breaking news
Jogulamba District News
-
ఆయిల్పాం సాగు లాభదాయకం
ఉండవెల్లి: ఆయిల్పాం సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యానశాఖ అధికారి అక్బర్ అన్నారు. మంగళవారం ఉండవెల్లి మండలం కలుగోట్ల రైతువేదికలో ఆయిల్పాం సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం వచ్చే ఆయిల్పాం దిగుబడులతో రైతులు లాభాలు ఆర్జించవచ్చన్నారు. జిల్లాలో ఆయిల్పాం సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాయితీలు అందిస్తున్నాయని.. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆయిల్ఫెడ్ జిల్లా ఇన్చార్జి శివనాగిరెడ్డి, ఏఓ అనిత, పీఏసీఎస్ చైర్మన్ గజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహించొద్దు
ఇటిక్యాల: ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించొద్దని డీఎంహెచ్ఓ డా.సంధ్యా కిరణ్మయి అన్నారు. మంగళవారం ఇటిక్యాల పీహెచ్సీలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. అనంతరం వైద్యసిబ్బందితో సమావేశమై మాట్లాడారు. మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలపై అశ్రద్ధ చేయొద్దన్నారు. గర్భిణులు ప్రసవ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంపూర్ణ అవగాహన కల్పించడంతో పాటు పీహెచ్సీలో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. కాలనుగుణంగా వస్తున్న సీజనల్ వ్యాధుల నివారణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని.. పీహెచ్సీలో ఉచితంగా నిర్వహించే షుగర్, బీపీ, క్యాన్సర్ స్క్రీనింగ్, స్కానింగ్, ఎల్ఎఫ్టీ, ఆర్ఎఫ్టీ వంటి పరీక్షలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఆరోగ్య కార్యక్రమాలను వందశాతం పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎంసీడీ కోఅర్డినేటర్ శ్యాంసుందర్, ఎన్సీడీ రమేశ్, మండల వైద్యాధికారిణి రాధిక ఉన్నారు. -
అనుమతులనురద్దు చేయాలి
గద్వాలటౌన్: భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వీవీ నర్సింహ, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి కార్తీక్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆల్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎస్సీ సంస్థ కార్మికులకు అవసరం లేకున్నా హెల్త్ టెస్టులు చేస్తుందని.. టెస్టులు చేయించుకోకపోతే లేబర్ కార్డులను తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతుందన్నారు. కార్మికులకు ఎలాంటి ఉపయో గం లేని సీఎస్సీ సంస్థ హెల్త్ టెస్టులను రద్దు చేయాలని కోరారు. అదే విధంగా కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ జానకీరాంను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఉప్పేర్ నర్సింహ, ఆంజనేయులు, సీతారాం, శ్రీనివాస్, జమ్మన్న, గట్టన్న, శివ, రవి, మహేశ్, పరమేశ్ పాల్గొన్నారు. ధ్వంసమైన పైపులైన్.. నిలిచిన నీటి సరఫరా గద్వాలటౌన్: జిల్లా కేంద్రం నుంచి అయిజకు వెళ్లే మార్గంలో చేపట్టిన రహదారి నిర్మాణ పనులతో తాగునీటి ప్రధాన పైపులైన్ ధ్వంసమైంది. దీంతో తాగునీరు వృఽథాగా పారింది. సమాచారం అందుకున్న మున్సిపల్ సిబ్బంది వెంటనే నీటి సరఫరాను నిలిపివేసి.. పైపులైన్కు మరమ్మతు పనులు చేపట్టారు. పైపులైన్ మరమ్మతు కారణంగా స్థానిక పిలిగుండ్ల కాలనీ తదితర ప్రాంతాలకు మంగళవారం తాగునీటి సరఫరా నిలిచిపోయింది. బుధవారం సాయంత్రం నాటికి పైపులైన్ మరమ్మతు పూర్తిచేసి.. తాగునీటి సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి మల్దకల్: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకొని భగవంతుడిని ఆరాధించాలని మంత్రాలయ పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు అన్నారు. మంగళవారం మల్దకల్ ఆదిశిలా క్షేత్రంలో ప్రారంభమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు స్వామీజీ ముఖ్య అతిథిగా హాజరు కాగా.. ఆలయ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. సర్వమతాలకు దేవుడు ఒక్కడేనని అన్నారు. సమాజంలో కులమతాలను రూపుమాపడానికి, ప్రజల మధ్య ఉన్న అసమానతలను తొలగించడానికి దైవభక్తి ఎంతో దోహదపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ భక్తిభావంతో ఉండటంతో పాటు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు. భక్తులు ఆధ్యాత్మికతను అలవర్చుకోవడం వల్ల జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకునే వీలుంటుందన్నారు. అనంతరం పీఠాధిపతిని భక్తులు సత్కరించారు. అదే విధంగా స్వామివారి పల్లకీ సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, నాయకులు మధుసూదన్రెడ్డి, సీతారామిరెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, చక్రధర్రెడ్డి, రాముడు, వీరారెడ్డి, ఆలయ అర్చకులు రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారి, అరవిందరావు, చంద్రశేఖర్రావు, బాబురావు, ముకుందరావు పాల్గొన్నారు. ఆటల్లో అదరగొడుతున్నారు.. ● రాష్ట్రస్థాయి పోటీలకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ● నిరంతర సాధన, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో క్రీడల్లో రాణింపు – వివరాలు 9లో.. -
ప్రభుత్వ బడుల్లో మెరుగైన విద్యాబోధన
గద్వాలటౌన్: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతోందని డీఈఓ విజయలక్ష్మి అన్నారు. జిల్లాలో ఏర్పాటుచేసిన బాలబడుల్లో ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించే ఇన్స్టక్టర్లకు మంగళవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈ ఓ మాట్లాడుతూ.. చాలా మంది పిల్లలు ప్రైవేటులో ప్రీ ప్రైమరీ చదువుతుండటంతో ఎన్రోల్మెంట్ తగ్గుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థు ల సంఖ్య పెంపు, తల్లిదండ్రులపై ఆర్థికభారం తగ్గించడం కోసం ప్రభుత్వం బాలబడులను ఏర్పా టు చేసిందన్నారు. ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతులతో విద్యా ప్రమాణాలు మెరుగుపడుతాయని అన్నారు. అనంతరం బాలబడుల పుస్తకా న్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదికారులు ప్రతాప్రెడ్డి, హంపయ్య, శాంతిరాజు, రేణుక, డీఆర్పీలు రాజవర్ధన్, జయమ్మ, వెంకటేశ్ ఉన్నారు. -
మహిళల ఆర్థికాభివృద్ధికే వడ్డీలేని రుణాలు
గద్వాలటౌన్: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించి.. ఆత్మగౌరవంతో జీవించాలనే సంకల్పంతో ప్రభుత్వం వడ్డీలేని రుణాలు అందిస్తుందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. ఐడీఓసీలోని సమావేశ హాల్లో మంగళవారం సెర్ఫ్ ఆధ్వర్యంలో ఇందిరా మహిళాశక్తి స్వయం సహాయక సంఘాల సభ్యు లకు స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డితో కలిసి కలెక్టర్ వడ్డీలేని రుణాల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలోని 4,724 మహిళా సంఘాలకు రూ. 5.10 కోట్ల వడ్డీలేని రుణాలు మంజూరైనట్లు చెప్పారు. సంఘాల్లో కొత్త సభ్యులను సైతం చేర్పించి.. వారి ఆర్థికాభివృద్ధికి బాటలు వేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం మహిళా సంఘాలతో పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయించి.. ఆర్థిక బలోపేతానికి తోడ్పాటు అంది స్తోందన్నారు. అదే విధంగా బస్సుల కొనుగోలు కోసం మూడు మహిళా సంఘాలకు సబ్సిడీ రుణా లు అందించినట్లు కలెక్టర్ వివరించారు. అనంతరం ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రభు త్వం అందించిన వడ్డీలేని రుణాలతో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడ మే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతరం గద్వాల ని యోజకవర్గానికి సంబంధించి 2,248 మహిళా సంఘాలకు రూ. 2.28 కోట్ల విలువైన చెక్కును అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాసు లు, డీపీఎంలు సలోమి, అరుణ పాల్గొన్నారు. -
దోమల విజృంభణ
● వర్షాకాలం ముగిసినా తగ్గని దోమకాటు ● మున్సిపాలిటీల్లో నివారణ చర్యలు అంతంతే ● ఆందోళనలో ప్రజలు గద్వాలటౌన్: వర్షాకాలం ముగిసినప్పటికీ దోమల బెడద మాత్రం తప్పడం లేదు. పల్లె, పట్టణం తేడా లేకుండా దోమలు విజృంభిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా దోమల సైర్వవిహారం ఎక్కువగా ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. దోమల నివారణ చర్యలకు మున్సిపాలిటీ పరంగా ఏటా రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నా.. ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటోంది. అయితే ఫాగింగ్, కాల్వల్లో దోమల నివారణ మందు పిచికారీ చేస్తున్నట్టు అప్పుడప్పుడు అధికారులు ప్రకటిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో కిందిస్థాయి సిబ్బంది పనితీరును పర్యవేక్షించక పోవడంతో పట్టణాల్లోని కొన్ని ప్రాంతాల్లో దోమల బెడద ఏ మాత్రం తగ్గడం లేదు. ఫలితంగా డెంగీ వంటి ప్రాణాంతక జ్వరాలు ప్రజానీకాన్ని వెంటాడుతున్నాయి. పారిశుద్ధ్య లోపంతో.. జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో డ్రెయినేజీలతో పాటు కందకాల్లో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జిల్లా కేంద్రంలో సగభాగం కందకాలు విస్తరించి ఉన్నాయి. ఎగువ నుంచి, అంతర్గత డ్రెయినేజీల నుంచి వచ్చే మురుగునీరంతా కందకంలో కలుస్తున్నాయి. వాటిలో సక్రమంగా పూడిక తీయకపోవడంతో చెత్తా చెదారాలతో నిండిపోయాయి. మరోవైపు స్థానిక సుంకులమ్మ మెట్టు వెనక భాగాన ఉన్న అవుట్లేట్ వద్ద అనువైన డ్రెయినేజీ వ్యవస్థ లేదు. ఇటీవల ప్రధాన డ్రెయినేజీల్లో చేపట్టిన పూడికతీత పనులు నామమాత్రంగానే సాగాయి. అయిజ, శాంతినగర్ వంటి పట్టణాల్లోనూ మురుగు కాల్వల్లో ప్లాస్టిక్ కవర్లు పేరుకుపోయాయి. దీంతో మురుగు ముందుకు పారడం లేదు. చాలా వరకు డ్రెయినేజీలు పూడికతో నిండి మురుగు పారుదలకు ఇబ్బందిగా ఏర్పడింది. ఎక్కడ నీరు అక్కడే నిలిచిపోవడంతో దోమల ఉధృతి పెరిగిపోతోంది. దోమల నివారణ చర్యలు గద్వాలలో ఓ మోస్తరుగా ఉండగా.. మిగిలిన అయిజ, అలంపూర్, వడ్డేపల్లి పట్టణాల్లో మచ్చుకై నా కనిపించవు. ఏడాదికి రూ.4 కోట్లపైనే.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో సుమారు 30వేల కుటుంబాలు నివసిస్తుండగా.. దోమల నివారణ మందుల వ్యాపారం రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రతి కుటుంబంలో ఎవరి స్థాయి మేరకు వారు రోజుకు రూ.2 నుంచి రూ.5 వరకు దోమల నివారణ కోసం ఖర్చు చేస్తున్నారు. సగటున నెలకు ఒక్కో కుటుంబం రూ.100 నుంచి రూ.150 వరకు ఖర్చు చేస్తోంది. ఇలా పట్టణాల్లో దోమల మందుల వినియోగ వ్యయం ఏడాదికి రూ.4 కోట్లపైనే దాటుతోంది. ఇది కేవలం ఆయా కుటుంబాలు వ్యక్తిగతంగా ఏడాదికి చేస్తున్న ఖర్చు. వీటితో పాటు మున్సిపాలిటీ దోమల సంహరణ కోసం రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. -
విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపాలి
మల్దకల్: విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని జిల్లా ఉపాధి కల్పన అఽధికారిణి డా.ప్రయాంక అన్నారు. మంగళవారం మల్దకల్ మండలంలోని తాటికుంట, కుర్తిరావల్చెర్వు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరుశాతం, ఉపాధ్యాయుల పనితీరును తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా విద్యాబోధన చేసి.. వారి మేధాశక్తిని పెంపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు గాను విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ఆమె వెంట ఎంఈఓ సురేశ్ తదితరులు ఉన్నారు. -
లార్వా దశలోనే నిర్మూలించాలి..
దోమ లార్వా దశలో ఉన్నప్పుడే నిర్మూలించే విధంగా పకడ్బందీ చర్యలు చేపట్టాలి. సమస్యాత్మక ప్రాంతాల్లో క్రమం తప్పకుండా యాంటీ లార్వా ఆపరేషన్ చేయించాలి. మురుగు కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించి, డంపింగ్ యార్డుకు చెత్తను తరలించే విధంగా చర్యలు తీసుకోవాలి. – శ్రీధర్, గద్వాల నివారణ చర్యలు చేపడుతాం.. డ్రెయినేజీలో పేరుకుపోయిన వ్యర్థాలు, ప్లాస్టిక్ కవర్లను తొలగించే పనులను ఇటీవల చేపట్టడం జరిగింది. దోమల నివారణ కోసం తగిన చర్యలు తీసుకుంటాం. ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండకుండా చూస్తాం. కాలనీల్లో ఫాగింగ్ యంత్రాలను వినియోగించడంతో పాటు దోమల నివారణ మందులను చల్లుతున్నాం. – జానకీరాం, మున్సిపల్ కమిషనర్, గద్వాల -
పల్లెపోరుకు సై..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్/గద్వాల టౌన్: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటనతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం సందడిగా మారింది. పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. తొలి విడత ఎన్నికలకు ఈ నెల 27 (గురువారం) నుంచే నామినేషన్లను స్వీకరించనుండగా.. డిసెంబర్ 11న తొలివిడత ఎన్నికలు నిర్వహించనున్నారు. నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు, మూడో దశ పంచాయతీ ఎన్నికలను చేపట్టనున్నారు. ఈ నెల 30 నుంచి రెండో విడత నామినేషన్లు స్వీకరించనుండగా.. డిసెంబర్ 14న ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికలకు డిసెంబర్ 3 నుంచి నామినేషన్లు స్వీకరించి.. 17న ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటనతో గ్రామాల్లో రాజకీయ సందడి జోరందుకుంది. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని వేచిచూస్తున్న ఆశావాహుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు గెలుపే లక్ష్యంగా గ్రామాల్లో తమ వ్యూహాలను అమలు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 1,678 గ్రామాలు.. 15,077 వార్డులు ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 1,678 గ్రామాలు, 15,077 వార్డులు ఉన్నాయి. అయితే మొదటి విడతలో 550 గ్రామాలు, 4,840 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో 565 గ్రామాలు, 5,221 వార్డులకు, మూడో విడతలో 563 గ్రామాలు, 5,016 వార్డు స్థానాలకు ఎన్నికలు ఉండనున్నాయి. డిసెంబర్ 11న తొలి విడత, 14న రెండో విడత, 17న మూడో విడత ఎన్నికలు నిర్వహించనుండగా, పోలింగ్ రోజునే కౌంటింగ్ చేపట్టి అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారు. గ్రామాల్లో రాజకీయ సందడి.. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయ సందడి మొదలైంది. ఆయా గ్రామాల్లో సర్పంచు, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన ఆశావాహులు ఉత్సాహంగా ఉన్నారు. ఒక్కో గ్రామంలో కనీసం ఇద్దరు, ముగ్గురు చొప్పున పోటీపడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదే క్రమంలో రిజర్వేషన్లు తమకు వస్తాయని ఆశించి భంగపడిన వారిలో నిరాశ నెలకొంది. ఇప్పటికే పార్టీల వారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంతోపాటు గెలుపు గుర్రాలు ఎవరన్న దానిపై ఎవరికి వారు కసరత్తు చేస్తున్నారు. దీనికితోడు ఈసారి ఇద్దరు పిల్లల నిబంధనను ప్రభుత్వం సడలించడంతో చాలామందికి అవకాశం దక్కుతోంది. దీంతో గ్రామాల్లో పోటీచేస్తున్న ఆశావహుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. అమలులోకి కోడ్.. పంచాయతీ ఎన్నికల పాలకవర్గం గడువు ముగిసి సుమారు ఏడాదిన్నర కాలం పూర్తయ్యింది. నెలల తరబడి ఎన్నికల నిర్వహణ కోసం ఎదురుచూస్తుండటం, ఇప్పటికే ఒకసారి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి, వాయిదా పడిన క్రమంలో ఈసారి ఎన్నికల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తిచేశారు. ఓటర్ల జాబితా, బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల సామగ్రి, ఎన్నికల సిబ్బందికి శిక్షణతోపాటు రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిచేశారు. మంగళవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా, ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ఎన్నికల నిర్వహణకు అనుగుణంగా అధికార యంత్రాంగం పూర్తిస్థాయి ఏర్పాట్లలో నిమగ్నమైంది. మూడు విడతల్లోపంచాయతీఎన్నికల నిర్వహణ షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం రేపటి నుంచే తొలి విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ డిసెంబర్ 11న తొలి దశ పోలింగ్, ఫలితాలు వెల్లడి ఉమ్మడి జిల్లాలో 1,678 గ్రామాలు.. 15,077 వార్డులు జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇలా.. జోగుళాంబ గద్వాల జిల్లాలోని 13 మండలాల్లో 255 గ్రామపంచాయతీలు ఉండగా.. 2,390 వార్డులు ఉన్నాయి. మొదటి విడతలో 106, రెండో విడతలో 74, మూడో విడతలో 75 జీపీలకు ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. -
పునరావాస కేంద్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
గట్టు: చిన్నోనిపల్లె పునరావాస కేంద్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. సోమవారం చిన్నోనిపల్లె పునరావాస కేంద్రంలో మిషన్ భగీరథ సంపు ప్రారంభించడంతో పాటు ిసీసీరోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అదే విధంగా చిన్నోనిపల్లె, ఆలూరు గ్రామాల్లో మహిళా సంఘాల సభ్యులకు ఇందిరా మహిళాశక్తి చీరలను పంపిణీ చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో గట్టు మండలం ఏడారిగా ఉండేదని.. ఎత్తిపోతల పథకాల నిర్మాణంతో పచ్చని పంటలతో కళకళలాడుతోందన్నారు. చిన్నోనిపల్లె నిర్వాసితుల్లో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ పునరావాస కేంద్రంలో ఇంటి స్థలాల పట్టాలు అందిస్తామన్నారు. పునరావాస కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పించి.. నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని.. అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జంబు రామన్గౌడ్, మాజీ ఎంపీపీ విజయ్కుమార్, మాజీ జెడ్పీటీసీ రాజశేఖర్, ఆనంద్గౌడ్, నర్సన్నగౌడ్, తిమ్మప్ప, రామాంజనేయులు, చంద్రశేఖర్, అలీ, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. (24జీడీఎల్–401) -
ముహూర్తం ఖరారు
● కృష్ణానదిపై జూరాల వద్ద హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం ఆత్మకూర్: ఏళ్లనాటి కల సాకారం కాబోతోంది. రెండు ప్రాంతాల మధ్య దూరం తగ్గనుంది.. కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి ముహూర్తం ఖరారు కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.. తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి ప్రాజెక్టు అయిన ప్రియదర్శిని జూరాల దిగువన హైలెవల్ బ్రిడ్జి (వంతెన) నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఆత్మకూర్ మండలం జూరాల గ్రామం వద్ద రూ.123 కోట్ల నిధులతో హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డిసెంబర్ 1న వస్తున్నారని రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ప్రకటించారు. ఈ మేరకు వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి భూమిపూజకు సంబంధించి జూరాల గ్రామం పుష్కర ఘాట్ వద్ద, హెలిప్యాడ్కు సంబంధించి ఆత్మకూర్ జాతర మైదా నం స్థలాలను పరిశీలించి నివేదిక సిద్ధం చేశారు. టెండర్ల ప్రక్రియ పూర్తి.. జూరాల, కొత్తపల్లి మధ్య కృష్ణానదిపై వంతెన నిర్మాణం కోసం రూ.123 కోట్ల నిధులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించగా.. ఆర్అండ్బీ శాఖ టెండర్ల ప్రక్రియ పూర్తిచేసింది. పనుల ప్రారంభానికి గాను గత నెల చివరి వారంలోనే భూమిపూజ జరుగుతుందని ప్రచారం జరిగిన ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో వాయిదా పడింది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భూమిపూజకు ఆదేశాలు ఇవ్వడంతో డిసెంబర్ 1న ముహూర్తం ఖరారు చేయడంతో మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఆయా శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గద్వాల– ఆత్మకూర్ మధ్య తగ్గనున్న 22 కిలోమీటర్ల దూరం ఇప్పటికే రూ.123 కోట్లు కేటాయింపు.. టెండర్ ప్రక్రియ సైతం పూర్తి రెవెన్యూ డివిజన్ దిశగా ఆత్మకూర్ అడుగులు డిసెంబర్ 1నసీఎం రేవంత్రెడ్డి పర్యటన -
ప్రజావాణికి అర్జీల వెల్లువ
గద్వాలటౌన్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి అర్జీలు వెల్లువెత్తాయి. కలెక్టర్కు సమస్యలను తెలియజేస్తే పరిష్కారమవుతాయనే ఉద్దేశంతో జిల్లా నలుమూలల నుంచి బాధితులు భారీగా తరలివచ్చారు. అర్జీదారులతో కలెక్టరేట్ ప్రాంగణం కిటకిటలాడింది. ప్రజావాణిలో కలెక్టర్ బీఎం సంతోష్, అడిషినల్ కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ప్రజావాణి కార్యక్రమం కొనసాగగా.. వివిధ సమస్యలపై 141 అర్జీలు అందాయి. ఇందులో 106 అర్జీలు డబుల్బెడ్రూం ఇళ్లకు సంబంధించినవి ఉన్నాయి. మిగతావి చేయూత పింఛన్లు, భూ సంబంధిత సమస్యలు, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, ఉపాధి, విద్యుత్ తదితర సమస్యలపై వినతులు అందాయి. అధికారులు బాధితుల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి.. వారి సమస్యలను ఓపికతో విన్నారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహించొద్దని కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులకు సూచించారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటాలి
గద్వాలటౌన్: క్రీడాకారులు నిర్మాణాత్మక క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ.. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటాలని డీఈఓ విజయలక్ష్మి సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఎస్జీఎఫ్ జోనల్ స్థాయి అండర్–14 బాలబాలికల వాలీబాల్ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించగా.. ఉమ్మడి జిల్లా నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. ఎంపిక పోటీలను డీఈఓ ప్రారంభించి మాట్లాడారు. క్రీడల పట్టణంగా గద్వాల అభివృద్ధి చెందుతుందన్నారు. భవిష్యత్లో రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. క్రీడాకారులు స్ఫూర్తిదాయకమైన ఆట ద్వారా ప్రతిభ చాటాలన్నారు. డీవైఎస్ఓ కృష్ణయ్య మాట్లాడుతూ.. క్రీడలు జీవితానికి గొప్ప స్ఫూర్తినిస్తాయన్నారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. అంతకుముందు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. క్రీడాకారులను పరిచయం చేసకుంటున్న డీఈఓ విజయలక్ష్మి విజేతలు వీరే.. వాలీబాల్ అండర్–14 బాలుర విభాగంలో నారాయణపేట జట్టు విజేతగా, జోగుళాంగ గద్వాల జట్టు రన్నరప్గా నిలిచింది. బాలికల విభాగంలో మహబూబ్నగర్ విజేతగా నిలవగా.. నారాయణపేట జట్టు రన్నరప్గా నిలిచింది. ప్రతిభ చాటిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ నెల 26 నుంచి పెద్దపల్లి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు పాల్గొననున్నారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, హెచ్ఎం ప్రతాప్రెడ్డి, పీఈటీలు నగేశ్బాబు, హైమావతి, శ్రీనివాసు లు, బీసన్న, స్రవంతి, భరత్కుమార్, నర్సింహారాజు, తిరుపతి, మోహన మురళీ, పార్వతమ్మ, రజనీకాంత్, వెంకట్రాములు పాల్గొన్నారు. -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
అలంపూర్: నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం రాజోళి, వడ్డేపల్లి, ఉండవెల్లి మండలాలకు చెందిన 202 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆయా మండలాల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
లెక్క తేలింది.. పోరు మిగిలింది!
అతివకు అందలం.. జిల్లాలోని 13 మండలాల పరిధిలో 255 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇందులో 116 సర్పంచ్ స్థానాలను మహిళలకు కేటాయించారు. ఎస్టీ మహిళకు ఒకటి, ఎస్సీ మహిళకు 21, బీసీ మహిళకు 32, జనరల్ మహిళకు 62 స్థానాలను కేటాయించారు. అదే విధంగా జనరల్కు 67, బీసీ జనరల్కు 38, ఎస్సీ జనరల్కు 30, ఎస్టీ జనరల్కు 4 స్థానాలు కేటాయించగా.. అందులోనూ అతివలు పోటీ చేసే అవకాశం ఉంది. గత పర్యాయం జిల్లాలో అత్యధిక సంఖ్యలో వార్డు సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో సహా జెడ్పీ చైర్పర్సన్ వరకు మహిళా ప్రజాప్రతినిధులు అధికంగా ఉండగా.. ఈ సారి కూడా అదే తీరులో అవకాశాలను ఆశిస్తున్నారు. గద్వాలటౌన్: గ్రామపంచాయతీల వారీగా సర్పంచు, వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై ఉత్కంఠ వీడింది. లాటరీ పద్ధతిన రొటేషన్ విధానంలో రిజర్వేషన్లు ఖరారు చేసిన అఽధికారులు.. తాజాగా సోమవారం ఓటరు జాబితాను విడుదల చేశారు. ఓటరు జాబితాలో తప్పుల సవరణకు ఇటీవల ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. కుటుంబ సభ్యులందరి పేర్లు ఒకే బూత్ పరిధిలోకి వచ్చే విధంగా మ్యాపింగ్ చేశారు. పంచాయతీల వారీగా ఓటరు జాబితాను కలెక్టర్ అనుమతితో మండలాల అధికారులు విడుదల చేశారు. అన్ని గ్రామపంచాయతీల్లో ఓటరు జాబితాను అందుబాటులో ఉంచారు. మొత్తమ్మీద పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో వేగం పెరిగింది. షెడ్యూ ల్ విడుదలైన వెంటనే మిగతా ఏర్పాట్లు ఊపందుకోనున్నాయి. ఆ దిశగా అధికారులు సిద్ధంగా ఉన్నారు. స్థానిక పోరుకు చకచకా అడుగులు పడుతుండటంతో పల్లెల్లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఇతరులు 10 ఓటేయడంలోనూ వారే అధికం.. పల్లెల్లో మొదలైన రాజకీయ వేడి ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు తాజాగా ఓటరు జాబితా విడుదల జిల్లాలో మహిళా ఓటర్లే అధికం జిల్లాలో ఓటర్ల సంఖ్యాపరంగా కూడా మహిళలే అధికంగా ఉన్నారు. అన్ని గ్రామాల్లో స్వశక్తి సంఘాలు ఉండగా.. ప్రస్తుత ఎన్నికల్లో వీరి పాత్ర కీలకంగా మారనుంది. గతంలో అన్ని ఎన్నికల్లో పురుషుల కన్నా మహిళలే అధికంగా ఓటు వేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇదే తరుణంలో పల్లెల్లో పోటీ పడేవారు అన్ని వర్గాల మహిళలను ప్రసన్నం చేసుకోవడంపై ప్రధానంగా దృష్టిసారించారు. -
రవాణా సౌకర్యం మెరుగు..
ఆత్మకూర్ నుంచి జూరాల ప్రాజెక్టు మీదుగా గద్వాలకు వెళ్లేందుకు 32 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూర్ మండలం జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మిస్తే కేవలం 10 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తే సరిపోతోంది. అలాగే గద్వాల నుంచి హైదరాబాద్కు వెళ్లాలంటే ఎర్రవల్లి చౌరస్తా మీదుగా హైవేపై ప్రయాణించాలి. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం అనంతరం గద్వాల నుంచి 10 కిలోమీటర్లకు ఆత్మకూర్ మీదుగా 14 కిలోమీటర్ల మేర కొత్తకోట హైవేకు చేరుకోవచ్చు. ఫలితంగా 40 కిలోమీటర్ల దూరం తగ్గనున్నట్లు అంచనాలు ఉన్నాయి. అలాగే ఏపీలోని ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయంతోపాటు కర్ణాటకలోని బళ్లారి ప్రాంతాలకు దూరం తగ్గే అవకాశం ఉంది. దీంతో ఆత్మకూర్ మీదుగా 24 గంటలపాటు రవాణా సౌకర్యం కలగనుండడంతో వ్యాపారపరంగా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి. జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మించే ప్రదేశం -
రుణపడి ఉంటాం..
గద్వాల మండలంలోని కొత్తపల్లి గ్రామం మీదుగా కృష్ణానదిపై వంతెన నిర్మిస్తారని మా చిన్నప్పటి నుంచి వింటున్నాం. కొంతమంది కుట్రల కారణంగా వంతెన విషయం మరుగున పడింది. ఎన్నో ఏళ్ల కలను ఇప్పుడు సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మా ప్రాంత ప్రజలు రుణపడి ఉంటాం. – అశోక్రెడ్డి, మాజీ సర్పంచ్, కొత్తపల్లి గ్రామం, గద్వాల జిల్లా పూర్వవైభవం తీసుకొస్తా.. ఇచ్చిన మాట ప్రకారం జూరాల, కొత్తపల్లి గ్రామాల మధ్య హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం భూమి పూజకు డిసెంబర్ 1న సీఎం రేవంత్రెడ్డి వస్తున్నారు. ఒకప్పుడు సంస్థానంగా, తాలుకా కేంద్రంగా అన్ని రకాల కార్యాలయాలతో ఆత్మకూర్ వెలుగొందింది. ఆత్మకూర్ను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రితో సహా రెవెన్యూ మంత్రి, కలెక్టర్కు విన్నవించగా.. సానుకూలంగా స్పందించారు. ఆత్మకూర్కు పూర్వవైభవం తీసుకువస్తా. – వాకిటి శ్రీహరి, రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి -
టీకా @ 87 శాతం
● చలికాలంలో పశువులకువైరస్ ముప్పు అధికం ● వంద శాతం లక్ష్యాన్ని చేరుకునేందుకు పశుసంవర్ధక శాఖ ప్రత్యేక చర్యలు జిల్లాలో చివరి దశకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా పంపిణీమండలం మొత్తం టీకా పశువులు పూర్తయినవి అయిజ 14,589 12,351 గద్వాల 12,200 10,318 వడ్డేపల్లి 11,089 10,129 మల్దకల్ 10,585 9,079 ధరూర్ 10,674 8,742 ఇటిక్యాల 10,090 8,525 గట్టు 9,316 7,910 మానవపాడు 7,550 7,408 రాజోళి 7,748 6,565 అలంపూర్ 5,735 4,655 కేటీదొడ్డి 4,458 3,779 ఉండవెల్లి 4,216 4,213 గద్వాల వ్యవసాయం: పశువులకు వైరస్ ద్వారా వ్యాపించే గాలికుంటు వ్యాధి నివారణకు జిల్లా పశు సంవర్ధకశాఖ ప్రత్యేకంగా దృష్టిసారించింది. జిల్లావ్యాప్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అక్టోబర్ 15 తేదీ నుంచి పశువులకు ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు వేస్తున్నారు. ఇప్పటి వరకు 87 శాతం పశువులకు టీకాలు వేశారు. ఇదిలా ఉండగా.. సాధారణంగా మూగజీవాలపై పలు రకాల వ్యాధులు దాడి చేస్తుంటాయి. ముఖ్యంగా పశువులకు వైరస్ ద్వారా గాలికుంటు వ్యాధి ప్రబలుతుంది. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్గా ఈ వ్యాధిని పేర్కొంటారు. గాలిలో తేమశాతం అధికంగా ఉన్నప్పుడు గాలికుంటు వ్యాధి వ్యాపించే అవకాశం ఉంటుంది. వ్యాధి సోకిన సమయంలో పశువుల్లో గర్భం విఫలమవుతుంది. నోరు, మూతి, కాళ్లు, గిట్టలపై పుండ్లు, బొబ్బలు రావడం, నోటి నుంచి విపరీతంగా నురగ రావడం, తీవ్రమైన జ్వరం వ్యాధి లక్షణాలుగా చెప్పవచ్చు. పశువుల లాలాజలం, పుండ్ల వల్ల, గాలి వల్ల వ్యాధి మిగతా పశువులకు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి సోకిన పశువుల్లో ఉత్పాదక శక్తి తగ్గిపోతుంది. జ్వర తీవ్రత పెరిగి పశువులు నీరసిస్తాయి. ఫలితంగా పాడి రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితులు దాపురిస్తాయి. జిల్లాలో వ్యాక్సినేషన్ వివరాలిలా.. ప్రతి పశువుకు తప్పనిసరి పశువులు గాలికుంటు వ్యాధి బారిన పడకుండా పశువైద్య సిబ్బంది గ్రామ గ్రామాన ఉచితంగా టీకాలు వేస్తున్నారు. ఇందులో భాగంగా పాడి రైతులకు ముందస్తుగా సమాచారం అందిస్తున్నాం. జిల్లాలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పశువులకు టీకాలు వేయించాలి. – వెంకటేశ్వర్లు, జిల్లా పశువైద్యాధికారి -
ఏళ్లకు ఏళ్లు.. అవే కన్నీళ్లు
శ్రీశైలం నిర్వాసితులకు కలగానే మారిన ప్రభుత్వ ఉద్యోగాలు కృష్ణానది తీరంలో పునరావాస గ్రామం మంచాలకట్ట నిర్వాసిత కుటుంబాలు 11,198 ఉమ్మడి జిల్లాలో ముంపునకు గురైన గ్రామాలు 67 కోల్పోయిన భూములు 1.23లక్షలు నాగర్కర్నూల్ జిల్లా పరిధిలో ఉన్న గ్రామాలు 8 జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో 36 వనపర్తి జిల్లా పరిధిలో 23 కొల్లాపూర్: దశాబ్దాల కాలంగా శ్రీశైలం నిర్వాసి తుల సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. శ్రీశైలం డ్యాం నిర్మాణంతో భూములు, నివాసాలు కోల్పోయిన నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ 98ను విడుదల చేసింది. ఈ మేరకు కర్నూలు జిల్లాలో దాదాపు 70 శాతం మంది నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వగా.. తెలంగాణలో జీఓ 98 అమలుకు నోచుకోలేదు. సర్వం కోల్పోయిన నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇచ్చి న్యాయం చేస్తామని నాలుగు దశాబ్దాలుగా పాలకులు ఇస్తున్న హామీలు నీటమూటలుగానే మారుతున్నాయి. జీఓ అమలు కోసం సుదీర్ఘకాలంగా ఆందోళనలు చేసిన శ్రీశైలం నిర్వాసితులు.. న్యాయపోరాటం సైతం చేస్తున్నప్పటికీ పాలకుల్లో చలనం రావడం లేదు. ఉమ్మడి జిల్లాలో 175 మందికే ఉద్యోగాలు.. శ్రీశైలం ప్రాజెక్టు కారణంగా ఉమ్మడి పాలమూరు, కర్నూలు జిల్లాల్లోని పలు గ్రామాలు కృష్ణా బ్యాక్వాటర్లో మునిగిపోయాయి. 1970– 82 మధ్య లో అధికారులు నిర్వాసిత గ్రామాల నుంచి ప్రజల ను ఖాళీ చేయించారు. దీంతో వారు నది తీరంలో నే కొత్త నివాసాలు ఏర్పాటు చేసుకోగా.. కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. నిర్వాసితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో 1986లో అప్పటి ప్రభుత్వం జీఓ 98 జారీ చేసింది. ఈ జీఓ ద్వారా ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని.. అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆ జీఓ ప్రకారం కర్నూలు జిల్లాలో వేలాది మంది నిర్వాసి తులకు ఉద్యోగాలు కల్పించిన గత ప్రభుత్వాలు.. పాలమూరు నిర్వాసితులను పట్టించుకోలేదు. ఉ మ్మడి జిల్లాలో 2,318 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో ఐదుగురికి 1993లో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. 2007లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మరో 30 మందికి, 2015లో కిరణ్కుమార్రెడ్డి హయాంలో 128 మంది నాన్ లోకల్ కో టా లష్కర్ ఉద్యోగా లు కల్పించారు. వీరిలో ఐదు గురి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేశారు. ఈ ఏడాది కోర్టు ఆదేశాల ప్రకారం నాగర్కర్నూల్ కలెక్టర్ 12 మంది నిర్వాసితులకు నీటిపారుదల శాఖలో ఉ ద్యోగాలు ఇచ్చారు. మొత్తంగా 175 మంది నిర్వాసితులకు ఉద్యోగాలు దక్కాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం మిగిలిన వారిలో 633 మంది మరణించగా.. 410 మంది వయసు పైబడి ఉద్యోగార్హత కోల్పోయారు. ఇక మిగిలింది 1,206 మందే. అయితే వీరే కాకుండా.. పలువురు నిర్వాసితులు ఉద్యోగాల అర్హుల జాబితాలో తమ పేర్లు కూడా చేర్చాలంటూ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా..ప్రజాప్రతినిధులు మారినా తీరని గోస బుట్టదాఖలైన వినతులు.. నీటిమూటలైన హామీలు ఎన్ని పోరాటాలు చేసినా అమలుకాని 98, 68 జీఓలు సొంత జిల్లావాసులపై ముఖ్యమంత్రి కనికరం చూపాలని వేడుకోలు -
జీపీలలో మహిళా స్థానాలకు రిజర్వేషన్లు
గద్వాల: తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని మండలాల వారిగా గ్రామ పంచాయతీలకు మహిళా రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు అదనపు కలెక్టర్ నర్సింగ్రావు తెలిపారు. ఆదివారం ఆర్డీఓ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నేతల సమక్షంలో డిప్ విధానంలో మహిళ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తిచేసినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం మొదటిసారిగా 2019లో గ్రామ పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరిగాయని, వాటిని దృష్టిలో ఉంచుకుని నిబంధనల మేరకు ప్రస్తుతం జరిగే ఎన్నికలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, అన్ రిజర్వుడ్ స్థానాల్లో మహిళలకు కేటాయించాల్సిన 33 శాతం రిజర్వేషన్లను డిప్ విధానంతో ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ అలివేలు, డీపీఓ నాగేంద్రం, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఆదిశిలావాసుడి ప్రచార రథం ప్రారంభం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ప్రచార రథం, వాల్పోస్టర్లను ఆదివారం ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యశ్చంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళవారం నుంచి వచ్చేనెల 6 వరకు జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు అందరూ తమవంతుగా కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు తిమ్మారెడ్డి, సీతారామిరెడ్డి, మధుసూదన్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, బాబురావు, చంద్రశేఖర్రావు, వీరారెడ్డి, అర్చకులు మధుసూదనాచారి, రమేషాచారి, రవిచారి, వాల్మీకి పూజారులు పాల్గొన్నారు. -
పేదల సొంతింటి కల సాకారం
ధరూరు: పేదల ఎన్నో ఏళ్ల సొంతింటి కలను సాకారం చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికే దక్కిందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన అల్వాలపాడు గ్రామంలో మండలంలోనే మొట్ట మొదట నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇంటిని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రాంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ఇంటి యజమానుల బ్యాంకు ఖాతాలోనే దశల వారిగా రూ.5 లక్షలు జమ చేస్తోందన్నారు. నియోజకవర్గానికి మొత్తం 3,500 ఇళ్లు మంజూరయ్యాయని, వీటిని లబ్ధిదారులు వీలైనంత త్వరగా పూర్తిచేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన సీఎం రేవంత్రెడ్డితోపాటు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రామంలోని మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు. మహిళా సంఘాలలో ఉన్న ప్రతి మహిళకు చీర అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిండమే కాకుండా అనేక రకాలుగా లబ్ధి చేకూరుస్తోందని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజశేఖర్, మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణనాయుడు, మాజీ సర్పంచ్ వీరన్నగౌడ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
కష్టాల్లో ఉన్నవారికి చేయూతనందించాలి
ఎర్రవల్లి: అన్య మతాలను గౌరవించడం, ఆదరించడం వంటి విలువలను బోధించిన మహానుబావుడు సత్యసాయి బాబా అని పదవ పటాలం కమాండెంట్ జయరాజు అన్నారు. ఆదివారం సత్యసాయి బాబా జయంతిని పురస్కరించుకొని బీచుపల్లి పదో బెటాలియన్లో కమాండెంట్ సిబ్బందితో కలిసి సత్యసాయి బాబా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయిబాబా తన భక్తి, ప్రార్థనలు, బోధనలతో ప్రజలను సన్మార్గం వైపు నడిపించారని కొనియాడారు. ఆపదలో ఉన్న ప్రతి పేదవాడికి విద్య, వైద్యం, ఆహారం, నీటిని అందించి ఎంతో మందిని ఆదుకున్నారన్నారు. సంపాదించి దాచుకోవడమే తెలిసిన ఈ సమాజంలో తను మాత్రం భక్తి, ప్రార్థనలతో సంపాదించిన దాంట్లో కూడా దాచుకోకుండా నిరుపేదలకు సహాయం చేశారన్నారు. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకొని ఈ రోజు అందరి హృదయాల్లో ఒక దైవ సమానమైన స్థానాన్ని సత్యసాయి బాబా పొందారన్నారు. ప్రతిఒక్కరూ సమాజ సేవ చేస్తూ తమకు చేతనైనంత సహాయాన్ని కష్టాల్లో ఉన్న వారికి అందించాలని కమాండెంట్ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు నరేందర్రెడ్డి, పాణి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ టోర్నీలో విజేతగా నిలవాలి
మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి సీనియర్ టోర్నీలో జిల్లా జట్టు విజేతగా నిలవాలని సీనియర్ సాఫ్ట్బాల్ క్రీడాకారుడు, జడ్చర్ల ఎస్ఐ అక్షయ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లా పురుషుల సాఫ్ట్బాల్ జట్టు క్యాంప్ను ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడుతూ నిరంతరం ప్రాక్టీస్తో క్రీడల్లో విజయం సాధించవచ్చని అన్నారు. టోర్నీలో చాంపియన్గా నిలిచి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్బాల్ సంఘం సభ్యులు నాగరాజు, రాఘవేందర్, సీనియర్ క్రీడాకారుడు ఆది లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
స్వయంగా ప్రస్తావించిన రేవంత్రెడ్డి..
