ్రామాల్లో దందాకు ముమ్మరంగా ప్రణాళికలు చేస్తున్నారని తెలుస్తుంది. జిల్లాలో ఉన్న మద్యంతో పాటుగా తక్కువ ధరకు లభించే మధ్య, చిన్న సైజు పాకెట్లలో లభించే మద్యంపై ఫోకస్ పెట్టారు. దీని కోసం కర్ణాటక ప్రాంతంలోని రాయచూరు తదితర పట్టణాల నుంచి కొన్ని రకాల మందు బాటిళ్లు తెచ్చే అవకాశాలున్నాయి. గతంలో జరిగిన ఎన్నికల సమయంలో కూడా అక్కడి నుంచి మద్యం పెద్ద ఎత్తున రవాణా జరిగింది. ఇదే తరహాలో మళ్లీ మద్యం రవాణా చేసేందుకు ఒప్పందాలు కుదిరినట్లు సమాచారం. నదీ తీర గ్రామాల్లో... కర్ణాటక నుంచి మద్యం తీసుకురావడానికి కట్టుదిట్టమైన పోలీస్ చెక్పోస్టులు ఉన్నప్పటికీ, ఆర్డీఎస్ కెనాల్ మీదుగా, ఇతర అడ్డదారుల్లో మద్యం తీసుకువచ్చేందుకు మార్గం ఏర్పాటు చేసుకుంటున్నారని సమాచారం. గతంలో మాదిరిగానే కర్ణాటకలో కొన్ని ప్రత్యేక టెట్రా పాకెట్లల్లో లభించే మద్యం, 90 ఎంఎల్ ప్యాకెట్లు, గోవా నుంచి తక్కువ ధరకు తీసుకువచ్చే మద్యాన్ని గ్రామాల్లోకి తరలించేందుకు రాజోళి మండలంలోని తుమ్మిళ్ల, ముండ్లదిన్నె గ్రామాలకు చెందిన వ్యక్తులు, అయిజ, రాయచూరు, గట్టు మండలంలోని పలువురితోపాటు ఏపీలోకి కర్నూలు జిల్లాలోని పలు గ్రామాల వారితో ఒప్పందాలు చేసుకున్నారని సమాచారం. కాగా రాజోళి పోలీస్స్టేషన్ పరిదిలోని సుంకేసుల డ్యాం వద్ద చెక్పోస్టు ఏర్పాటు చేశారు. అక్రమ మద్యంతో పాటు, ఎన్నికల సందర్భంగా డబ్బు, ఇతర ప్రలోభాలకు గురి చేసే వాటి రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో రోడ్డు మార్గంలో ఏపీ వ్యక్తులు అక్రమ మద్యాన్ని తెలంగాణలోకి తెచ్చే అవకాశం లేదు, కాని నదీ తీర గ్రామాల్లో పుట్టీల ద్వారా అక్రమ మద్యం వ్యాపారం యథేచ్ఛగా నడిచిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే తరహాలో కర్ణాటక నుంచి కర్నూలు జిల్లాలోని పలు గ్రామాల్లోకి మద్యం చేర్చుకుని, అక్కడి నుండి నది ఇవతలి వైపున ఉన్న జిల్లాలోని పలు గ్రామాలకు మద్యం చేరవేసేందుకు అవకాశాలున్నాయని ఆయా గ్రామాల్లోని పలువురు పేర్కొంటున్నారు. ఎన్నికల పుణ్యమా అని కల్లీ మద్యం తెచ్చి ప్రజలకు ఇస్తే దాని వల్ల ప్రజల ఆరోగ్య పరిస్థితి ఏంటని అంటున్నారు. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
అయిజ: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని, కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యర్తల సమావేశం నిర్వహించారు. అదేవిధంగా ఏకగ్రీవంగా ఎన్నికై న సర్పంచ్లకు శాలువాలు, పూలమాలలతో సత్కారం చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే నిధులు అడిగేందుకు హక్కు, బాధ్యత ఉండేదని, ఓడిపోయినందుకు నిధులు అడిగేందుకు నైతికమైన అర్హత కోల్పోయానని అన్నారు. నిధులు లేకనో, వనరులు లేకనో గెలిచిన ఎమ్మెల్యేలకే నిధులు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అయినా సరే నిధులు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తానని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలముందు ఎన్నో హామీలు ఇచ్చిన ఎమ్మెల్సీ చల్లా వెంట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు రెండు సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని విమర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంకాపురం రాముడు, షేక్షావలి ఆచారి, జయరాముడు, మద్దిలేటి, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల్లో రసవత్తర పోరు
● గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెట్టిన అభ్యర్థులు ● పార్టీ రహిత ఎన్నికలైనప్పటికీ.. ఉనికి చాటేందుకు పార్టీల పాట్లు ● ఊపందుకున్న ప్రచార సందడి గద్వాలటౌన్: పంచాయతీ ఎన్నికలను గద్వాల నియోజకవర్గంలోని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. పార్టీ రహిత ఎన్నికలైనప్పటికి రాజకీయ పార్టీలు తమ ఉనికిని చాటుకునేందుకు అనేక పాట్లు పడుతున్నాయి. రాబోయే మండల, జిల్లా పరిషత్తు ఎన్నికలు పార్టీ పరంగా జరుగుతాయి. కాబట్టి ఇప్పుడే సర్పంచులను తమ తమ వాళ్లుగా అనిపించుకోవాలని ఉద్దేశ్యంతో వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నాయి. మరో వైపు సర్పంచ్ పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల పోటాపోటీని దృష్టిలో పెట్టుకుని అర్ధబలం, అంగబలం కోసం పార్టీల చుట్టూ తిరుగుతున్నారు. ఇదే అదనుగా పార్టీల నాయకులు కూడా తమదైన ముద్ర వేసేందుకు గ్రామాల్లో పడరాని పాట్లు పడుతున్నారు. ఊపందుకున్న ప్రచారం.. మొదటి, రెండవ విడత ఎన్నికల వేడి రాజుకుంది. సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఖరారవటంతో ప్రచార పర్వం ఊపందుకుంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.. సర్పంచ్గా గెలిచేందుకు ఉవ్విళ్లూరుతున్న ఒక్కో అభ్యర్థి ఒక్కో పంథా అవలంభిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కొందరు సామాజిక మాధ్యమాలను విరివిరిగా వినియోగించుకుంటే.. మరి కొందరు ‘ నేను ఇవి చేసి చూపిస్తా’నంటూ బాండ్ పేపర్లు రాసిస్తున్నారు. ఇదిలా ఉంటే మూడవ విడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో అక్కడ కూడా పల్లెపోరు రసవత్తరంగా మారింది. స్థానిక వర్గాలు, సామాజిక సమీకరణాలు, వ్యక్తిగత పలుకుబడి కీలకంగా మారనున్నాయి. ప్రలోభాల పర్వం కుల సంఘాలు, వార్డు సమూహాలు, పెద్ద కుటుంబాలకు ప్రత్యేక విందులు ఏర్పాటు చేసేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు ముందురోజు ఓటుకు కొంత నగదు ఇవ్వటం ద్వారా ఓట్లు కొల్లగొట్టేందుకు నిధులు సమకూర్చుకుంటున్నారు. యువతను ఆకట్టుకునేందుకు రాత్రిపూట మద్యం పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. -
దారి తప్పిన సంగ్రామం..!
నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని తిప్పాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఓ వీధికి వెళ్లేందుకు వేసిన మట్టి రోడ్డు ఇది. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు తదితర అభివృద్ధి పనులు చేపట్టాలనే లక్ష్యంతో 2019లో ఊరంతా ఏకమై ఏకగ్రీవం చేసుకున్నారు. ఆ నిధులు వస్తే గ్రామ అభివృద్ధికి దోహదపడతాయని ఆశించారు. నజరానా రాకపోవడంతో సాధారణంగా వచ్చే నిధులతో తూతూమంత్రంగా పనులు చేపట్టారు. ఇప్పటికీ పలు వీధుల్లో సీసీరోడ్లు, పంచాయతీకి సొంత భవనం లేదు. అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన పాత భవనంలోనే కొనసాగుతోంది. ..ఈ ఒక్క గ్రామమే కాకుండా.. ఉమ్మడి పాలమూరులోని అన్ని ఏకగ్రీవ పంచాయతీల్లో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. పారితోషికం రాక.. నిర్దేశించుకున్న పనులు కాక.. స్థానిక ప్రజల్లో నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి. ఈ క్రమంలో ట్రెండ్ మారి వేలం పాటల ద్వారా ఏకగ్రీవాలకు క్రేజీ పెరుగుతుండగా.. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలయ్యే ప్రమాద ఘంటికలు పొంచి ఉన్నాయి. యునానిమస్ లక్ష్యం నెరవేరకపోవడం.. దారి తప్పుతున్న సం‘గ్రామం’ తీరుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్ ఉవ్ముడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో గత పంచాయతీ ఎన్నికల్లో మొత్తంగా 322 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాలో 113, నాగర్కర్నూల్లో 80, జోగుళాంబ గద్వాలలో 48, వనపర్తిలో 45, నారాయణపేట జిల్లాలో తక్కువగా 36 పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్థానాలన్నింటినీ గ్రామస్తులంతా ఒక్కతాటికి వచ్చి ఏకగ్రీవం చేసుకున్నారు. ఆలయ నిర్మాణాల వంటి ప్రధాన పనులు పూర్తి చేస్తామంటూ పలు జీపీల్లో ముందుకు రాగా.. ఆ అభ్యర్థులకు సర్పంచ్ అవకాశం ఇచ్చారు. కానీ, పెద్దగా వేలం పాటలు నిర్వహించిన దాఖలాలు లేవు. ఆయా ప్రాంతాల్లో ప్రచారం జరుగుతోంది. ● జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలోని చింతకుంట గ్రామాన్ని ఏకగ్రీవం చేసేందుకు కొందరు గ్రామపెద్దలు యత్నించారు. రూ.38.50 లక్షలకు ఏకగ్రీవం చేస్తూ.. సదరు అభ్యర్థి మినహా ఎవరూ నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని గ్రామానికి చెందిన ఒకరు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. విచారణ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ● నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం రాఘాయిపల్లి సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు పెద్దలు తీర్మానించగా బెడిసి కొట్టింది. రూ.25 లక్షలు ఇస్తానని ఒకరు ముందుకు రాగా.. ఓ అభ్యర్థి వ్యతిరేకించారు. దీంతోపాటు తన నామినేషన్ ఉపసంహరించుకుంటే రూ.5 లక్షలు ఇస్తానని ప్రలోభపెట్టడమే కాకుండా బెదిరిస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. దీనిపై ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఒకరిపై కేసు నమోదు చేశారు. మచ్చుకు కొన్ని.. మారిన ట్రెండ్.. డబ్బున్నోళ్లకే చాన్స్? ప్రస్తుత జీపీ ఎన్నికల్లో ఏకగ్రీవాల ట్రెండ్ మారింది. పలు పంచాయతీల్లో పోటీచేసే ఆయా పార్టీలకు చెందిన మద్దతుదారులతో గ్రామాల పెద్దలు భేటీ ఏర్పాటు చేసి.. ఎవరు ఎంత ఇస్తారంటూ వేలం పాటలకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొదటి దశలో 550 గ్రామాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇందులో 44 జీపీలకు సంబంధించి సర్పంచ్, వార్డు స్థానాల్లో ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో మెజార్టీ చోట్ల వేలం పాటల ద్వారానే సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవం చేసేలా పెద్దలు చక్రం తిప్పారు. కొన్నిచోట్ల సర్పంచ్ స్థానాల్లో వేలం పాడి పోటీ లేకుండా ఒక్కరితోనే నామినేషన్లు వేయించారు. ఇలా ఒక్కరే నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఎక్కువగా రియల్టర్లు, బడా వ్యాపారులే ఉండడం గమనార్హం. దాదాపు 88 శాతం మేర.. ఉమ్మడి జిల్లాలో తొలిదశ ఎన్నికల్లో 44 గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఒక్కొక్కటి చొప్పునే నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 39 గ్రామాల వరకు వేలం ద్వారా పదవులకు తీర్మానం చేసి.. ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్ వేసేలా పెద్దలు చక్రం తిప్పినట్లు నిబంధనలు కఠినం.. కొన్ని ప్రాంతాల్లో వేలం పాటల ద్వారా గ్రామాలను ఏకగ్రీవం చేస్తున్నారనే అంశం ఎన్నికల కమిషన్ దృష్టికి రావడంతో నిబంధనలను మరింత కఠినం చేసింది. నిబంధనల ప్రకారం ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు ఏకగ్రీవమైన జీపీల్లో నామినేషన్లు ఉపసంహరించుకున్న వారి నుంచి డిక్లరేషన్ తీసుకుంటున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. రాజకీయ నేతల ప్రోద్బలంతో ఉపసంహరించుకున్న వారు మిన్నకుండిపోక తప్పని పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వేలం ద్వారా పదవులు పొందిన వారిపై చర్యలుంటా యా అనేది ప్రశ్నార్థకమేనని సీనియర్ రాజకీయ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ ‘పెద్దల’ చేతుల్లోకి సమస్త గ్రామవాసుల నిర్ణయాధికారం రియల్, వ్యాపార రంగాలకు చెందిన యువతకే గ్రీన్సిగ్నల్ భారీ మొత్తం చెల్లించలేక ఔత్సాహికుల వెనకడుగు పల్లెపోరు పెడదారి పట్టడంతో పలుచోట్ల ‘పంచాయితీ’ యునానిమస్ లక్ష్యం నెరవేరకపోవడమూ కారణమంటున్న మేధావులు -
ఓటులోనూ నారీ శక్తి!
