శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్‌ సెర్చ్‌ | - | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్‌ సెర్చ్‌

Jul 18 2026 11:57 PM | Updated on Jul 18 2026 11:57 PM

కాగజ్‌నగర్‌టౌన్‌: శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నామని డీఎస్పీ వహీదుద్దీన్‌ తెలి పారు. ఎస్పీ నితకా పంత్‌ ఆదేశా ల మేరకు శనివా రం పట్టణంలోని సుభాష్‌ చంద్రబోస్‌ కాలనీలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో తెల్లవారు జాము న పోలీసులు నాలుగు బృందాలుగా విడిపో యి ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహించారు. అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేష న్‌, లైసెన్స్‌ లేని 64 ద్విచక్ర వాహనాలు, అనుమతి లేకుండా నడుస్తున్న 1 ఆటోను సీజ్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరి రక్షణలో భాగంగా చోరీలు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. రోడ్డు భద్రత నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాలన్నారు. కార్యక్రమంలో సీఐ ప్రేమ్‌ కుమార్‌, ఎస్సైలు లక్ష్మ ణ్‌, యాదగిరి, సందీప్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement