వనదేవతలకు మొక్కులు
కాగజ్నగర్ మండలం నందిగూడ శివారులోని పెద్దవాగు ఒడ్డున సమ్మక్క– సారలమ్మలు కొలువుదీరారు. పడిగిద్దరాజు, గోవిందరాజులు కూడా గద్దెలపైకి రావడంతో ఆసిఫాబాద్, రెబ్బెన, బెజ్జూర్, కౌటాల, సిర్పూరు(టి) మండలాలతోపాటు మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ దండె విఠల్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జెడ్పీ మాజీ చైర్మన్ కోనేరు కృష్ణారావు మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో జాతర కమిటి అధ్యక్షుడు తుమ్మ రమేశ్, సభ్యులు శ్రీనివాస్, కోట శంకర్, వెంకటేశ్ పాల్గొన్నారు. – కాగజ్నగర్టౌన్