జిల్లాల వారీగా ఓటర్ల వివరాలు ఇలా.. సాక్షి, నాగర్కర్నూల్: పంచాయతీ ఎన్నికల్లో మహిళలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల బరిలో మహిళలే అధిక సంఖ్యలో పోటీలో ఉండగా.. ఓటర్లుగానూ పురుషుల కన్నా మహిళల సంఖ్యే ఎక్కువగా ఉంది. ఫలితంగా ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేసేలా మహిళాశక్తి పనిచేయనుంది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లోనూ పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. వీరి ఓట్లను గంపగుత్తగా దక్కించుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 50 శాతం రిజర్వేషన్.. పంచాయతీ ఎన్నికల్లో మొత్తం సర్పంచ్, వార్డు స్థానాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉండగా, ఈ మేరకు స్థానాలన్నింటిలో మహిళలే అభ్యర్థులుగా బరిలో ఉంటున్నారు. వీటితోపాటు జనరల్ స్థానాల్లోనూ కొన్నిచోట్ల మహిళలు పోటీలో ఉంటున్నారు. గతంలో మహిళ రిజర్వేషన్ ఉన్నచోట్ల ప్రజాప్రతినిధులుగా ఎన్నికై న వారు ఈసారి రిజర్వ్ కాకపోయినా పోటీలో ఉంటున్నారు. అలాగే ఇప్పటికే ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు జనరల్ స్థానాల్లోనూ తమ సతీమణులను బరిలో దింపుతున్నారు. మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కారణంగా 50 శాతం స్థానాలతోపాటు మిగతా రిజర్వ్ కాని చోటా మహిళలు పోటీచేస్తుండటంతో 50 శాతానికి మించి మహిళలే ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కానున్నారు. సంఘాలతో సంప్రదింపులు.. గ్రామాల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే శక్తిగా మహిళా ఓటర్లు ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు దృష్టిసారిస్తున్నారు. ప్రత్యేకంగా మహిళా సంఘాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. స్థానికంగా మహిళల సమస్యలపై దృష్టిసారించి హామీలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో త్వరితగతిన పరిష్కారానికి వీలున్న వాటిని పూర్తిచేసేందుకు సైతం ప్రయత్నాలు సాగిస్తున్నారు. జిల్లా పురుషులు మహిళలు మొత్తం ఓటర్లు మహబూబ్నగర్ 2,48,222 2,51,349 4,99,582 నాగర్కర్నూల్ 3,23,016 3,24,315 6,47,342 వనపర్తి 1,90,068 1,92,223 3,82,295 జోగుళాంబ గద్వాల 1,93,627 1,99,781 3,93,418 నారాయణపేట 1,94,124 2,02,410 3,96,541 పంచాయతీ ఎన్నికల్లో ప్రభావిత వర్గంగా మహిళా శక్తి ఎన్నికల బరిలో 50 శాతంపైగా వారిదే హవా జనరల్ స్థానాల్లోనూ పోటాపోటీ ఇటు ఓటర్లు గానూ మెజార్టీ స్థాయిలో.. -
పోరుబాట ద్వారానే రిజర్వేషన్లు సాధ్యం..
సాయి ఈశ్వర్ మృతితోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రావాలి. అతడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి ఇచ్చి ఆదుకోవాలి. పోరు బాట ద్వారానే బీసీలకు రిజర్వేషన్లు సాధ్యం. పార్టీ పరంగా 42 శాతం సీట్లు కేటాయిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ చిత్తశుద్ధితో నిరూపించుకోవాలి. కాంగ్రెస్తోపాటు ఇతర పార్టీలు కూడా సర్పంచ్, వార్డులకు సంబంధించి జనరల్ స్థానాల్లో ఎంత మంది బీసీ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నారో జాబితా వెల్లడించాలి. – రాచాల యుగంధర్ గౌడ్, బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ -
గద్వాల కోసం ఏం సాధించారో ఎమ్మెల్యే చెప్పాలి
గద్వాలటౌన్: నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారినట్లు చెప్పుకుంటున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, రెండేళ్లలో ప్రత్యేకంగా ఏం అభివృద్ధి సాధించారో ప్రజలకు చెప్పాలని మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ నిలదీశారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. సొంత ప్రయోజనాలు, రాజకీయ ఉనికి కోసమే ఎమ్మెల్యే పార్టీ మారారని ధ్వజమెత్తారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకున్న పాపన పోలేదని విమర్శించారు. రేవులపల్లి వద్ద వెంటనే ప్రాజెక్టు సేప్టీ బ్రిడ్జి కట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు, సంక్షేమ పథకాలతోనే రాష్ట్రంలో, జిల్లాలో అభివృద్ధి కొనసాగుతోందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, కేంద్రం సాయంతోనే 75 శాతం గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి సీఎం, ఇద్దరు మంత్రులున్నా వారు పదవులు నిలుపుకొనేందుకు, గ్రూపు రాజకీయాలను కట్టడి చేయడానికి తప్ప జిల్లా అభివృద్ధికి ఇచ్చిన నిధులు శూన్యమని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని, కేవలం 20 శాతం మాత్రమే కల్పించి మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్కు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఆరు గ్యారంటీలతో ప్రజలను నిండా మోసం చేశారని విమర్శించారు. రెండేళ్లలో ఏం సాధించారని విజయోత్సవాలు జరుపుకొంటున్నారని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచులతో పనులు చేయించుకుని బిల్లులు ఇవ్వకుండా అప్పులపాలు చేసిందని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలలో బీజేపీ మద్దతుదారులను గెలిపిస్తే.. ఆయా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఇన్చార్జి బాబురెడ్డి, నాయకులు రామంజనేయులు, డీకే స్నిగ్దారెడ్డి, రామచంద్రారెడ్డి, బండల వెంకట్రాములు, శ్యామ్రావు, రాజగోపాల్, శివారెడ్డి, జయశ్రీ, సమత తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
