కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ మున్సిపాలిటీ ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మున్సిపల్ చైర్పర్సన్ షాహిన్ సుల్తానా అన్నారు. పట్టణంలోని వార్డు నం.18లో శుక్రవారం ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని వైస్చైర్పర్సన్ కొత్తపల్లి సునీత, కమిషనర్ తిరుపతితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. చైర్పర్సన్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అధి కారులు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. 99 రోజులపాటు నిర్వహించే పనులను అధి కారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, అధికారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.


