Vikarabad District News
-
సీజనల్ వ్యాధులతో జాగ్రత్త
సాక్షి, రంగారెడ్డిజిల్లా: సీజనల్ వ్యాధులపై అంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి 68 అర్జీలను స్వీకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణిలో ప్రజల నుంచి అందిన వినతులను పెండింగ్లో పెట్టొద్దని అన్నారు. ఎప్పటికప్పుడు వాటిని పరిశీలించి, బాధితులకు తగిన పరిష్కార మార్గం చూపించాలని ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం తలెత్తే ప్రమాదం ఉందన్నారు. వీధుల్లో చెత్త పేరుక పోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, మురుగు నీటి కాల్వల్లోని వ్యర్థాలను తొలగించి, వరద నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. దోమలు, ఈగలు వ్యాప్తి చెంది ప్రజలు సీజనల్ రోగాల బారినపడే ప్రమాదం ఉందని, వ్యాధుల నియంత్రణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, డీఆర్ఓ సంగీత, వివిధ విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు. రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి -
కమ్మేసిన పొగమంచు
ధారూరు: మండల కేంద్రంలో సోమవారం పొగమంచు ప్రజల్ని, ప్రయాణికులను ఇబ్బందుల పాలుచేసింది. పొలాలను సైతంపొగమంచు ఆవరించింది. రోడ్లను కమ్మేయడంతో వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సి వచ్చింది. విద్యార్థులకు వేడి భోజనం అందించాలి సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుబ్బలక్ష్మి మోమిన్పేట: విద్యార్థులకు నిత్యం వేడి భోజ నం అందించాలని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుబ్బలక్ష్మి ఆదేశించారు. సో మవారం మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం నిత్యం వేడిగా రుచికరమైన భోజనం పెట్టాలన్నారు. హాస్టల్ పరిసరాలు, గదులు, కిచెన్ షెడ్డును శుభ్రంగా ఉంచుకో వా లని సూచించారు. పారిశుద్ధ్యం లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులను కనిపెట్టుకొని ఉండాలని, రోజూ పాఠశాలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎస్డబ్ల్యూ శుక్ర వర్ధన్రెడ్డి, హెచ్ఓ జైపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం స్పెషల్ ఆఫీసర్ పల్లవిరెడ్డి బంట్వారం: కోట్పల్లి కేజీబీవీ జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ పల్లవీరెడ్డి సోమవారం తెలిపారు. ఇంగ్లిష్ లెక్చరర్ పోస్టులు రెండు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఎంపీహెచ్డబ్ల్యూ 1,ఎంఎల్టీ ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయన్నారు. మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు వికారాబాద్ జిల్లా నివాసులై ఉండాలన్నారు. మెరిట్, డెమో, ఆయా విభాగాల్లో సంవత్సరం పాటు బోధన చేసిన అనుభవం ఉండాలన్నా రు. తాత్కాలిక పద్ధతిని నియమించడం జరు గుతుందన్నారు.ఆసక్తి గల మహిళా అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లు, పాస్ ఫొ టోలు, ఇతర ధ్రువ పత్రాలతో ఈ నెల 18వ తేదీలోపు కోట్పల్లి కేజీబీవీలో సమర్పించాలన్నారు. మిగతా వివరాలకు సెల్ నంబర్ 8328 415565ను సంప్రదించాలని సూచించారు. 19న ప్రవేశ పరీక్ష కుల్కచర్ల: తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు ఈ నెల 19న పరీక్ష నిర్వహించనున్నట్లు ఎంఈఓ హబీబ్ అహ్మద్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. 2025 –26 విద్యా సంవత్సరంలో 5వ తరగతిలో ప్రవేశాల కోసం కుల్కచర్లలో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎగ్జామ్ రాయాలనుకునే విద్యార్థులు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ లేదా పీఈటీ ప్రవీణ్ సెల్ నంబర్ 9948640187లో సంప్రదించాలని సూచించారు. విధులు బహిష్కరించిన న్యాయవాదులు అనంతగిరి: వికారాబాద్లో సోమవారం న్యా యవాదులు తమ విధులను బహిష్కరించారు. ఈనెల 14న హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సంబంధించిన న్యాయవాదులు నారాయణ, శైలేష్ సక్సేనాలపై దాడి ఘటనను నిరసిస్తూ విధులు బహిష్కరించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నూలి బస్వరాజు, ప్రధాన కార్యదర్శి వెంకట్రెడ్డి, సీనియర్ న్యాయవాదులు మాధవరెడ్డి, ఆనంద్, శంకరయ్య, కమాల్రెడ్డి, గోపాల్రెడ్డి, లవకుమార్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర పథకాలతో నిరుపేదలకు మేలు
కందుకూరు: కేంద్రంలో ఏన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్లుగా అమలు చేస్తున్న పథకాలు నిరుపేదలు, బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేశాయని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో సోమవారం పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మ అంజిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, అవగాహన కల్పించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పని చేసి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములుయాదవ్, కడారి జంగయ్యయాదవ్, మండల ఇన్చార్జి పోరెడ్డి అర్జున్రెడ్డి, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఎల్మటి దేవేందర్రెడ్డి, జిల్లా నాయకులు జిట్టా రాజేందర్రెడ్డి, పి.శ్రీనివాస్గౌడ్, ఎస్.మల్లారెడ్డి. ఎ.సత్తయ్య, ఎన్.నర్సింహారెడ్డి, బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
భూ సమస్యలకు సత్వర పరిష్కారం
మర్పల్లి ఏఎంసీ చైర్మన్ మహేందర్రెడ్డి మోమిన్పేట: ధరణి తప్పిదాతలను సరి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని.. గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మర్పల్లి ఏఎంసీ చైర్మన్ మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని దేవరంపల్లి, ఏన్కతల గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ సమస్యలున్న రైతులు దరఖాస్తులు చేసుకుంటే అధికారులు రికార్డులు నమోదు చేసి త్వరితగతిన పరిష్కరిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, డిప్యూటీ తహసీల్దార్ సురేశ్ కుమార్, ఆర్ఐలు గోవర్ధన్, సరిత, కార్యదర్శి నర్సింలు, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు. భూ భారతితో రైతులకు మేలు కుల్కచర్ల: భూ భారతి రెవెన్యూ సదస్సులతో రైతులకు మేలు చేకూరుతుందని కుల్కచర్ల తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని బొంరెడ్డిపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భూభారతి చట్టం ద్వారా పెండింగ్ రెవెన్యూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. రైతుల మేలుకోసం నిర్విరామంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గిర్దవరి రవి, ఖాజా రెవెన్యూ సిబ్బంది అనిత, స్వప్న తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తులు స్వీకరించిన తహసీల్దార్ పరిగి: భూ భారతి రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తహసీల్దార్ ఆనంద్రావు సూచించారు. సోమవారం మండల పరిధిలోని గడిసింగాపూర్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ నరేందర్, పంచాయతీ కార్యదర్శి మొగులయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ బడులను ఆదరిద్దాం
● కలెక్టర్ ప్రతీక్జైన్ ● వికారాబాద్లో బడిబాట కార్యక్రమం అనంతగిరి: తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. సోమవారం వికారాబాద్లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల సిబ్బంది బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయు లు, విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఎఫ్ఎల్ ఎన్, ఎల్ఐపీ కార్యక్రమాలను జ్యోతి ప్రజల్వ న చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చదువు చెప్పే ఉపా ధ్యాయులను గౌరవించాలని విద్యార్థులకు సూచించారు. బాగా చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. ఎఫ్ఎల్ఎన్, ఎల్ఐపీ కార్యక్రమాలు సక్రమంగా అమలయ్యేలా చూడాల ని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్య క్రమం ద్వారా విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంచేందుకు దోహదం చేస్తుందని వివరించారు. అనంతరం విద్యార్థుల నృత్య ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తన చిన్ననాటి ఉపాధ్యాయురాలు తారబాయిని గుర్తు చేసుకున్నారు. ఆమె చదువు చెప్పడంతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని పేర్కొ న్నా రు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని సూ చించారు. అనంతరం విద్యార్థులకు యూనిఫా మ్స్, నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన టీఎల్ఎం స్టాల్స్ను సందర్శించి అభినందించారు. కార్యక్రమంలో డీఈఓ రేణుకాదేవి, మండల విద్యాధికారి బాబుసింగ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీశైలం, ఎస్ఎంసీ చైర్మన్ విజయలక్ష్మి ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పథకాలు ప్రజలకు అందేలా చూడాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వ చ్చిన ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, బడిబాట కార్యక్రమం, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని మండల అధికారులకు సూచించారు. రేషన్ దుకాణాల్లో మూడు నెలల సన్న బియ్యం పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వివిధ సమస్యల పరిష్కా రం కోసం 84 దరఖాస్తులు వచ్చాయని తెలిపా రు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ఆర్డీఓ వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
స్టయిఫండ్ చెల్లించాలంటూ ధర్నా
● విధులు బహిష్కరించి నిరసన తెలిపినహౌస్ సర్జన్స్, పీజీ విద్యార్థులు అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని మహావీర్ మెడికల్ కళాశాలలో హౌస్ సర్జన్స్, పీజీ విద్యార్థులు స్టయిఫండ్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాలుగు నెలలుగా కళాశాల యాజమాన్యం స్టయిఫండ్ చెల్లించడం లేదని పేర్కొన్నారు. జీవో నంబర్ 59, ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ప్రతి మెడికల్ కళాశాలలో హౌస్ సర్జన్లకు నెలకు రూ.25,906, పీజీ విద్యార్థులకు రూ.58.289 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. కానీ కళాశాల యాజమాన్యం నాలుగు నెలలుగా ఈ మొత్తం ఇవ్వడం లేదన్నారు. వెంటనే స్పందించి మా సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రక్షాళన.. పూర్తయ్యేనా!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: దేవాలయాల భూములకు రక్షణ లేకుండా పోతోంది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు అమాంతం పెరగడంతో కేటుగాళ్లు నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. చివరికి వివాదాలు కోర్టులు, ఎండోమెంట్ ట్రిబ్యూనల్స్కు చేరుకుంటున్నాయి. ఈ వివాదాల పరిష్కారంలో నిజాం కాలం నాటి ఉర్దూ భాషలో ముద్రించిన ముంతకబ్ రికార్డులు కీలక సాక్షంగా నిలుస్తున్నాయి. వందల ఏళ్ల క్రితానికి చెందిన ఈ రికార్డులు ప్రస్తుతం అవసాన స్థితికి చేరుకున్నాయి. ముట్టుకుంటే చిరిగిపోతున్నాయి. నాటి ఉర్దూను అర్థం చేసుకోవడం నేటి అధికారులకు ఇబ్బందిగా మారింది. ఆలయ ఈఓలకు ఉర్దూపై కనీస పట్టు లేదు. దేవాలయ భూములపై అవగాహన లేకపోవడంతో కోర్టుల్లో కేసులు వీగిపోతున్నాయి. విలువైన ఆలయ భూములు చేజారిపోతున్నాయి. అంతే కాదు ముంతకబ్ రికార్డుల్లోని దేవాలయాల పేర్లు, ట్రస్టీ, ఫౌండర్ల గోత్ర నామాలు గుర్తించలేని స్థితికి చేరుకున్నాయి. వివాదాల పరిష్కారంలో కీలకమైన ఈ రికార్డులను భద్రపరచడంతో పాటు ఉర్దూ నుంచి ఆంగ్లంలోకి తర్జుమా చేసి, భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని లోకాయుక్త సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయక పోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పెరిగిపోతున్న ఎండోమెంట్ పెండింగ్ కేసులు విచారణలో కీలక సాక్ష్యాలుగా మారిన ముంతకబ్ రికార్డులు నాటి ఉర్దూను అర్థం చేసుకోవడంలో అధికారుల ఇబ్బంది ఇంగ్లిష్లోకి అనువదించాలని లోకాయుక్త ఆదేశాలు ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాని తర్జుమా ప్రక్రియ అన్యాక్రాంతమవుతున్న ఆలయ భూములుదేవాదాయశాఖ భూములు (ఎకరాల్లో) జిల్లా మొత్తం భూమి అన్యాక్రాంతం మేడ్చల్ 4,125.03 2,888.18 రంగారెడ్డి 9,360.01 1,148.15 హైదరాబాద్ 5,718.01 2,374.25 వికారాబాద్ 2,294 444.16ఎండోమెంట్ ట్రిబ్యునల్లో కేసులు 2010 నుంచి ఇప్పటి వరకు నమోదైనవి 2,100 ఇప్పటి వరకు పరిష్కారమైనవి 1,365 ఇప్పటికీ పెండింగ్లో ఉన్నవి 735 హైదరాబాద్లో ఉన్న పెండింగ్ కేసులు 140 సికింద్రాబాద్లో పెండింగ్లో ఉన్న కేసులు 66 రంగారెడ్డి జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసులు 249 ఇప్పటి వరకు తర్జుమా అయిన ముంతకబ్లు 1,013 అనువాదం పూర్తికాని రికార్డులు 1,000పైనే -
ఒకే దరఖాస్తు..!
బొంరాస్పేట: మండలంలోని దుప్చర్ల గ్రామంలో సోమవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో దరఖాస్తుల కోసం రెవెన్యూ అధికారులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. సాయంత్రం కార్యక్రమం ముగిసే సమయంలో ఒకే దరఖాస్తు వచ్చింది. రెవెన్యూ సదస్సులపై అవగాహన కల్పించకపోవడమా? భూ సమస్యలే లేవా? భూభారతి చట్టంపై అపనమ్మకమా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం మండలంలోని సాలిండాపూర్లో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించనున్నారు. రైతు నేస్తం కార్యక్రమంలో కలెక్టర్ అనంతగిరి: వికారాబాద్ మండలం గొట్టిముక్కుల గ్రామ రైతు వేదికలో సోమవారం నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్జైన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి వీడియో కాన్ఫరెన్ కార్యక్రమాన్ని రైతులు, అధికారులతో కలిసి వీక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. దాడిచేసిన వారిని అరెస్ట్ చేయాలి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ తాండూరు రూరల్: మండల పరిధిలోని చెన్గేస్పూర్లో ఎరుకల కుటుంబంపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం గౌతపూర్ సమీపంలోని కరన్కోట్ పోలీస్స్టేషన్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. చెన్గేస్పూర్లో నివాసముంటున్న శారద బస్వరాజ్ కుటుంబంపై అదే గ్రామానికి చెందిన రమేష్గౌడ్, నరేందర్ గౌడ్, నానిగౌడ్, నరేష్గౌడ్, పవన్గౌడ్ దాడి చేశారన్నారు. దాడిచేసిన వారిపై వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బెల్కటూర్లో దళిత యువకుడిపై దాడి చేసిన ఘటన మరవకముందే చెన్గేస్పూర్లో ఎరుకల కుటుంబంపై దాడి చేయడం దారుణమన్నారు. సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలో దళితులు, ఎస్టీలపై దాడులు జరుగుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదని శ్రీనివాస్ అవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, కృష్ణ, చంద్రప్ప, సాయిలు, శారద, బస్వరాజ్, లక్ష్మి, కిష్టప్ప తదితరులు ఉన్నారు. మంత్రి శ్రీహరిని కలిసిన ఎమ్మెల్యే బీఎంఆర్ తాండూరు: మంత్రి వాకిటి శ్రీహరిని సోమవారం నగరంలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల వాకిటి శ్రీహరి మంత్రి పదవి చేపట్టడంతో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీతోనే తండాల అభివృద్ధి గిరిజన మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కల్యాణ్నాయక్ కడ్తాల్: బీజేపీతోనే గిరిజన తండాల అభివృద్ధి సాధ్యమని గిరిజన మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కల్యాణ్నాయక్, నాగర్కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వేముల నరేందర్రావు అన్నారు. కేంద్రంలో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టి 11 ఏళ్లే పూర్తయిన సందర్భంగా సోమవారం మండల పరిధిలోని మైసిగండిలో పార్టీ మండల అధ్యక్షుడు మహేశ్ దోనాదుల అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. గిరిజనుల అభివృద్ధికి ప్రధాని మోదీ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు సమ్మక్క సారలమ్మ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. -
నిరుత్సాహం వద్దు!
బొంరాస్పేట: నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం, అనుబంధ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఉచిత నైపుణ్య శిక్షణతో నేరుగా ఉద్యోగం పొందేలా తర్ఫీదునివ్వనున్నారు. వారి ఆసక్తికి అనుగుణంగా వారు కోరుకునే విధంగా నైపుణ్యం పెంపొందించుకుని ఎదగవచ్చు. యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేందుకు ఇదొక సువర్ణావకాశమని కొడంగల్ ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఆయన వివరించారు. యంగ్ ఇండియా సహకారంతో.. హైదరాబాద్ సమీపంలో ముచ్చింతల్లో యంగ్ ఇండియా సహకారంతో నైపుణ్యాల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోంది. కొడంగల్ ప్రాంతంతో ఇంటర్ ఆపై చదివుకున్న నిరుద్యోగులకు ఈ నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ ఇలా.. స్కిల్ యూనివర్సిటీ(నైపుణ్యాల విశ్వవిద్యాలయం)ద్వారా శిక్షణలుంటాయి. బీఎఫ్ఎస్ఐ తదితర రంగాల్లో వారం పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. లాజిస్టిక్స్ శిక్షణ, ఇంటర్వ్యూ అనంతరం ఉద్యోగం పొందే అవకాశం కల్పిస్తున్నారు. అమేజాన్, స్విగ్గీ తదితర కంపెనీలలో ఉద్యోగాలు పొందేలా శిక్షణ ఇవ్వనున్నారు. రేపు జాబ్మేళా ఈ నైపుణ్యాల శిక్షణపై పట్టణ సమీపంలోని బండల ఎల్లమ్మ ఆలయం వద్దనున్న ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఈనెల 18న బుధవారం నిర్వహించనున్న జాబ్మేళాలో ఉచిత అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియెట్ పూర్తిచేసినవారు, డిగ్రీ రెండో సంవత్సరం లేదా డిగ్రీ పూర్తయిన వారు అర్హులంటున్నారు. నైపుణ్య శిక్షణతో ఉద్యోగం సొంతం 24 ఏళ్ల లోపు యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ రేపు కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన సీఎం నియోజకవర్గంలో సరికొత్త శిక్షణ యువతకు సదావకాశం నైపుణ్యాల శిక్షణ యువత కు సదవకాశం. పేద, మఽ ద్య తరగతి యువత సద్వినియోగం చేసుకోవాలి. ఈ నైపుణ్య శిక్షణపై యంగ్ ఇండియా వీసీ, హైదరాబాద్ ప్రొఫెసర్లు అవగాహన కల్పించనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ మెమోలను డిగ్రీకశాళాలలోని డాక్టర్ మనోహర్ హాలులో అందజేయాలి. – డాక్టర్ బి.శ్రీనివాస్రెడ్డి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కొడంగల్ -
పరిషత్తు.. కసరత్తు
● పార్టీ గుర్తుపై ఎలక్షన్కు వెళ్లేందుకే ప్రభుత్వం మొగ్గు ● జిల్లాలో పెరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ● పోటీకి సిద్ధమవుతున్న ఆశావహులు వికారాబాద్: మళ్లీ ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగియగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో అన్నింటికంటే ముందుగా గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీ కాలం ముగియగా ప్రభుత్వం జీపీలకు బదులుగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాదిన్నర పూర్తయిన నేపథ్యంలో పార్టీ గుర్తుతో నిర్వహించే ఎన్నికలకే వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే అధికారులకు దిశానిర్ధేశం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2011 సెన్సెస్ ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఎన్ని ఉండాలనే దానిపై అధికారులు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. కొత్తగా ఏర్పాటైన మండలాలు, పక్క మండలాల నుంచి కలిసిన గ్రామాలు, మండలాల నుంచి మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాలను పరిగణలోకి తీసుకొనిమండలాల వారీగా ఎంపీటీసీల సంఖ్యను నిర్ణయించారు. కొత్త గా ఏర్పాటు చేసిన మండలాల్లో సెతం ఎంత మంది ఎంపీటీసీలు ఉండలానే విషయంలోనూ కసరత్తు పూర్తి చేశారు. ఈ లెక్కలు ఇప్పటికే పంచాయతీరాజ్ కమిషనర్కు అందజేసినట్లు సమాచారం. ప్రస్తుతం ‘ప్రత్యేక’ పాలన గ్రామ పంచాయతీల పదవీ కాలం గతేడాది జనవరి 31తో ముగియగా ఫిబ్రవరి నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఇప్పటికే జీపీ ఎన్నికలు సైతం పూర్తి కావాల్సి ఉండగా ప్రభుత్వం అనివార్య కారణాల వల్ల వాయిదా వేసింది. జిల్లాలో మొత్తం 221 మంది ఎంపీటీసీలు ఉండగా వారి పదవీ కాలం గతేడాది జూలైలోనే ముగిసింది. ఇక జెడ్పీటీసీలు 18 మంది ఉండగా వారి పదవీ కాలం కూడా అదే నెలలో ఒక్కరోజు తేడాతో ముగిసింది. ఈ ఏడాది జనవరిలో మున్సిపాలిటీల పదవీ కాలం సైతం ముగిసిన విషయం తెలిసిందే. జీపీలు, మండల, జిల్లా పరిషత్లతో పాటు మున్సిపాలిటీల్లో ప్రజా ప్రతినిధుల స్థానంలో ప్రత్యేకాధికారులు కొనసాగుతున్నారు. గతంలో ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశాంచింది. ఓటరు జాబితాసిద్ధ చేయాలని, బీసీ కమిషన్ నివేదికతో రెడీగా ఉండాలని సూచించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ షెడ్యూల్ విడుదల చేయడంతో అధికారులు ఆ ప్రక్రియ పూర్తి చేశారు. దాన్ని పక్కన పెట్టిన ప్రభుత్వం తాజాగా పరిషత్ ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించింది. దీంతో అందరి దృష్టి మండల, జిల్లా పరిషత్ ఎన్నికలపై పడింది. ఇక వరుస ఎన్నికలు రావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లా పరిషత్ ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికారులు పెరిగిన స్థానాలుజిల్లాలో 2019 మండల, జిల్లా పరిషత్ ఎన్నికలతో పోలిస్తే ఈ సారి మండల పరిషత్, ఎంపీటీసీల సంఖ్య పెరిగింది. గత ఎన్నికల 18 మండల పరిషత్లకు ఎన్నికలు నిర్వహించగా కొత్త గా ఏర్పాటైన చౌడాపూర్, దుద్యాల్ మండలకు ఈ సారి ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో మండల పరిషత్ల సంఖ్య 20కి చేరింది. గతంలో 221 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా ప్రస్తుతం వీటి సంఖ్య ఆరు పెరిగి 227కు చేరింది. మన జిల్లా పరిధిలోని బొంరాస్పేట్, నారాయణపేట్ జిల్లా పరిధిలోని కోస్గి మండలం నుంచి కొన్ని గ్రామాలను తీసుకుని కొత్త మండలంగా దుద్యాల్ను ఏర్పాటు చేశారు. కుల్కచర్ల మండలానికి చెందిన కొన్ని గ్రామాలు గతంలో మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలంలో కలిసిన మరి కొన్ని గ్రామాలతో చౌడాపూర్ మండలాన్ని ఏర్పాటు చేశారు. పరిగి మండలం నుంచి కొన్ని గ్రామాలు పరిగి మున్సిపాలిటీలో విలీనం చేసినప్పటికీ నవాబుపేట, కోస్గి మండలాల నుంచి కొన్ని గ్రామాలు మన జిల్లాలో కలవడంతో ఎంపీటీసీల సంఖ్య పెరిగింది. వీటన్నింటికీ ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. -
‘రైతు నేస్తం’ను సద్వినియోగం చేసుకోండి
● అడిషనల్ కలెక్టర్ సుధీర్మోమిన్పేట: రైతు నేస్తం కార్యక్రమం ద్వారా అన్నదాతలకు పంటల సాగుపై సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుందని అడిషనల్ కలెక్టర్ సుధీర్ తెలిపారు. సోమవారం మండలంలోని మేకవనంపల్లి రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. గతంలో మోమిన్పేటలో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించే వారమని దీన్ని మరో రెండు చోట్ల నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి మంగళవారం శాస్త్రవేత్తలు పంటల సాగుపై సలహాలు, సూచనలు ఇస్తారని తెలిపారు. రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. సేంద్రియ ఎరువుల వాడకంపెంచాలన్నారు. కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకర్, నాయకుడు సురేందర్, ఎంపీడీఓ విజయలక్ష్మి, తహసీల్దార్ రవీందర్,ఏఓ జయశంకర్, ఏఈఓలు పెంటయ్య, శ్రీనివాస్, చంద్రిక, శశాంక్ తదితరులు పాల్గొన్నారు. రైతులను ఆదుకుంటాం కొడంగల్: రాష్ట్రంలోని రైతులను ఆదుకుంటామని.. వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అన్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావ్తో కలిసి సోమ వారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రైతులకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. మండలంలోని రావులపల్లి, చిట్లపల్లి, పర్సాపూర్ గ్రామాల రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్పరెన్స్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వానాకాలం 2025 సీజన్కు సంబంధించి రైతు భరోసా అందిస్తామని మంత్రులు పేర్కొన్నారు. వివిధ పథకాల ద్వారా రైతులను ఆర్థికంగా బలోపేతం చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి (జిల్లా అటవీ శాఖాధికారి) జ్ఞానేశ్వర్, తహసీల్దార్ విజయ్కుమార్, ఏఎంసీ చైర్మన్ అంబయ్య గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ శివకుమార్ గుప్తా, ఎంపీడీఓ ఉషశ్రీ, మండల వ్యవసాయాధికారి తులసీ, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు. -
‘రైతు నేస్తం’తో కర్షకులకు మేలు
దోమ: ౖరెతునేస్తం కార్యక్రమంతో కర్షకులకు మేలు చేకూరుతుందని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నాడు. సోమవారం ఆయన మండల పరిధిలోని శివారెడ్డిపల్లి రైతు వేదికలో రైతులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రసంగాన్ని వీక్షించారు. రైతులు వ్యవసాయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, దిగుబడులపై సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, ఏడీఏ సౌభాగ్యలక్ష్మి కుమారి, ఎంపీడీఓ గ్యామా, మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్రావు, తదితరులు పాల్గొన్నారు. భూమి ఉన్న ప్రతి రైతుకూ రైతు భరోసా తాండూరు రూరల్: భూమి ఉన్న ప్రతి రైతుకూ ప్రభుత్వం రైతు భరోస నిధులు విడుదల చేస్తుందని తాండూరు సబ్కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. సోమవారం మండలంలోని అంతారం రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సందేశాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి నిబంధనలు లేకుండా పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్రెడ్డి, ఏడీఏ రుద్రమూర్తి, తహసీల్దార్ తారాసింగ్, ఏవో కొమరయ్య, ఏఈవో తదితరులు పాల్గొన్నారు. కుల్కచర్ల: వ్యవసాయం పండుగ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కృషి చేస్తున్నాడని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్, పీఏసీఎస్ చైర్మన్ కనకం మొగులయ్య అన్నారు. సోమవారం మండల పరిధిలోని కుస్మసముద్రం రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సాగులో ఎటువంటి అనుమానాలు ఉన్నా ప్రతీ మంగళవారం శాస్త్రవేత్తలో నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో నివృత్తి చేసుకోవచ్చునన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కుస్మసముద్రం, కుల్కచర్ల, చౌడాపూర్ గ్రామాల్లోని రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో వ్యవసాయాధికారి వీరస్వామి, ఏఈఓలు బాబు, నిఖిత, కార్యదర్శి జీవామృతం, నాయకులు రాములు, లక్ష్మయ్య, భీమయ్య, కృష్ణయ్య, అంజిలయ్య, కృష్ణారెడ్డి, సాయన్న, ఎల్లయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు. సీఎం ప్రసంగాన్ని వీక్షించిన రైతులు ధారూరు: వ్యవసాయ వర్సిటీలో సోమవారం నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ను అన్ని రైతు వేదికల్లో రైతులు, అధికారులు వీక్షించారు. ధారూరు రైతు వేదికలో మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ సాజిదాబేగం, రైతులు హాజరైయ్యారు. కేరెళ్లి రైతు వేదికలో నూతనంగా వీడియో కాన్ఫరెన్స్ను ఎంపీడీఓ నర్సింలు, ఏఓ సూర్యప్రకాశ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాన్సింగ్, ఏఈఓలు సంతోశ్, సంజూరాథోడ్ పాల్గొన్నారు. దేవర్ఫసల్వాద్లో.. దౌల్తాబాద్: వ్యవసాయ వర్సిటీలో సోమవారం ముఖ్యమంత్రి రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్లో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండల పరిధిలోని దేవర్ఫసల్వాద్లోని రైతువేదికలో రైతులు వీక్షించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకట్రావు అన్నారు. కార్యక్రమంలో ఏఓ లావణ్య, ఏఈఓలు వైశాలి నాయకులు, రైతులు పాల్గొన్నారు. రైతు భరోసాపై హర్షం యాలాల: రైతు భరోసాతో పాటు ప్రభుత్వ పథకాలపై సోమవారం సాయంత్రం సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని రైతులు వీక్షించారు. మండలంలోని రాస్నం రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల వ్యవసాయ అఽధికారి శ్వేతరాణి, ఏఈఓ శిరీషలు పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించారు. వానకాలం రైతు భరోసా నగదు జమ విషయాన్ని ప్రభుత్వం ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ జనార్ధన్రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ నర్సింలుగౌడ్, నాయకులు ఆరీఫ్ హుస్సేన్ తదితరులు ఉన్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి -
50శాతం రిజర్వేషన్లు కల్పించాలి
● బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ యాదవ్ బంట్వారం: చట్ట సభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అత్తెల్లి లక్ష్మణ్యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం బంట్వారంలో ఆయన మాట్లాడారు. పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని, లేకుంటే యుద్ధం తప్పదని హెచ్చరించారు. రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో బీసీలకు రాజకీయంగా కనీస ప్రాతినిధ్యం లభించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం సేకరించిన గణంకాల ప్రకారం చట్ట సభల్లో బీసీల ప్రాతినిధ్యం 14 శాతం దాట లేదన్నారు. దేశ జనాభాలో 56 శాతంబీసీలు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎక్కడ కనినిస్తుందని ప్రశ్నించారు. బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ప్రధానిని కోరారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లక్ష కోట్లతో బీసీ సబ్ ప్లాన్ను ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ బీసీ కమిషన్కు రాజ్యంగ బద్దమైన హక్కులు కల్పించాలన్నారు. బీసీల న్యాయమైన డిమాండ్లపై త్వరలోనే వేలాది మందితో చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని ఆయన పేర్కొన్నారు. -
లగచర్లలో ప్రశాంతంగా రెవెన్యూ సదస్సు
దుద్యాల్: మండల పరిధిలోని లగచర్లలో సోమవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సు ప్రశాంతంగా కొనసాగిందని తహసీల్దార్ కిషన్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన భూ భారతి చట్టంపై ప్రజలకు నమ్మకం పెరుగుతోందన్నారు. రైతు సమస్యల పరిష్కరించుకునేందుకు గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు చక్కని స్పందన లభిస్తోందన్నారు. రెవెన్యూ సదస్సులో 31 ఫిర్యాదులు అందినట్లు ఉప తహసీల్దార్ వీరేశ్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ నవీన్ కుమార్, రెవెన్యూ కార్యాలయ సిబ్బంది ఫకీరప్ప, ఊషప్ప, లాలాప్ప, పంచాయతీ కార్యదర్శి మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలి
తెలంగాణ కిసాన్ సంఘ్ వ్యవస్థాపకఅధ్యక్షుడు విజయ్కుమార్ అనంతగిరి/పరిగి: రైతులందరికీ రుణమాఫీ పథకం అమలు చేయాలని తెలంగాణ కిసాన్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్కుమార్ కోరారు. సోమవారం ఈ మేరకు అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సగం మందికే రుణమాఫీ అమలు చేయడం సరికాదన్నారు. రూ.2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పి కొర్రీలు పెట్టారని మండిపడ్డారు. దీంతో చాలా మందికి అన్యాయం జరిగిందన్నారు. ప్రస్తుత సీజన్కు సంబంధించి పంట రుణాలు ఇవ్వకుండా బ్యాంకర్లు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వక్తం చేశారు. పొలం ఉన్న ప్రతి రైతుకూ రైతు భరోసా డబ్బు జమ చేయాలని డిమాండ్ చేశారు. -
విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలి
తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ కొడంగల్: మండల పరిధిలోని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు ఎరన్పల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఎంఈఓ రాంరెడ్డికి వినతిపత్రం అందజేశారు. జీఓ నంబర్ 46 ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన పేద బలహీన వర్గాలకు 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఫీజులు వసూలు చేయాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులు పెంచుతూ పాఠ్య పుస్తకాలు, అడ్మిషన్ ఫీజులు అంటూ వ్యాపారం చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓంకార్, సికిందర్, భాను తదితరులు పాల్గొన్నారు. -
పనులను వేగిరం చేయండి
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య నవాబుపేట: విద్యార్థులు లక్ష్యంతో చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలో కేజీబీవీని సందర్శించారు. పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్ను అదనపు గదులను పరిశీలించి పనులను వేగిరం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు యూనిఫాం, నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్ నాయక్, ప్రిన్సిపాల్ శ్రీలత, నాయకులు వెంకట్రెరెడ్డి, ప్రభాకర్, ఎక్బాల్, రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులు వినియోగించుకోండి భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్వహిస్త్ను రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య సూచించారు. మండల పరిధిలోని చిట్టిగిద్ద గ్రామంలో సోమవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరయ్యారు. తహసీల్దార్ బుచ్చయ్య, డిప్యూటీ తహసీల్దార్ శ్రీలత పాల్గొన్నారు. -
మృత్యుపాశాలు!