గద్వాలటౌన్/అలంపూర్: బతిమాలో.. భంగపడో మొత్తానికి ప్రధాన రాజకీయ పార్టీల మద్దతుదారులు దాదాపు తమ తిరుగుబాటు అభ్యర్థులను దారికి తెచ్చుకున్నారు. జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన శనివారం ప్రధాన పార్టీల మద్దతుదారులను భయపెట్టిన రెబల్స్తో పాటు కొంతమంది ప్రత్యర్థి పార్టీల మద్దతుదారులు పోటీ నుంచి పక్కకు తప్పుకున్నారు. మల్దకల్ మండలంలో కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యే వర్గం, జడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వర్గాల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. అయిజ, రాజోలి, వడ్డేపల్లి మండలాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుదారుల మధ్య పోటీ త్రీవంగా ఉంది. ఽఆయా వర్గాల మద్దతుదారులకు తిరుగుబాటు బెడద తప్పడం లేదు. వారి వల్ల తమ విజయావకాశాలకు వచ్చే నష్టం లేదని పార్టీ మద్దతుదారులు ఎమరికి వారు ధీమాగా ఉన్నా ఎంతోకొంత ప్రభావం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండవ దశ గ్రామ పంచాయతీలలో ఉపసంహరణ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. దీంతో ఎన్నికల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణలో ఆయా ఎన్నికల నామినేషన్ కేంద్రాలు నాయకులు, కార్యకర్తలతో కిక్కిరిసిపోయాయి. 18 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం పంచాయతీ రెండవ దశ ఎన్నికలలో పలు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. రెండవ దశ ఎన్నికలు జరిగే మల్దకల్, అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లోని 74 గ్రామ పంచాయతీలకుగాను 18 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మల్దకల్ మండలంలో 5, అయిజలో 7, వడ్డేపల్లిలో 5, రాజోలి మండలంలో 1 గ్రామ పంచాయతీలలో సింగిల్ నామినేషన్ దాఖలు కావడంతో వాటిని అధికారులు ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. కోరం ఉన్న గ్రామ పంచాయతీలలో ఉప సర్పంచులను సైతం ఎన్నుకున్నారు. గుర్తుల కేటాయింపు రెండో విడత నామినేషన్ల ఘట్టం పూర్తవగా.. ఈనెల 14న జరిగే ఎన్నికలకు పోటీలో ఉండే సర్పంచు, వార్డు సభ్యులకు వేర్వేరుగా కేటాయించే గుర్తులను అధికారులు ప్రకటించారు. ఎన్నికల సంఘం నుంచి పంచాయతీ అధికారులకు వచ్చిన ఉత్తర్వుల మేరకు గుర్తులను కేటాయించారు. పోటీలో నిలిచే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నా ఇబ్బంది కలగకుండా 10–15 రకాల గుర్తులను కేటాయిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ గుర్తులతో కూడిన వివరాలు అన్ని గ్రామ పంచాయతీలకు చేరాయి. నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన వెంటనే పోటీలో నిలిచిన అభ్యర్థులకు అధికారులు అధికారికంగా గుర్తులను కేటాయించారు. ఈ నెల 7వ తేదీ నుంచి పోలింగ్కు ముందు రోజు వరకు కేవలం వారం రోజుల వ్యవధి మాత్రమే ఉంది. దీంతో అభ్యర్థులు వారికి కేటాయించిన గుర్తులతో కరపత్రాలు, వాల్పోస్టర్లు ముద్రించుకుని ఓటర్ల వద్దకు వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బిర్యానీలు, మద్యం సీసాల పంపిణీకి ఇంకొందురు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొత్తంగా అసలు సిసలు ఎన్నికల వాతావరణం పల్లెల్లో మొదలైంది. మూడో విడతలో జోరుగా నామినేషన్లు మూడో విడతగా అలంపూర్, మానవపాడు, ఉండవల్లి, ఇటిక్యాల, వడ్డేపల్లి మండలాల సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ శుక్రవారం ముగిసింది. చివరి రోజు కొన్ని కేంద్రాల్లో నామినేషన్ ప్రక్రియ అర్ధరాత్రి సైతం కొనసాగిన విషయం తెలిసిందే. ఐదు మండలాల్లో 75 సర్పంచ్ స్థానాలకు 438, 700 వార్డులకు 1489 నామినేషన్లు దాఖలయ్యాయి. మూడో విడతలో సర్పంచ్కు 438, వార్డులకు 1489 నామినేషన్లు రెండో దశలో 18 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం ఊపిరి పీల్చుకున్న పార్టీలు సమరానికి సిద్ధమైన అభ్యర్థులు -
పోరాడి సాధించుకుందాం.. ఆత్మహత్యలు వద్దు..
సాయి ఈశ్వరాచారి మృతి బాధించింది. పాలకుల మెడలు వంచి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించుకుంటాం. దశల వారీ పోరాటాలకు సిద్ధం. పూలే, పండుగ సాయన్న బాటలో ముందుకు సాగుతాం. బీసీలు అడగకముందే 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ మాట తప్పి.. మోసం చేసింది. బీసీ రిజర్వేషన్లను పోరాడి సాధించుకుందామే తప్ప.. ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఈశ్వర్ చారి మృతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. – బెక్కం జనార్దన్, బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఇప్పటికై నా మేల్కోవాలి.. బీసీలకు రాజ్యాధికారం రావడం కష్టమని భా వించి సాయి ఈశ్వరా చారి బలిదానం కావ డం బాధేస్తోంది. బీసీల కు 42శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ మోసం చేసింది. 17 శాతానికే పరిమితం చేయడం దారుణం. బీసీలను మోసం చేస్తూ ముందుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆగ్రహానికి గురికాక తప్పదు. ఇప్పటికై నా మేల్కోవాలి. లేకుంటే పోరు బాట తప్పదు. మాకు ఉద్యమం కొత్త కాదు.. బీసీలందరం ఏకమై సత్తా ఏంటో చూపిస్తాం. – శ్రీనివాస్ సాగర్, బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ● -
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
ధరూరు: వసతిగృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిణి నుషిత అన్నారు. శనివారం మండలంలోని ఉప్పేరు ప్రభుత్వ ఎస్సీ హాస్టల్ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, వంట గది, స్టోర్ రూం, సరుకులు, విద్యార్థులకు అందిస్తున్న భోజనం, ఆహార నాణ్యత, షానిటేషన్, బాత్రూంల శ్రుభ్రత తదితర వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థుల చదువు ప్రగతి, ట్యూటర్ల బోధనా విధానం, అధ్యయన సమయం తదితర వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సారి 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచించారు. -
పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
గద్వాల న్యూటౌన్: జోనల్ అధికారులు ఇతర అధికారులను సమన్వయం చేసుకుంటూ గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి రమేష్బాబు, డీపీఓ శ్రీకాంత్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని ఐడీఓసీ హాల్లో మూడు విడతల్లో విధులు నిర్వర్తించే జోనల్ అధికారులకు శిక్షణ నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. పోలింగ్ నిర్వహణకు ఒకరోజు ముందుగానే పోలింగ్ సామగ్రి అందించే ప్రిసైడింగ్ అధికారులకు జోనల్ అధికారులు సహకరించాలని సూచించారు. ఆయా పంచాయతీల్లో 87 మంది జోనల్ అధికారులకు రూట్ల ప్రకారం బాధ్యతలు అప్పగించడం జరుగుతుందని చెప్పారు. పోలింగ్ సందర్భంగా ఎక్కడైనా సమస్యలు వచ్చినా, సామగ్రి కొరత ఏర్పడినా వెంటనే అక్కడి సిబ్బందికి సహకారం అందించి, అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయి పోలింగ్ సామగ్రిని రిసెప్షన్ కేంద్రంలో అప్పగించేంతవరకు ఆయా రూట్లవారీగా బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు విజయవంతం చేయాలని సూచించారు. -
