మట్టి టిప్పర్ల పట్టివేత
కేశంపేట: టిప్పర్లతో అక్రమంగా మట్టిని తరలిస్తుండగా పోలీసులు అడ్డుకొని సీజ్ చేసిన సంఘటన మండల పరిధిలోని బైర్కాన్పల్లి శివారులో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలం కల్వకోలు గ్రామానికి చెందిన లక్ష్మణ్ బైర్కాన్పల్లి గ్రామ శివారులోని తట్టెకుంటతండా సమీపంలో మట్టిని తోడి అదే గ్రామంలో మరోచోటుకు తరలిస్తున్నారు. ఈ మేరకు పెట్రోలింగ్లో ఉన్న పోలీసులు మట్టిని తరలిస్తున్న రెండు టిప్పర్లను తనిఖీ చేయగా.. ఎలాంటి అనుమతులు లేవని తేలింది. దీంతో వాహనాలను స్వాధీనం చేసుకొని ఠాణాకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ నరహరి తెలిపారు.