నెత్తినసాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇళ్లలో వెలుగులు నింపాల్సిన విద్యుత్ తీగలు.. పౌరుల జీవితాల్లో చీకట్లు నింపుతున్నాయి. నెత్తిన మృత్యుపాశాల్లా వేలాడుతున్న వైర్లు ఎప్పుడు.. ఎవరిపై తెగిపడతాయో తెలియని దుస్థితి నెలకొంది. ఎలాంటి ఈదురు గాలులు, వర్షాలు లేకపోయినప్పటికీ.. వైర్లు తెగిపడుతుండటాన్ని పరిశీలిస్తే.. డిస్ట్రిబ్యూషన్ లైన్ల వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతోంది. విద్యుత్ లైన్ల నిర్వహణ కోసం డిస్కం ఏటా రూ.100 కోట్లకుపైగా ఖర్చు చేస్తోంది. అయినా ప్రమాదాలు తగ్గడంలేదు. తాజాగా సరూర్నగర్ డివిజన్ చింతల్కుంట ఫీడర్కు సంబంధించిన 11 కేవీ పోల్పై పాలిమర్ పిన్ ఇన్సులేటర్లోని మెటల్ రాడ్డు విరిగిపడి, హైటెన్షన్ విద్యుత్ కేబుల్ తెగిపడటంతో.. సాగర్ రింగ్రోడ్డు సమీపంలోని ఓ దేవాలయం ఫుట్పాత్పై నిద్రపోతున్న ఓ మహిళ, పురుషుడు (యాచకులు) విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డారు. విద్యుత్ ఇంజినీర్లు మాత్రం తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు గుర్తు తెలియని ఓ వాహనం స్తంభాన్ని ఢీకొనడంతోనే వైర్లు తెగిపడినట్లు చెబుతున్నారు. నిర్వహణ లోపంతోనే.. ఇప్పటికీ నిజాం కాలం నాటి ఓవర్హెడ్ లైన్లు, ఇనుప స్తంభాలే ఉన్నాయి. ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ లైన్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. తరచూ వైర్లు తెగిపడుతుండటంతో పాటు స్తంభాలను ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం, లూజు లైన్లు సరి చేయడం, దెబ్బతిన్న పిన్ ఇన్సులేటర్లను మార్చడం, పాడైన ఫ్యూజ్ బాక్సులను మార్చడం, డీటీఆర్ల వద్ద పటిష్టమైన ఎర్తింగ్ ఏర్పాటు చేయడం వంటి పనుల కోసం డిస్కం ఏటా రూ.100 కోట్లు ఖర్చు చేస్తోంది. కంపెనీ కేటాయించిన నిధులు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి తప్ప.. సరఫరా వ్యవస్థ మాత్రం మెరుగుపడటం లేదు. క్షేత్రస్థాయిలో ఇంజినీర్లు ఎప్పటికప్పుడు లైన్ టు లైన్, పోల్ టు పోల్ తిరిగి ప్రమాదకరంగా మారిన వాటిని గుర్తించి, వాటి స్థానంలో కొత్త వైర్లు, స్తంభాలు, పిన్ ఇన్సులేటర్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. పట్టించుకోవడం లేదు. లైన్ల పునరుద్ధరణ అంటే కేవలం చెట్ల కొమ్మల తొలగింపు ఒక్కటే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపాదనలకే సరి.. వేలాడుతున్న వైర్లను తొలగించి, వాటి స్థానంలో భూగర్భ విద్యుత్ కేబుళ్లను ఏర్పాటు చేయాలని డిస్కం నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఇంజినీర్ల బృందం ఇటీవల బెంగళూరులో పర్యటించి భూగర్భ విద్యుత్ కేబుల్ పనులను పరిశీలించి వివరాలను సేకరించింది. 3,400 కిలోమీటర్ల 33 కేవీ, 11,500 కిలోమీటర్ల 11 కేవీ లైన్లలో యూజీ కేబుళ్లు లైన్లు, 15 వేల కిలోమీటర్ల ఏబీ కేబుల్ లైన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందు కోసం రూ.13,600 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేసింది. బకాయిలు భారీగా పేరుకపోవడం, ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు సకాలంలో రాకపోవడంతో డిస్కం ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం నిధుల్లేవంటూ చేతులెత్తేసింది. కేంద్రం దయతలచి ఏదైనా స్కీం ప్రకటిస్తే గాని.. ఈ పనులు ఇప్పట్లో పూర్తికాని పరిస్థితి నెలకొంది.ప్రాణాంతకంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు తరచూ తెగిపడుతున్న వైర్లు లైన్ల పునరుద్ధరణకు ఏటా రూ.100 కోట్లకుపైగా ఖర్చు అయినా మెరుగుపడని పంపిణీ వ్యవస్థ -
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
కుల్కచర్ల: పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన చౌడాపూర్ మండల పరిధిలోని మరికల్, చౌడాపూర్ తదితర గ్రామాల్లో 242మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేదల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చితే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేదలకు లబ్ధిచేకూరేలా చర్యలు తీసుకుంటున్నారన్నారని వివరించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇళ్లు నిర్మించేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, మార్కెట్ కమిటీ డైరక్టర్ రామ్మోహన్ శర్మ, చౌడాపూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎల్పాటి అశోక్కుమార్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాము, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటయ్య, సలీం, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యత దోమ: మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధి దాదాపూర్ రైతు వేదికలో 249 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. నిరుపేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా యువతకు రాజీవ్ యువ వికాసం పథకం కింద ఒక్కొక్కరికి రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు సాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. సన్న బియ్యం పథకం పేదవాడి ఆత్మగౌరవ పథకం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ యాదవ రెడ్డి, మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు అనసూయ, ఏఎంసీ డైరెక్టర్లు ప్రభాకర్ రెడ్డి, శాంత్ కుమార్, బద్రి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రమేష్ గౌడ్, పార్టీ నాయకులు రాఘవేందర్ రెడ్డి, యాదయ్యగౌడ్, అంతిరెడ్డి, బాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రాజు, బసన గౌడ్, మొగులయ్య గౌడ్, శేఖర్, చెనయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి -
బీసీలు శాసించే స్థాయికి ఎదగాలి
బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్ షాద్నగర్రూరల్: బీసీలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదిగినప్పుడే సమాజంలో గుర్తింపు లభిస్తుందని బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలం రాయికల్ శివారులోని ఎన్హెచ్–44 హోటల్లో ఆదివారం బీసీసేన జిల్లా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలైన బీసీలు సమాజంలో గణనీయమైన వాటా కలిగి ఉన్నారని అన్నారు. జనాభా ప్రకారం అత్యధికంగా ఉన్నప్పటికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అనుకున్న స్థాయిలో ఎదగలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగుబలహీన వర్గాలు రాజ్యాధికారాన్ని సాధించినప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని తెలిపారు. జనాభా ప్రకారం అధికంగా ఉన్న బీసీలు రాజ్యాధికార సాధన దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం బీసీసేన జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్యాదవ్ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో బీసీసేన నాయకులు సుధాకర్, చంద్రశేఖర్, వరలక్ష్మి, శారద, వెంకటేశ్, దేవేందర్, సౌజన్య, జక్కుల జలజ, స్రవంతిరాజ్, భాగ్యలక్ష్మి, అనిత, శ్రీనివాస్, శివకుమార్, మహేష్, వరప్రసాద్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ పాలన.. విజయ పథాన
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. బొంరాస్పేట–బుర్రితండా డబుల్ రోడ్డు నిర్మాణం పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు.8లోu9లోuవికారాబాద్: ఓ పక్క సంక్షేమ పథకాలను ఇబ్బందులు తలెత్తకుండా ప్రజల వద్దకు చేర్చడంతో పాటు మరో పక్క పాలన గాడిన పెట్టడంలో కలెక్టర్ ప్రతీక్జైన్ చాలా వరకరు సక్సెస్ అయ్యారు. మొదటిసారి వికారాబాద్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఆయన మొదట్లో ఒడిదుడుకులు ఎదుర్కున్నారు. చివరకు తేరుకుని పాలన గాడిలో పెట్టారు. నేటితో ఆయన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తవుతుండటంతో జిల్లాపై ఆయన వేసిన ముద్ర ఎదుర్కొన్న సమస్యలు, లోటుపాట్లపై ఓ పరిశీలిద్దాం.. అధికార యంత్రాంగం పనితీరుపై.. జిల్లాలో ప్రధానంగా కలెక్టరేట్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు కంకణం కట్టుకున్న కలెక్టర్ వచ్చీ రాగానే అన్ని శాఖల యంత్రాంగం సేవలు ప్రజలకు అందడంలో ఇబ్బందులు, జాప్యంలేకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. ఆఫీస్ సబార్డినేట్ నుంచి జిల్లా అధికారుల వరకు అన్ని శాఖల యంత్రాంగం పనితీరును మెరుగపరిచేందుకు తీసుకున్న చర్యలు సత్ఫాలితాలిచ్చినట్లే కనిపిస్తున్నాయి. తరచూ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పర్యవేక్షణను బలోపేతం చేయటంలోనూ సఫళీకృతమయ్యారు. ధరణి నుంచి భూ భారతి సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక కార్యచరణతో ముందుకు సాగుతూ దిగ్విజయంగా ఏడాది పూర్తి చేసుకున్నారు. 4,500 ధరణి సమస్యలు పరిష్కారం జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న ధరణి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. బాధ్యతలు తీసుకున్నది మొదలు రోజుకు 150 సమస్యలకు తక్కువ కాకుండా ధరణి సమస్యలు పరిష్కరిస్తూ వచ్చారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేయటంతో పాటు సేవలు మెరుగుపర్చారు. ప్రతీ సోమవారం జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో మండల స్థాయిలో తహాసీల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజలు, రైతుల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. చిన్న చిన్న సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కరిస్తూ వస్తున్నారు. సమస్యలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నారు. 5 వేల వరకు ఉన్న ధరణి దరఖాస్తులు నేడు 400లోపే వచ్చాయి. విద్య, వైద్యంపై స్పెషల్ ఫోకస్ విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించంలో తనదైన ముద్ర వేశారు. ప్రతీ హాస్టల్కు తనే స్వయంగా వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. నిధులు కేటాయించి వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించారు. ఆస్పత్రులను తరచూ విజిట్ చేస్తూ వైద్య సేవలు అందరికి అందేలా చొరవ చూపారు. ఆస్పత్రుల్లో ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కారానికి కృషి చేశారు. ఇటీవల ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ బియ్యం సరఫరా, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై దృష్టి సారించి ప్రజలకు అందించడంలో ప్రత్యేక చొరవ చూపారు. భూసేకరణలో సక్సెస్ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం లగచర్లలో ఆయనతో పాటు ఇతర అధికారులు, పోలీసులపై జరిగిన దాడి ఘటన చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఆ ఘటన నుంచి సాధ్యమైనంత తొందరగానే బయటపడిన ఆయన తిరిగి పారిశ్రామిక ప్రగతిని ముందుకు తీసుకువెళ్లడంలో విజయం సాధించారు. పారిశ్రామిక వాడ కోసం భూములు సేకరించే విషయంలో సక్సెస్ అయ్యారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేలా చూడడంలో ఆయన శ్రమ ఫలించింది. ప్రతీక్జైన్ బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తి సంక్షేమం దిశగా పరుగులు పెట్టించేందుకు తనదైన మార్క్ -
పద్మమ్మకు నివాళి
ధారూరు: మండల పరిధిలోని చింతకుంటలో ఆదివారం దివంగత ఇంద్రారెడ్డి సోదరి పద్మమ్మ దశదిన కర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సబితారెడ్డి హాజరై నివాళి అర్పించారు. ఆమె వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, మాజీ మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు హఫీజ్ తదితరులు హాజరయ్యారు. విద్యుదాఘాతంలో ఆవు మృతి తాండూరు రూరల్: విద్యుదాఘాతంలో ఓ ఆవు మృత్యువాత పడింది. ఈ ఘటన పెద్దేముల్ మండలం ఎర్రగడ్డతండాలో ఆదివారం చోటు చేసుకుంది. తండాకు చెందిన శాంతబాయి రోజు మాదిరిగానే ఆవులను మేతకు తీసుకెళ్లి సాయంత్రం ఇంటికి వస్తోంది. ఈ క్రమంలో తండాశివారులోని ట్రాన్స్ఫార్మర్ వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్షాక్ తగిలి ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో సుమారు రూ.50 వేలు ఆర్థికంగా నష్టపోయానని ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కోరుతోంది. పశువుల నీటి తొట్టి ధ్వంసం బషీరాబాద్: పశువుల దాహార్తిని తీరుస్తున్న నీటితొట్టిని గ్రామానికి చెందిన ఓ నాయకుడు ధ్వంసం చేయించాడు. ఈ సంఘటన బషీరాబాద్ మండలం కాశీంపూర్లో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. మూగజీవాల దాహార్తిని తీర్చడానికి ప్రభుత్వం.. ఉపాధి నిధులతో పదిహేనేళ్ల క్రితం తొట్టిని నిర్మించింది. తొట్టి ఉన్న స్థలాన్ని కబ్జా చేసేందుకు ఓ జాతీయ పార్టీకి చెందిన యువ నాయకుడు జేసీబీతో ధ్వసం చేయించాడు. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన సదరు వ్యక్తిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవా లని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పేదలకు వరం ఇందిరమ్మ ఇళ్లు కుల్కచర్ల: పేదలకు వరం ఇందిరమ్మ ఇళ్లు అని, అర్హులందరికీ ప్రభుత్వం ఇంటిని నిర్మించి ఇస్తుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్ అన్నారు. ఆదివారం మండల పరిధి ముజాహిద్పూర్లో లబ్ధిదారుల ఇంటి నిర్మాణాలకు ముగ్గు పోసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు షర్పొద్దీన్, సోమలింగం, రాములు, అంబదాస్, కిష్టయ్య, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. 198 మందికి వైద్య పరీక్షలు యాలాల: మండల పరిధిలోని విశ్వనాథ్పూర్లో ఆదివారం తాండూరు వాసవి ఆస్పత్రి వారు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. ఈ శిబిరంలో గ్రామానికి చెందిన 198 మంది ప్రజలు వైద్య పరీక్షలు నిర్వహించుకున్నట్లు ఆస్పత్రి యజ మాని సతీశ్ కుమార్, వైద్యుడు విజేందర్ తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు తమ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత పరీక్షలతో పాటు మందులను పంపిణీ చేస్తున్నామన్నారు. కాడెద్దు అపహరణ ఆమనగల్లు: తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కాడెద్దును తరలించుకుపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతు బైకని పర్వ తాలు యాదవ్.. పొలం కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో వ్యవసాయ పొలం వద్ద ఐదు ఆవులు, రెండు కాడెడ్లను ఉంచాడు. ఆమనగల్లు– షాద్నగర్ రహదారి పక్కనే పశువుల పాక ఉండటంతో.. దుండగులు రూ.లక్ష విలువ చేసే ఎద్దును అపహరించారు. ఆదివారం ఉదయం పాక లో ఓ ఎద్దు లేదని గుర్తించిన బాధిత రైతు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
బోనస్ సున్నా
సన్నాలకు పరిగి: వరిలో సన్నరకం పండించే రైతులకు క్వింటాల్కు రూ.500 బోనస్ అదనంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా రైతులు సన్నాలు సాగు చేపట్టి ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. ధాన్యం విక్రయించి నెల రోజులు కావస్తున్న బోనస్ డబ్బులు మాత్రం వారి బ్యాంకు ఖాతాల్లో జమ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సేకరించిన 7,500 మెట్రిక్ టన్నుల సన్నాలకు గాను రూ.3.75కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ నగదు ఎప్పుడు జమ చేస్తారోనని రైతులు ఎదురుచూస్తున్నారు. ఆలస్యమైనా అక్కడే విక్రయం ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు తూకం వేయడంలో ఆలస్యం చేస్తున్నారు. ప్రభుత్వం బోనస్ ఇస్తుందనే కారణంగా రైతులు ఆలస్యమైనా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. మే మొదటి వారం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. రెండు మూడు రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని ప్రభుత్వం ప్రకటించినా చెల్లింపుల్లో ఆలస్యంగా అవుతున్నాయి. సన్న రకం విక్రయించిన రైతులకు ముందుగా క్వింటాల్కు రూ.2,320 చొప్పున చెల్లించి తరువాత బోనస్ వేస్తున్నారు. బోనస్ మినహా మిగత డబ్బులు చాలా మంది రైతుల ఖాతాలో జమ అయ్యాయి. పెరిగిన సాగు జిల్లా వ్యాప్తంగా సన్నరకం వరి సాగు భారీగా పెరిగింది. సాధారణంగా ఇక్కడి రైతులు వానాకాలం సీజన్లో సన్నాలు, యాసంగిలో దొడ్డు రకం పండిస్తారు. ప్రభుత్వం సన్నాలకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడంతో యాసంగి సీజన్లో రైతులు దొడ్డురకంతో పాటు సన్నాలు సైతం ఎక్కువగానే సాగు చేశారు. వానాకాలం సీజన్లో సాగు చేసిన సన్నాలకు బోనస్ డబ్బులను ప్రభుత్వం ఆలస్యంగా వేసిందని అప్పట్లో అధికారులు మొదటి సీజన్ కావున కొంత ఆలస్యం అవుతాయని చెప్పారు. యాసంగిలో బోనస్ను త్వరగా అందిస్తామని ప్రకటించినా కార్యరూపం దాల్చలేదన్నారు. ప్రభుత్వం స్పందించి సకాలంలో బోనస్ డబ్బులు ఖాతాలో జమ చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. నెల రోజులు దాటినా జమకాని రూ.500 ప్రోత్సాహకం రైతులకు తప్పని ఎదురుచూపులు నెల రోజులైంది ఐదెకరాల్లో సన్న రకం వరిసాగు చేయగా 65 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. నెల రోజుల క్రితం ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించా. బోనస్ డబ్బులు రూ.32 వేలు రావాల్సి ఉంది. నేటికీ జమ చేయలేదు. ప్రభుత్వం బోనస్ జమ చేసేందుకు చర్యలు తీసుకోవాలి. – మేకల శ్రీనివాస్, ఐనాపూర్ ప్రభుత్వానికి నివేదించాం ఇప్పటి వరకు 7,500 మెట్రిక్ టన్నుల సన్న రకం వరి ధాన్యం కొనుగోలు చేశాం. కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులను రెండు రోజుల వ్యవధిలోనే రైతు ఖాతాలో జమ చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి రావాల్సిన బోనస్ డబ్బుల కోసం ప్రభుత్వానికి నివేదిక అందించాం. త్వరలోనే రైతుల ఖాతాలో జమ అవుతాయి. – మోహన్ కృష్ణ, పౌరసరఫరాల శాఖ డీఎం, వికారాబాద్ -
మోహన్రెడ్డి సేవలు చిరస్మరణీయం
దౌల్తాబాద్: ప్రజా సంక్షేమానికి పరితపించిన నాయకుడు మోహన్రెడ్డి అని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్రెడ్డి, కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతి రెడ్డి అన్నారు. ఆదివారం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మోహన్రెడ్డి మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద వారు పార్టీ శ్రేణులతో కలిసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 30 ఏళ్ల రాజకీయంలో సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీగా పనిచేసిన ఆయన ప్రజల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు మోహన్రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ గురునాథ్రెడ్డి -
కొడుకు జ్ఞాపకాలతో విరాళం
ఆలయ అభిృద్ధికి హామీ బొంరాస్పేట: కొడుకు లేడన్న బాధను దిగమింగుకొని, పుత్రుడి జ్ఞాపకాలతో ఓ తండ్రి.. ఫాదర్ డే రోజు ఆదివారం ఆలయానికి రూ.10 వేలతో గంట, గేటు చేయించాడు. మరో నాలుగేళ్లలో పురాతన ఆలయానికి మరమ్మతు పనులు చేయిస్తానని హామీ ఇచ్చాడు. మండల పరిధి రేగడిమైలారానికి చెందిన గుర్మిట్కల్ హన్మిరెడ్డి కొడుకు నవీన్కుమార్రెడ్డి.. గతేడాది పొలం పనులకు వెళ్తూ విద్యుదాఘాతంతో చనిపోయాడు. కొడుకు అకాల మరణం చెందడాన్ని జీర్ణించుకోలేని ఆ తండ్రి.. తన బిడ్డ చనిపోలేదని, నేరుగా శివుడి వద్దకు చేరాడని పేర్కొనడం గమనార్హం. కొడుకు చనిపోయాడన్న బాధలో ఉండి కూడా.. ఆలయానికి తనకు తోచిన విరాళం అందజేసిన దాత హన్మిరెడ్డికి ఆలయ పూజారి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు జగదీశ్వరయ్య కృతజ్ఞతలు తెలిపారు. -
పార్టీ పటిష్టతకు కృషి చేయాలి
ఇబ్రహీంపట్నం: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీ పటిష్టతకు కృషి చేయాలని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజు భూపాల్గౌడ్ పిలుపునిచ్చారు. పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం.. ఆ పార్టీ భవనగిరి పార్లమెంట్ కో కన్వీనర్ నారాయణయాదవ్ అధ్యక్షతన స్థానిక వైష్ణవిగార్డెన్లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. రానున్న స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ -
విద్యార్థి అదృశ్యం
పహాడీషరీఫ్: విద్యార్థి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధి లో చోటు చేసుకుంది. పో లీసులు తెలిపిన ప్రకారం.. మామిడిపల్లి ముదిరాజ్ కాలనీకి చెందిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ రాకోటి మురళీమోహన్ కుమారుడు దివ్యసాయి(19) నీట్ పరీక్ష రాసి ఫలితాల కోసం నిరీక్షిస్తున్నాడు. ఈ నెల 9న తల్లిదండ్రులు పనిమీద బయటికి వెళ్లి మధ్యా హ్నం వచ్చి చూడగా దివ్యసాయి కనిపించలేదు. అతని ఆచూకీ కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో తండ్రి ఠానాలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో గానీ, 87126 62367 నంబర్లో గానీ సమాచారం ఇవ్వాలని సూచించారు. పరీక్ష రాసేందుకెళ్లి.. ఇబ్రహీంపట్నం: పరీక్ష రాసేందుకని వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ జగదీశ్ కథనం ప్రకారం.. శంషాబాద్కు చెందిన విద్యార్థిని (23) ఇబ్రహీంపట్నం మండలం రాందాసుపల్లి పరిధిలోని ఏవీఎన్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటలకు పరీక్ష రాసేందుకు కళాశాలకు బయలుదేరి తిరిగి ఇంటికి చేరుకోలేదు. కుటుంబసభ్యులు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘అపూర్వ’ సమ్మేళనం
32 ఏళ్ల తర్వాత కలుసుకున్న చించల్పేట్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు వికారాబాద్: ఆత్మీయం.. అపురూపం అన్నట్టుగా మారింది.. ఆ సమ్మేళనం..32 వసంతాల సుదీర్ఘ కాలం తరువాత కలిసిన ఆ పూర్వ విద్యార్థులు నాటి జ్ఞాపకాలు నెమరేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యేలా చేశాయి. నవాబుపేట మండలం చించల్పేట్ జెడ్పీహెచ్ఎస్లో 1992–93లో పదో తరగతి చదవిన విద్యార్థులు ఆదివారం వికారాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమంలో కలిశారు. నాడు వారికి విద్యా బుద్దులు నేర్పిన ఉపాధ్యాయులు రామకృష్ణారెడ్డి, విష్ణుచిత్తం, సత్యనారాయణరెడ్డి, గోవర్ధన్, యూసెఫ్లతో పాటు ప్రస్తుతం ఆ పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాడు పాండును ఘనంగా సన్మానించారు. పాతికేళ్ల అనంతరం.. బొంరాస్పేట: పదో తరగతి వరకు ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు పాతికేళ్ల తర్వాత ఆదివారం కలుసుకుని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమ గురువులకు పాదిభివందనాలు చేసి తరించారు. 1997–98లో మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన 56మంది పూర్వ విద్యార్థులు ఆత్మీయతను పంచుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన వెంకట్రాములుగౌడ్, నర్సప్ప, చెన్నబసప్ప, సాయన్నగౌడ్, సాయిబన్న, చంద్రశేఖర్గౌడ్లను శాలువాలతో సన్మానించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ హరిలాల్ పాల్గొన్నారు. -
పత్తి సాగుకు సమయమిదే..
నవాబుపేట: పత్తి సాగుకు సరైన సమయమిదేనని.. తగు జాగ్రత్తలు తీసుకుంటే రైతులకు తెల్లబంగారం లాభాలు ఆర్జించి పెడుతుందని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వానాకాలం సీజన్లో రైతులు అధికంగా పత్తి సాగుకు మొగ్గు చూపుతారు. కానీ ఏడాది గతంతో పోల్చితే తగ్గే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. గత ఏడాది సరైన సమయంలో వర్షాలు కురువక దిగుబడులు తగ్గడం.. ఖర్చులు పెరగడంతో ఆశించిన లాభాలు రాలేదు. దీంతో మొక్కజొన్న సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది వానాకాలం మండల పరిధిలో 21,539 ఎకరాల్లో పత్తి సాగు చేయగా.. మొక్క జొన్న 744 ఎకరాలకే పరిమితమైంది. ఈ సీజన్లో 19,230 ఎకరాల్లో పత్తి 2,317 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేయనున్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. నల్లరేగడి భూములు అనుకూలం పత్తి సాగుకు నల్లరేగడి భూములు అనుకూలమైనవి. నీటి సదుపాయం కలిగిన సారవంతమైన ఎర్రనేలల్లోనూ వేసుకోవచ్చు. సమస్యాత్మక భూములు తరుచుగా నీటి ఎద్దడికి గురయ్యే నేలలు, మురుగునీటి పారుదల సౌకర్యం లేని నేలల్లో సాగు చేపట్టొద్దు. తొలకరి వర్షాలు పడిన తర్వాత పొలాన్ని రెండు నుంచి మూడుసార్లు కలియ దున్నుకోవాలి. విత్తనాలు ఏ పద్ధతి లో వేసుకోవాలన్నది విత్తన రకం, నేల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. అవకాశం ఉన్నవారు ఆఖరి దుక్కిలో ఎకరానికి పది టన్నుల పశువుల ఎరువు వేయాలి. చివరి దుక్కిలోనే 150 కిలోల సింగల్ సూపర్పాస్పేట్ వేసి కలియదున్నాలి. భూమి బాగా తడిసిన తర్వాత అంటే 60 నుంచి 70 మీల్లీటర్ల వర్ష పాతం నమోదైన ఐదు రోజుల తర్వాత విత్తనాలు వేసుకోవాలి. నల్లరేగడి నేలల్లో 60 నుంచి 70 శాతం తేమ ఉంటేనే ఎర్రనేలల్లో 50 నుంచి 60 శాతం తేమ ఉంటే విత్తనం వేసుకోవచ్చు. విత్తన ఎంపిక పత్తిలో చాలా రకాలున్నాయి. నమ్మకమైన కంపెనీలు, డీలర్ల నుంచి విత్తనాలు కొనుగోలు చేయాలి. పత్తిలో సూటి, సుంకర రకాలున్నాయి. చాలా మంది బీటీ పత్తినే సాగు చేస్తున్నారు. మైకో, నూజివీడు, కావేరి, బ్రహ్మ, బోల్గార్డ్, అజీత్, ఇలా చాలా కంపెనీల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు ఎవరికి నచ్చిన విత్తనాలు వాల్లు విత్తుకోవాలి. పంటకాలం పూర్తయ్యే వరకు రసీదులు భద్రపరుచుకోవాలి. ఎరువులు వేయడం ఎకరాకు 60 నుంచి 80 కిలోల నత్రజని, 25 నుంచి 35 కిలోల భాస్వరం, 25 నుంచి 35 కిలోల పొటాష్ వేసుకోవాలి. భాస్వరం, పొటాష్లను మూడు సమభాగాలుగా చేసుకొని విత్తిన 30 రోజులకు , 60 రోజులకు, 90 రోజులకు వేసుకోవాలి. భూసార పరీక్షలు చేయించుకుని తదనుగుణంగా సిపారస్సు చేసిన ఎరువులు వాడితే పోషకాలు సమపాళ్లలో అందడంతో ఖర్చు తగ్గుతుంది. విత్తన నమోదు ఎకరానికి 650 గ్రాముల విత్తనాలు సరిపోతాయి. నేలసారాన్ని బట్టే విత్తే దూరం ఎంచుకోవాలి. బలమైన నల్లరేగడి నేలల్లో 90 ప్లస్ 90 సెంటీ మీటర్లు, మధ్యస్థ నేలల్లో వరుసల మధ్య దూరం 90 సెంటీ మీటర్లు, మొక్కల మధ్య దూరం 90 సెంటీ మీటర్లు ఉండేట్లు విత్తుకోవాలి. బీటీ పత్తి చుట్టూ రెండు నుంచి నాలుగు వరుసలు నాన్బీటీ పత్తిని ఖచ్చితంగా విత్తుకోవాలి. విత్తన రకం, నేల స్వభావమే ప్రధానం భూసార పరీక్షల ఫలితాల ఆధారంగానే ఎరువులు వాడాలి మండల వ్యవసాయాధికారి జ్యోతి -
అలుగు ఆధునికీకరణ ఎప్పుడో!
కోట్పల్లి ప్రాజెక్టు అలుగుపై సీసీ బెడ్ నీటి ప్రవాహ ఉధృతికి చిత్తడిగా మారింది. 2021లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టు పూర్తిగా నిండి నీటి ఉధృతి అలుగుపై పారడంతో భారీ గుంతలు ఏర్పడ్డాయి. అప్పట్లో మరమ్మతు పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ నాసిరకం పనులు చేపట్టడంతో తిరిగి శిథిలమైంది. ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.110 కోట్లు మంజూరయ్యాయని చెబుతున్నా పనుల్లో పురోగతి లేదని ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఇరిగేషన్ శాఖ అధికారులు శాశ్వత మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. – ధారూరు -
నేడు లగచర్లలో రెవెన్యూ సదస్సు
దుద్యాల్: మండల పరిధిలోని లగచర్ల గ్రామంలో సోమవారం రెవెన్యూ సదస్సు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ కిషన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం భూ భారతి చట్టంపై అవగాహన కల్పిస్తూ భూ సమస్యల పరిష్కారానికి ఈ రెవన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తోందన్నారు. రైతులు ఈ సదస్సును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతంలో అధికారులపై దాడి జరిగిన నేపథ్యంలో పోలీసు బందోబస్తు నడుమ రెవెన్యూ సదస్సు నిర్వహించనున్నట్లు సమాచారం. ఘనంగా కేంద్ర మంత్రి జన్మదిన వేడుకలు అనంతగిరి: కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి జన్మదిన వేడుకలు వికారాబాద్లో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. కిషన్రెడ్డి విద్యార్థినేత నుంచి నేడు జాతీయ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారన్నారు. పార్టీలో క్రమశిక్షణగల నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా అహర్నిషలు ప్రజలకోసం పరితపిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సదానందరెడ్డి, దిశ కమిటీ సభ్యుడు వడ్ల నందు, పార్టీ మండల అధ్యక్షుడు శివరాజ్గౌడ్, సీనియర్ నాయకులు సుధాకర్ ఆచారి, మోహన్రెడ్డి, రాములు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎంపీని కలిసిన బీసీ సంఘం నేతలుఅనంతగిరి: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్యను ఆదివారం బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు యాదగిరి యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. ఆయన వెంట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు, పలువురు నాయకులు తదితరులు ఉన్నారు. ఆపరేషన్ కగార్ వెనుక కుట్ర సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పీర్ మహ్మద్ పరిగి: కేంద్రం మావోయిస్టులపై జరుపుతున్న ఆపరేషన్ కగార్ వెనుక కుట్ర కోణం దాగి ఉందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పీర్ మహ్మద్ ఆరోపించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. అటవీ సందపను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నా కావాలనే వరుస దాడులు కొనసాగిస్తోందన్నారు. ఆపరేసన్ కగార్కు వ్యతిరేకంగా ఈ నెల 17న నగరంలోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్న మహాధర్నాకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. పేదలను ఇబ్బంది పెట్టొద్దు మాజీ మంత్రి సబితారెడ్డిహుడాకాంప్లెక్స్: రాజకీయాల కోసం పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి హితవు పలికారు. సరూర్నగర్, ఆర్కేపురం డివిజన్లకు చెందిన డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులు తమ సమస్యలను ఆదివారం ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గంలోని పేదలకు దాదాపు 5వేల డబుల్ బెడ్రూం ఇళ్లు ఆన్లైన్ లక్కీడీప్ ద్వారా కేటాయించడం జరిగిందన్నారు. ఆర్కేపురం, సరూర్నగర్ డివిజన్లకు చెందిన 1,800 మందికి డ్రా ద్వారా కేటాయించామన్నారు. స్థానికులకు 10 శాతం కేటాయించి ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అర్హులకు పట్టాలు ఇచ్చామని వివరించారు. కొంతమంది కావాలని కోర్టులకు వెళ్లి లబ్ధిదారులను ఇబ్బంది పెట్టే విధంగా చేస్తూ ఆనందం పొందుతున్నారని విమర్శించారు. ఉన్నతాధికారులతో చర్చించి లబ్ధిదారులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. -
సాగు.. పిరం!
కొడంగల్: ఏరువాక ముగిసింది. మృగశిర కార్తె ప్రారంభమైంది. ఖరీఫ్ సీజన్లో విత్తనాలు వేయడానికి రైతులు సిద్ధమయ్యారు. అడపాదడపా వర్షాలు సైతం కురుస్తున్నాయి. దీంతో రైతులు విత్తనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎరువులు, విత్తనాలకు డిమాండ్ పెరిగింది. ధరల పెరుగుదలపై నియంత్రణ లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరిగాయి. వ్యవసాయం పండుగలా మారిన రాష్ట్రంలో రైతన్నలకు సాగు ఖర్చులు పెరిగి పోయాయి. పెట్టుబడి పెట్టలేక ఎరువులు కొనలేక అవస్థల పాలవుతున్నారు. విత్తనాలు వేసే క్రమంలో రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. పెట్టుబడి సాయం వస్తే బాగుంటుందని ఆశ పడుతున్నారు. ఖర్చులు పెరిగాయి.. రైతు భరోసా పథకం కింద ఎకరాకు గత ప్రభుత్వం రూ.5 వేలు ఇచ్చేది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు రూ.6 వేలు ఇస్తోంది. నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్, దుద్యాల మండలాల్లో ఖరీఫ్ సీజన్కు సంబంధించి సుమారు 40 వేల హెక్టార్లలో రైతులు పలు రకాల పంటలను సాగు చేసే అవకాశం ఉంది. డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు వాటి నాణ్యతా ప్రమాణాలను బట్టి ఒక్కో ధర ఉంది. విత్తనాల ధరలు ఎక్కువే బహిరంగ మార్కెట్లో విత్తనాల ధరలు అధికంగానే ఉన్నాయి. కిలో కంది విత్తనాల బ్యాగు రూ.250 ఉంది. జొన్నలు 3 కిలోల బస్తా రూ.550, వరి బస్తా రూ.900, పెసర విత్తనాల బస్తా రూ.800 పత్తి విత్తనాలు 475 గ్రాములకు రూ.850 పలుకుతోంది. యంత్రాలతో విత్తనం.. నియోజకవర్గంలోని రైతులు ఆధునిక వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈక్రమంలో ఖర్చులు విపరీతంగా పెరిగాయి. గతంలో ఉన్న కూలీ రేట్లకు ఇప్పటి రేట్లకు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. సాగు ఖర్చులు పెరిగి పంట దిగుబడి రాకపోతే నష్టపోతున్నామని రైతులు భావిస్తున్నారు. ఆధునిక సేద్యం చేస్తూ ఖర్చులు తగ్గించుకుంటున్నారు. సాగు ఖర్చులను తగ్గించుకొని యంత్రాల వినియోగంతో పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. మహారాష్ట్రలోని పూణే నుంచి సాగు యంత్రాలను కొనుగోలు చేసి తెస్తున్నారు. వీటితో కంది, పెసర, మినుము, కుసుమలు, జొన్న విత్తనాలు వేస్తున్నారు. రోజుకు 8 ఎకరాల విస్తీర్ణంలో విత్తనాలు వేయవచ్చని రైతులు చెబుతున్నారు. తక్కువ పెట్టుబడితో పంటలు పండించాలనే ఉద్దేశంతో వ్యవసాయ శాస్త్రవేత్తల సలహా మేరకు ఈ యంత్రాలను కొనుగోలు చేసినట్లు రైతులు చెప్పారు. పెరిగిన ఎరువులు, విత్తనాల ధరలు ఇదే దారిలో కూలీ రేట్లు ప్రారంభమైన ఖరీఫ్ సీజన్ ఎరువులు విత్తనాలకు డిమాండ్ రైతు భరోసా కోసం ఎదురు చూపు ఎరువు ధర డీఏపీ రూ.1,350 కాంప్లెక్స్ రూ. 1,370 గ్రోమోర్ రూ.1,700 10.26.26 రూ.1,470 ఎమ్ఓపీ రూ.1,535 యూరియా రూ.266 ఖర్చులు పెరిగాయి గతేడాదితో పోలిస్తే ఈసారి సాగు ఖర్చులు పెరిగాయి. కూలీల ధరలతో పాటు ఎరువులు విత్తనాల ధరలు అధికంగా ఉన్నాయి. ఎరువులు కొనడానికి రైతులకు ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం సాగు ఖర్చుల కోసం రైతు భరోసా ఇస్తోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. రైతు భరోసా డబ్బులు వస్తే మేలు జరుగుతుంది. – చుక్కప్ప, కొడంగల్ -
జన్మన్ జాడేదీ..!
● పథకం అమలులో నిర్లక్ష్యపు నీడ ● చెంచుల అభ్యున్నతికి కేంద్రం తెచ్చిన ప్రత్యేక స్కీం ● ప్రారంభించి ఏడాది గడిచినా సాగని పనులు ● జిల్లాలో 22 ఆవాసాల్లో చెంచుల నివాసం ● 740 కుటుంబాలు, 2,554 మంది జనాభా వికారాబాద్: చెంచుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జన్మన్ కార్యక్రమం ముందుకు సాగడంలేదు. ప్రధాన మంత్రి జన జాతీయ ఆదివాసి న్యాయ అభియాన్ (పీఎం జన్మన్) పేరుతో కేంద్రం గతేడాది క్రితం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. చెంచు గూడేలు, వారి జీవితాల్లో సమూల మార్పులు తేవడంతో పాటు మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకం అమలు చేస్తున్నారు. స్కీం ప్రారంభించే ముందు వారి స్థితిగతులు తెలుసుకునేందుకు సర్వే నిర్వహించారు. జిల్లాలో 22 ఆవాసాల్లో చెంచులు నివసిస్తుండగా 740 కుటుంబాలు, 2,554 మంది ఉన్నట్లు గిరిజన సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 42 అంశాలపై సర్వే నిర్వహించి వివరాలు సేకరించింది. ఈ ప్రక్రియ పూర్తయ్యి ఏడాది దాటినా ఇప్పటి వరకు ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. కార్యక్రమం కాస్త సర్వేకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పథకంలో పొందుపర్చిన అంశాలు పీఎం జన్మన్ పథకంలో చెంచుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనేక అంశాలను పొందుపర్చారు. ముందుగా వారి వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు 42 అంశాలతో కూడా సమాచారం సేకరించారు. ప్రధానంగా వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన సదుపాయాల్లో ఇప్పటి వరకు ఏవేవి కలిగి ఉన్నారు..? ఇంకా ఏవేవి కల్పించాల్సి ఉంది..? అనే అంశాలను ఈ సర్వే ద్వారా తెలుసుకుని ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. చెంచు కుటుంబాలకు పక్కా ఇళ్లు ఉన్నాయా..? ఇంటికి కులాయి ఉందా లేదా..? లాంటివి తెలుసుకున్నారు. ప్రతి చెంచు ఆవాసానికి రహదారి, ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం, అందరికి నాణ్యమైన విద్య లాంటివి ఈ పథకం ద్వారా అందించాలని నిర్ణయించారు. వృత్తి విద్యా నైపుణ్యం, అందరికీ ఆరోగ్యం, పోషణ, మెరుగైన టెలీఫోన్ సౌకర్యం తదితర కార్యక్రమాల ద్వారా జీవనోపాధి మెరుగు పర్చడం లాంటివి ఈ కార్యక్రమంలో చేపట్టనున్నారు. ఉచిత నిత్యావసరాలు, ఉచిత ఎల్పీజీ కనెక్షన్, గర్భిణులకు ఆర్థిక సాయం, సుకన్య సంవృద్ధి యోజన, వంద శాతం వ్యాధి నిరోధక టీకాలు, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తదితర పథకాలన్నీ అందుతున్నాయా లేదా..? తెలుసుకుని వాటన్నింటిని అందేలా చూడటం ఈ పథకం ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది. ఈ పథకాన్ని తెలంగాణతోపాటు 28 రాష్ట్రాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.24 వేల కోట్లు వెచ్చించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే స్కీం ప్రారంభించి ఏడాది గడిచినా ఇంకా కార్యక్రమాలేవి చేపట్టకపోవటం విమర్శలకు తావిస్తోంది. వైఫల్యాలు పునరావృతం కాకుంటేనే.. చెంచుల అభ్యున్నతి కోసం తపపెట్టిన ఈ పథకంలో గత అనుభవాలు, వైఫల్యాలు పునరావృతం కాకుండా చూసుకోగలిగితే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. గతంలోనూ ప్రభుత్వాలు వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనేక పథకాలు, కార్యక్రమాలు తీసుకువచ్చినా ఆ కుటుంబాలల్లో ఆశించిన మార్పు రాలేదు. వారు అన్ని రంగాల్లో రాణించాలంటే మౌలిక వసతులు కల్పించడంతో పాటు విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా వారిలో సామర్థ్యాల పెంపుదలపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలని పలువురు అభిప్రాయపడ్డారు.. లేకుంటే ఇలాంటి ఎన్ని పథకాలు వచ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండన్నారు. -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
అనంతగిరి: రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం అధ్యక్షతన శనివారం వికారాబాద్లో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారికి వెంటనే పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు 2023 జూలై నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ ఇవ్వకుండా కేవలం డీఏలు ప్రకటించడం సరికాదన్నారు. అనంతరం వెంకటరత్నం మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రైవేటు పాఠశాలలను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రైవేటు పాఠశాలలను ప్రభుత్వమే తన ఆధీనంలోకి తీసుకుని జాతీయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రాములు ఉపాధ్యక్షులు నర్సింలు, జమున, కోశాధికారి మోహిస్ ఖాన్, జిల్లా కార్యదర్శులు బాబురావు, పవన్ కుమార్, కృష్ణవేణి, సలీం, ముత్యప్ప, శివరాజ్తో పాటు ఆయా మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి -
● ఆయన కష్టమే ఈ జీవితం
దుద్యాల్: మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన పిడుగు వెంకటయ్య –మాసనమ్మ దంపతులకు కొద్దిపాటి భూమి ఉంది. దీన్ని సాగు చేసుకుంటూ మరోవైపు వీఆర్ఏ ఉద్యోగం చేస్తూ ముగ్గురు కుమారులను బాగా చదివించారు. ప్రస్తుతం వారు ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. పెద్ద కొడుకు తిరుపతి వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. రెండో కుమారుడు గోపాల్ విద్యుత్ శాఖలో లైన్మెన్గా బొంరాస్పేట్ మండలంలో విధులు నిర్వహిస్తున్నారు. మూడో కొడుకు శ్రీనివాస్ అబ్కారీ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. నాన్న కష్టమే ఈ రోజు తాము ఉన్నతమైన జీవనం సాగిస్తున్నామని వారు ఆనందం వ్యక్తం చేశారు. -
సాగు.. పిరం! ఏరువాక ముగిసింది. మృగశిర కార్తె ప్రారంభమైంది. ఖరీఫ్ సీజన్లో విత్తనాలు వేయడానికి రైతులు సిద్ధమయ్యారు.
ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 20258లోuషాద్నగర్: వేలు పట్టి నడిపించాడు... అక్షర ప్రపంచాన్ని పరిచయం చేశాడు.. అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు అండగా నిలిచాడు.. తాను ప్రస్తుతం లేకపోయినా నా నీడగా ఉంటూ నన్ను గెలిపించాడు.. అంటూ తన తండ్రి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు సివిల్స్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి ఐఆర్ఎస్ సాధించిన కొర్రావత్ శశికాంత్. తన తండ్రి ప్రస్తుతం భౌతికంగా లేకున్నా తన హృదయంలో తనకు జీవితాన్ని, భవితవ్యాన్ని ఇచ్చిన వ్యక్తిగా ఎప్పటికీ గుర్తుంటాడని చెబుతున్నాడు ఈ ఐఆర్ఎస్ అధికారి. సొంతూరిని విడిచి.. మాది మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం గ్రామ పరిధిలోని చాకలిదాని తండా. తల్లిదండ్రులు రాములు నాయక్, సీతమ్మలకు రెండవ సంతానం. తనకు అన్న నీలిమ, తమ్ముడు శ్రీకాంత్ ఉన్నారు. ఉన్నత చదువుల కోసం షాద్నగర్కు తీసుకొచ్చాడు. హాస్టల్లో వార్డెన్గా విధులు నిర్వహిస్తూ చదివించాడు. తమను భవిష్యత్లో ఉన్నత స్థానంలో చూడాలన్నది ఆకాంక్ష. అందుకు ఆయన ఎంతో శ్రమించారు. అపుడే నిర్ణయం తీసుకున్నా నాన్న ప్రతి రోజు నా వెంట పాఠశాలకు వచ్చేవారు. చదువుల్లో రాణించి మంచి మార్కులు సాధించాలని చెప్పేవారు. ఏ చిన్న సందేహం వచ్చినా వెంటనే ఉపాధ్యాయులను అడగాలని సూచించేవారు. ఎంతో గారాబంగా పెంచారు. 8వ తరగతి వరకు షాద్నగర్లో పూర్తి చేసిన తర్వాత 9,10 వట్టెం నవోదయలో చేర్పించాడు. అప్పుడే నేను సివిల్స్ వైపు దృష్టి సారించాను. నాన్న ఆశయాలను నెరవేర్చాలని నిర్ణయించుకున్నాను. అనంతరం ఇంటర్ హైదరాబాద్ వికాస్లో, బీటెక్ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో పూర్తి చేశా. గెలుపు చూడకుండానే విడిచి వెళ్లిపోయాడు తనను ఉన్నత స్థానంలో నిలిపేందుకు నాన్న అన్నివిధాలా ప్రోత్సహించారు. 2008 బీటెక్ చదువుతుండగా ఆయన అకాల మరణం కలిచివేసింది. నాన్న లేరనే విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. అమ్మ ప్రోత్సాహంతో సివిల్స్లో ర్యాంకు సాధించి ఇండియన్ రైల్వే సర్వీస్లో ఉద్యోగం సాధించా. నేను సాధించిన లక్ష్యాన్ని నాన్న చూసి ఉంటే ఎంతో సంతోష పడేవాడు. న్యూస్రీల్ నాన్న నడిపించాడు.. నన్ను గెలిపించాడు -
అక్రమ నిర్మాణాలను ఉపేక్షించం
షాబాద్: ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని షాబాద్ తహసీల్దార్ ఎండీ అన్వర్ హెచ్చరించారు. మండల పరిధిలోని హైతాబాద్ గ్రామ శివారు సర్వే నంబర్ 8లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను శనివారం ఆయన కూల్చివేయించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రభుత్వ భూమిలో కొంతమంది వ్యాపారాలకు అనుగుణంగా కమర్షియల్ నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. మండలంలో ఎక్కడైనా ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు కనిపిస్తే వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. 111 జీవోలో కూడా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయమై ఎంపీడీఓ, ఎంపీఓకు సమాచారం అందించామని స్పష్టంచేశారు. సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. ఆయన వెంట రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఉన్నారు. షాబాద్ తహసీల్దార్ ఎండీ అన్వర్ హైతాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత -
● ‘సెవెన్ స్టార్’ బిచ్చన్న
కొడంగల్ రూరల్: పట్టణానికి చెందిన బిచ్చన్న – విజయలక్ష్మి దంపతులకు ఏడుగురు సంతానం. దర్జీ వృత్తి చేస్తూ పిల్లలను చదివించారు. ఆ కాలంలో ఏడుగురిని చదివించడమంటే ఆషామాషీ కాదు.. కానీ బిచ్చన్న బెదరలేదు.. పేదరికాన్ని జయించి కొడుకులను ఉన్నత స్థానంలో నిలిపారు. మొదటి కుమారుడు సత్యకుమార్ హైదరాబాద్లో పీహెచ్డీ, ఐఐసీటీ.., సౌత్ఆఫ్రికాలో పోస్టు డాక్ చేశారు. ప్రస్తుతం మస్కట్ దేశంలో యూనివర్సిటీ ఆఫ్ నిజ్వాలో అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ రీసర్చ్గా విధులు నిర్వహిస్తున్నారు. రెండో కుమారుడు ప్రవీణ్కుమార్ ఐఐటీ బాంబే, ఎంఎస్సీ గణితం పూర్తి చేసి ప్రస్తుతం మస్కట్ దేశంలో హలీ బ్యాంకులో పని చేస్తున్నారు. మూడో కుమారుడు రవికుమార్ దౌల్తాబాద్ పీఎస్లో కానిస్టేబుల్గా పని చేస్తున్నారు. నాల్గో కుమారుడు అనిల్కుమార్ మద్రాస్ ఐఐటీలో పీహెచ్డీ పూర్తి చేసి ప్రస్తుతం కెనడియన్ కంపెనీలో రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ వాటర్ టెక్నాలజీ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. ఐదో కుమారుడు శివకుమార్ ఎంబీఏ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఓ ప్రముఖ నగల దుకాణంలో సీనియర్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్గా పని చేస్తున్నారు. ఆరో కుమారుడు మనోజ్కుమార్ ఐఐఐటీ పూర్తి చేసి ఫీడెక్స్లో సాఫ్ట్వేర్ డెవలపర్గా రాణిస్తున్నారు. ఏడో కుమారుడు నవీన్కుమార్ పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ పూర్తి చేసి అపెక్స్ కోవంటెజ్ ఎల్ఎల్సా, యూఎస్ కంపెనీలో డాటా ప్రోగ్రామర్గా విధులు నిర్వహిస్తున్నారు. పిల్లలందరూ ఉన్నత స్థానాలకు చేరుకోవడంతో బిచ్చన్న సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
రాజీయే రాజమార్గం
పరిగి: రాజీయే రాజమార్గమని పరిగి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగుల శిల్ప అన్నారు. శనివారం వివిధ కేసులపై మెగా లోక్ అదాలత్ నిర్వహించా రు. లోక్ అదాలత్లో ఇరువురి రాజీ ద్వారా పలు కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా జడ్జి శి ల్ప మాట్లాడుతూ పంతాలకు పోయి గొడవలు పెంచుకోవద్దని సూచించారు. క్షణికావేశంలో చేసిన తప్పులు పలు కేసులకు దారితీస్తాయన్నారు. కావు న ఎలాంటి కేసులైన లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని సూచించారు. ఇక్కడ పరిష్కారమైన కేసులను అంతిమ పరిష్కారంగా పరిగణిస్తారన్నారు. కావున కేసులు ఉన్న వారు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏజీపీ బాలముకుందర్, బార్అసోసియేషన్ అధ్యక్షుడు ఇబ్రాహింఖాన్, న్యాయవాదులు పాల్గొన్నారు.పరిగి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగుల శిల్ప -
● తండ్రి కష్టాలు చూస్తూ పెరిగాం
యాలాల: ఒక వైపు పేదరికం.. మరోవైపు కుటుంబ భారం.. అయినా బెదరకుండా తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించారు ఆ తండ్రి. నాన్న పడిన కష్టానికి ప్రతిఫలంగా నేడు ఆయన పిల్లలు ఉన్నత స్థాయిలో నిలదొక్కుకున్నారు. యాలాల మండల కేంద్రానికి చెందిన లక్ష్మీనారాయణ, భారతి దంపతులకు నలుగురు కొడుకులు, ఒక కూతురు. డిగ్రీ వరకు చదువుకున్న ఆయన ప్రైవేటు పాఠశాలలో విధులు నిర్వహిస్తూ, పాల బూత్ను నిర్వహిస్తూ పిల్లలను చదివించారు. నేడు నలుగురూ ఉన్నత స్థాయిలో నిలిచారు. పెద్ద కొడుకు కేశవ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, శివ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, కమల్ హాసన్ పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా, విజయ్ రతన్ కొండాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి కంటి విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. నాన్న పడ్డ కష్టానికి ప్రతిఫలమే తాము అని నలుగురు కుమారులు పేర్కొన్నారు. -
మామిడి పండ్ల లారీ బోల్తా
కొత్తూరు: మామిడి పండ్ల లోడ్తో వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ చేగూరు కూడలి జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూల్ జిల్లా నుంచి మామిడిపండ్ల లోడ్తో ఢిల్లీ వెళ్తున్న లారీ చేగూరు కూడలి వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్కు గాయాలయ్యాయి. ప్రమాదం కారణంగా తిమ్మాపూర్ నుంచి శంషాబాద్ వైపు వెళ్లే రోడ్డులో నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. లారీ బోల్తా పడగానే పలువురు వాహనదారులు, ప్రజలు మామిడి పండ్లను ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సాయంతో లారీను తప్పించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదంపై ఏలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ నర్సింహ్మారావు తెలిపారు. పెంజర్ల కూడలిలో.. షాద్నగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ లారీ పెంజర్ల కూడలి సమీపంలో అదుపు తప్పి, బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ నర్సింహ్మారావు తెలిపారు. డ్రైవర్కు గాయాలు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ -
సత్తాచాటిన కీర్తన
బడంగ్పేట్: బడంగ్పేటకు చెందిన గుడ్ల రాధ, శ్రీనివాస్ దంపతుల కూతురు కీర్తన నీట్ ఫలితాల్లో 468 ర్యాంకుతో సత్తాచాటింది. ఉస్మానియా, లేదా గాంధీ మెడికల్ కాలేజీలో తనకు ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, స్థానికులు ఆమెను అభినందించారు. గంజాయి విక్రేత అరెస్టు కేపీహెచ్బీకాలనీ: మహారాష్ట్రలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి హైదర్నగర్లో ఎక్కువ ధరకు విక్రయించేందుకు యత్నిస్తున్న ఓ యువకుడిని కేపీహెచ్బీ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద బ్యాగులో ఉన్న 1100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోరబండ ప్రాంతంలో నివాసం ఉండే బచ్చల లోకేష్ (22) సెంట్రింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. స్థానికంగా ఉన్న కొందరు యువకులతో కలిసి గంజాయి తాగడం అలవాటు చేసుకున్నాడు. మహారాష్ట్రలోని పర్బనీ ప్రాంతంలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి నగరంలో ఎక్కువ ధరకు విక్రయించడం ద్వారా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలోని హైదర్నగర్ వద్ద నల్లటి బ్యాగులో అనుమానాస్పదంగా కనిపించగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం బయటపడింది. భర్తను హత్య చేసిన భార్య ఇనుపరాడ్తో కొట్టడంతో తీవ్రగాయాలతో మృతి సైదాబాద్: భర్తకు మద్యం తాగించి..మత్తులో ఉన్న అతడిపై భార్య ఇనుపరాడ్తో దాడి చేయటంతో తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన గురించి వివరాలు ఈవిధంగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్కు చెందిన జీషాన్ అలీ (45) నగరానికి వలస వచ్చి 18 ఏళ్ల క్రితం చంద్రా అలియాస్ అయేషా పర్వీన్ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. చాలా కాలం ఎల్బీనగర్లో నివసించిన వీరు తమ ఐదుగురు సంతానంతో ఇటీవల సింగరేణి కాలనీలో అద్దెకు దిగి పూల వ్యాపారం చేసేవారు. జీషాన్ అలీ తరచూ మద్యం సేవించి భార్యతో గొడవ పడేవాడు. యూపీలోని శరన్పూర్లో నివసించే అతని సోదరుడు షకీర్ అలీ వారిని ఫోన్లో సముదాయించే వాడు. అయితే అయేషా ఇటీవల మరొకరితో చనువుగా ఉంటుందని జీషాన్ అలీ భార్యతో గొడవపడటం ఎక్కువైంది. ఈ నెల 11న అయేషా తన భర్తను ఇనుప రాడ్తో విచక్షణారహితంగా కొడుతుండగా వారి ఇంటి నుంచి వచ్చిన శబ్దాలు విని స్థానికులు వెళ్లి ఆమెను అడ్డుకొని జీషాన్ను పడుకోబెట్టి వెళ్లి పోయారు. మరుసటి రోజు అయేషా తన భర్తను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా వారు పరీక్షించి అతని పరిస్థితి విషమంగా ఉందని ఉస్మానియాకు తీసుకెళ్లమన్నారు. అక్కడికి వెళ్లగా..అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న మృతుడి సోదరుడు షకీర్ అలీ శుక్రవారం యూపీ నుంచి నగరానికి వచ్చి ఓజీహెచ్లో తన అన్న మృతదేహాన్ని గుర్తించాడు. తన సోదరుడిని కొట్టి చంపిన అయేషాపై సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇచ్చిన హామీలను అమలు చేయాలి
మర్పల్లి: కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెవేళ్ల పార్లమెంట్ నియోజక వర్గం సభ్యుడు కొండ విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని దామస్తాపూర్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ మండల అధ్యక్షుడు పట్లోళ్ల రామేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. దీంతో ఆయన శనివారం నగరంలోని ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కే రాజశేఖర్రెడ్డి సమక్షంలో కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయని అసమర్థ ముఖ్యమంత్రి అని ఆయన అవహేళన చేశారు. నిరుద్యోగ యువతకు యువ వికాస్ పథకంలో చెలగాటం ఆడుతున్నారని ఆయన ఆరోపించాడు. రైతులకు ఇంతవరకు రైతు భరోస ఇవ్వలేదన్నారు. రానున్న కాలంలో కాంగ్రెస్కు బుద్ధి చెప్పుతామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన వారిలో గోవర్ధన్ రెడ్డి, విశాల్రెడ్డి, అరవింద్ రెడ్డి, కృష్ణారెడ్డి, జితేందర్రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు శాంతుకుమార్, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతతోనే కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరికలు ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి -
నేడు తాండూరుకు అజారుద్దీన్
తాండూరు: భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహ్మ ద్ అజారుద్దీన్ ఆదివారం తాండూరుకు రానున్నారు. పట్టణానికి చెందిన వ్యాపారి ముజీ బ్ఖాన్ ఆధ్వర్యంలో విలియంమూన్ మైదానంలో కొనసాగుతున్న క్రికెట్ టోర్నీ ఫైన ల్ దశకు చేరుకుంది. ఈ సందర్భంగా శాసనమండలి చీఫ్ విప్ మహేందర్రెడ్డితో కలిసి విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. 108లో గర్భిణి ప్రసవం కొడంగల్ రూరల్: మండల పరిధిలోని చిట్లపల్లితండాకు చెందిన వాణిశ్రీ శుక్రవారం రాత్రి 108 అంబులెన్స్లో ప్రసవించింది. గ్రామంలో ఉన్న ఆమెకు పురిటి నొప్పులు రావడంతో 108కు సమాచారం అందించారు. ఆమెను వాహనంలో కొడంగల్ నుంచి తాండూరుకు తరలిస్తుండగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉండటంతో తాండూరు ఆస్పత్రిలో జాయిన్ చేశామని వాణిశ్రీ బంధువులు తెలిపారు. వీధి కుక్కల దాడిలో రైతుకు గాయాలు దోమ: వీధి కుక్కల దాడిలో ఓ రైతుకు గాయాలయ్యాయి. ఈ ఘటన దోమ మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం..మండల కేంద్రానికి చెందిన బోయిని కిష్టప్ప ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ గుంపులుగా ఉన్న కుక్కలు ఒక్కసారిగా అతనిపై దాడి చేశాయి. దీంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయని పేర్కొన్నారు. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స అందించి మందులు పంపిణీ చేశారు. గ్రామాల్లో వీధి కుక్కల బెడద ఎక్కవ ఉందని వాటిని జనవాసాలనుంచి తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సీసీ రోడ్డుపై జారిపడి చిన్నారి మృతి దిర్సంపల్లిలో ఘటన దోమ: ఇంట్లో నుంచి వెళ్తున్న బాలుడు ప్రమా దవశాత్తు జారిపడి మృతిచెందాడు. ఈ ఘటన దోమ మండల పరిధి లోని దిర్సంపల్లిలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివ రాల ప్రకారం.. గ్రామానికి చెందిన సంగీత, రమేశ్కు వేణుమాధవ్(4), అనూష(2) సంతానం. ఉదయం 10 గంటల సమయంలో ఆడుకునేందుకు బయటకు వస్తుండగా వాకిట్లోని సీసీ రోడ్డుపై కుప్పకూలి ప్రాణం కోల్పోయాడు. ఇది గమనించిన పక్కింటి మహిళ పరుగున వెళ్లి సంగీతకు చెప్పింది. తల్లి వచ్చి బాలుడిని కదపగా ఉలుకు, పలుకు లేకపోవడంతో లబోదిబోమని రోదించింది. చుట్టు పక్కల వారు అక్కడి చేరుకునిపరిశీలించేసరికే చిన్నారి మృతిచెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మరణంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రుత్విక్ జ్యోషికి 557 ర్యాంకు కొడంగల్ రూరల్: పట్టణానికి చెందిన రాము జ్యోషి కుమారుడు రుత్విక్ జ్యోషి నీట్లో ఆలిండియా లెవల్లో 557 ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పలువురు రుత్విక్ను అభినందించారు. -
● తల్లిలేని లోటు తీర్చాడు..
కుల్కచర్ల: అదో మారుమూల గ్రామం.. అందులో ఒక నిరుపేద రైతు కుటుంబం. చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడంతో నాన్నే సర్వంగా మారి తనను ఉన్నత స్థానంలో నిలిపాడు.. ఆయనే నాకు స్ఫూర్తి అని కుల్కచర్ల ఎస్ఐ రమేష్ పేర్కొన్నారు. కొందుర్గు మండలం కాస్లాబాద్కు చెందిన వన్నెగూడ సత్యయ్యకు ఒక కుమారుడు. భార్య చాలా ఏళ్ల క్రితమే చనిపోయింది.. కొడుకు రమేష్ను బాగా చదివించి ఉన్నత స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. అందుకోసం ఎంతో శ్రమించారు. తండ్రి శ్రమను గుర్తించిన రమేష్ అంతే పట్టుదలతో చదివి ఎస్ఐ ఉద్యోగం సాధించారు. తన ఎదుగుదలకు నాన్నే కారణమని, ఆయన స్ఫూర్తితోనే ఈ స్థాయికి చేరుకోగలిగానని గర్వంగా చెప్పారు. రమేష్ ప్రస్తుతం కుల్కచర్ల ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. నాన్న చూపిన మార్గంలోనే ముందుకు సాగుతానని పేర్కొన్నారు. -
కేసుల పరిష్కారానికి రాజీయే మార్గం
సీనియర్ సివిల్ కోర్టు జడ్జిలు దశరథరామయ్య, శ్యాంకుమార్ చేవెళ్ల: రాజీమార్గం ద్వారా కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకోవాలని సీనియర్ సివిల్ కోర్టు జడ్జిలు దశరథరామయ్య, జె.శ్యాంకుమార్, రిటైర్డ్ జడ్జి కె.లక్ష్మణ్ అన్నారు. శనివారం చేవెళ్ల కోర్టు ఆవరణలో మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్షణికావేశంలో గొడవలు, ఘర్షణల కారణంగా సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. భార్యాభర్తల కేసులు, కుటుంబ తగాదాలు, భూ సంబంధిత విషయాలను రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని చెప్పారు. 1,271 కేసులకు రూ.16.62లక్షల జరిమానాలు చేవెళ్ల కోర్టు ఆవరణలో ఈ నెల 9 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించిన లోక్ అదాలత్లలో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కరించామన్నారు. ఆరు రోజుల్లో 1,271 కేసులు పరిష్కరించగా రూ.16,62,690 జరిమానా విధించామన్నారు. ట్రాఫిక్ విభాగానికి సంబంధించి 766 కేసులు పరిష్కారమయ్యాయన్నారు. సివిల్, క్రిమినల్, పిట్టి కేసులకు సంబంధించి పరిష్కరించుకునేందుకు వీలున్న అన్ని కేసులకు పరిష్కారం చూపామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సూపరింటెండెంట్లు ఈ.మహిపాల్, బి.కృష్ణవేణి, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ కె.కుమార్. సీఐ భూపాల్శ్రీధర్, ట్రాఫిక్ ఏఎస్ఐ చందర్నాయక్, అడ్వకేట్స్ బి.కృష్ణ గౌడ్, బి.మల్లేశ్గౌడ్, నర్సింలు, ఉపేందర్, శేఖర్, సిబ్బంది అనిల్కుమార్, నర్సింలు, ఆనంద్కుమార్ తదితరులు ఉన్నారు. 152 కేసులకు పరిష్కారం ఆమనగల్లు: పట్టణంలోని జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమంలో 152 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ స్వరూప కాటం మాట్లాడుతూ.. లోక్ అదాలత్లో ఇరువర్గాలు రాజీపడి కేసులను పరిష్కరించుకోవాలన్నారు. కోర్టుల చుట్టూ తిరగకుండా రాజీపడి పరిష్కరించుకుంటే ఇరువర్గాలు గెలిచినట్లేనన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీపీ కార్తీక్, సీఐ జానకీరాంరెడ్డి, గంగాధార్, వేణుగోపాల్, ఎకై ్సజ్ సీఐ బద్యానాథ్ చౌహాన్, ఎస్ఐలు వెంకటేశ్, శ్రీకాంత్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదీలాల్, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ పోలీస్ కేసులు డ్రంకెన్ డ్రైవ్ 544 రూ.10,76,500 లైసెన్స్, రిజిస్ట్రేషన్ 222 రూ.2,96,500 -
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన మున్సిపల్ మాజీ చైర్మన్
కొడంగల్: మున్సిపల్ మాజీ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి శనివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మార్యద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని సీఎం నివాసానికి వెళ్లి కొడంగల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. భారీ మొత్తంలో నిధులతో మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. నీట్లో సత్తాచాటిన మండల విద్యార్థి జాతీయ స్థాయిలో 660 ర్యాంక్ సాధించిన హరీష్ యాలాల/తాండూరు టౌన్: నీట్ ఫలితాల్లో మండల విద్యార్థి సత్తాచాటారు. బెన్నూరు గ్రామానికి చెందిన కరణం లక్ష్మీకాంతరావు, విద్యారాణి దంపతుల కుమారుడు కరణం హరీష్ గౌతం గత మేలో నిర్వహించిన నీట్ జాతీయ స్థాయి అర్హత పరీక్షలకు హాజరయ్యాడు. శనివారం వెలువడిన ఫలితాల్లో జాతీయ స్థాయిలో 660వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 416వ ర్యాంకు సాధించారు. నీట్ పరీక్షలో అన్ని సబ్జెక్టుల్లో 99శాతం ఉత్తీర్ణతతో హరీష్ మార్కులు సాధించడం విశేషం. హరీష్ తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. టీపీయూఎస్ రాష్ట్ర కోశాధికారిగా ఉన్నారు. నీట్లో ప్రతిభ చాటిన హరీష్కు ఉపాధ్యాయులు, సంఘం నాయకులు అభినందనలు తెలిపారు. రక్త దానం ప్రాణదానంతో సమానం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ వినయ్ కుమార్ తాండూరు టౌన్: రక్తదానం ప్రాణ దానంతో సమానమని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వినయ్ కుమార్ అన్నారు. శనివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి రక్తనిధి కేంద్రంలో కేక్ కట్ చేసి, రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వైద్యులు, ఆస్పత్రి సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాద సమయంలో, అత్యవసర శస్త్ర చికిత్సల సమయంలో కావాల్సిన రక్త గ్రూపు లేక పోవడంతో అనేక మంది మృత్యువాత పడుతున్నారని తెలిపారు. అందువల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన రక్తనిఽధి కేంద్రంలో యువత, పెద్దలు రక్తదానం చేసి రక్త నిల్వలను పెంచాలన్నారు. రక్తదానం చేయడం ఆరోగ్యకరమైన అంశమని, అలాగే ఇతరులు ప్రాణాలను నిలబెట్టిన వార వుతారన్నారు. కార్యక్రమంలో వైె ద్యులు ఆనంద్ గోపాల్ రెడ్డి, రక్తనిధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ధారూరు మార్కెట్కు 2,358 బస్తాల మక్కలు ధారూరు: స్థానిక వ్యవసాయ మార్కెట్కు శనివారం 2,358 బస్తాల మొక్కజొన్నలు వచ్చాయని ఏఎంసీ కార్యదర్శి సిద్దమ్మ తెలిపారు. బీట్లలో వ్యాపారులు క్వింటాలు మొక్కజొన్నలకు తక్కువగా రూ.2,140, మధ్యస్తంగా రూ.2,170 ఎక్కువగా రూ.2,290 వరకు ధర పలికిందని తెలిపారు. 1010 రకం ధాన్యం 1,045 బస్తాలు రాగా క్వింటాలుకు రూ.1,870, రూ.1,880, రూ.1,950 వరకు, సోనారకం వడ్లు 291 బస్తాలు వచ్చాయని, క్వింటాలుకు రూ.2,050, రూ.2,100, రూ.2,150 వరకు వ్యాపారులు కొనుగోలు చేశారని ఆమె వివరించారు. -
బాలలను పనిలో పెట్టుకోవద్దు
అనంతగిరి: బాలలను పనిలో పెట్టుకోవద్దని ఆ ర్టీఏ సభ్యుడు ఎర్రవల్లి జాఫర్ అన్నారు. వికారాబాద్ మండలం సిద్దులూర్లో గురువారం అంతర్జాతీయ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సాధన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాలలను విధిగా స్కూళ్లకు పంపాలన్నారు. బాలల రక్షణకు ప్రభుత్వం అనేక చట్టాలను తీసుకువచ్చిందని తెలిపారు. వారు ప్రశాంతమైన వాతావరణంలో చదువుకునేలా ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. బాలలను పనిలో పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఉచితంగా యూనిఫాంలు, పుస్తకాలు, నోట్బుక్స్ అందజేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు దీటుగా బోధన అందుతోందన్నారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, ఎంపీడీఓ వినయ్కుమార్, ఎంఈఓ బాబుసింగ్, సాధన కోఆర్డినేటర్ నర్సింలు, హైస్కూల్ హెచ్ఎం రామకృష్ణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి ప్రసన్నకుమార్, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఆర్టీఏ సభ్యుడు ఎర్రవల్లి జాఫర్ -
పండుగలా ప్రారంభం
అట్టహాసంగా తెరచుకున్న పాఠశాలలు ● విద్యార్థులకు స్వాగతం పలికిన ఉపాధ్యాయులు ● తరగతి గదులను అందంగా ముస్తాబు చేసిన సిబ్బంది ● పాఠ్యపుస్తకాలు, యూనిఫారాల అందజేత ● మొదటి రోజుసరదాగా గడిపిన చిన్నారులు వికారాబాద్: వేసవి సెలవుల అనంతరం గురువారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. మొదటి రోజు కావడంతో 50శాతం లోపే విద్యార్థులు వచ్చారు. చాలా చోట్ల స్కూల్ సమయం కంటే ముందుగానే చేరుకున్నారు. బడి గంట మోగగానే కొందు పరిగెత్తుకు రావడం కనిపించింది. పలు పాఠశాలల్లో తరగతి గదులను మామిడి తోరణాలు, పూలతో అందంగా అలంకరించారు. విద్యార్థులకు పూలు ఇచ్చి స్వాగతం పలికారు. మొదటి రోజు కావడంతో చిన్నారులు సరదాగా ఆడుకోవడం కనిపించింది. జిల్లాలో మొత్తం 1,063 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిలో దాదాపు 80వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 74,967 యూనిఫారాలు, 5,27,290 పాఠ్యపుస్తకాలు, నోటు పుసక్తకాలు 5,21,904 పాఠశాలలకు చేరాయి. వాటిని విద్యార్థులకు అందజేశారు. సర్కారు బడుల్లో చేర్పించండి అనంతగిరి: పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని అడిషనల్ కలెక్టర్ సుధీర్ తల్లిదండ్రులకు సూచించారు. గురువారం పాఠశాలల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని వికారాబాద్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠఽశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫామ్స్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని.. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన చేస్తారని తెలిపారు. పాఠశాలల్లో అన్ని రకాల సదుపాయాలు, వసతులు ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ బాబుసింగ్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ విజయలక్ష్మి, హెచ్ఎం శ్రీశైలం, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం వీరేశం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఉత్తములుగా తీర్చిదిద్దాలిబంట్వారం: విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని డీఈఓ రేణుకాదేవి అన్నారు. గురువారం మండలంలోని బొప్పునారం యూపీఎస్లో విద్యా సంవత్సరం ప్రారంభ వేడుకల్లో ఆమె పాల్గొని మా ట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభు త్వ బడుల్లోనే చేర్పించాలని సూచించారు. నాణ్యమైన బోధనతో పాటు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాంలు అందిస్తున్నామ న్నారు. ఉపాధ్యాయులు స్థానికుల సహకారంతో విద్యార్థుల సంఖ్యను పెంచాలన్నారు. పాఠశాలలో తర చూ తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. చదువు లో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆమె ఆకాంక్షించారు. చదువుతోపాటు క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యమన్నారు. ప్రతిరోజూ దినపత్రికలు, పుస్తకాలు చదవటం అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. శారీరక దృఢత్వం కోసం క్రీడలు ఆడాలన్నారు. అనంతరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ వెంకటేశ్వర్రావు, ఉపాధ్యాయులు విక్రమ్రెడ్డి, అంజమ్మ, రజిని, గ్రామస్తులు పాల్గొన్నారు. -
చెక్డ్యామ్లతో భూగర్భ జలాల పెంపు
● పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ ● యావాపూర్, వట్టిమీనపల్లిలో పర్యటన నవాబుపేట: రాతి కట్టలు, ఫారంపాండ్ పనులతో భూగర్భ జలాలు పెరుగుతాయని పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ అన్నారు. మండల పరిధిలోని యావాపూర్, వట్టిమీనపల్లిలోని చెక్డ్యామ్లను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెక్డ్యామ్లతో పాటు చిన్న చెరువుల నిర్మాణానికి చొరవ తీసుకోవాలని సూచించారు. వర్షాలు సమృద్ధిగా కురిసిన వెంటనే నర్సరీల్లోని మొక్కలను నాటించాలని ఆదేశించారు. ఆయన వెంట డీపీఓ జయసుధ, డీఎల్పీఓ సంధ్యారాణి, ఎంపీడీవో అనురాధ, ఎంపీఓ విజయ్కుమార్, ఏపీఓ లక్ష్మీదేవి, టెక్నికల్ అసిస్టెంట్లు భాస్కర్, జగదీశ్, రవి, విష్ణువర్ధన్రెడ్డి, ఈసీ జ్యోతి, పంచాయతీ కార్యదర్శులు గీత, తదితరులు పాల్గొన్నారు. -
ట్రాన్స్ఫార్మర్ల దొంగ దొరికాడు
నవాబుపేట: వ్యవసాయ క్షేత్రాల్లోని ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి, వాటిలోని రాగి తీగ, ఆయిల్ను దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర దొంగ నందులాల్ రాజ్బార్(35)ను నవాబుపేట పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. 30 పైగా ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసిన కేసుల్లో ఇతనిపై నాన్బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయి. వారం రోజుల పాటు శ్రమించిన పోలీసులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అజంగఢ్ జిల్లాలోని తన స్వగ్రామమైన చైన్నెలో నిందితుడిని అరెస్టు చేశారు. ఇతను గ్యాస్ వెల్డింగ్ పనులు చేసేవాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో నేరాల బాట పట్టాడు. తన వృత్తిని అడ్డు పెట్టుకుని నిర్మానుష్య ప్రాంతాల్లోని ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని అందులోని కాపర్, ఆయిల్ను దొంగిలించి సొమ్ము చేసుకునేవాడు. 2020–21లో నవాబ్పేట్ పీఎస్ పరిధిలో చేసిన పదికి పైగా కేసుల్లో అరెస్టయి జైలుకు వెళ్లాడు. అనంతరం బెయిల్పై బయటకు వచ్చి, వికారాబాద్ జేఎఫ్సీఎం కోర్టులో జరుగుతున్న విచారణకు హాజరు కాకుండా పరారీలో ఉన్నాడు. దీంతో న్యాయస్థానం అతనిపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నిందితున్ని పట్టుకుని వెంటనే తమ ముందు హాజరు పర్చాలని పోలీసులను ఆదేశించింది. దీంతో ఎస్పీ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు నవాబ్పేట్ ఎస్ఐ అరుణ్ కుమార్, సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన నిందితుడు ఉత్తరప్రదేశ్లో ఉన్నట్లు పక్కా సమాచారం అందుకుని వారం రోజులుగా అజంగఢ్ జిల్లాలో మకాం వేశారు. స్థానిక పరిస్థితులను అధిగమించి, నిందితుడి కదలికలపై నిఘా పెట్టి, అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసిన ఎస్ఐ అరుణ్ కుమార్తో పాటు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. నిందితుడిపై నవాబుపేట పీఎస్లో 10, క్పల్లి పీఎస్లో 16, మోమిన్పేట్ పీఎస్లో 3, ధారూరు, బంట్వారం పీఎస్ల పరిధిలో ఒక్కోటి చొప్పున కేసులు నమోదైనట్లు తెలిపారు. వీటితో పాటు సంగారెడ్డి, సైబరాబాద్, నల్గొండ, నిజామాబాద్, సూర్యాపేట, మహబూబ్నగర్ జిల్లాల్లో కూడా ఈ తరహా కేసులు నమోదయ్యాయని స్పష్టంచేశారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపర్చి, మిగిలిన వారిని సైతం పట్టుకుంటామన్నారు. ఉత్తర్ప్రదేశ్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుడిపై 30కిపైగా కేసులు -
అభివృద్ధి పథంలో కొడంగల్
● సీఎం రేవంత్రెడ్డి సహకారంతో వేగంగా సాగుతున్న పనులు ● కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి ● లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీకొడంగల్: అభివృద్ధి పథంలో కొడంగల్ దూసుకుపోతోందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎనుముల తిరుపతిరెడ్డి అన్నారు. పట్టణంలోని కడా కార్యాలయంలో గురువారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని ఎనిమిది మండలాల్లో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో అన్నివర్గాల ప్రజలకు మేలు జరుగుతోందని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహకారంతో రూ. 10 వేల కోట్లతో వివిధ పనులు ప్రారంభించామని చెప్పారు. కొడంగల్కు ప్రభుత్వ మెడికల్ కళాశాల, నర్సింగ్, ఫిజియోథెరపీ, పారా మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయని వెల్లడించారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని 220 బెడ్లకు విస్తరించడంతో పాటు టీచింగ్ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేశారన్నారు. అర్హులందరికీ రైతు భరోసా, రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు అందిస్తున్నామని చెప్పా రు. అనంతరం పట్టణంలోని ప్రకృతి వనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కడా అధికారి వెంకట్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజేశ్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ అంబయ్యగౌడ్, మహ్మద్ యూసూఫ్, నందారం ప్రశాంత్, నయీమ్, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, తహశీల్దార్ విజయ్కుమార్, ఎంపీడీఓ ఉషశ్రీ పాల్గొన్నారు. -
సదస్సులను వినియోగించుకోండి
పరిగి: రెవెన్యూ సదస్సులను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ ఆనంద్రావు సూచించారు. గురువారం మండల పరిధిలోని సుల్తాన్పూర్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూభారతి రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. వెంటనే రైతులు సదస్సులో అర్జీ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. సమస్యలు పరిష్కారానికే.. తాండూరు రూరల్: భూ సమస్యలు పరిష్కారానికే భూ భారతి చట్టం ఉందని తహసీల్దార్ తారాసింగ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని బెల్కటూర్, కొటబాసుపల్లి, చిట్టిఘనాపూర్ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 20వ తేదీ వరకు సదస్సులు నిర్వహిస్తామన్నారు. సదస్సులకు విశేష స్పందన దుద్యాల్: మండల పరిధిలోని హస్నాబాద్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో 35 ఫిర్యాదులు అంది నట్లు ఉప తహసీల్దార్ వీరేశ్ తెలిపారు. రెవెన్యూ స దస్సులకు విశేష స్పందన వస్తుందని ఆయన తెలిపారు. రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అల్లాపూర్లో.. కుల్కచర్ల: భూ భారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ అన్నారు. గురువారం మండలంలోని అల్లాపూర్ గ్రామపంచాయతీలో రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. -
బలమైన శక్తిగా భారత్
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి అనంతగిరి: ప్రపంచంలోనే మనదేశం నేడు నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోతోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్లో బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ పదకొండేళ్ల పాలనపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభు త్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వికసిత్ భారత్ అమృత్ కాల్ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పట్టణంలోని ప్రధా న రోడ్డు వద్ద ఎగ్జిబిషన్న్ ఏర్పాటు చేసినట్లు చెప్పా రు. నేడు దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోందన్నారు. ఈ నెల 17నుంచి గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి మోదీ పాలనను ప్రజల కు వివరిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ల అమలులో విఫలమైందని ఆరోపించారు. కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ ట్రెజరర్ విజయ్సూరన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సదానందరెడ్డి, జిల్లా కన్వీనర్ శేరి శ్రీధర్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వివేకానందరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, రాష్ట్ర నాయకురాలు సుచరితారెడ్డి, మండల అధ్యక్షుడు శివరాజ్గౌడ్,, జిల్లా నాయకులు బస్వలింగం,శ్రీ కాంత్రెడ్డి, నరోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ‘సంక్షేమం’
తాండూరు/తాండూరు రూరల్: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని ఎమ్మెల్యే బి.మనోహర్రెడ్డి అన్నారు. రూ.2.21 కోట్లతో తాండూరులో నిర్మించనున్న మురుగు కాల్వలకు వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, మున్సిపల్ కమిషనర్ విక్రంసింహారెడ్డితో కలిసి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని, ఇందులో భాగంగానే చిలుక వాగు ప్రక్షాళన, మురుగు కాల్వల నిర్మాణ పనులను చేపట్టామని స్పష్టంచేశారు. భారీ వర్షాలు కురిస్తే మున్సిపాలిటీలోని పలు ప్రాంతాలు జలమయం అవుతున్నాయన్నాని తెలిపారు. గత పాలకులు నిర్లక్ష్యంతోనే చిలుకవాగు నిరాదరణకు గురైందని ఆవేదన వ్యక్తంచేశారు. సంక్షేమ పథకాల అమలుపై ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది, మాజీ కౌన్సిలర్లతో సమీక్ష నిర్వహించారు. అర్హులందరికీ సబ్సిడీ సిలిండర్, ఉచిత విద్యుత్ అందేలా చూడాలన్నారు. కాగ్నా నది పంప్ హౌస్ మోటార్లను కాలం చెల్లాయని కొత్త మోటార్లను బిగించాలని తెలిపారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రొసీడింగ్లు అందజేశామని, నిర్మాణాలు ప్రారంభించుకోవా లని చెప్పారు. కోట్పల్లి ప్రాజెక్టు అభివృద్ధికి ప్రభు త్వం రూ.90 కోట్ల నిధులు చేయడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు హబీబ్లా ల, మాజీ కౌన్సిలర్లు నీరజాబాల్రెడ్డి, సోమశేకర్, మమత, పలువురు నాయకులుపాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తన చేతులమీదుగా పట్టాలు అందజేయడం చాలా ఆనందంగా ఉందని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన రోజు కూడా ఇంత సంతోషాన్ని అనుభవించలేదని మనోహర్రెడ్డి అన్నారు. తాండూరు, పెద్దేముల్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. అంతకుముందుకు ఇందిరమ్మ నమూనా ఇంటితో ఏర్పాటు చేసిన ఎడ్ల బండిపై ఎమ్మెల్యేను ఊరేగించారు. అన ంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బీఎమ్మార్ మాట్లాడుతుండగా వర్షం మొదలైంది. ఆయన వర్షంలోనే తడుస్తూనే తన ప్రసంగాన్ని కొనసాగించగా, మహిళలు తాము కూర్చున్న కుర్చీలను త లపై పట్టుకుని ఆసక్తిగా విన్నారు. రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ సభ్యుడు రమేష్ మహరాజ్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సూజత, పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, కాంగ్రెస్ బ్లాక్ ఏ అధ్యక్షుడు లొంక నర్సిములు, మండలాల అధ్యక్షుడు నాగప్ప,గోపాల్, నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి తాండూరు, పెద్దేముల్లో పర్యటన చిలుగవాగు పరిశీలన, ఇందిరమ్మ పట్టాల పంపిణీ -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● పారిశుద్ధ్య పనులు చేపట్టండి అదనపు కలెక్టర్ సుధీర్ అనంతగిరి: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ ఎం.సుధీర్ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో దోమల నుంచి సంక్రమించే వ్యాధుల నియంత్రణపై జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో దోమ కాటు వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్య లాంటి వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. వసతి గృహాలు, పాఠశాలల్లో ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని, జ్వరం, దగ్గు, జలుబుకు మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలన్నారు. నీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయాలన్నారు. గ్రామాల్లో మురుగు నీరు నిలవకుండా, పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకునే ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వైద్యం, ఇతర సహాయం కోసం సెల్నంబర్ 9702705161లో సంప్రదించాలని సూచించారు. సమావేశంలో డీటీడీఓ కమలాకర్ రెడ్డి, డీబీసీడీఓ ఉపేందర్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శంకర్ నాయక్, డిప్యూటీ డీఎంహెచ్ఓ రవీంద్ర యాదవ్, వివిధ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రైతులకు న్యాయం చేయాలి
అనంతగిరి: వరి కొనుగోలు కేంద్రాల్లో అధికారులు ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నారని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ అన్నారు. గురువారం యాలాల మండలం జంటుపల్లి రైతులతో వచ్చి కలెక్టర్ ప్రతీక్ జైన్ను కలిశారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. స్పందించిన కలెక్టర్ రైతులకు న్యాయం జరిగేలా చూడాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, జిల్లా సివిల్ సప్లయ్ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం శుభప్రద్పటేల్ మాట్లాడుతూ.. తరుగు పేరు తో రైతులను మోసం చేస్తూ 41 కిలోలకు కాంట పెట్టడానికి బదులు 43 కిలోలు తీసుకుంటున్నా రని తెలిపారు. రైస్ మిల్లర్లు సైతం 50 బస్తాలు ఉన్న రైతు దగ్గర రెండు బస్తాలు, 70 బస్తాలు ఉంటే 3 బస్తాలు, 100 బస్తాలకు 5 బస్తాలు, 150 బస్తాలకు 8 బస్తాలు కట్ చేస్తూ రైతులను దోచుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో బాధిత రైతులు రాంచందర్ శాంతప్ప, గోవర్దన్ గౌడ్, సోను, గోవింద్, నాయకులు రవిశంకర్, సిద్దిఖ్ పాల్గొన్నారు. రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్పటేల్ -
బైక్ల దొంగకు కటకటాలు
తాండూరు టౌన్: బైకులు చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగను తాండూరు పట్టణ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఏకంగా 15 బైకులను దొంగిలించిన నిందితుడు, ఇందులో 10 బైకులు విక్రయించి.. మరో బైక్పై దర్జాగా తిరుగుతుండగా ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. పట్టణ సీఐ సంతోష్ కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యాలాల మండలం కమాల్పూర్ గ్రామానికి చెందిన బోయిని శ్రీకాంత్ ఆటో డ్రైవర్గా పని చేసేవాడు. బుధవారం స్థానిక విలియంమూన్ చౌరస్తా వద్ద ఎస్ఐ సాజిద్ తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో బైక్పై వచ్చిన శ్రీకాంత్ పోలీసులను చూసి బైకు వదిలేసి పారిపోతుండగా, వెంబడించి పట్టుకున్నారు. అనంతరం తమ దైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపెట్టాడు. జిల్లాలో చోరీ చేసిన 15 బైకుల్లో 10 బైకులను తాండూరు మండలం బిజ్వార్ గ్రామంలో పలువురికి విక్రయించినట్లు అంగీకరించాడు. మిగిలిన ఐదింటిలో నాలుగు బైకులను తన ఇంట్లో దాచి పెట్టి మరో బైకుపై దర్జాగా తిరుగుతున్నాడు. దీంతో రూ.7.50 లక్షల విలువైన 15 బైకులను స్వాధీనం చేసుకుని, గురువారం నిందితుడిని రిమాండ్కు తరలించారు. అయితే గతంలో ఇతనిపై సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 20 కేసుల వరకు నమోదయ్యాయి. వీటిలో పలు కేసుల్లో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అయినా తీరు మార్చుకోలేదు. బైకు చోరీ కేసులను ఛేదించిన పట్టణ సీఐ సంతోష్ కుమార్, ఎస్ఐ సాజిద్, క్రైమ్ సిబ్బంది అమ్జద్, శివ, సాయప్ప, షబీల్ను ఎస్పీ నారాయణరెడ్డి అభినందించారు. 15 ద్విచక్ర వాహనాలు స్వాధీనం నిందితుడిపై 20కిపైగా కేసులు -
కష్టపడే వారికి సముచిత స్థానం
పీసీసీ అబ్జర్వర్ వినోద్రెడ్డి అనంతగిరి: పార్టీ కోసం అహర్నిశలు పాటుపడే వారికి సముచిత స్థానం కల్పిస్తామని పీసీసీ అబ్జర్వర్ వినోద్రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు గురువారం వికారాబాద్ పట్టణంలో నియోజకవర్గస్థాయి కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చామన్నారు. పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి ఈ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. పార్టీ కోసం ఎంతో కష్టపడి అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. పార్టీకి కార్యకర్తలే ముఖ్యమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి, పీపీసీ సహాయక అబ్జర్వర్ నరేందర్, పార్టీ పట్టణ అద్యక్షుడు సుధాకర్రెడ్డి, నాయకులు సత్యనారాయణ, జాఫర్, కిషన్నాయక్, నర్సింలు, అనంత్రెడ్డి, ఆయా మండలాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు. -
మోగనున్న బడి గంట
నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభంపండుగలా జరగాలి వికారాబాద్: సుదీర్ఘ సెలవుల తర్వాత నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఎప్పటిలాగే ఈ సారి కూడా విద్యార్థులను సమస్యలే స్వాగతం పలకనున్నాయి. వేసవి సెలవుల్లో ఆహ్లాదంగా గడిపిన చిన్నారులు గురువారం నుంచి బడిబాట పట్టనున్నారు. విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చి పదేళ్లు దాటినా విద్యార్థుల సమస్యలు తీరిన దాఖలాలు లేవు.. మన ఊరు – మన బడి, అమ్మా ఆదర్శ పాఠశాలలు లాంటి ప్రతిష్టాత్మక కార్యక్ర మాలు చేపట్టినా ఆశించిన మేర విద్యార్థులను ఆకర్శించలేకపోతున్నాయి. ప్రభుత్వ బడులలో మౌలిక సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా సమస్యలు కొలిక్కి రాలేదనే చెప్పాలి. ఇంకా వందకు పైగా పాఠశాలల్లో మరమ్మతులు అవసరమని అధికారులు తేల్చారు. సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కాకుండానే పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి. కొంగొత్త ఆశలు, ఆకాంక్షలతో వచ్చే విద్యార్థులకు కొంత మేర సమస్యలు తగ్గినప్పటికీ ఇంకా పలు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో ఫలితాలు కనిపిస్తున్నా.. అకాడమిక్ విషయంలో పెద్దగా మార్పు కనిపించలేదనే చెప్పాలి. నేడు పుస్తకాలు, దుస్తుల పంపిణీ జిల్లాలో మొత్తం 1,063 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 80వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ ఏడాది వారం రోజుల ముందుగానే పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు స్కూళ్లకు చేర్చారు. విద్యార్థులకు యూనిఫారాలు సిద్ధంగా ఉంచారు. పాఠశాలల ప్రారంభం రోజునే వీటిని అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సారి నోటు పుస్తకాలను కూడా ఉచితంగా అందించనున్నారు. పాఠశాలల పర్యవేక్షణలో కీలక భూమిక పోషించే డిప్యూటీ డీఈఓ వ్యవస్థకు స్వస్తి పలకగా.. 20 మండలాలకు ఒక్క రెగ్యులర్ ఎంఈఓ కూడా లేకుండా ఇంచార్జులతోనే నెట్టుకొస్తున్నారు. ఈ ప్రభావం ఫలితాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మూడేళ్లుగా పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా చివరి వరుసలో నిలవడం ఇక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది. ఇకనైనా పరీక్షల సమయంలోనే హడావుడి చేయకుండా అకాడమిక్ మానిటరింగ్ విషయంలోనూ దృష్టి సారించాలని విద్యాభిమాను లు, విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యూనిఫాంల సిద్ధం ఈ ఏడాది మొదటి విడతలో 79,049 యూనిఫారాలు అవసరమని ఇండెంట్ చేయగా ఇప్పటి వరకు 74,967 అంటే 95 శాతం పాఠశాలలకు చేర్చారు. 5,27,290 పాఠ్యపుస్తకాలు అవసరమని కాగా 4,84,211 అంటే 92 శాతం పాఠశాలలకు చేర్చారు. ఇక 5,79,894 నోటు పుసక్తకాలు అవసరమని కాగా 5,21,904 అంటే 92 శాతం బడులకు చేరవేశారు. మౌలిక సదుపాయాలతో సరి ఎప్పటిలాగే సమస్యలతో స్వాగతం జిల్లాలో మొత్తం పాఠశాలలు 1,063 విద్యార్థులు 80 వేల మంది సమస్యలు లేకుండా చూడండి: కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలల పునఃప్రారంభం పండుగ వాతావరణంలో జరగాలని కలెక్టర్ ప్రతీక్జైన్ ఆదేశించారు. పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యునిఫారాలు మొదటి రోజే పంపిణీ చేయాలని సూచించారు.. గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం ఆయన అడిషనల్ కలెక్టర్ సుధీర్, డీఈఓ రేణుకాదేవి, ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హెచ్ఎంలు, ఎంఈలకు పలు సూచనలు చేశారు. బడుల్లో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు. పాఠశాలల ఆవరణలో నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పైకప్పులపై నీరు నిల్వ ఉంటే లేకుండా చేసుకోవాలన్నారు. ఆవరణ, పాఠశాల గదులు మొత్తం శుభ్రం చేసుకోవాలన్నారు. కిచెన్ షెడ్ల శుభ్రంగా చేయాలన్నారు. షెడక్లు లేకుంటే ప్రతిపాదనలు పంపాలన్నారు. బియ్యం, వంట పాత్రలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వాటర్ ట్యాంకులను క్లోరినేషన్ చేసుకోవాలని ఆసూచించారు. బడీడు పిల్లలందరూ పాఠశాలతో చేరేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అధికారుల సూచనలు పాటించాలి
● జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్రెడ్డి అనంతగిరి: రైతులు వ్యవసాయాధికారులు ఇచ్చే సూచనలు, సలహాలు పాటించాలని డీఏఓ మోహన్రెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ మండలం నారాయణపూర్ గ్రామ రైతువేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తాండూరు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు సుజాత, యమున పంటలు వేసేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. మోతాదుకు మించి ఎరువులు, పురుగు మందు వాడవద్దని సూచించారు. రైతులకు ఏమైన సందేహాలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే నివృత్తి చేసి తగిన జాగ్రత్తలు సూచి స్తామని పేర్కొన్నారు. విత్తనాలు, ఎరువులు, మందులు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా రసీదు తీసుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏడీఏ శంకర్రాథోడ్, ఏఓ ప్రసన్నలక్ష్మి, ఏఈవోలు కావ్య, సరిత, ఫరీన్ పాల్గొన్నారు. -
డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు..