మళ్లీ.. బీసీ లొల్లి!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: వెనుకబడిన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్పై మళ్లీ లొల్లి మొదలైంది. హైదరాబాద్లో సాయి ఈశ్వరాచారి మృతితో బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఆయా సంఘాలకు చెందిన పలువురు నేతలు ఆయనది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్యే అని ధ్వజమెత్తుతున్నారు. ఈ క్రమంలో బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఆదివారం మహబూబ్నగర్ జిల్లాలో కొవ్వొత్తుల ప్రదర్శనకు పిలుపునివ్వగా.. వేడి రాజుకుంది. పంచాయతీ పోరు మొదటి విడతలో ప్రచారం హోరెత్తుతుండగా.. రెండో దశకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు పూర్తి కాగా.. నేటి నుంచి ప్రచారం మొదలు కానుంది. చివరి దఫాకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. ఇలా పంచాయతీ సంగ్రామం కీలక ఘట్టానికి చేరుకున్న క్రమంలో మళ్లీ బీసీ లొల్లి రాజుకోవడం రాజకీయ పార్టీలను కలవరానికి గురి స్తోంది. 42 శాతం ఏమైంది.. స్థానిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తొలుత బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ ఆర్డినెన్స్ తెచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత స్థానిక ఎన్నికలకు వెళ్లగా.. హైకోర్టులో అడ్డంకులు ఎదురయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. నోటిఫికేషన్ వెలువడే రోజు రిజర్వేషన్లు 50 శాతం పరిమితి దాటొద్దనే సుప్రీంకోర్టు సూచనలతో ప్రక్రియ నిలిచిపోయింది. ఈ క్రమంలో బీసీ సంఘాలు ఉద్యమాన్ని తీవ్రం చేసే దిశగా అడుగులు వేశాయి. కాంగ్రెస్ ముఖ్య నేతలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్పై వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని.. ప్రస్తుతం చట్టపరంగా ముందుకెళ్లలేని పరిస్థితి ఉందని చెప్పారు. ఈ మేరకు పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తూ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మూడు దశల పల్లె పోరు కీలక ఘట్టానికి చేరుకోగా.. బీసీలకు 42 శాతం సీట్ల కేటాయింపు ఎంతవరకు వచ్చిందంటూ బీసీ సంఘాలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. సంఘటితంగా పోరు బాట.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనలో భాగంగా బీసీ సంఘాలు, వెనుకబడిన తరగతులకు చెందిన కులసంఘాలు సంఘటితంగా పోరాడాలని నిర్ణయించాయి. ప్రధానంగా బీసీ సంక్షేమ, బీసీ సమాజ్, బీసీ పొలిటికల్ జేఏసీ, మున్నూరు కాపు, ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ, బీసీ లెక్చరర్ల ఫోరం, విశ్వకర్మ, బీసీ మేధావులు, యాదవ, నాయీబ్రాహ్మణ, రజక తదితర సంఘాలు ఏకమై బీసీ ఐక్యకార్యాచరణ కమిటీగా ఏర్పడ్డాయి. రెండు దశలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ.. చివరి దశలో నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసిన నేపథ్యంలో బీసీలకు పార్టీ పరంగా 42 శాతం సీట్లు కేటాయిస్తామన్న అధికార కాంగ్రెస్ నేతల హామీ ఏమైంది అంటూ బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. బీసీలకు మద్దతు ప్రకటించడం వరకు మాత్రమే బీఆర్ఎస్, బీజేపీ పరిమితమా అని నిలదీస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయించాలని ఈశ్వరాచారి ఆత్మహత్యకు యత్నించడం.. చికిత్సపొందుతూ ఆయన మృతి చెందడం వెనుకబడిన వర్గాల్లో విషాదం అలుముకుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఆదివారం కొవ్వొత్తుల ప్రదర్శనకు పిలుపునివ్వడంతో మళ్లీ సెగ రాజుకున్నట్లు తెలుస్తోంది. మా ఓటు బీసీలకే..42 శాతం రిజర్వేషన్పైసంఘాల పోరు ఇప్పటికే బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు హైదరాబాద్లో సాయి ఈశ్వర చారి మృతితో కదలిక నేడు కొవ్వొత్తుల ప్రదర్శనకు పిలుపు ఉమ్మడిగా దశల వారీ ఉద్యమబాటకు సన్నాహాలు సం‘గ్రామం’ వేళ మారుతున్న పరిణామాలతో రాజకీయ పార్టీల్లో కలవరం -
దళితుల అభ్యున్నతికి కృషి
గద్వాలటౌన్: దళిత, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే ధ్యేయంగా కేంద్రంలోని ఎన్టీయే ప్రభు త్వం పని చేస్తోందని ఎంపీ డీకే అరుణ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో శనివారం అంబేడ్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ● రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన జీవితం అందరికి ఆదర్శమని జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత కొనియాడారు. జిల్లా కేంద్రంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ మహా విద్యా వేత్త అని, విద్యను ప్రచారం చేయడం కోసం ఎంతో కృషి చేశారన్నారు. ● సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఉప్పేర్ నర్సింహ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివిధ ప్రజా సంఘాల నాయకులు అంబేడ్కర్ వర్థంతి వేడుకలలో పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.8,224 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు శనివారం 213 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.8,224, కనిష్టం రూ.4,700, సరాసరి రూ.6789 ధరలు లభించాయి. అలాగే, 9 క్వింటాళ్ల ఆముదాలు రాగా, గరిష్టం రూ.5907, కనిష్టం రూ.5250, సరాసరి రూ.5907 ధరలు పలికాయి. -
హోంగార్డుల సేవలు కీలకం
