breaking news
Vikarabad District News
-
ఆర్టీసీని రక్షించుకుంటాం
హయత్నగర్: ఆర్టీసీని రక్షించుకుంటామని, సంస్థను లాభాల్లోకి తీసుకొస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అబ్దుల్లాపూర్మెట్టు మండలంలోని మునుగనూరులో మంగళవారం ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల కమ్యూనిటీ హాలు నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదవాడికి రవాణా సౌక ర్యం కల్పించేది ఆర్టీసీ బస్సు మాత్రమేనని అలాంటి బస్సులను నడిపి సేవలు అందిస్తున్న కార్మికులను గుండెల్లో పెట్టుకుంటామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూ సిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త బస్సులు కొంటున్నామని, పీఆర్సీ ఇచ్చామని, కారుణ్య నియమకాలు చేపట్టామని, కొత్తగా ఉద్యోగాలు కల్పిస్తున్నామని వివరించారు. కార్మికుల సంక్షేమం, సంస్థ పరిరక్షణ, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో ఆర్టీసీ పురోగమిస్తోందని అన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల అప్పును మిగిల్చిన గత ప్రభుత్వం ఆర్టీసీని దివాలా తీయించిందని విమర్శించారు. కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించి వారికి అండగా ఉంటామన్నారు. రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన హామీ మేరకు విశ్రాంత కార్మికుల భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముద్దగోని లక్ష్మీప్రసన్న, ఆర్డీఓ అనంతరెడ్డి, తహసీల్దార్ సుదర్శన్రెడ్డి, విశ్రాంత కార్మిక సంఘం అధ్యక్షుడు రాజయ్య తదితరులు పాల్గొన్నారు. కార్మికులను గుండెల్లో పెట్టుకుంటాం మంత్రి పొన్నం ప్రభాకర్ -
నత్తనడకన ‘వనమహోత్సవం’
వికారాబాద్: జిల్లాలో వనమహోత్సవం కార్యక్రమం నత్తను తలపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే అధికారుల అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కొన్ని శాఖలు 20 శాతం మేర మొక్కలు నాటగా సగం శాఖలు పనులే ప్రారంభించలేదు. రెండు నెలల క్రితమే జిల్లా అధికారులు ఆయా శాఖలకు మొక్కల లక్ష్యాలను నిర్దేశించారు. ఈ ఏడాది 40.48 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. సీజన్ ప్రారంభ సమయంలో వర్షాలు కురవక పోవడంతో మొక్కలు నాటే కార్యక్రమం ముందుకు సాగలేదు. ప్రస్తుతం వానలు పడుతున్నా అధికారుల్లో చలనం లేదు. వనమహోత్సవంలో ప్రాధాన్యతను బట్టి 19 శాఖలను భాగస్వాములను చేశారు. అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం సాగనుంది. అధికారుల అలసత్వం మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా వనమహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏటా లక్షలాది మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 40,48,500 మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నారు. గతేడాది నాటిన మొక్కల్లో 80శాతం బతికాయని అధికారులు చెబుతున్నా వాస్తవానికి 50 నుంచి 60 శాతం మాత్రమే పెరిగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 8లక్షల లోపు మాత్రమే మొక్కలు నాటారు. పశు సంవర్ధక శాఖ, మైనింగ్, సివిల్ సప్లయ్, పోలీసు, ఆర్అండ్బీ, డీడబ్ల్యూఓ, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీలు కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. 581 నర్సరీల్లో పెంపకం జిల్లా వ్యాప్తంగా అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో 581 నర్సరీల్లో 38,30000 మొక్కలను పెంచుతున్నారు. ఈ సారి టేకు మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామ పంచాయతీలకు అత్యధిక లక్ష్యాలను కేటాయించారు. వానాకాలం ప్రారంభమై నెలన్నర దాటినా నాటింది 20 శాతంలోపే.. ఈ ఏడాది లక్ష్యం 40,48,500 మొక్కలు 19 ప్రభుత్వ శాఖలకు బాధ్యతలు పనులు ప్రారంభించని సగం శాఖలు శాఖల వారీగా కేటాయించిన లక్ష్యం శాఖ మొక్కలు అటవీ 5లక్షలు విద్య 11వేలు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ 9,43,500 ఉద్యానవన 2లక్షలు వ్యవసాయ 5లక్షలు తాండూరు మున్సిపాలిటీ 70వేలు వికారాబాద్ మున్సిపాలిటీ 80వేలు కొడంగల్ మున్సిపాలిటీ 35వేలు పరిగి మున్సిపాలిటీ 30వేలు మరి కొన్ని శాఖలకు లక్ష్యాన్ని నిర్ద్ధేశించారు -