దరఖాస్తుల ఆహ్వానం ● ఈ నెల 23 వరకు అవకాశం ● అర్హులైన విద్యార్థినులుసద్వినియోగం చేసుకోవాలి ● కలెక్టర్ ప్రతీక్ జైన్ అనంతగిరి: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు అర్హులైన మహిళా విద్యార్థినులు ఈ నెల 23 తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్కు సంబంధించిన డిగ్రీ మహిళా కళాశాల మొయినాబాద్ మండలం, తోలు కట్ట సమీపంలో ఉందన్నారు. కళాశాలలో బీఎస్సీ (ఎంపీసీఎస్, ఎంఎస్సీఎస్, బీజెడ్సీ, ఎంజెడ్సీ), బీకాం (బీఏ, సీఏ), బీఏ (హెచ్ఈపీ) కోర్సుల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. అర్హులైన విద్యార్థులు పదో తరగతి, ఇంటర్ మార్కుల మెమో (అటెస్టెడ్ గెజిటెడ్ ఆఫీసర్), కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ, 5 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలతో పాటు జనవరి 2025 తర్వాత పొందిన ఆదాయ ధ్రువీకరణ పత్రం(గ్రామీణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల ఆదా యం రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతానికి చెందిన వారి ఆదాయం రూ.2 లక్షలలోపు)తో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, డీఈఓ రేణుకాదేవి, డీసీఓ సాయిలత, కళాశాలల ప్రిన్సిపాళ్లు డాక్టర్ విజయ కోట, అశోక్ తదితరులు పాల్గొన్నారు. సకాలంలో హాజరుకావాలి జిల్లాలో యూడీఐడీ/ సదరం క్యాంపులకు దివ్యాంగులు సకాలంలో హాజరు కావాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు అంగవైకల్యానికి సంబంధించి జూన్ 13, 19, 24, 25 తేదీల్లో, బుద్ధి మాంద్యం గలవారికి జూన్ 17, 18న, మూగ, చెవుడు గత వారికి జూన్ 26న, అంధులకు జూన్ 27న క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్లాట్ బుక్ చేసుకున్న వారికి ఫోన్ ద్వారా సమచారం పంపుతామని తెలిపారు. వారు మాత్రమే క్యాంపులకు హాజరు కావాలని సేచించారు. -
పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
● మహిళా అభ్యర్థులకు అవకాశం ● కాంట్రాక్టు పద్ధతిలో ఎంపిక ● డీఈఓ రేణుకాదేవి అనంతగిరి: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అకౌంటెంట్, ఏఎన్ఎం పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలరి డీఈఓ రేణుకాదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అకౌంటెంట్ పోస్టులు 6, ఏఎన్ఎం పోస్టులు 3 ఖాళీగా ఉన్నాయని తెలిపారు. తాత్కాలిక కాంట్రాక్టు పద్ధతిలో మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నుట్లు వివరించారు. కేజీబీవీ దోమ, బషీరాబాద్, కొట్పల్లి, పెద్దేముల్, చౌడపూర్, బొంరాస్పేటలో అకౌంటెంట్ పోస్టులు, కేజీబీవీ చౌడాపూర్, నవాబుపేట, అలాగే ముజాహిద్పూర్ ఆదర్శ పాఠశాలలో ఏఎన్ఎం పోస్టులు ఖాళీలు ఉన్నాయని తెలిపారు. అకౌంటెంట్ పోస్టుకు గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ (ఎంఎస్ వర్డ్ – ఎక్సెల్) లేదా బీకాం కంప్యూటర్స్ అర్హత కలిగి ఉండాలని తెలిపారు. ఏఎన్ఎం పోస్టుకు ఇంటర్మీడియట్తో పాటు ఏఎన్ఎం సర్టిఫికెట్(ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్) ఉండాలన్నారు. అకౌంటెంట్ కోసం కామర్స్ డిగ్రీ చేసిన వారికీ 75 శాతం, పీజీ ఎంకామ్ చేసిన వారికి 25శాతం వెయిటేజీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఏఎన్ఎం కోసం ఇంటర్, ఏఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉన్న వారికి 45శాతం, ప్రొఫెషనల్ క్వాలిఫికెషన్స్ ఉన్న వారికి (జీఎన్ఎం ట్రైనింగ్ 5 మార్కులు, బీఎస్సీ నర్సింగ్ 10 మార్కులు) అదనపు వెయిటేజ్ ఇవ్వబడుతుందని వివరించారు. 25 నుంచి 40 సంవత్సరంలోపు వయస్సు కలవారు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఆమె తెలిపారు. -
నిరుపేదలకే ఇందిరమ్మ ఇళ్లు
● డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్తాండూరు రూరల్: నిరుపేదలకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు డీసీసీబీ వైస్ చైర్మన్ సంగెం రవిగౌడ్ తెలిపారు. బుధవారం తాండూరు మండలం సంగెంకలాన్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్ణాటక సరిహద్దులోని సంగెంకలాన్ గ్రామాన్ని ప్రభుత్వం అన్ని విధాలా అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. మొదటి విడతగా 50 ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షలు మంజూరు చేస్తుందని చెప్పారు. లబ్ధిదారులు వెంటనే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలోని రేషన్ దుకాణాన్ని పరిశీలించారు. ఈనెల చివరి వరకు బియ్యం చేస్తారని ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విశ్వప్రసాద్, మాజీ సర్పంచ్ మేఘనాథ్గౌడ్, పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణ, యూ త్ ప్రెసిడెంట్ సంతోష్కుమార్ పాల్గొన్నారు. -
తిరుగులేని శక్తిగా భారతి సిమెంట్
● అత్యంత మన్నికై నది భారతి అల్ట్రా ఫాస్ట్ ● ఇంజనీర్లతో కంపెనీ టెక్నికల్ మేనేజర్ సునీల్ సమావేశం తాండూరు టౌన్: వ్యాపార రంగంలో తిరుగులేని శక్తిగా భారతి సిమెంట్ వర్ధిల్లుతోందని ఆ సంస్థ టెక్నికల్ మేనేజర్ సునీల్ అన్నారు. బుధవారం స్థానిక దుర్గా గ్రాండ్యుయర్ హోటల్లో పలువురు ఇంజనీర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రా ఫాస్ట్ సిమెంట్ ఎంతో నాణ్యమైనదన్నారు. దీంతో నిర్మాణ ప్రక్రియ వేగవంతమవుతుందన్నారు. అల్ట్రా ఫాస్ట్ సిమెంట్తో ముఖ్యంగా స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జిలు, రహదారుల నిర్మాణాన్ని చేపడితే ఎక్కువ కాలం నిలుస్తాయన్నారు. స్లాబ్ కాంక్రీట్ సమయంలో నిపుణులైన ఇంజనీర్లు భారతి సిమెంట్ కంపెనీ తరఫున ఉచిత సాంకేతిక సహాయం అందజేస్తామన్నారు. నేరుగా సైట్ వద్దకు వచ్చి సహాయం చేస్తారన్నారు. మార్కెట్లో ఉన్న ఇతర సిమెంట్ రకాలతో పోలిస్తే భారతి ఆల్ట్రా ఫస్ట్ రూ.20 అధికంగా ఉందన్నారు. అనంతరం డీలర్ రవీందర్ మాట్లాడుతూ.. భారతి సిమెంట్ ఎంతో మన్నిక కలదని, సర్వీస్ విషయంలో ఎంతో వేగంగా స్పందిస్తారన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ సతీష్ రాజు, అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్ వీరాంజనేయ రెడ్డి, టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు అభినందనలు
అనంతగిరి: వివిధ ప్రాంతాల్లోని క్రీడా పాఠశాలలో సీట్లు సాధించిన 9మంది గిరిజన విద్యార్థులను బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ అభినందించారు. 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను ఇటీవల వాటర్ స్పోర్ట్స్ అకాడమీ (క్రీడా పాఠశాలలో) బోయినపల్లి, హైదరాబాదు నందు కాయకింగ్, కేనోయింగ్, ఫెన్సింగ్ మొదలైన వాటర్ స్పోర్ట్స్ నందు అడ్మిషన్లు కోసం రాష్ట్ర స్థాయి పరీక్షలు జరిగాయి. జిల్లా నుంచి 9మంది గిరిజన విద్యార్థులు ఎంపికయ్యారు. వారిని అదనపు కలెక్టర్ సుధీర్ అభినందించారు. చదువుతో పాటు వాటర్ స్పోర్ట్స్ విభాగంలో జాతీయ స్థాయిలో సత్తా చాటాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీటీడీఓ కమలాకర్ రెడ్డి, విద్యార్థుల తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి వివేక్ను కలిసిన మాజీ వైస్ ఎంపీపీలు పరిగి: రాష్ట్ర మంత్రి మండలిలో నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి గడ్డం వివేక్ను మండల మాజీ వైస్ ఎంపీపీలు మాణిక్యం, సత్యనారాయణ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేయాలని మంత్రి సూచించినట్టు వారు తెలిపారు. రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలకు చెక్ తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ యాలాల: రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తెలిపారు. బుధవారం మండలంలోని దౌలాపూర్లో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సును పరిశీలించారు. రైతులు ఇచ్చిన దరఖాస్తుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దౌలాపూర్తో పాటు ముద్దా యిపేటలో నిర్వహించిన సదస్సులో ఆరు దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ వెంకటస్వామి తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కిరణ్కుమార్, ఆర్ఐ వేణు, జూనియర్ అసిస్టెంట్ విజయ్కుమార్ పాల్గొన్నారు. ‘బాల పురస్కార్’కు దరఖాస్తు చేసుకోండి జిల్లా సంక్షేమ శాఖ అధికారి జయసుధ అనంతగిరి: ప్రధాన మంత్రి బాల పురస్కార్ అవార్డులకు అర్హులై న పిల్లలు దరఖాస్తు చే సుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి జయసుధ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.వివిధ రంగాల్లో ప్ర తిభ కనబర్చిన బాలలు ప్రధాన మంత్రి రాష్ట్రీ య బాల పురస్కార్ అవార్డు 2025కు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. క్రీడలు, నూతన ఆవిష్కరణలు, సామాజిక సేవ, కళలు, సంస్కృతి, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల్లో ప్రతిభ కనబర్చిన 18 సంవత్సరాల లోపు బా లలు అవార్డుకు అర్హులన్నారు. జూలై 31లోపు హెచ్టిటిపిఎస్ //అవార్డ్స్ . జిఓవి. ఇన్వెబ్ సైట్లో దరఖాస్తు చేయాలని సూచించారు. నేడు చెన్నారంలో ట్రాక్టర్ల రివర్స్ డ్రైవింగ్ పోటీలు యాలాల: మండలంలోని చెన్నారం గ్రామంలో గురువారం ట్రాక్టర్ల రివర్స్ డ్రైవింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు యువ రైతు పవన్కుమార్రెడ్డి తెలిపారు. ఏరువాక పండుగతో పాటు తన తండ్రి కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యే ఈ పోటీల్లో నిర్దేషిత ప్రదేశానికి తక్కువ సమయంలో ట్రాక్టర్ను రివర్స్లో చేరుకుంటారో వారు విజేతగా నిలుస్తారని తెలిపారు. గెలుపొందిన వారికి నగదు ప్రొత్సాహక బహుమతి ఇవ్వనున్నట్లు రైతు తెలిపారు. -
బీసీ హక్కుల కోసం నిరంతర పోరాటం
షాబాద్: బీసీల హక్కుల కోసం నిరంతర పోరాటం చేస్తామని బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో బుధవారం బీసీసేన మండల సమావేశం నిర్వహించారు. అనంతరం మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీసీసేన మండల అధ్యక్షుడిగా దామర్లపల్లి గ్రామానికి చెందిన కమ్మరి దయాకర్చారిని నియమించారు. ఉపాధ్యక్షుడిగా గోపాల్, యూత్ అధ్యక్షుడిగా బండ అజయ్కుమార్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణాయాదవ్ మాట్లాడుతూ.. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలంతా పోటీకి సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో బీసీసేన జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, షాద్నగర్ నియోజకవర్గం అధ్యక్షుడు కత్తి శేఖరప్ప, మహిళా అధ్యక్షురాలు బాస వరలక్ష్మి, ఫరూఖ్నగర్ మండల అధ్యక్షుడు మేకల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణాయాదవ్ -
అక్కసుతోనే దాడులు
పరిగి: ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు, జర్నలిస్టులు, పత్రిక కార్యాలయాలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎల్హెచ్పీఎస్, భారత్ ముక్తి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవింగ్నాయక్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. సీనియర్ జర్నిలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్రావుపై అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపడం అప్రజాస్వామికమని తెలిపారు. ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న గొంతులను నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. గత ఏడాది కాలంగా ఏపీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను బయటపెడుతోందనే అక్కసుతో సాక్షి కార్యాలయాలపై దాడులు చేస్తున్నారన్నారు. ప్రత్రిక స్వేచ్ఛను హరించే కుట్ర చేస్తున్న వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. శోభాయమానంగా గిరిప్రదక్షిణ కుల్కచర్ల: మండలంలోని బండవెల్కిచర్ల గ్రామంలో శ్రీ పాంబండ రామలింగేశ్వర దేవస్థానంలో ప్రతి పౌర్ణమికి నిర్వహించే గిరిప్రదక్షిణ కార్యక్రమం బుధవారం శోభాయమానంగా కొనసాగింది. భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో పాంబండ క్షేత్రం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య అబ్దుల్లాపూర్మెట్ : చెట్టుకు ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. పెద్దఅంబర్పేట ఓఆర్ఆర్ సమీపంలోని బలిజగూడ రహదారిలో ఉన్న ఏఎల్ నగర్ వెంచర్లో బుధవారం ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకున్నాడు. సమాచారం అందుకున్న అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు వనస్థలిపురానికి చెందిన మనోహర్రెడ్డిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. -
మరియా ఫీడ్ కంపెనీకి సీల్
ధారూరు: మండల పరిధిలోని దోర్నాల్ గ్రామ సమీప 113 సర్వేనంబర్లో ఉన్న మరియా ఫీడ్ కంపెనీకి తహసీల్దార్ సాజిదాబేగం బుధవారం తాళం, సీల్ వేశారు. కంపెనీ నుంచి దుర్వాసన వస్తోందని, ఇళ్లల్లో ఉండలేకపోతున్నామని మంగళవారం రాత్రి గ్రామస్తులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆర్డీఓ వాసుచంద్ర, డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి ఆందోళనకారులను శాంతింపజేశారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారుల నివేదిక వచ్చే వరకు కంపెనీని మూసేస్తున్నామని తహసీల్దార్ తెలిపారు. అప్పటి వరకు ఫ్యాక్టరీలోకి వాహనాలు రాకుండా రోడ్డుకు అడ్డంగా ట్రెంచ్ తవ్వించామన్నారు. ఆమె వెంట డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్, ఏఎస్ఐ సంగమేశ్వర్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. విద్యుదాఘాతంతో ఆవు మృతి యాలాల: మేత మేయడానికి వెళ్లిన ఆవు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని దేవనూరులో బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కిందికేరి మాజిద్ ఎప్పటిలాగే తన ఆవును మేత కోసం గ్రామ శివారులోకి తీసుకెళ్లాడు. దేవనూరు నుంచి దుబ్బతండా వెళ్లే మార్గంలో ప్రధాన రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. రూ.50 వేల విలువ గల ఆవు మృతి చెందడంతో రైతు లబోదిబోమన్నాడు. టీటీడీ ఆలయం హుండీలో చోరీ.. పోలీసులకు ఫిర్యాదు ఫిలింనగర్: జూబ్లీహిల్స్లోని టీటీడీ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం హుండీలో నగదు దొంగలిస్తుండగా భక్తులు వారిని రెడ్హ్యాండెడ్గా పట్టుకొని ఆలయ వర్గాలకు అప్పగించారు. అయితే బాలుర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి చోరీ చేసిన నగదును తిరిగి హుండీలో వేయించి పంపించారు. అయితే కొద్ది రోజుల తర్వాత అందులో ఓ బాలుడు మళ్లీ ఆలయానికి వచ్చి అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఆలయ ఏఈఓ రమేష్ ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల 28న ఓ బాలుడు సన్నిధిలో ఉన్న హుండీలో నుంచి డబ్బులు తీస్తుండగా భక్తులు గమనించి తమకు అప్పగించారని, ఆ కొద్ది దూరంలోనే తమ విజిలెన్స్ సిబ్బంది మరో బాలుడిని పట్టుకున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. హుండీ నుంచి చోరీ చేసిన రూ.1210 స్వాధీనం చేసుకుని తిరిగి హుండీలో వేయించామని, ఆ ఇద్దరు బాలురకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇప్పించి పంపించడం జరిగిందన్నారు. ఈ నెల 9న ఇందులో ఒక బాలుడు ఆలయ ప్రాంగణంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బస్ చార్జీలను తగ్గించండి తుర్కయంజాల్: పెంచిన ఆర్టీసీ బస్ చార్జీలను వెంటనే తగ్గించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కొంతం మాధవరెడ్డి డిమాండ్ చేశారు. తుర్కయంజాల్లో బుధవారం ఆయన మాట్లాడుతూ.. పెంచిన చార్జీలతో పేద ప్రజలు, విద్యార్థులకు ఆర్థిక భారం కానుందన్నారు. చార్జీల పెంపును వెనక్కి తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఎస్.జగన్ మోహన్ రెడ్డి, టి.బాలయ్య, బీరప్ప, గంధం బాలరాజ్, నరేందర్, కాటమయ్య, రేఖ, అండాలు, సావిత్రి పాల్గొన్నారు. నేడు డయల్ యువర్ డీఎం షాద్నగర్: ఆర్టీసీ ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు గురువారం డయల్ యువర్ డీఎం నిర్వహించనున్న ట్టు షాద్నగర్ డిపో మేనేజర్ ఉష బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్య క్రమం ఉంటుందని తెలిపారు. -
దైవ దర్శనానికి వెళ్తూ మృత్యు ఒడికి
బొంరాస్పేట: ఎదురుగా వచ్చిన డీసీఎం కారును ఢీకొట్టిన సంఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మండల పరిధిలోని జాతీయ రహదారి 163పై మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ రవూఫ్ వివరాల మేరకు.. హైదరాబాద్లో వ్యాపారం చేస్తున్న బీజాపూర్ వాసి కంచి వెంకటేశ్వర్రావు(48), భార్య కళ్యాణితో కలిసి కారులో తన కారులో కర్ణాటకలోని గానుగాపూర్ దత్తత్రేస్వామి దర్శనానికి వెళ్తున్నారు. ఈక్రమంలో బీజాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న డీసీఎం భోజన్నగడ్డతండా గేటు వద్ద వీరి కారును ఢీకొంది. దీంతో కారు నడుపుతున్న వెంకటేశ్వర్రావు అక్కడికక్కడే మృతి చెందగా కళ్యాణికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను మొదట పరిగి ఆస్పత్రికి ఆతర్వాత హైదరాబాద్ తరలించారు. డీసీఎం డ్రైవర్ జానప్పపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. కారును ఢీకొట్టిన డీసీఎం వ్యక్తి మృతి, మహిళకు గాయాలు -
అనుమానాస్పద స్థితిలో బాలుడి మృతి
బషీరాబాద్: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ బాలుడు తెల్లారేసరికి రైలు పట్టాలపై శవమై కనిపించాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం సేడం రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం వెలుగు చూసింది. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, కర్ణాటక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బషీరాబాద్ మండలం మైల్వార్కు చెందిన అంజిలమ్మ, మున్నెప్ప దంపతుల కొడుకు శాంతుకుమార్ మంగళవారం రాత్రి తన స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలో పాల్గొనేందుకు కంసాన్పల్లి వెళ్లాడు. తిరిగి 10.30 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. అంతలోనే ఓ నంబర్ నుంచి అతని సెల్ఫోన్కు కాల్ వచ్చినట్లు కుటుంబీకులు గుర్తించారు. దీంతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బైక్ తీసుకుని తన అమ్మమ్మ గ్రామమైన కర్ణాటక రాష్ట్రం ముదిన కు బయలుదేరాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఉదయాన్నే సేడం రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై విగతజీవిగా పడి ఉన్నాడు. పోలీసుల సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున రోదించారు. ప్రేమ వ్యవహారమే ప్రాణం తీసిందా..? శాంతుకుమార్ ఇటీవలే పదో తరగతి పూర్తి చేశాడు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇతనికి అమ్మమ్మ గ్రామమైన ముదినకు చెందిన ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉందని తెలుస్తోంది. ఆమె ఫోన్ చేయడంతోనే మంగళవారం రాత్రి బైక్ తీసుకుని బయటకు వెళ్లినట్లు బాలుడి సన్నిహితులు తెలిపారు. అయితే ఆతర్వాత బాలుడు ఎక్కడికి వెళ్లాడు.. ఎవరితో మాట్లాడాడు..? అనేది పోలీసులు తేల్చాల్సి ఉంది. ఇదిలా ఉండగా తమ కొడుకును రైలు ఢీకొని ఉంటే తీవ్రమైన గాయాలు కావాలని, స్వల్పగాయాలతో ఎలా మరణిస్తాడని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరో హత్య చేసి పట్టాలమీద పడేశారని, బైక్ కూడా ఎత్తుకెళ్లారని సేడం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుల్బర్గా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలుడి మృతితో మైల్వార్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సేడం సమీపంలో రైలు పట్టాలపై మృతదేహం బషీరాబాద్ మండలం మైల్వార్లో విషాద ఛాయలు -
పరువు పోతుందనే హత్యకు పథకం
పరిగి: మండల పరిధిలోని రాపోల్లో మంగళవారం రాత్రి జరిగిన వృద్ధురాలి హత్య, ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై హత్యాయత్నం ఘటనకు సంబంధించిన వివరాలను పరిగి డీఎస్పీ శ్రీనివాస్ బుధవారం మీడియాకు వెల్లడించారు. గ్రామానికి చెందిన పొట్టి రాంచరణ్ ఇంటర్ ఫెయిలై జులాయిగా తిరుగుతున్నాడు. ఈక్రమంలో ఖర్చుల కోసం వరసకు బావ అయ్యే రాజేందర్ ఇంట్లో తరచూ డబ్బులు దొంగిలించేవాడు. గత మంగళవారం రాత్రి సైతం రాజేందర్(ప్రభుత్వ ఉపాధ్యాయుడు) ఇంట్లో చోరీకి వెళ్లాడు. ఇది గమనించిన అతను అరవడంతో రాంచరణ్ పారిపోయాడు. ఈ విషయాన్ని తన స్నేహితులైన చంద్రశేఖర్(బన్ని)తో పాటు మరో యువకుడికి చెప్పాడు. తాను చోరీకి వెళ్లిన విషయాన్ని ఉదయాన్నే గ్రామంలో అందరికీ చెప్పి, తన పరువు తీస్తాడని భావించి, అతన్ని చంపేద్దామన్నాడు. ఇందుకు స్నేహితులు సైతం వంతపాడారు. ఆవెంటనే రాంచరణ్ తన ఇంటికి వెళ్లి కత్తి తీసుకుని, రాజేందర్ ఇంటికి చేరుకున్నారు. అతను నిద్రలో ఉండగా కత్తి, ఇనుప రాడ్డుతో రాంచరణ్ దాడి చేశాడు. మేల్కొన్న రాజేందర్ పెద్దగా అరవడంతో పక్క గదిలో పడుకున్న అతని తల్లి నర్సమ్మ వచ్చి, అడ్డుకుంది. దీంతో ఆమెను సైతం కత్తితో పొడిచి, బండరాయితో దాడి చేయగా అక్కడికక్కడే మృతిచెందింది. ఈ అలికిడికి చుట్టు పక్కల వాళ్లు లేవడంతో పారిపోయారు. దాడికి ఉపయోగించిన కత్తి, రాయి, ఇనుప రాడ్లను బావిలో పడేసేందుకు ప్రయత్నించగా.. కత్తి ఒడ్డుపైనే పడింది. రాంచరణ్, చంద్రశేఖర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్ఐ సంతోష్కుమార్ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మృత్యువుతో పోరాటం.. దాదాపుగా 30కి పైగా కత్తి పోట్లతో తీవ్రంగా గాయపడిన రాజేందర్ గాంధీ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. కత్తితో దాడి చేసిన సమయంలో కొంత భాగం తలలో విరిగిపోయింది. ఆపరేషన్ ద్వారా కత్తి ముక్కను తొలగించినట్లు తెలిసింది. దాడిలో మృతిచెంది రాజేందర్ తల్లి నర్మమ్మ అంత్యక్రియలను బుధవారం పూర్తి చేశారు. కొడుకు లేకపోవడంతో భర్త చెన్నయ్య అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వరుసకు బావ అయ్యే వ్యక్తిపై యువకుడి హత్యాయత్నం కత్తి, ఇనుప రాడ్లతో విచక్షణా రహితంగా దాడి అడ్డు వచ్చిన బాధితుడి తల్లిని పొడవడంతో అక్కడికక్కడే మృతి రాపోల్ ఘటన వివరాలను వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్ -
రోటావేటర్లో ఇరుక్కుని బాలిక మృతి
చేవెళ్ల: రోటావేటర్ ఓ బాలిక ప్రాణం తీసింది. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చేవెళ్ల మండలం తంగడపల్లి సమీపంలోని ఫామ్హౌస్లో కర్ణాటకకు చెందిన సుశీల్కుమార్, పద్మ దంపతులు పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. పద్మ చెల్లెలు కళావతి, సంజీవ్కుమార్ కుటుంబం వికారాబాద్జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్లో ఉంటోంది. అక్కను చూసేందుకు కళావతి భర్త, పిల్లలతో కలిసి మంగళవారం తంగడపల్లిలోని తోటకు వచ్చారు. బుధవారం మధ్యాహ్నం మామిడి తోటలో సుశీల్కుమార్ ట్రాక్టర్ రోటావేటర్తో దున్నతున్నాడు. అదే సమయంలో కళావతి కూతురు అక్షిత (11) ఆడుకుంటూ వచ్చింది. ప్రమాదవశాత్తు రోటావేటర్లో ఇరుక్కొని తీవ్రంగా గాయపడింది. వెంటనే కుటుంబసభ్యులు గమనించి చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సంజీవ్కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ముగిసిన ఎల్లమ్మ జాతర
తాండూరు రూరల్: భక్తుల కొంగు బంగారంగా విశ్వసించే కోత్లాపూర్ శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర బుధవారంతో ముగిసింది. నెల రోజుల పాటు జరిగిన వేడుకలో తెలంగాణ–కర్ణాటక నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతి మంగళవారం, శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ప్రధానఘట్టం రథోత్సవం, సిడే ఉత్సవాలు గతంలోనే ముగిశాయి. ఏరువాక పౌర్ణమి సందర్భంగా భక్తులు ఆలయానికి క్యూ కట్టారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నవీన్రెడ్డి, ఈవో శేఖర్గౌడ్, మాజీ సర్పంచ్ సాయిలు, మాజీ డైరెక్టర్ గోపాల్, గ్రామస్తులు ఉన్నారు. -
విత్తనశుద్ధితో తెగుళ్లకు అడ్డుకట్ట
ధారూరు: పంటలో వచ్చే తెగుళ్ల నివారణకు విత్తనశుద్ధి చేసుకోవాలని రాజేంద్రనగర్లోని నూనె గింజల పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అలివేలు రైతులకు సూచించారు. శాస్త్రవేత్తలు డాక్టర్ ఉషాకిరణ్, డాక్టర్ శంకర్మీనా, డాక్టర్ పుష్పలతో ఆమె మండలంలోని గురుదోట్ల, అంపల్లి గ్రామాల్లో బుధవారం వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వేప గింజలతో తయారు చేేసిన పిండి, రైజోబియంను భూమిలో కలపడంతో భూసారం పెరిగి దిగుబడి బాగా వస్తుందన్నారు. శాస్త్రవేత్తలు పుష్ప, ఉషాకిరణ్, మీనలు మాట్లాడుతూ.. ఆముదం పంటపై రెండుసార్లు పాక్లోబ్లూడజోల్ మందును పంటపై పిచికారీ చేస్తే ఎత్తు తగ్గి దిగుబడి పెరిగి పంటకాలం తొందరగా వస్తుందని అన్నారు. కార్యక్రమంలో పరిశోధన సంస్థకు చెందిన ఝాన్సీ, పూజిత, తేజస్వీ తదితరులు పాల్గొన్నారు. నూనె గింజల పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త అలివేలు -
దుండగులను గుర్తించాలి
తాండూరు రూరల్: మండల పరిధిలోని ఖాంజాపూ ర్ గేటు వద్ద ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో ఆవు కళేబరాన్ని వేసిన దుండగులను గుర్తించి, కఠినంగా శిక్షించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం రూరల్ సీఐ కార్యాలయంలో పోలీసులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేశ్కుమార్ మాట్లాడుతూ.. తాండూరు పట్టణంలో అల్లర్లు సృష్టించేందుకు కొంతమంది ఉద్దేశ పూ ర్వకంగా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు ఆంజనేయులు, బంటారం భద్రేశ్వర్, కృష్ణముదిరాజ్, పట్టణ, మండలాల బాధ్యులు రజనీకాంత్, నాగారం మల్లేశం, యాలాల శివకుమార్, మఠం మల్లిఖార్జున్ తదితరులు ఉన్నారు. మూగజీవి తల కలకలం యాలాల: మండల పరిధిలోని బైపాస్ రోడ్డు సమీపంలో కనిపించిన మూగజీవి తల కలకలం రేపింది. ఈ విషయమై బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్తో పాటు పలువురు నాయకులు సోమవారం రాత్రి పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ బాలక్రిష్ణారెడ్డి, సీఐ నగేష్, ఎస్ఐ గిరి ఘటన స్థలానికి చేరుకొని తలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు యాలాల పీఎస్లో కేసు నమోదు చేశారు. తల ఆవుదా..? గేదెతా..? స్పష్టత లేదని.. పరీక్షల కోసం చెంగిచెర్లలోని సెంట్రల్ మీట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్కు పంపించామని డీఎస్పీ తెలిపారు. పశువుల వ్యర్థాలను తరలించే వాహనంలో నుంచి పడిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సీఐ కార్యాలయంలో బీజేపీ నాయకుల వినతి సీఐ కార్యాలయంలో బీజేపీ నాయకుల వినతి -
దుర్వాసన భరించలేం..