గద్వాల క్రైం: పోలీసుశాఖలో హాంగార్డుల సేవలు ఎంతో కీలకమని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో హోంగార్డు రైజింగ్ డే సందర్భంగా సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సేవా స్ఫూర్తితో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఉండడం ఎంతో అభినందనీయమన్నారు. జిల్లా కేంద్రంలోని వివిధ విభాగలైన ట్రాఫిక్, పెట్రోలింగ్, డ్రైవింగ్ సేవలు చేస్తు పోలీసుశాఖకు విశిష్ట సేవలు అందిస్తున్నారన్నారు. హోంగార్డు సమస్యలపై ప్రత్యేక చొరవ తీసుకుని పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సమావేశంలో ఏఎస్పీ శంకర్, డీఎస్పీ తదితరులు ఉన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ముందుండాలి ఎర్రవల్లి: హోంగార్డ్స్ భవిష్యత్తులో తమ నైపుణ్యం పెంపొందించుకొని శాంతిభద్రతల పరిరక్షణలో ముందుండాలని పదో బెటాలియన్ కమాండెంట్ జయరాజు అన్నారు. శనివారం బీచుపల్లి పదో బెటాలియన్లో హోంగార్డ్స్ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించగా కమాండెంట్ హాజరై సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డ్స్ చూపుతున్న సేవలు, వినమ్రత క్రమశిక్షణ నిబద్దతకు నిదర్శనమని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో, పండుగలు, ప్రజాకార్యక్రమాలు, ప్రమాదాలు, రక్షణ చర్యలు, మొదలైన కీలక సమయాల్లో ప్రజల కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్న హోంగార్డ్స్, పోలీస్శాఖకు బలమైన తోడ్పాటును అందిస్తున్నారని అన్నారు. అనంతరం బెటాలియన్లో వివిద విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన హోంగార్డ్స్ శ్రీకాంత్, ధనుంజయ్, అశోక్ లకు అభినందించి వారికి కమాండెంట్ జ్ఞాపికలను బహుకరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ పాణి, రిజర్వ్ ఇన్సె ్ఫక్టర్లు ధర్మారావు, నర్సింహారాజు, ఆర్పీసింగ్, రాజేశం, సిబ్బంది ఉన్నారు. ఆదిశిలా క్షేత్రంలో జడ్జి పూజలు మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని శనివారం గద్వాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నేరెళ్ల పూజిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తికి ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించగా, అర్చకులు, చైర్మన్ స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించి మెమోంటోను అందజేశారు. వారి వెంట పట్వారి అరవిందరావు, మధుసూధన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రావు సిబ్బంది తదితరులు ఉన్నారు. -
ఆదిశిలా క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
మల్దకల్: ఆదిశిలాక్షేత్రమైన స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. గురువారం అర్ధరాత్రి కనులపండువగా రథోత్సవం నిర్వహించగా.. వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి భక్తులు పెద్దసంఖ్యలో హాజరై స్వామి వారికి దాసంగాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నెల రోజులపాటు స్వామి వారికి దాసంగాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. వాహనాలు, ఎడ్లబండ్లపై ఆలయానికి భక్తులు చేరుకున్నారు. స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో బారులుతీరి కనిపించారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అశ్వవాహనంపై ఊరేగింపు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి వారు అశ్వవాహనంపై ఊరేగారు. ముందుగా వేదపండితులు రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారి, ధీరేంద్రదాసుల ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీసమేతుడైన శ్రీనివాసుడిని అశ్వవాహనంపై ఉంచి ఆలయ మాడవీధులలో ఊరేగించారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, పట్వారి అరవిందరావు, చంద్రశేఖర్రావు, బాబురావు, పూజారులు పాల్గొన్నారు. -
పల్లీకి డిమాండ్..
● మార్కెట్యార్డులో 15 రోజులుగా మంచి ధరలు ● క్వింటాకు అత్యధికంగా రూ.7500 ధర పలుకుతున్న వైనం మంచి ధరలు బోర్లు, బావులు, అందుబాటులో ఉన్న నీటివనరుల కింద వేరుశనగను సాగు చేశారు. అయితే దిగుబడులు ఎక్కవగా రాకున్నా గింజ గట్టిగా, లావుగా ఉంది. కాగా చేతికి వచ్చిన వేరుశనగను విక్రయానికి రైతులు గడిచిన రెండు నెలల నుంచి గద్వాల మార్కెట్యార్డుకు తీసుకువస్తున్నారు. బాగా ఆరబెట్టి, మట్టిపెల్లలు, దుమ్మూదూళి లేకుండా రైతులు వేరుశనగను తీసుకొస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఈ సమయంలో వేరుశనగ యార్డులకు రావడం లేదు. దీంతో ఇక్కడ వేరుశనగకు మంచిఽ ధరలు వస్తున్నాయి. గడిచిన రెండు నెలల నుంచి ప్రతిరోజు 800 నుంచి 1100 క్వింటాళ్ల దాక వేరుశనగ యార్డుకు విక్రయానికి వస్తోంది. సరుకు నాణ్యతగా ఉంటుండటంతో వ్యాపారస్తులు మంచి ధరలు కోడ్ చేస్తున్నారు. క్వింటాకు అత్యధికంగా రూ.7వేల నుంచి రూ.7,550 దాకా వస్తోంది. సరాసరి ధరలు కూడా రూ.5400 నుంచి రూ. 6300 వరకు వస్తున్నాయి. అక్టోబర్, నవంబర్తో పోల్చితే డిసెంబర్లో మంచి ధరలు రైతులకు లభిస్తున్నాయి. కాగా ముందస్తు యాసంగి సీజన్లో భాగంగా సాగు చేసిన వేరుశనగ డిసెంబర్ వరకు యార్డుకు విక్రయానికి రానుంది. మరో 20వేల నుంచి 30వేల క్వింటాళ్ల వరకు విక్రయానికి వచ్చే అవకాశం ఉందని యార్డు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే డిసెంబర్లో ప్రస్తుతం వస్తున్న ధరల కన్నా ఇంకా కాస్త ఎక్కువ వస్తాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. గద్వాల వ్యవసాయం: పల్లీకి డిమాండ్ బాగా వస్తోంది. నడిగడ్డలోని రైతులు యాసంగి సీజన్కు ముందుగా వేరుశనగ వేశారు. ఇలా వేసిన వేరుశనగ పంట చేతికి రావడంతో విక్రయానికి గడిచిన 50 రోజుల నుంచి గద్వాల మార్కెట్యార్డుకు తీసుకువస్తున్నారు. ఇలా వస్తున్న వేరుశనగకు యార్డులో మంచి ధరలు లభిస్తున్నాయి. 