వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాలి

Aug 2 2026 12:10 AM | Updated on Aug 2 2026 12:10 AM

ఆసిఫాబాద్‌రూరల్‌: ఉపాధ్యాయులు కాలానుగుణంగా వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల ని ఐటీడీఏ పీవో మంద మకరందు సూచించారు. జిల్లా కేంద్రంలోని ఆదర్శ క్రీడా పాఠశాలలో ఆసిఫా బాద్‌, మంచిర్యాల ఉపాధ్యాయులకు నిర్వహించిన ఐదురోజుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరై శిక్షణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతిగదిలో సమర్ధవంతంగా అమలు చే యాలని సూచించారు. విద్యార్థుల్లో పఠనం, రచన, గణిత నైపుణ్యాలు, విశ్లేషణాత్మక ఆలోచన, సమస్య పరిష్కార సామర్థ్యం, సృజనాత్మకత, నాయకత్వ ల క్షణాలు పెంచాలని తెలిపారు. గిరిజన వి ద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని పేర్కొన్నారు. డీటీడీవో అంబాజీ, ఏసీఎంవో ఉద్దవ్‌, డీఎస్వో షేకు, జీసీడీవో శకుంతల, లక్ష్మయ్య, కోర్సు డైరెక్టర్‌ రవీందర్‌ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో మంద మకరందు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement