బాసర:నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ ఇంజినీరింగ్ విద్యార్థులు సిమెన్స్ ఇండియా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక స్కాలర్షిప్ ప్రోగ్రాంలో చోటు సంపాదించారు. యువ ప్రతిభలను ప్రోత్సహించి, ఆధునిక టెక్నాలజీ నాయకులుగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఎంపికై న విద్యార్థులకు ఆర్థిక సహాయంతోపాటు వృత్తి అభివృద్ధి అవకాశాలు అందుతాయి.
స్కాలర్షిప్ ప్రయోజనాలు
ఈ పథకం విద్యార్థులకు సమగ్ర మార్గదర్శకత్వం అందిస్తుంది. పూర్తి ఆర్థిక సహకారం విద్యా ఖర్చులకు. పరిశ్రమ నిపుణుల ప్రత్యక్ష మెంటర్షిప్. అధునాతన సాంకేతిక శిక్షణ, ప్రాక్టికల్ అనుభవం. ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్షిప్లు, ఆధునిక ఇంజినీరింగ్ పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. ఈ అవకాశాలు విద్యార్థుల కెరీర్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఇ.మురళీదర్శన్ స్కాలర్షిప్కు ఎంపికై న బి.శ్వేత, సమీనా, చిన్నారెడ్డి, శ్యామ్, హిమబిందును అభినందించారు. ఈ అవకాశం వారి కెరీర్ శిఖరాలు, దేశ సాంకేతిక పురోగతికి దోహదపడుతుందని ఆకాంక్షించారు. స్కాలర్షిప్ సెక్షన్ ఇన్చార్జ్ డాక్టర్ ఎస్.విఠల్, డాక్టర్ టి.రాకేశ్రెడ్డి, డాక్టర్ బావ్సింగ్తోసహా సిబ్బంది అభినందించారు.