50 రోజులుగా యార్డుకు ధాన్యం.. సాధారణంగా వంటనూనెలకు మార్కెట్లో ఽమంచి ఽడిమాండ్ ఉండటంతో పాటు ధరలు స్థిరంగా ఉంటాయి. ఇలా ధరలు బాగా ఉండటంతో పాటు గద్వాల ప్రాంతం నుంచి చైన్నె, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు ఏటా వేరుశనగ ఎగుమతి అవుతుంది. వ్యాపారస్తులు ఇక్కడ వేరుశనగను కొనుగోలు చేసి ఇక్కడే విక్రయించడంతో పాటు ఎగుమతి చేస్తుంటారు. నడిగడ్డలో వేరుశనగ పంటను ఇక్కడి రైతులు ఏటా మూడుసార్లు సాగు చేస్తారు. బోర్లు, బావులతో పాటు ఇతర నీటి వనరులు ఉన్న రైతులు వేరుశనగను మూడు సార్లు వేస్తున్నారు. వేరుశనగ పంట 90 నుంచి 100 రోజులకు చేతికి వస్తుంది. ఎకరాకు రూ.12వేల నుంచి రూ.15వేల వరకు ఖర్చు అవుతుంది. అయితే ఈసారి వానాకాలం సీజన్లో అధిక వర్షాల వల్ల వేరుశనగ బాగా దెబ్బతినడంతో కొన్ని చోట్ల తీసివేశారు. జిల్లాలో పలుచోట్ల అనుకున్న స్థాయిలో దిగుబడులు రాలేదు. అయితే బాగా కురిసిన వర్షాల వల్ల బోర్లు, బావులు రీచార్జ్ అయ్యాయి. దీంతో ఆగస్టు, సెస్టెంబర్లో దాదాపు 7వేల నుంచి 10వేల ఎకరాల్లో ముందస్తు యాసంగి సీజన్ పంటలో భాగంగా మల్దకల్, కేటీదొడ్డి, గట్టు, గద్వాల, ఇటిక్యాల, అయిజ మండలాల్లో వేశారు. ఇలా వేసిన వేరుశనగ పంట గడిచిన యాభై రోజులుగా యార్డుకు వస్తోంది. నాణ్యతగా తీసుకురావాలి గద్వాల ప్రాంతంలో వేరుశనగను ఏటా మూడు సార్లు సాగు చేస్తారు. ప్రస్తుతం యార్డుకు వస్తున్న వేరుశనగ నాణ్యతతో వస్తోంది. దీనివల్ల వ్యాపారస్తులు మంచి ధరలు ఇస్తూ కొనుగోలు చేస్తున్నారు. రైతులు వేరుశనగను బాగా ఆరబెట్టి, మట్టి పెళ్లలు లేకుండా తీసుకొస్తే ధరలు బాగా వస్తాయి. – నర్సింహ్మ, గద్వాల మార్కెట్ యార్డ్ కార్యదర్శి ●వేరుశనగ కాంటా వేస్తున్న హమాలీలు జిల్లాలో వేరుశనగ ధరల వివరాలిలా.. -
అర్ధరాత్రి వరకు సాగిన నామినేషన్ల ప్రక్రియ
అలంపూర్: నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కొనసాగింది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడతలో అలంపూర్ నియోజకవర్గంలోని అలంపూర్, ఉండవెల్లి, మానవపాడు, ఎర్రవల్లి, ఇటిక్యాల మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. శుక్రవారం మూడో రోజు కావడంతో అటు సర్పంచ్, ఇటు వార్డులకు నామినేషన్లు దాఖలు చేయడానికి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద అర్ధరాత్రి వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి వేచి ఉండగా.. అందుకు తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, ఏఏ కేంద్రాల్లో ఎన్ని నామినేషన్లు వచ్చాయనే విషయం ఒకటిరెండు చోట్ల తప్ప మిగిలిన కేంద్రాల వద్ద అధికారులు పూర్తి స్థాయిలో వివరాలు అందించేందుకు సాధ్యపడలేదు. చివరి రోజు కావడంతో భారీగా దాఖలు -
పోలింగ్ నిర్వహణపై అవగాహన అవసరం
మాట్లాడుతున్న కలెక్టర్ సంతోష్ గద్వాలటౌన్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే అధికారులకు పోలింగ్ నిర్వహణపై పూర్తి అవగాహన అవసరమని కలెక్టర్ సంతోష్ అన్నారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహించే రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులకు శుక్రవారం స్థానిక ప్రభుత్వ అభ్యసన, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న రెండో దశ శిక్షణను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ బూత్లో ప్రతి ఒక్క ఓటు ముఖ్యమేనన్న విషయం తెలుసుకోవాలన్నారు. ఓటర్లు తమ ఓటు గల్లంతైందని, ఇతర సమస్యలు చెప్పకుండా ముందుగానే పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే ముందుగానే మాస్టర్ ట్రైనర్స్ను అడిగి పరిష్కరించుకోవాలన్నారు. ఈ శిక్షణలో బ్యాలెట్ బాక్స్లను తెప్పించి మాదిరి పోలింగ్ కూడా చేస్తారన్నారు. మొదటి విడత ఎన్నికలు జరిగే ఆయా మండలాల్లోని గ్రామాల్లో ఓటు హక్కు ఉంటే ఫామ్ 14 ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ దరఖాస్తులను పూరించి సంబంధిత ఎంపీడీవో కార్యాలయాల్లో అందజేస్తే ఈ నెల 8వ తేదీన పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుందని వివరించారు. ఈ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఇతర జిల్లాలకు చెందిన సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం తమ జిల్లాలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా అన్ని అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శైలజ, ఎంఈఓ శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి
గద్వాలటౌన్: దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని డీఈఓ విజయలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలోని భవిత కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు పలు పోటీలను నిర్వహించారు. అనంతరం డీఈఓ విజయలక్ష్మి మాట్లాడుతూ.. దివ్యాంగ విద్యార్థులు అపారమైన ప్రతిభ కలిగి ఉంటారన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. వైకల్యం శరీరానికే కాని, మనసుకు కాదని, సకలాంగులతో సమానమేనన్నారు. అనంతరం పోటీల్లో ప్రతిభ కనబర్చిన దివ్యాంగ విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్గౌడ్, జిల్లా విలీన విద్య సమన్వయ అధికారి హంపయ్య, ఐఈఆర్పీలు వాసు, జనార్థన్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి గద్వాలటౌన్: వసతిగృహా విద్యార్థులకు రుచితో కూడిన నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి అక్బర్ పాషా అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతిగృహంలోని వంటగది, స్టోర్ రూంను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వసతి గృహాన్ని చక్కగా నిర్వహిస్తుండటంతో సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువులో రాణించి వంద శాతం ఫలితాలు సాధించాలని సూచించారు. జిల్లాలో ఇటీవల కొన్ని వసతి గృహాల్లో ఆహారం కలుషితమై విద్యార్థులు కొందరు అస్వస్థతకు గురైన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని అలాంటివి పునరావృత్తం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. -
సర్పంచ్కు 82, వార్డులకు 290 నామినేషన్లు
అలంపూర్: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత నామినేషన్ల స్వీకరణ రెండో రోజైన గురువారం జోరుగా సాగింది. అలంపూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మూడో విడత నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. రెండో రోజు సర్పంచ్ స్థానాలకు 82మంది, వార్డులకు 290 మంది నామినేషన్లు వేశారు. అలంపూర్ మండలంలో సర్పంచ్కు 82 మంది, ఇటిక్యాల మండలంలో సర్పంచ్కు 11 మంది, వార్డులకు 56, ఉండవెల్లిలో సర్పంచ్కు 18, వార్డులకు 57 మంది, మానవపాడులో సర్పంచ్కు 10 మంది, వార్డులకు 43 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఎర్రవల్లిలో సర్పంచ్ స్థానానికి 16 మంది వార్డుల స్థానాలకు 53 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
పొత్తుల రాజకీయం!