ధారూరు: దాణా ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న దుర్వాసనను భరించలేకపోతున్నామని, దీన్ని వెంటనే మూసేయాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి.. దోర్నాల్ సమీపంలోని మరియా ఫీడ్ ఫ్యాక్టరీలో అన్లోడ్ చేసేందుకు సోమవారం రాత్రి బొక్కలతో నిండిన మూడు డీసీఎంలు గ్రామానికి చేరుకున్నాయి. వీటినుంచి వస్తున్న దుర్వాసనను గమనించిన స్థానికులు వాహనాలను గ్రామంలోనే నిలిపేసి ఆందోళన చేపట్టారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందడంతో డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, ధారూరు సీఐ రఘురాం, ఎస్ఐ అనిత అక్కడికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించారు. వికారాబాద్ ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ సాజిదాబేగం మంగళవారం ఉదయాన్నే దోర్నాల్కు వెళ్లి వివరాలు సేకరించారు. కాలుష్య నియంత్రణ అధికారులకు నివేదిక ఇస్తామని తెలిపారు. డీసీఎంలలో తెచ్చిన ఎముకలను ఫ్యాక్టరీలోకి తీసుకెళ్లి జేసీబీతో గుంత తవ్వించి, అందులో పూడ్చేశారు. అనంతరం ఫ్యాక్టరీకి తాళం వేయించారు. ● స్థానికుల ఆందోళన ● బొక్కల లోడ్తో దాణా ఫ్యాక్టరీకి వచ్చిన డీసీఎంల అడ్డగింత ● రెవెన్యూ, పోలీసు అధికారుల చొరవతో ఫ్యాక్టరీకి తాళం -
భూదాన్ బోర్డు భూ సమస్యలపై అర్జీలు
ఇబ్రహీంపట్నం: భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్గౌడ్ కోరారు. ఇబ్రహీంపట్నం భాగాయత్, ఇస్మాయిల్ పంపు, తట్టిఖానా, అల్లిమియాకుంట రెవెన్యూ భూ సమస్యలపై మంగళవారం స్థానిక ఓసీ కమ్యూనిటీ హాల్లో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. సర్వే నంబర్ 58, సైదాబాద్ కంచె, భాగాయత్, తట్టిఖాన రెవెన్యూ పరిధి భూదాన భూములకు సంబంధించి అధికంగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఆ భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని పలువురు విన్నవించినట్లు పేర్కొన్నారు. భాగాయత్ పరిధి 120, తట్టిఖానా పరిధి 10, అల్లిమియా కుంట పరిధి నుంచి ఒక్క దరఖాస్తు అందిందని వివరించారు. -
కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులు
తాండూరురూరల్/బొంరాస్పేట/దౌల్తాబాద్/యాలాల/దుద్యాల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తాండూరు తహసీల్దార్ కేతావత్ తారాసింగ్ సూచించారు. మంగళవారం మండల పరిధిలోని చింతమణిపట్నం, ఖాంజాపూర్ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. భూ భారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. గ్రామాల్లో రైతులకు భూ సమస్యలు ఉంటే వెంటనే రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రెండు గ్రామాల్లో కలిపి 12 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. అలాగే బొంరాస్పేట మండల పరిధి కొత్తూరులో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు తహసీల్దార్ పద్మావతి హాజరై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. యాలాల మండలంలోని దేవనూరు, గోరేపల్లి గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు ఐదు దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ వెంకటస్వామి తెలిపారు. దుద్యాల్ మండల చిలుముల్ మైల్వార్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు 62 దరఖాస్తులు వచ్చినట్లు ఉప తహసీల్దార్ వీరేశ్ బాబు ప్రకటించారు. దౌల్తాబాద్ మండలంలోని బాలంపేట, సుల్తాన్పూర్ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు తహసీల్దారు గాయత్రి తెలిపారు. పలు గ్రామాల్లో దరఖాస్తుల వెల్లువ -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు
● జిల్లా వ్యవసాయ అధికారి మోహన్రెడ్డి నవాబుపేట: నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం నవాబుపేట మండలం పులుమామిడి గ్రామంలోని ఫెర్టిలైజర్ షాపును తనిఖీ చేశారు. విత్తనాలు, ఎరువుల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..విత్తనాలు కొనే ముందు రైతు లు జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన షాపుల్లోనే కొనుగోలు చేయాలన్నారు. అనంతరం గ్రామంలో పత్తి పంటను పరిశీలించారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి జ్యోతి, ఏఈఓలు, రైతులు ఉన్నారు. విత్తన దుకాణాల్లో తనిఖీ కొడంగల్: పట్టణంలోని ఎరువులు, విత్తనాల దుకాణాలను టాస్క్ఫోర్స్ బృందం, పోలీసులు, వ్యవసాయాధికారులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నకిలీ విత్తనాలు అమ్మినా, బిల్లులు లేకుండా ఎరువులు, విత్తనాలు విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. దుకాణదారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని సూచించా రు.ఎమ్మార్పికే విత్తనాలు విక్రయించాలన్నారు. లై సెన్సు లేకుండా ఎరువులు, విత్తనాలు అమ్మితే శా ఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కర్ణాటక నుంచి అక్రమంగా సరఫరా చేస్తున్న నాసిరకం విత్తనాలను విక్రయిచరాదన్నారు. రైతుల నుంచి ఫిర్యా దులు వస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. తనిఖీ ల్లో ఏడీఏ శంకర్ రాథోడ్, ఎస్ఐ సత్యనారాయణ, ఏఓ తులసీ, టాస్క్ఫోర్సు సిబ్బంది పాల్గొన్నారు. -
ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం
● సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్టు అప్రజాస్వామికం ● టీజేఎస్, బీఎస్పీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తాండూరు: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే ప్రజలకు దూరమైందని టీ జేఎస్, బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జ్లు ఎస్ సోమశేఖర్, దొరశెట్టి సత్యమూర్తి ఆరోపించా రు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్రా వును అరెస్టు చేయడాన్ని, ఏపీలో ‘సాక్షి’ కార్యాలయాలపై టీడీపీ మూకలు దాడి చేయడాన్ని వ్యతిరేకిస్తూ తాండూరు పట్టణం మంగళవా రం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ ఆధ్వ ర్యంలో ప్రజా సంఘాలు, టీజేఎస్, బీఎస్పీ నా యకులు,ఎన్ఎస్పీ ట్రస్ట్ ప్రతినిధులు నల్ల బ్యా డ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. ఏడాది కాలంలోనే కూటమి ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర స్థాయి లో వ్యతిరేకత మూటగట్టుకుందని తెలిపారు. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ దాడులను ప్రతి ఒక్క రూ ఖండించాలన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్పీ ట్రస్ట్ ప్రతినిధి భానుప్రసాద్,పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు పీశ్రీనివాస్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కే శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప, బీఎస్పీ నాయకులు అమ్జాద్ అలీ పాల్గొన్నారు. -
శాంతిభద్రతల రక్షణకు చర్యలు
షాద్నగర్రూరల్: శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ఏసీపీ లక్ష్మీనారాయణ అన్నారు. పట్టణంతో పాటు ఫరూఖ్నగర్లో మంగళవారం రాత్రి వాహనాల తనిఖీ చేట్టారు. కిరాణా దుకాణాలు, బెల్టుషాపులు, దాబాలు, లాడ్జీలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. నిషేధిత గుట్కాలు, అనుమతులు లేకుండా మద్యం విక్రయాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాత్రి సమయాల్లో అపరిచితులకు దూరంగా ఉండాలని, అలాంటి వారు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తనిఖీల్లో పట్టణ సీఐ విజయ్కుమార్, డీఐ వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ నర్సయ్య, కేశంపేట సీఐ నరహరి, ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐలు, ఎస్ఓటీ పోలీసులు, పాల్గొన్నారు. ఏసీపీ లక్ష్మీనారాయణ -
బాలికతో అసభ్యకర ప్రవర్తన
ఆటో డ్రైవర్పై పోక్సో కేసు తాండూరు రూరల్: బాలికతో అసభ్యక రంగా ప్రవర్తించిన ఆ టో డ్రైవర్పై పోక్సో కే సు నమోదు చేశారు. కరన్కోట్ ఎస్ఐ విఠ ల్రెడ్డి కథనం ప్రకారం.. మంగళవారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(15) తాండూరు పట్టణంలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు వచ్చింది. పరీక్ష ముగిసిన తర్వాత మధ్యాహ్నం ఇంటికి వెళ్లేందుకు పట్టణంలోని చౌరస్తా వద్ద నిలబడింది. గమనించిన బెల్కటూర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ప్రకాష్ బాలిక వద్దకు వచ్చి మీ ఊరికే వెళ్తున్నాను ఆటో ఎక్కమన్నాడు. నేను ఒక్కదాన్నే ఆటోలో రానని బాలిక చెప్పింది. మార్గమధ్యలో ప్రయాణికులు ఎక్కుతారని డ్రైవర్ నమ్మ బలికాడు. దీంతో ఆటో ఎక్కింది. చిట్టిఘనాపూర్ గేటు వద్దకు రాగానే ఆటోను పొలాల్లోకి తీసుకెళ్లాడు. అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక కేకలు వేసింది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు అక్కడికి చేరుకొని బాలికను రక్షించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆటో డ్రైవర్ ప్రకాష్ను అదుపులోకి తీసుకొని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపారు. -
పది టిప్పర్లు, జేసీబీ సీజ్
షాబాద్: ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని షాబాద్ తహసీల్దార్ ఎండీ అన్వర్ హెచ్చరించారు. మంగళవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు అలవాటు పడిన కొందరు ప్రభుత్వ భూముల్లోని మట్టిని అక్రమంగా తవ్వి, ప్రైవేట్ కంపెనీలకు తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారని తెలిపారు. సోలీపేట్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 350లో ఉన్న 120 ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని సమాచారం రావడంతో సోమవారం రాత్రి దాడులు నిర్వహించామన్నారు. పది టిప్పర్లు, ఒక జేసీబీని అదుపులోకి తీసుకున్నామని స్పష్టంచేశారు. వీటికి సంబంధించిన యజమానులు, డ్రైవర్లపై కేసులు నమోదు చేశామన్నారు. మరోమారు ఇలాంటి అక్రమాలకు పాల్పడితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని, ఈసీ వాగు నుంచి ఇసుక తరలిస్తున్న వారిపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. యజమానులు, డ్రైవర్లపై కేసులు నమోదు మరోసారి పట్టుబడితే నాన్ బెయిలబుల్ కేసులు షాబాద్ తహసీల్దార్ ఎండీ అన్వర్ -
బెడ్ పద్ధతి మేలు
మోమిన్పేట: చెరుకు సాగులో నూతన ఒరవడికి రైతులు నాంది పలుకుతున్నారు. సంప్రదాయ సాగుకు స్వస్తి పలుకుతూ తక్కువ విత్తన మోతాదుకు శ్రీకారం చుడుతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న పెట్టుబడులు, కూలీల ఖర్చులను తగ్గించుకుంటూ ఎక్కువ దిగుబడులను సాధించేందుకు కృషి చేస్తున్నారు. ఒకప్పుడు బోజ పద్ధతిలో చెరుకు సాగును చేపట్టారు. ప్రస్తుతం ఎక్కువగా బెడ్ పద్ధతిని అవలంబిస్తూ కూలీల ఖర్చును తగ్గిస్తున్నారు. పంటలో కలుపు తగ్గించేందుకు బెడ్ పద్ధతి ఎంతో ఉపయోగకరమని రైతులు పేర్కొంటున్నారు. చిన్న ట్రాక్టరుల ద్వారా బెడ్ మధ్యలో నాగలి, గుంటుక, రోటోవేటరును వేసుకొని గడ్డి జాతి మొక్కలను నివారించుకోవచ్చు. దీంతో పాటు విత్తనం ఖర్చును తగ్గించుకొనేందుకు నర్సరీలో పెంచుతున్న చెరుకు మొక్కలను వినియోగిస్తున్నారు. నర్సరీ నుంచి మొక్కలు నర్సరీలో పెంచిన ఒక్కో మొక్కకు రకాన్ని బట్టి రూ.2.50 నుంచి రూ.3.50 వరకు ఉంటుంది. బెడ్ పద్ధతిలో మొక్కలను నాటుకోవడంతో విత్తన మోతాదు తగ్గుతుంది. చెరుకు గడలోని విత్తనం వచ్చే ఒక ఇంచును కట్ చేసి నర్సరీలో సేంద్రియ ఎరువుల సహాయంతో ప్లాంటుపై పెంచుతారు. ఒక ఫీట్ పెరిగిన చెరుకు విత్తనాన్ని తీసుకువచ్చి నేరుగా పొలంలో నాటుతారు. దీంతో చాలావరకు కూలీల ఖర్చు తగ్గుతుందన్నారు. చెక్కర ఫ్యాక్టరీ యాజమాన్యం కొన్ని రకాలను హైబ్రిడ్ వంగడాలను అన్నదాతలకు ఇస్తుంది. దీన్ని తీసుకువెళ్లి నర్సరీలో పెంచుతున్నారు. ఒకప్పుడు చెరుకు గడలను రెండు ఫీట్ల పొడవుతో భూమిలో తొక్కేవారు. వీటన్నింటికి విత్తన ఖర్చు ఎక్కువ కావడం.. రైతులకు దిగుబడులు రాకపోవడంతో నష్టాలు చవి చూసేవారు. మండల పరిధిలోని ఏన్కతల గ్రామంలో హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్ అనే రైతు పొలాలను కౌలుకు తీసుకొని చెరుకు సాగును చేపట్టారు. నర్సరీలో పెంచిన విత్తనాలను పొలంలో నాటుతున్నారు. చెరుకు సాగులో నూతన ఒరవడికి శ్రీకారం తగ్గనున్న పంట పెట్టుబడులు ఆసక్తి చూపుతున్న రైతులు -
కత్తులతో పొడిచి వృద్ధురాలి హత్య
పరిగి: మద్యం, గంజాయి మత్తులో నిందితులు ఒడిగట్టిన దారుణానికి ఓ వృద్ధురాలి ప్రాణం పోయింది. ఆమె కొడుకు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని రాపోల్కు గుండు రాజేందర్(40) ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఇదే గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ అనంతయ్య కూతురు సంగీతతో పదేళ్ల క్రితం ఇతనికి వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. ఇదిలా ఉండగా కుటుంబ కలహాల నేపథ్యంలో రాజేందర్ కొన్నాళ్లుగా భార్యాపిల్లలకు దూరంగా ఉంటున్నారు. సోమవారం రాత్రి రాజేందర్ తన తల్లితో కలిసి ఇంట్లో ఉండగా.. అతని చిన్నమామ(సంగీత బాబాయి) ప్రభాకర్ వచ్చాడు. మామాఅల్లుళ్లు కలిసి మద్యం తాగుతూ కూర్చున్నారు. కొంత సమయం గడిచిన తర్వాత.. తన అన్న కూతురైన సంగీతను దూరం పెడుతూ ఆమె బతుకు నాశనం చేస్తున్నావంటూ ప్రభాకర్ అల్లుడితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ప్రభాకర్ తన అన్న కొడుకు(సంగీత తమ్ముడు)కు ఫోన్ చేసి రమ్మన్నాడు. అప్పటికే రాజేందర్పై కోపంగా ఉన్న అతను, మరికొందరు స్నేహితులతో అక్కడికి చేరుకున్నాడు. వెంట తెచ్చుకున్న కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. తీవ్ర గాయాలు రావడంతో రాజేందర్ కిందపడిపోయాడు. తన కొడుకును చంపొద్దంటూ అడ్డుకోబోయిన నర్సమ్మ(60)పై సైతం కత్తులతో దాడి చేయగా అక్కడికక్కడే మృతిచెందింది. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రాజేందర్ను స్థానికులు పరిగిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడిలో పాల్గొన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దాడికి పాల్పడిన యువకులు గ్రామానికి చెందిన వారేనని, గంజాయి మత్తులో ఈ దురాఘతానికి పాల్పడ్డారని తెలుస్తోంది. ప్రాణాపాయ స్థితిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు పరిగి మండలం రాపోల్లో ఘటన కుటుంబ కలహాలే కారణం పోలీసుల అదుపులో నలుగురు నిందితులు? -
కొమ్మినేని అరెస్టు అక్రమం
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్యాదవ్ బంట్వారం: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్రావుపై అక్ర మ కేసులు బనాయించి, అరెస్టు చేయడం హేయమైన చర్య అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అత్తెల్లి లక్ష్మణ్యాదవ్ అన్నారు. ఏపీలో సాక్షి కార్యాలయాలు, కొమ్మినేని అరెస్టును తీవ్రంగా ఖండించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కూటమి ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ఏడాది కాలంగా ఏపీలో భయానక వాతావరణం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలని చూడటం సరైనది కాదని హితవు పలికారు. కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య బొంరాస్పేట: కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ రవూఫ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి.. బొంరాస్పేటకు చెందిన భార్యాభర్తలు తొగపురం రవి(40), సునీత మధ్య ఆదివారం రాత్రి డబ్బుల విషయంలో గొడవ జరిగింది. దీంతో రవి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సోమవారం ఉద యం నుంచి బంధువులు, తెలిసిన వారి వద్ద వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం పొలానికి వెళ్తున్న స్థానికుల కు.. గ్రామ శివారులోని ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. దీంతో వారు కుటుంబ సభ్యుల కు సమాచారం అందించారు. అందరూ వచ్చి పరిశీలించగా రవి అప్పటికే చనిపోయాడు. మృతుడి సోదరుడు శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. దరఖాస్తు చేసుకోండి అనంతగిరి: తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలలు(హకీంపేట్, కరీంనగర్, అదిలాబాద్) 2025–26 సంవత్సరానికి గాను నాలుగో తరగతి ప్రవేశానికి అర్హులైన విద్యార్థిని విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడల శాఖ అధికారి ఎంఏ సత్తార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను టీజీఎస్ఎస్. తెలంగాణ. జీఓవీ.ఇన్ లో తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఓయూ ఎంట్రెన్స్ టెస్ట్లో సత్తాచాటిన విద్యార్థులు అనంతగిరి: ఓయూ పీహెచ్డీ ఎంట్రెన్స్ టెస్ట్ గణితశాస్త్రం విభాగంలో వికారాబాద్కు చెందిన విద్యార్థులు ఉత్తమ ర్యాంకు సాధించి సత్తా చాటారు. మున్సిపల్ పరిధిలోని రామయ్యగూడకు చెందిన కె.రేఖ 8వ ర్యాంక్, మర్పల్లి మండలానికి చెందిన శ్రావణ్కుమార్ 16వ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంచి ర్యాంకులు రావడం సంతోషంగా ఉందన్నారు. ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం శంకర్పల్లి: ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడి, చేసిన అప్పులు తీర్చలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం శంకర్పల్లి పట్టణంలో చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లికి చెందిన బండి రామమైసూర్రెడ్డి(44), చిన్న వ్యాపారం చేస్తూ.. జీవనోపాధి పొందేవాడు. ఈ క్రమంలో వ్యాపారం సాగక.. ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడ్డాడు. అక్కడా నష్టం రావడంతో అప్పులు చేశాడు. అవి తీర్చేమార్గం కానరాక సతమతమయ్యాడు. దీంతో సోమవారం ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. ఎంత కీ రాకపోవడంతో.. కుటుంబ సభ్యులు మంగళవారం కూకట్పల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యా దు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు, సదరు వ్యక్తి లోకేషన్ చూడగా.. శంకర్పల్లిలోని ఓ లాడ్జి చూపించింది. అక్కడికి వెళ్లి లాడ్జిలోని గదులను పరిశీలించగా.. ఓ గదిలో ఉరివేసుకొని విగతజీవిగా కనిపించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
విధులపై అవగాహన పెంచుకోవాలి
అనంతగిరి: కొత్తగా ఉద్యోగాల్లో చేరిన హాస్టల్ వార్డెన్లు వీలైనంత త్వరగా విధులపై అవగాహన పెంచుకోవాలని అదనపు కలెక్టర్ సుధీర్ అన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నూతనంగా ఎంపికై న ఎనిమిది మంది వసతి గృహ అధికారులకు మంగళవారం వికారాబాద్ కలెక్టరేట్లోని తన చాంబర్లో విధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హాస్టల్ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దే దిశగా పనిచేయాలని సూచించారు. పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. మెనూ అమలు, ఆహార పదార్థాల నిల్వలు తదితర విషయాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. విద్యాశాఖతో అనుసరించాల్సిన విషయాలను డీఈఓ నుంచి అడిగి తెలుసుకోవాని సూచించారు. నిధుల వినియోగం, రికార్డుల నిర్వహణపై ట్రెజరీ అధికారుల సూచనల ను పరిగణలోకి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీటీడీఓ కమలాకర్ రెడ్డి, డీబీసీడీఓ ఉపేందర్, డీఈఓ రేణుకాదేవి, డీఎంహెచ్ఓ వెంకటరవణ, డీటీఓ జార్సన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ● అదనపు కలెక్టర్ సుధీర్ -
భూ భారతితో సత్వర పరిష్కారం
కలెక్టర్ ప్రతీక్జైన్ కొడంగల్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూ భారతి చట్టంతో భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. మంగళవారం మండలంలోని రావులపల్లిలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల నుంచి భూ సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వాటిని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారా, వివరాల నమోదులో ఎలాంటి తప్పులకు తావులేకుండా చూడాలన్నారు. సమస్యల వారీగా దరఖాస్తులను విభజిస్తూ, పక్కాగా రికార్డులను పొందుపరచాలని సూచించారు. ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తునూ స్వీకరించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ బి.విజయకుమార్, డిప్యూటీ తహసీల్దార్ అనిత, ఆర్ఐ రాఘవేందర్, రెవెన్యూ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. అరెస్టు అన్యాయం కొడంగల్ రూరల్: తాండూరు మండలం బెల్కటూర్ గ్రామంలో దళితులపై దాడిచేసిన వారిని అరెస్టు చేయాలని తాండూరు డీఎస్పీ కార్యాలయం ముందు శాంతియుత ధర్నా చేస్తుంటే పోలీసులు అరెస్టు చేయడం అన్యాయమని ప్రజా సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బెల్కటూర్లో దళిత యువకుడి పెళ్లి వేడుకను అడ్డుకొని కులం పేరుతో దూషించి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అగ్రకుల పెత్తందారులకు కొమ్ముకాస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు బుస్స చంద్రయ్య, యూ.రమేష్బాబు, జగన్, గోవిందు, కనకప్ప, నరేష్ తదితరులు పాల్గొన్నారు. 18లోపు దరఖాస్తు చేసుకోండి అనంతగిరి: అర్హులైన దివ్యాంగులు సహాయ ఉపకరణాల కోసం ఈ నెల 18లోగా దరఖా స్తు చేసుకోవాలని జి ల్లా సంక్షేమ శాఖ అధి కారి పి.జయసుధ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సహకార సంస్థ ద్వారా 2024– 25 ఆర్థిక సంవత్సరానికి గాను పరి కరాలు, లర్నింగ్ మెటీరియల్ తదితర వాటిని ఉచితంగా పంపిణీ చేస్తుందని తెలిపారు. శారీ రక దివ్యాంగులు, అంధులకు, బదిరులకు, మానసిక దివ్యాంగు లకు అవసరమగు పరికరాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు నిర్ణయించిందన్నారు. అన్ని ధ్రువ పత్రాలతో ఈ నెల 18లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వచ్చిన దరఖాస్తులను జిల్లా ఎంపిక కమిటీ పరిశీలించి నియమ నిబంధనల మేరకు అర్హత గల దివ్యాంగులను ఎంపిక చేస్తారన్నా రు. పూర్తి వివరాలకు జిల్లా సంక్షేమ శాఖాధికా రి కార్యాలయం సెల్ నంబర్ 81794 32874 లో సంప్రదించాలని ఆమె సూచించారు. కేటీఆర్ను కలిసిన శుభప్రద్పటేల్ అనంతగిరి: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా రాజకీయాలపై చర్చించినట్లు తెలిసింది. -
ప్లాస్టిక్ రహిత సమాజానికి కృషి చేద్దాం
● ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి ● పురపాలక పరిపాలన కమిషనర్ డైరెక్టర్ టీకే శ్రీదేవి కొడంగల్: ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పురపాలక పరిపాలన కమిషనర్, డైరెక్టర్ డాక్టర్ టీకే శ్రీదేవి అన్నారు. కొడంగల్ మున్సిపాలిటీలో మంగళవారం ఆమె పర్యటించారు. పట్టణంలో చేపట్టిన వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వివిధ అభివృద్ధి పనులు, తడి పొడి చెత్త విభజనపై అవగాహన, ఆరోగ్య శిబిరాల నిర్వహణ, మురుగు కాల్వల్లో పూడికతీత పనులను కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి పరిశీలించారు. అనంతంర కడా కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణం దెబ్బతింటోందన్నారు. మహిళా సంఘాల సభ్యులతో టెంట్ హౌస్లను ఏర్పాటు చేయించి ప్లాస్టిక్కు సంబంధించిన సామగ్రి సరఫరా లేకుండా శుభ కార్యక్రమాలు జరిగే విధంగా అవగాహన కల్పించాలన్నారు. పర్యావరణాన్ని కాపాడడానికి ప్రజల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని సూ చించారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా వాడా ల్సిన వస్తువులపై ప్రజలకు తెలియచేయాలని ఆదేశించారు. మురుగు కాలువల్లో ఎప్పటికప్పుడు పూడిక తీసి శుభ్రంగా ఉంచాలన్నారు. దోమల బెడద నివారించేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలన్నారు. కొడంగల్ను సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. పనుల్లో వేగం పెంచాలని సూచించారు. పట్టణంలోని శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఇంజనీరింగ్ విభా గం అధికారులు నిర్లక్ష్యంగా ఉండకుండా క్షేత్ర స్థా యిలో పర్యవేక్షిస్తూ పనులు వేగవంతంగా పూర్తి చే యాలన్నారు.అంతకుముందు మున్సిపల్ పరిధిలో జిల్లా అధికారులతో కలిసి మొక్కలు నాటారు.పట్టణంలోని పార్కులను, నీటి సరఫరా ట్యాంకులను పరిశీలించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సుధీ ర్, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, జాయింట్ డైరెక్టర్ పల్గున్ కుమార్, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ బలపడేలా..
‘అమ్మ మాట.. అంగన్వాడీ బాట’తో ప్రజల్లోకి.. ● చిన్నారుల సంఖ్య పెంపే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళిక ● వారం రోజులపాటు కార్యక్రమాలు ● నేటి నుంచి శ్రీకారం నవాబుపేట: అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. అమ్మ మాట.. అంగన్వాడీ బాట పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమైంది.. విద్యార్థుల సంఖ్య పెంపే లక్ష్యంగా ముందుకు సాగనుంది. ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. బడిబాట తరహాలోనే అంగన్వాడీ టీచర్లు గ్రామాల్లో పర్యటించి కేంద్రాల్లో అందే సేవలపై చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు. తద్వారా పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు వారిని ఒప్పిస్తారు. అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు. కేంద్రాల్లో పిల్లలకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, తీసుకుంటున్న శ్రద్ధ, పౌష్టికాహారం తదితర వటి గురించి వివరిస్తారని పేర్కొన్నారు. వికారాబాద్ ప్రాజెక్టు పరిధిలో.. ఐసీడీఎస్ వికారాబాద్ ప్రాజెక్టు పరిధిలోని వికారాబాద్, ధారూరు, పూడూరు, నవాబుపేట మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 233 అంగన్వాడీ కేంద్రాలు.. 2వేల మందికి పైగా చిన్నారులు ఉంటారు. ఈ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను అమలు చేస్తారు. ప్రస్తుత సంవత్సరంలో పిల్లల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా సిబ్బంది ముందుకు సాగనున్నారు. రోజువారీ కార్యక్రమాలు.. ● ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ● 11న గ్రామంలోని ఉపాధ్యాయులు, ఎన్జీవో సంఘాలు, తల్లిదండ్రులు, పోషక అభియాన్ సిబ్బందితో ర్యాలీలు నిర్వహించాలి. గ్రామస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలి. బెల్ కొట్టాలి, పిల్లలకు ఎగ్ బిర్యానీ, స్వీట్లు ఇవ్వాలి. ● 12న గ్రామాల్లోని మూడేళ్ల లోపు పిల్లలను గుర్తించాలి. వారందరినీ అంగన్వాడీ కేంద్రా ల్లో చేర్పించేలా తల్లిదండ్రులను ఒప్పించాలి. ప్రభుత్వం పిల్లలకు అందిస్తున్న సేవలను వివరించాలి. కేంద్రాల్లో విద్యార్థులను నమోదు చేయాలి. గత సంవత్సరం చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేయాలి. ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. ● 14న స్వచ్ఛ అంగన్వాడీ పేరుతో కేంద్రాలను శుభ్రం చేయాలి. అవకాశం ఉన్నచోట మొక్కలు నాటాలి. తాగునీటి సదుపాయం, మరుగుదొడ్లను ఉపయోగంలోకి తేవాలి.కేంద్రాలు విద్యార్థులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలి. ● 16, 17 తేదీల్లో కేంద్రాల్లో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించాలి. పిల్లలకు పాఠాలు, టైం టేబుల్, సాంస్కృతిక కార్యక్రమాలపై అవగాహన కల్పించాలి. స్టడీ మెటీరియల్ పంపిణీ చేయాలి. సద్వినియోగం చేసుకోవాలి అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అమ్మ మాట.. అంగన్వాడీ బాట పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రభుత్వం పిల్లలకు అందిస్తున్న సేవలను, సౌకర్యాలను వివరిస్తాం. తద్వారా విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తాం. ఇందుకు గ్రామస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, ఎన్జీవోలు, యువజన సంఘాల నాయకులు సహకరించాలి. – వెంకటేశ్వరమ్మ, ఐసీడీఎస్ సీడీపీఓ, వికారాబాద్ -
ఊరిలోనే విత్తనోత్పత్తి
కొడంగల్ రూరల్: సాగుకు అత్యంత కీలకమైన నాణ్యమైన విత్తనం కోసం రైతులు ప్రైవేటు కంపెనీలపై ఆధారపడకుండా ఉండేందుకు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఏటా విత్తన ధరలు పెరుగుతుండడంతో రైతులపై ఆర్థిక భారం పడుతోంది. మరోవైపు నకిలీ విత్తనాల బెడదతో దిగుబడి రాక ఏటా వేలాది మంది రైతులు నష్టపోతున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘నాణ్యమైన విత్తనం–రైతు నేస్తం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని కడా కార్యాలయ ఆవరణలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఎనుముల తిరుపతిరెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ పలువురు రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించారు. రాష్ట్రంలోని ప్రతీ రెవెన్యూ గ్రామంలో ముగ్గురు రైతులు చొప్పున ఎంపిక చేసి విత్తనాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ వానాకాలం సీజన్లో వారు విత్తనోత్పత్తి చేసి వచ్చే సీజన్లో ఇతర రైతులకు అందించేందుకు కృషిచేయనున్నట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. రైతులు విత్తనాల కోసం ప్రైవేటు కంపెనీలపై ఆధారపడుతుండడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రైవేటు కంపెనీల విత్తనాలను విత్తుకోవడంతో ఆశించిన దిగుబడి రావడంలేదని, దిగుబడి రాని సమయంలో ప్రైవేటు కంపెనీలు పరిహారం ఇవ్వకపోవడంతో నష్ట పోయే అవకాశాలున్నాయి. ప్రైవేటు కంపెనీలపై ఆధారపడకుండా రైతులు సొంతంగా విత్తనోత్పత్తి చేసుకోవడమే ఉత్తమ మార్గమని ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసిందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది గ్రామాల్లో కొందరు రైతులను ఎంపికచేసి విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు, వీరికి వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సలహాలు సూచనలు అందించనున్నారు. 216 మంది రైతుల ఎంపిక నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 216 మంది రైతులను ఎంపిక చేశారు. వరి పది కిలోల విత్తన రకం ఆర్ఎన్ఆర్ 1508, కంది రకం ఆశ ఐసీపీఎల్ నాలుగు కిలోల ప్యాకెట్, పాలెం పచ్చజొన్న నాలుగు కిలోల ప్యాకెట్ విత్తనాల కిట్లను ఎంపిక చేసి రైతులను అందజేస్తామని వ్యవసాయాధికారులు తెలిపారు. సాగుకు శాస్త్రవేత్తల సహకారం విత్తన కొరత నివారించేందుకు ‘నాణ్యమైన విత్తనం–రైతు నేస్తం’ గ్రామాల వారీగా రైతుల ఎంపిక మండలాల వారీగా రైతుల వివరాలు మండలం రైతులు కొడంగల్ 54 బొంరాస్పేట 51 దౌల్తాబాద్ 75 దుద్యాల్ 36 గ్రామానికి ముగ్గురు.. రాష్ట్రంలో రైతులకు విత్తన కొరతను నివారించడానికి ప్రొఫెసర్ జయశంక ర్ విశ్వవిద్యాలయం, వ్యవసాయశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శాస్త్రవేత్తల సమక్షంలో పండించిన విత్తనాలను సేకరిస్తూ ప్రతీ రెవెన్యూ గ్రామంలో ముగ్గురు రైతులను ఎంపిక చేస్తూ విత్తనాలు అందించేందుకు ఏర్పాటు చేశాం. – శంకర్ రాథోడ్, ఏడీఏ, కొడంగల్ -
ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండా
మీర్పేట: ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా సీపీఐ పని చేస్తుందని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. లెనిన్నగర్లో ఆదివారం నిర్వహించిన పార్టీ 6వ మహాసభకు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందోజు రవీంద్రాచారితో కలిసి జంగయ్య హాజరయ్యారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడుతూ.. సమాజంలో తీవ్ర అసమానతలు పెరిగిపోతున్నాయని, అసమానతలు లేని సమాజం కష్టజీవుల శ్రామికుల సమాజం ఎర్రజెండా ద్వారానే సాధ్యమని అన్నారు. దోపిడీ లేని సమసమాజ స్థాపన కోసం అలుపెరుగని పోరాటాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మావోయిస్టులను వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. అనంతరం సీపీఐ బాలాపూర్ మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా ముకుందంగారి చంద్రశేఖర్రెడ్డి, సహాయ కార్యదర్శిగా జటోత్ రెడ్యానాయక్, కౌన్సిల్ సభ్యులుగా పిచ్చిరాజు, డేరంగుల శంకరయ్య, జాజుల అంజయ్య, శివ, బండ యాదమ్మ, రమాపాండునాయక్, ఛత్రునాయక్, వీరాస్వామి, కౌసల్య, దేవయ్య, రమేష్, మిరియాల లక్ష్మమ్మ, పద్మ ఎన్నికయ్యారు. సందడిగా బోనాల ఊరేగింపుసీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య -
మంత్రి వర్గంలో బీసీలకు పెద్దపీట
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వర్గంలో బీసీలకు పెద్ద పీట వేసిందని తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజ్గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ యెలికట్టే విజయకుమార్గౌడ్ అన్నారు. 2వ విడత మంత్రి వర్గ విస్తరణలో బీసీ వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి స్థానంకల్పించడం అభినందనీయమన్నారు. ఆదివారం వాకిటి శ్రీహరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ బీసీలకు తగిన ప్రాధాన్యం కల్పించినందుకు పార్టీ అధినేత రాహుల్ గాంధీ, జాతీయ అధ్యక్షులు మలిఖార్జున్ ఖర్గే, సీఎం రేవంత్రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్ కొత్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు రెవెన్యూ సదస్సులు
అనంతగిరి: వికారాబాద్ మండల పరిధిలోని మద్గుల్ చిట్టంపల్లి, గొట్టిముక్కుల గ్రామాల్లో సోమవారం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ లక్ష్మీనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భూ సమస్యలు ఉన్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉద్దండపూర్, చెన్గేస్పూర్ గ్రామాల్లో.. తాండూరు రూరల్: మండల పరిధిలోని ఉద్దండపూర్, చెన్గేస్పూర్ గ్రామాల్లో సోమవారం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ తారాసింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భూ భారతి చట్టంపై ప్రజలకు అవగహనక కల్పిస్తామన్నారు. భూ సమస్యలు ఉన్న రైతులు రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి కొడంగల్ రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి కలిసికట్టుగా కృషి చేయాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి సూచించారు. ఆదివారం బీఆర్ఎస్ నాయకురాలు కుర్వ నర్మదాకిష్టప్ప నగరంలోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నరేందర్రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారని చెప్పారు. -
నేటి నుంచి కొత్త ఆస్పత్రిలో వైద్య సేవలు
అనంతగిరి: వికారాబాద్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సోమవారం నుంచి కేవలం మాత, శిశు సేవలు మాత్రమే అందుతాయని.. మిగిలిన ఓపీ, ఐపీ సేవలు రాజీవ్నగర్ కాలనీ ఎదుట నిర్మించిన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అందుబాటులో ఉంటాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంచంద్రయ్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వికారాబాద్ పరిసర మండలాల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అన్ని వసతులతో మెరుగైన సేవలు అందుబాటులో ఉన్నాయని.. నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని చెప్పారు. కుల వివక్షను సహించేది లేదు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ బషీరాబాద్: కుల వివక్షను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. కులవివక్ష రూపుమాపే వరకు పోరాడుతామన్నారు. మండల పరిధిలోని బెల్కటూర్లో దళిత యువకుడు వినయ్కుమార్ వివాహం సందర్భంగా మే 18న పెళ్లి ఊరేగింపులో అదే గ్రామానికి చెందిన అగ్రవర్ణ యువకులు అడ్డుకుని దూషించారని ఆరోపించారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా నేటికీ చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు. దళితులను అవమాన పరిచిన వారి అరెస్టు కోసం తాండూరులో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ధర్నా చేపడతామని ప్రకటించారు. దళితులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. 11న ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ఏఎంసీ చైర్మన్ మాధవరెడ్డి బషీరాబాద్: ప్రజా ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తోందని బషీరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి అన్నారు. మండల పరిధిలోని 755 మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పైలెట్ పంచాయతీ కాశీంపూర్కు 193 ఇళ్లు మంజూరవగా ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. మిగిలిన గ్రామాల నుంచి లబ్ధిదారులకు మంజూరైన పేదలకు ఈ నెల 11న బుధవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ప్రొసీడింగ్స్ అందజేస్తారని చెప్పారు. మరకత శివాలయం సందర్శన శంకర్పల్లి: మండల పరిధిలోని చెందిప్ప గ్రామంలో వెలసిన 11వ శతాబ్దపు మరకత శివాలయాన్ని ఆదివారం జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ రాధా సతీష్ దంపతులు దర్శించుకున్నారు. స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు జాయింట్ కమిషనర్కి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మరకత శివాలయాన్ని దర్శించుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. గతంలో శంకర్పల్లి మండలంలో నాలుగేళ్లు పని చేశానని అప్పుడు సైతం దర్శించుకున్నట్లు గుర్తు చేసుకున్నారు. నేటి నుంచి ప్రత్యేక లోక్ అదాలత్ చేవెళ్ల: ఈనెల 14వ తేదీ వరకు పాటు చేవెళ్ల కోర్టు ఆవరణలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ వెంకటేశం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చేవెళ్ల ట్రాఫిక్ ఠాణా పరిధిలోని చేవెళ్ల, శంకర్పల్లి, మోకిల, షాబాద్ పోలీస్స్టేషన్లలో నమోదైన కేసులు ఏమైనా పెండింగ్లో ఉంటే పరిష్కరించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. -
మోదీ పాలనలోనే దేశం పురోగతి
తాండూరు టౌన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ తిరుగులేని పాలన అందిస్తున్నారని పలువురు బీజేపీ నాయకులు కొనియాడారు. మోదీ ప్రధానిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం తాండూరులో పార్టీ నాయకులు కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. సుమారు ఆరు దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ చేయలేని అభివృద్ధి పనులను ప్రధానిగా మోదీ కేవలం దశాబ్దంలో పూర్తి చేసిందన్నారు. 370 ఆర్టికల్ రద్దు, రామ్మందిర నిర్మాణం, సీఏఏ, ట్రిపుల్ తలాక్, వక్ఫ్బోర్డు చట్టం, గరీబ్ కల్యాణ్ యోజన, ఆయుష్మాన్ భారత్, ఆర్థిక రంగంలో ప్రపంచంలోనే దేశాన్ని నాలుగో స్థానంలో నిలపడం, మావోయిస్టులు, ఇతర ఉగ్రవాదుల ఏరివేత, క్రీడా, వ్యవసాయ, దేశ రక్షణ రంగం వంటి వాటిలో ఎంతో పురోగతి చెందిందన్నారు. మేకిన్ ఇండియా నినాదంతో దేశ ప్రగతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘనత మోదీకే దక్కిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేశ్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణముదిరాజ్, పట్టణాధ్యక్షుడు నాగారం మల్లేశం, ఉపాధ్యక్షుడు దోమ కృష్ణ, ధార్మిక సెల్ జిల్లా నాయకుడు మోహన్ రెడ్డి, నాయకులు రాజు, శృతి, శ్రీనివాస్, షాబుద్దీన్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని పాలనలో దేశానికి 4వ స్థానం మర్పల్లి: ప్రధాన మోదీ పాలనలో దేశం ప్రపంచంలో నాలుగో స్థానంలో నిలిచిందని బీజేపీ మండల అధ్యక్షుడు పట్లోళ్ల రామేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడారు. ఈ నెల 8వ తేదీతో మోదీ 11 ఏళ్ల పాలన పూర్తయిందన్నారు. ఉగ్రవాదం, మావోయిస్టుల ఏరివేతతో ముందుకు సాగుతోందన్నారు. దేశ పురోగతి సాధిస్తున్న సందర్భంలో దేశం నలుమూలల కార్యశాల కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమం మండల ఇన్చార్జి జిల్లా కార్యదర్శి బద్రేశ్వర్, సీనియర్ నాయకులు జిల్లా కార్యదర్శి మల్లేశ్ యాదవ్, మండల నాయకులు శ్రీమంత్కుమార్, నాగన్న, శ్రీధర్రెడ్డి, మధూకర్, గణేశ్, ఆనందం, అమర్నాథ్, గోపాల్, శ్రీకాంత్, రవీందర్, బద్రన్న తదితరులు ఉన్నారు. 11 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో మైలు రాళ్లు కార్యశాలలో బీజేపీ నాయకుల వెల్లడి -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
కడ్తాల్: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు క్రియాశీలకంగా పనిచేయాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్రెడ్డి పిలుపునిచ్చారు. మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవతను ఆదివారం పార్టీ నాయకులతో కలిసి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నాయకులతో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలతో ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. కష్టపడే కార్యకర్తలు, నాయకులను పార్టీ తప్పకుండా గుర్తిస్తుందనిన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగ లక్ష్మీకాంత్రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షుడు ధళపతిగౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోసురవి తదితరులు పాల్గొన్నారు. -
మొండి చేయి!