తెలంగాణ రాష్ట్రం వచ్చాక స్థానిక నేతలు నిర్వాసితుల సమస్యను అప్పటి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అర్హులైన వారికి ఉద్యోగాలకు బదులుగా నగదు ప్యాకేజీ అందించాలని భావించారు. అది కూడా ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ, ఈ ఏడాది జటప్రోల్ సభలోనూ నిర్వాసితుల అంశాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పలుమార్లు నిర్వాసితులు మంత్రి జూపల్లి కృష్ణారావును కలిశారు. కానీ, సమస్యకు శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదు. సర్వం కోల్పోయాం.. మా పూర్వీకుల స్వగ్రామం అసద్పూర్. శ్రీశైలం బ్యాక్వాటర్ కారణంగా మా ఊరంతా మునిగిపోయి సర్వం కోల్పోయాం. ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 98, 68 అమలు కోసం ఎదురుచూస్తున్నాం. నిర్వాసితుల్లో చాలా మంది పేదరికంతో చనిపోయారు. వారి కుటుంబాలను ఆదుకోవాలి. – మేనుగొండ రాముయాదవ్, శ్రీశైలం నిర్వాసితుడు సీఎంను కలుస్తాం.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలిస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. జటప్రోల్ సభలో నిర్వాసితుల అంశంపై నివేదిక తయారు చేయాలని మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావుకు సూచించారు. నిర్వాసితుల వివరాలు, ఉద్యోగాల ఖాళీలు వంటి అంశాలపై కలెక్టర్లతో చర్చించామన్నారు. ఈ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. – డాగోజీరావు, శ్రీశైలం నిర్వాసితుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ● -
పండ్లతోటల వైపు.. రైతన్న చూపు
అయిజ: ఇంతకాలం ఆహార ధాన్యాలు, పత్తి, పొగాకు, ఆముదం పంటలు పండించిన రైతన్నలు.. ప్రస్తుతం పండ్లతోటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు బీడు భూములుగా కనిపించిన పొలాల్లో పండ్లతోటలు పండిస్తూ సిరులు కురిపిస్తున్నారు. జిల్లాలోని వ్యవసాయ పొలాలు పండ్లతోటలకు అనువుగా ఉండటం.. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహకాలతో పండ్లతోటల సాగు గణనీయంగా పెరుగుతోంది. జిల్లావ్యాప్తంగా మామిడి, జామ, దానిమ్మ, బత్తాయి, సీతాఫలం మొదలగు పండ్ల తోటలను సాగుచేస్తున్నారు. ఇది కేవలం అన్నదాతల ఆదాయం పెంచడమే కాదు.. పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతోంది. బి.తిమ్మాపూర్లో సాగుచేసిన బత్తాయి తోట మార్కెట్ సౌకర్యాలు, నాణ్యత నియంత్రణ, పండ్ల ధరల అస్థిరత్వం రైతులకు సవాల్గా మారుతున్నాయి. ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని, ఎక్స్పోర్ట్ సౌకర్యం కల్పించాలని రైతులు కోరుతున్నారు. అన్నదాతలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తే జిల్లా తెలంగాణ ఫ్రూట్ బౌల్గా మారే అవకాశం ఉంది. పండ్ల తోటలపై ఆశలు పెట్టుకున్న రైతన్నలకు ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపడితే రాష్ట్ర ఉద్యాన రంగంలో జిల్లా మరింత ముందుండనుంది. బత్తాయి 110 డ్రాగన్ ఫ్రూట్ 10 జామ 6 దానిమ్మ 5 సీతాఫలం : 5 నిమ్మ : 8 మెండగా లాభాలు.. రైతులు ప్రభుత్వం అందించే 40 శాతం సబ్సిడీని సద్వినియోగం చేసుకొని పండ్ల తోటలు సాగుచేస్తే అనేక లాభాలు ఉంటాయి. తోటలు కాపుకొచ్చినప్పటి నుంచి సుమారు 20 నుంచి 30 సంవత్సరాల వరకు పంట దిగుబడి వస్తుంది. ఇతర పంటలతో పోల్చితే కూలీల అవసరం చాలా వరకు తక్కువగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. – ఎంఏ అక్బర్ బాషా, జిల్లా ఉద్యానశాఖ అధికారి మూడేళ్లలోనే 40శాతం మేర.. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 215 హెక్టార్లలో వివిధ రకాల పండ్ల తోటలు సాగయ్యాయి. మూడేళ్ల కాలంలోనే ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 40 శాతం పెరిగిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అలంపూర్, వడ్డేపల్లి, ఇటిక్యాల, గట్టు, ఉండవెల్లి మండలాల్లో మామిడి తోటలు విస్తృతంగా సాగుచేస్తున్నారు. అదే విధంగా గద్వాల, ధరూరు ప్రాంతాల్లో దానిమ్మ, సీతాఫలం సాగుచేస్తుండగా.. అయిజ మండలంలో ఎక్కువగా బత్తాయి తోటలు పండిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో.. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం (ఎంఐడీహెచ్), రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కేవీవై) పథకాలను అమలు చేస్తున్నాయి. తోటల సాగు చేపట్టే రైతులకు ఉద్యానశాఖ ద్వారా 40 శాతం రాయితీలను అందిస్తున్నాయి. అందులో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరం 252 యూనిట్లు మంజూరు చేస్తూ.. రూ. 1.7కోట్లు కేటాయించాయి. ఉద్యాన ప్రోత్సాహక పథకాలు చిన్న, సన్నకారు రైతులకు ఊతమిస్తున్నాయి. మామిడి, దానిమ్మ, సీతాఫలం మొక్కలకు 75 నుంచి 90శాతం, డ్రిప్ ఇరిగేషన్కు 90 శాతం సబ్సిడీని సద్వినియోగం చేసుకుంటున్నారు. సౌకర్యాలు లేక ఇబ్బందులు.. జిల్లాలో పెరుగుతున్న ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం ప్రోత్సహిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఏడాది 215 హెక్టార్లలో సాగు సబ్సిడీతో లబ్ధి పొందుతున్న అన్నదాతలు -
రోడ్డు ప్రమాదమా?.. హత్యనా?
నందిన్నెలో రోడ్డుపై భైఠాయించి ఆందోళన చేస్తున్న మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు నందిన్నె మాజీ సర్పంచ్ మృతిపై అనుమానం సొంత వాళ్లే చంపించారని భార్య ఆరోపణ ఎనిమిది మందిపై ఫిర్యాదు చేసిన సోదరుడు ఆర్థిక వ్యవహారాలు.. పాత కక్షలపై పోలీసుల ఆరా మృతదేహంతో రోడ్డుపై బైఠాయించిన బంధువులు నందిన్నెలో తీవ్ర ఉద్రిక్తత.. రైస్మిల్లుపై దాడికి యత్నం అడ్డుకున్న పోలీసులు.. గ్రామంలో పికెటింగ్ – గద్వాల/గద్వాల క్రైం -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
అలంపూర్: నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే విజయుడు అన్నారు. అలంపూర్లోని ఓ ఫంక్షన్హాల్లో శనివారం అడిషనల్ కలెక్టర్ నర్సింగ్రావుతో కలిసి ఆయన మహిళలకు ఇందిరా మహిళాశక్తి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మేరకు అర్హులందరికీ ఆరు గ్యారంటీలను అందించాలన్నారు. ఇటీవల ఓ దివ్వాంగుడు, వృద్ధురాలు తమకు పింఛన్ రావడంలేదని తన దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. అర్హులకు సంక్షేమ పథఽకాలు అందించడంలో నిర్లక్ష్యం చేయొద్దని అధికారులకు సూచించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. రెండు రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ పూర్తి చేస్తామన్నారు. ప్రతి గ్రామంలో 17 నుంచి 18 ఏళ్లలోపు కిషోర బాలికలతో పాటు వృద్ధులతో ప్రత్యేకంగా సంఘాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 311 గ్రామ సంఘాలు ఉన్నాయని వివరించారు. వాటి ఆధారంగా 311 వృద్ధుల సంఘాలు, 3,111 దివ్వాంగ, 662 కిషోర బాలికల సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సంఘంలో ఉన్న ప్రతి మహిళకు రూ. 10 లక్షల బీమా సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. బ్యాంకు రుణాల్లో రూ. 2లక్షల వరకు మాఫీ ఉంటుందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాసులు, డీడబ్ల్యూఓ సునంద, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డెన్న, తహసీల్దార్ మంజుల, ఎంపీడీఓ పద్మావతి, ఏఓ నాగార్జున్ రెడ్డి, రాష్ట్ర టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యుడు ఎండీ ఇస్మాయిల్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు ప్రభావతి, కార్యదర్శి సౌజన్య, డీపీఎం సలోని పాల్గొన్నారు. -
మూడు నెలలు నిల్వ..
మత్స్య కళాశాల విద్యార్థులు తయారు చేసే జల పుష్పాల పచ్చళ్లు గరిష్టంగా మూడు నెలలపాటు నిల్వ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 90 రోజుల పాటు పచ్చడి నిల్వ ఉండేందుకు నిమ్మ రసాన్ని ఉపయోగించడంతోపాటు స్టెరిలైజ్ చేసిన గాజు సీసాలో నింపి లేబుల్ చేస్తారు. నాణ్యమైన నూనె, దినుసులను ఉపయోగిస్తారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. ఈ చేప, రొయ్యల పచ్చళ్లను తయారు చేస్తున్నట్లు మత్స్య కళాశాల నుంచి అధికారిక అనుమతులు పొంది పచ్చళ్లు తయారు చేస్తున్నారు. -
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజీవ్రెడ్డి
గద్వాల: జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎం.రాజీవ్రెడ్డిని నియమించారు. ఈ మేరకు శనివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ డీసీసీ అధ్యక్షుల జాబితాను విడుదల చేశారు. ధరూరు మండలం కాపులకుంటకు చెందిన రాజీవ్రెడ్డిని డీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. ఆయన మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. దశాబ్దన్నర కాలంగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేయడంపై మున్నూరుకాపు సామాజిక వర్గం, రాజీవ్రెడ్డి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తంచేశారు. ‘పంచాయతీ’ రిజర్వేషన్లు ఖరారు గద్వాల: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అధికారులు పంచాయతీల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. మొత్తం 255 సర్పంచ్ స్థానాలు ఉండగా.. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను శనివారం లక్కీడిప్ ద్వారా కేటాయించారు. మొత్తం సర్పంచ్ స్థానాలకు రొటేషన్ విధానంలో రిజర్వేషన్ ప్రక్రియను పూర్తిచేశారు. ఈ జాబితాను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు నివేదించనున్నారు. కాగా, జిల్లాలో ఇదివరకే గ్రామపంచాయతీల వారీగా నూతన ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. ఇందులో ఒక కుటుంబానికి చెందిన ఓట్లు ఒకే వార్డులో ఉండేలా చేర్పు, మార్పులు చేపట్టారు. గత జూలై 1న రూపొందించిన ఓటరు జాబితా ప్రమాణికంగా ముసాయిదా జాబితాను విడుదల చేశారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం సెప్టెంబర్ 2న తుది జాబితాను విడుదల చేసిన విషయం విదితమే. తాజాగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు మొదలుపెట్టిన నేపథ్యంలో ఓటరు దరఖాస్తుల అభ్యంతరాల స్వీకరణ, తప్పుల సవరణ వంటి ప్రకియను పూర్తిచేసి.. తుది ఓటరు జాబితాను ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రచురించనున్నారు. మెరుగైన విద్య అందించాలి మల్దకల్: విద్యార్థులకు మెరుగైన విద్య అందించి.. వారి ఉన్నతికి కృషి చేయాలని డీఈఓ విజయలక్ష్మి ఉపాధ్యాయులకు సూచించారు. శనివారం మండలంలోని అమరవాయి ఉన్నత పాఠశాలలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. అనంతరం కాంప్లెక్స్ సమావేశానికి డీఈఓ హాజరై మాట్లాడారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నారు. చదువులో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని డీఈఓ పరిశీలించారు. ఆమె వెంట ఎంఈఓ సురేశ్, జీహెచ్ఎం నరేశ్ ఉన్నారు. సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో వివిధ కోర్సులకు సంబంధించిన పరీక్ష ఫలితాలను వీసీ శ్రీనివాస్ శనివారం విడుదల చేశారు. బీఈడీ సెమిస్టర్ 2లో 71.98 శాతం, బీఈడీ 4వ సెమిస్టర్లో 93.48 శాతం, ఎల్ఎల్బీ 2వ సెమిస్టర్లో 68.85 శాతం, ఎల్ఎల్బీ 4వ సెమిస్టర్లో 86.85 శాతం, బీ ఫార్మసీ 4వ సెమిస్టర్ 60.40 శాతం, భీపార్మసీ 6వ సెమిస్టర్ 57.77 శాతం, ఎంఫార్మసీ 2వ సెమిస్టర్లో 72.22 శాతం, బీపెడ్ 2వ సెమిస్టర్లో 87.13 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు కంట్రోలర్ ప్రవీణ తెలిపారు.కార్యక్రమంలో అడిషనల్ కంట్రోలర్ అనురాధారెడ్డి, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, కరుణాకర్రెడ్డి, ఈశ్వర్కుమార్, సురేష్, గౌతమి తదితరులు పాల్గొన్నారు. -
మహిళల ఆర్థిక అభ్యున్నతే లక్ష్యం
గద్వాలటౌన్/ధరూరు: మహిళల ఆర్థిక అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. శనివారం గద్వాల మండలం గోనుపాడు, ధరూరు మండల కేంద్రంలోని రైతువేదికలో ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అన్నివిధాలా సహకారం అందిస్తోందన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళా సంఘాలకు అందించే వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా రాణించాలని సూచించారు. వివిధ వృత్తులు, వ్యాపారాల్లో మహిళలు ప్రావీణ్యం పొందేందుకు గాను జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా మహిళా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో అన్నివర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తామన్నారు. ఒకప్పుడు మహిళలు బ్యాంకులకు వెళ్లాలంటేనే ఇబ్బంది పడే పరిస్థితి ఉండేదని.. ప్రస్తుతం బ్యాంకుల్లో ప్రధాన పాత్ర మహిళా సంఘాలదే ఉంటుందన్నారు. కొన్నేళ్లలోనే మహిళా సంఘాలు పెద్దఎత్తున ఏర్పాటై స్వయం సమృద్ధిని సాఽధిస్తున్నారని వివరించారు. జిల్లాలోని గట్టు, మల్దకల్, అలంపూర్ మండల్లాలోని సంఘాలు ఆర్టీసీకి బస్సులను అద్దెకు ఇచ్చేందుకు గాను ప్రభుత్వం రూ. 30లక్షల చొప్పున సబ్సిడీ మంజూరు చేసిందని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, మాజీ వైస్ఎంపీపీ సుదర్శన్రెడ్డి, ఎంపీడీఓ శైలజ, తహసీల్దార్ మల్లికార్జున్, డీపీఎం అరుణ, నాయకులు శ్రీనివాస్రెడ్డి, వెంకట్రామిరెడ్డి, రామన్న, విజయ్రెడ్డి, ఉరుకుందు పాల్గొన్నారు. -
భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలి
గద్వాలటౌన్: పెండింగ్లో ఉన్న భూ భారతి దరఖాస్తులను నిబంధనల మేరకు వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో భూ భారతి, మీ–సేవ దరఖాస్తులు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఎఫ్–లైన్ దరఖాస్తులపై మండలాల వారీగా తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్లో ఎన్ని ఆర్జీలు పరిష్కరించారు, ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులు ఆరు నెలలు దాటిన వాటిని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని పూర్తిస్థాయిలో పరిష్కరించాలన్నారు. ఆర్డీఓ, తహసీల్దార్ల లాగిన్లలో ఉన్న పెండింగ్ దరఖాస్తులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. దరఖాస్తులలో ప్రభుత్వ భూములు లేదా కాల్వలకు సంబంధించిన అంశాలు ఉంటే సర్వేయర్లు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పించాలని, దరఖాస్తులను తిరస్కరించే ముందు స్పష్టమైన కారణాలను తెలియాజేయాలని సూచించారు. రెవెన్యూ కార్యాలయాలలో ఆదాయం, కుల, కుటుంబ ధ్రువీకరణ, కల్యాణలక్ష్మి, షాదీ ముభారక్ పెండింగ్ దరఖాస్తులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రతి తహసీల్దార్ తమ పరిధిలోని పాఠశాలలు, వసతి గృహాలను విధిగా సందర్శించి ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ అలివేలు, సర్వేఅండ్ ల్యాండ్ రికార్డు రామ్చందర్ తదితరులు పాల్గొన్నారు. -
త్వరలోనే వలంటీర్ల నియామకం
గట్టు: గట్టు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు సరిపడా విద్యావలంటీర్లను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు డీఈఓ విజయలక్ష్మీ తెలిపారు. శుక్రవారం తుమ్మలచెరువు ప్రాథమికోన్నత పాఠశాలలో గట్టు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశానికి హాజరైన ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు నిత్య విద్యార్థిగా మారి, తరగతుల్లో విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునే విధంగా ఆధునిక పద్ధతులను ఉపయోగించి పాఠ్యాంశాలను బోధించాలన్నారు. గట్టు మండలంలో ఉపాధ్యాయులు వాడుతున్న బోధనా పరికరాలను చూసి ప్రశంశించారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉంటుందన్నారు. ఎఫ్ఎల్ఎన్ మిడ్లైన్ టెస్టులో విద్యార్థుల మెరుగైన ప్రగతికోసం మరింత కృషి చేయాలని సూచించారు. పాఠశాలలో భవిష్యత్భారత్ స్వచ్ఛంద సంస్థ నిర్మిస్తున్న వంటగది నిర్మాణ పనులను ఆమె ప్రారంభించారు.కార్యక్రమంలో ఏసీజీఈ శ్రీనివాస్, జిల్లా సమన్వయ అధికారి అంపయ్య, ఎంఈఓ వెంకటేశ్వర్లు, హెచ్ఎంలు నల్లారెడ్డి, రామన్గౌడ్, రాజన్న, బాలరాజు, నర్సింహులుగౌడ్ పాల్గొన్నారు. -
హుండీ ఆదాయం రూ.21.82 లక్షలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.21.82 లక్షలు వచ్చిందని దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ తెలిపారు. శుక్రవారం ఆలయ ఆవరణలోని కల్యాణ మండపంలో హుండీ లెక్కింపు చేపట్టగా.. గద్వాలకు చెందిన ఎస్ఎల్వి సేవా సంఘం ఆధ్వర్యంలో 150మంది పాల్గొన్నారు. మొత్తం రూ.21,82,936 ఆదాయం, చింతలాముని నల్లారెడ్డిస్వామి ఆదాయం రూ.34,630 వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. గతేడాది కంటే అదనంగా ఆదాయం సమకూరినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సత్యచంద్రారెడ్డి, చైర్మన్ ప్రహ్లాదరావు, నాయకులు సీతారామిరెడ్డి, చంద్రశేఖర్రావు, పద్మారెడ్డి, వీరారెడ్డి, రాముడు, భీమన్న, వీరన్న ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.6,889 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు శుక్రవారం 306 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.6889, కనిష్టం రూ.3850, సరాసరి రూ.3850 ధరలు లభించాయి. అలాగే, 21 క్వింటాళ్ల ఆముదాలు రాగా, గరిష్టం రూ. 5869, కనిష్టం రూ.5728, సరాసరి రూ.5759 ధరలు పలికాయి. 1988 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ. 2689, కనిష్టం రూ. 1866, సరాసరి ధరలు రూ. 2689 వచ్చాయి. ఆయిల్పాం సాగుతో దీర్ఘకాల లాభాలు మల్దకల్: రైతులు ఆయిల్పాం సాగుతో దీర్ఘకాల లాభాలు పొందవచ్చునని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అక్బర్ సూచించారు. శుక్రవారం మల్దకల్ రైతువేదికలో సింగిల్విండో డైరెక్టర్లు, రైతులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ కాలం పంట దిగుబడి వచ్చే ఆయిల్పాం సాగుపై రైతులు అవగాహన పెంచుకోవాలన్నారు. ఆయిల్పాం సాగుకు ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహం అందిస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం సబ్సిడీపై మొక్కలతో పాటు సాగుకు సంబంఽధించిన డ్రిప్ అందజేస్తుందని పేర్కొన్నారు. అలాగే ఆయిల్పాం సాగులో రైతులు అంతరపంటను సాగు చేసుకోవచ్చని వివరించారు. కార్యక్రమంలో జిల్లా కో ఆపరేటివ్ అధికారి శ్రీనివాస్, ఏడీఏ శివనాగిరెడ్డి, ఏఓ రాజశేఖర్, సింగిల్ విండో అధ్యక్షుడు తిమ్మారెడ్డితోపాటు విష్ణు తదితరులు పాల్గొన్నారు. సంఘటితంతోనే సమస్యల పరిష్కారం గద్వాలటౌన్: తెలుగు ముదిరాజ్ కులస్తులను బీసీ–ఏ జాబితాలో చేర్చాలని, బీసీ–ఏ సాధన కోసం అందరూ ఏకతాటిపైకి రావాలని, సంఘటితంగా సమస్యలను పరిష్కరించుకోవాలని తెలుగు, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు కబీర్దాస్ నర్సింహులు, నియోజకవర్గ అధ్యక్షుడు టీఎన్ఆర్ జగదీష్ సూచించారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని గద్వాల తెలుగు, ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక రెండవ రైల్వేగేటు దగ్గర ఉన్న సంఘం కమ్యూనిటీ హాల్ స్థలంలో ఏర్పాటు చేసిన మత్స్యకారుల సంఘం జెండాను వారు ఆవిష్కరించారు. అనంతరం గంగమ్మతల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం నదిఆగ్రహారం, గార్లపాడు గ్రామాలలో ఉన్న మత్స్య సహకార సంఘాలలో వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు జనార్థన్, రమేష్, నంబర్ నర్సింహా, అంజి, దౌలు, లక్ష్మన్న, రాములు, దడవాయి నర్సింహులు, పాండు తదితరులు పాల్గొన్నారు. -
బస్సు కోసం రోడ్డెక్కిన విద్యార్థులు
అయిజ: విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయాలని మున్సిపాలిటీ పరిధిలోని పర్దీపురం వద్ద అంతర్రాష్ట్ర రహదారి రాయచూరు – కర్నూలు రోడ్డుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు శుక్రవారం ధర్నాకు దిగారు. బస్సులు నిలపకపోడంతో పాఠశాలలకు సమయానికి వెళ్లలేకపోతున్నామని, చదువులకు దూరమవుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గంటపాటు బైఠాయించడంతో రోడ్డుకు ఇరు వైపులా బస్సులు, లారీలు ఎక్కడికక్కడే నిలిచాయి. ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో ఎస్ఐ శ్రీనివాసరావు, ఆర్టీసీ సిబ్బంది అక్కడకు చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. దీంతో ఎస్ఐ ఆర్టీసీ డిపో మేనేజర్ సునీతకు ఫోన్చేసి మాట్లాడారు. బస్సులు పర్దీపురంలో నిలిపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు. ఆందోళన విరమించడంతో వాహనాలు ముందుకు కదిలాయి. ఈ నెల 4వ తేదీన సైతం విద్యార్థులు ధర్నా చేశారు. ఈవిషయమై ఆర్టీసీ డిపో మేనేజర్ సునీతను వివరణ కోరగా.. ఆర్టీసీ బస్సులు పర్దీపురం స్టేజీ వద్ద నిలుపుతున్నారని, అయితే ప్రత్యే క బస్సు ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారని, అది వీలుకాదని పేర్కొన్నారు. అంతర్రాష్ట రహదారిపై రెండు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు -
గడువులోగా పూర్తయ్యేనా?
పట్టణాల్లో నత్తనడకన ‘అమృత్ 2.0’ పనులు ● రక్షిత, సుస్థిర నీటి సరఫరాయేపథకం లక్ష్యం ● గద్వాల, అలంపూర్, వడ్డేపల్లి పురపాలికలకు రూ.88.74 కోట్లు మంజూరు పనులు వేగవంతం చేస్తాం.. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో జరుగుతున్న అమృత్ 2.0 పథకం పనుల వేగాన్ని పెంచుతాం. సాంకేతిక కారణాలతో కొన్ని చోట్ల పనులు ఆగాయి. మళ్లీ చేపట్టాం. పైపులైన్ పనులు సైతం కొనసాగుతున్నాయి. పనులు గడువులోగా పూర్తి కావాలన్న ఆలోచన కాకుండా నాణ్యతగా చేయాలన్న తలంపుతో ఉన్నాం. – విజయభాస్కర్రెడ్డి, ఈఈ, ప్రజారోగ్యశాఖ గద్వాలటౌన్: మున్సిపల్ పట్టణాలలో రక్షిత, సుస్థిర తాగునీటి సరఫరా లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యంతో ‘అమృత్ 2.0’ పథకం తీసుకొచ్చాయి. ప్రజల దాహార్తి తీర్చేందుకు ఈ పథకం కింద భారీగా నిధులు కేటాయించాయి. అంతా బాగున్నా.. జిల్లాలో ఈ పథకం కింద చేపట్టిన పనులు నత్తనడకన సాగుతుండటంతో గడువులోగా పూర్తి కావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రూ.88.74 కోట్లతో పనులు జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో అయిజ మినహా గద్వాల, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలు ‘అమృత్ 2.0’ పథకం కింద ఎంపికయ్యాయి. మూడు మున్సిపాలిటీలకు గాను మొత్తం రూ.88.74 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు, మున్సిపల్ నిధులతో ఈ పనులు చేపట్టనున్నారు. శివారు కాలనీలు, విలీన గ్రామాల్లో నెలకొన్న తాగునీటి ఇబ్బందులను క్షేత్రస్థాయిలో సర్వే చేసి నీటి ట్యాంకులు నిర్మించేందుకు నిర్ణయించారు. ప్రజారోగ్యశాఖ రెండేళ్ల క్రితం టెండర్లు పిలిచింది. నిర్మాణ పనులన్నీ ఒకే సంస్థకు అప్పగించారు. తాగునీటి ట్యాంకులు, పైపులైన్ పనులు, ఫిల్టర్బెడ్ల నిర్మాణం, మరమ్మతులు తదితర పనులు వేగవంతంగా కొనసాగాల్సి ఉండగా.. నెమ్మదిగా సాగుతున్నాయి. కొన్ని చొట్ల పనులు ఇంకా మొదలే కాలేదు. ఇలాగే పనులు సాగితే గడువులోపు పనులు పూర్తి చేయడం కష్టతరమే. -
యాజమాన్య పద్ధతులు పాటించండి
అయిజ/అలంపూర్ రూరల్: రైతులు యాజమాన్య పద్ధతులు పాటించి వరిలో అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.శంకర్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా చేపట్టిన ‘నాణ్యమైన విత్తనం రైతన్న నేస్తం’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉప్పల,బుక్కాపురం గ్రామ శివారులో ‘ఆర్ఎన్ఆర్ 15048’ వరి రకం క్షేత్ర దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా శాస్త్రవేత్త మాట్లాడుతూ.. రైతు స్థాయిలో విత్తనోత్పత్తిని పెంపొందించే ఉద్దేశంతో జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా నాణ్యమైన విత్తనం రైతన్న నేస్తం కార్యక్రమం నిర్వహిస్తోందని తెలిపారు. ఆర్ఎన్ఆర్ 15048 వరి రకం, వాటి లక్షణాలు తెలియజేశారు. విత్తనోత్పత్తి చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళకువలు గురించి రైతులకు వివరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం. శంకర్, డాక్టర్ ఏ. శ్రీరామ్, డాక్టర్ ఆది శంకర్, డాక్టర్ కె. సిద్దప్ప, ఏఓ జనార్ధన్, వ్యవసా య విస్తరణ అధికారిని స్వాతి రైతులు పాల్గొన్నారు. -
అలవి వలల నిషేధాన్ని అమలు చేస్తాం
● ఈ అంశంపై ఏపీ అధికారులతో మాట్లాడతా ● రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కొల్లాపూర్: కృష్ణానదిలో అలవి వలలతో వేటను పూర్తిస్థాయిలో బ్యాన్ చేస్తామని, దీనిపై ఏపీకి చెందిన పోలీసు, రెవెన్యూ అధికారులతో కూడా మాట్లాడుతామని రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కొల్లాపూర్లో నిర్వహించిన ప్రపంచ మత్స్యకార దినోత్సవంలో మంత్రి వాకిటి శ్రీహరితోపాటు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి, కాంగ్రెస్ నేత నీలం మధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.122 కోట్లు కేటాయించిందని, వాటితో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. మంత్రి జూపల్లి లేఖ పంపిస్తే కొల్లాపూర్లో చేపపిల్లల ఉత్పత్తి యూనిట్, మత్స్య పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. కొల్లాపూర్ చేపలను ప్రపంచ స్థాయి మార్కెట్కు ఎగుమతి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ మత్స్యకారుల కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేస్తామన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పెద్దకొత్తపల్లి మండలంలో రూర్బన్ మిషన్ కింద మంజూరైన నిధులతో కోల్డ్ స్టోరేజీ, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. మామిడి, చేపల విక్రయాల కోసం 116 ఎకరాల్లో మార్కెట్ నిర్మాణానికి భూ సేకరణ చేస్తున్నట్లు వివరించారు. ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ అడుక్కుంటే పదవులు రావని, గుంజుకోవాలని ముదిరాజ్లకు సూచించారు. జనాభా దామాషా ప్రకారం రాజకీయ పదవులకు పోటీపడాలని, ఇందుకు ఐక్యంగా ఉంటేనే సాధ్యమవుతుందన్నారు. తాను బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు మత్స్యకారుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టానని, ఇప్పుడు కూడా బీజేపీ ఎంపీగా కేంద్రంలో మత్స్యకారుల సంక్షేమం కోసం అవసరమైన కృషిచేస్తానన్నారు. ఎంపీ మల్లురవి మాట్లాడుతూ ముదిరాజ్లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి కృషిచేస్తున్నారన్నారు. కాంగ్రెస్ నేత నీలం మధు మాట్లాడుతూ బీసీ ఏ గ్రూపులో చేర్చే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో చర్చించాలని మంత్రులను కోరారు. కార్యక్రమంలో నాయకులు డాక్టర్ పగిడాల శ్రీనివాసులు, ఎల్లేని సుధాకర్రావు, కేతూరి వెంకటేష్, పెబ్బేటి కృష్ణయ్య, మల్లికార్జున్, వెంకటస్వామి, గాలెన్న, హుస్సేనయ్య, హరికృష్ణ, శివవర్మ, చెన్నరాములు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
నందిన్నె చెక్పోస్టు తనిఖీ
కేటీదొడ్డి: మండలంలోని నందిన్నె చెక్పోస్టును ట్రెయినీ కలెక్టర్ మనోజ్కుమార్రెడ్డి తనిఖీ చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన చెక్పోస్టు వద్దకు చేరుకొని అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులతో మాట్లాడారు. చెక్పోస్టులో నిర్వహించే తనిఖీల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం గ్రామ పంచాయతీ వద్ద నిర్వహిస్తున్న వైద్య సిబ్బందితో మాట్లాడారు. ఫిర్యాదులు పరిశీలించి పరిష్కరిస్తాం ● ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ స్టేషన్ మహబూబ్నగర్: డయల్ యువర్ ఆర్టీసీ ఆర్ఎంకు వచ్చిన సలహాలు, ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరిస్తామని రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ అన్నారు. డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు రీజినల్ పరిధిలోని ఆర్టీసీ ప్రయాణికుల నుంచి ఆర్ఎం సలహాలు, ఫిర్యాదులను స్వీకరించారు. మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్ రూట్లో శంకరాయపల్లి వద్ద బస్సులు, మహబూబ్నగర్లోని భగీరథకాలనీ వద్ద బస్సులు ఆపాలని ప్రయాణికులు ఫోన్లో కోరారు. ఉదయం సమయంలో కోస్గి నుంచి మహబూబ్నగర్ మీదుగా లింగచేడ్, కొమ్మురు, కోయిలకొండకు బస్సులు నడపాలని, గద్వాల బస్సును అల్లపాడు నుంచి మానవపాడు ఎక్స్రోడ్ వరకు పొడిగించాలని కోరారు. కొల్లాపూర్ నుంచి శ్రీశైలం వరకు నేరుగా బస్సు సర్వీసు నడపాలని విజ్ఞప్తి చేశారు. -
30 పడకల ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేయాలి
అయిజ: 30 పడకల ఆస్పత్రి ప్రారంభిస్తే చుట్టుపక్కల మండలాల ప్రజలకు వైద్యపరంగా ఎంతో ఉపయోగపడుతుందని.. ప్రభుత్వం వెంటనే ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేయాలని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కన నిర్మించ తలపెట్టిన 30 పడకల ఆస్పత్రి భవనాన్ని బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈసందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రాభుత్వ ఆస్పత్రి నిర్మాణం పూర్తికాకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా, సులబ్ కాంప్లెక్స్లా మారిందని మండిపడ్డారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు స్పందించి 30 పడకల ఆస్పత్రినిర్మాణం పూర్తిచేసి ప్రారంభించాలని, లేదంటే నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు భగత్రెడ్డి, గోపాలకృష్ణ, లక్ష్మణ్గౌడ్, అంజి, ఖుషి, బసన్న గౌడ్, నరసింహులు, కృష్ణ, రఘు పాల్గొన్నారు. -
ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్
ముందస్తు రిజర్వేషన్ ఫీజు పెంపు పాలమూరు: ఇటీవల కాలంలో ఖరీదైన కార్లు కొనుగోలు చేయడం ఒక ఎత్తు అయితే.. అంతకంటే ఎక్కువగా ఫ్యాన్సీ, లక్కీ నంబర్ తీసుకోవడానికి ఎంతైన ఖర్చు చేసే సంప్రదాయం బాగా పెరిగింది. చాలా వరకు కార్లకు, బైక్లకు ఫ్యాన్సీ నంబర్ పెట్టుకోవడం హోదాగా భావిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో కొన్ని ప్రత్యేక నంబర్లకు అధిక ప్రాముఖ్యత చోటుచేసుకుంటుంది. ఏడాది జనవరి నుంచి నవంబర్ 19వరకు జిల్లాలో 5,516 వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ లక్కీ నంబర్ల ద్వారా ప్రభుత్వానికి రూ.3.30 కోట్ల ఆదాయం రావడం విశేషం. ఇందులో అధికంగా 9999తో పాటు 9, 7777, 7 సిరీస్, 01తో పాటు 7, 6, 5 వంటి సిరీస్ నంబర్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రవాణా శాఖలో నూతన వాహనాల నంబర్ రిజిస్ట్రేషన్ కోసం ముందే రిజర్వేషన్ చేసుకునే ముఖ్యమైన నంబర్ల ఫీజు పెంచుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్నగర్ ఆర్టీఏ కార్యాలయంలో 9999 నంబర్ రిజర్వేషన్ చేసుకోవాలంటే సదరు వాహనదారుడు ముందుకు రూ.1.50 లక్షలు డీడీ చెల్లించి రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా వాహనదారుడు పోటీ వచ్చి వేలం పాట నిర్వహిస్తే మళ్లీ ఫీజు ధర పెరుగుతుంది. అదేవిధంగా 1, 9, 6666 నంబర్లకు ఫీజు రూ.1లక్ష ఫీజు కేటాయించగా 99, 999, 3333, 4444, 5555, 7777 నంబర్లకు ఫీజు రూ.50వేలుగా నిర్ణయించారు. దీంతోపాటు 5, 6, 7, 123, 333, 369, 555, 666, 777, 1111 నంబర్లకు రూ.40వేలుగా ఫీజు కేటాయించారు. ఇకపై జాబితాలో లేని నంబర్లకు కారు నంబర్కు అయితే రూ.6వేలు, ద్విచక్ర వాహనం అయితే రూ.3వేల ఫీజు ఉంటుంది. అదేవిధంగా ఆరోజు అందుబాటులో ఉండి రిజర్వ్ కాని నంబర్లకు రూ.2వేల ఫీజు చెల్లించి నంబర్ తీసుకోవచ్చు. పెరిగిన నంబర్ల ఫీజు వల్ల ఆర్టీఏ శాఖకు ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. జిల్లా వాహనాలు వచ్చిన ఆదాయం మహబూబ్నగర్ 2,032 1.15 కోట్లు నాగర్కర్నూల్ 1,176 66.22 వనపర్తి 836 55.62 జోగుళాంబ గద్వాల 833 54.15 నారాయణపేట 639 31.76 ఫ్యాన్సీ నంబర్ వేలం ద్వారా వచ్చిన ఆదాయం(రూ.లక్షల్లో) టీజీ06ఏ9999 7,82,000 టీజీ06బీ0001 1,05,000 టీజీ06బీ0009 7,75,555 టీజీ0బీ0999 1,05,500 టీజీ06బీ5555 1,34,000 రూ.లక్షల్లో డిమాండ్ ఉన్నా చెల్లించేందుకు రెడీ ఆసక్తి చూపుతున్న వాహనదారులు ఉమ్మడి జిల్లాలో ఏడాదిలో 5,516 వాహనాల రిజిస్ట్రేషన్ ప్రభుత్వానికి రూ.3.30 కోట్ల ఆదాయం -
దేదీప్యమానం.. కార్తీక దీపోత్సవం
కోటలోని ఆలయ ఆవరణ లో దీపాలు వెలిగిస్తున్న మహిళలు గద్వాలటౌన్/అయిజ/ఎర్రవల్లి: పరమశువుడికి ఎంతో ఇష్టమైన కార్తీక మాసం చివరి రోజు.. అందులోను అమావాస్యను పురస్కరించుకుని చేపట్టిన దీపోత్సవ కార్యక్రమాలు వైభవంగా సాగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకొని దీపాలు వెలిగించారు. జిల్లా కేంద్రంలోని కోటలోని శ్రీభూలక్ష్మి చెన్నకేశవస్వామి ఆలయం, నదిఆగ్రహారంలోని ఆలయాల సముదాయంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దీపాలు వెలిగించారు. కొండపల్లి గ్రామంలోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో వివిధ ఆకృతులలో వెలిగించిన ప్రమిదలు ఆకట్టుకున్నాయి. జములమ్మ పుష్కర ఘాట్లో సామూహిక కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించారు. – బీచుపల్లి పుణ్యక్షేత్రం భక్తులతో రద్దీగా మారింది. ఉదయాన్నే కృష్ణానదిలో స్నానాలు ఆచరించిన భక్తులు.. శివాలయం, కోదండరామస్వామి, సరస్వతీదేవితో పాటు అభయాంజనేయస్వామి ఆలయాలను దర్శించుకున్నారు. ● అయిజ మండలం కురువపల్లిలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణం కనులపండువగా నిర్వహించారు. ఎమ్మెల్యే విజయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. -
సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి
ఎర్రవల్లి: విద్యార్థుల సమగ్రాబివృద్ధికి ఉపాధ్యాయులు కలిసికట్టుగా కృషిచేయాలని డీఈఓ విజయలక్ష్మి అన్నారు. గురువారం మండలంలోని కొండేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ అమీర్పాష ఆధ్వర్యంలో స్కూల్ అండ్ క్లీన్ స్పెషల్ క్యాంపెయిన్ సమావేశం నిర్వహించగా.. డీఈఓ హాజరయ్యారు. ఈమేరకు 5.0పై అధికారులతో కలిసి సమీక్షించారు. ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా పరిశుభ్రతను పాటించాలని, ప్రమాదకర భవనాలు, తరగతి గదులు ఉంటే కూల్చివేయాలన్నారు. పాత బడిన పాఠశాల గదులకు పెయింటింగ్ పనులు చేపట్టాలని, పాఠశాలల్లో ఇంటర్నెట్ సమస్యలున్నా, టెక్నికల్ సమస్యలున్నా పరిష్కరించాలన్నారు. యూడిఐఎస్ఈలో ఎంట్రీ, డేటా లోపాలు ఏమైనా ఉంటే సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఫీల్డ్ స్థాయిలో డిజిటల్ లెర్నింగ్ అమలు, పురోగతి మరియు విద్యార్థుల వినియోగంపై సమీక్షించారు. ల్యాబ్ల పంక్షనాలిటి, వనరుల వినియోగం, పెరుగుదల గురించి ఆరా తీశారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు అవసరమయ్యే లైబ్రరీలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అంతకు ముందు కొండపేటలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల అభ్యర్థనా సామర్థ్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈఓ వెంకటేశ్వర్లు, శాంతిరాజు, హంపయ్య, రాజేంద్ర, మహ్మద్ ఆజాం పాల్గొన్నారు. -
విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకోవాలి
గద్వాలటౌన్: జిల్లాలో చిన్నారుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, పిల్లలు బాగా చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు అన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని ఐడీఓసీ సమావేశపు హాల్లో బాలల హక్కుల వారోత్సవ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్నారులకు అభ్యాసం, వారి సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం గుణాత్మక విద్య, పౌష్టికామారంతోపాటు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. నేటి పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనాథ పిల్లలకు బాలసదనం భద్రతగా, సురక్షితంగా ఉంటుందన్నారు. పిల్లలు ఎవరూ కూడా అధైర్యపడద్దొని, మీ అభ్యున్నతికి మేం ఎల్లప్పుడూ తోడుంటామని చెప్పారు. అనంతరం ఆటల పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి సునంద, డీఈఓ విజయలక్ష్మి, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ నుషిత, డీఎంఅండ్హెచ్ఓ సంధ్య కిరణ్మయి, జిల్లా ప్రొబిషన్ అధికారి పరుశరాం, సీడబ్ల్యూసీ చైర్మన్ సహదేవుడు, సభ్యురాలు శైలజ, కోఆర్డినేటర్ నర్సింహా, జువైనల్ జస్టీస్ బోర్డు సభ్యురాలు గ్రేసి తదితరులు పాల్గొన్నారు. -
నిధుల విడుదలకు సహకరించండి
అలంపూర్: చేనేత రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న నేతన్నలకు నిధుల విడుదలకు సహకరించాలని రాజోలి చేనేత కార్మికులు బీఆర్ఎ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కోరారు. గురువారం హైదరాబాద్లో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డితో కలిసి రాజోలి చేనేత కార్మికులు ఆయనను కలిసినట్లు తెలిపారు. ఈమేరకు చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ వంతుగా కృషి చేయాలని వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల నుంచి చేనేత కార్మికులను పట్టించుకోవడం లేదని వినతిలో తెలిపారు. రుణ మాఫీ, సబ్సిడీ రుణాలు అమలు కావడం లేదని పేర్కొన్నారు. అసెంబ్లీలో ఈ విషయం మాట్లాడి చేనేత రంగానికి బడ్జెట్లో నిధులు కేటాయించడానికి కృషి చేయాలని వినతిలో కోరారు. క్రీడలతో ఉజ్వల భవిష్యత్ గద్వాలటౌన్: ఆటల్లో గెలుపు కన్నా క్రీడా స్ఫూర్తి గొప్పది.. దానికి లోబడే క్రీడాకారులు వ్యవహరించాలని, క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి కృష్ణయ్య అన్నారు. ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాస్థాయి బాల, బాలికల అండర్–17 బాస్కెట్ బాల్ ఎంపిక పోటీలు గురువారం ఉత్సాహంగా సాగాయి. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. వీరాపురం దగ్గర ఉన్న ఎస్ఆర్ విద్యానికేతన్ క్రీడా మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, పాఠశాల డైరెక్టర్ రాముడు, పీఈటీలు హైమావతి, సతీష్, నగేష్, మోహనమురళీ, నర్సింహారాజు, మల్లేశ్వరి పాల్గొన్నారు. ప్రతి రైతు మద్దతు ధర పొందాలి ఎర్రవల్లి: రైతులు ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను పొందాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. గురువారం మండలంలోని కొండేరులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏ–గ్రేడ్ రకానికి రూ.2389, సాధారణ రకానికి రూ. 2369 మద్దతు ధరను అందిస్తుందన్నారు. దీనికోసం రైతులు 17 శాతం తేమ ఉండేలా వడ్లను ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రానికి తరలిస్తే సరిపోతుందన్నారు. గోనె సంచులు, హమాలీ చార్జీలను కూడా కేంద్రమే భరిస్తుందన్నారు. వడ్లను కేంద్రం కొనుగోలు చేసి రైతులకు డబ్బు జమ చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఫ్లెక్సీల్లో వారి నాయకుల ఫొటోలు పెట్టుకోవడంపై ఆయన మండిపడ్డారు. ప్రధానిమోదీ ఫొటో ఉండేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం
గద్వాల క్రైం: శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉంటూ అనుమానాస్పద కేసులపై వేగంగా విచారణ చేపట్టి బాధితులకు అండగా ఉండాలని డీజీపీ శివధర్రెడ్డి వెల్లడించారు. గురువారం వీడియో సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరావుతో మాట్లాడారు. జిల్లా పోలీసుల పనితీరు, పోలీసు స్టేషన్లో నమోదైన కేసులు, సమస్యలపై వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ నేరగాళ్లపై ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించి చైతన్యం చేయాలని, హిట్ అండ్ రన్ ప్రమాదాలపై ప్రత్యేక విచారణ చేపట్టాలన్నారు. అనుమతి లేకుండా ఇసుక, మట్టి, రేషన్ బియ్యం, నిషేధిత మత్తు పదార్థాలు సరఫరా చేస్తే కట్టడి చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలపై విలేజ్ రోడ్డు సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాల్సిందిగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాదిలో నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో పట్టిష్ట నిఘా ఉంచాలన్నారు. అనంతరం జిల్లాలో నమోదైన కేసులు, విచారణ, సిబ్బంది పనితీరును ఎస్పీ డీజీపీకి వివరించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ శంకర్,డీఎస్పీ మొగిలయ్య, సీఐలు శ్రీను, టాటబాబు, రవిబాబు ఉన్నారు. -
ఒత్తిడితో ఆరోగ్యం చిత్తు
జిల్లాలో పెరుగుతున్న పక్షవాతం కేసులు ● వ్యాధి లక్షణాలతో 858 మంది సతమతం ● 15 శాతం మంది యువకులే కావడం ఆందోళనకరం ● లక్షణాలు ముందస్తుగా గుర్తించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సర్వే గద్వాల క్రైం: మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు.. రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రించుకోవడంలో నిర్లక్ష్యం.. వెరసి యువకులు సైతం పక్షవాతం బారిన పడుతున్నారు. దీనికితోడు వ్యాధి లక్షణాలను ముందుగా గుర్తించకపోవడం, సరైన సమయంలో తగిన వైద్యం తీసుకోకపోవడంతో అనారోగ్య సమస్యలు ఏరికోరి తెచ్చుకుంటున్నారు. జిల్లాలో 858 మంది ఈ వ్యాధి భారినపడ్డారు. అయితే ఇందులో 15 శాతం యువత సైతం ఈ లక్షణాలతో సతమతమవుతున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు 40 ఏళ్లలోపు వారు గత కొన్ని నెలల కిత్రం మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు దిక్కులేని వారవుతున్నారు. దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సర్వే చేపట్టి వ్యాధిగ్రస్తులను గుర్తించి జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక వసతులు అందిస్తున్నారు. చాలామటుకు కేసుల్లో ఒత్తిడితో కూడిన జీవనం, మద్యపానం, దూమపానం, నిద్రలేమి సమస్యలతో మొదడు మొద్దుబారిపోతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుత సమయంలో చాలా మందికి ఈ వ్యాధి లక్షణాలపై అవగాహన లేకపోవడం సమస్యగా మారిందని వైద్యులు పేర్కొంటున్నారు. ఉన్నట్టుండి శరీరం బిగుసుపోవడం, మూతి వంకర తిరగడం, కాళ్లు, చేతులు చచ్చుబడి పోవడం, ఒక్కోసారి గుండె కూడా పని చేయకపోవడం ఇలా శరీరంలో ప్రతి అవయంపై ప్రభావం చూపుతున్న వ్యాధి పక్షవాతం అని వైద్యులు సూచిస్తున్నారు. పక్షవాతం.. అప్పటి వరకు ఆనందంగా సాగిపోతున్న వారి జీవితాలను ఆకస్మాత్తుగా కుప్ప కూల్చేస్తోంది. వారి బతుకులను ఉన్నట్లుండి అంధకారంలో నెట్టేస్తోంది. పక్షవాతానికి గురైన కొందరు దివ్యాంగులుగా మిగిలిపోయి.. తీవ్ర అవస్థలు పడుతున్నారు. పక్షవాతాన్ని (పెరాలసిస్), వైద్య పరిభాషలో బెయిన్ స్ట్రోక్ అని పిలుస్తారు. మెదడుకు రక్త సరఫరాలో ఆటంకం ఏర్పడినప్పుడు కొన్ని లక్షణాలు బయటపడతాయి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారి మెదడుకు రక్త సరఫరా తగ్గడంతో శరీరంలో తిమ్మిర్లు, ఒక కాలు, చేతిలో శక్తి తక్కువైనట్లు అనిపిస్తుంది. పూర్తిగా లేదా సరిగ్గా మాట్లాడలేరు. ఇతరులు చెప్పింది అర్థం చేసుకోలేరు. చూపు మసకబారుతుంది. తీవ్ర తలనొప్పి, ముందుకు నడవలేక ఇబ్బంది పడతారు. ఈ లక్షణాలు కనిపించిన మూడు గంటలోపు ఆసుపత్రికి తీసుకేళ్తే.. వైద్యులు మెరుగైన వైద్యం అందించి రక్త ప్రసరణను పునరుద్ధరిస్తారు. మొదడు ఎక్కువగా దెబ్బ తినకుండా కాపాడతారు. అవగాహన లోపమే శాపం వెంటనే వైద్య సేవలు పొందాలి మద్యం, సిగరెట్లు తాగే వారికి పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. తరచూ బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. ఎక్కువగా నీరసంగా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి. గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడేవారు వైద్య పరీక్షలు చేయించుకుని తగిన మందులు తీసుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉంటూ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించి 30 రోజులకు అవసరమయ్యే మందులు అందజేస్తున్నాం. ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లా వ్యాప్తంగా సర్వే చేపట్టింది. – దాము వంశీ, జిల్లా ఆస్పత్రి జనరల్ ఫిజీషియన్ -
స్థానిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి
గద్వాలటౌన్: స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టామని కలెక్టర్ బీఎం సంతోష్ వివరించారు. గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి, ఇతర ఎన్నికల సంఘం అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కలెక్టర్తోపాటు ఎస్పీ శ్రీనివాస్రావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా, అభ్యంతరాలు, పోలింగ్ కేంద్రాలు, రిజర్వేషన్ల ప్రక్రియ, శాంతిభద్రల అంశాలపై సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాంటి వివాదాలు, అవకతవకలకు అవకాశం లేకుండా, మూడు విడతలలో నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని, 2011 ఎన్నికల జాబితా ప్రకారం ఎస్సీ, ఎస్టీలు, 2024 సర్వే ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కేటాయించడం జరుగుతుందని రాష్ట్ర అధికారులు తెలిపారు. అనంతరం జిల్లాలో ఎన్నికల నిర్వహణ, శాంతిభద్రతలపై కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో అడిషినల్ కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగరావు, అడిషినల్ ఎస్పీ శంకర్, డీపీఓ నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్పాం సాగుకు మరింత ప్రాధాన్యం
అలంపూర్రూరల్: ఆయిల్పాం సాగుకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇస్తుందని, సాగుకు ముందుకొచ్చే రైతులకు రాయితీపై డ్రిప్, మొక్కలు అందజేస్తుందని ఉద్యానవన శాఖ జిల్లా అధికారి ఎంఏ అక్బర్ అన్నారు. బుధవారం మండలంలోని క్యాతూర్ రైతువేదికలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో..ఉద్యావనశాఖ, ఆయిల్ఫెడ్ సౌజన్యంతో ఆయిల్పాంపై అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. విదేశాల నుంచి నూనె దిగుమతి చేసుకునేందుకు ఏటా ప్రభుత్వాలు రూ.కోట్లు వెచ్చిస్తున్నాయని, దేశీయంగా ఆయిల్పాం సాగు చేస్తే ఇక్కడే నూనె తయారు చేసుకోవచ్చని, విదేశాలపై ఆధారపడడం కొంతవరకు తగ్గుతుందన్నారు. కొద్దిపాటి పెట్టుబడితో రైతులు ఆయిల్పాం సాగు చేస్తే ప్రభుత్వం సహకరిస్తుందని, ఫీల్డ్ ఆఫీసర్లు, అధికారులు రైతులకు సలహాలు సూచనలు అందిస్తూ అండగా ఉంటారని వివరించారు. కొత్తగా ఆయిల్పాం సాగుచేసే రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆయిల్ఫెడ్ మేనేజర్ శివ నాగిగెడ్డి, శ్రీనివాస్, రాఘవ రెడ్డి, యశోద తదితరులు పాల్గొన్నారు -
మత్స్యకారుల ఉపాధికి తోడ్పాటు
ఎర్రవల్లి: మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేయడం, ఉపాధికి తోడ్పాటు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుందని జిల్లా మత్స్యశాఖ అదికారిణి షకీలాబాను అన్నారు. బుధవారం మండలంలోని కొండేరులో పలు చెరువులలో ప్రభుత్వం వంద శాతం రాయితీలో అందించిన చేప పిల్లలను మత్స్య సంఘం సభ్యులతో కలిసి ఆమె విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామంలోని పెద్ద చెరువు, లచ్చమ్మ చేరువులో మొత్తం లక్షా ఐదు వేల చేప పిల్లలను విడుదల చేశామన్నారు. చేప పిల్లలను పంపిణీ చేయడం ద్వారా వేలాది మంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. దీని కోసం చెరువు సంఘాల సభ్యులు పలు జాగ్రత్తలు పాటించి చెరువులో నీరు కలుషితం కాకుండా చూసుకోవాలన్నారు. చేప పిల్లలకు అవసరమైన ఫీడ్ను సక్రమంగా అందిచాలని, యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే అధిక దిగుబడి సాధించవచ్చునని తెలిపారు. దిగుబడి ఎక్కువగా వస్తేనే సంఘం సభ్యులకు అధిక ఆదాయం చేకూరుతుందని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి సురేష్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి రాజు, మత్య సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
చట్టానికి లోబడి దత్తత తీసుకోండి
ఇటిక్యాల: మాతృత్వం ఒక వరమని, అందుకు దత్తత మరో మార్గమని.. చట్టానికి లోబడి దత్తత తీసుకోవాలని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి రవి అన్నారు. బుధవారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శిశు సంక్షేమ శాఖ, బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లకు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. బాలల న్యాయ సంరక్షణ చట్టం – 2015 ప్రకారం చట్ట విరుద్ధంగా ఏ ప్రయోజనం కోసం పిలల్లను దత్తత ఇచ్చినా, తీసుకున్నా వారికి మూడేళ్ల కారాగార శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా తప్పదన్నారు. ప్రభుత్వమే కలెక్టర్ ద్వారా సులభంగా వేగంగా న్యాయబద్ధంగా దత్తత ఇవ్వడం జరుగుతుందన్నారు. పిల్లలను దత్తతకు తీసుకోవాల్సిన దంపతులు తమ పాన్కార్డ్, దంపతుల ఫొటో, నివాస ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, దంపతులకు దీర్ఘకాలిక, ప్రాణాంతర వ్యాధులు లేనట్లు ఫిట్నెస్ సర్టిఫికెట్తో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం లేదా శిశు గృహ, జిల్లా బాలల పరిరక్షణ విభాగ సంక్షేమ అధికారిని సంప్రదించాలన్నారు. అనంతరం దత్తతకు సంభందించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి సిబ్బంది, ఎస్విలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో 80వేల మంది మహిళలకు చీరలు పంపిణీ
గద్వాల: ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని జిల్లాలో 80వేల మంది మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. బుధవారం సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. 80వేల మంది మహిళలు ఉండగా, 86 వేల చీరలు వచ్చినట్లు తెలిపారు. చీరలను గ్రామీణ, పట్టణప్రాంతాల్లో నిర్ధేశించిన షెడ్యూల్ ప్రకారం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని గద్వాల, అలంపూరు రెండు నియోజకవర్గాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. ఏపీఎం, గ్రామకార్యదర్శులు, మహిళ సంఘాల సభ్యుల పరస్పర సహకారంతో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పంపిణీ ప్రక్రియను నిర్వహిస్తామన్నారు. పంపిణీ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలిపారు. ప్రతి లబ్ధిదారు ఫొటోతో పాటు ఆధార్కార్డు నంబర్ సేకరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులను కోటిశ్వరులు చేయాలనే లక్ష్యంతో విరివిగా వడ్డీలేని బ్యాంకురుణాలను అందించడం జరుగుతుందన్నారు. వారి ఆర్థిక అభివృద్ధి కోసం బస్సులు పెట్రోల్బంకులు, సోలార్ప్లాంట్లు కూడ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, డీపీవో నాగేంద్రం, ఏడీఆర్డీవో శ్రీనివాస్, మహిళసంఘం సభ్యులు పాల్గొన్నారు. -
వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి
గద్వాలటౌన్: ఆంగ్లేయులపై అలుపెరుగని పోరాటం చేసిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి అని.. స్వాతంత్య్ర సంగ్రామంలో ముఖ్య పాత్ర పోషించిన ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఏబీవీపీ రాష్ట్ర వసతి గృహ కన్వీనర్ ఠాగూర్ రితిసింగ్ సూచించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగిన సీ్త్ర శక్తి దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతర ఆమె విద్యార్థులనుద్ధేశించి మాట్లాడారు. సీ్త్రలు అన్నిరంగాల్లో రాణించాలని సూచించారు. మహిళల ఆర్థికాభివృద్ధితోనే దేశం అభివృద్ధి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు కరుణాకర్ మాట్లాడుతూ భారత మహిళా శక్తిని, సాధికారకాంక్షను ప్రపంచానికి చాటిన ఽధీరవనిత ఝాన్సీ అని కొనియాడారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు ఆంజనేయులు, నరేష్, రఘువంశీ, పద్మశ్రీ, సురేష్, నితిన్, సూర్యతేజ, నరేంద్ర, తేజ, మంజునాథ, ఉదయ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.7,041 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు బుధవారం 127 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.7041, కనిష్టం రూ.4009, సరాసరి రూ.6139 ధరలు లభించాయి. అలాగే, 56 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ.5939, కనిష్టం రూ.5201, సరాసరి రూ.5839 ధరలు పలికాయి. వీటితోపాటు 2716 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.2716, కనిష్టం రూ.1709, సరాసరి ధరలు రూ.2619 వచ్చాయి. 23న ఉమ్మడి జిల్లావాలీబాల్ జట్ల ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: రాజన్న సిరిసిల్లలోఈనెల 29 నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్ అంతర్జిల్లా వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా బాలబాలికల జట్ల ఎంపికలను 23వ తేదీన ఉదయం 8.30 గంటలకు జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు హనీఫ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికల్లో పాల్గొనేవారు కోచ్ పర్వేజ్పాష–బాలురు (77805 82604), జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి చెన్న వీరయ్య–బాలికలు (94403 11067) సంప్రదించాలని సూచించారు. రిజర్వాయర్ నిర్మాణానికి భూములివ్వం బల్మూర్: ప్రాణత్యాగాలకై నా వెనకాడం.. తమ భూములను రిజర్వాయర్ నిర్మాణానికి ఇచ్చేదిలేదని నిర్వాసిత రైతులు ఆందోళనకు దిగారు. మండల కేంద్రానికి సమీపంలో నిర్మంచతలపెట్టిన ఉమామహేశ్వర రిజర్వాయర్ నిర్మాణానికి ఇరిగేషన్ అధికారులు బుధవారం భూసేకరణ కార్యక్రమం చేపట్టడంతో విషయం తెలుసుకున్న బల్మూర్, అనంతవరం, అంబగిరి రైతులు నిరసన ర్యాలీ చేపట్టి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. అధికారులు తమకు ఎలాంటి నోటీసులు అందజేయకుండానే కేవలం ఫోన్ల ద్వారా కొంతమంది రైతులకు సమాచారం ఇచ్చి భూసేకరణకు పూనుకోవడం సరైందికాదని ప్రశ్నించారు. రిజర్వాయర్ నిర్మాణానికి ఈ ప్రాంతం అనువైనది కాకున్నా.. కేవలం కాట్రాక్టర్లు, పాలకుల కమీషన్ల కకక్కురర్తి కోసమే నిర్మించ తలపెట్టారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతమైన ఇక్కడ రిజర్వాయర్ నిరర్మించాలంటే పీసా చట్టం ప్రకారం అధికారులు నడుచుకోవాల్సి ఉనన్నా.. నిబంధనలు ఉల్లంగించి రైతుల భూములను లాక్కొనే ప్రయతత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఈ రిజర్వాయర్ నిర్మాణ అనుమతులను రద్దు చేయాలని, లేకుంటే తమ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. భూనిర్వాసిత పోరాట కమిటీ సభ్యులు అనంత సీతారాంరెడ్డి, తిరుపతయ్య, నాగయ్య, కృష్ణయ్య, ఇంద్రసేనారెడ్డి, గణేశ్, రైతులు పాల్గొన్నారు. -
జ్ఞానాన్ని పెంచే వేదికలు గ్రంథాలయాలు
గద్వాలటౌన్/అలంపూర్: జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు గ్రంథాలయాలు చక్కని వేదికలని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ విజయలక్ష్మి అన్నారు. ఆరో రోజైన బుధవారం గ్రంథాలయ వారోత్సవాలకు డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల సౌకర్యార్థం వాటికి సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచిందన్నారు. తెలుగు సాంప్రదాయాన్ని కాపాడేలా ముగ్గులు వేసిన ప్రతి విద్యార్థినీ వారు అభినందించారు. తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలకు ముగ్గులు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. అంతకుముందు గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొనిస్థానిక గ్రంథాలయం కార్యాలయం, సంతాన వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విద్యార్థులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేశారు. విద్యార్థినులు, మహిళలు ముగ్గుల వేసి సృజనాత్మకతను చాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, గ్రంథాలయ అధికారి రామాంజనేయులు, విద్యాశాఖ అధికారి హంపయ్య తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన విద్య అందించాలి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని డీఈఓ విజయలక్ష్మి సూచించారు. అలంపూర్ చౌరస్తాలో నిర్వహించిన సమావేశానికి అలంపూర్, ఉండవెల్లి, మానవపాడు మండలాల జెడ్పీహెచ్ఎస్, యూపీఎస్, పీఎస్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొనగా.. డీఈఓ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల ప్రగతిపై చర్చించారు. విద్యార్థుల ఆధార్ ఆప్డెట్, ఇంటర్నేట్ సేవలు, అదనపు గదులు, లైబ్రరీ గదులపై ఆరా తీశారు. ఎఫ్ఏ–1, ఎఫ్ఏ–2, ఎస్ఏ–1 మార్కుల వివరాలను ప్రభుత్వ యాప్లో ఆప్లోడ్ చేయడం పూర్తి చేయాలని సూచించారు. ఇతర సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వారితోపాటు సెక్టోరియల్ ఆఫిసర్సు హంపయ్య, శాంతిరాజ్, ఏపీఓ శ్రీనివాసులు, ఎంఈఓలు శివప్రసాద్, అశోక్ కుమార్, ఏఈ ఆజాద్, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
చరిత్ర తిరగరాసే కుట్రలు చేస్తున్న మోదీ
● నెహ్రూ కుటుంబం చేసిన త్యాగాలుఎవరూ చేయలే.. ● టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ అచ్చంపేట: దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన ఇందిరాగాంధీ కుటుంబంపై ప్రధాని నరేంద్ర మోదీ కుట్రలు చేస్తూ.. చరిత్ర తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ఆరోపించారు. బుధవారం ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అచ్చంపేట ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణతో కలిసి ఏర్పాటుచేసిన సమావేశంలో టీపీసీసీ చీఫ్ మాట్లాడారు. ప్రపంచంలో ఉక్కు మనిషి అనే పేరు కొందరికే ఉంటుందని.. వారిలో దివంగత ఇందిరాగాంధీ ఒకరు అని అన్నారు. పాకిస్థాన్పై యుద్ధంచేసి బంగ్లాదేశ్కు విముక్తి కల్పించిన ఘనత ఇందిరాగాంధీకే దక్కిందని కొనియాడారు. బీజేపీ శాఽశ్వత అధికారం కోసం ఈడీ, సీబీఐ, ఎలక్షన్ కమిషన్ను తన చెప్పు చేతల్లో పెట్టుకోవడంతో పాటు కుల, మతం పేరుతో దేశాన్ని విచ్ఛినం చేయాలని చూస్తోందన్నారు. నెహ్రూ కుటుంబం తమ ఆస్తులు, పదవులు, ప్రాణాలను సైతం త్యాగం చేశారని.. అలాంటి నాయకత్వం ఏ పార్టీలోనైనా ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే ఆలోచనలు, సూచనల మేరకు సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ పాలన కొనసాగుతోందన్నారు. రెండేళ్ల కాలంలోనే ఎంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేసి చూపిందన్నారు. గత ప్రభుత్వంలో కేవలం 50వేల ఉద్యోగాలు ఇస్తే.. అనతి కాలంలోనే 70వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం రేవంత్రెడ్డికి దక్కిందన్నారు. రానున్న మూడేళ్లలో మరో 1.30 లక్షల ఉద్యోగాలను అందించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి.రాజేందర్, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో సత్తా చాటాలి
గద్వాలటౌన్: క్రీడాకారులు నిర్మాణాత్మకమైన క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో సత్తా చాటాలని అధికారులు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి సీనియర్, జూనియర్ మహిళా, పురుషుల కబడ్డీ ఎంపిక పోటీలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన క్రీడాకారుల ఎంపిక పోటీలకు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బండల వెంకట్రాములు, జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ముఖ్య అతిథులగా హాజరై మాట్లాడారు. క్రీడల పట్టణంగా గద్వాల అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్లో రాష్ట్ర స్థాయి పోటీల నిర్వాహణకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. క్రీడాకారులు స్ఫూర్తిదాయకమైన ఆట ద్వారా ప్రతిభ చాటారన్నారు. క్రీడలు జీవితానికి గొప్ప స్ఫూర్తినిస్తాయని, అందువల్ల వాటిని తప్పని సరిగా ప్రోత్సహించాలని సూచించారు. అంతకుముందు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనే సీనియర్, జూనియర్ విభాగాలలో 20 మంది క్రీడాకారులతో జిల్లా జట్టును ఎంపిక చేశారు. శిక్షణ తరువాత తుది జట్టును ఎంపిక చేస్తామని నిర్వాహకులు తెలిపారు. వచ్చే నెల నల్లగొండ జిల్లా నాగర్జునసాగర్, మహబూబ్నగర్ జిల్లాలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నర్సింహా, కన్వీనర్ అబ్రహాం, కబడ్డీ అసోసియేషన్ నాయకులు చందు, రవి, సర్వేశ్వర్రెడ్డి, సురేష్, శివ, గితన్న, పీఈటీలు హైమావతి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. -
జోరుగా అక్రమ కట్టడాలు
గద్వాల టౌన్: జిల్లా కేంద్రంలో నివాస, వాణిజ్య అవసరాల కోసం భవన నిర్మాణాలను ఇష్టానుసారంగా నిర్మించుకుంటున్నారు. యజమానులు భవన అనుమతుల సమయంలో తీసుకునే ఫ్లాన్కు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు నుంచి ఆరోపణలు వస్తున్నాయి. మరికొందరైతే నిబంధనలకు పాతర వేస్తూ రోడ్డుపైనే నిర్మాణాలు చేపడుతుండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. నాలుగైదేళ్లుగా బహుళ అంతస్తులు, నివాస, వాణిజ్య భవన నిర్మాణాలపై వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నా అధికారులు తనిఖీలు నిర్వహించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఒకరిని చూసి మరొకరు నిబంధనలకు పాతర వేసి అనుమతులకు విరుద్ధంగా అదనపు అంతస్తులు, అక్రమ నిర్మాణాలు చకచకా కొనసాగిస్తున్నారు. నిబంధనలు గాలికి... అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు కొత్త మున్సిపల్ చట్టంలో పలు నిబంధనలు రూపొందించారు. అందులో ప్రధానంగా అన్ని ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. తేడాలు లేకుండా కచ్చితమైన ఇంటి కొలతలు ఉండాలి. కొలతల్లో తేడాలు ఉన్నా, నిబంధనలు అతిక్రమించినా 25 రెట్లు జరిమానాతో పాటు వాస్తవ పన్ను విధిస్తారు. అంతేకాక సెట్బ్యాక్ నిబంధనను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాలు చేపట్టాలి. స్థలం 200 గజాల్లోపు ఉంటే రోడ్డు వైపు 5 ఫీట్లు, మిగతా మూడు వైపులా 3.5 ఫీట్లు వెనక్కి స్లాబు వేసుకోవాలి. 100 గజాల్లోపైతే రోడ్డు వైపు 5 ఫీట్లు, మిగిలిన రెండు వైపుల 2 ఫీట్లు వదలాలి. 20 ఫీట్ల రోడ్డు ఉంటే కచ్చితంగా 5 ఫీట్లు మున్సిపాలిటీకి గిఫ్టు చేయాల్సిందే. ఇదిలా ఉంటే సెట్బ్యాక్ స్థలంలో స్లాబు, ప్రహరీ, సెప్టిక్ ట్యాంకు నిర్మించకూడదు. ఇళ్లకు పెట్టే తలుపులు, గేట్లు లోపలి వైపునకు తెరుచుకోవాలి. దీంతో పాటు ఇంటి యజమానులు తీసుకున్న అనుమతులకు భిన్నంగా పై అంతస్తులు నిర్మిస్తున్నారు. అధికారులు తనిఖీకి వచ్చేలోపు నిర్మాణాలు పూర్తవుతున్నాయి. ఈ వ్యవహరంలో సంబంధిత యంత్రాంగం నిర్లక్ష్యంతో పాటు వారిపై రాజకీయ ఒత్తిళ్లు ఉండటంతో చర్యలు తీసుకోకుండా వెనుదిరుగుతున్నారు. దీంతో మున్సిపల్ ఆదాయానికి రూ.లక్షల్లో గండి పడుతుంది. ఎక్కడెక్కడంటే.. మున్సిపల్ పరిధిలో ప్రధానంగా 2, 3, 6వ వార్డుల పరిధిలో సుమారు 40 భవన నిర్మాణాల్లో అనుమతులకు విరుద్ధంగా పై అంతుస్తుల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వీటితో పాటు ప్రధాన రహదారుల పక్కన సెట్ బ్యాక్ లేకుండా, నివాస అనుమతి తీసుకుని వాణిజ్య దుకాణాలు నిర్మిస్తున్నారు. కొన్ని నిర్మాణాలకు అనుమతులు సైతం తీసుకోలేదని తెలుస్తుంది. వీటితో పాటు శ్రీనివాసకాలనీ, భీంనగర్, పాత హౌసీంగ్బోర్డు కాలనీలో నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపడుతున్నారు. 6, 19, 20వ వార్డుల పరిధిలో ఉన్న రీక్రియేషన్, ఇండస్ట్రీయల్ జోన్ పరిధిలో సుమారు 50 వర కు అనుమతులు లేకుండా నిర్మాణాలు ఉన్నాయి. -
ఇక పంచాయితీనే..!
పాత రిజర్వేషన్లతోనే సం‘గ్రామం’ ● మంత్రివర్గం నిర్ణయంతోఆశావహుల పోరు సన్నాహాలు ● బీసీలకు పార్టీపరంగా 42% రిజర్వేషన్తో ‘హస్తం’ ముందుకు.. ● అదే బాటలోనే కారు, కమలం నడిచే అవకాశం ● ఈ లెక్కన జనరల్ స్థానాల్లో ఎక్కువ శాతం బీసీలకే చాన్స్ ● చట్టపరంగా కాకపోవడంతో చిక్కులు తప్పవని నేతల బెంబేలు అన్ని పార్టీల్లోనూ గుబులు.. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించిన పక్షంలో చిక్కులు వచ్చే అవకాశం ఉన్నట్లు అన్ని ప్రధాన పార్టీల్లో చర్చ జరుగుతోంది. చట్టపరంగా జనరల్/అన్ రిజర్వ్డ్గా కేటాయించిన స్థానంలో ఆ కేటగిరికి సంబంధించి బలమైన నాయకుడు ఉండడం.. పార్టీ పరంగా ఆ సీటును బీసీలకు ఇవ్వాల్సి వచ్చిన పక్షంలో విభేదాలు పొడచూపే అవకాశం ఉంటుంది. పెద్ద, చిన్న పంచాయతీలు అనేది లేకుండా అంతటా ఈ సమస్య ఉత్పన్నమవుతుందని అభిప్రాయపడుతున్నారు. పార్టీ పరంగా బీసీలకు కేటాయించిన జనరల్ స్థానాలకు సంబంధించి ఆ వర్గంలోనే బహుముఖ పోటీ ఉంటే కొత్త తలనొప్పులు ఎదురవుతాయని అంచనా వేస్తున్నారు. ఇలాంటి అంశాలు గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో ఆయా పార్టీల ముఖ్య నాయకుల్లో గుబులు నెలకొన్నట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందుగా సం‘గ్రామానికి’ అడుగులు పడ్డాయి. డిసెంబర్లోపు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీం కోర్టు సూచనల మేరకు రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఎన్నికలకు వెళ్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇచ్చిన హామీ మేరకు బీసీలకు కాంగ్రెస్ పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లతో సీట్లు కేటాయిస్తామని స్పష్టం చేసింది. దీంతో జనరల్/అన్ రిజర్వ్డ్ స్థానాల్లో ఎక్కువ శాతం మేర బీసీలు బరిలో నిలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చట్టపరంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. పార్టీ పరంగా అయితే పలు గ్రామాలకు సంబంధించి చిక్కులు, చికాకులు తప్పవని సీనియర్ రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. ‘హస్తం’ దారిలోనే ప్రతిపక్షాలు.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్కు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అక్టోబర్లో జీఓ 9 జారీ చేసింది. ఆ తర్వాత ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి, నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ జరగగా.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజే ప్రక్రియ నిలిచిపోయింది. ఆ సమయంలో బీసీ రిజర్వేషన్లను ఎవరూ వ్యతిరేకిస్తలేరని, తామూ సిద్ధమని.. అయితే చట్టబద్ధత అవసరమని ప్రధాన ప్రతిపక్షాల నేతలు చెప్పారు. ప్రస్తుతం జీపీ ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేయగా.. బీఆర్ఎస్, బీజేపీ సైతం అదే దారిలో నడిచే అవకాశాలు కన్పిస్తున్నాయి. గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీ వాదమే అందరి ఎజెండాగా నిలిచే అవకాశం ఉంది. ఆటంకాలు ఎదురైనా తాము ఇచ్చిన హామీ మేరకు పార్టీపరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించి సర్పంచ్ ఎన్నికలకు వెళ్తున్నామని.. చట్టబద్ధతపై కోర్టు కేసులు కొలిక్కి వచ్చాకే ప్రాదేశిక, మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో పాటు ప్రజాపాలనలో సంక్షేమ, అభివృద్ధి ఫలాలను స్థానికంగా వివరిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రణాళికతో ఆ పార్టీ ముందుకు సాగుతున్నట్లు ఆ పార్టీ నేతల మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఇదేక్రమంలో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకపోవడం.. అమలు కాని కాంగ్రెస్ ఎన్నికల హామీలు.. వివిధ పథకాల అమలులో జాప్యం, లోపాలను ఎత్తిచూపుతూ బీఆర్ఎస్, బీజేపీలు ఎన్నికల కదనరంగంలోకి దూకనున్నట్లు తెలుస్తోంది. ఎవరికి వారు తమదైన వాదంతో.. -
రైతులకు సకాలంలో నగదు చెల్లించాలి
గద్వాల న్యూటౌన్/ఎర్రవల్లి: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో నగదు చెల్లింపు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. గద్వాల మున్సిపాలిటీ పరిధిలో జమ్మిచేడు వద్ద మెప్మా ఆధ్వర్యంలో, ఎర్రవల్లి మండలంలోని తిమ్మాపురంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు రైతుల నుంచి ఎంత ధాన్యం కొనుగోలు చేశారని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం వద్ద ఆరబెట్టిన ధాన్యాన్ని చూసి సెంటర్లో తేమశాతం, గింజల పరిమాణాన్ని కొలిచే విధానాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రానికి కేటాయించిన టార్ఫాలిన్లు, గన్నీ సంచుల వివరాలపై ఆరా తీశారు. రైతుల సాగు ధ్రువీకరణకు సంబంధించి వ్యవసాయ విస్తరణ అధికారులు ఇచ్చే టోకెన్లు పరిశీలించారు. తూకం అనంతరం మిల్లులకు ధాన్యం రవాణా ప్రక్రియ గురించి తెలుసుకున్నారు. కౌలు రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ధాన్యం కొనుగోలు వివరాలను ఎప్పటికప్పుడు యాప్లో నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఐకేపీ డీపీఎం అరుణ, ఏపీఎం సలోమి, ఏఓలు ప్రతాప్కుమార్, సురేష్గౌడ్, ఏఈఓలు ప్రవళిక, నరేష్, మెప్మా అధికారులు వెంకటేశ్వర్లు, శ్రీకర్, మహలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వయోవృద్ధుల సంక్షేమానికి కృషి వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ సంతోష్ అన్నారు. దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ సాధికారత శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 19న గద్వాల ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించనున్న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవానికి సంబంధించిన వాల్పోస్టర్లను కలెక్టర్ తన చాంబర్లో సీనియర్ సిటిజన్ ఫోరం నాయకులు, అధికారులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి సునంద, సీనియర్ సిటిజన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు మో హన్రావ్, ఎన్జీఓ ప్రతినిధులు పాల్గొన్నారు. -
దేశ సమగ్రతను కాపాడుకోవాలి
గద్వాల టౌన్: దేశ సమగ్రతను కాపాడేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన ధైర్య సాహసాలు మనందరిలో ప్రతినిత్యం ఐక్యత స్ఫూర్తిని కలిగిస్తాయని, ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి కృషిచే యాలని అడిషినల్ కలెక్టర్ నర్సింగరావు పిలుపునిచ్చారు. భారత మాజీ హోంశాఖ మంత్రి, ఉప ప్రధాని వల్లభాయ్పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం కేంద్ర యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏక్ భారత్, ఆత్మ నిర్భర భారత్ నినాదంతో నెహ్రూ యువకేంద్రం సహకారంతో యూనిటీ మార్చ్ (ఐక్యత పాదయాత్ర) నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు జెండా ఊపి ఐక్యత మార్చ్ను ప్రారంభించగా.. విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక తేరుమైదానంలో జరిగిన సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఒకే దేశం, ఒకే లక్ష్యం అన్న భావనతో కలిసి ఉన్నప్పుడే పటేల్ కలలుగన్న సమైక్య భారత నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. విశ్వాసం, బలం, ఐక్యత ద్వారానే పౌరులు గొప్ప కార్యాలు సాధిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సమైక్యత ప్రతిజ్ఞను చేశారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం ఉమ్మడి జిల్లా అధికారి కోటా నాయక్, పాదయాత్ర కమిటీ కన్వీనర్ బండల వెంకట్రాములు, కోకన్వీనర్ అనిల్కుమార్, బీజేపీ నాయకులు రామంజనేయులు, రామచంద్రారెడ్డి, శ్యామ్రావు, దేవదాసు, పాండు, సాయి, మధుగౌడ్, మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
ధాన్యం దళారులకు విక్రయించి నష్టపోవద్దు
అలంపూర్: పంట సాగు చేసిన రైతులు ధాన్యాన్ని దళారులకు విక్రయించి నష్టపోవద్దని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. అలంపూర్ పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ సహకారంతో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. మొక్కజొన్న క్వింటాల్కు రూ. 2,400 మద్దతు ధర ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే ధాన్యం నాణ్యతగా ఉండే విధంగా చూసుకోవాలని రైతులకు సూచించారు. కేంద్రానికి తీసుకొచ్చే ధాన్యంలో తెగులు సోకిన, రంగు మారిన గింజలను సాధ్యమైనంత వరకు తొలగించి అధికారులకు సహకరించాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా సమస్యలు తమ దృష్టికి తీసుకరావాలన్నారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ డీఎం చంద్రమౌళి, మార్కెట్ యార్డు చైర్మన్ దొడ్డెన్న, పీఏసీఎస్ చైర్మన్ మోహన్రెడ్డి, వైస్ చైర్మన్ మద్దిలేటి, ఎత్తిపోతల పథకం కమిటీ చైర్మన్ విజయ్కుమార్ రెడ్డి, పీఏసీఎస్ ఇన్చార్జి సీఈఓ శ్రీనివాసులు, పీఏసీఎస్ డైరెక్టర్లు, బీఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
యువత మత్తుకు దూరంగా ఉండాలి
గద్వాల క్రైం: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, భవిష్యత్పై దృష్టి సారించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో నషా ముక్త్ భారత్ అభియాన్పై విద్యార్థులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో యువత గంటల తరబడి గడపడం వల్ల చెడు అలవాట్లకు దారి తీస్తుందన్నారు. మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు యువత బానిసలైతే జీవితం నాశనం అవుతుందని హెచ్చరించారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో ప్రతి పౌరుడు నార్కోటిక్ డ్రగ్ వారియర్గా పని చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా పోలీసుశాఖ మత్తు పదార్ధాల కట్టడికి విశేషంగా కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య, సీఐలు శ్రీను, రవిబాబు, టాటాబాబు, ఎస్ఐలు, సిబ్బంది తదితరులు ఉన్నారు. వాహనాదారులు జాగ్రత్త చలికాలంలో రోడ్లపై పొగ మంచు కమ్ముకోవడంతో వాహనాదారులు స్వీయ జాగ్రత్తలు పాటించి డ్రైవింగ్ చేయాలని ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించే పరిస్థితి ఉండదన్నారు. ఈ క్రమంలో ప్రతి వాహనదారుడు హెడ్ లైట్లు ఉపయోగించాలన్నారు. వీలైనంత వరకు తెల్లవారుజామున, రాత్రి సమయాల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిందని సూచించారు. -
సామాజికంగా ఎదగాలి
ఎర్రవల్లి: నాయీ బ్రాహ్మణులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు కిన్నెర శేఖర్, కోట్ల రామకృష్ణ, దొడ్ల రాములు, అగ్రహారం జయన్న అన్నారు. సోమవారం మండలంలోని బీచుపల్లి పుణ్యక్షేత్రంలో ఆ సంఘం నాయకులు నందకుమార్ ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో నాయీ బ్రాహ్మణులు హాజరై వైద్యనారాయణ ధన్వంతరి స్వామి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఆరాధించారు. అనంతరం వారు మాట్లాడుతూ పవిత్రమైన కార్తీక మాసంలో నాయి బ్రాహ్మణులంతా ఒకే చోట కలవడం ఎంతో సంతోషకరమన్నారు. ఇందులో అందరి సామాజిక అంశాలతో పాటు పరిచయాలను తెలుసుకొని పలు రంగాల్లో వారు అభివృద్ధి చెందేలా సంఘం నుండి ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్లు, అశ్విని రమేష్, నాగేష్, అశోక్, శ్రీనివాస్, అశ్విని భాస్కర్, గుమ్మడం వెంకటేశ్వర్లు, బాలస్వామి, తదితరులు ఉన్నారు. -
ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి
గద్వాల: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యతినిస్తూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఫిర్యాదుల దినోత్సవం సందర్భంగా ఐడీవోసీ కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పలు సమస్యలపై కలెక్టర్కు 106 ఫిర్యాదులు అందించారు. అనంతరం వీటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. పరిష్కారం కాని యెడల అందుకు సంబంధించి కారణాలు పేర్కొంటూ ఫిర్యాదుదారునికి అక్నాలెడ్జ్మెంట్ పంపాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
ఎస్పీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలి
గద్వాల: మాదాసి, మాదారి కురువలకు ఎస్సీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని మాదాసి, మాదారి కురువ ఎస్సీ సంక్షేమ సంఘం నాయకుడు వెంకటేష్ తదితరులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం ఆ సంఘం నాయకులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని అర్హులైన మాదాసి కురువ, మదారి కురువలకు ఎస్సీ కులధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలన్నారు. అదేవిధంగా జాతీయ ఎస్సీ కమీషన్ సిఫారసులు అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 19ప్రకారం, హైకోర్టు ఆదేశాలను ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బాలరాజు, రాములు, వెంకటేశ్వర్లు, రవిప్రకాష్, బాలకృష్ణ, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు. పత్తి మిల్లులో షార్ట్ సర్క్యూట్ ఉండవెల్లి: మండలంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న పత్తి మిల్లులో సోమవారం షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. దీంతో మిల్లులో సిబ్బంది భయందోళనతో పరుగులు తీశారు. అక్కడే ఉన్న రైతులు, సిబ్బంది.. నీరు, ఇసుకతో మంటలను ఆర్పివేయడంతో భారీ ముప్పు తప్పింది. సమాచారం అందుకున్న ఫైరింజన్ సిబ్బంది అక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేశారు. ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ శేఖర్ పరిశీలించి ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీశారు. -
మద్యం మత్తులో వాహనాలు నడిపితే చర్యలు
ఎర్రవల్లి: మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం మండలంలోని బీచుపల్లి పదో బెటాలియన్లో పోలీస్ పెట్రోల్ బంక్లో ఇటిక్యాల ఎస్ఐ రవినాయక్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించగా ఎస్పీ హాజరై మాట్లాడారు. ప్రయాణికుల భద్రత కోసమే జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్ బంకులలో ప్రత్యేక డ్రైవ్ను చేపట్టి ప్రయాణికులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. ఇటీవలె జాతీయ రహదారిపై జరిగిన మేజర్ రోడ్డు ప్రమాదాలు అన్నీ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం ద్వారానే జరిగాయన్నారు. దీనివల్ల ఎంతో మంది ప్రాణాలను కోల్పోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. పోలీస్ వారికి సహకరించి ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని సూచించారు. వాహనాలను ఎక్కడబడితే అక్కడ నిలపొద్దు వాహనదారులు జాతీయ రహదారిపై ఎక్కడబడితే అక్కడ వాహణాలను నిలపవద్దని సిఐ రవిబాబు అన్నారు. ముఖ్యంగా మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహణాలను నడిపి ప్రమాదాలకు కారణం అవ్వరాదన్నారు. హైవేపైకి వచ్చే వారు, హైవే నుండి వెళ్లే వారు, రోడ్డును దాటే వారు తప్పకుండా ఇండికేషన్ ఇవ్వాలన్నారు. హైవేపై లాంగ్ జర్నీ వెళ్లే వారు నిద్ర వచ్చినా లేదా అలిసిపోయినా తప్పకుండా పెట్రోల్ బంకులలో మాత్రమే వాహనాన్ని నిలుపుకోవాలన్నారు. రోడ్డుపై ఎలాంటి ఇండికేషన్ లేకుండా వాహనాలను ఇంజన్తో సహా నిలపడం వల్ల చాలా ప్రమాదాలు జరగడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించి తమ ప్రాణాలతో పాటు ఎదుటి వారి ప్రాణాలను కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు ఉన్నారు. ఇసుక తరలింపునకు అనుమతి ఇవ్వాలని నిరసన రాజోళి: నదిలో ఇసుక తీసుకునేందుకు ఎడ్ల బండ్లకు అనుమతి ఇవ్వాలని వాటి యజమానులు ఆదివారం రోడ్డెక్కారు. రాజోళిలోని గాంధీ చౌక్లో బండ్లను రోడ్లపై నిలిపి నిరసన తెలిపారు. ట్రాక్టర్లు రాత్రి సమయాల్లో ఇసుకను తరలిస్తున్నాయని అయినా వారిపై చర్యలు తీసుకునేవారు లేరని, కాని ఎడ్ల బండ్లపై ఇసుక తీసుకుంటుంటే అడ్డుకుంటున్నారని వాటి యజమానులు అన్నారు. తమకు జీవనోపాధిగా ముందుకు సాగుతుంటే.. ఇలా అడ్డుకోవడం తగదని అన్నారు. అయితే విషయం తెలుసుకున్న ఎస్ఐ గోకారి అక్కడకు చేరుకుని ఎడ్ల బండ్లతో ఇందిరమ్మ ఇళ్లకు, లేదా ఇళ్లు కట్టుకునే వారికి ఇసుకను అందిస్తే సమస్య లేదని, నదిలోకి బండ్లతో వెళ్లి, ఆ ఇసుకను ట్రాక్టర్ల వారికి చేర్చడంతో, వారు అధిక ధరలకు అక్రమంగా విక్రయిస్తున్నారని తెలిపారు. వాస్తవంగా ఇళ్లు కట్టుకునే వారికి ఇసుక ఇస్తే ఎవరూ అడ్డుకోరని, అక్రమంగా రవాణా చేస్తుంటే సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. అలాంటి దందాలకు అవకాశమివ్వమని తేల్చి చెప్పారు. ఇళ్లు కట్టుకునే వారి వివరాలు, అనుమతి పత్రాలు తీసుకుని నదిలో ఇసుకను తీసుకోవచ్చని, అక్రమంగా విక్రయించే వారిపై మాత్రం చర్యలు తప్పవని అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం వనపర్తి రూరల్: విద్యార్థులు క్రీడారంగంలో తమకంటూ ప్రత్యేకతను చాటుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జిల్లెల చిన్నారెడ్డి కోరారు. ఆదివారం మండలంలోని చిట్యాల ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాల క్రీడా మైదానంలో ఉమ్మడి జిల్లా అండర్–17 క్రీడల ప్రారంభోత్సవానికి ఆయనతో పాటు ఆర్సీఓ శ్రీనివాస్గౌడ్, డీసీఓ శ్రీవేణి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ముందుగా చిన్నారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఒలింపిక్ జ్యోతిని వెలిగించి క్రీడాకారుల వందన సమర్పణను స్వీకరించారు. అనంతరం కబడ్డీ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. దేశ నిర్మాణంలో క్రీడాకారులు తమవంతు పాత్ర పోషించాలన్నారు. ప్రతిభగల క్రీడాకారులను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. క్రీడలు శారీరక దారుఢ్యం, మానసిక ప్రశాంతతను పెంపొందిస్తాయని తెలిపారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పిస్తామని చెప్పారు. ప్రిన్సిపాల్ ప్రశాంతి మాట్లాడుతూ.. క్రీడా పోటీల్లో ఉమ్మడి జిల్లాలోని 14 ఎంజేపీ బీసీ బాలుర గురుకులాల నుంచి 450 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. క్రీడాకారులకు పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించామని, క్రీడల్లో చరుగ్గా పాల్గొని జయాపజయాలకు భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
ఎత్తిపోతలు ఉత్తిపోతలేనా
టీబీ డ్యాం వద్ద పూర్తి స్థాయిలో ఏర్పాటుచేయని నూతన క్రస్టు గేట్లు ● తెలంగాణ వాటా 9 టీఎంసీలు వచ్చే పరిస్థితి లేదని రైతుల ఆందోళన ● సుంకేసుల బ్యారేజీ దిగువన వున్న ఎత్తిపోతలకు యాసంగిలో నీటి విడుదల ప్రశ్నార్థకం ● టీబీ డ్యాంలో గేట్ల నిర్మాణానికి 40 టీఎంసీలు దిగువకు విడుదల చేస్తామని అధికారుల స్పష్టం ● ఆ నీటిని సుంకేసులలో నిల్వచేసి ఎత్తిపోతలకు అందించాలని కోరుతున్న రైతులు నదిలో నీరుండేలా చూడాలి తుంగభద్ర నది నుంచి లిఫ్ట్లకు నీటిని మోటార్ల ద్వారా తీసుకుంటాం. ప్రస్తుతం మొక్కజొన్న విత్తనాలు వేయడానికి పొలాలు తడుపుతున్నాం. విత్తనాలు వేశాక నదిలో నీరు ఇంకిపోతే మా పరిస్థితి ఏమి. పంటలు ఎండిపోయి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. అటు వానాకాలం పంటలు నష్టపోయాం. ఇటు యాసంగి పంటలు ఎండిపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యం. తెలంగాణ వాటా నీటిని విడతల వారీగా విడుదల చేసి రైతులను ఆదుకోవాలి. – లక్ష్మినారాయణ, బుడమర్సు లిఫ్ట్ చైర్మన్, బుడమర్సు నీరు విడుదల చేయకపోతే ఎలా ఏటా తెలంగాణ వాటా కింద తుంగభద్ర నదికి నీటిని విడుదల చేస్తారు. ఈ ఏడాది ఎన్ని టీఎంసీలు విడుదల చేస్తారు, ఏ నెల వరకు విడుదల చేస్తారనే విషయం ఇప్పటివరకు అధికారులు ప్రకటించలేదు. టీబీ డ్యాం వద్ద కొత్త గేట్లు అమర్చుతున్నారని చెబుతున్నారు. గేట్ల కొరకు డ్యాంలో నీరంతా దిగువకు విడుదల చేస్తారని సమాచారం. ఒకే సారి డ్యాంలో నీటిని విడుదల చేస్తే మేం సాగుచేసే మొక్కజొన్న, వరి పంటలు ఎండిపోతాయి. రైతుల గురించి ఆలోచించి నీటిని విడతల వారీగా విడదల చేస్తే మంచిది. ఈమేరకు నిర్ణయం తీసుకోవాలి. – ఉప్పరి రాముడు, ఆయకట్టు రైతు, బుడమర్సు టీబీ బోర్డు సమావేశం తర్వాత వెల్లడిస్తాం ఈ నెల 23న టీబీ బోర్డు సమావేశం నిర్వహించనున్నాం. ఈ సమావేశంలో కర్ణాటక, ఆంధ్రప్రదేష్, తెలంగాణ నీటిపారుదలశాఖ అధికారులం అందరం కలిసి చర్చిస్తాం. అందరి ఆలోచన మేరకు నీటి విడుదలపై ప్రకటన చేస్తాం. – శ్రీనివాసులు, డీఈఈ, నీటిపారుదలశాఖ, జోగుళాంబ గద్వాల శాంతినగర్: తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లోని పొలాలకు సాగునీరందించి ఆయకట్టు రైతులను ఆదుకోవాలనే సంకల్పంతో రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన ఎత్తిపోతల పథకాలకు ఈ ఏడాది యాసంగిలో సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో అలంపూర్ నియోకవర్గంలోని వడ్డేపల్లి, రాజోళి, మానవపాడు మండలాల్లో నిర్మించిన ఎత్తిపోతల పథకాలకు తుంగభద్ర నది నుంచి నీరందే పరిస్థితి అగుపించడంలేదు. అలంపూర్ నియోజకవర్గంలో తుంగభద్ర నీటిపై ఆధారపడి మూడు లిఫ్ట్లు బుడమర్సు–1, బుడమర్సు–2, మద్దూర్ లిఫ్ట్లు వున్నాయి. ఆయా లిఫ్టుల క్రింద వందల ఎకరాల్లో ఆయకట్టు సాగవుతుంది. ఈ ఏడాది మొక్కజొన్న పంట కొందరు సాగుచేయగా మరికొందరు పొలాలు చదును చేసే పనిలో నిమగ్నమయ్యారు. బుడమర్సు–1 లిఫ్ట్ కింద 700 ఎకరాలు, బుడమర్సు–2, 500 ఎకరాలు, తూర్పుగార్లపాడు 300 ఎకరాలు, రాజోళి లిఫ్ట్ కింద 2వేల ఎకరాలు, పంచలింగాల లిఫ్ట్ కింద తెలంగాణ రైతులకు సంబంధించి 500 ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. అంతేగాక తుంగభద్ర నది నుంచి పైప్లైన్ల ద్వారా మద్దూరు శివారులో 400 ఎకరాలు, కొర్విపాడు, గోకుల పాడు శివారులో 500 ఎకరాలు, పుల్లూరు, కలుగోట్ల శివారులో మరో 600 ఎకరాలు యాసంగిలో సాగుచేస్తారు. ఈ ఏడాది వానాకాలంలో అతివృష్టి వల్ల పత్తి, కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు నష్టపోయారు. తుంగభద్ర నదిలో నిల్వ వుండే నీటితో యాసంగిలో మొక్కజొన్న పంట సాగుచేసి నష్టాలు పూడ్చుకుందామని రైతులు సమాయత్తమైన తరుణంలో టీబీ డ్యాం నుంచి నీరు రావనే సంకేతాలు అందడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తుంగభద్ర నదిలో నీరుచేరకపోతే ఇప్పటికే సాగుచేసిన మొక్కజొన్న పంటలు సుమారు 2,500 ఎకరాలు ఎండిపోయే పరిస్థితి పొంచి ఉంది. విడతల వారీగా నీరు విడుదల చేస్తేనే.. టీబీ డ్యాం వద్ద కొత్తగా క్రస్టు గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. డ్యాంలో నిల్వ వున్న 80 టీఎంసీల నీటిలో మరో 40 టీఎంసీల నీరు దిగువకు వదిలితేనే గేట్లు అమర్చడానికి వీలవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. డ్యాం నుంచి విడుదల చేసే నీరు విడతల వారీగా వదలాలని రైతులు కోరుతున్నారు. అయితే, టీబీ డ్యాం నుంచి ఒకేసారి 40 టీఎంసీలు విడుదల చేస్తే సుంకేసుల బ్యారేజీ నుంచి ఏకంగా దిగువన వున్న శ్రీశైలం జలశయానికి చేరుకుంటాయని, పంటలకు ఉపయోగపడవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుంగభద్ర నదిలో ప్రస్తుతం పంటలు సాగుచేయడానికి అవసరమైనన్ని నీళ్లు వున్నాయని, టీబీ డ్యాం నుంచి తెలంగాణ వాటాగా విడుదలయ్యే నీటిని విడతల వారీగా విడుదల చేయకపోతే నదిలో నీరులేక పంటలు ఎండిపోతాయని, వానాకాలంలో నష్టపోయామని, యాసంగిలో అదే పరిస్థితి ఏర్పడితే అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
క్షయ నిర్మూలనే లక్ష్యం
● హ్యాండ్ ఎక్స్రే యంత్రాలతోవైద్య పరీక్షలు ● అనుమానిత వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు ఆశా వర్కర్ల ఇంటింటి సర్వే ● న్యూట్రీషన్ కిట్ల అందజేత గద్వాల క్రైం: క్షయ నివారణకు ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. ఈ మహమ్మారి వ్యాధి బారిన పడిన వారి నుంచి మరొకరికి సోకకుండా అనుమానితులను గుర్తించేందుకు ఆశావర్కర్ల ద్వారా ఇంటింటి సర్వేను ఇటీవల జిల్లాలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో ప్రారంభించింది. 2025 చివరి నాటికి దేశంలో వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా కసరత్తు చేపట్టింది. క్షయ.. అంటువ్యాధి కావడంతో ఒకరి నుంచి మరొకరికి సోకకుండా కట్టడి చేసేలా వైద్యాధికారులు ప్రత్యేక చొరువ తీసుకున్నారు. గడచిన మూడు సంవత్సరాలలో వ్యాధి గ్రస్తులను గుర్తించారు. వారికి అవసరమైయ్యే మందులను ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుంది. జిల్లాలో టీబీ ముక్త్ గ్రామ పంచాయతీలు ఖమ్మంపాడు, చమన్కాన్దొడ్డి, పల్లెపాడు, ఇటిక్యాలపాడు, కొదండాపురంలో పరీక్షలు చేయగా ఎలాంటి క్షయ వ్యాధిగ్రస్తులు లేరు. హ్యాండ్ ఎక్స్రే, అత్యధునిక సీబీన్యాట్ మిషన్ ద్వారా పరీక్షలు చేస్తున్నారు. రెండు గంటల్లో రోగులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం ద్వారా వ్యాధి బయట పడుతుంది. క్షయ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఆరోగ్యశాఖ అనుమానిత వ్యక్తులను గుర్తించి వారికి పరీక్షలు చేసేందుకు అడుగులు వేసినా.. వైద్య పరీక్షలు చేసుకునేందుకు చాలామంది ముందుకు రావడంలేదు. దీంతో వారి నుంచి కుటుంబ సభ్యులు, వారితో సఖ్యతగా ఉన్నవారికి వ్యాధి సంక్రమిస్తుంది. మరో వైపు వ్యాధిని మొదటి దశలో గుర్తిస్తే నివారించేందుకు ఎంతో దోహదం పడుతుంది. నిర్లక్ష్యం చేస్తే మృతి చెందే అవకాశం లేకపోలేదు. సంవత్సరంలో ఈ వ్యాధి బారిన పడి 36 మందికిపైగా మృతిచెందినట్లు ఆరోగ్యశాఖ గుర్తించింది. మొదటి దశలో వ్యాధి గుర్తించి మందులు సకాలంలో వాడితే ఆరు నెలల్లోనే వ్యాధి తగ్గుముఖం పడుతుంది. వ్యాధి రెండు రకాల వ్యాధిగా ఉండగా.. ఊపిరితిత్తులకు వచ్చిన వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. శరీర భాగాలకు వచ్చిన క్షయ వ్యాధి వ్యాప్తి చెందదు. వెంట్రుకలు, గోళ్లు మినహా అన్ని భాగాలకు క్షయ వ్యాధి వ్యాపిస్తోంది. నిక్షయ్ మిత్ర ద్వారా తోడ్పాటు క్షయ వ్యాధి గ్రస్తులకు నిక్షయ్ మిత్ర ద్వారా వారికి ప్రతి నెల నూట్రీషన్ కిట్లు అందజేస్తున్నారు. దాతలు, స్వచ్ఛంద సంస్థల నుంచి చేయూత కల్పిస్తున్నారు. వారి కోసం ప్రజాప్రతినిధుల నుంచి ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది నుంచే ఇప్పటి వరకు 200 మందికి న్యూట్రీషన్ కిట్లను అందజేశారు. వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం మందుల కొనుగోలు తదితర ఖర్చుల నిమిత్తం రూ.1,000 అందజేస్తుంది. గతేడాది నుంచి నిధులు లేమి కారణంతో రూ.1,000 చెల్లించడం లేదు. దీంతో వ్యాధిగ్రస్తులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటింటి సర్వే చేస్తున్న ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది (ఫైల్) చైతన్యం తీసుకువస్తున్నాం.. క్షయ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టీబీ ముక్త్ భారత్ కార్యక్రమం ద్వారా వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే ఆశా వర్కర్ల ద్వారా చేపట్టాం. క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమాల ద్వారా చైతన్యం తీసుకువస్తున్నాం. వ్యాధి వ్యాప్తి చెందకుండా, మరణాల రేటు తగ్గించేందుకు చర్యలు తీసుకున్నాం. హైరిస్క్ ఉన్న వారందరికీ పరీక్షలు చేయిస్తున్నాం. రోగులకు ఉచితంగా మందులు, రూ. 1,000 నగదు అందిస్తున్నాం. క్షయ.. అంటువ్యాధి కావడంతో కుటుంబ సభ్యులు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి. – కిరణ్మయి, జిల్లా ఇంచార్జ్ వైద్యాధికారి ఇంటింటి సర్వే క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ప్రభుత్వం ఆశా వర్కర్ల ద్వారా జిల్లా వ్యాప్తంగా ఇంటింటి సర్వే చేపట్టింది. అన్ని ప్రాథమిక ఆరోగ్య, బస్తీ దవాఖాన, జిల్లా ఆసుపత్రి, సబ్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రి ప్రాంతాల్లో ఆశా వర్కర్లు హైరిస్కు వ్యాధి గ్రస్తులైన 60 ఏళ్లు పైబడిన వారికి, డయాబెటిస్, హెచ్ఐవీ, పోషణకాహార లోపం, గతంలో క్షయ వ్యాధి వచ్చిన వారికి, క్షయ వ్యాధి గ్రస్తుడి కుటుంబ సభ్యులకు స్క్రీనింగ్ చేస్తున్నారు. దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, చాతినొప్పి, రక్తం పడటం, ఎడతెరిపి లేకుండా దగ్గు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి వ్యాధి గ్రస్తులను గుర్తించడం, వారికి ఆరోగ్య అంశాలపై వివరిస్తున్నారు. నివారణ దిశగా.. -
సహజ సిద్ధంగా..
ఇవీ మిషన్ విశేషాలు.. ●రైతులు ముందుకు రావాలి.. ఆహార అవసరాల డిమాండ్ పెరగడంతో అధిక దిగుబడులు పొందేందుకు వ్యవసాయ సేద్యంలో ఉపయోగిస్తున్న ప్రమాదకర ఎరువులు, పురుగు మందులు, రకరకాల సాగు విధానాలు పర్యావరణంతోపాటు మానవ ఆరోగ్యాలకు హాని కలిగిస్తున్నాయి. వ్యవసాయాన్ని సహజ పద్ధతులతో చేయడం వల్ల ఆరోగ్యకర దిగుబడులు లభించడమే కాక పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. దీనిపై రైతులకు అవగాహన లేకపోవడంతో ముందుకు రావడం లేదు. ఈ పథకం దేశం మొత్తంలో యుద్ధప్రాతిపదికన అమలు చేయాల్సిన అవసరం ఉంది. అపోహలు వీడి రైతులు ముందుకు రావాలి. – వార్ల మల్లేశం, సేవ్ నేచర్ ప్రతినిధి, కోస్గి కార్యాచరణ సిద్ధం.. ప్రకృతిలో దొరికే వనరులను వినియోగించడంతోపాటు రసాయనాలు, పురుగు మందుల వాడకం తగ్గించి సహజ పద్ధతిలో వ్యవసాయం చేసేలా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేస్తున్నాం. ప్రస్తుతం రైతుల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే ఎంపిక చేసిన రైతులకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించనున్నాం. – వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, మహబూబ్నగర్ జిల్లా క్లస్టర్లు రైతులు మహబూబ్నగర్ 20 2,500 నాగర్కర్నూల్ 15 1,875 నారాయణపేట 10 1,250 జోగుళాంబ గద్వాల 20 2,500 వనపర్తి 10 1,250 మహబూబ్నగర్ (వ్యవసాయం): అధిక దిగుబడుల కోసం విచ్చలవిడిగా వాడుతున్న రసాయనాలు అటు పర్యావరణానికి.. ఇటు ప్రజల ఆరోగ్యాలకు పెనుముప్పుగా మారుతున్నాయి. ఈ క్రమంలో సంప్రదాయ పద్ధతులతో కూడిన ప్రకృతి వ్యవసాయానికి రైతులను సమాయత్తం చేసేలా కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ అండ్ నేచురల్ ఫార్మింగ్ పథకానికి పచ్చజెండా ఊపింది. సేంద్రియ పద్ధతులతో విభిన్న పంటలు పండించడానికి రైతులకు కావాల్సిన ప్రోత్సాహకాలు అందించనుంది. ఆరోగ్యకర దిగుబడులతోపాటు పర్యావరణ హితంగా పంటలు పండిస్తూ.. భూమి, సహజ వనరులను కాపాడుతూ.. రైతులు తక్కువ ఖర్చులతో కూడిన సుస్థిర వ్యవసాయ విధానం వైపు అడుగులు వేసేందుకు ఈ పథకం తోడ్పడనుంది. సంప్రదాయ వ్యవసాయాన్ని సహజ రీతిలో ప్రకృతి వ్యవసాయంగా మార్చాలనే దృక్పథాన్ని పునరుద్ధరించేలా కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 60 శాతం వాటా, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం ఖర్చు చేయనున్నాయి. 2025– 26 సంవత్సరంలో 60 వేల ఎకరాల్లో ఈ పథకం కింద సాగు చేపట్టనున్నారు. సురక్షితమైన పోషకాహారాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సహజ సాగు పద్ధతులను ప్రోత్సహిస్తుంది. 2025– 26లో ఈ పథకం కోసం వెచ్చించే రూ.2,481 కోట్ల మూలధనంతో కేంద్ర ప్రభుత్వం రూ.1,584 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.897 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఇప్పటికే సాగులో సేంద్రియ పద్ధతులు పాటిస్తున్న రైతులు, పీఏసీఎస్లు, ఎఫ్పీఓలు, ఎస్హెచ్జీలు లాంటి వాటికి ఈ పథకంలో ప్రాధాన్యమిస్తారు. సేంద్రియ వ్యవసాయానికి అవసరమయ్యే సహజ ఉత్పత్తులను రైతులకు సులభంగా అందుబాటులో ఉంచేందుకు అవసరాన్ని బట్టి జీవాధార వనరుల కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, రైతుల పొలాల్లో 2 వేల వరకు నమూనా సహజ వ్యవసాయ క్షేత్రాలను నెలకొల్పుతారు. ఆసక్తి గల రైతులకు నిపుణులైన శిక్షకులు సహజ వ్యవసాయ పద్ధతులు, జీవ ఎరువుల తయారీ వంటి వాటిలో శిక్షణ ఇస్తారు. జిల్లాలో ఎంపిక చేసిన వ్యవసాయ క్లస్టర్లలో ఈ పథకంపై అవగాహన కల్పించేందుకు, స్థానిక రైతుల మధ్య సహకారం పెంచేందుకు ‘కృషి సఖులు’ సాగు సహాయకులను ఉపయోగించనున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ పరిధిలో ఇలా.. చేకూరే ప్రయోజనాలు ప్రకృతి వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా మూస ధోరణికి స్వస్తిపలికి.. విభిన్న పంటలకు ప్రోత్సాహం ప్రతిరైతు సేంద్రియ పద్ధతిని అవలంభించేలా చర్యలు తద్వారా సురక్షితమైన పోషకాహారం తీసుకొచ్చేందుకు కృషి ఉమ్మడి జిల్లాలో 9,375 మంది రైతుల ఎంపిక ప్రతీ మండలంలో.. సహజ వ్యవసాయ పథకం అమలులో భాగంగా ప్రతి మండలంలో ఒక క్లస్టర్ గ్రామాన్ని ఎంపిక చేశారు. గుర్తించిన గ్రామం లేదా గ్రామ సముదాయంలో 125 మంది చొప్పున జిల్లాలో 20 క్లస్టర్ల నుంచి మొత్తం 2,500 మంది ఔత్సాహిక రైతులను గుర్తించారు. వారి వ్యవసాయ కమతంలో మొదట ఒక విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతి ఆచరించేలా ప్రోత్సహిస్తారు. మొదటి సంవత్సరం రైతులు శిక్షణలో భాగంగా క్షేత్ర సందర్శన, ఇంటి పెరట్లో అవసరాలకు సరిపడా కూరగాయల సాగుతో ప్రకృతి వ్యవసాయం ప్రారంభిస్తారు. రెండు, మూడేళ్లలో ఆవుపేడ, గోమూత్రం సేకరణ, జీవామృత లాంటి బయో ఉత్పత్తుల తయారీ, మల్చింగ్, అంతర పంటల సాగు పద్ధతులు అవలంభించనున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన, నమ్మకం ఏర్పడి రైతు తన క్షేత్రంలో కొంత విస్తీర్ణంలో ఆచరణ మొదలుపెట్టాలి. 4–5 ఏళ్లలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతు తన వ్యవసాయ క్షేత్రంలో ఆచరించాలి. ఇలా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 75 క్లస్టర్లలో 9,375 రైతులను ఎంపిక చేశారు. వీరందరికి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. సేంద్రియ ఎరువులు, జీవసంబంధం పద్ధతుల వాడకం వల్ల నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి, భూసారం మెరుగుపడుతుంది. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గడం వల్ల వాతావరణంలో కర్బన ఉద్ఘారాలు తగ్గుతాయి. సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్లో ఎక్కువ డిమాండ్, ధర ఉండటం వల్ల రైతులకు ఆదాయం పెరుగుతుంది. సేంద్రియ ఉత్పత్తులు మానవ ఆరోగ్యానికి సురక్షితమైనవి. పోషక విలువలను అధికంగా కలిగి ఉంటాయి. సహజ వ్యవసాయం పర్యావరణ అనుకూలమైన, స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. స్థానిక వనరుల వినియోగం ద్వారా గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుంది. -
‘పల్లెటూరి కురాళ్ల’కు ప్రశంసలు
ప్రతిఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని అవగాహన కలిగించేందుకు అయిజ మండలంలోని కొందరు యువకులు తీసిన షార్ట్ఫిల్మ్కు రాష్ట్ర స్థాయి గుర్తింపు దక్కింది. అలంపూర్ నియోజకవర్గంలోని అయిజ మండలానికి చెందిన పులికల్, రాజాపురం, కిసాన్నగర్, బైనిపల్లి గ్రామాలకు చెందిన యువకులు కలిసి ‘పల్లెటూరి కుర్రళ్లు’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. అయితే, పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 21న నిర్వహించిన రాష్ట్రస్థాయి షార్ట్ఫిల్మ్ పోటీల్లో వీరు తీసిన షార్ట్ఫిల్మ్ రెండో బహుమతిని గెలుచుకుంది. ఈమేరకు శుక్రవారం రాత్రి హైదరాబాద్ ఎల్బీనగర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ శివధర్రెడ్డి చేతుల మీదుగా విజేతలు బహుమతిని అందుకున్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఎస్పీ శ్రీనివాసరావు వీరిని అభినందించారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది వాహనాలను పట్టుకునే క్రమంలో ‘రెకమండేషన్లు కాదు.. రోడ్డు భద్రతా నియమాలే మన ప్రాణాలు కాపాడతాయి..’ అని ప్రజలకు అర్థమయ్యేలా షార్ట్ఫిల్మ్ తీయడం ఎంతో అభినందనీయమని ఎస్పీ అన్నారు. రాష్ట్ర స్థాయిలో రెండవ బహుమతి జిల్లాకు రావడంపై ఎస్పీ హర్షం వ్యక్తం చేశారు. గద్వాల క్రైం/అయిజ: -
ప్రత్యేక లోక్ అదాలత్లో 175 కేసులు పరిష్కారం
గద్వాల క్రైం: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు శనివారం గద్వాల కోర్టు ఆవరణలో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్లో 139 కేసులు పరిష్కారమైనట్లు లోక్ అదాలత్ చైర్మన్, జిల్లా న్యాయమూర్తి ఎన్ ప్రేమలత తెలిపారు. క్రిమినల్, సివిల్, సైబర్ క్రైం, బ్యాంకు లిటిగేషన్, ప్రమాద తదితర పెండింగ్ కేసులకు సంబంధించి ఇరువర్గాల వారికి రాజీ కుదిర్చినట్లు న్యాయమూర్తి తెలిపారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు యస్ రవికుమార్, వి శ్రీనివాస్, వెంకట హైమ పూజిత, ఉదయ్నాయక్, ఏపీపీలు రెచ్చల్ సంజాన జాషువ, న్యాయవాదులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. అలాగే, అలంపూర్ కోర్టు ఆవరణలో జరిగిన ప్రత్యేక లోక్అదాలత్లో 36 కేసులు పరిష్కరించారు. జాతీయ సాహస శిక్షణ శిబిరానికి ఎంపిక గద్వాలటౌన్: ఈ నెల 18 నుంచి 27వ తేది వరకు హిమచల్ ప్రదేశ్ ధర్మశాలలోని అటల్ బిహారి వాజ్పేయి ఇనిస్టిట్యూట్లో జరిగే జాతీయ సాహస శిక్షణ శిబిరానికి ఎంఏఎల్డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థి వీరేష్నాయక్ ఎంపికయ్యారు. ఈ విద్యార్థి బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఎన్ఎస్ఎస్ యూనిట్–1 విభాగం నుంచి ఎంపికయ్యాడు. ఇదే శిక్షణ శిబిరానికి ఎన్ఎస్ఎస్ యూనిట్–2 విభాగానికి చెందిన పోగ్రాం ఆఫీసర్ భాస్కర్ సైతం ఎంపికయ్యారు. పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని పోగ్రాం ఆఫీసర్లలో భాస్కర్ ఒక్కరే ఎంపిక కావడం విశేషం. 2025–26 విద్యా సంవత్సరానికిగాను డిగ్రీ కళాశాల నుంచి పోగ్రాం ఆఫీసర్తో పాటు విద్యార్థి జాతీయ సాహస శిక్షణ శిబిరానికి ఎంపిక కావడం కళాశాలకే గర్వకారణమని ప్రిన్సిపల్ షేక్ కలందర్బాషా పేర్కొన్నారు. ఆరోగ్య భద్రత కోసమే మెడికల్ క్యాంప్ ఎర్రవల్లి: ఆరోగ్య భద్రత కోసమే ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించినట్లు బీచుపల్లి పదో బెటాలియన్ కమాండెంట్ జయరాజు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని బీచుపల్లి పదో బెటాలియన్లో హైదరాబాద్ రినోవా ఆసుపత్రి ఆద్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కమాండెంట్ హాజరై వైద్యులతో కలిసి మెగా మెడికల్ క్యాంపును ప్రారంబించారు. ఈమేరకు కార్డియాలజిస్ట్, యూరాలజిస్ట్, న్యూరాలజిస్ట్, ఆంకాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్ వంటి విభాగాలకు చెందిన ఏడుగురు వైద్యులు 250 మంది బెటాలియన్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అనంతరం కమాండెంట్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది ఆరోగ్యంతో పాటు సామాజిక సంక్షేమాన్ని ప్రోత్సహించడం కోసం ప్రత్యేక మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం ఎంతో గర్వకారణమన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు శ్రీనివాసులు, పాణి, వైద్యులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు. -
రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి
గద్వాల: రైతుల సంక్షేమ కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లిస్తూ వరి, పత్తి, మొక్కజొన్న పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని, ఈ కొనుగోలు ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్తి కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన పత్తిని నాణ్యతా ప్రమాణాలు సరిగ్గాలేవని తిరస్కరించే పరిస్థితి తలెత్తకుండా ముందస్తుగానే రైతులకు నిబంధనలపై అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలన్నారు. మొక్కజొన్న సేకరణ ప్రక్రియ మొదలుపెట్టినట్లు, వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సైతం ప్రారంభించినట్లు తెలిపారు. వీటిసేకరణలో తగు చర్యలు తీసుకోవాలని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. సమావేశంలో డీఏఓ సక్రియానాయక్, ఏడీ సంగీతలక్ష్మీ, హార్టికల్చర్ అధికారి అక్బర్బాషా, డీఎస్వో స్వామి కుమార్, మార్కెట్ఫెడ్ అధికారి చంద్రమౌళి, జగ్గునాయక్, సీసీపై ప్రతినిధి రాహుల్ తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవాదుల పాదయాత్రకు తాత్కాలిక విరామం
అలంపూర్: న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన పాదయాత్రకు తాత్కాలిక విరామం పలికినట్లు అలంపూర్ అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గవ్వల శ్రీనివాసులు తెలిపారు. శనివారం అలంపూర్ కోర్టులోని న్యాయవాదుల సమావేశ మందిరంలో బార్ అసోసియేషన్ సమావేశం నిర్వహించగా.. ఈమేరకు శ్రీనివాసులు మాట్లాడారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 9వ తేదిన అలంపూర్ టు హైదరాబాద్ అలంపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టామన్నారు. ప్రధానంగా న్యాయవాదులకు రక్షణ చట్టం అమలు చేయాలని, జూనియర్ న్యాయవాదులకు రూ.5 వేల స్టైఫండ్, హెల్త్ కార్డులు ఇవ్వాలని, సీఆర్పీసీ సెక్షన్ 41(ఏ ), బీఎన్ఎస్ సెక్షన్ 35(1) అమైన్మెంట్ చేయాలనే డిమాండ్లతో పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఈ యాత్ర భూత్పూర్ వరకు కొనసాగినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలతో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పాదయాత్ర చేపట్టిన బార్ అసోసియేషన్ సభ్యులను కలిశారని, త్వరలోనే న్యాయవాదులను సీఎం రేవంత్రెడ్డితో కలిపించి వారి డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈమేరకు పాదయాత్ర నిలిపివేయాలని కోరారని, వారి హామీ మేరకు న్యాయవాదుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందనే ఆశాభావంతో పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. ఒకవేళ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు పోరాటాలు, ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో బార్ అసోసియేషన్ సభ్యులు నరసింహ్మా, తిమ్మారెడ్డి, మధు, ఆంజనేయులు, శ్రీధర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, యాకోబు తదితరులు ఉన్నారు. -
సొంత బ్రాండ్తో విక్రయం..
నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం కార్వంగకి చెందిన రైతు దంపతులు కొసిరెడ్డి లావణ్య, రమణరెడ్డి సేంద్రియ సాగు ద్వారా ప్రత్యేకత చూపుతున్నారు. సాధారణంగా మిర్చిపంటకు వారంలో రెండు, మూడుసార్లు పిచికారీ చేయాల్సి వస్తోంది. కానీ, ఈ దంపతులు ప్రకృతి సేద్యం ద్వారా ఎలాంటి రసాయనాలు లేకుండా మిర్చి పండిస్తుండటంతో వీరి ఉత్పత్తులకు డిమాండ్ ఏర్పడింది. మిర్చిలో తెగుళ్లు, పురుగుల నివారణకు వీరముష్టి కషాయం, అగ్ని అస్త్రం, గోమూత్రం, పశువుల ఎరువులతో ఎకరాకు 20 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధిస్తున్నారు. వరిలోనూ సాధారణ రకాలు కాకుండా బాస్మతి, బ్లాక్ రైస్ వంటి రకాలు సాగుచేస్తూ నేరుగా వినియోగదారులకే అమ్ముతున్నారు. ‘లావణ్య బ్రాండ్’, ‘ప్రకృతి సేద్యం’ పేర్లతో తమ ఉత్పత్తులను హైదరాబాద్, ఇతర జిల్లాలకు ట్రాన్స్పోర్ట్ ద్వారా సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఆర్గానిక్ షాపు ఏర్పాటు చేసి తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. -
దళారులను నమ్మి మోసపోవద్దు
ఎర్రవల్లి: రైతులు ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శనివారం మండలంలోని తిమ్మాపురం, కొండేరు గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంబించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన వసతులతో పాటు టార్పాలిన్ కవర్లు, ఖాళీ సంచులు అందుబాటులో ఉండేటట్లు చూడాలన్నారు. దాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ధాన్యం విక్రయించిన రైతులకు వెంటనే నగదును వారి ఖాతాల్లో జమచేసేలా చూడాలన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నీలి శ్రీనివాసులు, నాయకులు నారాయణ నాయుడు, శ్రీధర్రెడ్డి, వెంకటేష్ యాదవ్, సోమనాద్రి, శంకర్నాయుడు, ఈరన్న, వీరన్న, ఉమాపతి నాయుడు పాల్గొన్నారు. ప్రొటోకాల్ విషయంలో స్వల్ప వివాదం.. ఇదిలాఉండగా, కొండేరులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రం వద్ద స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే విజయుడు కొనుగోలు సెంటర్ను ప్రారంభించడం కంటే ముందే కాంగ్రెస్ నాయకులు రిబ్బన్ కట్ చేసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రోటోకాల్ పాటించకుండా కొనుగోలు కేంద్రాన్ని ఎలా ప్రారంభిస్తారని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించడంతో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కడ ఉన్న ఇటిక్యాల ఎస్ఐ రవినాయక్, సిబ్బంది ఇరు పార్టీల నాయకులకు సర్దిచెప్పడంతో సమస్య సద్దుమణిగింది. -
వందేళ్ల సుదీర్ఘమైన పోరాటం సీపీఐది..
● ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు.. ● రాష్ట్ర బస్సు జాతా ప్రారంభంలో సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి గద్వాల: వందేళ్లు సుదీర్ఘమైన పోరాటాలు చేసిన ఘనత సీపీఐది అని.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి అన్నారు. సీపీఐ పార్టీ స్థాపించి వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలో పాతబ బస్టాండ్లో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర బస్సు జాతాను పల్లా వెంకటరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ బస్సు జాతాను గద్వాలలో ప్రారంభించి, కొత్తగూడెంలో ముగించనున్నామన్నారు. గద్వాల ప్రాంతం ఆది నుంచి కూడా పోరాటాల గడ్డ, వీరయోధులను కన్నగడ్డ అని కొనియాడారు. ప్రతి వ్యక్తి సీపీఐ జెండాను పట్టి నడిగడ్డ సమస్యలపై పోరాడాలన్నారు. కమ్యూనిస్టు పార్టీల పోరాటంతోనే రాష్ట్ర, కేంద్రస్థాయిలలో పాలకుల అరాచకాన్ని తిప్పికొట్టడం సాధ్యమవుతుందన్నారు. దేశంలోని సామాన్యులు, పేదప్రజలు, కార్మికులు, రైతులు, ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన ఘనత సీపీఐ పార్టీదన్నారు. దేశాన్ని బ్రిటీష్ పాలన నుంచి విముక్తి కోసం పోరాటం జరిపిందన్నారు. అదేవిధంగా నైజాంపాలన విముక్తి నుంచి పోరాడి రాచరిక పాలన నుంచి ప్రజలకు విముక్తి పొందేలా చేసిందన్నారు. నేటికి ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేసిందన్నారు. దున్నేవాడిదే భూమికావాలని భూదానం చేసిన ఘనత సీపీఐకే దక్కుతుందన్నారను. దేశ సమైక్యతను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు.. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బడా పెట్టుబడిదారులతో చేతులు కలిపి మనదేశ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేసిందన్నారు. మతం పేరిట ప్రజలను వర్గాలుగా విభజించి దేశసమైక్యతను దెబ్బతిస్తుందని విమర్శించారు. వీటన్నింటిపై సీపీఐ ప్రజాఉద్యమాలు చేపట్టి దేశసమైఖ్యతను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అదేవిధంగా పార్టీ వందేళ్ల ఉత్సవాలలో భాగంగా డిసెంబర్ 26వ తేదీన ఖమ్మం జిల్లాలో ఐదు లక్షల మందితో భారీ బహిరంసభను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలనర్సింహా, జిల్లా కార్యదర్శి ఆంజనేయలు, రంగన్న, ఆశన్న, వెంకట్రాములు, ప్రభాకర్, వెంకటస్వామి, చెన్నయ్య, రవి, నాగార్జున, పరమేష్, ప్రవీణ్, వీరేష్, భరత్, గురుస్వామి, భీమేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఊతమిస్తేనే ఊరట..!
గ్రంథాలయాల్లో మౌలిక వసతులు కరువు ● సిబ్బంది కొరత.. అసంపూర్తి భవనాలతో తప్పని తిప్పలు ● పోటీ పరీక్షలతో పెరుగుతున్న పాఠకులు ● ప్రారంభమైన గ్రంథాలయ వారోత్సవాలు గద్వాలటౌన్: సెస్సు బకాయిలు.. సిబ్బంది కొరత.. ధరిచేరని పోటీ పరీక్షల పుస్తకాలు, ఇంటర్నెట్.. అద్దె భవనాలు.. ఇలా సమస్యలకు నిలయాలుగా గ్రంథాలయాలు మారాయి. స్థానిక సంస్థలు, మున్సిపాలిటీల నుంచి గ్రంథాలయాల సెస్సు వసూలు చేస్తున్నా దాన్ని జిల్లా గ్రంథాలయ శాఖకు జమ చేయడం లేదు. గ్రంథాలయ వ్యవస్థపై ఆర్థిక భారం పెరిగి సమస్యలను పరిష్కరించలేని పరిస్థితి నెలకొంది. నవంబరు 14 నుంచి 20వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించనున్నారు. అడుగడుగునా.. నిరాదరణ జిల్లా కేంద్రమైన గద్వాల మినహా మిగిలిన శాఖ గ్రంథాలయాలకు వచ్చిన పుస్తకాలు, చదివే పాఠకుల సంఖ్య రోజురోజుకు తగ్గుతుంది. మొదట్లో గ్రంథాలయానికి వచ్చిన పుస్తకాలు తీసుకెళ్లే పాఠకులు నెలకు వందల సంఖ్యలో ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నారు. ఆ సంఖ్య నేడు పూర్తిగా పడిపోయింది. ప్రధానంగా నిరుద్యోగులకు అవసరమైన పోటీ పుస్తకాలు, కంటెంట్ పుస్తకాలు, కెరీర్గైడెన్స్, రెఫరెన్స్ పుస్తకాలతో పాటు బ్యాంకింగ్, రైల్వే, పబ్లిక్ సర్వీస్ కమీషన్ పుస్తకాలు శాఖ గ్రంథాలయాలలో లేకపోవడంతో అవి నిరాదరణకు గురవుతున్నాయి. రెండేళ్ల క్రితం గద్వాలలో రూ.1.65 కోట్ల వ్యయంతో చేపట్టిన నూతన జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణ పనులు నిధుల కొరతతో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. వేధిస్తున్న సిబ్బంది కొరత జిల్లాలో జిల్లా గ్రంథాలయంతో పాటు 9 శాఖ గ్రంథాలయాలు, నాలుగు గ్రామీణ గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిలో అవసరమైన స్థాయిలో అధికారులు సిబ్బంది పనిచేయడం లేదు. కేవలం గద్వాల, అలంపూర్ శాఖా గ్రంథాలయాల్లో మాత్రమే రెగ్యులర్ లైబ్రేరియన్లు పనిచేస్తున్నారు. మిగిలిన చోట్ల ఔట్సోర్సింగ్, పార్ట్టైం సిబ్బంది ద్వారా నడుతుపున్నారు. లైబ్రేరియన్లు, రికార్డు అసిస్టెంట్లు, క్రిందిస్థాయి సిబ్బంది నియామకాలు జరగకపోవడం వల్ల వాటిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణ పనులు నిలిచిపోవడం.. స్థానిక సంస్థల నుంచి వచ్చే సెస్సు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. నిధు లు మంజూరైన వెంటనే అభివృద్ధి పనులు చేపడతాం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఉపయోగపడే అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచాం. కొంతమంది సూచనల మేరకు దాతల సహకారంతో మరికొన్ని పోటీ పరీక్షల పుస్తకాలు తెప్పించాం. మహిళలు చదువుకోవడానికి గ్రంథాలయంలో ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేయడం జరిగింది. – నీలి శ్రీనివాసులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జిల్లాలో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే యువతతో పాటు పాఠశాల స్థాయి విద్యార్థులు వేల సంఖ్యలో ఉంటారు. ఇలాంటివారికి అవసరమైన సాంకేతికతను, కొత్త పంథాను గ్రంథాలయాల్లో అందించే దిశగా పాలకులు, అధికార యంత్రాంగం ప్రత్యేక చొరవ చూపించాల్సిన అవసరముంది. ముఖ్యంగా నిర్వహణ నిధులతో పాటు స్థానిక సంస్థల నుంచి గ్రంథాలయాలకు రావాల్సిన సెస్సు విషయంలోనూ ప్రత్యేక దృష్టి సారించాలి. వాటి నిధులతో సకల వసతుల్ని సమకూర్చాలి. కమిటీ పర్యవేక్షణలో జిల్లాలో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు అవసరమైన పుస్తకాల్ని కొనుగోలు చేయాలి. వారోత్సవాల నిర్వహణలో వీటి ప్రాధాన్యతపై విస్తృత ప్రచారంతో పాటు వీటి ప్రగతి దిశగా కార్యాచరణ రూపొందించి ఆచరణలో చూపించాలి. -
ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి సయ్యద్ అక్బర్పాషా ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని జెడ్పీహెచ్ఎస్, ఎయిడెడ్, మున్సిపల్, ప్రభుత్వ పాఠశాలలో చదివే 9,10వ తరగతి విద్యార్థులు 2025–26 విద్యాసంవత్సరానికి గాను రూ.4వేల చొప్పున ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలు పొందేందుకు డిసెంబర్ 15వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు తమ ఆధార్కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రం, గ్రామాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులకు రూ.1.50 లక్షలు, పట్టణాల్లోని విద్యార్థులు రూ.2లక్షల వరకు వార్షికాదాయం కలిగి ఉండాలని తెలిపారు. దరఖాస్తులను http:tela nganaepass.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని, హార్డ్కాపీలు, ఇతర ధ్రువీకరణ పత్రాలను జతపర్చి గద్వాల ఐడీవోసీలోని కార్యాలయంలో అందజేయాలని సూచించారు. బాల్యాన్ని ఆనందంగా గడపాలి గద్వాల టౌన్/గట్టు/ధరూరు: బాల్యాన్ని ఆనందంగా గడుపుతూ చక్కగా పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని డీఈఓ విజయలక్ష్మీ తెలిపారు. బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం గట్టు మండలం ఆలూరు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని, దాన్ని సాధించే దిశగా క్రమ శిక్షణతో అడుగులు ముందుకు వేయాలని కోరారు. నేటి బాలలే రేపటి పౌరులను, ఉత్తమ పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దే బాద్యత ఉపాధ్యాయులపైనే ఉందన్నారు. విద్యార్థులు యోగాతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. సాయం అందించే గుణం కలిగి ఉండాలి మనమెంత ఎదిగినా.. ఎంత దూరంగా ఉన్నా.. సాయమందించే మనస్తత్వాన్ని కలిగి ఉండాలని డీఈఓ విజయలక్ష్మీ అన్నారు. ధరూరులోని సీపీఎస్ పాఠశాలలో కళావేదికను ఆమె ప్రారంభించారు. బూరెడ్డిపల్లికి చెందిన బండ్ల ధర్మారెడ్డి, రామమ్మ జ్ఞాపకార్ధం వారి కుమారుడు కోడలు బండ్ల నాగేశ్వరరెడ్డి, బండ్ల విమలాదేవి విద్యార్థుల అవసరార్ధం రూ.3 లక్షల వ్యయంతో కళా వేదికను నిర్మించారు. విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దాలి గద్వాలటౌన్: విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎస్పీ మొగులయ్య పిలుపునిచ్చారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక బాలభవన్లో బాలల హక్కుల దినోత్సవ వేడుకలను నిర్వహించగా.. ఆయన పాల్గొని మాట్లాడారు. చిన్నారుల రక్షణ కోసం పలు చట్టాలు అమలులో ఉన్నాయని, ఎక్కడైనా ఆపదలో ఉన్న బాలలు కనిపిస్తే తప్పనిసరిగా 1098 లేదా 100 నంబర్కి ఫోన్ చేయాలని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారిణి సునంద మాట్లాడుతూ బాల్యం ప్రతి చిన్నారి హక్కు అని, వారు స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎదగాలని ఆకాక్షించారు. అనంతరం ఆటల పోటీలలో గెలుపొందిన చిన్నారులకు బహుమతులను అందజేశారు. గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలుగద్వాలటౌన్: గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు అని, వాటిని విద్యార్థులు వినియోగించుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా గ్రంథాలయంలో చైర్మన్ శ్రీనివాసులు జ్యోతి ప్రజ్వలన చేసి వారోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పుస్తక పఠనంతోనే విజ్ఞాన సమపార్జన సాధ్యమవుతుందని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విజ్ఞానాన్ని అందించే పుస్తకాలను అందుబాటులోకి తెస్తామన్నారు. మంచి పుస్తకానికి మించిన మిత్రులు లేరన్నారు. గ్రంథాలయాలు విజ్ఞాన బాండాగారాలని, ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలన్నారు. నేటి యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రంథాల య అభివృద్ధికి దాతల సహకారం తీసుకుంటామని చెప్పారు. అనంతరం విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ అధికారి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
గుట్టకాయ స్వాహా..!
ఆనవాళ్లు కోల్పోతున్న పాలమూరు నిబంధనల ప్రకారం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే తవ్వకాలు చేపట్టాలి. అక్రమార్కులు పర్మిషన్లు తీసుకోకుండా.. అది కూడా చాలా చోట్ల రాత్రివేళ సైతం మట్టి దందా కొనసాగిస్తున్నారు. కొన్నిచోట్ల అర్ధరాత్రి దాటిన తర్వాతే తవ్వకాలు చేపట్టి భారీ వాహనాల్లో తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాజకీయ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకుల ఆధ్వర్యంలో ఈ దందా కొనసాగుతోంది. ఇందులో ప్రధానంగా అధికార పార్టీకి చెందినవారే. వీరికి అధికార నేతలు అండగా నిలవడంతో ప్రభుత్వ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీస్, రవాణా, మైనింగ్ శాఖకు వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోజు, నెల వారీగా మామూళ్లు అందుతుండడంతోనే వారు పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా మట్టి మాఫియా రెచ్చిపోతుంది. అధికార నేతల అండదండలతో పగలు, రాత్రనక సహజ సంపదను కొల్లగొడుతోంది. ఎర్రమట్టి, మొరం కోసం గుట్టలను కేరాఫ్గా చేసుకుని అడ్డగోలుగా తవ్వకాలు చేస్తోంది. రాయల్టీ చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ.. భారీ వాహనాల్లో యథేచ్ఛగా తరలిస్తోంది. అవినీతికి అలవాటు పడిన పలు శాఖలు పట్టించుకోకపోవడంతో పాలమూరు క్రమక్రమంగా తన ఆనవాళ్లను కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ఫోకస్.. ‘నారాయణపేట’లో ఇష్టారాజ్యం.. నారాయణపేట జిల్లా ఎక్లాస్పూర్, అప్పిరెడ్డిపల్లి గ్రామాల పరిధిలో గుట్టల్లో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు తవ్వకాలు చేపడుతున్నారు. ఒక ట్రిప్పుపై వచ్చిన లాభంలో జేసీబీ యజమానులు, టిప్పర్ ఓనర్లు వాటాల లెక్కన పంచుకుంటున్నారు. మాగనూరు మండలం నుంచి నారాయణపేటకు ఇసుక రవాణా నిత్యం కొనసాగుతోంది. నారాయణపేటలో ఇసుకను అన్లోడ్ చేసిన తర్వాత తిరిగి మాగనూరుకు వెళ్తున్న క్రమంలో ఖాళీగా వెళ్లకుండా మొరం నింపుకుని వెళ్తూ అవసరమైన వాళ్లకు అమ్ముకుంటున్నారు. ఒక టిప్పర్ మొరం లోడ్కు మార్కెట్లో సుమారు రూ.4,500 నుంచి రూ.5 వేలు పలుకుతోంది. ఊట్కూరు మండలం ఎర్గట్పల్లి గుట్టను కూడా కొందరు తొలుస్తున్నారు. గ్రామంలోని చెరువు కట్ట మీద నుంచి టిప్పర్లు, జేసీబీలు తీసుకెళ్లి గుట్ట వద్ద తవ్వకాలు చేస్తున్నట్లు తెలిసింది. ధన్వాడ మండలం మణిపూర్ తండా గుట్ట, గున్ముక్ల, ఎమ్మినోనిపల్లి మాలేగుట్ట, దేవుని గుట్టపై అక్రమంగా తవ్వకాలు చేపట్టి.. మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. మద్దూరు మండలం ఎరగ్రోల్ తండా సమీపంలో, కోస్గి మండలం కడెంపల్లి పెద్ద గుట్టను కూడా కొల్లగొడుతున్నారు. ● మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి నగర పరిధిలో ఎదిర, మౌలాలి గుట్ట, వీరన్నపేట, కొర్షగుట్ట ప్రాంతాల్లో అక్రమార్కులు గుట్టలను పిండి చేస్తున్నారు. మొరం, ఎరమ్రట్టిని యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. అడ్డాకుల మండలం కేంద్రంలోని పలుగు గుట్టపై కూడా అక్రమంగా మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. ● వనపర్తి జిల్లాలో వీపనగండ్ల మండలం గోపాల్దిన్నె రిజర్వాయర్ రక్షణ కట్ట, ఖిల్లాఘనపురం మండలం సోళిపూర్, కర్నెతండా, జిల్లాకేంద్రంలోని శ్రీనివాసాపురం శివారులోని మబ్బు గుట్టపై అక్రమార్కులు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా యథేచ్ఛగా తవ్వతున్నారు. ● జోగుళాంబ గద్వాల జిల్లాలో పూడూరు, వజ్రాలగుట్ట, నది అగ్రహారం సమీపంలో, పిల్లిగుండ్ల కాలనీ, ముల్కల్ పల్లి, జమ్మిచేడు తదితర ప్రాంతాల్లోని గుట్టలను అక్రమార్కులు కేరాఫ్గా చేసుకుని మట్టి దందా చేస్తున్నారు. అదేవిధంగా ధరూరు, గట్టు, కేటీ దొడ్డి, మల్దకల్ మండలాల్లోని ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు చేపట్టి అనధికారకంగా మట్టి తరలిస్తున్నారు. ● నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలంలోని ఊర గుట్టను కొల్లగొడుతున్నారు. రాత్రివేళల్లో టిప్పర్లతో నిత్యం మట్టి తరలింపు కొనసాగుతోంది. అదేవిధంగా తాడూరు మండలంలోని కొమ్ముగుట్టపై తరచుగా తవ్వకాలు జరుగుతున్నాయి. రాయల్టీ చెల్లించకుండా దందా.. ప్రభుత్వ పనులకై నా, ప్రైవేట్కై నా మట్టి కావాల్సి వస్తే.. నిబంధనల ప్రకారం టన్నుకు రూ.56 చొప్పున మైనింగ్ శాఖకు రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎంత మేర కావాలో పేర్కొంటూ ఆ శాఖకు అర్జీ పెట్టుకోవాలి. ఆ తర్వాత మైనింగ్ శాఖ డీడీఓ కోడ్ పేరిట చలానా తీయాలి. ఈ మేరకు నిర్దేశిత సర్వే నంబర్లో చలానా చెల్లించిన మేరకు అధికారులు కొలతలు (పొడవు, వెడల్పు, లోతు) వేసి అనుమతి పత్రాలు ఇస్తారు. ఆ తర్వాతే తవ్వకాలు చేపట్టి మట్టి తరలించాల్సి ఉంటుంది. కానీ ఉమ్మడి పాలమూరులోని అన్ని జిల్లాల్లో ఒకరిద్దరు మినహా అక్రమార్కులు నిబంధనలను తుంగలో తొక్కి దందా సాగిస్తున్నారు. రాయల్టీ ఎగవేస్తూ యథేచ్ఛగా గుట్టలు తొలుస్తుండడంతో పర్యావరణంపై ప్రభావం పడుతుండడంతోపాటు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రెచ్చిపోతున్న మాఫియా ఎరమ్రట్టి, మొరం కోసం అడ్డగోలు తవ్వకాలు రాజకీయ నేతల అండతో యథేచ్ఛగా దందా రాయల్టీ ఎగవేతతో సర్కారు ఆదాయానికి గండి మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖపై విమర్శలు నేను కొత్తగా వచ్చా. రెండు రోజులు మాత్రమే అటెండ్ అయ్యా. ఎక్కడ గుట్ట తవ్వి మొరం, మట్టి కొడుతున్నారో వివరాలు నాకు తెలవదు. రాయల్టీ కూడా చెల్లిస్తున్నారో లేదో తెలవదు. మొరం, మట్టి తరలింపునకు ఇసుక లెక్క నిబంధనలు ఉండవు. 24 గంటలూ కొట్టుకోవచ్చు. – సత్యనారాయణ, మహబూబ్నగర్ ఏడీ, మైనింగ్ శాఖ -
బీసీల రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలి
ఎర్రవల్లి: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లును వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి రాజ్యాంగ రక్షణ కల్పించాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్గౌడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో స్థానిక బీసీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రణభేరి బహిరంగ సభ వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్ట సభల్లో బీసీలకు జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించి, మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలన్నారు. బీసీ ప్రధానిగా ఉండి బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు. బీసీ ఎంపీలు కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదని, బీసీల సామాజిక న్యాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం రాజ్యంగ విరుద్ధమన్నారు. ఇది ముమ్మాటికి బీసీలను రాజకీయంగా వెనక్కి నెట్టే కుట్ర అని మండిపడ్డారు. నామినేటెడ్ పదవులను జనాభా ప్రాతిపదికన బీసీలకు కేటాయించాలన్నారు. -
భూ సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
గద్వాల: భూభారతి, సాదాబైనామా తదితర భూసమస్యలకు సంబంధించిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో కాన్ఫరెన్స్హాలులో రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల సందర్భంగా 6,391 దరఖాస్తులు వచ్చాయని వీటిలో వివిధ స్థాయిలో పెండింగ్లో ఉన్న ఆయా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కరించాలన్నారు. జిల్లాలో ప్రభుత్వానికి చెందిన వివిధ భూములు పలుచోట్ల ఆక్రమణలకు గురవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిపై దృష్టి పెట్టి అన్యాక్రాంతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా కుల, ఆదాయ నివాస ద్రువీకరణ పత్రాలు, కల్యాణలక్ష్మీ, షాదీముభారక్ తదితర దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి జిల్లాలో ఇప్పటివరకు 35శాతం మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయిందన్నారు. ఆయా పోలింగ్ స్టేషన్ల వారీగా సూపర్వైజర్లు, బీఎల్వోలు మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను తహసీల్దార్లు క్రమం తప్పకుండా సందర్శించి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, ఆర్డీవో అలివేలు, ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. -
ప్రతిభను గుర్తించేందుకు ఖేలో ఇండియా పోటీలు
గద్వాలటౌన్: గ్రామీణ నేపథ్యం ఉన్న క్రీడాకారిణుల్లో శక్తి సామర్థ్యాలు ఎక్కువ ఉంటాయనే కేంద్ర ప్రభుత్వం ‘ఖేలో ఇండియా’ అస్మిత లీగ్ పేరిట జాతీయ స్థాయి అథ్లెటిక్స్ టోర్నీ నిర్వహిస్తుందని డీవైఎస్ఓ కృష్ణయ్య తెలిపారు. శుక్రవారం స్థానిక ఇండోర్ స్టేడియంలో ఖేలో ఇండియా, స్పోర్ట్స్ అధారిటి, అథ్లెటిక్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అస్మిత (అచీవింగ్ స్పోర్ట్స్ మైల్స్టోన్ బై ఇన్స్ప్పైరింగ్ ఉమెన్) లీగ్ అథ్లెటిక్స్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. బాలికలకు అండర్–14, అండర్–16 విభాగాలలో 60 మీటర్లు, 600 మీటర్లు, లాంగ్జంప్, హైజంప్, జావలిన్ త్రో, డిస్కుత్రో పోటీలను నిర్వహించారు. పోటీల అనంతరం ప్రతిభ చాటిన క్రీడాకారిణులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కనీస మౌలిక వసతులు లేని ప్రాంతాల్లోనూ ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉంటారని, వారిని గుర్తించి తర్ఫీదు ఇచ్చేందుకే ఈ పోటీలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బీసన్న, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
పని చేసేందుకు వచ్చి.. ప్రాణాలు కోల్పోయారు!
మహబూబ్నగర్ క్రైం: పాత భవనం రేనోవేషన్ పనులు చేయడానికి వెళ్లిన ఇద్దరు దినసరి కూలీలు.. ఆ భవనం కూలి శిథిలాల కింద చిక్కుకొని మృతి చెందిన ఘటన మహబూబ్నగర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని పాత తోట ప్రాంతంలో సంపు లక్ష్మణ్కు చెందిన ఒక పాత భవనం శిథిలావస్థకు చేరింది. ఈ భవనంలో మనోహర్ కిరాణం దుకాణానికి సంబంధించిన సరుకులు నిల్వ చేసేందుకు గోదాంలా ఉపయోగించుకుంటున్నాడు. అయితే గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో సంపు లక్ష్మణ్ దగ్గర పని చేసే గుమస్తా రాజు పాత బస్టాండ్ దగ్గర అడ్డాపై ఉన్న ఇద్దరు కూలీలు నవాబ్పేట మండలం రుద్రారం గ్రామానికి చెందిన గద్వాల కృష్ణయ్య(45), భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్కు చెందిన కుమ్మరి శాంతయ్య(60) పని కోసం తీసుకువచ్చాడు. అయితే ఒకవైపు ఇద్దరు కూలీలు పాత ఇంటికి అనుకొని ఉన్న రావిచెట్టును తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. మరో యువకుడు గోడలకు డ్రీల్ చేసే పనిలో ఉండగా.. అకస్మాత్తుగా గొడలు కూలడంతో గమనించిన ఆ యువకుడితో పాటు గుమస్తా రాజు అక్కడి నుంచి బయటకు వచ్చారు. అదే సమయంలో కొట్టేసిన చెట్టె లాగుతూ ఇద్దరు కూలీలు అటువైపు రాగా.. స్లాబ్ కూలి ఇద్దరిపై పడింది. దీంతో వారు శిథిలాల కింద చిక్కుకొని అక్కడిక్కడే మృతి చెందారు. జేసీబీ సహాయంతో దాదాపు ఆరు గంటల పాటు శ్రమించి సాయంత్రం 4.48 గంటల ప్రాంతంలో మొదటి మృతదేహం బయటకు తీశారు. సాయంత్రం 5.20 ప్రాంతంలో రెండో మృతదేహం వెలికితీశారు. సహాయ చర్య పనులను కలెక్టర్ విజయేందిర బోయి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం పరిశీలించారు. ● మహబూబ్నగర్లో కూలిన పాత భవనం ● శిథిలాల కింద చిక్కుకొని ఇద్దరు కూలీలు మృతి గద్వాల కృష్ణయ్య (ఫైల్) కుమ్మడి శాంతయ్య (ఫైల్) -
పెండింగ్ నిర్మాణ పనులు పూర్తిచేయాలి
గద్వాల: జిల్లా వ్యాప్తంగా పలు అంగన్వాడీ కేంద్రాలలో చేపట్టిన మరుగుదొడ్లు, నీటివసతి తదితర పెండింగ్లో ఉన్న నిర్మాణ పనులు నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో అంగన్వాడీ కేంద్రాలలో చేపట్టిన వివిధ పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐసీడీఎస్ ఎన్ఆర్ఈజీఎస్ ఆర్థిక సంఘం నిధులతో ఆయా కేంద్రాల్లో మరుగుదొడ్లు, నీటివసతి, విద్యుత్ సౌకర్యం తదితర పనులు సకాలంలో పూర్తికాకపోవటానికి కారణాలపై ఆరా తీశారు. ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించి డిసెంబర్ 15లోగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న పలు అంగన్వాడీ కేంద్రాల భవనాలు కూడా ఫిబ్రవరిలోగా పూర్తి చేయాలని, జిల్లాలో మొత్తం 69 అంగన్వాడీ కేంద్రాల ఆవరణలో కూరగాయల సాగుకు అవసరమైన ఏర్పాట్లు ఈ నెల చివరిలోగా పూర్తిచేయాలని ఆదేశించారు. విద్యుత్ సౌకర్యం లేని కేంద్రాలలో నిర్దేశిత గడువులోగా కనెక్షన్ ఇవ్వాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిపై తాను తరచూ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని, సంబంధిత ఇంజినీర్లు సైతం క్రమం తప్పకుండా పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో పీఆర్ ఈఈ ప్రభాకర్, జిల్లా సంక్షేమ అధికారి సునంద, ట్రాన్స్కో ఎస్ఈ శ్రీనివాస్రెడ్డి, హాల్టికల్చర్ అధికారి అక్బర్, మిషన్భగీరథ ఈఈ శ్రీధర్రెడ్డి, ఏఈలు, సీపీడీవోలు పాల్గొన్నారు. -
ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలి
ఎర్రవల్లి: జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా గురువారం మండలంలోని కోదండాపురం పోలీస్స్టేషన్ను ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణ, రికార్డులు, సిబ్బంది క్రమశిక్షణ, యూనిఫాం టర్న్ ఔట్ తదితర అంశాలను పరిశీలించి సిబ్బందితో కేసుల విషయమై ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పీఎస్ పరిదిలోని జాతీయ రహదారిపై ప్రమాదాలను నివారించేందుకు బ్లాక్ స్పాట్స్ గుర్తించాలని, రాత్రి సమయంలో రోడ్డు పక్కన వాహనాలు నిలిపి నిద్రించే డ్రైవర్లకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వాలని సూచించారు. రోడ్ భద్రత కోసం ఏర్పాటు చేసిన విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీలు చురుకుగా పనిచేయాలని ఆదేశించారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించి, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు జరపాలని సూచించారు. సైబర్ నేరాల నివారణకు కమ్యూనిటీ పోలీసింగ్ నిర్వహించాలని, సీసీ కెమెరాల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. స్టేషన్ నిర్వహణ, రికార్డుల మొయింటెనెన్స్పై సంతృప్తి వ్యక్తం చేసి సిబ్బందిని అభినందించారు. స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని సిబ్బందికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ శంకర్, డిఎస్పీ మొగిలయ్య, సిఐ రవిబాబు, ఎస్సై మురళి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి సంగీత వాయిద్య పోటీలకు ఎంపిక
గద్వాలటౌన్: ప్రభుత్వ బాలురు ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సుందర్రాజు జాతీయ స్థాయిలో జరిగే సంగీత వాయిద్య పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్ పోటీలలో సుందర్ రాజు పాల్గొని సత్తాచాటారు. రాష్ట్రస్థాయి సంగీత వాయిద్య పోటీల విభాగంలో అత్యంత ప్రతిభ కనబర్చి మొదటిస్థానంలో నిలిచారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న సుందర్రాజును గురువారం పాఠశాలలో ఘనంగా సన్మానించారు. పాఠశాల హెచ్ఎం రేణుకాదేవి, గైడ్ టీచర్ దీప్తి, ఫిజకల్ డైరెక్టర్ హైమావతి అభినందించారు. జాతీయ స్థాయి పోటీలలో సత్తాచాటాలని హెచ్ఎం పిలుపునిచ్చారు. బస్సు యాత్రను జయప్రదం చేయాలి గద్వాల: సీపీఐ పార్టీ వందేళ్ల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్సు జాతాను నిర్వహించనున్నట్లు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు అన్నారు. గురువారం ఆయన పార్టీకార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 15వ తేదీన నిర్వహించే సీపీఐ రాష్ట్ర బస్సు జాతను జయప్రదం చేయాలని, కార్యక్రమానికి జాతీయకార్యదర్శి మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కార్యవర్గ సభ్యులు ఎం బాలనర్సింహులు హాజరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రంగన్న, ఆశన్న, ప్రవీణ్, పరమేష్లు పాల్గొన్నారు. ఏసీబీ వలలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అయిజ: రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపల్ ఇన్చార్జ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వరప్రసాద్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అయితే, అయిజ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అయిన వరప్రసాద్.. ఆదిబట్ల మున్సిపాలిటీలో ఇంచార్జ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఈక్రమంలో ఆదిబట్ల మున్సిపాలిటీలో ఓ ఇంటి నిర్మాణం కోసం ఒక వ్యక్తి నుంచి రూ.1.50 లక్షలు డిమాండ్ చేశారు. అయితే, బాధితుడు గురువారం రూ.75 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వరప్రసాద్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వంశీని పట్టుకొని కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఈ విషయానికి సంబంధించి పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అయిజ మున్సిపాలిటీలో కలకలం రేపాయి. -
విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి
గట్టు: విద్యార్థులు సామాజిక మాద్యమాలకు దూరంగా ఉంటూ, చదువుపైనే దృష్టి సారించాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి ప్రియాంక సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం తప్పెట్లమొర్సు, గొర్లఖాన్దొడ్డి గ్రామాల్లోని 9, 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నీ లక్ష్యం నిన్ను నిద్రపోనివ్వకపోతేనే.. ఆ లక్ష్యం నీ జీవితాన్ని మార్చుతుందని, విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ, సమయాన్ని చదువుకు వినియోగిస్తే తప్పకుండా మంచి ఫలితాలను రాబట్టవచ్చునని తెలిపారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకుని, దాన్ని సాధించే దిశగా అడుగులు ముందుకు వేయాలన్నారు. లక్ష్య సాధనకు ప్రణాళిక, క్రమ శిక్షణ, సమయపాలన అత్యంత అవసరమని, విజయం కోసం భయం, సోమరితనం, దూరం పెట్టి నిరంతర కృషి, అంకిత భావంతో చదువుకోవాలన్నారు.రోజూ 7గంటల నిద్ర, 8 గంటల చదువు, 9 గంటలు ఇతర పనులు చేయాలని, సమయాన్ని వృథా చేయకుండా క్రమ శిక్షణతో చదువుకోవాలన్నారు. అనంతరం ఆయా పాఠశాలల్లో విద్యార్థుల మధ్యాహ్నా భోజనాన్ని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
అలవి వల పట్టివేత
అలంపూర్ రూరల్: మండలంలోని గొందిమల్ల గ్రామ శివారులో కృష్ణానది పరివాహక ప్రాంతంలో నిషేధిత అలవి వలను గురువారం పట్టుకున్నట్లు ఎస్ఐ వెంకటస్వామి తెలిపారు. వివరాలిలా.. కాకినాడ జిల్లాకు చెందిన బాబురావు, జంగంపాడ్ గ్రామానికి చెందిన శంకర్ ఆదేశాల మేరకు నిషేధించిన అలవి వలలతో కృష్ణానదిలో చేపలు పట్టి తీసుకువెళ్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. జిల్లా మత్య్సశాఖ అధికారి షకీలాభానుకు సమాచారం ఇవ్వగా.. ఆమె దానిని పరిశీలించి అలవి వలగా గుర్తించింది. ఈమేరకు సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆకట్టుకున్న గ్రామ సింహాల పరుగుపందెం
గట్టులో అంబాభవాని జాతర సందర్భంగా గురువారం గ్రామ సింహాల పరుగు పందెం పోటీలను నిర్వహించారు. కర్ణాటక, తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి 18 గ్రామ సింహాలు రేసులో పాల్గొన్నాయి. పోటీలను పీఏసీఎస్ చైర్మన్ వెంకటేష్, రామకృష్ణారెడ్డిలు ప్రారంభించారు. కుచినేర్ల వీరేస్కు చెందిన గ్రామసింహం గెలిచి రూ.10వేలు దక్కించుకోగా.. ఉప్పలపాడు యల్లప్పకు చెందిన కుక్క రెండోస్థానంలో, రాజపురం రాజేందర్కు చెందిన కుక్క మూడోస్థానంలో నిలిచాయి. కుక్కల పరుగు పందెం తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చారు. – గట్టు -
నదీ తీర ప్రాంతాలే అడ్డాగా..
ఆంధ్రా ప్రాంతంలోని కృష్ణా, మచిలీపట్నం ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులు రెండు దశాబ్దాల కిందట గద్వాల ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ప్రమాదకరమైన నిషేదిత క్యాట్ఫిష్ చేపలను పెంచుతున్నారు. ఇందుకోసం సంవత్సర కాలంపాటు నీళ్లు అందుబాటులో ఉండే పొలాలను ఎంచుకుంటారు. ఈ క్రమంలోనే కృష్ణానది తీరప్రాంతాలైన ధరూరు మండలం ఉప్పేరు, గార్లపాడు, నెట్టెంపాడు, ఖమ్మంపాడు, గద్వాల మండలం బీరెల్లి, లత్తిపురం, చెనుగోనిపల్లి, గుంటిపల్లి, ఎర్రవల్లి మండలం తిమ్మాపురం, షేక్పల్లి,బీచుపల్లి, అదేవిధంగా తుంగభద్ర తీరప్రాంతాలైన మద్దూరు, పెద్దతాండ్రపాడు తదితర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని స్థిరపడ్డారు. ఈప్రాంతాల్లో అక్రమంగా నిషేధిత క్యాట్ఫిష్ను పెంచుతూ వాటిని హైదరాబాద్, బెంగుళూరు వంటి ప్రాంతాలకు తరలిస్తూ పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. అయితే వీటిపై గతంలో మీడియాలో అనేక కథనాలు రావడంతో అధికారులు దాడులు నిర్వహించి ధ్వంసం చేసినప్పట్టికీ అక్రమార్కులు రూటుమార్చి క్యాట్ఫిష్ను సాగుచేస్తున్నారు. క్యాట్ఫిష్ చెరువులు సులువుగా గుర్తించేందుకు వీలు లేకుండా అక్రమార్కులు ఫంగస్ చేపల చెరువుల మధ్య పెద్ద మొత్తంలో క్యాట్ఫిష్ చెరువులు ఏర్పాటు చేసి ప్రమాదకరమైన క్యాట్ఫిష్ను సాగుచేస్తున్నారు. -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
ధరూరు: వసతిగృహంలోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అక్బర్ అన్నారు. గురువారం రాత్రి ఆయన మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతిగృహాన్ని ఆయన తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని, స్టాక్ రికార్డులు, హాస్టల్ పరిసరాలు, స్టోర్ రూంలోని కిరాణ సరుకులు, వాటి ఎక్స్పైరీ తేదీలను పరిశీలించారు. పాత్రలను శుభ్రంగా కడిగిన తర్వాత, శుభ్రమైన ప్రదేశంలో వంట చేయాలని వంట వారికి సూచించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేయాలని సూచించారు. అలాగే, ప్రతి విద్యార్థి వ్యక్తిగత శుభ్రత పాటించాలని, సమయాన్ని వృథా చేసుకోకుండా శ్రద్ధగా చదవాలని సూచించారు. వార్డెన్ నర్సింహులు, హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. -
రూ.2.88 కోట్ల ధాన్యం గోల్మాల్
● పోలీసులకు ఫిర్యాదు చేసిన సివిల్ సప్లైశాఖ అధికారులు ● మిల్లు యజమానిపై కేసు నమోదు గద్వాల క్రైం: ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా వచ్చిన ధాన్యాన్ని బియ్యంగా చేసి ఇచ్చేందుకు మిల్లుకు కేటాయించగా.. దాదాపు రూ.2.88 కోట్ల ధాన్యం గోల్మాల్ అయినట్లు వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలిలా.. జిల్లా కేంద్రంలోని శ్రీరామ రైస్మిల్లుకు ప్రభుత్వం 2022–23, 24–25 వానాకాలం, యాసంగి సీజన్లలో రైతుల నుంచి కొనుగోలు చేసిన రూ.2.88 కోట్ల విలువైన వరి ధాన్యాన్ని కేటాయించింది. ఈ క్రమంలో సదరు మిల్లు యజమాని ధాన్యాన్ని మర ఆడించి బియ్యాన్ని అప్పజెప్పకపోవడంతో ఈ ఏడాది అక్టోబర్ 18న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది మిల్లులో తనిఖీ చేశారు. దీంతో 1049.600 మెట్రిక్ టన్నుల వరిధాన్యం పక్కదారి పట్టించారని, సదరు యజమాని అక్రమాలకు పాల్పడినట్లు తేల్చారు. ఈ ధాన్యం విలువ రూ.2.88 కోట్లుగా నిర్ధారించారు. ఇదే విషయాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సివిల్ సప్లైశాఖ అధికారులకు నివేదించారు. ఈ నివేదికల ఆధారంగా 30.10.2025 తేదీన సివిల్ సప్లై శాఖ జిల్లా మేనేజర్ విమల రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మిల్లు యజమాని పవన్కుమార్రెడ్డి కేసు నమోదు చేశారు. అయితే, కేసు నమోదు విషయం ఇన్నాళ్లు విచారణ అధికారులు గోప్యంగా ఉంచారు. ఈ విషయంపై గద్వాల సీఐ శ్రీనును ‘సాక్షి’ వివరణ కోరగా.. సివిల్ సప్లై శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు మిల్లు యజమానిపై కేసు నమోదు చేశామని, ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉందని, త్వరలో పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. ఇదిలాఉండగా, ఈ నెల 4వ తేదీన సదరు మిల్లు యజమాని ఈ కేసు విషయమై హై కోర్టులో ముందుస్తు బెయిల్ పొందినట్లు తెలుస్తోంది. -
అంతా గుట్టుగా!
అధికారుల కళ్లుగప్పి నిషేధిత క్యాట్ఫిష్ పెంపకం ఈ చేపలతో క్యాన్సర్ కోవిడ్ తరువాత ప్రతిఒక్కరికి ఆరోగ్యంపై శ్రద్ధపెరిగింది. ఈక్రమంలో ఆరోగ్యానికి అన్ని రకాలుగా మేలు చేసే జీవనదులు, చెరువులలో పెరిగే సాధారణ చేపలపై మాంసాహారులు ఎక్కువగా మక్కువ చూపెడుతున్నారు. అయితే ప్రజల అవసారాన్ని అలుసుగా తీసుకున్న ఈ క్యాట్ఫిష్ పెంపకందారులు అడ్డదారిలో నిషేధిత క్యాట్ఫిష్ను కూడా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రధానంగా గద్వాల జిల్లాతో పాటు, పెబ్బేరు, కొత్తకోట, హైదరాబాద్, బెంగుళూరు వంటి ప్రధాన నగరాల్లో క్యాట్ఫిష్ను విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. దీంతో ఈనిషేధిత క్యాట్ఫిష్ను తినడం ద్వారా ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధి వస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈక్రమంలోనే ఈక్యాట్ఫిష్ను నిషేదించినట్లు స్పష్టం చేస్తున్నారు. గద్వాల: రెండు నదుల మధ్య వెలసిన నడిగడ్డ ప్రాంతం విషపు చేపల పెంపకానికి నిలయంగా మారింది. కృష్ణా, తుంగభద్ర నదుల తీరప్రాంతాల్లో రెండు దశాబ్దాలుగా నిషేధిత క్యాట్ఫిష్ పెంపకం గుట్టుగా కొనసాగుతుంది. ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చిన కొందరు వందల ఎకరాల పంటపొలాలను లీజుకు తీసుకుని దర్జాగా క్యాట్ఫిష్ సాగుచేస్తున్నారు. గతంలో క్యాట్ఫిష్ చెరువులపై దాడులు జరిగి క్రిమినల్ కేసులు నమోదు కావడంతో అధికారులకు దొరకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ఈ రకమైన నిషేధిత చేపలకు ఆహారంగా చికెన్, కుళ్లిన కోడిగుడ్డు వ్యర్థాలను వినియోగిస్తున్నారు. ఈవ్యర్థాలను ఏటా బహిరంగా వేలం ద్వారా క్యాట్ఫిష్ పెంపకందారులు దక్కించుకుంటుడగా, మరోవైపు హైదరాబాద్ నుంచి సైతం వ్యర్థాలు తరలిస్తున్నారు. ఇంతటి ప్రమాదకర చేపలు పెంపకంపై నిఘాపెట్టి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం అటువైపు దృష్టిసారించడం లేదు. క్యాట్ఫిష్ పెంపకంలో రూ.లక్షల్లో లాభాలు గడిస్తుండడంతో క్యాట్ఫిష్ పెంపకందారులు చికెన్ వ్యర్థాలను దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున పోటీపడుతుండడం విశేషం. పూర్తి నిరుపయోగమైన చికెన్ వ్యర్థాలు రూ.లక్షల్లో ధర పలుకుతున్నాయంటే ఆశ్చర్యం కలుగక మానదు. జిల్లాలో సుమారు 200లకు పైగా చికెన్షాపులు ఉండగా కస్టమర్లు చికెన్ తీసుకునే క్రమంలో స్కిన్, కాళ్లు, తల, పేగులు వంటి వ్యర్థాలు వేలంపాటలో ఏటా రూ.80 లక్షల ధర పలుకుతుందంటే క్యాట్ఫిష్ సాగు ఏ స్థాయిలో జరుగుతుందో స్పష్టమవుతుంది. ఇది సరిపోదు అన్నట్టు ఏకంగా షాద్నగర్, హైదరాబాద్ ప్రాంతాల నుంచి సైతం చికెన్వ్యర్థాలు, కుళ్లిన కోడిగుడ్లు జిల్లాకు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. చికెన్ వ్యర్థాలకు డిమాండ్ కేసులు పెడతాం నిషేధిత క్యాట్ఫిష్ను ఎవరైన సాగుచేస్తే వా రిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. చెరువులను ధ్వంసం చేయడమే కాకుండా వాటి పెంపకందారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. – వి.లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్ చికెన్, కుళ్లిన కోడిగుడ్ల వ్యర్థాలే ఆహారంగా అందిస్తున్న వైనం జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్ నుంచి కోళ్ల వ్యర్థాలు ఫంగస్ చేపల చెరువులఽమధ్యలో క్యాట్ఫిష్ చెరువులు వీటిని తింటే రోగాలుఖాయమంటున్న వైద్య నిపుణులు -
చేనేత రుణమాఫీ అమలు చేయాలి
రాజోళి: చేనేత కార్మికులను నిర్లక్ష్యం చేస్తే కార్మికుల ఆగ్రహ చర్యలకు ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సిందేనని.. వెంటనే రుణమాఫీ అమలు చేయాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్ అన్నారు. రాజోళిలో చేనేత రుణమాఫీ కోసం మాజీ ఎమ్మెల్సీ సీతారాములు, చేనేత కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. రాజోళి పుర వీధుల్లో చేనేత కార్మికుల సమస్యలను విన్నవిస్తూ, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ పి.రామ్మోహన్కు వినతి పత్రం అందచేశారు. అనంతరం స్థానిక వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో కార్మికులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో చేనేత రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి నేటి వరకు చేయకపోవడం వల్ల కార్మికులు తమ జీవనోపాధికి దూరమవుతున్నారని అన్నారు. ప్రభుత్వం కూడా తమ గోడును వినకుండా, కార్మికులను నిర్లక్ష్యం చేస్తుందని, వారి కడుపుకొడుతుందని అన్నారు. చేనేత రుణమాఫీతో పాటు, పథకాల అమలుకు, కార్మికుల హక్కుల సాధనకు ఈ నెల 20న హైద్రాబాద్లోని చేనే,జౌళి శాఖ కమీషనర్ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. మహాధర్నాకు చేనేత కార్మికులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దోత్రే శ్రీను, చేనేత కార్మికులు పాల్గొన్నారు. -
ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు
మానవపాడు: నీటి వసతులున్న వ్యవసాయ క్షేత్రల్లో ఆయిల్పామ్ తోటలు సాగు చేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వస్తాయని జిల్లా ఉద్యానవనశాఖ అధికారి మహ్మద్ అలీ అక్బర్ సూచించారు. బుధవారం మండలకేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ, తెలంగాణ ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో ఆయిల్పామ్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగుకు చీడపీడలు సోకే ఆస్కారం తక్కువని, మొక్కలు నాటిన నాలుగేళ్ల తర్వాత ఏటా ఎకరానికి 8 నుంచి 12 టన్నుల ఆయిల్పామ్ కాయల దిగుబడి వస్తుందన్నారు. ఆయిల్ పామ్ సాగుచేయాలనుకునే రైతులకు మొక్కలకు 90 శాతం రాయితీ, డ్రిప్ ఏర్పాటుకు 80శాతం నుంచి వందశాతం రాయితీ వస్తుందని, మొక్కలు ఎదిగే వరకు నాలుగేళ్ల వరకు ఎకరానికి రైతుకు రూ.4200 చొప్పున ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఒకసారి మొక్కలు నాటితే 30ఏళ్ల పాటు రైతు దిగుబడి పొంతాడన్నారు. కేవలం నీరు అందించి, పైపాటు ఎరువులు అందిస్తే సరిపోతుందని, మార్కెట్కు దిగులు పాడాల్సిన అవసరం లేదని, ఈ పంటలో అంతర పంటలు సాగు చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో శివనాగిరెడ్డి, రాజశేఖర్, త్రివిక్రమ్, యశ్వంత్, పీఏసీఎస్ అధ్యక్షులు శ్రీధర్రెడ్డి, పోసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యం.. వందశాతం
పన్ను వసూళ్లపై పంచాయతీల దృష్టి –8లో u2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను వసూళ్లను నవంబర్ 1 నుంచి ప్రారంభించాం. ఇప్పటికి 10శాతం పన్నులు వసూలయ్యాయి. వందశాతం పన్నులు వసూలు అయ్యేలా అవసరమైన కార్యాచరణను సిబ్బందికి తెలియజేశాము. గడిచిన నాలుగేళ్ల నుంచి తీసుకుంటున్న ప్రత్యేక చర్యల వల్ల డిమాండ్ పెరుగుతోంది. – నాగేంద్రం, జిల్లా పంచాయతీ అధికారి జిల్లాలో పన్ను వసూళ్ల లక్ష్యం వివరాలిలా.. గద్వాలన్యూటౌన్: గ్రామ పంచాయతీలకు ప్రధాన ఆదాయ వనరు అయిన పన్నులపై అధికారులు దృష్టి సారించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను వసూళ్లను ప్రారంభించారు. ఈ ఏడాది జిల్లాలో రూ.4.03 కోట్లు లక్ష్యంగా ఉంది. శతశాతం వసూలు అయ్యేలా సిబ్బందికి అధికారుల దిశా నిర్ధేశం చేశారు. పన్నులే ప్రధాన ఆదాయ వనరు గ్రామ పంచాయతీలు స్వయం పోషకాలుగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తుంటాయి. పంచాయతీలకు ఇంటిపన్ను, తాగునీటిపన్నుతో పాటు వాణిజ్య దుకాణాలు, ఫ్యాక్టరీల నుంచి లైసెన్స్ ఫీజు వసూలు చేస్తాయి. పంచాయతీలు ఈ పన్నులే ప్రధాన ఆదాయవనరు. పలు అవసరాలకు పంచాయతీలకు పన్నుల రూపేణ వచ్చే సొమ్మే దిక్కు అవుతుంది. అయితే ప్రభుత్వం పరంగా ఎస్ఎఫ్సీ, ఆర్థికసంఘం నుంచి నిధులు మంజూరు అవుతాయి. ఇది కూడా జనాభా ప్రాతిపదికన రూ.2లక్షల లోపు మాత్రమే ఆయా పంచాయతీలకు వస్తోంది. అయితే పంచాయతీల్లో పాలకవర్గాలు లేనందున ఎస్ఎఫ్సీ, ఆర్థిక సంఘం నుంచి రెండేళ్లుగా నిధులు రావడం లేదు. కేంద్రం కూడా వందశాతం పన్ను వసూళ్లయితేనే ప్రత్యేకంగా గ్రాంట్లు ఇస్తామని చెప్పింది. ఇలాంటి పరిస్థితి వల్ల పంచాయతీలు పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన పరిస్థితి. పెరుగుతున్న డిమాండ్ 2022–23 నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని మండల్లాలోని పంచాయతీల్లో యేటా పన్నుల డిమాండ్ పెరుగుతోంది. దీనికి కారణాలు ఏమిటంటే పలు గ్రామాల్లో మట్టి మిద్దెల స్థానంలో ఆర్సీసీ ఇళ్ళు నిర్మించుకున్నారు. వీటికి రీఅసెస్మెంట్ చేసి, పన్ను పెంచుతున్నారు. మండల కేంద్రాల్లో అసెస్మెంట్ లేని దుకాణాలను గుర్తించి, అసెస్మెంట్ చేసి పన్ను విధించారు. ప్రధానంగా ఎర్రవల్లి చౌరస్తా, అలంపూర్చౌరస్తా, ధరూర్ గట్టు తదితర మండల కేంద్రాల్లో పలు దుకాణాలకు కొత్తగా అసెస్మెంట్ చేసి, లైసెన్స్ ఫీజు విధించారు. దీంతో డిమాండ్ పెరుగుతూ వస్తోంది. కాగా ప్రతి ఆర్థిక సంవత్సరంలో పన్ను ఐదు శాతం పెంచుతారు. ఈక్రమంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గడిచిన ఏడాది బకాయిలు రూ. 22.42లక్షలు, ఈఏడాది రూ. 3.80 కోట్లు మొత్తంగా రూ. 4.03కోట్లు పన్ను లక్ష్యంగా ఉంది. రూ.4.03 కోట్లు వసూలు చేయాలని సిబ్బందికి దిశానిర్దేశం ఇప్పటికీ 10 శాతం పూర్తి చేసిన కార్యదర్శులు రెండేళ్లుగా ఎస్ఎఫ్సీ, ఆర్థిక సంఘం నిధులు విడుదల కాక కొరవడిన ప్రగతి మండలం లక్ష్యం (రూ.లక్షల్లో) గట్టు 51.14 గద్వాల 46.31 ఉండవల్లి 45.38 మల్దకల్ 39.74 అయిజ 37.18 ఎర్రవల్లి 36.86 ధరూర్ 30.16 కేటీదొడ్డి 24.36 మానవపాడు 24.33 రాజోళి 22.64 అలంపూర్ 15.89 ఇటిక్యాల 14.92 వడ్డేపల్లి 14.36 -
వీధి కుక్కల బెడద తీరేనా..?
