‘చలో ఢిల్లీ’ విజయవంతం చేయాలి
ఆసిఫాబాద్రూరల్: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5న తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 23ను సవరించి 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సింగ్, రవి, విజేష్, అనిల్ కుమార్, శ్రావణ్ కుమార్, రమేశ్, హేమంత్, తదితరులు పాల్గొన్నారు.