మంత్రివర్గ విస్తరణలో జిల్లా నేతలకు దక్కని అమాత్య యోగం రేసులో టీఆర్ఆర్ రెండు దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకున్న పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. తదనంతర పరిణామాల్లో పలువురు నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీ మారినప్పటికీ ఆయన పార్టీ జెండాను విడువలేదు. కాంగ్రెస్ గడ్డు పరిస్థితుల్లో ఉండగా బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా పార్టీని వీడలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 20 వేల పైచిలుకు మెజార్టీ సాధించారు. జిల్లా ఏర్పాటు తర్వాత ఆయన డీసీసీ అధ్యక్షుడిగా పార్టీ సేవలందిస్తూ వస్తున్నారు. పార్టీ ఏ పిలుపునిచ్చినా విజయవంతం చేస్తూ విధేయుడిగా ఉంటాడనే పేరుంది. పార్టీ పెద్దలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలతో పరిచయాలున్న నేపథ్యంలో మంత్రి పదవిని ఆశిస్తూ వచ్చారు. అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మరోసారి జరిగే విస్తరణ వరకు వేచి ఉంటానని పేర్కొంటున్నారు. మాజీ మంత్రి, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మంత్రి వర్గంలో చోటు కోసం యత్నిస్తూ వచ్చినా చివరకు నిరాశే ఎదురైంది. వికారాబాద్: మంత్రివర్గ విస్తరణలో జిల్లా నేతలకు నిరాశే ఎదురైంది. ఆది నుంచీ జిల్లాలో ముగ్గురు నేతలు మంత్రి పదవిని ఆశించగా మొదటి కూర్పులో అవకాశం దక్కలేదు. రెండో విస్తరణలోనైనా చాన్స్ దక్కుతుందని భావించినా మొండిచేయి మిగిలింది. సామాజిక సమీకరణలను స్వాగతిస్తున్నామంటూనే తాము సైతం రేసులో ఉన్నామని జిల్లా నేతలు ప్రకటనలు చేస్తూ వచ్చారు. మున్ముందు విస్తరణలో తమకు బెర్త్ ఖరారు అంటూ పేర్కొంటున్నారు. ప్రస్తుతం శాసనసభ స్పీకర్గా కొనసాగుతున్న గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రి పదవి ఆశిస్తున్నవారిలో ముందున్నారు. పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి, మాజీ మంత్రి, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి ముందునుంచీ రేసులో ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరికీ చోటు దక్కకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. గతంలో జిల్లా నుంచి ఇద్దరు మంత్రి పదవులు చేపట్టినా అభివృద్ధికి నోచుకోలేదు. జిల్లా నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా ఉండగా మరో మంత్రి పదవి ఎందుకనే వాదన ఉండగా.. మర్రిచెన్నారెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే మరో ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చారంటూ ఆశావహులు పేర్కొంటున్నారు. మంత్రి పదవిపైనే మమకారం గతంలో కిరణ్కుమార్రెడ్డి మంత్రి వర్గంలో జౌళిశాఖ మంత్రిగా పనిచేసిన స్పీకర్ ప్రసాద్కుమార్ మొదటి విడతలోనే మంత్రి పదవిని ఆశించి చివరి వరకు పోరాడారు. ఎన్నికల ప్రచారంలోనూ రేవంత్రెడ్డి ప్రసాద్ కుమార్కు మంత్రి పదవి ఖాయమని హామీ ఇచ్చారు. కాగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాజిక సమీకరణాల్లో ఆయనకు స్పీకర్ పదవిని కట్టబెట్టారు. రెండో దఫా విస్తరణలో మంత్రి పదవి ఇవ్వాలని ప్రభుత్వ, పార్టీ పెద్దలను కోరారు. తన బావమరిదికి వివేక్కు స్పీకర్ పదవి కట్టబెట్టి తనకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని చివరి వరకు ప్రయత్నించారు. ఆదివారం మంత్రి వర్గవిస్తరణలో ఆయన పేరు లేకపోవడంతో ఒకింత నిరాశకు గురయ్యారని సన్నిహితులు పేర్కొంటున్నారు. గడ్డం ప్రసాద్కుమార్పట్నం మహేందర్రెడ్డిఆది నుంచీ ఆశలు పెట్టుకున్నస్పీకర్, డీసీసీ అధ్యక్షుడు, మండలి విప్ రెండో విడతలోనూ తప్పని నిరాశ మలి విడత కోసం ఎదురుచూపులు -
మొక్కజొన్న సాగుకు అనువైన సమయమిదే
నవాబుపేట: మొక్కజొన్న సాగుకు అనువైన సమయమిదేనని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. చాలా మంది రైతులు ప్రస్తుతం ఈ పంట సాగులో బిజీగా ఉన్నారు. సరైన యాజమాన్య పద్ధతులు అవలంబిస్తే మంచి లాభాలు పొందవచ్చని మండల వ్యవసాయాధికారి జ్యోతి సూచిస్తున్నారు. నవాబుపేట మండలంలో ఈ ఖరీప్లో 27,234 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, కంది, కూరగాయలు తదితర పంటలు సాగుకానున్నాయి. అందులో మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరగనుందని అధికారులు తెలుపుతున్నారు. గతేడాది మండలంలో 744 ఎకరాల్లో సాగయింది. ఈసారి మాత్రం 2317 ఎకరాలకు పెరగనుందని అంచనా. మొక్కజొన్న సాగులో పాటించాల్సిన పద్ధతులు, జాగ్రత్తలపై అధికారులు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. నేలలు సారవంతమైన నీరు ఇంకే నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, ఒండ్రు కలిగిన ఇసుక నేలలు మొక్కజొన్న సాగుకు అనుకూలమైనవి. చౌడు భూములు, నీరు నిల్వ ఉండేవి ఈ పంటకు అనుకూలించవు. విత్తుటకు ముందు మూడు–నాలుగు సార్లు నాగలితో దుక్కి దున్నాలి. ఎకరాకు దాదాపు 10 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. విత్తేకాలం సాధారణ పరిస్థితుల్లో వర్షాదారపు పంటను జూన్ 15 నుంచి జులై 15 వరకు విత్తుకోవచ్చు. రబీలో అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 లోగా విత్తితే ఎక్కువ దిగుబడులు పొందడానికి అవకాశం ఉంది. మొదలు నాగలితో బోదెలు చేసుకోవాలి. తర్వాత విత్తనాన్ని బోదెకు పైనుంచి 1/3 వంతు ఎత్తులో విత్తితే నీటి పారుదల సులభంగా ఉండడమే కాకుండా వర్షాపాతం ఎక్కువైనప్పుడు నీరు బయటకు పోవడానికి వీలుంటుంది. కలుపు యాజమాన్యం పంట విత్తిన తర్వాత రెండు, మూడు రోజులలోపు అట్రజిస్ అనే కలుపు మందును తేలిక నేలల్లో ఎకరాకు 800 గ్రాములు పిచికారీ చేయాలి. బరువు నేలలో అయితే ఎకరాకు 1200 గ్రాములను 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయడం వల్ల కొన్ని గడ్డిజాతి కలుపు మొక్కలను ఒక నెల వరకు అదుపు చేయవచ్చు. విత్తిన నెల రోజులకు వెడల్పాటి కలుపు మొక్కలు గమనిస్తే 2, 4–డి సోడియం సాల్ట్ ఎకరాకు 500 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇలా చేస్తే పంట దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉంది. నీటి తడులు మొక్కజొన్న పూతకు ముందు, పూత దశలో, గింజ పాలు పోసుకునే దశలో బాగా నీరు పెట్టడం అవసరం. 30–40 రోజులలోపు ఉన్న లేత పైరుకు అధిక నీరు హానికరం. విత్తిన తర్వాత చేనులో నీరు నిలిస్తే విత్తనం మొలకెత్తదు. సాధారణంగా పంట కాలంలో 6–8 నీటి తడులు అవసరం. విత్తనాలు వేసినప్పుడు, విత్తిన 15 రోజులకు, తదితర దశల్లో నీటి తడులను తప్పకుండా ఇచ్చేలా జాగ్రత్త పడాలి. దీర్ఘకాలిక వంగడాలను 1–2 తడులు అధికంగా అవసరమవుతాయి. కాండం తొలుచు పురుగులు ఇవి రెండు రకాలు. మచ్చల, చారల కాండం తొలిచే పురుగు ఎక్కువగా ఖరీప్ పైరును ఆశిస్తుంది. గులాబీ రంగు కాండం తొలుచు పురుగు ఎక్కువగా రబీలో ప్రభావం చూపుతుంది. ఇవి పైరు మొలకెత్తిన 10–20 రోజులకు సోకుతాయి. పిల్ల పురుగులు మొదట ఆకులపైన పత్ర హరితాన్ని గోకి తింటాయి. తర్వాత గుండు సూది మాదిరి రంధ్రాలు, పొడవాటి చిల్లులు వరుస క్రమంలో కలిపిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వల్ల పువ్వు చనిపోయి ఎండిపోతుంది. దీనినే డెడ్హార్ట్ అంటారు. కాండం లోపల గుండ్రని లేదా ఎస్ ఆకారంలో సొరంగాలను ఏర్పరుస్తుంది. ఇవి పూతను, కంకిణి ఆశించడంతో దిగుబడి తగ్గతుంది. రసం పీల్చు పురుగులు 30 రోజులు పైబడిన పైరును పేనుబంక, చిగురు నల్లి ఆశించవచ్చు. పొడి వాతావరణంలో వీటి ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది. లేత కాండం నుంచి రసాన్ని పీల్చడంతో ఆకులు పసుపు రంగుకు మారిపోతాయి. మొక్క గిడసబారిపోతుంది. ఇవి విసర్జించే జిగునరు పదార్థానికి చీమలు చేరడమే కాకుండా శిలీంధ్రాలు ఏర్పడి మసి తెగులు ఆశించడం వల్ల కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం ఏర్పడి దిగుబడి తగ్గుతుంది. నివారణ సహజంగా అక్షింతల పురుగులు, సిర్పిడ్స్ వంటి పరాన్నజీవులు ఈ పురుగులను అదుపులో ఉంచుతాయి. రసం పీల్చు పురుగుల ఉద్ధృతి ఎక్కువగా ఉంటే మొనోక్రోటోపాస్ ఎకరాకు 320 మి.లీ లేదా డైమిథోయేట్ కలిపి పిచికారీ చేయాలి. టర్సికమ్ ఆకు తెగులు ఆకులపై పొదవైన, కోలాకారపు బూడిద రంగుతో ఆకుపచ్చ, గోధుమ వర్ణపు మచ్చలు కన్పిస్తాయి. ఈ మచ్చలు 2.5 నుంచి 25 సెం.మీ. పొడవు, 4 సెం.మీ. వెడల్పు ఉంటాయి. ఈ మచ్చలు మొదట మొక్క కింద ఆకులపై కనిపించి, క్రమంగా పెద్దవై వ్యాపిస్తాయి. అధిక తేమతో కూడిన వాతావరణంలో ఆకు అంతా ఎండి మొక్కలు చలిపోయినట్లుగా కనిపిస్తాయి. ఆకుల అడుగు బాగాన వలయాలుగా ఉంచాయి. ఈ మచ్చలు కాండంపైనా వ్యాపిస్తాయి.తుప్పు తెగులు నల్ల రేగడి, ఎర్ర నేలలు అనుకూలం యాజమాన్య పద్ధతులు పాటిస్తే మేలు నవాబుపేట ఏఓ జ్యోతి ఆకులపై రెండు వైపులా గుండ్రని లేక పొడవాటి గోధుమ వర్ణపు పొక్కుల మాదిరిగా తెగులు లక్షణాలు కనిపిస్తాయి. పంట పెరిగిన కొద్ది ఆకులపైన పొక్కులు గోధుమ వర్ణం నుంచి నలుపు వర్ణానికి మారుతాయి. ఉద్ధృతి, వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. పై రెండు రకాల తెగుళ్ల నివారణకు మాంకోజెట్ ఎకరానికి 500 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి తెగులు తీవ్రతను బట్టి ఒకటి లేక రెండుసార్లు పిచికారీ చేయాలి. -
చేపలకు భలే గిరాకీ
అనంతగిరి: మృగశిర కార్తెను పురస్కరించుకుని ఆదివారం వికారాబాద్ చేపల మార్కెట్లో ఽకొనుగోళ్లతో కిటకిటలాడింది. ఆనవాయితీ ప్రకారం ఈ రోజు చేపలను తింటే ఆరోగ్యానికి మంచిదని ప్రజల విశ్వాసం. దీంతో వాటి ధరలు రోజు కంటే ఎక్కువగా పలికినావినియోగదారులు కొనడానికి ఆసక్తికనబర్చారు. తాండూరు: తాండూరు పట్టణంలో చేపల విక్రయాలు జోరుగా సాగాయి. ఆదివారం మృగశిర కార్తె కావడంతో మీనాలు తింటే ఆరోగ్య సమస్యలు రావంటూ జనాలు విశ్వసిస్తారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు రకాల చేపలు స్థానిక మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. దీంతో చేపలను కొనుగోలు చేసేందుకు జనాలు పోటీ పడ్డారు. మర్పల్లిలో.. మర్పల్లి: మృగశిర కార్తె సందర్భంగా అన్నదాతలు వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు. ఆదివారం కార్తె ప్రవేశించడంతో చేపల విక్రయాలు జోరుగా సాగాయి. మండలంలో కొంషేట్పల్లి ప్రాజెక్టు, రావులపల్లి, తిమ్మాపూర్ చెరువులలో మాత్రమే మత్స్యకారులు చేపలు పట్టారు. భూగర్భ జలాలు అడుగంటడంతో ఆశించిన మేర చేపలు వృద్ధి చెందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇసుక డంప్ సీజ్
యాలాల: అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను సీజ్ చేసినట్లు యాలాల తహసీల్దార్ వెంకటస్వామి తెలిపారు. మండల పరిధిలోని కోకట్ శివారులో గల ఓ ప్రైవేట్ స్కూల్ సమీపంలో కొందరు అక్రమార్కులు భారీగా ఇసుక నిల్వలను డంపు చేశారు. సమాచారం అందుకున్న యాలాల పోలీసులు, రెవెన్యూ ఆర్ఐ వేణు ఆదివారం ఘటనా స్థలానికి చేరుకొని నిల్వ ఉన్న 25 ట్రాక్టర్ల ఇసుక డంపులను సీజ్ చేసినట్లు ప్రకటించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జంట హత్యల కేసు దర్యాప్తునకు బృందం మొత్తం ఏడు బృందాల ఏర్పాటు రాజేంద్రనగర్: జంట హత్యల కేసు ఛేదించేందుకు రాజేంద్రనగర్ పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. నిందితుల ఆనవాళ్లు లభించకపోవడంతో దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. హత్య కేసును ఛేదించేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు ఆదివారం మరో బృందాన్ని ఏర్పాటు చేశారు. వృద్ధ దంపతుల కుటుంబ సభ్యులను ఆదివారం మరోసారి ప్రశ్నించి వివరాలను సేకరించారు. ఆస్తి వివాదాలు, డబ్బు, నగలు తదితర వాటిపై కుటుంబ సభ్యుల నుంచి పలు ప్రశ్నలు అడిగి సమాచారం సేకరించారు. సీసీ టీవీ ఫుటేజీల్లో లభించిన ఆధారంగా నిందితుల చిత్రాలను కుటుంబ సభ్యులతో పాటు బంధువు, మిత్రులకు చూపించినా ఎలాంటి క్లూ లభించలేదు. దీంతో నిందితుల చిత్రాలను అన్ని పోలీస్స్టేషన్లకు పంపించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులు వాడిన రెండు ద్విచక్ర వాహనాలు నంబర్ ప్లేట్లు మార్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఒక వాహనం లభించినా ఎలాంటి క్లూ లభించలేదని సమాచారం. పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లూ లభించలేదంటూనే... త్వరలో నిందితులను పట్టుకుంటామని వెల్లడిస్తున్నారు. వివాహిత అదృశ్యం మణికొండ: వివాహిత అదృశ్యమైన సంఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... సికింద్రాబాద్లోని సీతాఫల్మండీకి చెందిన శ్రీరామ్ యోగిబాబు, తన భార్య సుచరిత(21)తో కలిసి శనివారం మధ్యాహ్నం ఫైనాన్షియల్ జిల్లాలో ఉన్న ప్రిస్టేజ్ స్కైటెక్లోని ఆమె కార్యాలయానికి వచ్చారు. అందులో ఆమె ఫ్లోర్ మేనేజర్గా పనిచేస్తుంది. తనకు లోపల పని ఉందంటూ భర్తను బయట ఉంచి లోనికి వెళ్లింది. ఎంత సేపు వేచి చూసినా ఆమె రాకపోవటంతో లోనికి వెళ్లి చూడగా ఆమె అక్కడ కనిపించలేదు. పరిసర ప్రాంతాలతో పాటు బంధుమిత్రుల ఇళ్లలో విచారించినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో భర్త నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె మెరూన్ రంగు దుస్తులు ధరించిందని, చేతికి స్మార్ట్ వాచ్ ఉందని, ఆమె ఆచూకీ తెలిస్తే నార్సింగి పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. కేసు దర్యాప్తులో ఉంది. రేషన్ గోధుమల పట్టివేత బంజారాహిల్స్: లబ్దిదారుల నుంచి తక్కువ ధరకు రేషన్ గోధుమలు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయించడానికి నిల్వ చేసిన గోదాములపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. భారీగా గోధుమలను స్వాధీనం చేసుకుని రేషనింగ్ ఖైరతాబాద్ సర్కిల్–7 అధికారులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే..బోరబండకు చెందిన బాబర్ అనే వ్యక్తి గత కొంతకాలంగా కార్డుదారుల నుంచి కిలో రూ.10 చొప్పున గోధుమలు కొనుగోలు చేస్తున్నాడు. వీటిని కర్ణాటకు చెందిన జితేందర్ రాథోడ్ అనే వ్యక్తికి కిలో రూ.12 చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో బాబర్ గోధుమలు నిల్వ చేసిన గోదాముపై దాడి చేసిన పోలీసులు 7.5 క్వింటాళ్ల గోధుమలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని సర్కిల్–7 రేషనింగ్ అధికారులకు అప్పగించగా అధికారులు మూసాపేటలోని గోడౌన్కు తరలించారు. జితేందర్రాథోడ్పై గతంలోనూ బోరబండ పోలీస్స్టేషన్లో రేషన్ గోధుమలు అక్రమంగా కొనుగోలు చేస్తున్నట్లుగా కేసు నమోదై ఉండగా పరారీలో ఉన్నాడు. సంగారెడ్డి పోలీస్స్టేషన్లోనూ అతడిపై ఇదే తరహా కేసు నమోదై ఉంది. నిందితులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
తప్పుల తడక
మొయినాబాద్: మున్సిపాలిటీ ఓటరు జాబితా తప్పుల తడకగా మారింది. ఇటీవల విడుదల చేసిన ముసాయిదా జాబితాలో అన్నీ తప్పులే దర్శనమిస్తున్నాయి. ఒకే వ్యక్తి ఓటు రెండు మూడు సార్లు ఉండటంతోపాటు చిన్న పిల్లల ఫొటోలు ఉన్నాయి. మున్సిపల్ పరిధిలో లేనివారి ఓట్లు సైతం జాబితాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ నెల 3న మున్సిపల్ అధికారులు వార్డుల విభజన చేపట్టి ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేశారు. ఐదు నెలల క్రితం కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో తొమ్మిది పంచాయతీలు విలీనమయ్యాయి. మొయినాబాద్, సురంగల్, ముర్తూజగూడ, ఎనికేపల్లి, అజీజ్నగర్, హిమాయత్నగర్, చిలుకూరు, అప్పోజీగూడ, పెద్ద మంగళారం గ్రామ పంచాయతీలు మున్సిపల్గా మారాయి. మున్సిపల్ పరిధిలో మొత్తం 32 వేల ఓట్లు ఉండగా 26 వార్డులుగా విభజించారు. ఒక్కో వార్డుకు 1,200 నుంచి 1,300 మంది ఓటర్లు ఉండేలా విభజించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితా ఆధారంగా వార్డుల విభజన చేపట్టారు. ప్రతి వార్డులో అదే పరిస్థితి మున్సిపల్ అధికారులు విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో చాలా వరకు తప్పులే ఉన్నాయి. కొన్ని వార్డుల్లో ఒక్కొక్కరికి రెండు మూడు ఓట్లు ఉన్నాయి. ఒకే జాబితాలో ఒకే రకమైన పేరు, ఫొటోతో రెండు మూడు ఓట్లు కనిపిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. 11వ వార్డుకు సంబంధించిన ఓటరు జాబితాలో 22 ఏళ్ల కుశల అనే ఓటరు స్థానంలో చిన్నపాప ఫొటో ఉంది. 25వ వార్డు ఓటరు జాబితాలో మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ దారెడ్డి శోభ పేరు, ఫొటోతో ఉంది. మరణించిన వారి పేర్లు, పెళ్లి చేసుకుని వెళ్లినవారి పేర్లు సైతం ఓటరు జాబితాలో ఉన్నాయి. ఇలా ప్రతి వార్డులో రిపీట్ అయిన ఓట్లు, ఇతర ప్రాంతాలకు చెందినవారి ఓట్లు వందల సంఖ్యలో ఉన్నాయి. మున్సిపల్ అధికారులు విడుదల చేసిన ఓటరు జాబితా తప్పుల తడకగా ఉండటంపై పలు రాజకీయ పార్టీల నాయకులు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు చెందినవారి పేర్లు మున్సిపల్ ఓటరు జాబితాలో ఎలా ఉంటాయని.. అలాంటి వాటిని గుర్తించి అధికారులే తొలగించాలని.. తప్పులను సైతం సరిచేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయిజుద్దీన్ను వివరణ కోరగా తమకు పై నుంచి వచ్చిన జాబితా విడుదల చేశామని.. తాము ఎలాంటి సవరణలు చేసే అవకాశం లేదన్నారు. తప్పులేమైనా ఉంటే తహసీల్దార్ వద్దగానీ, ఆన్లైన్లోగానీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ ఓటరు జాబితాలో అన్నీ పొరపాట్లే.. ఒకే వ్యక్తి ఓటు రెండు మూడుసార్లు జాబితాలో చిన్నపిల్లల ఫొటోలు మున్సిపల్ పరిధిలో లేనివారు సైతం ప్రత్యక్షం -
మరో లగచర్ల చేయొద్దు
మొయినాబాద్: ఎనికేపల్లి భూముల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే మరో లగచర్లను చూస్తారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి హెచ్చరించారు. మున్సిపల్ పరిధిలోని ఎనికేపల్లిలో ప్రభుత్వం గోశాలకు కేటాయించిన భూములను శనివారం ఆమె సందర్శించారు. రైతులు సాగుచేసిన పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారికి మద్దతుగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 18 నెలలుగా రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని వర్గాల వారిని ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. కొన్ని రోజులు మూసీ పరిసరాల్లో పేదలను గుంజేశారని.. ఫుట్పాత్పై ఉండే పేదలను లాగేస్తున్నారన్నారు. లగచర్లలో గిరిజనుల భూములు గుంజుకునే ప్రయత్నం చేశారని.. ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం మండలాల్లో కొత్త రోడ్డుకోసం 3వేల ఎకరాలు పేదల భూములు తీసుకుంటున్నారని విమర్శించారు. సంగారెడ్డి, గద్వాలలో పేదల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తాజాగా ఎనికేపల్లిలో గోశాల ఏర్పాటుకోసం అంటూ వంద ఎకరాలను రైతుల నుంచి లాక్కుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో రకంగా పేదలు, చిన్న, సన్నకారు రైతుల భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. ఎనికేపల్లి విషయం తెలిసి కేసీఆర్ తనను ఇక్కడి పంపారన్నారు. రైతుల భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమని.. వారికి మద్దతుగా పోరాడతామని స్పష్టం చేశారు. 1954 నుంచి రైతులే సాగు చేస్తున్నారు ఎనికేపల్లిలో 1954లోనే హరిజనులు సాగుచేసుకుంటున్నట్లు రికార్డులో ఉందని.. 1998 వరకు రైతులు శిస్తు కట్టిన రసీదులు ఉన్నాయన్నారు. ఎలాంటి నోటీసులు, సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం భూములను ఎలా తీసుకుంటుందని నిలదీశారు. వాళ్ల భూములు వారికే పట్టా చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయాలపై చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళతో ఫోన్లో మాట్లాడారు. జిల్లా ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కోకాపేట భూములను అమ్ముకోవడానికే.. కోకాపేటలో గోశాలకు 200 ఎకరాల భూమి ఉందని.. అందులో 100 ఎకరాలు ప్రభుత్వం తీసుకుని దానికి బదులు ఎనికేపల్లిలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తోందన్నారు. గోశాలకు ఇవ్వాలంటే మొయినాబాద్ మండలంలోనే ప్రభుత్వం పీఓటీ చట్టంకింద స్వాధీనం చేసుకున్న వెయ్యి ఎకరాల భూమి ఉందని గుర్తు చేశారు. ప్రతి ఫాంహౌస్, ప్రతి కాలేజీలో ప్రభుత్వ భూమి ఉందని.. వాటిని బయటకు తీయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, కొత్త నర్సింహారెడ్డి, దేశమొల్ల ఆంజనేయులు, పార్టీ మండల అధ్యక్షుడు దారెడ్డి వెంకట్రెడ్డి, మాజీ సర్పంచ్లు కోట్ల నరోత్తంరెడ్డి, శ్రీహరియాదవ్, సుధాకర్యాదవ్, రాఘవరెడ్డి, మహేందర్రెడ్డి, మాజీ ఎంపీటీసీలు కొత్త మాణిక్రెడ్డి, మోర శ్రీనివాస్, రవీందర్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, మాజీ డైరెక్టర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోం అన్నదాతలకు అన్యాయం జరగనివ్వం మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి -
పంటకు గంగరాయి
నీళ్లపల్లిలో 500 ఎకరాల్లో విస్తరించిన రాళ్లభూమి ● ప్రతికూల వాతావరణంలోనూ దిగుబడి ● పత్తి, జొన్న, శనగ పంటలకు ఎంతో మేలు ● యంత్రాలతోనే సాగు చేయాలంటున్న రైతులు బషీరాబాద్: సాధారణంగా పొలాల్లో రాళ్లు ఉంటే పంటలు సరిగ్గా పండవు.. వాటిని తొలగించేందుకు రైతులు ఎంతైనా ఖర్చు చేస్తుంటారు.. కానీ బషీరాబాద్ మండలం నీళ్లపల్లిలో ఆ రాళ్లే పసిడి పంటకు దోహదం చేస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు వందల ఎకరాల్లో పలుగురాళ్లు (గంగారాయి) రాశులు పోసినట్లు కనిపిస్తాయి. అవి పొలంలో తడి ఆరకుండా పంట ఎదుగుదలకు దోహసం చేస్తున్నాయి. రబీ సీజన్లో జొన్న, శనగ, తెల్ల కుసుమ పంటలకు ఈ రాళ్లు జీవం పోస్తున్నాయి. విత్తు మొదలు పంట కోసే వరకు భూమిలో తేమశాతం తగ్గకుండా కాపాడుతున్నాయి. ఏడాదికి రెండు పంటలు బషీరాబాద్ మండలంలోని నీళ్లపల్లి, జలాల్పూర్ తోపాటు కొండగల్ నియోజకవర్గంలోని రుద్రారం, టేకుల్కోడ్ గ్రామాల పరిధిలో సుమారు 500 ఎకరాల్లో ఈ రాళ్ల పొలాలు ఉన్నాయి. ఈ రాళ్లను రైతులు గంగ రాయి, చలువరాయి అని పిలుస్తారు. ఈ భూముల్లో ఏడాదికి రెండు పంటలు పండిస్తున్నారు. ఖరీఫ్లో పత్తి, కంది ఎక్కువగా సాగు చేస్తారు. పత్తి మంచి దిగుబడి వస్తుందని.. కంది సాగుకు అంతగా అనుకూలించవని రైతులు చెబుతున్నారు. యంత్రాలతోనే సాగు పొలమంతా గంగరాళ్లు ఉండటంతో ఎద్దులతో వ్యవసాయం చేయడం చాలా కష్టం. కూలీలు కూడా పనిచేయలేని పరిస్థితి. రాళ్ల కారణంగా పొలాల్లో నడవలేరు. దీంతో రైతులు ప్రత్యామ్నాయంగా యంత్రాలను వినియోగిస్తున్నారు. విత్తు మొదలు పంట కోతలు, నూర్పిడి వరకు యంత్రాలనే వాడుతున్నారు. కేవలం పత్తి తీసేందుకు మాత్రం కూలీలను వినియోగిస్తున్నారు.అధిక దిగుబడికి దోహదంగంగరాయి పొలాలు పత్తి, జొన్న, శనగ పంటలకు అనుకూలం. సాధారణ పొలాల కంటే వీటిలో అధిక దిగుబడి వస్తుంది. ముఖ్యంగా రబీ సీజన్లో తేమ శాతం తగ్గదు. దీంతో పంటలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. నేల వేడెక్కదు సూర్య కిరణాలు పలుగు రాళ్లపై పడటం ద్వారా పొలం వేడెక్కదు. ఈ రాళ్లు 60శాతం మేర ఎండను అడ్డుకుంటాయి. తద్వారా భూమిలో తేమ ఆరదు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా పంటలకు ఎలాంటి నష్టం జరగదు. పొలం లోపల పైన రాళ్లు ఉండటంతో పంటకు చలువ లభించి మొక్కలు ఏపుగా పెరుగుతాయి. దీంతో అధిక దిగుబడి వస్తుంది. – సుధాకర్, వ్యవసాయ శాస్త్రవేత్త, తాండూరు రాళ్లే పంటకు జీవం మా కుటుంబానికి 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పొలం నిండా రాళ్లు రాశులు పోసినట్లు ఉంటాయి. ఆ రాళ్లే సిరులు కురుపిస్తున్నాయి. భూమి లో తడి ఆరకుండా మేలు చేస్తాయి. పత్తి, కంది, జొన్న, శనగ సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుంది. ఎకరాకు 13 క్వింటాళ్ల పత్తి వస్తుంది. జొన్నలు అయితే 14 క్వింటాళ్లు వస్తాయి. – రుక్మారెడ్డి, రైతు నీళ్లపల్లి -
ఫిట్లెస్..!
బడి బస్సుల భద్రతపై అనుమానాలెన్నో● జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు 195 ● రిజిస్ట్రేషన్ అయిన స్కూల్ బస్సులు 250 ● అనధికారికంగా తిప్పుతున్నవి వందకు పైనే.. ● ఫిట్నెస్ పరీక్షలు పూర్తయినవి 40 మాత్రమే ● మరో నాలుగు రోజుల్లో తెరుచుకోనున్న పాఠశాలలు వికారాబాద్: బడి బస్సు భద్రమేనా..? అంటేకాదనే సమాధానం వస్తోంది. తరచూ స్కూల్ బస్సులు మొరాయిస్తూనే ఉన్నాయి. బ్రేకులు ఫెయిల్ కావటం.. రోడ్డు పక్కకు దూసుకెళ్లడం.. ప్రమాదాలకు గురికావడం సర్వసాధారణంగా మారింది. గతే డాది కూడా స్కూల్ బస్సులు ప్రమాదాలకు గురైన ఘటనలు మనం చూశాం. ఈ నెల 12నుంచి పాఠ శాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో బడి బస్సులు కండీషన్పై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. జిల్లాలో 195 ప్రైవేటు పాఠశాలలు ఉండగా 250 వరకు రిజిస్ట్రేషన్ అయిన బస్సులు ఉన్నాయి. మరో వంద బస్సులను అనుమతులు లేకుండా తిప్పుతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు 40 బస్సులు మాత్రమే యాజమాన్యాలు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోగా మిగతా వారు దరఖాస్తు కూడా చేసుకోలేదు. నిబంధనలు తుంగలో తొక్కి బస్సులు తిప్పుతునఆన ఆర్టీఏ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నిబంధనలకు నీళ్లు చాలా వరకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పాత బస్సులు కొనుగోలు చేసి వాటికి పేయింట్ రుద్ది కొత్త బస్సుల్లా కలరింగ్ ఇస్తున్నారు. ఆర్టీఏ అధికారులు ఫిట్నెస్ చెక్ చేసే సమయంలో బస్సు టైర్లు, పేయింటింగ్, రేడియం స్టిక్కర్లు, లైట్లు, సీట్లు, అనుభవం, నైపుణ్యంగల డైవర్లు ఇలా అన్నీ పరిశీలించాలి. కానీ నామమాత్రంగా చెక్ చేసి చేతులు దులుపుకొంటున్నారనే విమర్శలు ఉన్నా యి. దీంతో ఏటా బస్సులు ప్రమాదాలకు గురై చిన్నారులు ఆస్పత్రుల పాలవుతున్నారు. జిల్లాలో 15 సంవత్సరాలు దాటి ఫిట్నెస్ లేని బస్సులు వందకు పైగా ఉన్నట్లు సమాచారం. వీటికి ఫిట్నెస్ టెస్టులు చేయించుకోకుండా ఆర్టీఏ అధికారులను మ్యానేజ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్కూల్ బస్సు నడపాలంటే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి. ఐదు సంవత్సరాల అనుభవం తప్పనిసరి. కానీ ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు ఇవేవీ పాటించటంలేదు. జిల్లాలో మొత్తం 45 వేల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతుండగా 50 శాతం మంది స్కూల్ బస్సుల్లోనే పాఠశాలలకు వెళ్తున్నారు. మరో నాలుగు రోజుల్లో 200 స్కూల్ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయడం సాధ్యమేనా అనేది ప్రశ్న తలెత్తుతోంది. పాటించాల్సిన నిబంధనలు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తోపాటు ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న వారినే డ్రైవర్లుగా నియమించుకోవాలి. కంటి చూపు, షుగర్, బీపీ, ఫిట్స్, గుండెజబ్బులు లేనివారిని మాత్రమే డ్రైవర్లుగా నియమించుకోవాలి. వారికి ప్రతి మూడు నెలలకోసారి వైద్య పరీక్షలు చేయించాలి. ఆర్టీఏ నిబంధనల ప్రకారం 15 సంవత్సరాలు దాటిన బస్సులను విద్యార్థుల రవాణాకు వినియోగించరాదు. 60 సంవత్సరాలు నిండిన వారిని డ్రైవర్లుగా కొనసాగించరాదు. బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ సేఫ్టీ పరికరాలు కచ్చితంగా ఉంచాలి. అందులో మందులు ఉండేలా చూసుకోవాలి. కాలం చెల్లిన మందులు, పరికరాలు ఎప్పటికప్పుడు మార్చాలి. విద్యా సంస్థల పేరు, ఫోన్ నంబర్ బస్సుకు ఎడమవైపు వెనకభాగంలో కనిపించేలా రాయించాలి. బస్సులో అటెండర్ను కచ్చితంగా ఉండాలి. చిన్నారులు బస్సు ఎక్కడం, దిగటం డ్రైవర్కు స్పష్టంగా కనిపించేలా కుంభాకార అద్దాలు ఏర్పాటు చేసుకోవాలి. విద్యార్థుల బ్యాగులు ఉంచుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి. ప్రతి పది బస్సులకు అదనంగా మరో బస్సును అందుబాటులో ఉంచుకోవాలి. రక్షణ చర్యల్లో భాగంగా కిటీకీల మధ్యలో రాడ్స్ను ఏర్పాటు చేసుకోవాలి. ఫుట్ బోర్డులో మొదటి మెట్టు భూమికి 325 మిల్లీ మీటర్ల ఎత్తు మించ రాదు. మిగతా అన్ని మెట్లు కూడా జారకుండా లోహంతో నిర్మితమై ఉండేలా చూసుకోవాలి. తల్లిదండ్రులు కూడా బస్సులు బాగున్నాయా లేదని అని పరిశీలించాలి. నోటీసులు ఇచ్చాం పాఠశాలల పునఃప్రారంభం లోపే స్కూల్ బస్సుల కు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలి. నిబంధనలకు లోబడి బస్సులో అన్ని పరికరాలు ఉండేలా చూసుకోవాలి. ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోని వారికి నోటీసులు ఇచ్చాం. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డెక్కే బస్సులను సీజ్ చేస్తాం. – వెంకట్రెడ్డి, డీటీఓ, వికారాబాద్ -
వైభవంగా ఆలయ వార్షికోత్సవం
తాండూరు టౌన్: తాండూరు పట్టణంలోని శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయ 11వ వార్షికోత్సవ వేడుకలు పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో శనివారం వైభవంగా జరిగాయి. ఉదయం 7గంటలకు స్వామివారికి అభిషేకం, అలంకరణ. మహా మంగళ హారతి, 9గంటలకు గణపతి హోమం, మహా నైవేద్యం, మంత్ర పుష్పం, తీర్థ ప్రసాద వితరణ గావించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద విత రణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మా ర్కండేయ కాలనీ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం పదో తరగతి, ఇంటర్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పద్మశాలి విద్యార్థులను మెమొంటోలతో ఘనంగా సన్మానించారు. పెద్దేముల్ ఎస్ఐగా ప్రశాంత్వర్ధన్ తాండూరు రూరల్: పెద్దేముల్ ఎస్ఐగా ప్రశాంత్ వర్ధన్ శనివా రం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పని చేసిన శ్రీధర్రెడ్డి సంగారెడ్డికి బదిలీపై వెళ్లారు. టాస్క్ఫోర్స్లో పని చేస్తున్న ప్రశాంత్ వర్ధన్ను పెద్దేముల్కు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి దోమ: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని శివారెడ్డిపల్లిలో మూడు నెలల రేషన్ కోటా బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని లబ్ధిదారులకు యూడు నెలల బియ్యాన్ని ఒకే సారి పంపిణీ చేస్తోందని తెలిపారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తు న్నట్లు చెప్పారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, నాయకులు రాంచంద్రారెడ్డి, వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య తాండూరు టౌన్: జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం తాండూరు రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన వాగ్మాడే సుమన్ (24) కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన యువకుడు రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు శవాన్ని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతుని తండ్రి ముకుందరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. కోట్పల్లి ఎస్ఐగా శైలజ బంట్వారం: కోట్పల్లి ఎస్ఐగా శైలజ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఇక్కడ పనిచేసిన అబ్దుల్ గఫార్ డీసీఆర్బీకి బదిలీ చేశారు. ఆయన స్థానంలో డీసీఆర్బీలో పనిచేసే శైలజను ఇక్కడికి పంపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల సహకారంతో మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. -
ఈత, తాటి చెట్లను నరకొద్దు
ఆమనగల్లు: అనుమతి లేకుండా ఈత, తాటి చెట్లను నరికితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆమనగల్లు ఎకై ్సజ్ సీఐ బద్యనాథ్చౌహాన్ హెచ్చరించారు. పట్టణంలోని ఎకై ్సజ్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాల్లోని వివిధ గ్రామాల్లో ఈత, తాటి చెట్ల నుంచి వచ్చే కల్లును విక్రయించి గౌడ కులస్తులు ఉపాధి పొందుతున్నారని తెలిపారు. వీరు ప్రభుత్వం నుంచి లైసెన్స్ కలిగి ఉన్నారన్నారు. ఈత, తాటి చెట్లను నరకడం చట్ట ప్రకారం నేరమని చెప్పారు. తెలంగాణ ఎకై ్సజ్ యాక్ట్ 1968 ప్రకారం సొంత భూమిలోని ఈత, తాటి చెట్లను తొలగించాలన్నా ఎకై ్సజ్ శాఖ అనుమతులు పొందాల్సి ఉంటుందని వివరించారు. అవసరమైన వారు పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే కలెక్టర్ పర్యవేక్షణలోని త్రిసభ్య కమిటీ పరిశీలించి కలెక్టర్కు నివేదిక అందజేస్తుందని తెలిపారు. కలెక్టర్ అనుమతితో వీటిని తొలగించాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం ఒక్కో చెట్టుకు ప్రభుత్వానికి రూ.1,968 రుసుం చెల్లించాలన్నారు. ఎకై ్సజ్ శాఖ అనుమతి లేకుండా చెట్లను తొలగిస్తే మొదటి తప్పుగా భావించి 3 నెలల జైలు శిక్ష, రెండో సారి తొలగిస్తే 6 నెలల జైలుశిక్ష, జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. ఎకై ్సజ్ సీఐ బద్యనాథ్చౌహాన్ -
కేజీబీవీలో ఎంఎల్టీ కోర్సు
యాచారం: మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఈ ఏడాది నుంచి ఎంఎల్టీ (మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్) ఇంటర్ కోర్సు ప్రారంభిస్తున్నట్లు విద్యాలయ ప్రత్యేకాధికారి అరుణశ్రీ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కోర్సులో 40 సీట్ల చొప్పున భర్తీ చేస్తామని తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో తరగతులు ఉంటాయన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. వివరాలకు 83318 33426 నంబర్లో సంప్రదించాలని ఆమె సూచించారు. ఎంఎల్టీ బోధించడానికి ఆసక్తి కలిగిన అధ్యాపకులు కూడా సంప్రదించాలన్నారు. నెల రోజులకు కుటుంబం చెంతకు యాచారం: మండల పరిధిలోని కుర్మిద్ద గ్రామంలో నెల రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి శనివారం కుటుంబ సభ్యుల చెంతకు చేరాడు. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ లిక్కి కృష్ణంరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మల్కాపురం నర్సింహ మే 7న ఇంటి నుంచి పని కోసమని వెళ్లి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు చుట్టు పక్కల గ్రామాల్లో, బంధువుల ఇళ్ల వద్ద వెతికిన జాడలేకపోవడంతో గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నల్లగొండ, నాగర్కర్నూల్, హైదరాబాద్ జిల్లాల్లోని పలు చోట్ల వెతికి శనివారం నగరంలోని ఎల్బీనగర్ ప్రాంతంలో నర్సింహ సంచరిస్తుండగా గుర్తించి తీసుకొచ్చారు. కుర్మిద్దలోని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అదుపు తప్పి రేకులషెడ్డును ఢీకొట్టి ● రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి దుర్మరణం ● మరో విద్యార్థికి తీవ్ర గాయాలు ఇబ్రహీంపట్నం: అదుపు తప్పిన బైక్ రేకుల షెడ్ను ఢీకొట్టడంతో బీటెక్ విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ జగదీశ్ కథనం ప్రకారం.. మంచిర్యాలకు చెందిన రుతికేష్(20) ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. కళాశాలలో శుక్రవారం ఫేర్వెల్ పార్టీ అనంతరం స్నేహితుడు సంజయ్ ఉంటున్న మంగల్పల్లి హాస్టల్కు మరో స్నేహితుడు శంకర్తో కలిసి బైక్ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి దాటిన తర్వాత శేరిగూడ గాంధీ విగ్రహం వద్దకు రాగానే వేగంగా వస్తున్న బైక్ అదుపుతప్పి మెడికల్ షాపు ముందున్న రేకుల షెడ్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో రుతికేష్ అక్కడికక్కడే మృతిచెందగా తీవ్ర గాయాలైన శంకర్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పేదలను అన్నివిధాలా ఆదుకుంటాం మణికొండ: పేద విద్యార్థుల చదువులు, అనారోగ్యాలు, వివాహాలకు ఆర్థిక సాయంతోపాటు అన్ని విధాలా ఆదుకుంటామని వట్టినాగులపల్లి మాజీ సర్పంచ్ జి.స్వరూప నగేష్యాదవ్ అన్నారు. శనివారం గ్రామానికి చెందిన బుడల పెంటయ్య కూతురు వివాహానికి రూ. 50 వేల ఆర్థిక సాయాన్ని ఆమె అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మనకు ఉన్న దాంట్లో కొంత లేని వారికి ఇస్తే మానసిక సంతృప్తి మిగులుతుందన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు రాబోయే రోజుల్లోనూ నిర్విరామంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఎలాంటి ఇబ్బందులున్నా పేదలు తమను సంప్రదించాలని వారికి తగిన సాయం చేస్తామని ఆమె వెల్లడించారు. ఇప్పటి వరకు వంద మందికి పైగా ఆర్థికంగా ఆదుకున్నామని తెలిపారు. -
బాలారిష్టాల్లో ఫ్యూచర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’ భవిష్యత్ మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్నట్లు మారింది. 330 అడుగుల గ్రీన్ఫీల్డ్ రోడ్డు, మెట్రోరైలు, ఏఐ సిటీ, జపాన్, తైవాన్ కంపెనీలు అంటూ రోజుకో ప్రకటనతో సర్కారు ఊదరగొడుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటివరకు కేవలం స్కిల్ యూనివర్సిటీ మినహా మరే ప్రాజెక్టుకు ప్రతిపాదిత నాలుగో నగరిలో పునాది రాయి కూడా పడకపోవడం.. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ రెండు నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ సిబ్బందిని కూడా సమకూర్చుకోకపోవడం చూస్తే.. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కడ్తాల్, కందుకూరు, యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం మండలాల్లోని 56 గ్రామాలను ఎఫ్సీడీఏ పరిధిలోకి తెచ్చారు. ఈ గ్రామాల అభివృద్ధిని క్షేత్రస్థాయి నుంచి పర్యవేక్షించాల్సిన ఎఫ్సీడీఏ ఆఫీసు మాత్రం మూడో నగరమైన (సైబరాబాద్) నానక్రాంగూడలో ఏర్పాటు చేయడం గమనార్హం. సీఎం కలల ప్రాజెక్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు బాలారిష్టాలను ఎదుర్కొంటోంది. అధికారంలోకి రాగానే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో ఫోర్త్ సిటీ అవసరమని ప్రకటించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జాతీయ రహదారుల మధ్యలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించి ఏడాది గడుస్తున్నా ఆశించిన స్థాయిలో ఆ దిశగా అడుగులు ముందుకు పడటం లేదు. పూర్తి స్థాయి సిబ్బంది లేకపోవడంతో అభివృద్ధి పనుల్లో పురోగతి కనిపించడం లేదు. రావిర్యాల ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి ఆకుతోట పల్లి వరకు 330 అడుగుల రతన్టాటా గ్రీన్ఫీల్డ్ రహదారికి భూ సేకరణ పనులు చురుగ్గా సాగగా.. పరిహారం ఇవ్వకుండానే నిర్మాణ పనులకు టెండర్లు పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించడంతో బ్రేక్ పడింది. దీంతో ఇప్పటివరకు ఈ ప్రాంతంలో స్కిల్ వర్సిటీ పనులు మాత్రమే కాస్తో కూస్తో సాగుతున్నాయి. సిబ్బంది కొరత 765.28 చదరపు కి.మీల విస్తీర్ణంలో ఫోర్త్ సిటీని అభివృద్ధి చేయాలన్నది రేవంత్ సర్కార్ లక్ష్యం. వివిధ విభాగాల నుంచి డెప్యుటేషన్పై 90 పోస్టులకు గత మార్చిలో మంత్రివర్గం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వీటిలో 34 రెగ్యులర్ పోస్టులు కాగా.. మిగిలిన 56 పోస్టులను ఔట్ సోర్సింగ్/కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయాల్సి ఉంది. కానీ.. ఇప్పటివరకు ఎఫ్సీడీఏ కమిషనర్ శశాంక మినహా పూర్తిస్థాయి సిబ్బంది నియామకం జరగలేదు. సిబ్బంది కొరతతో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ఇతర విభాగాల నుంచి డెప్యుటేషన్పై ఎఫ్సీడీఏ ప్లానింగ్ విభాగంలో పనిచేసేందుకు అధికారులు నిరాసక్తి చూపిస్తున్నారు. దీంతో ఎఫ్సీడీఏ మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో ఎలాంటి పురోగతి లేదు. మాస్టర్ ప్లాన్ హెచ్ఎండీఏదే.. ఫోర్త్సిటీలో ఐటీ, పారిశ్రామిక, ఆతిథ్య, పర్యాటక, క్రీడారంగాలకు పెద్దపీట వేయాలని నిర్ణయి ంచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు దేశ, విదేశీ సంస్థలు, పెట్టుబడులు తీసుకురావాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రతిబంధకాలు రాకుండా, అభివృద్ధి పనులు ప్రణాళికబద్ధంగా చకచకా సాగేలా ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందిచాలని నిర్ణయించారు. ఈ బాధ్యతలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అప్పగించినట్లు ఓ అధికారి తెలిపారు. గతంలో సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ (సీడీఏ), ఎయిర్పోర్ట్ అథారిటీ ప్లాన్ (ఏఏపీ) మాస్టర్ ప్లాన్లను హెచ్ఎండీఏనే అభివృద్ధి చేసిందని గుర్తు చేశారు. అలాగే ఎఫ్సీడీఏ పరిధిలోని గ్రామాలు గతంలో హెచ్ఎండీఏ పరిధిలోనే ఉన్నాయని, అందుకే ఎఫ్సీడీఏ మాస్టర్ ప్లాన్ను హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తోందని ఆయన వివరించారు. ఇప్పటికీ అడుగు పడని ప్రాజెక్టులు కేవలం స్కిల్ వర్సిటీకే పరిమితం గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు కోర్టు బ్రేక్ వేధిస్తున్న సిబ్బంది కొరత ప్లానింగ్లో పని చేసేందుకు అధికారుల నిరాసక్తి ఎఫ్సీడీఏ మాస్టర్ ప్లాన్ బాధ్యత హెచ్ఎండీఏ చేతికి -
దాడి కేసులో నిందితులపై చర్యలు తీసుకోవాలి
కొందుర్గు: జిల్లేడ్ చౌదరిగూడ మండలం గుర్రంపల్లిలో దళితులపై దాడిచేసిన నిందితులపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ డిమాండ్ చేశారు. మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో శనివారం గుర్రంపల్లి గ్రామాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా శంకర్తోపాటు మానవ హక్కుల వేదిక జంగయ్య, పాండు మాట్లాడుతూ.. బొడ్రాయి ఉత్సవాల్లో కొందరు యువకులు డ్యాన్స్ చేస్తూ ఆడ పిల్లలపై పడబోతుంటే అడ్డుకున్న దళిత యువకుడు ప్రవీణ్పై దాడిచేయడం బాధాకరమన్నారు. అంతటితో ఆగకుండా మరుసటి రోజు ప్రవీణ్ సోదరుడు శ్రీనివాస్ పంచాయతీ కార్యాలయం వద్ద ఫోన్ మాట్లాడుతుండగా దాడి చేసి చేయి విరగ్గొట్టారన్నారు. ఈ విషయమై బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేసినా నిందితులపై కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే వారిపై కేసు నమోదుచేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల నాయకులు యాదయ్య, రామచంద్రయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
విహార యాత్రకు వెళ్లి..
