నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో సోమవారం నుంచి ఇంటర్మీడియెట్ ప్రయోగ పరీక్షలు ప్రా రంభం కానున్నాయి. 15 పరీక్ష కేంద్రాల్లో 4,691 మంది విద్యార్థులు హాజరుకానున్నా రు. 11 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, నాలు గు ప్రైవేట్ కాలేజీల్లో సెంటర్లు ఏర్పాటు చేశా రు. ఈ ఏడాది కళాశాలలకు రూ.50వేల చొప్పున నిధులు కేటాయించడంతో ఇప్పటికే రసాయన పదార్థాలు, ఇతర సామగ్రిని కొనుగోలు చేశారు. అవకతవకలకు తావులేకుండా అన్ని కాలేజీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 11 వరకు బోర్డు నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తామని డీఐఈవో రాందాస్ తెలిపారు.


