ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ
ఆసిఫాబాద్అర్బన్: ప్రశాంత వాతావరణంలో ము న్సిపల్ ఎన్నికలు నిర్వహించడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఎన్నికల సాధారణ పర్యవేక్షకుడు అలోక్కుమార్ అన్నారు. ఆసిఫాబాద్ పట్టణంలోని పెద్దవా గు తీరంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టు, ఆదిలాబాద్ ఎక్స్రోడ్డు వద్ద ఉన్న చెక్పోస్టును బుధవారం నోడల్ అధికారి అశ్వక్ అహ్మద్తో కలిసి తనిఖీ చేశారు. వివిధ రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డబ్బు, మద్యం లేకుండా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చెక్పోస్టులోని సిబ్బంది ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో లైజనింగ్ అధికారి ప్రణయ్, సిబ్బంది పాల్గొన్నారు.


