ఆసిఫాబాద్అర్బన్: సదరం శిబిరాల్లో పారదర్శకంగా వైద్యపరీక్షలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కొనసాగుతున్న సదరం శిబి రాన్ని శుక్రవారం సందర్శించారు. లోకో మోటార్(ఆర్థోపెటిక్) విభాగానికి సంబంధించిన వైకల్య ని ర్ధారణ ప్రక్రియను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ అర్హులకు వేగంగా యూడీఐడీ ధ్రువపత్రాలు జారీ చేయాలన్నారు. శిబిరానికి హాజరైన ది వ్యాంగుల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఏపీడీ రామకృష్ణ, ప్రభుత్వ ఆస్పత్రి ఉప పర్యవేక్షకుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


