ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని గురువారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గల సాంఘిక సంక్షేమ అభివృద్ధి కార్యాలయంలో వినతిపత్రం అందించారు. జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల్లోని నాలుగో తరగతి ఉద్యోగుల అక్రమ నియామకాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరికొన్ని వసతిగృహాల్లోనూ అక్రమంగా నియామకాలు చేపట్టారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు నగేశ్, మహేశ్వర్, మహేశ్, సభ్యులు పాల్గొన్నారు.


