భద్రత ప్రశ్నార్థకం..! | - | Sakshi
Sakshi News home page

భద్రత ప్రశ్నార్థకం..!

Jul 17 2026 1:22 AM | Updated on Jul 17 2026 1:22 AM

● ఈ నెల 4న కాగజ్‌నగర్‌ మండలం ఎన్జీవోస్‌ కా లనీ సమీపంలోని జ్యోతిబా పూలే గురుకుల పా ఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినికి కొందరు విద్యార్థినులు రాత్రి స్టడీ అవర్‌ సమయంలో బలవంతంగా పెన్ను క్యాప్‌ మింగించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాటి పురోగతి లేదు. ఈ విషయం బయటికి రాకుండా ఉపాధ్యాయులు జాగ్రత్త పడ్డారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ● పెన్ను క్యాప్‌ ఘటన జరిగిన వారం రోజుల్లోనే మంగళవారం పెట్రోల్‌ పంప్‌ ఏరియాలోని ఎంజేపీ బాలుర పాఠశాల విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళకు చేశారు. ‘పీఈటీ టార్చర్‌ తట్టుకోలేకపోతున్నాం.. బూతులు తిడుతున్నారు..’ అంటూ ఆరోపణలు చేస్తూ నిరసన తెలిపారు. ప్రతీ చిన్న తప్పును ఆసరాగా తీసుకుని చితకబాదుతున్నారని వాపోయారు. ● ఎంజేపీ గురుకులంలో ఆరు నెలల క్రితం మరో సంఘటన జరిగింది. ఓ విద్యార్థి వాటర్‌ బాటిల్‌లో తోటి విద్యార్థులు యూరిన్‌ నింపి పెట్టగా, అది తెలియని సదరు విద్యార్థి తాగాడు. ● గతేడాది కౌటాల మండలానికి చెందిన 8వ తరగతి విద్యార్థి సాయంత్రం నాలుగు గంటలకు కాలు విరగగా కనీసం ఆస్పత్రికి తరలించలేదు. ఆ విద్యార్థి తండ్రికి సమాచారం ఇవ్వగా రాత్రి 10.30 గంటలకు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యమందించాడు. ● ఏడాది క్రితం సైతం ఇదే విద్యాలయానికి చెంది న కొంతమంది విద్యార్థులు రాత్రి 12 గంటల ప్రాంతంలో గోడ దూకి వెళ్లి ఐస్‌క్రీం తిన్నారు. రాత్రిపూట ఉపాధ్యాయులు ఉన్నా భద్రతను పట్టించుకోలేదు. ● గత విద్యాసంవత్సరం చివరలో విద్యార్థుల మధ్య గొడవ జరగడంతో తొమ్మిది మందికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిచారని సమాచారం. వారంతా ఇంటి నుంచే వచ్చి పరీక్షలు రాశారు.

జిల్లాలోని ఎంజేపీ గురుకులాల్లో వరుస ఘటనలు ఇటీవల కాగజ్‌నగర్‌లో రోడ్డెక్కి నిరసన తెలిపిన విద్యార్థులు సరైన సౌకర్యాలు కల్పించాలని తల్లిదండ్రుల డిమాండ్‌

కాగజ్‌నగర్‌టౌన్‌: సిబ్బంది తప్పిదాలో.. అధికారు ల పర్యవేక్షణ లోపామో గాని జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాలు గాడి తప్పుతున్నాయి. వరుస ఘటనలు చోటుచేసుకుంటుండంతో తల్లిదండ్రులు విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఓ విద్యార్థినితో బలవంతంగా పెన్ను క్యాప్‌ మింగించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ ఘటన మరువక ముందే ప్రిన్సిపాల్‌, పీఈటీ వేధింపులు తట్టుకోలేకపోతున్నామని విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు.

ఐదు ఎంజేపీ గురుకులాలు

జిల్లాలో మొత్తం ఐదు మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాలు ఉన్నాయి. ఇందులో కాగజ్‌నగర్‌లో రెండు(బాలుర, బాలికలు), ఆసిఫాబాద్‌లో మూడు(బాలికలు రెండు, బాలురు ఒకటి) నిర్వహిస్తున్నారు. అయితే రెండింటికి మాత్రమే పక్కా భవనాలు ఉండగా, మరో మూడు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. సుమారు రెండు వేల మంది చదువుకుంటున్నారు. ఆయా గురుకులాల్లో నిత్యం ఏదో ఒక ఘటన వెలుగు చూస్తుండటంతో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. సీసీ కెమెరాలు మాయమైనా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

వరుస ఘటనలు

సోషల్‌ మీడియాకు అడిక్ట్‌

మారుతున్న టెక్నాలజీతో పిల్లలు సోషల్‌ మీడియాలో వస్తున్న ఘటనలకు అడిక్ట్‌ అవుతున్నారు. విద్యార్థులతో మాట్లాడి అవగాహన కల్పించాం. ప్రిన్సిపాల్‌, పీఈటీ కొత్తగా రావడం, వారు కొంత కఠినంగా నిబంధనలు అమలు చేయడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. – శ్వేత, డీసీవో

అద్దె భవనంలో ఇబ్బందులు

కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాల అద్దె భవనంలో కొనసాగుతోంది. ఇక్కడ ఇరుకు గదుల్లో పాఠాలు బోధిస్తున్నారు. చిన్న గదిలో తరగతి గదితోపాటు అందులోనే విద్యార్థుల వసతి కల్పించడంతో ఇబ్బందులు ఎ దురవుతున్నాయి. సరైన ప్రహరీ లేకపోవడంతో భోజనాలు చేసేందుకు ప్రత్యేక గది లేదు. రోడ్డుపక్కన ఖాళీ స్థలంలో భోజనాలు చేస్తుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement