కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధి 125 పెద్దపులులకు ఆవాసయోగ్యంగా ఉంది. ప్రస్తుతం ఇక్కడ పులులు శాశ్వతంగా నివాసం ఉండడాన్ని శుభసూచకంగా భావిస్తున్నాం. అటవీశాఖ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. జీవవైవిధ్యం కలిగిన జిల్లా అడవుల్లో పులుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. గతంలో పులుల దాడుల్లో 48 పశువులు మృతి చెందగా, బాధితుల కుటుంబాలకు రూ.30 వేల చొప్పున పరిహారం అందించాం. నేడు వారితో మొక్కలు నాటించాలని ప్రణాళిక రూపొందించాం.
– అప్పయ్య,
కాగజ్నగర్ డివిజన్ అటవీ అధికారి