గద్వాలటౌన్: జిల్లాలోని మున్సిపల్ పట్టణాలు, గ్రామాలలో కుక్కల స్వైర విహారం ఎక్కువైంది. వీధుల్లోనే కాదు.. ప్రధాన రోడ్లపై కూడా జనాన్ని వెంటాడుతున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. దీంతో బయటకు వెళ్లాలంటనే స్థానికులు జంకుతున్నారు. నిత్యం ఏదో ఓచోట వాటి బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారు. వీధికుక్కల సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు మాత్రం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం కుక్కల సమస్యపై తీర్పును పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం ఆదేశాలనైనా జిల్లా అధికారులు పాటిస్తారా లేదా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గద్వాల పట్టణంలో గడిచిన రెండు నెలల్లోనే సుమారు వంద మంది వరకు కుక్కకాటు బారినపడి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందారంటే పరిస్థితి త్రీవతను అర్థం చేసుకోవచ్చు. ఇంకా చాలా మంది కుక్కకాటు బాధితులు ఉన్నప్పటికి ఆ సంఘటనలు వెలుగులోకి రావడం లేదు. రూ.30 లక్షలతో ఏబీసీ కేంద్రం జిల్లా కేంద్రంలో వీధి కుక్కల సంతతిని అరికట్టేందుకు రూ.30 లక్షల వ్యయంతో జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని (ఏబీసీసీ) నిర్మించారు. ఇక్కడ శస్త్ర చికిత్సల కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. దీన్ని టెండర్ ప్రాతిపదికన ఓ ఎన్జీవో సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టారు. వారు పశు వైద్యులను నియమించడంతో పాటు, కుక్కుల పట్టే వారిని కూడా నియమించుకోవాల్సి ఉంటుంది. కాంట్రాక్టు ఒప్పదంలో బాగంగా పశువైద్యులు కుక్కలకు శస్త్ర చికిత్స చేయడం, ఆ తరువాత వాటికి కొన్ని రోజుల పాటు అక్కడే ఏర్పాటు చేసిన కేజ్లో ఉంచి సంరక్షించాలి. వాటికి ఆహారం, తాగునీరు అందించడంతో పాటు రేబిస్ టీకాలను సైతం వేయాల్సి ఉంది. కోలుకున్న తరువాత వాటిని మళ్లీ యధాస్థానంలో వదిలేయాలి. ఇలా చేయడానికి ఒక్కోదానికి రూ.1550 మున్సిపాలిటీ చెల్లించింది. ఇప్పటి వరకు సుమారు 800 కుక్కలను పట్టుకుని సంతానోత్పత్తి కలగకుండా చర్యలు చేపట్టారు. అయితే గత ఎనిమిది నెలలుగా ఎన్జీవో సంస్థ పనిచేయడం లేదు. దీంతో కుక్కల సంతానోత్పత్తి నిలిచిపోయింది. ఏబీసీ కేంద్రాన్ని ఏర్పాటు చేయకుమందు మున్సిపల్ కౌన్సిల్ చొరవ తీసుకుని రాజమండ్రి నుంచి ప్రత్యేకంగా సిబ్బందిని పిలిపించి కుక్కలను పట్టించారు. అలా పట్టకున్న కుక్కలను ప్రత్యేక వాహనాలలో అటవీ ప్రాంతాలకు తరలించారు. మిగిలిన మున్సిపాలిటీలలో ఏబీసీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. హోటళ్లు, మాంసం దుకాణాలే అడ్డా.. ఏటా కుక్కలు ప్రజలపై దాడి చేసి గాయపర్చడం సాధారణంగా మారింది. వాటి నియంత్రణకు మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే కుక్కల సంతతి నానాటికీ వృద్ధి చెందడానికి కారణం ఆయా పట్టణాల్లోని వాతావరణమే. హోటళ్లు, ఫంక్షన్ హాల్స్, ఫాస్టుఫుడ్ కేంద్రాలు, మాంసం, చికెన్ దుకాణాలు.. వాటి ఆహార లభ్యతకు చిరునామాగా ఉంటున్నాయి. అక్కడే తిష్టవేసి ఆశ్రయం పొందుతున్నాయి. ఈ క్రమంలోనే గుంపులు గుంపులుగా స్వైర విహారం చేసి స్థానికులను గాయపర్చుతున్నాయి. రాత్రి వేళ విధులు ముగించుకొని వచ్చేవారితో పాటు, ముఖ్యంగా వేకువ జామున వాకింగ్కు వెళ్లే వారు, రాత్రి వేళ అత్యవసర నిమిత్తం ఆసుపత్రి, రైల్వే స్టేషన్, బస్టాండ్కు వేళ్లే వారికి కుక్కలు ఇబ్బందుల్ని కలిగిస్తున్నాయి. ఇళ్ల ముందు ఆడుకుంటున్న చిన్నారులపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. ‘విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, క్రీడా మైదానాలు, ఆసుపత్రులు తదితర జన రద్దీ ఉండే బహిరంగ ప్రదేశాలలో వీధి కుక్కలను సంచరించకుండా తగు ఏర్పాట్లు చేయాలి. వాటిని ప్రత్యేక షెడ్లకు తరలించండి.’ – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవి. తరచూ పాదచారులు, చిన్నారులపై దాడులు నెల రోజుల్లో 100కి పైగా కుక్క కాటు కేసులు ఏటీసీ కేంద్రం ఉన్నా.. సిబ్బంది లేక ఇబ్బంది కుక్కలతో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఆ దిశగా ఇప్పటికే సిబ్బందిని ఆదేశించాం. కుక్కల బెడదపై వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. తాజాగా కుక్కల తరలింపుపై ఉన్నతాధికారుల నుంచి ఇంకా ఆదేశాలు రాలేదు. ఏబీసీ కేంద్రాన్ని పునరుద్దరించడానికి ఎన్జీఓ సంస్థలతో చర్చిస్తున్నాం. – జానకిరామ్, కమిషనర్, గద్వాల -
తల్లిదండ్రులను పిల్లలు గౌరవించాలి
గద్వాలన్యూటౌన్: ప్రతి ఒక్కరు తమ తల్లిదండ్రులను గౌరవిస్తూ, మంచిగా చూసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి సునంద అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మహిళా శిశు సంక్షేమ, విద్యాంగుల వయోవృద్దుల శాఖ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఎంఏఎల్డీ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడారు. వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని చెప్పారు. వారి సంరక్షణ చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రస్తుతం సమాజంలో తల్లిదండ్రులను వదిలివేసి ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారని, అలా కాకుండా వారిని తమ దగ్గరే ఉంచుకొని మంచిగా చూసుకోవాలన్నారు. వయోవృద్దులు ఏమైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నం. 14567ను సంప్రదించాలని సూచించారు. డీసీపీఓ నరసింహ, కమ్యూనీటీ ఎడ్యుకేటర్ కృష్ణయ్య, అధ్యాపకుడు నాగభూషణ్, విద్యార్థులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా చిన్న నీటి వనరుల గణన
గద్వాల: జిల్లాలోని చిన్ననీటి వనరుల లెక్క తేల్చేందుకు నిర్వహించనున్న గణన ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీవోసీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో దేశవ్యాప్తంగా ఐదేళ్లకోసారి నిర్వహించే 7వ మైనర్ ఇరిగేషన్ రెండవ వాటర్బాడీస్ సెన్సెస్ జిల్లాలో ఏవిధంగా నిర్వహించాలని అంశంపై జిల్లా స్థాయిస్టీరింగ్ కమిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని చిన్నపారుదల వనరుల గణన ప్రణాళిక ప్రకారం పూర్తిచేయాలని ఆదేశించారు. రెండువేల హెక్టార్ల లోపు విస్తీర్ణం ఉన్న జలవనరుల గణన మొబైల్ అప్లికేషన్ ద్వారా చేయాలని ప్రభుత్వం ఆదేశాల జారీ చేసిందన్నారు. మొదట ఒక గ్రామాన్ని యూనిట్ తీసుకుని గణన పూర్తిచేసిన అనంతరం తదుపరి గ్రామాల గణనను కొనసాగించాలన్నారు. తహసీల్దార్, ఎంపీడీవో, నీటిపారుదల శాఖ ఏఈలు, మండల స్థాయిలో పర్యవేక్షణ చేస్తారని తెలిపారు. గ్రామస్థాయిలో పంచాయతీకార్యదర్శులు ఏఈవోలు ఎన్యూమరేటర్లుగా కొనసాగుతారని తెలిపారు. జిల్లాలో ఉన్న 202 రెవెన్యూ గ్రామాల్లో చిన్ననీటి వనరుల గణన కోసం అవసరమైతే ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్స్ను కూడా ఎన్యూమరేటర్లుగా వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో అన్ని చెరువులు, కుంటలు, ఇతర జలవనరుల వివరాలు సేకరించడంపై అందరూ ఎన్యూమనరేటర్లకు జిల్లా మండలాల స్థాయిలో త్వరితగతిన శిక్షణ పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, సీపీవో పాపయ్య, నీటిపారుదల శాక ఈఈ శ్రీనివాసులు, భూగర్భజల వనరుల శాఖ డీడీ మోహన్, పంచాయతీరాజ్ శాఖ ఈఈ ప్రభాకర్, విద్యుత్శాఖ డీఈ తిరుపతిరావు, డీఎస్వో హరికృష్ణ, హైమావతి, డీఆర్డీఏ తదితరులు పాల్గొన్నారు. యూడైస్లో వివరాలు పక్కాగా నమోదు చేయాలి యూడైస్లో పాఠశాలలు, విద్యార్థులకు సంబంధించిన వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లో విద్యాశాఖ పనితీరుపై సమీక్షించారు. మండలాల వారీగా పాఠశాలలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, మౌళిక వసతులకు సంబంధించిన వివరాలు యూడైస్లో నమోదయ్యే సమాచారం క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలన్నారు. విద్యాశాఖకు సంబంధించిన యాప్ల నిర్వాహణ, డాటా నమోదు, పాఠశాలల పనితీరు పర్యవేక్షణలో ఆధునిక సాంకేతికతను వినియోగించాలని సూచించారు. ముఖ్యంగా ఏఐ ప్లాట్ఫాంల ద్వారా విద్యార్థుల అభ్యాస స్థాయిని అంచనావేసి, వ్యక్తిగత విద్యా మద్దతు అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫౌండేషనల్ లిటరసి అండ్ న్యూమరసీ కార్యక్రమాన్ని పాఠశాలల స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ఇంటర్నోడల్ అధికారి హృదయరాజు, డీఈవో విజయలక్ష్మీ, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నుషిత, సెక్టోరియల్ అధికారులు అంపయ్య పాల్గొన్నారు. -
విద్యాభివృద్ధికి ఆద్యుడు మౌలానా అబుల్ కలాం
గద్వాల: మౌలనా అబుల్ కలాం ఆజాద్ విద్యాభివృద్ధికి ఎన్నో సంస్కరణలు చేసిన మహోన్నత వ్యక్తి అని కలెక్టర్ సంతోష్ అన్నారు. అబుల్ కలాం జయంతిని పురస్కరించుకొని మంగళవారం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఐడీఓసీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృషమోహన్రెడ్డితో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యాభివృద్ధికి ఆయన చేసిన సేవలు కొనియాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, నర్సింగరావు, కార్యాలయ అధికారులు తదితరులు ఉన్నారు. -
‘పత్తి రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు’
ఉండవెల్లి: పత్తి రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా.. సీసీఐ కేంద్రానికి వచ్చిన పత్తిని వెంటనే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే విజయుడు అధికారులకు సూచించారు. ‘కొనుగోళ్లలో కొర్రీలు’ అనే శీర్షిక మంగళవారం సాక్షి దినపత్రికలో ప్రచురించిన కథనానికి ఎమ్మెల్యే విజయుడు స్పందించి ఉండవెల్లి శివారులోని సీసీఐ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో అక్కడ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకొని సీసీఐ అధికారితో మాట్లాడారు. ప్రతి రైతు పత్తిని సాగు చేసినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు అనేక నష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు. వర్షాలకు పత్తి దిగుబడి తగ్గి, ఆర్థికంగా నష్టపోతుంటే సీసీఐ అధికారులు సైతం వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కపాస్ యాప్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని కోరారు. అకాల వర్షాల కారణంగా పత్తి రంగు మారిందని, తేమ శాతం విషయంలో కొన్ని నిబంధనలు సడలించి కొనుగోలు చేయాలని వ్యవసాయ మంత్రి ఆదేశించినా.. అధికారులు రైతులను ఇ బ్బందులకు గురిచేస్తున్నారని అసహనం వ్య క్తం చేశారు. ఉన్నతాధికారులు రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. సీసీఐ అధికారి రాహుల్పై ఎమ్మెల్యే విజయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్, మార్కెటింగ్ అధికారులతో ఫోన్లో మాట్లాడి పత్తి రైతులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో పీఏసీఎఎస్ చైర్మన్ గజేందర్రెడ్డి, నాయకులు నాగేశ్వర్రెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
గద్వాల: పాఠశాలలను పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వజ్ర ఫంక్షన్హాల్లో డీఆర్డీఏ యూనిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిశోర బాలికల సమస్యలు, పాఠశాలలో వాష్ వాటర్ శాంక్షన్ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ మాట్లాడుతూ చదువుకునే ప్రదేశంలో బాలికలకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం 94 పాఠశాలల వాష్ సర్వే నివేదికను విడుదల చేశారు. నర్సింహారెడ్డి సర్వే వివరాలు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలికల విద్యా ప్రగతి కోసం పాఠశాలలో పరిశుభ్రత, తాగునీటి సదుపాయాలు మరుగుదొడ్లు, నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. కార్యక్రమంలో యూనిసెఫ్ ఆఫీసర్ మురళీకృష్ణ తదితరులు ఉన్నారు. -
ఆయిల్పాం సాగుతో దీర్ఘకాల లాభాలు
రాజోళి: రైతులు ఆయిల్పాం తోటలను పెంచడం వల్ల ప్రభుత్వం ద్వారా అందే సబ్సిడీ పొందడమే కాకుండా, ఆర్థికంగా లాభపడతారని జిల్లా వ్యవసాయ సహకార అధికారి జి.శ్రీనివాస్ అఽన్నారు. ఉద్యానవన శాఖ అధికారులతో కలిసి ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో మండలంలోని మాన్దొడ్డిలో ఆయిల్పాం సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంప్రదాయ పంటలకు స్వస్తి పలికి ఆయిల్పాం తోటలను సాగు పెంచడం ద్వారా ఒకసారి పెట్టుబడి పెడితే దీర్ఘకాలం ఆదాయం సమకూరుతుందన్నారు. కొద్దిపాటి పెట్టుబడితో లాభాలు ఆర్జించే ఆయిల్పాం సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు గోపాల్రెడ్డి, ఉద్యానవన అధికారులు రాజశేఖర్, మహేష్, యశ్వంత్, త్రిక్రమ్, అశోక్వర్ధన్రెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
25 ఎకరాల్లో సాగు చేశా..
నేను దాదాపు 25 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశా. పత్తి తీసేందుకు కూలీల కొరత ఉండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నందికొట్కూర్ ప్రాంతం నుంచి తీసుకొస్తున్నా. కేజీ పత్తి తీసేందుకు రూ.16 చెల్లించడంతో పాటు ఆటో చార్జి ఒక్కొక్కరికి రూ.120 నుంచి రూ. 150 వరకు ఇవ్వాల్సి వస్తోంది. అకాల వర్షాలతో పత్తితీత కష్టమైంది. ఈ ఏడాది పెట్టుబడి అమాంతం పెరిగిపోయింది. – భీమ రాజు, రైతు, గోకులపాడు ఇతర ప్రాంతాల నుంచి.. అధిక వర్షాలతో పత్తి ఒకేసారి తీయాల్సి రావడంతో కూలీల కొరత ఏర్పడింది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి అధిక కూలి చెల్లించి కూలీలను తీసుకు రావాల్సి వస్తోంది. దీనికి రవాణా ఖర్చులు అదనం. వర్షాల కారణంగా పత్తి తడిసిందని కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర పలకడం లేదు. ఆదాయం పెట్టుబడి, కూలీలకే సరిపోయేలా లేదు. ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాల వద్ద కొర్రీలు పెట్టకుండా చూసుకోవాలి. – సంజీవనాయుడు, పైపాడు, వడ్డేపల్లి మండలం ● -
నిరంతర సాధన చేస్తే విజయం తథ్యం
గట్టు: ప్రతి విద్యార్థి నిరంతర సాధన, పట్టుదలతో శ్రమిస్తే విజయం సాధిస్తారని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి డాక్టర్ ప్రియాంక తెలిపారు. కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశాల మేరకు మంగళవారం బోయలగూడెం ఉన్నత పాఠశాలలో 9, 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణ తరగతులను ప్రియాంక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు నేర్చుకున్న విషయాన్ని బాగా అర్థ చేసుకొని, దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే వంద శాతం ఫలితం ఉంటుందన్నారు. విద్య అనేది మనకు లభించిన గొప్ప వరమని, చదువుకోవాలనే కోరిక బలంగా ఉంటే ఎలాంటి సబ్జెక్టు అయినా సులభంగా నేర్చుకోవచ్చన్నారు. విజయానికి మార్గం నిరంతర కృషి, సమయపాలన, ఆత్మవిశ్వాసం ముఖ్యమన్నారు. పరీక్షలు కేవలం మార్కుల కోసం కాకుండా జ్ఞానం కోసం రాయాలని సూచించారు. డిజిటల్ సాధనాలను సద్వినియోగం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సత్తా చాటాలని ఆకాంక్షించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఉపాధ్యాయులుకు సూచించారు. కార్యక్రమంలో హెడ్మాస్టర్ శ్రీధర్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
గల్లీ గల్లీలో గంజాయి
మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో గల్లీగల్లీలో గంజాయి గుప్పుమంటుంది. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన గంజాయి మహమ్మారి ఇప్పుడు పల్లెలోకి ప్రవేశించింది. వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేసుకొని క్రయవిక్రయాలు చేపట్టేస్థాయికి చేరుకుంది. గంజాయికి బానిసలుగా మారిన యువతే విక్రేతలుగా అవతారం ఎత్తుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎకై ్సజ్ టాస్క్ ఫోర్స్ బృందాలు, పోలీసులు జరుపుతున్న దాడుల్లో 16–30 ఏళ్ల వయసు వారే అత్యధికంగా పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది. కొందరు టీనేజర్లు చెడు స్నేహాలతో పక్కదారి పడుతున్నారు. చదువులతో పాటు జీవితాలనూ నాశనం చేసుకుంటున్నారు. ప్రధానంగా మెడికల్, ఫార్మసీ, నర్సింగ్, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంటర్ వంటి కళాశాల దగ్గర ముఠాలు అడ్డాలు ఏర్పాటు చేసుకుని మత్తు పదార్థాల విక్రయాలకు తెగబడుతున్నారు. మహబూబ్నగర్తో పాటు జడ్చర్ల, నాగర్కర్నూల్, అచ్చంపేట, గద్వాల, నారాయణపేట కేంద్రాల్లో సరఫరా అధికంగా ఉంటోంది. హైదరాబాద్, సరిహద్దు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో పాటు మహారాష్ట్ర, జార్ఖండ్, బిహార్, ఒడిశా, యూపీ నుంచి కూడా కొందరు గంజాయి తెప్పించి విక్రయిస్తున్నారు. ఉమ్మడి పాలమూరులో జిల్లాలో ఈ ఏడాది ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో 41 కేసులు నమోదయ్యాయి. అందులో అత్యధికంగా మహబూబ్నగర్లో 17, వనపర్తిలో 8, గద్వాలలో 4, నాగర్కర్నూల్లో 6, నారాయణపేటలో 6 కేసులున్నాయి. ఇదే స్థాయిలో పోలీసుశాఖ ఆధ్వర్యంలోనూ గంజాయిను పట్టుకొని కేసులు నమోదు చేశారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు మహబూబ్నగర్ ఎకై ్సజ్ పోలీసులు చేసిన విచారణలో పీజీ మెడిసిన్ చదువుతున్న ముగ్గురు వైద్యులు ఎండు గంజాయి వాడుతున్నట్లు నిర్ధారణ అయింది. వారితో పాటు ఎంబీబీఎస్, నర్సింగ్, పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులు వీటిని అధికంగా వాడుతున్నట్లు తేలింది. మహబూబ్నగర్లో ఒకరిద్దరూ ప్రాక్టీస్లో ఉన్న వైద్యులు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా ఆటో డ్రైవర్లు, పెయింటర్స్, చదువు వదిలేసి తిరుగుతున్న టీనేజర్లు గ్రూప్లుగా ఏర్పడి గంజాయి విక్రయించడంతో పాటు వాడకం మొదలుపెట్టారు. ఐదు గ్రాముల ఎండు గంజాయి పాకెట్ను రూ.500లకు విక్రయిస్తుంటే.. కేజీ ఎండు గంజాయి రూ.1 లక్షకు విక్రయిస్తున్నారు. ఎండు గంజాయిని ఒక లిక్విడ్లో బాగా ఉడికించిన తర్వాత చాక్లెట్స్ మాదిరిగా తయారు చేయడంతో పాటు యాషెష్ అయిల్గా తయారు చేసి అందులో వచ్చే లిక్విడ్ సీరంను సిగరెట్లలో చుక్కలు చుక్కలుగా వేసుకొని పీలుస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జోగుళాంబ గద్వాల జిల్లాలో ఓ గ్యాంగ్ రాత్రివేళ గంజాయి మత్తులో పట్టణంలో బీభత్సం సృష్టించారు. దీంతో 13 మంది యువకులను అరెస్టు చేయడంతో పాటు మరో 25 మందిని బైండోవర్ చేశారు. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం గోకుల్నగర్లో గంజాయి మత్తులో ఓ యువకుడు కన్నతల్లిని పారతో నరికి చంపేసిన ఘటన చోటు చేసుకుంది. అలాగే నాగర్కర్నూల్ జిల్లా పెద్దపూర్ వద్ద ఓ ఆర్టీసీ డ్రైవర్పై గంజాయి మత్తులో ఇద్దరు యువకులు దాడి చేశారు. 19 ఇంటెలిజెన్స్ బృందాల ఏర్పాటు ఉమ్మడి జిల్లాలో 14 ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో నాలుగు డీటీఎఫ్ బృందాలు, 19 ఇంటెలిజెన్స్ బృందాలు ఏర్పాటు చేశాం. ఇంటెలిజెన్స్ బృందాలు నిత్యం ఆయా స్టేషన్ పరిధిలో గంజాయి సరఫరా, కొనుగోలు విక్రయాలు ఎక్కడ జరుగుతున్నాయి అనే సమాచారం తెలుసుకుని తనిఖీలు చేసి సీజ్ చేయాల్సి ఉంటుంది. ఒడిశా, బిహార్, యూపీ కూలీలపై ప్రత్యేక నిఘా పెట్టాం. విద్యార్థుల్లో 2 నుంచి 3శాతం మంది గంజాయి వాడుతున్నట్లు నిర్ధారణ అయింది. వీరు మిగిలిన విద్యార్థులకు అలవాటు చేస్తున్నారు. దీనిని కట్టడి చేసేందుకు అవగాహన కార్యక్రమాలతో పాటు గంజాయి వాడే విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. – విజయ్భాస్కర్రెడ్డి, డీసీ ఎకై ్సజ్ శాఖ ఈ నెలలో నమోదైనగంజాయి కేసులు నవంబర్ 11వ తేదీ... మహబూబ్నగర్ ఎకై ్సజ్ సీఐ వీరారెడ్డి, ఎస్ఐ సుష్మ ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారుజామున అప్పన్నపల్లి సమీపంలో వాహనాలు తనిఖీలు చేస్తుంటే బ్రిజేష్కుమార్, శ్రీరాజ్ అనే ఇద్దరూ యువకులు ద్విచక్ర వాహనంలో 150 గ్రాముల ఎండు గంజాయి తరలిస్తుంటే పట్టుకున్నారు. బిహార్కు చెందిన బ్రిజేష్కుమార్ కొన్నిరోజుల నుంచి జడ్చర్ల మండలం ముదిరెడ్డిపల్లి సమీపంలో ఉన్న ఓ బీరువాల తయారీ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇటీవల బిహార్కు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో తీసుకొచ్చిన గంజాయిని మహబూబ్నగర్లోని శ్రీనివాసకాలనీకి చెందిన శ్రీరాజ్కు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. వీరి నుంచి 150 గ్రాముల గంజాయి, ఒక బైక్, ఒక ఫోన్ సీజ్ చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇదే రోజు నాగర్కర్నూల్ జిల్లా మన్ననూరులో 100 గ్రామలు గంజాయిని సీజ్ చేసి, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ 10వ తేదీ.. కోయిలకొండ మండలం గార్లపాడ్ వద్ద 260 గ్రాములు, జడ్చర్ల మండలం బండమీదిపల్లి శివారులో 305 గ్రామలు ఎండు గంజాయిని పట్టుకొని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ 2వ తేదీ... నారాయణపేట జిల్లా కృష్ణా పోలీసుస్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీల్లో 12.4 కేజీల గంజాయి పట్టుకోవడంతో పాటు నారాయణపేటతో పాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. నవంబర్ 7వ తేదీన నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి సమీపంలోని ఓ వెంచర్లో గంజాయి సేవిస్తున్న ఐదుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని 138 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాగా.. నిందితుల్లో ఒక బాలుడు కూడా ఉన్నాడు. నవంబర్ 6వ తేదీన జడ్చర్ల మండలం శంకరాయపల్లి తండా గేట్ వద్ద ఓ వ్యక్తిని అరెస్టు చేసి 116 గ్రాములు, నవంబర్ 1వ తేదీన జడ్చర్ల పట్టణంలో నలుగురు యువకులను అరెస్టు చేసి 240 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. పట్టణాల నుంచి పల్లెలకు విస్తరిస్తున్న మహమ్మారి బానిసలుగా మారుతున్న యువకులు, విద్యార్థులు మెడికల్, ఇతర కళాశాలల వద్ద గంజాయి అడ్డాలు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా సరఫరా -
విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి
గద్వాలటౌన్: విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవడంతో పాటు విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని డీఈఓ విజయలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో టీషాట్, ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాస్థాయి విద్యార్థుల వార్షిక పోటీలను నిర్వహించారు. బాలవక్త, వ్యాసరచన, క్వీజ్ పోటీలకు జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. మల్దకల్ మండలం అమరవాయి జడ్పీహెచ్ఎస్కు చెందిన కేశవర్థన్ బాలవక్త పోటీల్లో, ధరూర్ జెడ్పీహెచ్ఎస్కు చెందిన శివకుమార్ వ్యాసరచన, మానవపాడు జెడ్పీహెచ్ఎస్కు చెందిన అఖిల్సాయి క్విజ్ పోటీల్లో సత్తా చాటారు. వీరిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. బాలవక్త పోటీలలో విజేతగా నిలిచిన విద్యార్థి 12వ తేదీన హైదరాబాద్లో టీషాట్ నిర్వహించే లైవ్ ప్రోగ్రాంలో పాల్గొననున్నారు. వ్యాసరచన, క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులు 13వ తేదీన హైదరాబాద్లో నిర్వహించే లైవ్ ప్రోగ్రాంలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం ఏర్పాటు చేసిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో డీఈఓ విజయలక్ష్మి పాల్గొని ప్రశంసా పత్రాలు, మెమోంటోలను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. మొదటిసారి గ్రామీణ ప్రాంత విద్యార్థులు రాష్ట్రస్థాయి టీషాట్ లైవ్ ప్రోగ్రాంకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. రాష్ట్రస్థాయి పోటీలలో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి పట్టుదలతో సాధన చేస్తే ఏదైనా సాధ్యమని పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులను ప్రోత్సహించినప్పుడే మరింత ముందుకు వెళ్తారన్నారు. కార్యక్రమంలో ప్రతాప్రెడ్డి, అశోక్కుమార్, హేమలత, మహేష్, నర్సింహాస్వామి, విష్ణు, బాలజీ, కృష్ణకుమార్, వెంకటేశ్వర్రెడ్డి, రిటైర్డు ఎంఈఓ రాజు పాల్గొన్నారు. -
వైభవంగా రాములోరి కల్యాణం
ఎర్రవల్లి: శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురష్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో సోమవారం సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సీతారాముల విగ్రహాలను ముస్తాబుచేసి వేదమంత్రాల నడుమ వైభవంగా కల్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఆలయ చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, అర్చకులు భువనచంద్ర, దత్తుస్వామి, భానుమూర్తి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. -
జిల్లా ఇన్చార్జ్ వైద్యాధికారిగా కిరణ్మయి
గద్వాల క్రైం: జిల్లా ఇన్చార్జ్ వైద్యాధికారిగా కిరణ్మయి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకొన్న సమస్యలు, మౌలిక వసతులపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. రోగులకు సరిపడా మందులు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది రాజు, ప్రసన్నరాణి, రిజ్వానా తన్వీర్, వరలక్ష్మీ, శ్యాంసుందర్, మదుసూధన్రెడ్డి తదితరులు ఉన్నారు. ‘ప్రజావాణిశ్రీకి 61 వినతులు గద్వాలటౌన్: కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ సంతోష్, అడిషినల్ కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగరావు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ప్రజావాణి కొనసాగింది. మొత్తం 61 దరఖాస్తులు ప్రజావాణికి వచ్చాయి. ప్రజావాణిలో అధికారులు బాధితుల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించి వారి సమస్యలను ఓపికతో విన్నారు. ఆయా సమస్యలను అడిగినప్పుడు సంబంధిత శాఖల అధికారులను పిలిపించి పరిష్కరించాలని సూచించారు. వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆసరా పెన్షన్లు, భూసంబంధిత, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, ఉపాధి, విద్యుత్తు తదితర సమస్యలపై వినతలు వచ్చాయి. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పట్ల అలసత్వం వద్దని కలెక్టర్.. సంబంధిత అధికారులకు సూచించారు. పోలీస్ గ్రీవెన్స్కు 10 అర్జీలు.. గద్వాల క్రైం: పోలీస్ గ్రీవెన్స్లో భాగంగా వివిధ గ్రామాలకు చెందిన వారి నుంచి ఎస్పీ శ్రీనివాసరావు ఫిర్యాదులు స్వీకరించారు. ప్రధానంగా భూ వివాదం, ఆస్తి తగదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడం లేదని ఇలా 10 మంది ఫిర్యాదులు అందాయి. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తామని బాధితులకు ఎస్పీ సూచించారు. వేరుశనగ క్వింటా రూ.6,749 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు సోమవారం 1187 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.6749, కనిష్టం రూ.2929, సరాసరి రూ.6239 ధరలు లభించాయి. -
పేదల సొంతింటి కల సాకారం
గట్టు: పేదల సొంతింటి కల ప్రజాపాలనలో సీఎం రేవంత్రెడ్డి సహకారం చేసినట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. సోమవారం ఆరగిద్దలో గద్వాల నియోజక వర్గంలో నిర్మించిన తొలి ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆరగిద్దకు చెందిన మాదిగుండులక్ష్మీ, కుమ్మరిసుజాత, మాలపార్వతమ్మలకు మొదటి దశలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, వారు నిర్మాణాలను పూర్తి చేశారు. ఈ ముగ్గురు లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే గృహ ప్రవేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను అరగిద్దకు చెందిన లబ్దిదారులు పూర్తి చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. లబ్ధిదారులకు విడతల వారిగా రూ.5 లక్షలను వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని, నియోజక వర్గానికి 3500 ఇండ్లు మంజూరు కాగా, 1500పైగానే నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నట్లు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేదల సొంతింటి కల ఇప్పటికి నేరవేరినట్లు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డితో పాటుగా గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకటేష్, వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్ శ్రీధర్గౌడ్, మాజీ ఎంపీపీ విజయ్కుమార్, నాయకులు రమేష్నాయుడు, మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దళారులను నమ్మి మోసపోవద్దు
ఎర్రవల్లి: రైతులు ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. సోమవారం మండలంలోని బీచుపల్లిలో పుటాన్దొడ్డి పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన వసతులతో పాటు టార్పాలిన్ కవర్లు, ఖాళీ సంచులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యాన్ని ఎప్పటికప్పుడూ సెంటర్ నుంచి తరలించి రైతు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని, వెంటనే ఖాతా ద్వారా నగదును జమచేయాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రంగారెడ్డి, ఏఓ సురేష్గౌడ్, ఏఈఓ నరేష్, నాయకులు నారాయణ నాయుడు, హనుమంతురెడ్డి, రవీందర్రెడ్డి, ఈరన్న, సుదాకర్, రైతులు, తదితరులు ఉన్నారు. -
అడ్డగోలుగా నియామకాలు..!
పాలమూరు యూనివర్సిటీలో పైరవీలకు పెద్దపీట ●విచారణ చేపట్టాలి.. ఏ ప్రభుత్వ సంస్థల్లో చేపట్టని విధంగా పీయూలో నియామకాలు చేపడుతున్నారు. యూనివర్సిటీలో నేరుగా భర్తీ చేపట్టిన ఏజెన్సీలను రద్దు చేయాలి. మధ్యవర్తులుగా వ్యవహరించి డబ్బులు తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి. నియామకాలపై కమిటీతో విచారణ చేపట్టాలి. – రాము, ఏఐఎస్ఎఫ్ నాయకులు ఏజెన్సీలే భర్తీ చేస్తాయి.. అవసరాల మేరకు కొల్లాపూర్, గద్వాలతో పాటు పలువురు సిబ్బందిని ఔట్సోర్సింగ్ విధానంలో తీసుకున్నాం. గురుకులాలు ఇతర సంస్థలలో నియామకాలు ఎలా చేపడుతున్నారో తెలియదు కానీ యూనివర్సిటీల్లో మాత్రం ఔట్సోర్సింగ్ సిబ్బందిని ఏజెన్సీలే భర్తీ చేస్తాయి. అందుకు యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం ఉండదు. ఒకవేళ అర్హత లేని వారిని తీసుకుంటే తొలగిస్తాం. – రమేష్బాబు, రిజిస్ట్రార్, పీయూమహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో అధికారులు అడ్డగోలుగా సిబ్బంది నియామకం చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి నోటిఫికేషన్, పత్రికా ప్రకటన, రోస్టర్ విధానం వంటి ప్రక్రియలు చేపట్టకుండా నేరుగా సిబ్బందిని పైరవీల ద్వారా తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా గద్వాల పీజీ సెంటర్, కొల్లాపూర్ పీజీ సెంటర్, పీయూతో పాటు సుమారు 35 నుంచి 36 మంది వరకు సిబ్బందిని వివిధ ఏజెన్సీల ద్వారా నియమించినట్లు సమాచారం. ఇందులో కుక్, హెల్పర్, కేర్ టేకర్, వాచ్మెన్ వంటి పోస్టులు ఉన్నాయి. నేరుగా ఏజెన్సీల ద్వారా వీరిని నియమించడంతో ఏజెన్సీలకు పలువురు మధ్యవర్తులుగా ఉండి తమకు కావాల్సిన వారిని చేర్పించారు. ఈ క్రమంలో పలు పోస్టులకు సిబ్బంది నుంచి డబ్బులు సైతం వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ద్వారా వేతనాలు చెల్లిస్తూ.. ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి వసతులు కల్పిస్తూ నియమించే ఉద్యోగాలకు బయటి వ్యక్తులు, ఏజెన్సీలు నియమించుకోవడం ఏమిటని విమర్శలు వస్తున్నాయి. సిబ్బందిని నియమించిన తర్వాత ఆర్డర్లు సైతం ఇవ్వకుండా అధికారుల వద్దే పెట్టుకొని.. నేరుగా వేతనాలు ఇస్తున్నారు. ఎక్కడెక్కడ ఎంత మంది.. మూడు నెలల క్రితం గద్వాల పీజీ సెంటర్లో బాలికలు, బాలుర హాస్టళ్లను అధికారులు ప్రారంభించారు. ఈ క్రమంలో రెండు హాస్టళ్లకు సంబంధించి ఇద్దరు కుక్, ఇద్దరు హెల్పర్, ఒక కేర్ టేకర్, 9 మంది సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు. అలాగే కొల్లాపూర్ పీజీ సెంటర్లో 9 మంది సెక్యూరిటీ సిబ్బంది, కేర్టేకర్, కుక్, హెల్పర్ ఒక్కొక్కరిని నియమించారు. అయితే ఈ ప్రక్రియలో పలువురు మధ్యవర్తులుగా కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. దీంతో పాటు పీయూలో కేర్టేకర్లు, కుక్లు, సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు. ఇందులో ఓ మహిళా అధికారి పలువురు సిబ్బందిని నియమించేందుకు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. పలువురు సిబ్బందితో డబ్బులు తీసుకోవడంతోపాటు భవిష్యత్లో నియమించే పోస్టులకు సైతం ముందస్తు ఒప్పందాలను సదరు మహిళ చేసుకున్నట్లు సమాచారం. ఇందుకు ఏజెన్సీలో పనిచేసే మరో వ్యక్తి సైతం సిబ్బంది నియామకాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాలన్నీ వీసీ, రిజిస్ట్రార్లకు తెలిసినా వారికే మద్దతుగా నిలుస్తున్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా.. అన్ని విద్యాసంస్థలకు ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగుల భర్తీని ప్రభుత్వం చేపడుతుంది. అందులో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలతో పాటు యూనివర్సిటీలకు కూడా ఔట్సోర్సింగ్ సిబ్బందిని నియమించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో గురుకులాల్లో స్కావెంజర్ పోస్టు నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకు సిబ్బందిని నియమించాలంటే తప్పకుండా పత్రికా ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించి మెరిట్ మార్కులు, తదితర స్కిల్స్కు సంబంధించి సర్టిఫికెట్, రిజర్వేషన్ తదితర అంశాల ఆధారంగా రోస్టర్ తయారు చేయాల్సి ఉంటుంది. ఇందులో మొదటి పాయింట్ వచ్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలి. అనంతరం ఎంపిక చేసిన వారిని ఏజెన్సీలకు అప్పగించి ఆర్డర్స్ ఇస్తారు. కానీ, యూనివర్సిటీ అధికారులు మాత్రం ఇవేమీ పట్టనట్లు కేవలం ఏజెన్సీలు తీసుకువచ్చి చూపించిన వారికే ఉద్యోగాలు ఇవ్వడం కొసమెరుపు. అంతేకాకుండా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ద్వారా కూడా సీనియార్టీ ఆధారంగా కూడా భర్తీ చేసే విధానం ఉంది. ఉన్న వారికి జీతాలేవీ? పీయూలో పనిచేస్తున్న 42 మంది పార్ట్టైం లెక్చరర్లకు కొన్ని నెలలుగా పూర్తిస్థాయిలో వేతనాలు అందడం లేదు. పని ఒత్తిడి తగ్గించడంతో వేతనాలు పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఇక ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందికి రెండు నెలల వేతనాలు ఇవ్వలేదు. దసరా, దీపావళి పండగలకు సైతం వేతనాలు ఇవ్వకపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటికి తోడు సెక్యూరిటీ సిబ్బందికి సైతం రెండు నెలల వేతనాలు ఇవ్వాల్సి ఉండగా 10 రోజుల క్రితం ఒకనెల వేతనం రూ.10 వేలు ఖాతాలో జమచేశారు. గతంలో రూ.11 వేలు ఇవ్వగా ప్రస్తుతం దాన్ని రూ.వెయ్యి తగ్గించి ఇవ్వడాన్ని సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వేతనం పెంచాల్సింది పోయి తగ్గించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల గద్వాల పీజీ సెంటర్ 14, కొల్లాపూర్ పీజీ సెంటర్లో 11 మంది నియామకం యూనివర్సిటీలోనూ 9 మంది వరకు అవకాశం.. ఎలాంటి ప్రకటనలు, రోస్టర్ విధానం లేకుండా చేపట్టడంపై విమర్శలు మధ్యవర్తులు చెప్పిన వారికే ఉద్యోగాలు? -
పైరవీదారులకు ప్రాధాన్యం..
సీసీఐ కేంద్రం వద్ద పైరవీలు లేనిదే పత్తి కొనుగోలు చేయడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. అయిజ, వడ్డేపల్లి మండలాల నుంచి అధికంగా పత్తి తీసుకువస్తుండగా.. సీసీఐకు మహిళా రైతులు, బాలింతలు కూడా వచ్చిన పడిగాపులు తప్పట్లేదు. రైతులు స్లాట్ను ఏ రోజు ది ఆ రోజే బుక్ చేయాలని అధికారులు చెప్పడం గమనార్హం. మరోవైపు సీసీఐ అధికారి, మార్కెటింగ్ అధికారులపై ఎన్నో ఆరోపణలు వస్తున్నా, ఆందోళనకు దిగుతున్నా ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడంలేదని, వరుస క్రమంలో వచ్చిన రైతుల వాహనాలను అన్లోడ్ చేయకుండా, తేమ శాతం పరిశీలించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, రైతుల సమస్యలను పట్టించుకొని పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. -
రైతులకు ఇబ్బందులు రానివ్వొద్దు
గద్వాలటౌన్: జిల్లాలో మొత్తం 81 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకుగాను ఇప్పటికే 76 ప్రారంభించామని, ఎక్కడా రైతులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ సంతోష్ తెలిపారు. వరి ధాన్యం, పత్తి, మొక్కజోన్న, సోయా కొనుగోలు కేంద్రాలతో పాటు అకాల వర్షాలతో రైతులు పండించిన పంటలు దెబ్బతినడం, ఇతర అంశాలపై సోమవారం సాయంత్రం హైదరాబాద్ సచివాలయం నుంచి మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, ఉత్తమ్ కుమార్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధింత అధికారులతో వీడియో కాన్పరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈక్రమంలో కలెక్టర్ సంతోష్ కొనుగోలు కేంద్రాలలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రులకు వివరించారు. త్వరలో మరికొన్ని కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగరావు, పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి స్వామికుమార్, మేనేజర్ విమల, వ్యవసాయ అధికారి జగ్గునాయక్, జిల్లా మార్కెటింగ్ అధికారిణి పుష్పమ్మ, ఉద్యానవన శాఖ అధికారి అక్బర్, కోఆపరేటివ్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోళ్లలో కొర్రీలు..!
