సిర్పూర్(టి): మండలంలోని హీరాపూర్కు చెందిన రైతు టేకం పెంటు (26) బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన విధితమే. భూకబ్జాదారుడు కె.వేణుగోపాల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి ఆవరణలో గిరిజన సంఘ నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మన్నెవార్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుర్స పోచయ్య మాట్లాడుతూ ప్రభుత్వం బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


