‘భగీరథ’ పైపులైన్‌ లీకేజీ | - | Sakshi
Sakshi News home page

‘భగీరథ’ పైపులైన్‌ లీకేజీ

Aug 2 2026 11:49 PM | Updated on Aug 2 2026 11:49 PM

కాగజ్‌నగర్‌టౌన్‌: వరదల కారణంగా కాగజ్‌నగర్‌ మండలంలోని చింతగూడ సమీపంలో గల మిషన్‌ భగీరథ ప్రధాన పైపులైన్‌ దెబ్బ తినడంతో కాగజ్‌నగర్‌, దహెగాం మండలా ల్లో రెండు రోజులుగా తాగునీటి సరఫరా నిలి చిపోయింది. ఈ విషయమై మిషన్‌ భగీరథ డీఈ పృథ్వీరాజ్‌ను వివరణ కోరగా.. చింతగూడ వద్ద పైపులైన్‌ గాస్కెట్‌ భారీ వరదలకు దెబ్బతినడంతో లీకేజీ అవుతోందని తెలిపా రు. దీంతో కాగజ్‌నగర్‌, దహెగాం మండలా ల పరిధిలో తాగునీటి సరఫరాకు అంతరా యం ఏర్పడుతోందని పేర్కొన్నారు. మరమ్మతులు చేపట్టి సోమవారం నుంచి తాగునీటి స రఫరాను పునరుద్ధరించనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement