● పీవో మంద మకరందు
ఆసిఫాబాద్రూరల్: గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు చర్యలు చేపడుతున్నామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం తనిఖీ చేశారు. పీవో మాట్లాడుతూ శిక్షణకు నామమాత్రంగా హాజరు కాకుండా, అవకాశంగా భావించి వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. విద్యార్థులకు డిజిటల్ లిటరసీపై అవగాహన ఉండేలా బోధించాలని సూచించారు. కార్యక్రమంలో డీటీడీవో అంబాజీ, ఏసీఎంవో ఉద్దవ్, డీవైఎస్వో శేకు, హెచ్ఎం లింబారావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న పీవో మంద మకరందు