పత్తి రైతుల ఆందోళన ● తేమ శాతం ఎక్కువుందని, నల్లబారిందంటూ తిప్పిపంపుతున్న వైనం ● సీసీఐ కేంద్రం వద్ద రోజుల తరబడి పడిగాపులు ● దళారుల పత్తి యథేచ్ఛగా కొనుగోలు నిబంధనల పేరుతో.. విత్తు విత్తనం నుంచి పంట చేతికొచ్చేంత వరకు రూ.లక్షలు పెట్టుబడి పెట్టామని.. మరోవైపు భారీ వర్షాలు, అనుకూలించని వాతావరణంతో పంట కొంత మేర నష్టపోయామని, తీరా వచ్చిన పంట విక్రయిద్దామని వస్తే నిబంధనల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఎకరాకు 12 క్వింటాళ్లకు బదులు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటన విడుదల చేయడంతో అప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న రైతులు జాతీయ రహదారిపై వాహనాలతో ఇటీవల రెండు సార్లు ఆందోళనకు దిగారు. జిల్లా అధికారులు కలగజేసుకొని.. సమస్య పరిష్కరించారు. సోమవారం సైతం అవే కొర్రీలు పెడుతూ పత్తి రైతులను తిప్పి పంపడం, రోజుల తరబడి ఎదురుచూసేలా చేయడంతో దిక్చుతోచడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉండవెల్లి: ఎకరాకి ఏడు క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తాం.. పత్తిలో తేమ శాతం ఎక్కువైంది.. పత్తి నల్లబారింది.. నాణ్యతగా లేదు.. అంటూ సీసీఐ కేంద్రం నిర్వాహకులు ఎన్నో కొర్రీలు పెడుతుండడంతో పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉండవెల్లి శివారులో జాతీయ రహదారి సమీపంలో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే, ఆది నుంచి ఈ కేంద్రంలో దళారుల రాజ్యం నడుస్తోందనే ఆరోపణలు వినవస్తున్నాయి. సీసీఐ అధికారుల కింద ఉన్న ముగ్గురు వ్యక్తులే మొత్తం దందా నడిపిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. దళారులకు సంబందించిన వాహనాలను యథేచ్ఛగా ముందుకు అనుమతిస్తుండగా.. వీరికి అక్కడున్న మార్కెటింగ్ అధికారులు కూడా ఒత్తాసు పలుకుతున్నారని రైతులు పేర్కొంటున్నారు. తాము స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు పడిగాపులు పడుతుండగా.. దళారులకు మాత్రం స్లాట్ ఎలా బుక్ అవుతుందని, సీసీఐ సిబ్బంది కొందరు వారికి సాయపడుతున్నారని ఆరోపిస్తున్నారు. రోజుల తరబడి ధాన్యం లోడుతో జాతీయ రహదారిపై భయం భయంగా గడుపుతున్నామని.. దళారుల వాహనాలు మాత్రం ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అన్లోడ్ చేశాక తిప్పి పంపారు.. పత్తిలొ తేమ శాతం పరిశీలించాక వాహనాన్ని లోపలికి అనుమతించారు. సగానికిపైగా అన్లోడ్ చేశాక సీసీఐ అధికారి వచ్చి వాగ్వాదానికి దిగాడు. 60 క్వింటాళ్లు కొనుగోలు చేయాల్సి ఉండగా.. 40 క్వింటాళ్లే కొనుగోలు చేసి మిగతాది రిజెక్ట్ చేశారు. సీసీఐ అధికారి కేవలం తేమ శాతం మాత్రమే పరిశీలించాలి. వర్షానికి పత్తి కొద్దిగా నల్లబారితే.. క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయమని తిప్పిపంపారు. స్లాట్ సమయం ముగిసిపోతుంది అని చెప్పినా పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలి. – రామకృష్ణ, పత్తి రైతు, ఉదండాపురం, ఇటిక్యాల మండలం -
న్యాయవాదులకు రక్షణ కల్పించాలి
అలంపూర్: న్యాయవాదులకు రక్షణ కల్పించాలని అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గవ్వల శ్రీనివాసులు కోరారు. అలంపూర్ పట్టణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆదివారం న్యాయవాదులు అలంపూర్ టు హైదరాబాద్కు పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా న్యాయవాదులు జోగుళాంబ అమ్మవారి బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని మహాత్మాగాంధీ, మహాత్మా జ్యోతిబా పూలే, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హైదరాబాద్కు పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో న్యాయవాదులపై దాడులు పెరిగాయని, ఎక్కడో ఒక చోట నిరంతరం భౌతిక దాడుల సంఘటనలు చోటు చేసుకోవడం ఆందోళనకు గురి చేస్తోందన్నారు. అందుకే న్యాయవాదులకు రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. జూనియర్ న్యాయవాదులకు రూ.వేల స్టైఫండ్, అందరికి హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 41(ఏ ), బీఎన్ఎస్ సెక్షన్ 35(1) అమైన్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల రక్షణ చట్టం అమలుతోపాటు డిమాండ్లను పరిష్కరించాలన్నారు. పాదయాత్ర పది రోజులపాటు కొనసాగుతుందని తెలిపారు. పాదయాత్ర బృందం హైదరాబాద్ చేరుకొని రాష్ట్ర గవర్నర్, హైకోర్టు జడ్జి, ముఖ్యమంత్రిని కలిసి సమస్యలు విన్నవించి వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నరసింహ్మ, బార్ అసోసియేషన్ నాయకులు నారాయణరెడ్డి, తిమ్మారెడ్డి, శ్రీధర్ రెడ్డి, గజేంద్ర గౌడ్, ఆంజనేయులు, మధు, వెంకటేష్, హేమంత్ యాదవ్, యాకూబ్, నాగయ్య తదితరులు ఉన్నారు. పాదయాత్రకు ప్రముఖుల మద్దతు సమస్యల పరిష్కారం కోసం అలంపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రకు ప్రముఖ న్యాయవాదులు మద్దతు తెలిపారు. తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి, సిట్టింగ్ స్టేట్ బార్ మెంబర్ హనుమంతు రెడ్డి, మహబూబ్నగర్ సీనియర్ న్యాయవాది వెంకటేష్, షాద్నగర్ న్యాయవాది జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మద్దతు తెలిపారు. -
అదిగో.. పులి
అచ్చంపేట: రాష్ట్రంలో పులుల సంఖ్య తెల్చేందుకు అటవీశాఖ సిద్ధమైంది. జాతీయ పులుల సంరక్షణ యాజమాన్యం (ఎన్టీసీఏ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నాలుగేళ్లకోసారి.. రాష్ట్రస్థాయిలో అటవీశాఖ ప్రతి ఏటా జంతుగణన చేపడుతోంది. ఇందులో భాగంగా నల్లమలలో పులుల లెక్కింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఈసారి పులుల గణన–2026లో పాల్గొనేందుకు ఆసక్తి గల స్వచ్ఛంద సంస్థల వలంటీర్లు, జంతు ప్రేమికులు, ఔత్సాహిక యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 18– 60 ఏళ్ల వయసు కలిగి.. రోజూ అడవి మార్గంలో 10– 15 కి.మీ., వరకు నడిచే సామర్థ్యం కలిగి ఉండాలి. ఇది పూర్తిగా స్వచ్ఛంద కార్యక్రమం కావడంతో ఎలాంటి పారితోషికం ఇవ్వరు. అవసరమైన వసతి, రవాణా సౌకర్యం అటవీశాఖ కల్పిస్తుంది. వచ్చే జనవరి 17 నుంచి 23వ తేదీ వరకు అమ్రాబాద్ (నల్లమల) అభయారణ్యంలోని 220 అటవీ బీట్లలో పులుల గణన చేపట్టనున్నారు. ఈసారి డెహ్రాడూన్ వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) వన్యప్రాణుల గణనను సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. పులులతోపాటు ఇతర శాఖాహార, మాంసాహార జంతువుల లెక్కింపు చేపట్టనున్నారు. అతిపెద్ద టైగర్ రిజర్వు.. దేశంలోని 50 పులుల అభయారణ్యంలో అమ్రాబాద్ 45వ స్థానంలో ఉండగా.. దక్షిణ భారతదేశంలో ఇదే అతిపెద్ద టైగర్ రిజర్వు ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. ఇక్కడ పులుల అభయారణ్యం 2,611.39 చదరపు కి.మీ., మేర విస్తరించి ఉంది. ఇందులో 2,166.37 చదరపు కి.మీ., అభయారణ్యం కాగా.. 445.02 చదరపు కి.మీ.. బఫర్ జోన్. ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల అడవులను అమ్రాబాద్ పులుల అభయారణ్యంగా పరిగణిస్తారు. అమ్రాబాద్, మద్దిమడుగు, మన్ననూర్, దోమలపెంట, అచ్చంపేట, లింగాల, కొల్లాపూర్, నాగర్కర్నూల్, దేవరకొండ, కంబాలపల్లి, నాగార్జునసాగర్ రేంజ్లను 270కి పైగా బీట్లుగా విభజించి గణన చేపడుతున్నారు. కెమెరా ట్రాప్ ద్వారా సేకరించిన ప్లగ్ మార్కులు, గుర్తులను అక్కడికక్కడే ఎకనామికల్ యాప్లో అప్లోడ్ చేస్తారు. పులుల మనుగడకు ఆవశ్యకతగా ఉండే శాఖాహార జంతువుల సంఖ్య పెరుగుతుందా.. తగ్గుతుందా.. అనే వివరాల మేరకు పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వులో జంతుగణన–2026కు సిద్ధం జనవరి 17 నుంచి 23 వరకు కొనసాగనున్న ప్రక్రియ ఈసారి లెక్కింపులో ఔత్సాహిక యువకులకు అవకాశం స్వచ్ఛంద సంస్థల వలంటీర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం ఈ నెల 22తోముగియనున్న స్వీకరణ గడువు పెద్ద పులులకు పుట్టినిల్లు.. నల్లమల అటవీ ప్రాంతం పెద్ద పులులకు పుట్టినిల్లుగా మారుతోంది. 200పైగా పులులు స్వేచ్ఛగా సంచరించేందుకు అమ్రాబాద్ టైగర్ రిజర్వు (ఏటీఆర్) ఉంది. ఇక్కడ ఆరేళ్లుగా పులుల సంతతి పెరుగుతోంది. 2017 లెక్కల ప్రకారం 6 పులులు ఉండగా.. 2024– 25 జూలై వరకు 36కు పెరిగింది. అమ్రాబాద్ పులుల అభయారణ్యంలోని పులి కూనలతో కలిసి సంచరిస్తున్న ఫరాహా ఎఫ్–6 ఆడపులి, ఫరాహా ఎఫ్–6, తారా ఎఫ్–7, భౌరమ్మ ఎఫ్–18, ఎఫ్–26, ఎఫ్–53 ఆడపులులు వాటి సంతతి పెంచేందుకు తోడ్పడటంతోపాటు నల్లమలలో జీవవైవిధ్యానికి పాటుపడుతున్నాయి. -
జూరాల రహదారికి మోక్షం
●అమరచింత: ఉమ్మడి జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు రహదారి మరమ్మతులకు పీజేపీ అధికారులు ప్రతిపాదనలు పంపగా.. ప్రభుత్వం రూ.30 లక్షలు మంజూరు చేసింది. దీంతో అధికారులు త్వరలోనే టెండర్లను ఆహ్వానించి పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. నందిమళ్ల క్యాంపు నుంచి ప్రాజెక్టు మీదుగా గద్వాల, రాయచూర్ ప్రాంతాలకు నిత్యం వేలాది మంది తమ వ్యక్తిగత, వ్యాపార పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుండటంతో వందలాది వాహనాలు తిరుగుతుంటాయి. వీటితోపాటు జూరాల ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల పర్యాటకులు సైతం వస్తుంటారు. 4.50 కిలోమీటర్ల మేర ఉన్న ప్రాజెక్టు ప్రధాన రహదారి గుంతలుపడి అధ్వానంగా మారడంతో ప్రయాణికులు, వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టు రహదారిపై గద్వాలకు వెళ్తుండటంతో అప్పట్లో తాత్కాలిక మరమ్మతులు చేపట్టిన పీజేపీ అధికారులు.. నేటి వరకు పూర్తిస్థాయి మరమ్మతులకు పూనుకోకపోవడంతో రహదారిపై ప్రయాణం ప్రాణ సంకటంగా మారింది. ప్రస్తుతం నిధులు మంజూరు కావడం.. మరమ్మతుకు నోచుకోవడంతో రాకపోకల కష్టాలు తొలగిపోనున్నాయి. అడుగుకో గుంత.. పీజేపీ నందిమళ్ల క్యాంపు నుంచి రేవులపల్లి వరకు జూరాల జలాశయం ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతింది. అడుగడుకో గుంత ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొన్నిచోట్ల చిన్న గుంతలు, మరికొన్ని చోట్ల రహదారి మధ్యలో భారీ గుంతలు ఏర్పడటంతో రాకపోకల సమయంలో వాహనాల టైర్లు దెబ్బతింటున్నాయని భారీ వాహన డ్రైవర్లు వాపోతున్నారు. దీనికితోడు ఎదురుగా వస్తున్న ద్విచక్ర, ఆటోలను తప్పించబోయి ప్రమాదాల బారినపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రత్యేక రాష్ట్రంలో ప్రాజెక్టు రూపురేఖలు మారుతాయని ఈ ప్రాంత ప్రజల ఆశలు నేటికీ పూర్తిస్థాయిలో నెరవేరలేకపోతున్నాయి. ప్రస్తుతం రహదారి మరమ్మతుకు నిధులు మంజూరయ్యాయని తెలియడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతుకు రూ.30 లక్షలు మంజూరు బాగుపడనున్న 4.50 కిలోమీటర్ల రోడ్డు టెండర్ల ఆహ్వానానికి సిద్ధమవుతున్న అధికారులు తీరనున్న ప్రయాణికుల కష్టాలు కుడి, ఎడమ కాల్వల పరిధిలో.. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల పరిధిలోని రహదారి పూర్తిస్థాయిలో దెబ్బతినడంతో ద్విచక్ర వాహనదారులు సైతం వ్యయ ప్రయాసాలకోర్చి రాకపోకలు సాగించే దుస్థితి నెలకొంది. దీనికితోడు ఎడమ కాల్వ వద్ద చేప వంటకాల విక్రయ కేంద్రాలు ఉండటంతో పర్యాటకులతో పాటు చేప వంటకాలు ఆరగించేందుకు ప్రజలు రోజు వేలాదిగా సొంత వాహనాల్లో ఇక్కడికి వస్తుంటారు. వాహనాలన్నీ కాల్వ సమీపంలోని ప్రధాన రహదారిపై నిలుపుతుండటంతో వచ్చి వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
రుణ లక్ష్యం.. రూ.1200 కోట్లు
యాసంగి పంట రుణ లక్ష్యం ఖరారు బ్యాంకు రైతుల రుణలక్ష్యం సంఖ్య ఎస్బీఐ 14,926 304.16 గ్రామీణ బ్యాంక్ 7,397 150.71 యూబీఐ 8,743 178.17 కెనరా బ్యాంక్ 6,952 141.96 ఇండియన్ బ్యాంక్ 6,020 122.49 హెచ్డీఎఫ్సీ 5,448 111.40 ఐసీఐసీఐ 3,719 75.97 టీఎస్ కోఆపరేటివ్ 2,181 44.03 సెంట్రల్ బ్యాంక్ 1,989 40.25 యాక్సిస్ 925 19.08 బ్యాంక్ ఆఫ్ బరోడా 179 4.13 కరూర్ వైశ్య బ్యాంక్ 185 3.40 కేబీఎస్ 105 2.26 పంజాబ్ నేషనల్ బ్యాంక్ 93 1.73 బ్యాంక్ ఆఫ్ ఇండియా 31 0.45 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 9 0.13 గద్వాలన్యూటౌన్: జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి యాసంగి పంట రుణ లక్ష్యం ఖరారు అయ్యింది. నడిగడ్డలో యాసంగి పంటలకు గాను 58,902 మంది రైతులకు రూ. 1200.58 కోట్లు రుణాలుగా అందించాలని లక్ష్యంగా నిర్దేశితమైంది. పంట పెట్టుబడులకి ఇక్కడి రైతులు బ్యాంకులు అందించే రుణాలపైనే అధారపడ్డారు. బ్యాంకర్లు సకాలంలో రుణాలు అందిస్తేనే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. నడిగడ్డ వ్యవసాయ ఆధారిత జిల్లా. ఇక్కడ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్ట్లతో పాటు, నెట్టెంపాడు ఎత్తిపోథల పథకం, దీని కింద ఏడు రిజర్వాయర్లు, వందకు పైగా చెరువులు, కుంటలు ఉన్నాయి. ఏటా రెండు సీజన్లలో దాదాపు 5లక్షల ఎకరాల వరకు వివిధ రకాల పంటలు సాగు చేస్తుంటారు. ఇంకా పండ్లతోటలు, కూరగాయలు పండిస్తున్నారు. జిల్లాలో తొంభైశాతం సన్న, చిన్నకారు రైతులు ఉన్నారు. జిల్లా వివరాలిలా.. (రూ.కోట్లలో) (09జిడియల్203–210034) పంట రుణాలపైనే రైతుల పెట్టుబడి ఆశలు వానాకాలం సీజన్లో 61 శాతం రుణ లక్ష్యం చేరిన వైనం బ్యాంకర్లు సకాలంలో అందిస్తేనే ప్రయోజనం అర్హులందరికీ పంట రుణాలు పంట పెట్టుబడుల్లో బాగంగా పంట రుణాలఉక ధరఖాస్తు చేసుకునే అర్హులైన రైతులందరికి రుణాలు అందిస్తాం. రుణాలు పొందాలనుకున్న రైతులు తప్పక రెన్యూవల్ చేసుకోవాలి. దీనివల్ల రుణాలు అందించడానికి వీలు అవుతుంది. యాసంగి సీజన్లో లక్ష్యం మేరకు రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీనివాసరావ్, ఎల్డీఎం -
42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమించాలి
గద్వాలటౌన్: స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా మరో ఉద్యమానికి సిద్ధం కావాలని బీసీ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక వాల్మీకి భవన్లో జరిగిన బీసీ చైతన్య సదస్సుకు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, బహుజన విద్యావేత్త అక్కల బాబుగౌడ్, బీసీ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్కుమార్తో పాటు జిల్లా బీసీ, బహుజన ఉద్యమ నాయకులు నాగర్దొడ్డి వెంకట్రాములు, మధుసూధన్బాబులు ప్రధాన వక్తలుగా హాజరై మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు, రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించే వరకు బీసీలు ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించే విషయంలో కొన్ని పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, బీసీల రిజర్వేషన్ల విషయంలో ఆ పార్టీలకు చిత్తశుద్ది లేదని విమర్శించారు. రాజ్యాంగంలో పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేసిన నాయకులు, బీసీ రిజర్వేషన్లను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్రంలోని అగ్రవర్ణ పాలకులు తాము ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి, రాష్ట్రపతి ఆమోదంతో గ్యారంటీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాజకీయ పార్టీలకు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సదస్సులో పలు తీర్మాణాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, వివిధ సంఘాల నాయకులు అతికూర్ రెహమాన్, వాల్మీకి, శంకర ప్రభాకర్, వినోద్కుమార్, కుర్వ పల్లయ్య, కృష్ణయ్య, రహిమతుల్లా, అచ్చన్నగౌడ్, నాగన్న, కిరణ్, నర్సింహా, రాంబాబు, ప్రకాష్, రాజు, తాహేర్, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. -
శివాలయ పునర్నిర్మాణానికి రూ.3.5లక్షలు విరాళం
గద్వాలటౌన్: జిల్లా కేంద్రంలోని నల్లకుంట శివాలయ పునర్నిర్మాణం కోసం భక్తులు విరాళాలు అందజేస్తున్నారు. సుమారు రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించే శివాలయ పునర్నిర్మాణంలో కాలనీ ప్రజలతో పాటు సమీప కాలనీల భక్తులు భాగస్వామ్యం అవుతున్నారు. ఆ దిశగా ఆలయ కమిటీ సభ్యులు దాతల నుంచి విరాళాలను సేకరిస్తున్నారు. ఆదివారం ప్రముఖ సీడ్ ఆర్గనైజర్ మేకలసోంపల్లి ప్రభాకర్రెడ్డి రూ.3,51,116ను విరాళంగా అందజేశారు. వీరితో పాటు మరికొందరు అలయ నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వహకులు పులిపాటి వెంకటేష్, వెంకట్రాములు, గోపాల్, నల్లారెడ్డి, రాంరెడ్డి, సోనీ వెంకటేష్, బాలాజీ, అల్లంపల్లి వెంకటేష్, రాజు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కనులపండువగా అయ్యప్ప మహా పడిపూజ గద్వాలటౌన్: శరణం.. శరణం అయ్యప్పా.. అంటూ జిల్లా కేంద్రంలో అయ్యప్పస్వామి నామస్మరణం, శరణు గోషతో మార్మోగాయి. ఆదివారం ఉదయం స్థానిక వెంకటరమణ కాలనీలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాలధారణ వేసుకున్న అయ్యప్పస్వాములతో పాటు మహిళలు, ఇతర భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అయ్యప్ప సేవలో తరించారు. అయ్యప్ప మాలాధారులు భక్తి పారవశంలో మునిగిపోయారు. ఈ సందర్బంగా నిర్వహించిన మహా పడిపూజ కనులపండువగా సాగింది. మహా పడిపూజ కార్యక్రమంలో భక్తులు శరణుఘోష దీక్షాధారులనే కాక, ఇతర భక్తులను పారవశ్యంలో ముంచెత్తింది. అయ్యప్పస్వామిని, మెట్లు తదితర వాటిని వైభవంగా అలంకరించారు. ఈ పూజా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డీకే భరతసింహారెడ్డి, పోతుల శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. (09జీడీయల్103 -
బీటీ రహదారి నిర్మించాలి..
నందిమళ్ల క్యాంపుకాలనీ నుంచి రేవులపల్లి వరకు కొత్తగా బీటీ రహదారి ని ర్మించాలి. రహదారికి తా త్కాలిక మరమ్మతు చేస్తే చిన్నప ాటి వర్షాలకే మ రోమారు దెబ్బతినే అవకాశం ఉంది. అధికారు లు, ప్రజాప్రతినిధులు స్పందించి మరమ్మ తు పక్కాగా చేపట్టాలి. – వెంకటేష్, నందిమళ్ల త్వరగా చేపట్టాలి.. ప్రాజెక్టు రహదారిపై నిత్యం వేల మంది ప్రయాణం చేస్తుంటారు. రూ.30 లక్షలతో చేపట్టే మరమ్మతు నాణ్యతగా పూర్తిచేసి రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు అధికారులు కృషిచేయాలి. పీజేపీ ప్రాజెక్టు రహదారి మరమ్మతు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. – రాజు, మస్తీపురం రూ.30 లక్షలతో మరమ్మతు.. జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వ పరిధిలోని మొత్తం 4.50 కిలోమీటర్ల మేర ఉన్న ప్రధాన రహదారి మరమ్మతుకు రూ.30 లక్షలతో ప్రతిపాదనలు పంపించాం. త్వరలోనే నిధులు మంజూరవుతాయి. వెంటనే టెండర్లు ఆహ్వానించి యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం. – ఖాజా జుబేర్ అహ్మద్, ఈఈ, గద్వాల -
చారిత్రక వైభవం..
నాటి చరిత్రకు సాక్ష్యంగా నేటికీ నిలిచిన కట్టడాలు అందరికీ అందుబాటులోకి తెస్తేనే.. గ్రామాల్లో పర్యటించి పరిశోధన ద్వారా తెలుసుకున్న చరిత్రకు భావితరాలకు అందించేందుకు పుస్తకాలు, రచనలు, డాక్యుమెంట్ల రూపంలో వెలుగులోకి తేవాల్సి ఉంది. అయితే రెండేళ్ల క్రితం ఈ కార్యక్రమాన్ని చేపట్టినా ప్రభుత్వం ఇందుకు అవసరమైన నిధులను కేటాయించలేదు. ఇది పూర్తిగా ప్రొఫెసర్లు, డిగ్రీ విద్యార్థులు, ఔత్సాహిక పరిశోధకులు స్వచ్ఛందంగా చేపట్టాల్సి రావడంతో చాలావరకు గ్రామాల పర్యటన, చరిత్ర పరిశోధన ఆశించినంత సాగడం లేదు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసి, భావితరాలకు అందించేలా చర్యలు చేపట్టాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బిజినేపల్లి మండలం వట్టెంలోని గడి మన ఊరు – మన చరిత్ర కార్యక్రమంలో భాగంగా చాలా వరకు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి అధ్యయనం చేపట్టాం. పలుగ్రామాల చరిత్ర పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మారుమూల గ్రామాల్లో మనకు తెలియని కొత్త చరిత్ర బహిర్గతమవుతోంది. ఆనాటి సామాజిక పరిస్థితులు, వివక్ష తదితర అంశాలు తెలుస్తున్నాయి. – పెబ్బేటి మల్లికార్జున్, ప్రాజెక్ట్ జిల్లా కోఆర్డినేటర్) చాలా కొత్త విషయాలు తెలిశాయి.. -
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఎంచుకోవాలి
గద్వాలటౌన్: విద్యార్థులు పాఠశాల దశలోనే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని, వాటిని సాధించేందుకు పట్టుదలతో శ్రమించాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మోటివేషన్ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మోటివేషన్ తరగతులు దోహదం చేస్తాయన్నారు. విద్యార్థులు పుస్తకాలలో నేర్చుకునే విషయాలను నిజజీవితంలో ప్రయోగించి, సమాజానికి ఉపయోగపడేలా చేయాలన్నారు. కొత్త విషయాలను నేర్చుకోవడంతో పాటు విషయ పరిజ్ఞానం ముఖ్యమన్నారు. విద్యార్థులు ఇప్పటి నుంచే ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని, వాటి సాధన కోసం నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు. ప్రముఖ సైకాలజిస్టు రాఘవేందర్ మాట్లాడుతూ పరీక్షలకు ఏ విధంగా సన్నద్దం కావాలనే దానిపై వివరించారు. ప్రతి విద్యార్థి పట్టుదలతో సాధన చేస్తే ఏదైనా సాధ్యమని పేర్కొన్నారు. ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు పరీక్షలకు సన్నద్దం కావాలని సూచించారు. సొంతంగా ఆలోచించడం, నిరంతర సాధన చేయడం విద్యార్థులు మరువరాదన్నారు. కార్యక్రమంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం ప్రతినిధులు బీచుపల్లి, బాబునాయుడు, గోవర్థన్రెడ్డి, సవారన్న తదితరులు పాల్గొన్నారు. -
ఆదిశిలా క్షేత్రంలో భక్తుల ప్రత్యేక పూజలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులతో కిక్కిరిసింది. ఈసందర్భంగా అర్చకులు మధుసూదనాచారి, రమేషాచారి, రవిచారి స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదే విధంగా సద్దలోనిపల్లి కృష్ణస్వామి, పాల్వాయి అడవి ఆంజనేయస్వామి, కుర్తిరావులచెర్వు గట్టు తిమ్మప్పస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు అరవిందరావు, చంద్రశేఖర్రావు, ఆలయ సిబ్బంది రంగనాథ్, ఉరుకుందు, కృష్ణ, శివమ్మ, రాము, శ్రీను, చక్రి, వాల్మీకి పూజారులు తదితరులు పాల్గొన్నారు. రేపు బీచుపల్లిలో సీతారాముల కల్యాణం ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా సోమవారం సీతారాముల కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై రాములోరి కల్యాణ కార్యక్రమాన్ని కనులారా తిలకించాలని ఆయన కోరారు. వేరుశనగ క్వింటా రూ.6,712 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు శనివారం 1410 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ. 6712, కనిష్టం రూ. 3000, సరాసరి రూ. 5499 ధరలు లభించాయి. అలాగే, 37 క్వింటాళ్ల ఆముదాలు రాగా, గరిష్టం రూ. 5889 కనిష్టం రూ. 5659, సరాసరి రూ. 5859 ధరలు పలికాయి. 337 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ. 2166, కనిష్టం రూ. 1751, సరాసరి ధరలు రూ. 1911 వచ్చాయి. చేనేత సమస్యల పరిష్కారానికి మహాధర్నా కొత్తకోట: చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 20న కమిషనర్ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపడతామని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పొబ్బతి రవికుమార్ పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని వీవర్స్కాలనీలో జరిగిన చేనేత కార్మికుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించి ఏడాదిన్నర కావస్తున్నా.. నేటికీ అమలు కాలేదన్నారు. 15 రోజుల్లో రుణమాఫీ నిధులు కార్మికుల ఖాతాల్లో జమ చేయకపోతే హైదరాబాద్ నాంపల్లిలోని హ్యాండ్లూమ్ టెక్స్టైల్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గతంలో ఉన్న చేనేత చేయూత నగదు బదిలీ పథకం స్థానంలో చేనేత భరోసా పథకాన్ని నెలలు గడుస్తున్నా అమలు చేయడం లేదని ఆరోపించారు. నేతన్న బీమా పథకాన్ని వయస్సుతో నిమిత్తం లేకుండా ఇవ్వాలని నిర్ణయించడం సంతోషమేగాని.. మరణించిన నేత కార్మికులకు ఏడాది గడిచినా బీమా సొమ్ము అందకపోవడం విచారకమని తెలిపారు. చేనేత సహకార సంఘాలకు 12 ఏళ్లు గడుస్తున్నా ఎన్నికలు జరుపలేదని.. చేనేతశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఏడాది దాటిందని, తక్షణమే నిర్వహించి టెస్కోకు పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఉపాధి కల్పనకు ప్రభుత్వ రంగంలోని ఏకరూప దుస్తులకు మగ్గాలపై నేసిన వాటినే అందించాలని సూచించారు. కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం నాయకులు సాంబరి వెంకటస్వామి, పగిరాకుల రాములు, ఎంగలి రాజు, కొంగటి శ్రీనివాసులు, కొంగటి వెంకటయ్య, దిడ్డి శ్రీకాంత్, గోరంట్ల బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
‘యాసంగి’కి కన్నీళ్లేనా..?
అయోమయంలో ఆర్డీఎస్ రైతులు ● గతేడాది తుంగభద్ర డ్యాం 9వ గేటు కొట్టుకుపోయిన వైనం ● గేట్ల మరమ్మతు పూర్తయ్యేవరకు పూర్తి స్థాయిలో నీరు నిల్వ చేయలేమని అధికారుల స్పష్టం ● ఈ ఏడాది జనవరి వరకు నీటి విడుదల ప్రశ్నార్థకమే.. ● బీళ్లను తలపిస్తున్న ఆయకట్టు పొలాలు దిక్కుతోచడం లేదు.. ఆర్డీఎస్ డి–25ఏ కింద మాకు 40 ఎకరాల పొలం వుంది. మొక్కజొన్న వేద్దా మని ఆర్డీఎస్ నీటి కోసం ఎదురుచూస్తున్నాం. కానీ, ఈ ఏడాది నీళ్లు వస్తాయో రావోనని భయంగా ఉంది. అధికారులు ఏవిషయం చెబితే బాగుంటుంది. గ్రా మంలో 3వేల ఎకరాల ఆయకట్టు రైతులకు దిక్కుతోచడంలేదు. – కృష్ణారెడ్డి, రైతు, కొంకల సమావేశం తర్వాతే.. ఈ నెల 21న తుంగభద్ర బోర్డు సమావేశం ఉంది. కర్ణాటక, ఆంధ్రప్రదేష్, తెలంగాణ నీటిపారుదలశాఖ అధికారులు పాల్గొంటారు. గేట్ల పనులు పూర్తికానందున టీబీ డ్యాంలో ఎంత నీరు నిల్వ వుంటుందో అనే అంశంపై మరోసారి చర్చిస్తాం. ఆతర్వాత నీటి విడుదలపై ప్రకటన విడుదల చేస్తాం. – బి.శ్రీనివాసులు, ఈఈ, నీటిపారుదలశాఖ, జోగుళాంబ గద్వాల జిల్లా శాంతినగర్: భారీ వర్షాల నేపథ్యంలో వానాకాలం సీజన్ రైతులకు అప్పులే మిగిల్చింది. కనీసం యాసంగి సీజన్ అయినా కలిసొస్తుంది అనుకున్న ఆర్డీఎస్ రైతులకు మరో పిడుగులాంటి వార్త తెలిసింది. తుంగభద్ర డ్యాం (టీబీడ్యాం) గేట్ల మరమ్మతు పూర్తికాకపోవడంతో డ్యాంలో పూర్తి స్థాయి నీటి నిల్వలు 105 టీఎంసీలు నిల్వ చేయలేదని, యాసంగి పంటలకు నీటిని అందించలేమని చెప్పడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు నీటిపారుదలశాఖ అధికారులు ఆర్డీఎస్ కెనాల్కు నీటి విడుదల విషయమై ఇప్పటివరకు ఏ ప్రకటన చేయకపోవడంతో ఆయకట్టు రైతులు అయోమయంలో పడ్డారు. వానాకాలంలో సాగుచేసిన పత్తి, కూరగాయలు, ఆముదం పంటలను రైతులు ముందస్తుగానే తొలగించి యాసంగి పంటలు సాగుచేద్దామని సమాయత్తమయ్యారు. ఇంతలోనే టీబీ డ్యాం అధికారుల ప్రకటనతో చదును చేసిన భూమిలో పంటలు వేయలేక రైతులు కన్నీటిపర్యాంతమవుతున్నారు. నీటి విడుదలపై సందిగ్ధం టీబీ డ్యాం వద్ద 33 గేట్లు ఏర్పాటుచేయకపోవడంతో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయలేమని, ప్రస్తుతం వున్న 80 టీఎంసీలతో రబీకి నీళ్లు ఇవ్వలేమని వానాకాలం సీజన్కు ముందే ఆంధ్రప్రదేష్ నీటిపారుదలశాఖ అధికారుల బోర్డు ప్రకటించింది. దీంతో అక్కడ యాసంగిలో సాగుచేసే 3.5 లక్షల ఎకరాల్లో సాగు ప్రశ్నార్ధకంగా మారింది. అక్కడి ఆయకట్టు పొలాలకు పూర్తిస్థాయిలో సాగునీరందించాలంటే డ్యాంలో కనీసం 110 టీఎంసీలు వుండాలని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. 110 టీఎంసీలు నిల్వ చేసేందుకు గేట్లు సహకరించవని దీంతో నీటిని విడుదల చేసే అవకాశం లేదని టీబీ డీఈఈ జ్ఙానేశ్వర్ తేల్చిచెప్పారని సమాచారం. డ్యాంలో 80 టీఎంసీలు వుంటే మిగతా గేట్లు ఏర్పాటుచేయడానికి సాధ్యపడదని 40 టీఎంసీలకు తగ్గిస్తేనే గేట్లు ఏర్పాటుచేస్తామని టెండర్ దక్కించుకున్న గుజరాత్ కంపెనీవారు తేల్చి చెప్పడంతో డ్యాంలో వున్న 80 టీఎంసీల్లో 40 టీఎంసీలు తగ్గించడానికే ఇంజినీర్లు మొగ్గు చూపుతున్నారని సమాచారం. జాప్యం చేస్తే వచ్చే ఖరీఫ్ వానాకాలం పంటలకు నీరందించడానికి ఇబ్బందికరంగా మారుతుందని ఇంజనీర్లు చెబుతున్నారు. ఇదిలాఉండగా, ఈనెల 7న నిర్వహించాల్సిన టీబీ బోర్డు మీటింగ్వాయిదా పడింది. కేంద్ర ఆర్థికశాఖ తరపున సభ్యులుగా వుండే ఉన్నతస్థాయి అధికారి రాకపోవడంతో సమావేశం వాయిదాపడినట్లు నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. 21కి సమావేశం వాయిదా వేశామని ప్రకటించారు. కర్ణాటకలోని తుంగభ ద్ర డ్యాం తాగునీటి కోసం విడుదల 19వ గేటుతో తలెత్తిన సమస్య గతేడాది వానాకాలం సీజన్ ఆగస్టులో టీబీ డ్యాం వద్ద ఏర్పాటుచేసిన 19వ గేటు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. డ్యాంలో పూర్తిస్థాయిలో వున్న 105 టీఎంసీల్లో సగానికి పైగా సుమారు 50 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. అయితే, తుంగభద్ర డ్యాం వద్ద 33 క్రస్టు గేట్లలో చాలామటుకు తుప్పుపట్టగా.. ఇప్పటివరకు 12 గేట్లు కొత్తగా ఏర్పాటుచేశారు. మొత్తం రూ.52 కోట్లతో 33 గేట్లు కొత్తగా అమర్చాలని అంచనా వేశారు. ఇప్పటివరకు సగం గేట్లు కూడా కొత్తవి ఏర్పాటుచేయకపోవడంతో పూర్తిస్థాయిలో నీటిని 105 టీఎంసీలు నిల్వ వుంచే పరిస్థితి లేదని టీబీ అధికారులు చెబుతున్నారు. మరో వారం రో జుల్లో 3 గేట్లు పూర్తవుతాయని సామాచారం. టీబీ డ్యాంలో తెలంగాణ వాటా 9 టీఎంసీలు, ఆంధ్రప్రదేష్ వాటా 14 టీఎంసీలు. 105 టీఎంసీలు పూర్తిస్థాయి నీటి మట్టం వున్న సమయంలో ఆయా రాష్ట్రాల వాటాలు పూర్తిగా విడుదలయ్య అవకాశం వుండేదికాదు. అలాంటిది ప్రస్తుతం నిల్వ వున్న 80 టీఎంసీల్లో గేట్లు ఏర్పాటుకొరకు మరో 40 టీఎంసీలను దిగువకు విడదల చేస్తే మన వాటా కేవలం 2 టీంఎసీలకు పరిమితమయ్యే అవకాశం వుందని అదికారులు చెప్పకనే చెబుతున్నారు. దీంతో వచ్చే 2 టీఎంసీల నీరు తాగునీటి కొరకు వేసవికాలంలో విడుదల చేస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా, ఈనెల 21న జరిగే తుంగభద్ర డ్యాం (టీబీ బోర్డు) సమావేశంలో యాసంగి పంటలకు క్రాప్ హాలీడే ప్రకటించే అవకాశం వున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయకట్టు రైతులు పంటలు సాగుచేసేందుకు సమాయత్తమవుతున్న తరుణంలో టీబీ బోర్డు సమావేశం అనంతరం పంటలు సాగుచేసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. -
పేదల సొంతింటి కల నెరవేరుస్తాం..
ఇటిక్యాల: పేదోడి సొంతింటి కలను ప్రజా పాలన ప్రభుత్వం నెరవేర్చిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు అన్నారు. శనివారం మండల పరిధిలోని శివనంపల్లిలో వడ్డె సరోజమ్మకు ప్రభుత్వం నుంచి మంజూరైన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డెప్ప, స్థానిక నాయకులతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా నీలి శ్రీనివాసులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామన్న మాట నెరవేరుస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జన్మదినం సందర్భంగా జిల్లాలోనే మొదటి ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు రుక్మందర్రెడ్డి, కాంగ్రెస్ నాయకలు లక్ష్మీనారాయణరెడ్డి, ప్రభాకర్రెడ్డి, రాజ్కుమార్, రాజు, మద్దిలేటి పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి యోగాసన పోటీల్లో ప్రతిభ చాటాలి
మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి యోగాసన పోటీల్లో క్రీడాకారులు ప్రతిభచాటాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి కురుమూర్తిగౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లోని ఎస్ఎంపీ స్కూల్లో శనివారం నుంచి ప్రారంభమైన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, జూనియర్ యోగాసన పోటీలకు ఉమ్మడి జిల్లా క్రీడాకారులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా స్థానిక మెయిన్ స్టేడియంలో క్రీడాకారులను కురుమూర్తిగౌడ్ అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా యోగాసన క్రీడా సంఘం కార్యదర్శి ఆర్.బాల్రాజు, భారత్ వికాస్ పరిషత్ ప్రతినిధి జి.పాండురంగం, యోగ సంఘం సభ్యులు సూర్యప్రకాశ్, కిషన్దాస్, వెంకటేశ్, బాలమణి పాల్గొన్నారు. ● 8–10 ఏళ్ల విభాగంలో అరుణ్, అరవింద్సాయి, యుగంధర్, సంజయ్, ప్రశాంత్ ఆర్య, వైష్ణవి, శ్రీరాఘవి, అర్చన, ప్రియ, అద్వేత, 10–12 విభాగంలో సంపత్కుమార్, శ్రీప్రసాద్, గౌతమ్, హరికృష్ణ, ఉదయ్కుమార్, దీపిక, క్రిష్ణవేణి, మనస్విని, మోక్షిత, రూప, 12–14 విభాగంలో చరణ్, రంజిత్కుమార్, విఘ్నేష్, సృజన్ కుమార్, జయచంద్ర, ధనలక్ష్మి, స్వప్న, నవిత, నయనశ్రీ, వైష్ణవి, 14–16 విభాగంలో శివతేజ, బాలు, సుశీల్కుమార్, సాగర్, కార్తీక్, జె.వైష్ణవి, నందిని, ప్రవళిక, రూపలత, దీపిక, 16–18 విభాగంలో తిరుపతి, చైతన్య, వంశీ ఎంపికయ్యారు. -
నిషేధం ఉత్తిదే!
జిల్లాలో జోరుగా ప్లాస్టిక్ వినియోగం ● నియంత్రణ చర్యలపై అధికారుల నిర్లక్ష్యం ● ప్రజారోగ్యం, పర్యావరణానికి పెనుభూతం ● 2022, జూలై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం గద్వాలటౌన్: ప్రజారోగ్యానికి, పర్యావరణానికి పెనుభూతంలా మారిన ఒకసారి వినియోగించి పడేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వస్తువులపై కేంద్ర ప్రభుత్వం 2022 జూలై 1 నుంచి నిషేధం విధించినా జిల్లాలో ఎక్కడా అది అమలు జరగడం లేదు. స్ట్రాలు, థర్మకోల్ సీట్లు, ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల వంటి 19 రకాల వస్తువులపై ఈ నిషేధం వర్తించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ప్లాస్టిక్ కాలుష్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్దే అగ్రస్థానం. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 75 మైక్రానుల కన్నా తక్కువ మందం ఉన్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం ఉంది. 2022 డిసెంబర్ నుంచి 120 మైక్రాన్లలోపు ఉండే కవర్లను, వస్తువులను తయారు చేయడం, అమ్మడం, వినియోగించడాన్ని కూడా నిషేధించారు. ప్రభుత్వం నిషేధం విధించిన కొత్తలో కొద్ది రోజుల పాటు హడావుడి చేసిన అధికార యంత్రాంగం నిరంతరం తనిఖీలు చేశారు. ఆ తర్వాత మెల్లగా అటకెక్కించారు. జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ సంచులను, వస్తువులను పూర్తిగా నిషేధించారు. మొదట్లో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ వ్యాపారులతో ఉన్న పాలిథిన్ సంచులను స్వాధీనం చేసుకున్నారు. కొంతమందికి జరిమానాలు సైతం విధిస్తు ఉక్కుపాదం మోపారు. అవగాహన కల్పిస్తున్నాం రెండేళ్ల క్రితమే ప్లాస్టిక్ సంచుల నిషేధం అమల్లోకి వచ్చింది. ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నాం. అధికారులు, సిబ్బంది కలిసి దాడులు చేసి ప్లాస్టిక్ విక్రయాలను అడ్డుకుంటున్నాం. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే వంద శాతం నిర్మూలన సాధ్యమవుతుంది. ప్లాస్టిక్ విక్రయాలు చేస్తే జరిమానాలతో పాటు దుకాణం లైసెన్సు రద్దు చేస్తాం. జరిమానాలు సైతం విధించడం జరిగింది. – జానకీరాం, కమిషనర్, గద్వాల మార్పు వచ్చే సమయంలో... జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ నిషేధించడంతో వ్యాపారులు సైతం పాలిథిన్ కవర్ల వినియోగించడాన్ని నిలిపివేశారు. సరుకు కొనుగోలు చేసేందుకు వచ్చే వినియోగదారులకు చేతి సంచులు తీసుకురావాలని వ్యాపారులు సూచించడంతో కొద్ది రోజులు నిషేధం సాఫీగానే సాగింది. అధికారులు తనిఖీలు తగ్గించడంతో వ్యాపారులు అన్ని వస్తువులు ప్లాస్టిక్ కవర్లలోనే ఇస్తుండటంతో మళ్లీ మొదటికొచ్చింది. కూరగాయలు, పూలు, పండ్ల వ్యాపారులు పల్చని సంచులు వాడటం, ఏ శుభకార్యం జరిగినా కల్యాణ మండపాలు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, కర్రీ పాయింట్ల నుంచి ప్యాకింగ్ సంచులు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, చెంచాలు, కప్పులు వేల సంఖ్యలో బయటకు వస్తున్నాయి. దుకాణాల్లో ఒకసారి వాడి పడేసే వస్తువులు, కవర్లు విక్రయం, వినియోగం యథేచ్చగా జరుగుతుంది. గ్రామాల్లో సైతం.. ప్లాస్టిక్ భూతం గ్రామాల్లో సైతం కోరలు చాచుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఓ సెగ్రిగేషన్ షెడ్ నిర్వహించి చెత్తను రీసైక్లింగ్ చేయాల్సి ఉన్నా ఎక్కడా అమలులోకి రావడం లేదు. కొన్ని ప్రదేశాల్లో ప్లాస్టిక్ను విచ్చలివిడిగా తగులబెడుతుండడంతో గాలి, నేల, నీటి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. ప్లాస్టిక్ను బహిరంగ ప్రదేశాల్లో వేస్తుండడంతో వాటిని తినే మూగజీవాలు తీవ్ర అస్వస్థతకు గురై మృత్యువాతపడుతున్న ఘటనలు ఉన్నాయి. -
‘చదువుకునే అదృష్టాన్ని దూరం చేయొద్దు’
గట్టు: ‘మీరు చదువుకొని ఉండకపోవచ్చు, కానీ మీ పిల్లలకు చదువు అనే అదృష్టాన్ని దూరం చేయొద్దని, ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలను తప్పనిసరిగా చదివించాలని’ జిల్లా ఉపాధి కల్పన అధికారిణి డాక్టర్ ప్రియాంక తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. గురువారం జిల్లా పర్యవేక్షణ అధికారుల బృందం డ్రాప్ అవుట్, రీ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా బల్గెర, మిట్టదొడ్డి, చాగదోన గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ చదువు అనే ఆయుధాన్ని తల్లిదండ్రులు తమ పిల్లలకు అందిస్తే, భవిష్యత్లో వారు మీ కష్టాన్ని శాశ్వతంగా దూరం చేస్తారని తెలిపారు. మధ్యలో బడి మానేసి, పంట పొలాల్లో పనులు చేస్తున్న పిల్లలను గుర్తించి, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. చిన్నారులను వయసుకు మించిన పనులకు తీసుకెళ్లి వారి బాల్యాన్ని నాశనం చేయొద్దని కోరారు. బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిల్లలను పొలాల వైపు కాకుండా తరగతి గది వైపు నడిపించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ చెన్నయ్య, ఆయా పాఠశాలలకు చెందిన హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు, సీపీఓ రవి, ప్ర భుత్వ అధికారుల బృందం సభ్యులు పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
గద్వాల వ్యవసాయం: ఐకేపీ మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెంకటోనిపల్లి కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, నదిఅగ్రహారం కేంద్రాన్ని పీఏసీఎస్ చైర్మన్ సుభాన్, జమ్మిచేడు కేంద్రాన్ని అక్కడి మహిళా సంఘాల ప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, పీఏసీఎస్ చైర్మన్ సుభాన్ వేరువేరుగా మాట్లాడుతూ.. రైతులు దళారులకు ధాన్యం విక్రయించి మోసపోకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో అమ్మి మద్దతు ధర పొందాలని సూచించారు. సన్న రకానికి బోనస్ రూ.500 ప్రభుత్వం ఇస్తోందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ప్రతాప్గౌడ్, నాయకులు రమేష్నాయుడు, మహేశ్వర్రెడ్డి, మెప్మా అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
ఆశలకు ‘గండి’..
● తరచుగా కోతకు గురవుతున్న కేఎల్ఐ కాల్వలు ● ఏటా ఏదో ఒక చోట తెగుతున్న వైనం ● పంటలు దెబ్బతిని రైతులకు భారీ నష్టం సాక్షి, నాగర్కర్నూల్: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నిర్మించిన సాగునీటి కాల్వలు నిర్వహణకు నోచుకోవడం లేదు. సుమారు 20 ఏళ్ల క్రితం కాల్వల నిర్మాణం చేపట్టగా.. ఇప్పటి వరకు కాంక్రీట్ లైనింగ్ ఏర్పాటు చేయకపోవడంతో తరచుగా కాల్వలు తెగుతున్నాయి. దీంతో సమీపంలోని రైతుల పంటపొలాలను వరద ముంచెత్తి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కాల్వలు చెంతనే ఉన్నాయన్న ఆశతో పంటలు వేసుకుంటున్న రైతులకు చివరికి కన్నీరే మిగులుతోంది. పంటలు చేతికొచ్చే సమయంలో కాల్వలకు గండ్లు పడి పంటంతా నీటిపాలవుతోంది. ఏటా ఇదే తంతు కొనసాగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం స్పందించడం లేదని రైతులు వాపోతున్నారు. నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు, కల్వకుర్తి, వెల్దండ, పాన్గల్ మండలాల్లో తరుచుగా కాల్వలు తెగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అడుగడుగునా గండ్లతో నష్టం.. కేఎల్ఐ కాల్వకు ఒకేచోట ఆరుసార్లు గండి పడినా అధికారులు మాత్రం తాత్కాలిక చర్యలకే పరిమితమవుతున్నారు. ఇందుకోసం రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. అయితే నానాటికీ బలహీనమైన కాల్వ కట్టలకు తరచుగా గండ్లు పడి రైతులు నష్టపోవాల్సి వస్తోంది. నాగర్కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి మండలం తోటపల్లి, వెంకటాపూర్, తిమ్మరాసిపల్లి, నెల్లికట్ట, వెల్దండ సమీపంలోని కేఎల్ఐ కాల్వ అధ్వానంగా తయారైంది. వనపర్తి జిల్లాలోని పాన్గల్, రేవల్లి మండలాల్లోని కేఎల్ఐ కాల్వలతోపాటు భీమా కాల్వకు పలు చోట్ల గండి పడటంతో రైతులు పెద్దసంఖ్యలో నష్టపోతున్నారు. పాన్గల్ మండలంలోని పలు గ్రామాల సమీపంలో కాల్వ తెగి రైతుల పొలాలు నీటమునుగుతున్నాయి. నిధులు లేక నిర్వహణ గాలికి.. కేఎల్ఐ కాల్వల నిర్మాణం 2005లో చేపట్టగా.. అప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం మరమ్మతు, నిర్వహణకు నోచుకోవడం లేదు. సుమారు పదేళ్లుగా కాల్వలను అధికారులు గాలికి వదిలేశారు. ప్రతిసారి వేసవిలో కాల్వలకు మరమ్మతు చేపట్టి.. కాల్వ కట్టలను పటిష్టం చేయాల్సి ఉండగా, గడిచిన పదేళ్లలో ఒక్కసారి కూడా మరమ్మతు చేపట్టలేదు. కేఎల్ఐ కింద కేవలం చెరువులు, కుంటలు నింపడం.. ఉన్న కొద్దిపాటి కాల్వలకు సాగునీరందించేందుకే అధికారులు పరిమితమవుతున్నారు. పంపుహౌస్ల్లో మోటార్లకు సైతం మరమ్మతు చేయకపోవడంతో.. సరైన స్థాయిలో పంపింగ్ చేపట్టక చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడం లేదు. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ సమీపంలోని కేఎల్ఐ కాల్వ ఏడేళ్ల వ్యవధిలో ఇక్కడే ఆరుసార్లు తెగింది. కాల్వ తెగినప్పుడల్లా అధికారులు మట్టివేసి తాత్కాలిక మరమ్మతు చేపడుతున్నా.. నీటి ప్రవాహం ధాటికి తరుచుగా తెగుతోంది. ఫలితంగా సమీపంలోని రైతుల పంటపొలాలు నీటిపాలవుతున్నాయి. సిమెంట్ లైనింగ్ చేపడితేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రైతులు చెబుతున్నారు. పటిష్టానికి చర్యలు.. కేఎల్ఐ కింద కాల్వల నిర్వహణకు చర్యలు తీసుకుంటాం. కాల్వలకు గండి పడితే వెంటనే స్పందించి కట్టడి చేస్తున్నాం. అవసరమైన చోట్ల మరమ్మతు చేస్తున్నాం. విడతల వారీగా కాల్వల పటిష్టానికి చర్యలు చేపడతాం. – విజయ్భాస్కర్రెడ్డి, సీఈ, నీటిపారుదల శాఖ -
పెండింగ్ కేసులపై విచారణ చేపట్టాలి
గద్వాల క్రైం: పెండింగ్ కేసులపై వేగంగా విచారణ చేపట్టాలని ఎస్పీ శ్రీనివాసరావు పోలీస్ అధికారులకు సూచించారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ నెల 15 న ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమం ఉంటుందన్నారు. రాజీ అయ్యే అవకాశం ఉన్న కేసులను ఇరువర్గాల అర్జీదారులతో మాట్లాడి కేసులను పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు. వివిధ వివాదాలపై వచ్చే ఫిర్యాదులను వీలైనంత త్వరగా స్టేషన్ పరిధిలో అవగాహన కల్పించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. లోక్ అదాలత్పై ప్రజలకు అవగాహన కల్పించి, వినియోగించుకునేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐలు టాటాబాబు, శ్రీను, రవిబాబు ఎస్ఐలు తదితరులు ఉన్నారు. వేధింపులపై నిర్భయంగా ఫిర్యాదు చేయండి అమ్మాయిలపై వేధింపులకు గురి చేసే వారిని అడ్డుకునేలా ప్రతి ఒక్కరూ ముందుకు కదలాల్సిన ఆవశక్యత ఉందని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. సహజంగా మహిళలకు ధైర్యం లేదనే యోచనతో పోకిరీలు వెకిలి చేష్టలు చేస్తూ మానసికంగా వేధించడం, లైగింక దాడులకు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు, అమ్మాయిలు మానసికంగా అత్యంత బలవంతులమని సమాజానికి చూపాల్సిన అవసరం ఉందన్నారు. బాలికలు ప్రేమ పేరుతో మోసపోకుండా ఉన్నతంగా చదివి సొంత కాళ్లపై నిలబడాలని ఆకాంక్షించారు. ప్రతి మహిళలకు ఎల్లవేళలా జిల్లా పోలీస్ యంత్రాంగం అండగా ఉంటుందన్నారు. మహిళల సమస్యలకు భరోసా కేంద్రంలోని సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. అత్యాచార బాధిత మహిళలకు అన్ని రకాల (మెడికల్, న్యాయసలహ, వైద్యం, కౌన్సెలింగ్, సైకాలజిస్ట్ సపోర్ట్) సేవలను అందిస్తున్నామని తెలిపారు. అత్యవసర సమయాల్లో డయల్ 100 లేదా 87126 70312 నంబర్కు సంప్రదించాలని సూచించారు. ఆపద సమయంలో షీ టీం సభ్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. -
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు
ధరూరు: రైతులు సాగులో నూతన పద్ధతలు పాటించడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చని జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కార్యాలయంలో పామాయిల్ సాగుపై మండల రైతులకు అవగాహన కల్పించారు. సింగిల్ విండో చైర్పర్సన్ మహదేవమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆయిల్పాం సాగుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని, ఆసక్తి ఉన్న రైతులు సంప్రదించాలని కోరారు. ఇప్పటికే సాగు చేసుకున్న రైతులకు, నూతనంగా సాగు చేసుకునే రైతులకు ఏమైనా సందేహాలు ఉన్నా అధికారులను కలిసి నివృత్తి చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ సీఈఓ రాజు, ఉద్యావన శాఖ డివిజన్ అధికారి రాజశేఖర్, విస్తరణ అధికారి మేఘారెడ్డి, శివకుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు. గద్వాల మార్కెట్ సమాచారం గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు గురువారం 1,735 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. క్వింటాల్కు గరిష్టం రూ.5,901, కనిష్టం రూ.2,606, సరాసరి రూ.5,199 ధరలు లభించాయి. 134 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టం రూ.5,909, కనిష్టం రూ.5689, సరాసరి రూ.5709 ధరలు పలికాయి. 192 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టం రూ. 2149, కనిష్టం రూ.1871, సరాసరి ధరలు రూ.1929 పలికింది. ఆత్మీయ సభ విజయవంతం చేయాలి వనపర్తి రూరల్: మహబూబ్నగర్లో ఈ నెల 9న రాష్ట్ర ఔట్సోర్సింగ్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే ఉమ్మడి జిల్లా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఆత్మీయ సభ వాల్పోస్టర్లను గురువారం పెబ్బేర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు భరత్కుమార్, ఉపాధ్యక్షుడు పవన్కళ్యాణ్ మాట్లాడుతూ.. ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అధికసంఖ్యలో పాల్గొని ఆత్మీయ సభను విజయవంతం చేయాలని కోరారు. మత్స్య కళాశాల ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, సంఘం నాయకులు పాల్గొన్నారు. రామన్పాడులో తగ్గిన నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో గురువారం నీటిమట్టం తగ్గినట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 862 క్యూసెక్కులు, సమాంతర కాల్వ నుంచి 129 క్యూసెక్కుల వరద జలాశయానికి చేరి సముద్రమట్టానికిపైన 1,020 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ఇదిలా ఉండగా జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 693 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 15 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగించినట్లు వివరించారు. -
సీసీఐ కేంద్రం వద్ద రైతుల ధర్నా
● పత్తిని పరిశీలించకుండానే వద్దంటున్న సీసీఐ అధికారి ● జాతీయ రహదారిపై రెండు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు ● ఎస్ఐ నచ్చజెప్పడంతో శాంతించిన రైతులు ఉండవెల్లి: పత్తి కొనుగోలు కేంద్రం వద్ద సీసీఐ అధికారి అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ రైతులు జాతీయ రహదారిపై గురువారం ధర్నా నిర్వహించారు. దాదాపు 2 గంటలు ధర్నా కొనసాగించడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కేంద్రంలో అధికారి తేమశాతం మాత్రమే చూడాలని, పత్తిని చూడకుండానే నల్లగా ఉందని తిప్పి పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కురిసిన వర్షాలకు పత్తి పాడైందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. సీసీఐ అధికారులు, మార్కెటింగ్ అధికారులు దళారులకే కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. రైతులు రోడ్డుపై ధర్నా చేస్తున్న అధికారి ఎలాంటి చలనం లేకుండా మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండని దబాయిస్తున్నాడని వాపోయారు. ఇంటికాడ పిల్లలున్నారని, చీకటి పడకముందే ఇంటికి పోవాలని మిల్లు వద్దకు పత్తి తెచ్చిన భార్యాభర్తలు వేడుకుంటున్నా.. సీసీఐ అధికారి పట్టించుకోకుండా పక్కకు వెళ్లి వేరే వాహనంలో ఉన్న పత్తి మ్యాచర్ చూశారంటూ కన్నీటిపర్యంతమయ్యారు. వర్షంలో తడిసిన పత్తిని ప్రభుత్వమే కొనకపోతే సీసీఐ కేంద్రాలు ఎందుకు తెరిచారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐ శేఖర్ ధర్నా వద్దకు వచ్చి రైతులకు నచ్చజెప్పడంతో శాంతించారు. మార్కెటింగ్ కార్యదర్శి ఎల్లస్వామితో ఎస్ఐ మాట్లాడగా.. తమకు ఈ విషయంలో ఎలాంటి ప్రమేయం లేదని, సీసీఐ అధికారే దీనికి బాధ్యులు అని కార్యదర్శి తెలిపారు. దీంతో ఎస్ఐ సీసీఐ అధికారితో చర్చించగా.. ‘మా రూల్స్ మాకు ఉంటాయి.. ఎవరు చెప్పినా వినమని’ ఆయన తెగేసి చెప్పాడు. దీంతో ఎస్ఐ శేఖర్ స్పందిస్తూ శుక్రవారం ఉదయం మరోమారు విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి, రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. దీంతో సీసీఐ అధికారి తీరుపై రైతులు ఆందోళన చెందుతున్నారు. -
చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది
ధరూరు: రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. గురువారం వారు ధరూరులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 81 కేంద్రాలకు గాను మొదటి కేంద్రాన్ని ధరూరులో ప్రారంభించినట్లు తెలిపారు. త్వరలోనే అన్ని కేంద్రాలను ప్రారంభించి వడ్లు కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,389, బీ గ్రేడ్కు రూ.2,369 ప్రభుత్వం రైతులకు చెల్లిస్తుందని పేర్కొన్నారు. ధాన్యం కేంద్రానికి తీసుకొచ్చేటప్పుడు తేమ శాతం 17కి మింకుండా చూసుకోవాలన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ.. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని, మహిళా సంఘాల ద్వారానే ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నామని తెలిపారు. నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా ర్యాలంపాడు రిజర్వాయర్ను నింపి రైతులకు ఈసారి కూడా రెండో పంటకు సాగు నీరు అందిస్తామన్నారు. వర్షాలను దృష్టిలో ఉంచుకుని రైతులకు అవసరయ్యే గన్నీ బ్యాగులతో పాటు టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు, అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాసులు, మార్కెట్ యార్డు చైర్మన్ హనుమంతు, మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డి, ఎంపీడీఓ కృష్ణమోహన్, ఏపీఎం నరహరి, ఏఓ శ్రీలత, మహిళా సంఘం నాయకురాలు ఖాజాబీ నాయకులు శ్రీనివాస్రెడ్డి, శ్రీధర్గౌడ్, రాజశేఖర్, కురుమన్న తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం
సామూహిక సత్యనారాయణస్వామి వ్రతంలో పాల్గొన్న భక్తులు ఎర్రవల్లి: కార్తీక పౌర్ణమిని పురష్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో బుధవారం సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు బీచుపల్లికి కృష్ణానదిలో స్నానాలు ఆచరించారు. అనంతరం ఉపవాసంతో 80 జంటలు సామూహిక సత్యనారాయణస్వామి వ్రతంలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోదండరామస్వామి ఆలయ ప్రధాన అర్చకులు దత్తుస్వామి, భువనచంద్రాచార్యులు వేదమంత్రాల నడుమ సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాన్ని నిర్వహించారు. భక్తులకు గద్వాలకు చెందిన రిటైర్డ్ టీచర్ రామ తులశమ్మ కుటుంబ సభ్యులు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, పాలక మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు, తదితరులు ఉన్నారు. -
వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
గద్వాలటౌన్: ఆధ్యాత్మిక వెలుగులతో ఆ ప్రాంతమంతా నిండింది.. శివనామస్మరణంతో మార్మోగింది.. పరమశువుడికి ఎంతో ఇష్టమైన కార్తీక మాసంలో చేపట్టిన దీపోత్సవ కార్యక్రమాలు కనులపండువగా సాగాయి. బుధవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవక్షేత్రాలు భక్తులతో కోలాహాలంగా కనిపించాయి. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. తెల్లవారుజాము నుంచే ఆయా ఆలయాలలో భక్తులు దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. నదిఅగ్రహారంలోని ఆలయాల దగ్గర, స్థానిక తెలుగుపేటలోని శివాలయంలో పెద్ద సంఖ్యలో మహిళలు చేరి దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయంలోని శివలింగానికి అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. నది అగ్రహారం ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. స్థానిక కోటలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో, పెద్ద అగ్రహారంలోని అహోబిల మఠంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దీపాలు వెలిగించారు. వాసవీ కన్యకా పరమేశ్వరి, మార్కండేయ స్వామి, అంబాభవాని ఆలయంలో, షిర్డిసాయి మందిరం, వీరభద్రస్వామి, రాఘవేంద్రకాలనీలోని శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. దీపాలతో ఆలయ ప్రాంగణాలు ప్రకాశవంతంగా మారాయి. వివిధ ఆకృతులలో వెలిగించిన ప్రమిదలు ఆకట్టుకున్నాయి. జములమ్మ ఆలయంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్కర ఘాట్లో కార్తీక దీపోత్సవ పూజలో పాల్గొన్నారు. నందికోల సేవ ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించింది. భక్తిశ్రద్ధలతో అభిషేకాలు నీలకంఠాయ.. మృత్యుంజయాయ..సర్వేశ్వరాయ.. సదాశివాయ..శ్రీమాన్ మహాదేవయాయ నమః అంటూ పరమేశ్వరుడికి పండితులు వివిధ ద్రవ్యాలతో నిర్వహించిన అభిషేకాలను భక్తిశ్రద్ధలతో తిలకించి భక్తులు తరించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులు శివలింగాలకు అభిషేకాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని శివాలయాలతో పాటు గ్రామాలలో ఉన్న శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. నదీ అగ్రహారం దగ్గర ఉన్న కృష్ణానదిలో తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో మహిళలు పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం అక్కడే కార్తీక దీపాలు వెలిగించారు. -
కనులపండువగా ఆదిశిలా వాసుడి కల్యాణం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రంలోని స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి వారి కల్యాణం బుధవారం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కనులపండువగా నిర్వహించారు. వేదపండితులు రమేషాచారి, మధుసూదనాచారి, దీరేంద్రదాసు, రవిచారి స్వామి వారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు, మహాహోమం నిర్వహించారు. అనంతరం స్వామి వారి ఉత్సవమూర్తులకు కల్యాణం జరిపించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో హజరయ్యారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నిర్వాహుకులు అరవిందరావు, చంద్రశేఖర్రావు పాల్గొన్నారు. జడ్జి ప్రత్యేక పూజలు ఆలయంలో గద్వాల జూనియర్ సివిల్ జడ్జి నేరెళ్ల వెంకట హైమా పూజిత దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ నిర్వహుకులు, అర్చకులు జడ్జీ దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అర్చకులు స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి జడ్జి దంపతులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. శేషవస్త్రంతో సత్కరించి మెమోంటోను అందజేశారు. అంతర్జాతీయ పోటీల్లో యువకుడి సత్తా శాంతినగర్: అంతర్జాతీయ పరుగు పోటీల్లో అయిజ మండలం చిన్నతాండ్రపాడు గ్రామానికి చెందిన హరికృష్ణ ప్రథమ స్థానంలో నిలిచాడు. 42 కిలోమీటర్ల పరుగుపందెం పోటీలు నేపాల్ రాష్ట్రంలో జరిగాయి. అంతర్జాతీయ రన్నింగ్ పోటీల్లో పాల్గొన్న హరికృష్ణ 42 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి మొదటిస్థానం కై వసం చేసుకున్నాడు. నడిగడ్డ వాసి, మారుమూల గ్రామానికి చెందిన యువకుడు ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రథమస్థానంలో నిలవడంతో మండల ప్రజలతోపాటు పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ హరికృష్ణకు అభినందనలు తెలిపారు. మద్యం దుకాణాల్లో ‘టాస్క్ఫోర్స్’ తనిఖీలు గద్వాల క్రైం: జిల్లా కేంద్రంలోని మద్యం దుకాణాలను బుధవారం సాయంత్రం రాష్ట్ర ఎకై ్సజ్ టాస్క్ఫోర్సు అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. 2023– 2025 వరకు మద్యం దుకాణాలు నిర్వహించగా.. ఇప్పటి వరకు ఎంత మద్యం విక్రయించారు, ఆర్థిక లావాదేవీలు, స్టాక్ ఎంత ఉంది తదితర విషయాలపై రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువగా ధరలకు విక్రయాలు చేపడితే శాఖ పరమైన చర్యలు తప్పవని వ్యాపారులను హెచ్చరించారు. త్వరలో నూతన మద్యం పాలసీ ప్రారంభం కానుండడంతో వ్యాపారులు ఎవరు కూడా పాత స్టాకుకు సంబంధించిన వివరాల నివేదికాలు అందజేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై ఎకై ్సజ్ సీఐ గణపతిరెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా విధుల్లో భాగంగా రాష్ట్ర ఎకై ్సజ్ టాస్క్ఫోర్సు సిబ్బంది మద్యం, కల్లు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారని తెలిపారు. ఉమ్మడి జిల్లా హ్యాండ్బాల్ జట్ల ఎంపిక కోస్గి రూరల్: ఉమ్మడి జిల్లా అండర్ – 17 హ్యాండ్బాల్ బాల,బాలికల జట్లు ఎంపిక చేశామని ఉమ్మడి జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ సెక్రెటరీ జీయావుధ్దిన్, ఎజ్జీఎప్ సెక్రెటరీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఈమేరకు ఎంపికలు చేపట్టారు. ఇందులో ఉమ్మడి జిల్లా పరిది నుంచి 180 మంది బాల బాలికలు పాల్గొన్నారు. ప్రతిభ కనబరచిన 16 మంది బాలురు, 16 బాలికలను ఉమ్మడి జిల్లా జట్టుగా ఎంపిక చేశామని తెలిపారు. అంతకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్కుమార్ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు సాయినాథ్ , రామకృష్ణారెడ్డి , రవికుమార్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. -
చేపలు పెరగడం లేదు..
చేపల వృత్తినే నమ్ముకుని బతుకుతున్న మాకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయడం సంతోషదాయకం. కానీ, జూన్లో వదలాల్సిన చేపపిల్లలను అక్టోబర్, నవంబర్లో వేస్తున్నారు. దీంతో సీజన్ ప్రకారం తదుపరి వచ్చే మే నెల వరకు చేపలు అంతగా పెరగడం లేదు. ప్రతిసారి ఇలాగే చేస్తుండటంతో మాకు మేలు జరగకపోవడంతోపాటు సర్కారు లక్ష్యం నెరవేరడం లేదు. వర్షాకాలం ప్రారంభంలోనే చేపపిల్లలు చెరువుల్లో వదలితేనే ప్రయోజనం ఉంటుంది. – ఇప్పలి జనార్దన్, మత్స్యకారుడు, కొనగట్టుపల్లి, హన్వాడ మండలం, మహబూబ్నగర్ ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో నీరు ఎక్కువగా అందుబాటులో ఉంటుంది కాబట్టి చేప విత్తనాలు అప్పుడే వేయాలి. ఆ సమయంలో వేస్తే ఇప్పటి వరకు చేప బరువు 250 గ్రాముల వరకు పెరిగేది. ఆలస్యంగా వేయడం వల్ల కొన్ని చెరువులలో నీరు తగ్గి.. చేప బరువు పెరగదు. దీని వల్ల మత్స్యకారులకు ఎలాంటి లాభం ఉండదు. ఈసారి ఇప్పటి వరకు చేప విత్తనాలు పంపిణీ చేయలేదు. – అల్లోజి, మత్స్య సహకార సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, నాగర్కర్నూల్ ● -
ఎన్నాళ్లీ నిరీక్షణ..!
●రాజోళి: ఏళ్లు గడుస్తున్నా.. వరదలు మిగిల్చిన గాయం మానడంలేదు. 2009లో తుంగభద్ర నదికి వచ్చిన వరదల కారణంగా నదీ పరివాహక గ్రామాలన్నీ ముంపునకు గురయ్యాయి. చేనేత రంగంలో ఎంతో ఖ్యాతి గడించిన జోగుళాంబ గద్వాల జిల్లాలో చేనేత వృత్తిపై ఆధారపడి వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. గద్వాల పట్టణంతో పాటు గట్టు, అయిజ, మండలాల్లో కూడా చేనేత కార్మికులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. అయితే ప్రధానంగా రాజోళి, అయిజ మండలాలే ముంపునకు గురయ్యాయి. ఈ మండలాల్లో చేనేత కార్మికులు అదే వృత్తిపై ఆధారపడి వేల సంఖ్యలో జీవనం సాగిస్తున్నారు. గతంలో వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి, ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టింది. అయితే ఈ గృహాలు మరీ చిన్నవిగా ఉండటంతో అందులో చేనేత కార్మికులు మగ్గం ఏర్పాటు చేసుకునేందుకు వీలుకాకపోవడంతో, చేనేత కార్మికుల వినతి మేరకు ప్రభుత్వం వర్క్ షెడ్లు కూడా నిర్మించేందుకు అంగీకరించింది. కానీ ఇప్పటిదాకా వర్క్ షెడ్ల ఊసే లేకపోవడంతో చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా భారీ వర్షాల నేపథ్యంలో ఇరుకు గృహాల్లో మగ్గం గుంతల్లోకి నీరు చేరి నేత పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. వర్షాలతో తీవ్ర ఇబ్బందులు చేనేత వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు చిన్న ఇళ్లు ఉన్నప్పటికీ మగ్గం ఏర్పాటు చేసుకోక తప్పడం లేదు. ఉన్న చిన్న ఇంటిలోనే గుంత మగ్గాలు ఏర్పాటు చేసుకున్నారు. ఉన్న రెండు గదుల ఇంటిలో ఒక గది మగ్గానికే సరిపోతుంటే, మరో గదిలోనే కుటంబ సభ్యులతో కాలం వవెల్లదీస్తున్నామని వాపోతున్నారు. ఇళ్లన్నీ నల్లమట్టి భూమిలో నిర్మించడం వలన ఈ వర్షాకాలంలో కురుస్తున్న భారీ వర్షాలకు మగ్గం గుంతలోకి నీరు వచ్చి చేరుతుంది. దీంతో నీటి ఊట రావడంతో మగ్గం గుంత నిండిపోతుంది. మెటీరియల్ నష్టపోవడమే కాకుండా, గుంతలోని నీరు ఎత్తిపోసుకోవడానికి సమయం వృథా అవుతుందని, గుంతలో నీరు ఎత్తిపోసుకోవడానికి నాలుగు రోజులు సమయం పట్టడంతో పాటు, తడిసిన మగ్గాలు ఆరే వరకు బట్టలు నేయడం కుదరదని వాపోతున్నారు. దీంతో నష్టాలు తప్పడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా, ఒక్కో వర్క్ షెడ్కు రూ.45 వేల నుంచి రూ.60 వేల దాకా ఖర్చు పెట్టి నిర్మించేందుకు 2009లో అప్పటి ప్రభుత్వం ఒప్పుకుంది. ఇళ్ల నిర్మాణ సమయంలో ఇళ్లతో పాటుగానే వర్క్ షెడ్లు నిర్మిచాలని చేనేత కార్మికులు కోరినప్పటికీ, అధి ముందుకు సాగలేదు. కొందరు చేనేత కార్మికులకు వర్క్ షెడ్లు మంజూరు అయినప్పటికీ వాటి నిర్మాణం కూడా మధ్యలోనే నిలిచిపోయింది. ఇలా ఏళ్లుగా ప్రభుత్వాలు మారిన, ప్రత్యేక రాష్ట్రం, జిల్లా ఏర్పడినా.. తమ సమస్య తీరడం లేదని చేనేత కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఇరుకు గృహాల్లో మగ్గాల ఏర్పాటుకు ఇబ్బందులు భారీ వర్షాల నేపథ్యంలో మగ్గం గుంతల్లో చేరుతున్న నీరు ఎప్పటికప్పుడు చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. వివిధ స్కీంల ద్వారా వచ్చే ప్రయోజనాలను తెలియచేస్తున్నాం. వర్క్ షెడ్ల విషయానికి వస్తే గతంలో హౌసింగ్ శాఖ ద్వారా షెడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కాగా.. ఆ శాఖ లేకపోవడంతో నిర్మాణాలు నిలిచాయి. ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం. వాటిని మంజూరు చేసేందుకు కృషి చేస్తాం. – గోవిందయ్య, ఏడీ, చేనేత, జౌళి శాఖ జిల్లాలో 6,948 మంది చేనేత కార్మికులు ఉండగా.. జియో ట్యాగింగ్ లేని వారితో లెక్కిస్తే మరింత ఎక్కవ సంఖ్యలో ఉంటారు. అందులో సింహభాగం రాజోళిలోనే ఉన్నారు. వీరిలో చాలా మందికి పునరావాసంలో ఇళ్ల కేటాయింపు జరిగింది. మరికొందరికీ అసలు ఇళ్లే మంజూరు కాలేదు. ప్రభుత్వం నిర్మించిన ఈ ఇళ్లు కూడా చాలా చిన్నవిగా ఉన్నాయి. కాలక్రమంలో కొద్దికాలం పాటు హౌసింగ్ శాఖ లేకపోవడంతో ఇటు ఇళ్ల నిర్మాణం, అటు వర్క్ షెడ్ల నిర్మాణం ప్రశ్నార్ధకంగా మారింది. ఈ క్రమంలో రాజోళిలో మొత్తం 776 వర్క్ షెడ్లు మంజూరు కాగా.. ఇప్పటి వరకు 25 మాత్రమే నిర్మాణం పూర్తయ్యాయి. ఇందులో కొందరు సొంతంగా వర్క్ షెడ్లు నిర్మించుకోగా, మరి కొందరు స్థోమత లేక నిర్మించుకోలేదు. మరి కొందరు మధ్యలోనే నిలిపేశారు. నిర్మించుకున్న వారికి ఇంతవరకు బిల్లులు కూడా అందలేదు. -
చెరువుకు చేరినా..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: మత్స్యకారుల ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వందశాతం సబ్సిడీతో చేపపిల్లలను పంపిణీ చేస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి సుమారు మూడు నెలల క్రితమే ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా.. వివిధ రకాల కారణాలతో జాప్యం చోటుచేసుకుంది. ఎట్టకేలకు గత నెల 17న పంపిణీకి శ్రీకారం చుట్టినప్పటికీ.. నిర్దేశిత లక్ష్యం చేరుకోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు అదునుదాటిన తర్వాత చేప విత్తనాలు సరఫరా చేయడం.. నిర్దేశిత లక్ష్యంలో కోత పెట్టి తూతూమంత్రంగా ముగించడం ప్రతిఏటా ఆనవాయితీగా వస్తోంది. ఇది చాలదన్నట్లు కాంట్రాక్టర్లు మేలు రకాలకు తిలోదకాలు ఇస్తుండడంతో సర్కారు లక్ష్యం నెరవేరడం లేదు. రెండేళ్లుగా ఆలస్యంగానే.. రాష్ట్రంలో మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి వందశాతం సబ్సిడీపై చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎదిగిన చేపల విక్రయం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించగా.. మత్స్యకారుల కుటుంబాల్లో ఆర్థిక భరోసా ఏర్పడింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. ఈ పథకాన్ని కొనసాగించింది. గతేడాది ఉమ్మడి జిల్లాలో బొచ్చ, బంగారు తీగ, రౌట, మోస్ వంటి రకాల చేప పిల్లలను వదిలారు. ఈసారి కూడా ప్రభుత్వం చేప విత్తనాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. అయితే ఎప్పుడూ ఏప్రిల్లో టెండర్లు ప్రారంభించి వర్షాకాలంలోగా చేపల పంపిణీని పూర్తిచేసేవారు. కానీ, రెండేళ్లుగా పలు కారణాలతో ఈ ప్రక్రియలో ఆలస్యం జరుగుతూ.. సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు పంపిణీ చేస్తున్నారు. ఈసారి అదే తీరు.. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలోని 4,225 నీటి వనరుల్లో రూ.11.80 కోట్ల వ్యయంతో 10.63 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు 863 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లోని సభ్యులు, లైసెన్స్దారులు మొత్తం 66,808 మందితోపాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా మరికొన్ని వేలాది మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. కానీ, ఇప్పటి వరకు పదిశాతం కూడా లక్ష్యాన్ని చేరలేదు. మహబూబ్నగర్, నారాయణపేట, గద్వాల జిల్లాలో చేపపిల్లల పంపిణీ ప్రారంభం కాగా.. వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఇంకా మొదలుపెట్టలేదు. ఇక్కడ మంత్రి చేతులమీదుగా ప్రారంభించాలని వేచిచూస్తుండడంతోనే ఆలస్యం జరుగుతున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా పూర్తిచేస్తామని ‘అధికార’ యంత్రాంగం చెబుతున్నా.. గతేడాదిలాగే కోత తప్పదని మత్స్యకార సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. గతేడాది ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 8.81 కోట్ల చేప పిల్లలను చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో వదలాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఒక్క జోగుళాంబ గద్వాల జిల్లాలోనే పూర్తిస్థాయిలో లక్ష్యం చేరుకోగా.. మిగతా నాలుగు జిల్లాల్లో సగం కూడా చేరుకోలేకపోయారు. మొత్తంగా 4,56,68, 000 చేపపిల్లలను మాత్రమే నీటిలో వదలగా.. అది కూడా అదును దాటిన తర్వాత అక్టోబర్ చివరలో మొదలుపెట్టి నవంబర్ చివరలో పూర్తి చేశారు. పలు జిల్లాల్లో అదును దాటిన నేపథ్యంలో 35–40 ఎంఎం సైజు చేపలు వేయలేదు. 80–100 ఎంఎం సైజు గల చేప పిల్లలనే వదిలినా సరిగా ఎదగలేదని మత్స్యకారులు పేర్కొంటున్నారు. ఇందుకు అదును దాటిన తర్వాత చేప పిల్లలు వదలడమే కారణమని చెబుతున్నారు. చివరికి నిర్దేశిత టార్గెట్లోనూ సగం మేర కుదింపు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రతిఏటా ఇదే తంతు కాంట్రాక్టర్ల చేతిలోనే మత్స్యకారుల భవిష్యత్ ‘అధికార’ యంత్రాంగం ప్రత్యేక దృష్టిసారిస్తేనే ఫలితం -
భూసార పరీక్షలు తప్పనిసరి
గట్టు: ప్రతి రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి జగ్గునాయక్ సూచించారు. మంగళవారం మండలంలోని ఆరగిద్ద రైతువేదికలో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు భూసార పరీక్షలకు సంబంధించిన ధ్రువపత్రాలను ఆయన అందజేసి మాట్లాడారు. మట్టి పరీక్షల ఫలితాల ఆధారంగా పంటలు సాగుచేసి.. అవసరం మేరకు ఎరువులు వినియోగించాలని సూచించారు. రైతులు విచ్చలవిడిగా రసాయనిక ఎరువుల వినియోగంతో భూసారం తగ్గుతుందన్నారు. పంటల సాగులో సేంద్రియ ఎరువుల వాడాకాన్ని పెంచాలన్నారు. ఏడీఏ సంగీతలక్ష్మి మాట్లాడుతూ.. ఎఫ్ఏక్యూ ప్రమాణాల మేరకు రైతులు పత్తిని ఆరబెట్టుకొని తేమశాతం 8 ఉండే విధంగా చూడాలని తెలిపారు. తద్వారా మద్దతు ధర రూ. 8,110 లభిస్తుందన్నారు. వానాకాలంలో రైతులు పండించిన వరిధాన్యంలో తేమ 17శాతంలోపు ఉండాలని.. తాలు, మట్టి లేకుండా కొనుగోలు కేంద్రాలకు తరలించాలని కోరారు. వరికోత మిషన్లో గేర్ స్టోన్ను ఏ–2 నుంచి బీ–1లోకి పెట్టి కోతలు కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హనుమంతురెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్, ఏఈఓలు తిరుమలేష్, తోహిద్, అలివేలు, శ్రావణి, వీరేశ్, ప్రకాశ్, భార్గవి తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు నష్టపరిహారంఅందించాలి
ఎర్రవల్లి: ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రాంబాబు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన పార్టీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం.. కాలయాపన చేయడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం వెంటనే పంటలు నష్టపోయిన రైతులను గుర్తించి తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు మణికుమార్, బుచ్చన్న, మోషే, రామకృష్ణ ఉన్నారు. -
ఏర్పాట్లు చేస్తున్నాం..
వానాకాలంలో పండించిన ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లావ్యాప్తంగా 2లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నాం. ఇందుకు అనుగుణంగా 84 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తాం. కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా అక్రమాలకు పాల్పడిన రైస్మిల్లర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఆర్ఆర్ యాక్టు కింద రికవరీ చేస్తాం. – వి.లక్ష్మీనారాయణ, అదపు కలెక్టర్ -
ఉత్సాహంగా ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో మంగళవారం ఉమ్మడి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14, అండర్–17 విభాగాల బాలబాలికల కరాటే జట్ల కోసం ఎంపికలు నిర్వహించారు. జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి, జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ ఎంపికలను ప్రారంభించారు. జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి మాట్లాడుతూ ఎంపికలకు ఉమ్మడి జిల్లా నుంచి 300 మంది హాజరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో పీడీలు వేణుగోపాల్, పరుశరాముడు, శశికళ, ఉమ్మడి జిల్లాలోని కరాటే మాస్టర్లు పాల్గొన్నారు. -
ఉన్నత లక్ష్యంతో చదివితే ఉజ్వల భవిష్యత్
గట్టు: పోటీ ప్రపంచంలో రాణించేందుకు ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యంతో చదువుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి డా.ప్రియాంక సూచించారు. కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశాల మేరకు మంగళవారం మాచర్ల, ఇందువాసి పాఠశాలల్లో 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రేరణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై ఉపాధ్యాయులు చెప్పే పాఠ్యాంశాలను శ్రద్ధగా విని అర్థం చేసుకోవాలన్నారు. ప్రతి పాఠాన్ని కేవలం సబ్జెక్టుగా చూడకుండా.. తమ భవిష్యత్ను మార్చే గొప్ప అవకాశంగా భావించాలని సూచించారు. ఉపాధ్యాయులు చెప్పబోయే పాఠాన్ని ఒక రోజు ముందుగానే విద్యార్థులు ఇంటి వద్ద చదువుకుని వస్తే మరింత సులభంగా అర్థమవుతుందని తెలిపా రు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు నిత్యం వ్యాయామం చేయాలని సూచించా రు. సాంస్కృతిక కార్యక్రమాలకు కొంత సమయం కేటాయించాలని తెలిపారు. కార్యక్రమంలో హెచ్ ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలుకు సన్నద్ధం
గద్వాల: వానాకాలంలో రైతులు పండించిన వరిధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జిల్లావ్యాప్తంగా 2లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఈ మేరకు రైతులకు అందుబాటులో 84 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన గన్నీ బ్యాగులు, కాంటాలు, తేమ శాతం పరిశీలించే యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు తదితర వాటిని అందుబాటులో ఉంచనున్నారు. కాగా, 2024–25 వానాకాలం, యాసంగి సీజన్లో ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యానికి సంబంధించిన సీఎమ్మార్ను మిల్లర్లు పెట్టకుండా.. మరోసారి ప్రభుత్వం నుంచి ధాన్యాన్ని తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. గతేడాది వానాకాలంలో 96వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా.. యాసంగిలో లక్ష మెట్రిక్ టన్నులు సేకరించారు. ఇందులో వానాకాలం ధాన్యానికి సంబంధించి 83 శాతం సీఎమ్మార్ పెట్టగా.. యాసంగికి సంబంధించి 44 శాతం మాత్రమే సీఎమ్మార్ పెట్టారు. ఈ క్రమంలోనే రూ. 10కోట్ల విలువజేసే ధాన్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టించారు. గతేడాది కేటాయింపులు ఇలా.. 2024–25 వానాకాలంలో జిల్లావ్యాప్తంగా 96618.800 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి.. 37 రైస్మిల్లులకు కేటాయించారు. రైస్మిల్లర్లు మొత్తం 64734.248 మెట్రిక్ టన్నుల సీఎమ్మార్ పెట్టాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 54459.234 మెట్రిక్ టన్నుల బియ్యం అందించారు. ఇంకా 10915.947 మెట్రిక్ టన్నుల బియ్యం పెట్టాల్సి ఉంది. అదే విధంగా యాసంగి సీజన్లో 101924.320 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి.. 39 రైస్మిల్లులకు కేటాయించారు. ఇందుకు సంబంధించి 68339.908 మెట్రిక్ టన్నుల సీఎమ్మార్ పెట్టాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కేవలం 30465.030 మెట్రిక్ టన్నుల సీఎమ్మార్ పెట్టారు. ఇంకా 38551.511 మెట్రిక్ టన్నుల సీఎమ్మార్ అందించాల్సి ఉంది. రూ.10కోట్లధాన్యం బొక్కేసిన మిల్లర్లు.. ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యాన్ని కొందరు మిల్లర్లు పక్కదారి పట్టించారు. రూ. 10కోట్లకు పైగా ధాన్యాన్ని దర్జాగా బొక్కేశారు. కేటీదొడ్డి మండలం కమ్మిడి స్వామి రైస్మిల్లు నిర్వాహకుడు రూ. 7.80కోట్ల విలువ గల ధాన్యాన్ని స్వాహా చేయగా.. గద్వాల సమీపంలోని శ్రీరామ రైస్మిల్లు యజమాని రూ. 2.25కోట్ల ధాన్యాన్ని స్వాహా చేశారు. ఆయా రైస్మిల్లుల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించి.. అక్రమార్కుల లెక్క తేల్చారు. అక్రమార్కులపై కేసులు నమోదు చేయడంతో పాటు ఆర్ఆర్ యాక్టు కింద నోటీసులు జారీ చేశారు. కాగా, పెద్ద మొత్తంలో ఽప్రభుత్వ ధాన్యాన్ని మిల్లర్లు బొక్కేస్తుంటే.. ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టి నియంత్రించాల్సిన జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు కొందరు అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ వాటాలు పంచుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 2లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం జిల్లావ్యాప్తంగా 84 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు గతేడాది యాసంగిలో తీసుకున్న ధాన్యానికి 44శాతం మాత్రమే సీఎమ్మార్ పెట్టిన మిల్లర్లు -
దళారులను నమ్మి మోసపోవద్దు
అలంపూర్ రూరల్: రైతులు కష్టించి పండించిన పంటను దళారులకు విక్రయించి మోసపోవద్దని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మంగళవారం అలంపూర్ మండలం క్యాతూర్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్వింటాల్కు రూ. 2,400 మద్దతు ధర చెల్లిస్తుందని.. తేమ 14శాతంలోపు ఉండాలని.. ఎకరాకు 25 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేస్తున్నట్లు మార్క్ఫెడ్ డీఎం చంద్రమౌళి వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డెప్ప, వైస్ చైర్మన్ కుమార్, ఏఓ నాగార్జున్రెడ్డి, క్యాతూర్ పీఎసీఎస్ ఆధ్యక్షుడు రాఘవరెడ్డి, సీఈఓ హుస్సేన్ పీరా పాల్గొన్నారు. -
‘గుడ్విల్’తో గాలం
● వైన్స్లను దక్కించుకునేందుకురంగంలోకి లిక్కర్ వ్యాపారులు ● రూ.లక్షల్లో మొదలైన బేరసారాలు అచ్చంపేట/గద్వాల క్రైం: మద్యం దుకాణాల కేటాయింపు పూర్తికావడంతో.. వాప్యారుల బేరసారాలు మొదలయ్యాయి. నజరానా ఇస్తాం.. దుకాణం ఇస్తారా.. అంటూ లక్కీడ్రాలో మద్యం దుకాణం దక్కిన వారిని వ్యాపారులు ప్రలోభపెడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో డిమాండ్ను బట్టి నజరానా ఇచ్చేందుకు చర్చలు జరుపుతున్నారు. అయితే లక్కీ డ్రాలో దుకాణం దక్కించుకున్న వారంతా మంగళవారం ఆయా దుకాణాలకు రెంటల్ రేటు ఆధారంగా 1/6వ వంతు డబ్బులు చెల్లించారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. టెండర్ల ప్రక్రియ ముగియడంతో డిసెంబరు 1 నుంచి మద్యం దుకాణాలు తెరిచేందుకు వ్యాపారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలో సిండికేట్ వ్యాపారులకు దక్కని మద్యం దుకాణాలపై కన్నేశారు. పట్టణాలతో పాటు మండల కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న దుకాణాలను తమ గుప్పిట్లో ఉంచుకోవాలని బడా, పాత లిక్కర్ వ్యాపారుల యోచిస్తున్నారు. గుడ్విల్ ద్వారా ఆ దుకాణాలను చేజిక్కించుకుని మద్యం వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. సిండికేట్ కోసం.. మద్యం దుకాణాలకు టెండర్లు ముగిశాయి. లక్కీడ్రాలో జిల్లాలోని 34 దుకాణాల ఎంపిక పూర్తయింది. ఇప్పుడు ఉన్న అన్ని దుకాణాల యజమానులు ఒక్కటైతేనే సిండికేట్గా మార్గం సులువవుతుంది. తద్వారా చీఫ్ లిక్కర్ విక్రయాలు, బెల్టుషాపులకు అధిక ధరలకు విక్రయించుకునే అవకాశాలను జోరుగా నడిపేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ వ్యాపారంలో తలపండిన వారికి సిండికేట్, బెల్టు షాపులకు లిక్కర్ సరఫరా వంటివి సులువుగా చేసేస్తారు. తమకు దక్కిన దుకాణాలతోపాటు ఇతర వాటిని పొందడం ద్వారా లిక్కర్ వ్యాపారాన్ని తమ గుప్పిట్లో ఉంచుకునేందుకు మంతనాలు జరుపుతున్నారు. నిబంధనల ప్రకారం ఉంటేనే.. ప్రస్తుత మద్యం పాలసీ నవంబర్ 30న ముగియనుండగా 2025–27కు సంబంధించి కొత్త మద్యం దుకాణాలు డిసెంబర్ 1 నుంచి ప్రారంభవుతాయి. అయితే మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు ఎక్కడ దుకాణం ఏర్పాటు చేస్తారు.. ఏ పేరిట దుకాణం పెడతారు.. తదితర వివరాలను ఎకై ్సజ్ శాఖ అధికారులకు సమర్పించాలి. దుకాణం గుడి, బడి, ఆస్పత్రికి 100 మీటర్ల దూరంలో ఉందా.. లేదా.. నిబంధనల ప్రకారం ఏర్పాటు చేస్తున్నారా.. అనే విషయాలను అధికారులు పరిశీలించిన తర్వాత అన్నీ సవ్యంగా ఉంటేనే మద్యం దుకాణం ఏర్పాటుకు లైసెన్స్ జారీ చేస్తారు.