దుద్యాల్: దైవ దర్శనాల కోసం బైక్పై బయల్దేరిన ఇద్దరు స్నేహితులు ప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఒకరు మృతిచెందగా మరొకరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండల పరిధిలోని గౌరారం గ్రామానికి చెందిన కమ్మరి జగన్నాథచారి, సరిత దంపతుల కుమారుడు చందుచారి హైదరాబాద్లోని వేద పాఠశాలలో చదువుతున్నాడు. నల్లగొండ జిల్లాకు చెందిన శివకుమార్ అనే స్నేహితుడితో కలిసి ఇటీవల విహార యాత్రగా బైక్పై తిరుపతి, అరుణాచలం బయల్దేరారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో చందు (19) అక్కడిక్కడే మృతి చెందగా, తీవ్రగాయాలైన శివకుమార్ రేణిగుంట ప్రభుత్వ ఆసస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరి వద్ద ఉన్న గుర్తింపు కార్డుల ఆధారంగా అక్కడి పోలీసులు శుక్రవారం సాయంత్రం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. రేణిగుంట వద్ద బైక్ యాక్సిడెంట్ గౌరారం గ్రామానికి చెందిన వేద పాఠశాల విద్యార్థి దుర్మరణం -
అన్నోజిగూడలో విషాదం
● రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడికి గాయాలు ● చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి ● అంత్యక్రియల్లో పాల్గొన్న జిల్లా రాజకీయ ప్రముఖులు కందుకూరు: కుమార్తెను లండన్ పంపించేందుకు ఏర్పాట్లు చేసుకున్న ఓ తండ్రి ఊహించని ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని అన్నోజిగూడకు చెందిన మాజీ ఉప సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెంకల యాదయ్య(54) శుక్రవారం ఉదయం బైక్పై హైదరాబాద్ వెళ్తుండగా పహాడీషరీఫ్ పీఎస్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం యశోద ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. కాగా మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉంది. ఈనెల 9న కూతురును ఉన్నత చదువుల కోసం లండన్లో పంపించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం సన్నిహితులు, బంధువులకు విందు ఏర్పాటు చేశాడు. కానీ ఊహించని ప్రమాదంలో గాయపడి మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, పీసీసీ సభ్యుడు దేప భాస్కర్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు బొక్క జంగారెడ్డి, ఏనుగు జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.కృష్ణనాయక్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ఎస్.మల్లేశ్, వివిధ పార్టీల నాయకులు, ముదిరాజ్ సంఘం నాయకులు హాజరై నివాళులర్పించారు. -
బెర్త్ దక్కేనా..?
సాక్షి, రంగారెడ్డిజిల్లా: తెలంగాణలోనే కీలకమైన జిల్లా నేతలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా కొనసాగారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఒక్కరికీ అవకాశం దక్కలేదు. ప్రభుత్వానికి ఆర్థిక, రాజకీయ వనరులను సమకూర్చిపెట్టే కీలకమైన ఆయా జిల్లాల నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో మంత్రి వర్గ విస్తరణ ఉండనున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. జిల్లా నేతలకు ఈసారైనా అవకాశం దక్కేనా అనేది వేచిచూడాలి. సీనియార్టీనా.. సామాజిక సమీకరణాలా? గ్రేటర్కు ఆనుకుని ఉన్న జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వీటిలో ఇబ్రహీంపట్నం, షాద్నగర్, కల్వకుర్తి స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన అనుభవం ఉండగా, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా పని చేసిన అనుభవం ఉంది. షాద్నగర్ నుంచి వీర్లపల్లి తొలిసారిగా గెలుపొందారు. ఆయన బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చారు. కారుగుర్తుపై గెలుపొందిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మంత్రి పదవులు, అభివృద్ధి కోసం భారీ నిధుల పేరుతో హస్తం గూటికి చేరుకున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పదవులు దక్కే అవకాశం లేదు. మొదటి నుంచీ పార్టీనే నమ్ముకుని పని చేస్తున్న ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ..వారికి మంత్రి వర్గంలో స్థానం కల్పించకపోవడంపై కేడర్లో నిస్తేజం నెలకొంది. డీసీసీ వేదికగా జరిగిన పలు సమావేశాల్లోనూ ఇదే అంశంపై నేతలు బహిరంగ విమర్శలకు దిగడం గమనార్హం. కొంత మంది సీనియర్ నేతలు ఏకంగా ఢిల్లీకి చేరుకుని పార్టీ అధిష్టానాన్ని కలిసి విన్నవించడం తెలిసిందే. పార్టీలో ఎక్కువ పదవులు ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణలోనే కాదు కార్పొరేషన్, ఇతర పదువుల్లోనూ సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకోవాలని అధిష్టానం సూచించినట్లు తెలిసింది. సీనియార్టీకి ప్రాధాన్యత ఇస్తే మల్రెడ్డికి చాన్స్ ఉంటుంది. బీసీ నినాదాన్ని ఎత్తుకుంటే వీర్లపల్లికి అవకాశం ఉంది. ఇక ఎస్సీ కోటాకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తే ఇప్పటికే శాసనసభ స్పీకర్గా కొనసాగుతున్న గడ్డం ప్రసాద్కుమార్కు చాన్స్ కల్పించనుంది. సమన్వయం చేసే వారు లేక .. ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చి పెట్టడంలోనే కాదు పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనలో ముందు వరుసలో నిలిచే జిల్లాకు పూర్తిస్థాయి మంత్రి లేకపోవడం ఇబ్బందిగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలే కాదు చివరికి అధికారులు సైతం ప్రతి చిన్న పనికి ఇన్చార్జి మంత్రిని ఆశ్రయించాల్సి వస్తోంది. ఫ్యూచర్సిటీ కోసం భూ సేకరణ, కోహెడ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం, ఐటీ, అనుబంధ సంస్థలకు భూముల కేటాయింపు, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు నిధుల సేకరణ వంటి కీలక అంశాలపై జిల్లా నేతలతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంది. అంతేకాదు ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని, సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి కారణమైన నేతలకు నామినేటెడ్ పదవులు ఇప్పించుకోవడం, వ్యక్తిగత, ఇతర సమస్యలతో వచ్చే వారికి సమయం ఇచ్చి, వాటి పరిష్కారం కోసం కృషి చేయాల్సి ఉంది. జిల్లాకు పూర్తిస్థాయి మంత్రి లేకపోవడంతో అభివృద్ధి సహా సంస్థాగతంగా కేడర్ను బలోపేతం చేసే దిశగా ఎలాంటి అడుగులు పడటం లేదు. ఇన్చార్జి మంత్రి ఉన్నప్పటికీ..ఆయనతో జిల్లా సెకండ్ కేడర్ నేతలకు పెద్దగా పరిచయాలు లేకపోవడం, అధ్యయనాల పేరుతో ఆయన తరచూ విదేశాల్లో పర్యటించాల్సి వస్తుండటం, కేవలం ముఖ్య నేతలు పాల్గొనే బహిరంగ సభలు, సమావేశాలకే పరిమితం అవుతుండటం జిల్లా నేతలకు ఇబ్బందిగా మారింది. జిల్లాస్థాయి సమీక్ష, సమావేశాలు కూడా నామమాత్రంగా నిర్వహించి వెళ్తుండటాన్ని కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. తాజాగా విస్తరణ కథనాలతో బెర్త్ ఎవరికి దక్కుతుందన్న చర్చలు మొదలయ్యాయి. మంత్రి వర్గంలో రంగారెడ్డి జిల్లాకు దక్కని ప్రాతినిధ్యం విస్తరణ ఊహాగానాల నేపథ్యంలో మళ్లీ కదలిక ఎవరికి అవకాశం దక్కుతుందా అనే చర్చలు -
రోడ్లపైనే నిరీక్షణ!
దుద్యాల్: మండల పరిధిలోని పలు గ్రామాల్లో బస్టాండ్లు లేక ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబుబ్నగర్– చించోలి జాతీయ రహదారిపై దుద్యాల్ మండల కేంద్ర ప్రధాన గేట్తో పాటు మండలంలోని హస్నాబాద్, లగచర్ల గేట్, ఈర్లపల్లి, గౌరారం, చిలుముల మైల్వార్ తదితర గ్రామాల్లో బస్ షెల్టర్లు అందుబాటులో లేవు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో.. దుద్యాల్ గేట్, హస్నాబాద్ తదితర గ్రామాల మీదుగా మహబుబ్నగర్– తాండూరు రూట్లలో బస్సులు ఎక్కువగా తిరుగుతుంటాయి. లగచర్ల గేట్ నుంచి హైదారాబాద్కు అధిక సంఖ్యలో జనాలు రాకపోకలు సాగిస్తారు. ఈ నేపథ్యంలో నిత్యం వందలాది మంది బస్సుల కోసం వేచి చూస్తుంటారు. వీరికి కనీసం నిలబడేందుకు కూడా చోటు లేకపోవడంతో రోడ్లపై నిలబడి బస్సుల కోసం పడిగాపులు కాస్తుంటారు. ప్రస్తుత వర్షాకాలంలో చినుకులు పడితే ఎక్కడా ఉండలేని పరిస్థితి ఉంటుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి అవసరమైన చోట బస్ షెల్టర్లు నిర్మించాలని కోరుతున్నారు. కనీస సౌకర్యాలు కరువు బస్సుల కోసం వేచి చూసే సమయంలో తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక జనం ఇక్కట్లకు గురవుతున్నారు. తాము వెళ్లే బస్సులు వచ్చే వరకు సమీపంలోని హోటళ్లను, ఆశ్రహిస్తున్నారు. బస్సుల కోసం వేచి చూసే ప్రయాణికులు కూర్చోవడానికి ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు స్పందించి అవసరమైన ప్రారంతాల్లో బస్ షెల్టర్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అందుబాటులోలేని బస్ షెల్టర్లు ఎండావానలో ప్రజలు, ప్రయాణికుల అవస్థలు పట్టించుకోని ఆర్టీసీ అధికారులు షెల్టర్లు ఏర్పాటు చేయాలి ప్రతి రోజు ప్రయాణికులు తాము వెళ్లే బస్సు వచ్చే వరకు నిరీక్షస్తుంటారు. కూర్చోడానికి స్థలం లేక రోడ్డుపైన నిలబడుతున్నారు. ఆర్టీసీ అధికారులు చొరవ చూపి రద్దీగా ఉండే ప్రాంతాల్లో బస్ షెల్టర్ను ఏర్పాటు చేయాలి. – సురేశ్, ప్రయాణికుడు, దుద్యాల్ -
వయోవృద్ధుల బాధ్యత సంతానానిదే
మోమిన్పేట: వయోవృద్ధుల పోషణ, సంక్షేమం వారి సంతానందేనని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. గురువారం తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ జిల్లా కార్యదర్శి జూకరెడ్డితో కలిసి వయోధికుల చట్టంపై రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వయోధికుల వేధింపుల చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. కార్యక్రమంలో మోమిన్పేట మండల అధ్యక్షుడు మల్లారెడ్డి ప్రధాన కార్యదర్శి నారాయణరెడ్డి పాల్గొన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ -
ప్రారంభించారు.. ప్రవేశం మరిచారు
వికారాబాద్: జిల్లా కేంద్రంలో ఆర్భాటంగా ప్రారంభించిన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నూతన భవనం నేటికీ అందుబాటులోకి రాలేదు. నెల రోజుల క్రితం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నూతన భవనాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే పూర్తిస్థాయిలో పనులు కాకపోవడం వల్లే ఆస్పత్రిని అందులోకి తరలించలేదని తెలిసింది. ప్రస్తుతం పాత భవనంలోనే చాలీ చాలనీ వసతులతో సేవలు అందిస్తున్నారు. దీంతో రోగులు, వైద్య సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. 330 పడకల సామర్థ్యంతో.. రెండున్నరేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం వికారాబాద్కు మెడికల్ కళాశాలను మంజూరు చేసింది. భవన సముదాయం, ఇతర వసతుల కోసం రూ.240 కోట్లు మంజూరు చేసింది. గత విద్యా సంవత్సరం వంద మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభమయ్యాయి. మెడికల్ కళాశాలతో పాటు అనుబంధం జనరల్ ఆస్పత్రి నిర్మాణానికి రూ.30 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో 330 పడకల సామర్థ్యం గల నూతన భవనాన్ని నిర్మించాల్సి ఉంటుంది. పట్టణ పరిధిలోని ఎస్ఏపీ కళాశాల ఎదుట నూతన భవన నిర్మాణం చేపట్టారు. తుది దశ పనులు జరుగుతుండగానే ప్రారంభించారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ వైద్య సేవలు అందిచడం సాధ్యం కాదని భావించిన అధికారులు ఆస్పత్రిని అక్కడికి తరలించలేదు. ప్రస్తుతం బస్టాండ్ రోడ్డులో గల ఏరియా ఆస్పత్రి పాత భవనంలో జనరల్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. ఇక్కడ వంద బెడ్లు కూడా లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. నత్తనడకన పనులు జిల్లా కేంద్రంలో రెండున్నరేళ్ల క్రితం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఏడాదిలోపు పనులు పూర్తి చేయాలని షరతు విధించారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులను సకాలంలో పూర్తి చేయలేదు. దాదాపు మూడేళ్లు కావస్తున్నా భవనం అందుబాటులోకి రాలేదు. గత ప్రభుత్వం సకాలంలో బిల్లుల చెల్లించకపోవడంతోనే పనుల్లో జాప్యం జరిగినట్లు తెలిసింది. ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తి చేశారు. భవనం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకముందే హడావుడిగా ప్రారంభించారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ రాంచంద్రయ్యను వివరణ కోరగా త్వరలో నూతన భవనంలోకి జనరల్ ఆస్పత్రిని మారుస్తామని తెలిపారు. రెండు నెలల్లో పూర్తిస్థాయిలో భవనం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. నెల రోజుల క్రితం జనరల్ ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి దామోదర నేటికీ అందుబాటులోకి రాని వైనం పాత భవనంలోనే సేవలు గదులు సరిపోక ఇబ్బంది పడుతున్న రోగులు -
తీరు మారేనా!
అవినీతికి అడ్డాగా మారిన తాండూరు ఎస్ఆర్ఓతాండూరు: అక్రమ రిజిస్ట్రేషన్లకు తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అడ్డాగా మారింది. అవినీతికి కేరాఫ్గా మారిన ఈ ఆఫీసులో డ్యూటీ చేసేందుకు రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు జంకుతున్నారు. తాండూరుకు వచ్చేందుకు ససేమిరా అంటున్నట్లు సమాచారం. రెండున్నరేళ్ల వ్యవధిలో ఒకరు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడగా మరో ఇద్దరు ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్లు అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడి సస్పెన్షన్కు గురయ్యారు. 2017 నుంచి నేటి వరకు తాండూరు కార్యాలయంలో 11 మందికి పైగా సబ్ రిజిస్ట్రార్లు విధులు నిర్వహించారు. వీరిలో ముగ్గురు మాత్రమే రెగ్యులర్ అధికారులు. ఏడాది నుంచి ఏడాదిన్నర కాలంలో ముగ్గురు అధికారులు బదిలీ చేయించుకొని ఇతర జిల్లాలకు వెళ్లారు. నాటి నుంచి ఇన్చార్జులే దిక్కయ్యారు. రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ సురేందర్ నాయక్ 16 నెలల పాటు విధులు నిర్వహించగా, చాంద్ బాషా ఏడాది పాటు పని చేశారు. 2024 నుంచి 25 ఫిబ్రవరి వరకు పుర్యనాయక్ రెగ్యులర్ బాధ్యతలు నిర్వహించారు. ఈయనపై డాక్యుమెంట్ రైటర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం, మరోవైపు స్థానిక నేతల నుంచి ఒత్తిడి పెంచడంతో చేసేది లేక బదిలీ చేయించుకొని వెళ్లారు. అప్పటి నుంచి సీనియర్ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగించారు. ప్రతి ఆరు నెలలకు ఒకరు చొప్పున ఇన్చార్జ్ రిజిస్ట్రార్గా కొనసాగుతున్నారు. 2020లో స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను ఆన్లైన్లో అనుసంధానం చేశారు. దీంతో కార్యాలయంలో జరిగే ప్రతి రిజిస్ట్రేషన్ వివరాలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలిసిపోతాయి. ఆన్లైన్ లోపాలను ఆసరాగా చేసుకొని కొందరు ఇన్చార్జులు అక్రమాలకు పాల్పడ్డారు. 2022 డిసెంబర్లో సబ్ రిజిస్ట్రార్గా పని చేసిన జమీరొద్దీన్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడి సస్పెన్షన్కు గురయ్యారు. గత నెలలో అనుమతులు లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారంటూ ఇద్దరు ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్లు ఫసీయొద్దీన్, పవన్పై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. రియల్ వ్యాపారులదే పెత్తనం తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రిజిస్ట్రేషన్ల జరుగుతున్నాయి. ఈ వ్యవహారంలో రియల్ వ్యాపారులు, పాత నేరస్తుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కూడా ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. కొంతమంది రియల్టర్లు అధికారుల ఇళ్లకు వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. డబుల్ రిజిస్ట్రేషన్లు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లకు ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు అప్పగించడంతో అవినీతి అక్రమాలు జోరందుకున్నాయి. గతంలో ఒకే ప్లాట్కు రెండు రిజిస్ట్రేషన్లు చేశారు. మున్సిపల్ రోడ్డుకు కూడా రిజిస్ట్రేషన్ చేశారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం ఎమ్మెల్యే మనోహర్రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్ అయినట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పారదర్శకంగా లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా కొందరు రియల్టర్లు ఎమ్మెల్యేను కలిసి సమస్య పరిష్కరించాలని కోరగా వారిని వెనక్కు పంపినట్లు తెలిసింది. తాండూరు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ప్రక్షాళన చేయాలని సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని కలిసి కోరినట్లు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి తెలిపారు. త్వరలోనే తాండూరు కార్యాలయానికి రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ వస్తారని పేర్కొన్నారు. కార్యాలయాన్ని శాశ్వత భవనంలోకి మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఆ సమయంలోనే అక్రమాలు మూడు నెలల క్రితం తాండూరు సబ్ రిజిస్ట్రార్ పుర్య బదిలీ అయ్యారు. దీంతో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న సాయికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. అప్పట్లో 20 రోజుల పాటు విధులు నిర్వహించిన ఆయన 27 రోజుల పాటు సెలవుపై వెళ్లారు. ఆ సమయంలో జూనియర్ అసిస్టెంట్గా ఉన్న పవన్కు బాధ్యతలు అప్పగించారు. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకొని పవన్ 10 రోజుల వ్యవధిలో 70 ప్లాట్లకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారు. ఆ తర్వాత ఆయన కూడా సెలవులో వెళ్లిపోయారు. దీంతో మరో జూనియర్ అసిస్టెంట్ ఫసియొద్దీన్కు బాధ్యతలు అప్పంగించారు. రోజుకు దాదాపు 50 చొప్పున ఐదు రోజుల వ్యవధిలో 200 రిజిస్ట్రేషన్లు చేశారు. ఉన్నతాధికారులకు అనుమానం రావడంతో విచారణకు ఆదేశించారు. దీంతో అసలు విషయం బయట పడింది. పది రోజుల క్రితం ఫసియొద్దీన్ను సస్పెండ్ చేశారు. ఉన్నతాధికారుల ఆడిట్లో పవన్ సైతం అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు తేలింది. దీంతో ఆయన్ను కూడా సస్పెండ్ చేశారు. ఇప్పటికే ముగ్గురిపై సస్పెన్షన్ వేటు రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ లేకపోవడంతో అక్రమాలు ప్రక్షాళణ దిశగా ప్రభుత్వం తాండూరుకు వచ్చేందుకు జంకుతున్న అధికారులు -
పర్యావరణాన్ని కాపాడుకుందాం
అనంతగిరి: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం వికారాబాద్ కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పర్యావరణంలో వస్తున్న మార్పులను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నా టాలన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి చంద్రకిశోర్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి వెంకటేశ్వర్లు, పీపీలు దీపారాణి, అన్వేష్సింగ్, సమీనాబేగం, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. 14న జాతీయ లోక్అదాలత్ ఈ నెల 14న జరిగే జాతీయ లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్ కోర్టు ఆవరణలో లోక్అదాలత్పై జిల్లా పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజీపడదగ్గ కేసులను అధిక సంఖ్యలో రాజీపడేలా చూడాలని ఆదేశించారు. లోక్ అదాలత్లో రాజీకుదుర్చుకుంటే ఇద్దరు గెలిచినట్లే అవుతుందన్నారు. రాజీమార్గమే రాజమార్గమన్నారు. ఈ విషయంలో పోలీసులు ఆయా పీఎస్ల వారీగా రాజీకీ అస్కారం అవకాశం ఉన్న కేసులు ఉన్న వారిని రాజీకుదుర్చుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి చంద్రకిశోర్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జడ్జి వెంకటేశ్వర్లు, ఎస్పీ నారాయణరెడ్డి, పబ్లిక్ ప్రాస్యిక్యూటర్ దీపారాణి అన్వేష్సింగ్, సమీనాబేగం, డీఎస్పీలు శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్, బాలకృష్ణారెడ్డి, దానయ్య, సీఐలు భీంకుమార్, సంతోష్, నగేష్, శ్రీనివాస్రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్రెడ్డి -
భూ భారతితో సమస్యల పరిష్కారం
బొంరాస్పేట: భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తెలిపారు. గురువారం మండలంలోని ఎన్కేపల్లి, తిర్మలాపూర్ గ్రామాలకు సంబంధించి ఎన్కేపల్లిలో రెవెన్యూ సదస్సును నిర్వహించారు. తిర్మలాపూర్ నుంచి ఎలాంటి వినతులు రాలేదు. ఎన్కేపల్లిలో 9 దరఖాస్తులు అందాయని తహసీల్దార్ పద్మావతి తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఐలు రవి, శైలజ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ -
ప్లాస్టిక్ రహిత జిల్లాగా మారుద్దాం
అనంతగిరి: వికారాబాద్ను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మారుద్దామని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ కాలుష్యం అంతం చేద్దాం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకం పెరిగి చివరకు మనం తీసుకునే ఆహారంలో కూడా చేరుతోందని తెలిపారు. ఇది మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటి వాటిని కాపాడుకోవాలన్నారు. అనంతరం అనంతగిరి అర్బన్ పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్, అటవీ రేంజ్ ఆఫీసర్లు శ్యామ్ కుమార్, రాజేందర్, ప్రతిమ, అటవీ సెక్షన్ అధికారి అరుణ, ఉద్యాన్ కేర్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, విద్యార్థినులు, సత్యసాయి సేవా ట్రస్ట్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం పరిశీలన జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో గల ఈవీఎం గోదామ్ను గురువారం కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోదాం సీల్ను ఓపెన్ చేశారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సంబంధిత రికార్డులను పరిశీలించి సంతకాలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ఆర్డీఓ వాసుచంద్ర, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు నెమత్ హాలీ, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారానికే సదస్సులు బంట్వారం: భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గురువారం కోట్పల్లి మండలం రాంపూర్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును ఆయన సందర్శించారు. భూ సమస్యలపై రైతులు ఇచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని తహసీల్దార్ శ్రీనివాస్కు సూచించారు. అనంతరం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. స్థానికుల సహకారంతో బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. పిల్లలందరూ బడిలోనే ఉండేలా చూడాలన్నారు. బాల్య వివాహాల నిర్మూలన కోసం ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రేషన్ షాపుల్లో మూడు నెలలకు సంబంధించిన సన్న బియ్యం పంపిణీపై ఆరా తీశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, ఆర్డీఓ వాసుచంద్ర, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం -
పిచ్చి.. పరాకాష్ట
తాండూరు టౌన్: పిచ్చి పరాకాష్టకు చేరిందంటే ఇదేనేమో.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో తన ఫెవరేట్ జట్టు కాకుండా, వేరే జట్లు గెలిస్తే అరగుండు కొట్టించుకొని, మెడలో చెప్పుల దండ వేసుకుని బస్టాండులో తిరుగుతానని తాండూరు ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఇన్స్ట్రాగ్రామ్లో పోస్టు పెట్టాడు. ఈ నెల 3న జరిగిన ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ జట్టు ఓడిపోయి.. ఆర్సీబీ గెలిచిన విషయం తెలిసిందే. దీంతో సదరు యువకుడు చాలెంజ్ చేసిన విధంగా అరగుండు కొట్టించుకొని, మెడలో చెప్పుల దండ వేసుకుని బుధవారం తాండూరు బస్టాండులో తిరిగాడు. ఈ వీడియోను తిరిగి పోస్టు చేసి చాలెంజ్ను నిలబెట్టుకున్నానంటూ చెప్పడం విశేషం. అంతేకాకుండా క్వాలిఫయర్ 2 మ్యాచ్లో ముంబై, పంజాబ్ జట్లు తలపడతుండగా పంజాబ్ గెలిస్తే షర్టు లేకుండా చౌరస్తాలో తిరుగుతానని ఇన్స్ట్రాగాంలో పోస్టు పెట్టాడు. ఆ రోజు మ్యాచ్లో పంజాబ్ గెలవడంతో షర్టు విప్పి అర్ధనగ్నంగా తాండూరు చౌరస్తాలో తిరిగాడు. ఇలా షర్టు లేకుండా తిరగడం, అరగుండు, మెడలో చెప్పుల దండతో తిరిగిన యువకున్ని చూసి జనాలు అవాక్కయ్యారు. పిచ్చి ముదిరితే ఇలాంటి చేష్టలే చేస్తారని, ఈ రోజు చేసిన ఈ చిన్న చాలెంజ్, భవిష్యత్లో పెద్ద పెద్ద చాలెంజ్లు చేసే పరిస్థితికి వస్తుందని జనాలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. యువకులు క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలే తప్ప, ఇలాంటి చాలెంజ్లు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోరాదని హితవు పలుకుతున్నారు. ఆర్సీబీ గెలిచినందుకు అరగుండు, చెప్పుల దండతో తిరిగిన యువకుడు ఇన్స్టా గ్రామ్లో చేసిన చాలెంజ్ను నిలబెట్టుకున్నానంటూ పోస్టు -
జాతీయ రహదారిపై పత్తాలేని పెట్రోలింగ్!
పరిగి: జాతీయ రహదారి వెంట ఎక్కడా పోలీసులు కనిపించడం లేదు. క్రమం తప్పకుండా గస్తీ నిర్వహిస్తూ అనుక్షణం పర్యవేక్షించాల్సిన వాహనాలు సైతం పత్తాలేకుండా పోయాయని ప్రజలు, ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రమా దాలు జరిగిన సమయంలో వెంటనే స్పందించే వారు లేక క్షతగాత్రులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్డుపై యాక్సిడెంట్లను నివారించడంతో పాటు ప్రమాదాలు జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు హైవే పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. కానీ వీటిలో ఎవరూ అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైవేలపై నిత్యం యాక్సిడెంట్లు చోటు చేసుకుంటున్నా పోలీసులు ఎందుకు స్పందించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. హైదారాబాద్ నుంచి కర్ణాటక వెళ్లేందుకు హైదారాబాద్– బీజాపూర్ మార్గం ఒక్కటే ఉంది. మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలు సైతం ఈరూట్లోనే రాకపోకలు సాగిస్తాయి. రద్దీ కారణంగా ఈ రోడ్డుపై తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. హైవే పెట్రోలింగ్ పోలీసుల అలసత్వంతోనే ఈ పరిస్థితి ఎదురవుతోందనే ఆరోపణలున్నాయి. రెండు హైవే పోలీస్ స్టేషన్లు పూడూర్ మండలం అంగడి చిట్టంపల్లి నుంచి కొడంగల్ మండలం రావులపల్లి వరకు జిల్లాలో జాతీయ రహదారి విస్తరించి ఉంది. ఈమార్గంలో రెండు హైవే పెట్రోలింగ్ పోలీస్ స్టేషన్లు ఉన్నప్పటికీ నామమాత్రంగానే సేవలు అందిస్తున్నాయి. ఎనిమిదేళ్ల క్రితం మన్నెగూడ, కొడంగల్లో వీటిని ఏర్పాటు చేశారు. అప్పట్లో పూర్తి స్థాయి సిబ్బందిని నియమించినా ప్రస్తుతం ఒక స్టేషన్లో ఒక ఎస్ఐ, నలుగురు సిబ్బంది మాత్రమే ఉన్నారు. అరకొర సిబ్బందితో విధులు సక్రమంగా నిర్వహించడం లేదనే ఆరోపణాలున్నాయి. మన్నెగూడలో ఏర్పాటు చేసిన హైవే పెట్రోలింగ్ స్టేషన్ సిబ్బంది అంగడిచిట్టంపల్లి నుంచి గడిసింగాపూర్, కొండంగల్ పీఎస్ సిబ్బంది రావుపల్లి నుంచి గడిసింగాపూర్ వరకు విధులు నిర్వహించాలి. కానీ వీరు ఏ ఒక్క రోజు కూడా కనిపించడం లేదని ప్రజలు చెబుతున్నారు. నిత్యం ప్రమాదాలు జాతీయ రహదారిపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలుపుతున్నారు. రాత్రి వేళ వీటిని ఢీకొట్టి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు వెంట పోలీసులు, పెట్రోలింగ్ వాహనాలు లేకపోవడంతో కొంత మంది ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, ఇప్పటికై నా హైవే పెట్రోలింగ్ పెంచాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. కనిపించని గస్తీ వాహనాలు జిల్లా పరిధిలో రెండు పీఎస్లు ఉన్నా సేవలు అంతంతే హైదారాబాద్– బీజాపూర్ హైవేపై నిత్యం ప్రమాదాలు పట్టించుకోని పోలీసు అధికారులు వెంటనే స్పందిస్తున్నారు జాతీయ రహదారిపై రెండు పెట్రోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. రెండు షిఫ్టులుగా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. హైవేపై ప్రమాదాలు జరిగిన వెంటనే మా అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించి సకాలంలో చర్యలు తీసుకుంటున్నారు. – శ్రీనివాస్, పరిగి డీఎస్పీ -
పద్మమ్మ అంత్యక్రియలకు హాజరైన మాజీ మంత్రి
ధారూరు: చింతకుంట గ్రామంలో గురువారం మృతి చెందిన పద్మమ్మ అంత్యక్రియలకు మాజీ మంత్రి సబితారెడ్డి హాజరయ్యారు. స్వర్గీయ ఇంద్రారెడ్డి అక్క, సబితారెడ్డికి వదిన మృతి చెందినట్లు సమాచారం అందటంతో కొడుకు కారిక్రెడ్డితో కలిసి చింతకుంటకు చేరుకున్నారు. వీరితో పాటు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మెతుకు ఆనంద్, మండల అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మెన్ కృష్ణారెడ్డి, హరిదాస్పల్లి పీఏసీఎస్ చైర్మెన్ వెంకట్రెడ్డి తదితరులు కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
అటవీ భూమి కబ్జా
బషీరాబాద్: మండలంలోని మైల్వార్ రిజర్వుడు ఫారెస్టులో 5 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. నీళ్లపల్లి ఫారెస్టు సెక్షన్లోని సర్వేనంబర్ 20లో ఇస్మాయిల్పూర్ తండాకు చెందిన బలరాం నాయక్, రెడ్యానాయక్, భీమ్లానాయక్ గుట్టుచప్పుడు కాకుండా విత్తనాలు నాటారు. విషయం తెలుసుకున్న బషీరాబాద్ ఫారెస్టు సెక్షన్ అధికారి స్నేహశ్రీ, బీట్ అధికారి మల్లప్ప గురువారం అక్కడికి చేరుకొని కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఇదే భూమి విషయం కోర్టులో కేసునడిచింది. కొన్ని నెలల తర్వాత అవీ అటవీ భూములేనని కోర్టు కూడా తీర్పు ఇచ్చిందని వ్యవసాయ అధికారులు గుర్తు చేశారు. అటవీ భూములు కబ్జా చేసి సాగు చేయడం చట్టరీత్య నేరమన్నారు. వెంటనే ఆ భూముల్లో గోతులు తీయించారు. త్వరలో మొక్కలు నాటుతామని అధికారులు తెలిపారు. రైతుల వాగ్వివాదం.. కబ్జాకు గురైన భూమిని స్వాధీనానికి వెళితే సాగు చేసిన రైతులు వారిపై గొడవకు దిగారు. తాము ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్నామని తమ భూమిని ఎలా స్వాధీనం చేసుకుంటారని అధికారులతో వాగ్వివాదానికి దిగారు. అధికారులు కేసులు పెడుతామని హెచ్చరించడంతో రైతులు వెనుకంజ వేశారు. ● ఇస్మాయిల్పూర్లో 5 ఎకరాల్లో విత్తనాలు నాటిన రైతులు ● అడ్డుకున్న ఫారెస్టు అధికారులు ● ఆందోళనకు దిగిన అన్నదాతలు -
దిగబడిన వరిధాన్యం లారీ
తాండూరు: తాండూరు డీసీఎంఎస్ కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద వరిధాన్యం లోడ్ లారీ దిగబడింది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. డీసీఎంఆర్ ద్వారా కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని తాండూరు డీసీఎంఎస్ కార్యాలయ ప్రాంగణంలోని గిడ్డంగుల్లో నిల్వ చేస్తున్నారు. అందులో భాగంగా యాలాల మండలం నుంచి 18 టైర్లు కలిగిన పెద్ద లారీలో వరి ధాన్యంతో డీసీఎంఎస్ గేట్లోకి ప్రవేశించింది. ఇటీవల రోడ్డు వెడల్పుతో డీసీఎంఎస్ గేట్ వద్ద గుంతలా మారింది. దీంతో లారీ రెండు వైపులా ఇరుక్కుపోయి అక్కడే ఆగిపోయింది. బుధవారం రాత్రి నుంచి లారీని పక్కకు తప్పించేందుకు ప్రయత్నించినా వీలు కాలేదు. మరోసారి గురువారం ఉదయం లారీని పక్కకు తప్పించేందుకు ప్రయత్నించారు. వీలు కాకపోవడంతో లారీలో ఉన్న ధాన్యం బస్తాలను దింపి పక్కకు తప్పించారు. దీంతో కొనుగోలు కేంద్రాల నుంచి లోడ్తో వచ్చిన లారీలు రోజంతా నిలిచిపోయాయి. డీసీఎంఎస్ గేట్ దాటుతుండగా ఘటన గోదాంలలోకి వాహనాల రాకపోకలకు అంతరాయం -
ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి
మున్సిపల్ కమిషనర్ రవీంద్రసాగర్ఇబ్రహీంపట్నం: ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా సహకరించాలని మున్సిపల్ కమిషనర్ రవీంద్రసాగర్ కోరారు. 100 రోజుల స్పెషల్ డ్రైవ్లో భాగంగా గురువారం నాలుగోరోజు ఇబ్రహీంపట్నంలో దుకాణాలను తనిఖీలు చేసి ప్లాస్టిక్ ఉపయోగిస్తున్న వాటికి ఫెనాల్టీ విధించారు. అనంతరం మొక్కలు నాటి పర్యావరణంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ కవర్స్ వాడకంతో పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటోందని అన్నారు. కాలుష్య వాతావరణం ఏర్పడి మనుషులతోపాటు పశుపక్ష్యాదులపై దీని ప్రభావం పడుతుందన్నారు. దుకాణాల్లో వ్యాపారస్తులు ప్లాస్టిక్ కవర్స్ను ఉపయోగించొద్దని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ ప్రవీణ్రెడ్డి, పర్యావరణ ఇంజనీర్ ప్రణవ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
పట్టుబడ్డ గంజాయిని కొట్టేసి..
