జిల్లాలో డిమాండ్కు తగినట్లు విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పెరుగుతున్న విద్యుత్ లోడ్కు అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఓవర్ లోడ్ నియంత్రించేందుకు జిల్లాలో 14 కొత్త ట్రాన్స్ఫార్మర్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు ఏడు బిగించాం. అలాగే ఏబీ స్విచ్లు ఏర్పాటు చేస్తున్నాం. లోడ్ అధికంగా ఉన్న సబ్ స్టేషన్లలో పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే దహెగాం, గుండాయపేట్, నజ్రూల్నగర్లో ఏర్పాటు చేశాం. రిజర్వ్ ఫారెస్టు ప్రాంతాల్లో 33 కేవీ లైన్లు ఉన్నచోట కవర్ కండక్టర్లు ఏర్పాటు చేస్తున్నాం. 70 కిలోమీటర్ల కేబుల్ అమర్చాం.
– ఉత్తం జాడె, విద్యుత్ శాఖ ఎస్ఈ


