శిక్షణ అనంతరం ఉ పాధ్యాయులు ప్రతీ రోజు పాఠశాలలో 3గంటల నుంచి 4గంటల వరకు రెమిడియల్ టీచింగ్ అమలు చేయాలి. ప్రత్యేక ప్రణాళికతో బోధిస్తే తప్పకుండా వెనుకబడిన విద్యార్థులు నిర్దేషించిన సామర్థ్యాలు సాధించగలుగుతారు. ఏ సమయంలో.. ఏమి బోధించాలనే విషయాలను ముందే ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేసి టీచింగ్ ప్రారంభించాలి. 2నుంచి 5వ తరగతి వరకు ప్రతీ విద్యార్థికి చదవడం, రాయడం వచ్చేలా, గణితంలో సామర్థ్యాలు సాధించేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే.
– ఉప్పులేటి శ్రీనివాస్, క్వాలిటీ కోఆర్డినేటర్