షాద్నగర్ రూరల్: వచ్చే జీతంతో తృప్తి పడని ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ పని చేసే స్టేషన్లోనే గతంలో పట్టుబడిన గంజాయిని దొంగిలించి.. విక్రయిస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటన పట్టణంలోని ఫరూఖ్నగర్ ఈద్గా వద్ద చోటుచేసుకుంది. పట్టణ సీఐ విజయ్కుమార్ గురువారం వివరాలు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా తాండూరు ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్లో గులామ్ సుల్తాన్ అహ్మద్ ఎకై ్సజ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. జల్సాలకు అలవాటుపడ్డ అతను వచ్చే వేతనం సరిపోక అక్రమ మార్గం ఎంచుకున్నాడు. వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తూ విలాస జీవితానికి అలవాటుపడ్డాడు. అక్కడ దొంగిలించి.. ఇక్కడ విక్రయిస్తూ స్టేషన్లో గతంలో పట్టుబడిన గంజాయిని గులామ్ సుల్తాన్ అహ్మద్ దొంగిలించేవాడు. దానికి తనకు వరుసకు కుమారుడైన షాద్నగర్ పట్టణానికి చెందిన అంజాద్కు విక్రయించేందుకు అప్పగించేవాడు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న రూ.75 వేల విలువ చేసే కిలోన్నర గంజాయిని విక్రయించేందుకు అంజాద్ బుధవారం రాత్రి ఈద్గా సమీపంలోకి చేరుకున్నాడు. అదే సమయంలో ఎస్ఐ దేవరాజ్ అధ్వర్యంలో సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అంజాద్ కవర్ పట్టుకొని అనుమానాస్పదంగా తచ్చాడడం గమనించారు. అతడి వద్ద ఉన్న కవర్ను పరిశీలించగా అందులో గంజాయి ఉన్నట్టు గుర్తించారు. దీంతో విచారించగా నేరం అంగీకరించాడు. ఈ మేరకు ఇద్దరినీ రిమాండ్కు తరలించారు. కేసు విచారణలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను శంషాబాద్ డీసీపీ రాజేశ్, అడిషనల్ డీసీపీ పూర్ణచందర్, ఏసీపీ లక్ష్మీనారాయణ అభినందించారు. బంధువు ద్వారా విక్రయం ఎకై ్సజ్ కానిస్టేబుల్ నిర్వాకం పోలీసుల అదుపులో నిందితులు -
ప్రభుత్వ భూములను కాపాడండి
మొయినాబాద్ రూరల్: మండలంలోని తోల్కట్ట రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములను కాపాడాలని పలువురు గ్రామస్తులు గురువారం డిప్యూటీ తహసీల్దార్ వినోద్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ విషయమై పలుమార్లు మండల, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని తెలిపారు. ఎక్స్ సర్వీస్మెన్ల పేరుతో ప్రభుత్వ అనుమతి లేకుండా కబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. కొంతమంది బడాబాబులకు అసైన్డ్ పట్టాలు, పాసు పుస్తకాలు జారీ చేస్తున్నారని ఆరోపించారు. పేదలు సాగు చేసుకునేందుకు మాత్రం అనుమతించడం లేదని మండిపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ఒకే సర్వే నంబర్లోని భూమిని ఇద్దరు సోదరుల్లో ఒకరికి పట్టా చేసి, మరొకరికి లావణి పట్టాలు ఇస్తున్నారని ఆరోపించారు. భూ భారతిలోనైనా బాధితులకు న్యాయం చేయాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో గ్రామస్తులు భిక్షపతి, జంగయ్య, మల్లయ్య, వెంకటయ్య తదితరులు ఉన్నారు. రెవెన్యూ సదస్సులో తోల్కట్టవాసుల వినతి -
మొక్కల సంరక్షణతోనే మనుగడ
కుల్కచర్ల: మొక్కల సంరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని కుల్కచర్ల ఎంపీడీఓ రామకృష్ణ అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుల్కచర్ల మండలం కామునిపల్లి గ్రామంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పచ్చదనంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ అనితారెడ్డి, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు మోర వెంకటయ్య, రఘునాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అల్లిపూర్లో.. ధారూరు: అల్లిపూర్ గ్రామంలో ధారూరు ఎంపీడీఓ నర్సింహులు, కాంగ్రెస్ నాయకుడు గంధం హన్మయ్యతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. ప్రతీ ఇంటి ఆవరణలో మొక్క నాటి పెంచాలన్నారు. గ్రామ కార్యదర్శి సునీత తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు కృషి.. కొడంగల్ రూరల్: పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ కృషిచేయాలని మున్సిపల్ కమిషనర్ బలరాంనాయక్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో వారు మొక్కలు నాటారు. వైస్ ప్రిన్సిపాల్ రఫియాఖానం, ఐక్యూఏసీ కో ఆర్డినేటర్ టి రాంబాబు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు ఆర్ శ్రీనివాస్, డాక్టర్ ఈ సోమ్లా తదితరులు పాల్గొన్నారు. విరివిగా మొక్కలు నాటాలి కొడంగల్: ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని కొడంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో మండల లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. బార్ అసోషియేషన్ వైస్ ప్రెసిడెంట్ బస్వరాజు, న్యాయవాదులు బి.కృష్ణయ్య, కె.రమేష్, మొహీద్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దుద్యాల్లో.. దుద్యాల్: హకీంపేట్ గ్రామంలో డాక్టర్ వందన ప్రధాన వీధుల గుండా తిరుగుతూ పర్యావరణంపై అవగాహన కల్పించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటారు. పంచాయతీ కార్యదర్శి ఆనందం, మండల కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి, ఎంఎల్హెచ్పీ నర్సమ్మ, అంగన్వాడీ టీచర్ రామేశ్వరి, ఏఎన్ఎం విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కుల్కచర్ల ఎంపీడీఓ రామకృష్ణ -
దివ్యాంగుల భవనాన్ని ప్రారంభించాలి
హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ పరిగి: పరిగి పట్టణ కేంద్రంలో నిర్మించిన దివ్యాంగుల భవనాన్ని వెంటనే ప్రారంభించాలని భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్ డిమాండ్ చేశారు. బుధవారం పరిగి పట్టణ కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్ అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. 2018లో కేసీఆర్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం దృష్ట్యా దాదాపు రూ.7 లక్షల వ్యయంతో నిర్మించారని గుర్తు చేశారు. ఆ భవనాన్ని నేటికీ ప్రారంభించకపోవడం బాధాకరమన్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఈ విషయంలో చొరవ చూపి వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకొవాలన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరి ఈదయ్య బాబు, సంఘం పరిగి నియోజకవర్గ ఇంచార్జ్ లక్ష్మయ్య, మండల అధ్యక్షుడు పసుల చంద్రయ్య, ఉపాధ్యక్షుడు నారాయణ, దోమ మండల అధ్యక్షుడు చుక్కయ్య తదితరులు పాల్గొన్నారు. -
పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ల్లు
నవాబుపేట: పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. మండల పరిధిలోని ఎక్మామిడి, మాదిరెడ్డిపల్లి, మైతాప్ ఖాన్ గూడ, ఎల్లకొండ గ్రామాల్లో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరైన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, సంక్షేమమే ధ్యేయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్న ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అనురాధ, ఎంపీఓ విజయ్ కుమార్, నాయకులు చిట్టెపు మల్లారెడ్డి, వెంకట్ రెడ్డి, ప్రభాకర్, రంగారెడ్డి, ఎండి రఫీ, ప్రకాష్, గ్రామస్తులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య -
భూ భారతితో సమస్యల పరిష్కారం
తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ కొడంగల్: భూ భారతితో భూ వివాదాలు పరిష్కారం అవుతాయని తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని టేకుల్కోడ్ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడారు. భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తహశీల్దార్ విజయ్కుమార్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సమస్యలు ఉంటే తెలియజేయండి దుద్యాల్: భూ భారతి చట్టం రైతులకు చుట్టంలాంటిదని తహసీల్దార్ కిషన్ అన్నారు. ఈర్లపల్లి గ్రామంలో రైతు సదస్సులో మాట్లాడుతూ ఎలాంటి సమస్య ఉన్నా, ఫిర్యాదులు చేయాలన్నారు. ఉప తహసీల్దార్ వీరేశ్ బాబు, ఆర్ఐ నవీన్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ ఫకీరప్ప, రికార్డు అసిస్టెంట్ ఊషప్ప తదితరులు పాల్గొన్నారు. రైతులకు మేలు.. కుల్కచర్ల: భూ భారతి సదస్సులతో రైతులకు మేలు చేకూరనుందని తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి అన్నారు. పుట్టపహాడ్ రెవెన్యూ సదస్సులో మాట్లాడుతూ..భూములకు సంబంధించిన సమస్యలపై అవగాహన లేకపోవడంతోనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. దీంతో సమస్యలను నేరుగా అధికారులకు చెప్పుకునే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. డిప్యూటి తహశీల్దార్ చంద్రశేఖర్, గిర్దవరులు ఖాజ, రవి, తదితరులు పాల్గొన్నారు. సమస్యల పనిష్కారానికే.. బంట్వారం: భూ సమస్యల పరిష్కారినికే సదస్సులు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ తహశీల్దార్ మహేష్ అన్నారు. సుల్తాన్పూర్, నూరుల్లాపూర్ సదస్సులో 26 దరఖాస్తులను డీటీ మహేశ్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రాంగోపాల్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. కోట్పల్లి మండలంలో.. కోట్పల్లి మండలంలోని ఇందోల్, ఓగులాపూర్ గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో రైతుల నుంచి 11 దరఖాస్తులు స్వీకరించినట్లు తహశీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. రెవెన్యూ సదస్సుకు దరఖాస్తుల వెల్లువ యాలాల: భూ భారతి రెవెన్యూ సదస్సులో ఆరు దరఖాస్తులు వచ్చినట్లు తహశీల్దార్ వెంకటస్వామి తెలిపారు. చెన్నారంలో 3, ఎన్కెపల్లిలో 1, నాగసముందర్లో 2 వచ్చాయన్నారు. డీటీ కిరణ్కుమార్, ఆర్ఐ వేణు, జూనియర్ అసిస్టెంట్ విజయ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. మోమిన్పేటలో.. మోమిన్పేట: కోల్కుంద, రావులపల్లి గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో 10 దరఖాస్తులు వచ్చాయని తహశీల్దార్ రవీందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సురేష్కుమార్, అర్ఐలు గోవర్ధన్, సరిత, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సద్వినియోగం చేసుకోవాలి తాండూరు రూరల్: రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలని తాండూరు తహశీల్దార్ తారాసింగ్ అన్నారు. వీర్శెట్టిపల్లి, గోనూర్ గ్రామా ల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. గోనూర్లో–11, వీర్శె ట్టిపల్లిలో ఎలాంటి దరఖాస్తులు రాలేదని తహశీల్దార్ తెలిపారు. డిప్యూటీ తహశీల్దార్ లలిత, ఆర్ఐ గోపి తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల స్వీకరణ దోమ: ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపడుతున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ గోవిందమ్మ అన్నారు. పోతిరెడ్డిపల్లి, బట్లచందారం గ్రామంలో నిర్వహించిన సదస్సులో 19 దరఖాస్తులు స్వీకరించారు. డిప్యూటీ తహశీల్దార్ నర్సింహులు, ఆర్ఐలు సుదర్శన్, రాంచంద్రరావు, సీనియర్ అసిస్టెంట్ పర్వేజ్, జూనియర్ అసిస్టెంట్ సరిత, యాదయ్య, మోహన్, శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
అటవీ భూమిలో ఇంటి నిర్మాణం
కుల్కచర్ల: అటవీ భూమిలో ఇంటి నిర్మాణాన్ని అడ్డుకున్న ఆ శాఖ అధికారిపై దురుసుగా ప్రవరించిన వ్యక్తులపై కేసు నమోదు చేసిన ఘటన కుల్కచర్ల మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చెరువుముందలి తండా(కే)కు చెందిన కేతావత్ భాషా, అతని కుమారుడు నంద్యనాయక్ అటవీ భూమిలో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ శ్రీధర్ మంగవారం ఇంటి నిర్మాణాన్ని అడ్డుకున్నారు. దీంతో కేతావత్ భాషా, నంద్యనాయక్ శ్రీధర్ను అసభ్య పదజాలంతో ధూషించారు. దీంతో శ్రీధర్ బుధవారం కుల్కచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. అడ్డుకున్న అధికారిపై దూషణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు -
రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
అనంతగిరి: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. హెడ్కానిస్టేబుల్ హరిప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గొల్లగూడ – చిట్టిగడ్డ రైల్వే స్టేషన్ల మధ్య ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు అధికారులు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని రైల్వే పోలీసులు పరిశీలించారు. మృతుడి వయస్సు 30 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. చేతి మణికట్టుకు నలుపు, పసుపు, ఎరుపు రంగు కలిగిన దారం ఉందని తెలిపారు. మృతుని ఒంటిపై నలుపు రంగు నైట్ ప్యాంట్, నలుపు రంగు టీ షర్ట్ ఽఉందన్నారు. మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురికి తరలించి భద్రపరిచారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు. అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు ● త్రుటిలో తప్పిన ప్రమాదం ● పలువురికి స్వల్ప గాయాలు యాలాల: స్టీరింగ్ రాడ్ పనిచేయకపోవడంతో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పింది. ఈ ఘటనలో పలువురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటన బుధవారం మండం పరిధిలోని గోరేపల్లి శివారులో జరిగింది. దేవనూరు నుంచి తాండూరు వైపు సుమారు 50 మంది ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు వెళుతుంది. గోరేపల్లి శివారులోని మలుపు వద్ద స్టీరింగ్ రాడ్ పనిచేయకపోవడంతో అదుపుతప్పి రోడ్డు కిందకు దిగింది. ఈ ఘటనలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ గిరి తెలిపారు. ఇంట్లో గంజాయి.. వ్యక్తి అరెస్టు తాండూరు టౌన్: గంజాయి ఉన్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు తాండూరు ఎకై ్సజ్ శాఖ ఇన్చార్జ్ సీఐ కె.శ్రీనివాస్ బుధవారం తెలిపారు. పక్కా సమాచారం మేరకు తాండూరు ఎకై ్సజ్ పోలీసులు, జిల్లా టాస్క్ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామంలో మహ్మద్ మియా అనే వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించామన్నారు. అతను సేవించేందుకు కొనుగోలు చేసిన 125 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితున్ని అరెస్టు చేసి బుధవారం రిమాండ్కు తరలించినట్లు ఇన్చార్జ్ సీఐ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎకై ్సజ్ ఎస్సైలు ఆదిశేషు రెడ్డి, నిజాముద్దీన్, సిబ్బంది భీమయ్య, రవి, కిషోర్, రాధిక, ఆసిఫాబేగం, రవికిరణ్ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు కుల్కచర్ల: ప్రమాదవశాత్తు ముందు ఉన్న బైక్ను ఢీ కొని క్రిందపడి తీవ్రగాయాలైన ఘటన కుల్కచర్ల మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బుధవారం కుల్కచర్ల మండలం తిర్మలాపూర్ గేటు దగ్గరలో ఘండిచెరువు గాదె కాలనీకి చెందిన తిరుపతయ్య కుల్కచర్ల వైపునకు వెళ్తున్నక్రమంలో ముందు ఉన్న వాహనాన్ని తగిలి అదుపుతప్పి క్రింద పడిపోయాడు. ఈ ఘటనలో తిరుపతయ్యకు తీవ్రగాయాలు అవ్వడంతో 108లో మహబూబ్నగర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం అనంతగిరి: ముఖ్యమంత్రి విదేశీ విద్యా పథకం (సీఎం ఓవర్సిస్ స్కాలర్షిప్ పథకం) కింద విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించే మైనార్టీ విద్యార్థులకు(ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, జైనులు, బుద్దిస్ట్, పార్మీలు)నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికా రి రాజేశ్వరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 7993357103, 8978964132లలో సంప్రదించాలన్నారు. నేడు గౌతాపూర్లో రెవెన్యూ సదస్సు తాండూరు రూరల్: మండలంలోని గౌతాపూ ర్, బిజ్వార్ గ్రామాల్లో గురువారం రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ తారాసింగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బిజ్వార్ అనుబంధ గ్రామం బొంకూర్ తోపాటు గౌతాపూర్ అనుబంధ గ్రామం గోపన్పల్లిలో సదస్సులు ఉంటాయని ఆయన తెలిపారు. -
బాల్య వివాహాలు చేస్తే చర్యలు
కుల్కచర్ల: మండల కేంద్రంలో గురువారం బాల్యవివాహం చేస్తున్నారనే సమాచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు గ్రామానికి చేరుకొని రెండు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బాల్య వివాహాలు చేస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కుల్కచర్లకు చెందని బాలిక(15)ను దాదాపూర్ గ్రామానికి చెందిన యువకుడికి ఇచ్చి గురువారం వివాహం చేయాలని భావించారు. ఈ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు స్థానిక పోలీసులతో వారి ఇళ్లకు వెళ్లి పెళ్లి నిలిపివేయాలని సూచించారు. అనంతరం ఐసీడీఎస్ సూపర్వైజర్ అంజమ్మ మాట్లాడుతూ.. చిన్న వయస్సులో పెళ్లి చేస్తే బాలిక ఆరోగ్యం దెబ్బతింటుంనది తెలిపారు. బాల్యవివాహాలకు సహకరించినా నేరమని పేర్కొన్నారు. విద్యుదాఘాతంతో బాలుడి మృతి దుద్యాల్: విద్యుదా ఘాతంతో బాలుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కుదరుమల్లలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన కుర్వ నర్సిములు సునీత కుమారుడు భానుప్రసాద్(13). వారికి ఇంటికి దగ్గర్లలోనే పశువుల పాక ఉంది. అక్కడ పశువులను చూడడానికి వెళ్లిన భాను ప్రసాద్ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు. ఈ సంఘటనతో గ్రామంలో విషదచాయలు అలుముకున్నాయి. -
బడిబాటకు సన్నద్ధం
● రేపటి నుంచి 19 వరకు కార్యక్రమాలు ● ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపే లక్ష్యంగా ముందుకు.. దౌల్తాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపే లక్ష్యంగా విద్యాశాఖ బడిబాట కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమైంది. జూన్ 6 నుంచి 19వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఉపాధ్యాయులు బడిబయట బడీడు పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించనున్నారు. ప్రభుత్వ పాఠశాలలు సాధించిన ప్రగతి, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలపై ప్రచారం చేయనున్నారు. గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇటీవల మండల కేంద్రంలో ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ కూడా ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలపై సమ్మకం పెంచేలా.. మండల వ్యాప్తంగా 45 ప్రభుత్వ పాఠశాలలు ఐదు ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 4,800 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను 20శాతం పెంచాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే సర్కారు బడులపై ప్రజల్లో ఉన్న అపోహాలను తొలగించి నమ్మకం పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయనున్నారు. నాణ్యమైన విద్య, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, భోజన వసతి వంటి వాటి గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేనున్నారు. అలాగే సాధించిన ఫలితాల గురించి వివరించనున్నారు. విజయవంతం చేస్తాం ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులే ఉంటారు. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన చేస్తారు. అలాగే ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, భోజన వసతి ఉంటుంది. వీటన్నింటినీ బడిబాట కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులకు వివరిస్తాం. తద్వారా విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తాం. – వెంకటస్వామి, ఎంఈఓ, దౌల్తాబాద్ -
పదకొండేళ్లు సుపరిపాలనే
అనంతగిరి: ప్రధాని నరేంద్రమోదీ పదకొండేళ్లు సుపరిపాలన అందించారని, ప్రపంచానికి ఆదర్శనాయకుడని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ అన్నారు. బుధవారం వికారాబాద్లో భారత ప్రధాని నరేంద్రమోదీ పాలన 11సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీజేపీ ఇచ్చిన నెల రోజుల కార్యాచరణపై ఒక్క రోజు వర్క్షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. నెలరోజులు పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆమె వివరించారు. 11 సంవత్సరాలు బీజేపీ చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. జిల్లా, మండల స్థాయిలో కార్యక్రమ ఇంచార్జిలను నియమించాలన్నారు. కేంద్రంలో నరేంద్రమోదీ పాలన అవినీతిరహిత పాలన అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్, కార్యక్రమ ఇంచార్జి శేరి శ్రీధర్రెడ్డి, మాజీ అధ్యక్షుడు మాధవరెడ్డి, సదానందారెడ్డి, రాష్ట్ర కార్యవర్గసభ్యులు శివరాజు, పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, సీనియర్ నాయకులు ఈశ్వరప్ప, వడ్లనందు, సుచరితారెడ్డి, సాహు శ్రీలత, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ నరేంద్రమోదీ ప్రపంచానికే ఆదర్శ నాయకుడు -
పశువుల తరలింపును అడ్డుకున్నందుకే..
తాండూరు టౌన్: అక్రమంగా పశువులను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని అడ్డుకోవడంతో కొందరు వ్యక్తులు తమపై దాడి చేశారని పెద్దేముల్ మండలానికి చెందిన పలువురు యువకులు బుధవారం తాండూరు డీఎస్పీకి బాలకృష్ణా రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. పెద్దేముల్ మండలం జనగామ శివారులో మంగళవారం అర్ధరాత్రి ఓ అటవీ శాఖాధికారికి చెందిన ఫాంహౌస్ నుంచి 20 వరకు పశువులను డీసీఎంలో తరలిస్తుండగా, మంబాపూర్కు చెందిన రమేష్ సాగర్, రాము, అంజి అడ్డుకున్నారు. డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో డీసీఎం వాహనదారులతోపాటు మరి కొందరు యువకులపై దాడి చేశారు. దాడికి పాల్పడిన వారితో పాటు పశువుల తరలింపునకు సహకరించిన అటవీ శాఖ అధికారిపై కూడా చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ కుమార్, అసెంబ్లీ కన్వీనర్ రజినీకాంత్, పట్టణ కార్యదర్శి కిరణ్ డీఎస్పీని కోరారు. ఈ విషయమై తగు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇచ్చారు. మాపై దాడి చేశారు డీఎస్పీకి యువకుల ఫిర్యాదు చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకుల డిమాండ్ -
విరమణ వయస్సు పెంచడం సరికాదు
కొడంగల్ రూరల్: ఉద్యోగ విరమణ వయస్సు పెంచడం సరికాదని ఎస్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేటలో ఎస్టీయూటీఎస్ రాష్ట్ర ద్వితీయ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగ విరమణ వయస్సు 61నుంచి 62సంవత్సరాలకు పెంచాలని ప్రభుత్వం ఆలోచించడం సరికాదన్నారు. దీంతో నిరుద్యోగులు తీవ్ర అన్యాయానికి గురవుతారన్నారు. 2023 జనవరి నుంచి పెండింగ్లో ఉన్న 5డీఏలలో సత్వరమే మూడు డీఏలను ప్రకటించాలని, పెండింగ్లోని వివిధ బిల్లులు, సరెండర్ లీవ్లు, టీఎస్జీఎల్ఐ, జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ను వెంటనే మంజూరు చేయించాలని వివరించారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ షఫీ తదితరులు పాల్గొన్నారు. ఎస్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ -
నిరీక్షణకు మోక్షం..
● బషీరాబాద్లో ఎట్టకేలకు ఇంటర్ తరగతులు ● 8 మంది ఫ్యాకల్టీని నియమించిన ప్రభుత్వం ● కళాశాలకు భవనం కేటాయింపు ● ఊపందుకున్న అడ్మిషన్లు బషీరాబాద్: ఇంటర్ విద్యార్థుల రెండేళ్ల నిరీక్షణకు మోక్షం లభించింది. 2023లో బషీరాబాద్కు జూనియర్ కళాశాల మంజూరైంది. గతేడాది అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించినా భవనం లేకపోవడం, లెక్చలర్లను నియమించకపోవడంతో విద్యార్థులను తాండూరు జూనియర్ కాలేజీలో చేర్పించారు. రెండు రోజుల క్రితం ప్రభుత్వం బషీరాబాద్ కశాశాలకు 8మంది ఫ్యాకల్టీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అడ్మిషన్లు ఊపందుకున్నాయి. మండల కేంద్రంలో దశాబ్దాలుగా ఇంటర్ కళాశాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం కళాశాలను మంజూరు చేసింది. రెండేళ్లయినా తరగతులు ప్రారంభం కాలేదు. దీంతో విద్యార్థులు నిరుత్సాహ పడ్డారు. గతేడాదిలో 34 మంది విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లు పొందారు. అయితే ప్రభుత్వం లెక్చలర్లను నియమించకపోవడంతో విద్యార్థులను తాండూరు జూనియర్ కాలేజీలో చేర్చారు. ప్రస్తుతం సిబ్బందిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడటంతో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్సీ తదితర కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుంటున్నారు. అధ్యాపకులు ఇంటింటికి తీరుగుతూ విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కళాశాలకు సొంత భవనం లేకుపోవడంతో జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలోని భవనాన్ని కేటాయించారు. బుధవారం భవనాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్ వెంకట్రామ్రెడ్డి, అజయ్ప్రసాద్, కళాశాల సిబ్బంది పరిశీలించారు. చిన్న చిన్న మరమ్మతులు చేస్తే తరగతులు నిర్వహించవచ్చని భావిస్తున్నారు. -
కబ్జా కాకుంట
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రియల్టర్ల భూ దాహానికి ఖాళీ ప్రభుత్వ స్థలాలే కాదు.. చెరువులు, కుంటలు సైతం మాయమవుతున్నాయి. భగ్గున మండుతున్న ఎండలకు చెరువులు, కుంటలన్నీ ఎండిపోయాయి. కాల్వలు, కట్టలు, అలుగులు సహా శిఖం భూములు ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో ఆ పక్కనే పట్టా భూములు కొనుగోలు చేసిన రియల్టర్లు కల్వర్టులు, కాల్వలను సైతం చదును చేసి తమ వెంచర్లలో కలిపేస్తున్నారు. వరదనీరు పారకుండా అడ్డుకట్టలు వేస్తూ.. రైతుల పొలాల మీదకు మళ్లిస్తున్నారు. చెరువులు, కుంటలపై ఎప్పటికప్పుడు నిఘా పెంచాల్సిన అధికార యంత్రాంగం అటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కళ్లముందే కుంటల ఆనవాళ్లను చెరిపేస్తుండటంతో కొంతమంది రైతులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. హద్దులు దాటి.. జిల్లా వ్యాప్తంగా 2,132చెరువులు, కుంటలు 10, 946 ఎంఎఫ్టీ సామర్థ్యం కలిగి ఉన్నాయి. వీటి పరిధిలో 70,067 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రభుత్వం వీటిలో ఏటా 1.20 కోట్ల చేప పిల్లలను వదులుతోంది. 400 టన్నుల కుపైగా దిగుబడి వస్తోంది. వేలాది మంది మత్య్సకారులు ఈ చెరువు లు, కుంటలనే నమ్ముకుని జీవిస్తున్నారు. వేసవిలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. బఫర్జోన్లు, ఫుల్ ట్యాంక్ లెవల్లోని నీరు పూర్తిగా ఇంకిపోయింది. ఇదే అవకాశంగా భావిస్తున్న కొంతమంది అక్ర మార్కులు రాత్రికి రాత్రే మట్టి నింపుతున్నారు. పెద్దకుంట కబ్జా కడ్తాల్: మండలంలోని వంపూగూడ గ్రామ సర్వే నంబర్ 40లోని ‘పెద్దకుంట’కు సంబంధించిన 1.12 ఎకరాల ఎఫ్టీఎల్ భూమిని కబ్జా చేసిన వెంచర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని బుధవారం గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రెవెన్యూ సదస్సుకు హాజరైన అధికారులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పోతుగంటి అశోక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం డిప్యూటీ తహసీల్దార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. వెంటనే పెద్దకుంటను సర్వే చేసి, హద్దులు నిర్ధారించాలని కోరారు. భూ భారతి సదస్సుల్లో భాగంగా బుధవారం ఆయా గ్రామాలకు హాజరైన అధికారులకు ఈవిషయమై ప్రజలు ఫిర్యాదులు అందించారు. మొద్దులకుంటలో మట్టి యాచారం: గాండ్లగూడెం సమీపంలోని మొద్దులకుంటను ఓ వ్యాపారి మట్టితో పూడ్చేసినట్లు గుర్తించిన పలువురు రైతులు బుధవారం ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్రెడ్డికి ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 313లోని పట్టా భూమి యజమానులు కొన్ని రోజులుగా మట్టితో కుంటను పూడ్చేస్తున్నారని, ఎఫ్టీఎల్, బఫర్జోన్ కనిపించడకుండా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన ఆర్డీఓ వెంటనే పరిశీలించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ అయ్యప్ప, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. వెంటనే కుంట వద్దకు చేరుకున్న అధికారులుపోసిన మట్టిని తీసేయాలని, లేదంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చెరువుల, కుంటల అన్యాక్రాంతంపై ఫిర్యాదులు అక్రమార్కులను కట్టడి చేయాలని అభ్యర్థన -
అధిక యూరియాతో అనర్థం
● సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలి ● వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిమళ, డాక్టర్ శేఖర్ పరిగి: పంటల సాగులో రైతులు అధికంగా యూరియా వాడుతున్నారని, దీని వల్ల ఎటాంటి ప్రయోజనం లేకపోగా భూ సారం దెబ్బతింటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిమళ, డాక్టర్ శేఖర్ అన్నారు. బుధవారం మండలంలోని సైదుపల్లి రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు అవసరానికి మించి యూరియా వాడుతున్నారని, దాన్ని తగ్గించాలని సూచించారు. సేంద్రియ సాగుపై దృష్టి సారిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు కొనుగోలు చేస్తే తప్పని సరిగా రశీదు తీసుకోవాలన్నారు. పంట కాలం పూర్తయ్యే వరకు వాటిని భద్రపరచుకోవాలని సూచించారు. ఒక వేళ పంట దెబ్బతింటే నష్ట పరిహారం పొందేందుకు రశీదులు ఉపయోగపడతాయన్నారు. వరి సాగుకు నీటిని ఎక్కువగా వాడకూరాదని, రెండు, మూడు రోజులకు ఒక్కసారి పొలానికి నీరు పెడితే సరిపోతుందని తెలిపారు. పంట మార్పిడితో అధిక లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు. పప్పు దినుసుల దిగుబడి భారీగా తగ్గిపోయిందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి, పరిగి వ్యవసాయ సంచాలకులు సౌభాగ్యలక్ష్మి కుమారి, మండల వ్యవసాయ అధికారి రజిత, ఏఈఓ ప్రసిల్లా, పంచాయతీ కార్యదర్శి విజయభాస్కర్, సైదుపల్లి ఇందిరమ్మ కమిటీ సభ్యులు గణేష్, గోపాల్ రెడ్డి, అన్వర్, నర్సింలు పాల్గొన్నారు. -
జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ ఫోన్ ఇన్
వికారాబాద్: వానాకాలం సీజన్లో పంటల సాగు, విత్తనాల ఎంపిక, తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు ఎరువుల వినియోగం తదితర సందేహాలు తీర్చుకునేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయాధికారి మోహన్రెడ్డితో ఈనెల 6న ఉదయం 10నుంచి 11:30 గంటల వరకు ‘ఫోన్ ఇన్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రైతులు ఆయనతో మాట్లాడి సందేహాలనునివృత్తి చేసుకోవచ్చు. తేదీ : 06–06–2025 సమయం : ఉదయం 10 నుంచి 11:30 గంటల వరకు ఫోన్ చేయాల్సిన నంబర్లు : 8977755890, 9010299041 -
ఆటకెక్కిన మైదానాలు!
తెలంగాణ క్రీడా ప్రాంగణాల్లో కానరాని అభివృద్ధి● జిల్లాలోని అన్ని జీపీల్లో ఆట స్థలాలు ● క్రీడా పరికరాలు, వసతులు కల్పించని వైనం ● నిర్వహణ లేక పిచ్చి మొక్కలతోనిండిన మైదానాలు ● నెరవేరని ప్రభుత్వ లక్ష్యం ధారూరులో నిరుపయోగంగా మారిన క్రీడా ప్రాంగణం వికారాబాద్: జిల్లాలోని తెలంగాణ క్రీడా ప్రాంగణాలు అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. మూడేళ్ల క్రితం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసింది. స్థలం కేటాయించి నామమాత్రంగా చదును చేయించి బోర్డుల ఏర్పాటుతో సరిపెట్టింది. క్రీడాపరికరాలు, మౌలిక వసతులు కల్పించకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. క్రీడా మైదానాల కోసం అప్పట్లో తహసీల్దార్లు నానా ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల స్థల వివాదాలు తలెత్తడంతో వాటిని అధిగమించి భూమి కేటాయించారు. ప్రస్తుతం వారి శ్రమ వృథా అయ్యింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులు అనేక మంది ఉన్నారు. వారికి క్రీడా పరికరాలు, ఆత్మరక్షణ కిట్లు, బూట్లు వంటివి సరఫరా చేయలేదు. క్రీడా మైదానాలు ఉన్నా వాటి నిర్వహణను గాలికొదిలేశారు. ప్రస్తుతం చాలా ప్రాంగణాలు పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి. మరి కొన్ని చోట్ల రాళ్లు, గుట్టలు ఉండటంతో క్రీడలకు అనుకూలంగా లేవు. ప్రతి గ్రామ పంచాయతీలో.. జిల్లాలో 585 గ్రామ పంచాయతీలు ఉండగా ప్రతి చోటా ఒకటి చొప్పున క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు. ఒక్కో జీపీలో 2వేల చదరపు గజాలు లేకుంటే 20 గుంటలకు తగ్గకుండా భూమిని కేటాయించారు. ఇందుకోసం ప్రభుత్వ, ఫారెస్టు భూములను సేకరించారు. ప్రభుత్వ భూమి లేనిచోట జీపీల్లో లేఅవుట్లు చేస్తే వాటి ద్వారా సామాజిక అవసరాల కింద ఇచ్చే 10 శాతం భూమిని క్రీడా ప్రాంగణాలకు కేటాయించేందురే వీలు కల్పించారు. ఇన్ని ఇబ్బందులు పడి అధికారులు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో క్రీడా ప్రాంగణాలకు స్థలాలు సమకూర్చారు. అయితే మౌలిక వసతులు, పరికరాలు సమకూర్చకపోవడం,కీడా ప్రాంగణాల నిర్వహణను గాలికి వదిలేయడంతో నేడు అవి నిరుపయోగంగా మారాయి. కనీసం మూడెకరాలు ఉండాలి గత ప్రభుత్వం క్రీడలకు అవసరమైన మేర స్థలాలు కేటాయించలేదని క్రీడాకారులు అంటున్నారు. 2వేల చదరపు గజాలు లేకుంటే 20 గుంటల భూమి క్రికెట్కు సరిపోదని వారు అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది యువకులు క్రికెట్ తోపాటు కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్ తదితర ఆటలు ఆడుతుంటారు. ప్రస్తుతం ఉన్న స్థలంలో ఒక్క ఆట ఆడుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది. మరో క్రీడ ఆడాలంటే ఇబ్బందులు ఎదురవుతాయి. కనీసం మూడు ఎకరాల స్థలం ఉంటే క్రికెట్కు అనుకూలంగా ఉంటుందని యువకులు అంటున్నారు. ప్రతి గ్రామంలో ఎక్కువ మంది క్రికెట్టే ఆడతారని తెలిపారు. ఒకే చోట మూడు ఎకరాల స్థలం అందుబాటులో లేకుంటే రెండు మూడు గ్రామాలకు కలిపి ఒక చోట క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తోంది. ప్రభుత్వం ఆ దిశగా చొరవ చూపాలని, అలాగే పరికరాలు, వసతులు కల్పించాలని క్రీడాకారులు కోరుతున్నారు. క్రీడా ప్రాంగణాల నిర్వహణ బాధ్యతలు గ్రామ పంచాయతీలకు అప్పగించి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని పలువురు అభిప్రాయ పడ్డారు. -
‘భూ భారతి’ని సద్వినియోగం చేసుకోండి
సబ్కలెక్టర్ ఉమాశంకర్ప్రసాద్ దౌల్తాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తాండూరు సబ్కలెక్టర్ ఉమాశంకర్ప్రసాద్ సూచించారు. బుధవారం మండలంలోని నందారం గ్రామంలో నిర్వహించిన భూభారతి సదస్సును ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడారు. ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు స్వీకరించారని తహసీల్దారును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు భూ సమస్యలకు సంబంధించి తగిన ఆధారాలతో గ్రామసభలో దరఖాస్తు చేసుకుంటే వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దారు గాయత్రి, డీటీ చాంద్పాషా, నాయకులు రాజశేఖర్రెడ్డి, తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేసిన సేవలే గుర్తింపునిస్తాయి డీఎంహెచ్ఓ వెంకటరవణ ధారూరు: విధి నిర్వహణలో మనం చేసిన సేవలే గుర్తింపునిస్తాయని డీఎంహెచ్ఓ వెంకటరవణ అన్నారు. బుధవారం మండలంలోని నాగసమందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన సూపర్వైజర్ లక్ష్మికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. వైద్య సేవలు చేసే మనల్ని ప్రజలు దైవంతో సమానంగా భావిస్తారని, వారి నమ్మ కాని నిలబెట్టుకోవాలని సిబ్బందికి సూచించా రు.కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ జయరాం, నాగసమందర్ పీహెచ్సీ ఇన్చార్జ్ డాక్టర్ మేఘన, హెల్త్ ఎడ్యుకేటర్ ప్రీతమ్, ల్యా బ్ టెక్నిషియన్ ఉమ, ధారూరు, నాగసమందర్ పీహెచ్సీల వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడి యాలాల: నాణ్యమైన విత్తనాలతో మంచి దిగుబడి వచ్చి రైతులకు లాభం చేకూరుతుందని అగ్రికల్చర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సునీతా అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు పంటల సాగుపై పలు సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం వరి, జొన్న, కంది విత్తనాలను పరిశోధన నిమిత్తం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. -
విద్యార్థుల సంఖ్య పెరగాలి
అనంతగిరి: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ కమిటీలు ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగేలా కృషి చేయాలని ఆదేశించారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్ నుంచి అన్ని శాఖల జిల్లా అధికారులు, మ్చండల స్థాయి అధికారులు, పాఠశాలల హెచ్ఎంలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 6 నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించాలన్నారు. గ్రామాల్లోని బాలబాలికలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బడిబయట పిల్లలు ఉండరాదన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రధానోపాధ్యాయులు చొరవ చూపాలన్నారు. సర్కారు బడుల్లోని వసతులు, నాణ్యమైన బోధనను ప్రజలకు వివరించాలని తెలిపారు. పాఠశాలల్లో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ పాఠశాలలకు చేర్చామని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచండి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతి ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. రెండో విడతలో ఇళ్లు మంజూరైన వారు పనులు చేపట్టేలా అధికారులు చొరవ చూపాలన్నారు. అర్హులకు పెన్షన్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, డీఆర్డీఓ శ్రీనివాస్, డీఈఓ రేణుకాదేవి, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఏపీఎంలు, మున్సిపల్ కమిషనర్లు, ప్రిన్సిపళ్లు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం బొంరాస్పేట: భూ భారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మండలంలోని రేగడిమైలారంలో బుధవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఈ నెల 20 వరకు సదస్సులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను ఆగస్టు 14వ తేదీలోపు పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అనంతరం నాగిరెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. బొంరాస్పేట రేషన్ దుకాణంలో బియ్యం పంపిణీపై ఆరా తీశారు. తదనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, డీఎస్వో మోహన్బాబు, తహసీల్దార్ పద్మావతి, ఎంపీడీవో వెంకన్న తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ రేపటి నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమం -
టీబీ పరీక్షలు తప్పనిసరి
యాలాల: రెండు వారాల పాటు ఎవరికై నా దగ్గు ఉంటే తప్పనిసరిగా టీబీ పరీక్షలు చేయించుకోవాలని జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ రవీంద్రయాదవ్ సూచించారు. మంగళవారం మండలంలోని అగ్గనూరు ఆరోగ్య ఉప కేంద్రంలో టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా మండల వైద్యాధికారి రుబియానాజ్తో కలిసి వైద్య శిబిరం నిర్వహించారు. రెండు వారాల పాటు దగ్గు, సాయంత్రం వేళ జ్వరం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, చాతిలో నొప్పిలాంటి లక్షణాలు కలిగిన 310 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. వారికి స్క్రీనింగ్ పరీక్షల అనంతరం 115 మందికి ఎక్స్రే తీసి వ్యాధిని గుర్తించినట్లు చెప్పారు. పాజిటివ్ వచ్చిన వారికి ఆరునెలల పాటు ఉచితంగా మందులతో పాట పౌష్టికాహారం కోసం నెలకు రూ. వెయ్యి చొప్పున రోగి ఖాతాలో జమ చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ఎన్ సుశీల, సూపర్వైజర్లు శోభారాణి, పల్లె దవాఖాన వైద్యురాలు భువనేశ్వరి, ఎంఎల్హెచ్పీ వైష్ణవి, టీబీ సూపర్వైజర్ రహత్ అలీ, ఏఎన్ఎంలు వీరమణి, రోజారమణి తదితరులు పాల్గొన్నారు. టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ రవీంద్రయాదవ్ -
‘భూ భారతి’పై అవగాహన అవసరం
తాండూరు రూరల్: భూ భారతి చట్టంపై ప్రతీ రైతుకు అవగాహన అవసరమని తాండూరు సబ్–కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. మంగళవారం ఆయన ఎల్మకన్నె గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. రైతులు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్–కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. భూ సమస్యలున్న రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రికార్డుల్లో తప్పులుంటే సరిచేసుకోవాలని సూచించారు. భూ మార్పిడిలో సర్వేయర్ రూపొందించిన నక్షను జత చేసినట్లయితే భవిష్యత్లోనూ భూ వివాదాలకు తావుండదని వివరించారు. చంద్రవంచలో డిప్యూటీ తహసీల్దార్ లలిత ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఎల్మకన్నెలో 11 దరఖాస్తులు, చంద్రవంచలో నాలుగు దరఖాస్తులు వచ్చాయని తహసీల్దార్ తారాసింగ్ తెలిపారు. మ్యుటేషన్, విరాసత్, పాసు పుస్తకంలో రైతు పేర్ల తప్పులు, భూ విస్తీర్ణంలో సవరణపై ఫిర్యాదులు అందాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ గోపి, సిబ్బంది బాబు, నర్సింలు, అంజమ్మ, ప్రవీణ్, యాదయ్య, ఇంతియాజ్, ప్రదీప్, నరేశ్, ఉలేందర్, గోపాల్, మహేందర్, బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. తాండూరు సబ్–కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ -
పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించండి
అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ అనంతగిరి: అర్హులైన వారి నుంచి పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన జాతీయ కుటుంబ ప్రయోజన పథకంలో రైతు ఆత్మహత్య కుటుంబాలు, వితంతు పెన్షన్లు అంశాలపై సెర్ప్ సీఈఓ దివ్యదేవరాజన్, అదనపు కలెక్టర్లు, డీఆర్డీఓ, రెవెన్యూ విభాగాల అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ మాట్లాడుతూ.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు, వితంతు పెన్షన్లకు సంబంధించి ఆర్థిక సాయం పొందేలా దరఖాస్తులు స్వీకరించి ప్రతిపాదనలు పంపాలన్నారు. అర్హులకు పెన్షన్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. జూమ్ సమావేశంలో డీహెచ్ సూపరింటెండెంట్లు వెంకటేశ్వరి, నేమత్ అలీ, ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ మహమూద్ అలీ, డీపీఎం నర్సింలు పాల్గొన్నారు.