జోగుళాంబ గద్వాలశుక్రవారం శ్రీ 5 శ్రీ డిసెంబర్ శ్రీ 2025మహబూబ్నగర్: బీఆర్ఎస్, బీజేపీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ● గండేడ్ మండలం చిన్నవార్వాల్, రుసుంపల్లి, పెద్ద వార్వాల్, లింగాయపల్లి, వెన్నచేడ్, కొండాపూర్ గ్రామాల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయి. అంచన్పల్లి, మన్సూర్పల్లి గ్రామాల్లో ఏకగ్రీవం కావడానికి మూడు పార్టీల మద్దతుదారులు అంగీకరించారు. ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్కు చెందిన వారు సర్పంచ్లుగా ఏకగ్రీవమయ్యారు. ● మహమ్మదాబాద్ మండల పరిధిలోని చౌదర్పల్లి గ్రామంలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిస్తోంది. కంచన్పల్లిలో కాంగ్రెస్కు చెందిన ముగ్గురు సర్పంచ్ బరిలో ఉండగా.. అందులో ఒకరికి బీఆర్ఎస్ నాయకులు మద్దతు ప్రకటించారు. మంగంపేటలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. నంచర్ల, గాదిర్యాల్లో సర్పంచ్లుగా పోటీ చేస్తున్న బీఆర్ఎస్ మద్దతుదారులకు బీజేపీ నేతలు మద్దతు తెలుపుతున్నారు. పల్లె పోరులో చిత్రవిచిత్రాలు గెలుపే లక్ష్యంగా ఊహించని ‘మద్దతులు’ కొన్ని జీపీల్లో బీఆర్ఎస్, బీజేపీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి.. పలు ప్రాంతాల్లో కాంగ్రెస్, బీజేపీ.. సీపీఎం, కాంగ్రెస్.. మంత్రి జూపల్లి ఇలాకాలో కారు, కమలం ఉమ్మడి కార్యాచరణ? వీపనగండ్లలో బీఆర్ఎస్ రెబల్స్, కాంగ్రెస్ రెబల్స్, సీపీఎం.. -
ఎన్నికల కోడ్ పక్కాగా అమలయ్యేలా చూడాలి
గద్వాలటౌన్: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు జరిగేలా పర్యవేక్షించాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కోడ్ అమలులో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్లు ఆయా జిల్లాల కలెక్టక్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీసు అధికారులతో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన స్టేజ్–2 జోనల్ ఆఫీసర్ల శిక్షణ తరగతులు, సర్వీస్ ఓటర్లు, పోస్టల్ బ్యాలెట్కు ఏర్పాట్లు, వెబ్ కాస్టింగ్, ఓటరు స్లిప్పుల పంపిణీ షెడ్యూల్ తదితర అంశాలపై కమిషనర్ ఆరా తీశారు. ఎన్నికలు ముగిసే వరకు అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పటిష్టంగా అమలు చేయాలన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల ప్రకటన నియమాలు, ఏకగ్రీవ స్థానాలలో ఉప సర్పంచ్ ఎన్నిక, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు, నామినేషన్లపై వచ్చే ఫిర్యాదులు తదితర అంశాలపై ఎన్నికల అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. వార్డు సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికై న గ్రామాల్లో ఉప సర్పంచ్ నియామకం నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలని ఆదేశించారు. వీసీలో కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాస్రావు, అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, ఎన్నికల పరిశీలకుడు గంగాధర్, రాజేష్బాబు పాల్గొన్నారు. -
ప్రజా రక్షణ కోసమే సిబ్బందికి నైపుణ్య శిక్షణ
ఎర్రవల్లి: ప్రజల రక్షణ కోసమే 10వ బెటాలియన్ పోలీస్ సిబ్బందికి ప్రత్యేక నైపుణ్య శిక్షణకు అందిస్తున్నట్లు కమాండెంట్ జయరాజు తెలిపారు. విపత్తు సమయంలో వేగవంతమైన రక్షణ కోసం బీచుపల్లి పదో బెటాలియన్ సిబ్బందికి యూసుఫ్గూడలోని 1వ బెటాలియన్లో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందనపై ప్రత్యేక శిక్షణ కొనసాగుతుందన్నారు. ఈ శిక్షణలో విపత్తులు సంభవించినప్పుడు, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ప్రాణ రక్షణకు ఉపయోగించే ఆధునిక పరికరాలపై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఎయిర్ లిఫ్టింగ్ బ్యాగ్, హైడ్రాలిక్ ర్యామ్ సెట్, ఫ్లోటింగ్ పంప్, ఇన్స్పెక్షన్ హోల్ మేకర్, రోటరీ రెస్క్యూ, కార్బైడ్ టిప్ చైన్స్, డైమండ్ టిప్ చైన్స్ పరికరాల వినియోగం, నిర్వహణ, విపత్తు సమయంలో రక్షణ చర్యలు తీసుకునే పద్ధతులపై ప్రాక్టికల్ శిక్షణను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ ద్వారా విపత్తుల సమయంలో ప్రజలను రక్షించడానికి, సత్వర చర్యలు చేపట్టడానికి, సిబ్బంది నైపుణ్యాలను మరింత మెరుగుపర్చడం ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజలకు ఉపయోగపడే ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని సూచించారు. -
మార్మోగిన గోవిందనామస్మరణ
● ఆదిశిలా క్షేత్రానికి తరలివచ్చిన భక్తజనం ● బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు ● దాసంగాలతో మొక్కులు చెల్లించుకున్న భక్తులు ● ఎడ్లబండ్లు, వాహనాలతో కిలోమీటర్ల మేర రద్దీ మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవాలయ పరిసరాలు గోవిందనామస్మరణతో మార్మోగాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామి వారికి వేదపండితులు అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. వివిధ గ్రామాలు, పట్టణాల నుంచి భక్తులు బ్రహ్మోత్సవాలకు తరలిరావడంతో భక్తులతో మల్దకల్ గ్రామం జనసంద్రమైంది. మల్దకల్ ఆలయం చుట్టూ కిలోమీటర్ల మేర ఎటు చూసినా తిమ్మప్పస్వామి భక్తులతో రద్దీగా మారింది. ట్రాక్టర్లు, ఆటోలు, జీపులు, ఎద్దులబండ్లపై వచ్చిన భక్తులు స్వామి వారికి దాసంగాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎస్పీ, డీఎస్పీ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పోలీసులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు, విద్యార్థులు, సేవా సమితి నిర్వాహకులు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. జాతరలోకి వాహనాలను అనుమతివ్వకుండా గ్రామశివారులోనే ఎక్కడికక్కడే కట్టడి చేశారు. కార్యక్రమంలో ఆల య చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, ఎస్ఐ నందికర్, పట్వారి అరవిందరావు, చంద్రశేఖర్రావు, బాబురావు, మండల నాయకులు మధుసూదన్ రెడ్డి, సీతారామిరెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, నరేందర్ వాల్మీకీలు పాల్గొన్నారు. ఎస్పీ ప్రత్యేక పూజలు ఆలయాన్ని ఎస్పీ శ్రీనివాసరావు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ ప్రహ్లదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, అర్చకులు ఎస్పీకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జాతర పరిసరాలను పరిశీలించారు. రథోత్సవంకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు చేపట్టాలని పోలీసులకు సూచించారు. అలాగే క్యూలైన్లు, తేరు పరిసరాలను పరిశీలించారు. డీఎస్పీ మొగులయ్య, సీఐలు టంగుటూరి శ్రీను, టాటా బాబు, ఎస్ఐలు నందీకర్, సతీష్రెడ్డి పాల్గొన్నారు.