పాల ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్గా నరేశ్
దోమ: పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం చైర్మన్గా దోమ గ్రామానికి చెందిన కావలి నరేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత నెల 29న మండల కేంద్రంలోని పాలఉత్పత్తిదారుల కేంద్రంలో రెండు డైరెక్టర్ స్థానాలకు అధికారులు ఎన్నికలు నిర్వహించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నలుగురు అభ్యర్థులు పోటీలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన బొంపల్లి తండాకు చెందిన బుగ్యానాయక్, దోమకు చెందిన జాకరం నారాయణ విజయం సాధించారు. దీంతో మొత్తం 10 డైరెక్టర్ స్థానాలకు గాను కాంగ్రెస్ ఏడింటిని కై వసం చేసుకుంది. దీంతో కావలి నరేశ్ను చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నరేశ్ను డైరెక్టర్లు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ జాకటి వెంకటయ్య, డైరెక్టర్లు మల్లేశ్, సత్తమ్మ, లలిత, చందర్, నాయకులు మాలి శివకుమార్రెడ్డి మల్లేశ్, జావీద్, యాదయ్య, బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆదర్శనీయుడు వనజీవి రామయ్య
తాండూరు టౌన్: పర్యావరణ పరిరక్షకుడు వనజీవి రామయ్య అందరికీ ఆదర్శనీయుడని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కొట్రిక విజయలక్ష్మి అన్నారు. మంగళవారం రామయ్య జయంతిని పురస్కరించుకుని కోకట్ టీజీ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒక్క మొక్క నాటడంతో ప్రారంభించిన వనజీవి రామయ్య తన జీవిత కాలంలో సుమారు 3కోట్ల వరకు మొక్కలు నాటారన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన కృషిని మెచ్చిన ప్రభుత్వాలు అనేక అవార్డులతో సత్కరించాయన్నారు. వృక్ష సంపద పెరిగితే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, తద్వారా పంటలు పండటం, పర్యావరణం కలుషిత రహితంగా మారుతుందన్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తూ వయసు పైబడినా మొక్కలు నాటే ప్రక్రియను మాత్రం ఆయన వదిలిపెట్టలేదన్నారు. కావున అందరూ ఆయనను ఆదర్శంగా తీసుకుని విస్తారంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తాండూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీదేవి, ప్రిన్సిపాల్ సరస్వతి, సామాజిక కార్యకర్త వెంకట్, గాజుల బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా జయంతి వేడుకలు -
పొరపాట్లను సరిచేశాం
మండలంలో ఉన్న జాబ్కార్డుల్లో తప్పులు లేకుండా, కార్డుదారుల్లో నమోదైన పొరపాట్లను, అర్హులను ఎంపిక చేసేందుకు అన్ని సవరించాం. అర్హులైన వారిని గుర్తించేలా కొన్ని జాబ్ కార్డులను తీసివేశాం. దీంతో లబ్ధిదారుల ఎంపిక సులువుగా ఉంటుంది. – ఇలియాస్, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఓ, బొంరాస్పేట మంచి పథకం భూమిలేని వ్యవసాయ కార్మిక కుటుంబాలకు, ఉపాధి హామీ కూలీ కుటుంబాలకు, అడ్డా కూలి కుటుంబాలకు ఈ పథకం ఆర్థిక భద్రత కల్పించనుంది. ఏడాదికి రూ.12 వేల చొప్పున ఖరీఫ్, రబీ సీజన్లలో అందించనున్నారు. ప్రస్తు త సీజన్లో జిల్లాలో 1.5లక్షల మంది ఉపాధి ప నులు చేయగా అందులో సుమారు 8వేల మంది అర్హులు లబ్ధి పొందే అవకాశం ఉంది. ఇదివరకు భూమి ఉన్న వారికే రైతుబంధు, భీమా ఉండేది. ప్రస్తుతం భూమిలేని వారికి ఇది మంచి పథకం. – జి.నర్సింలుగౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, బొంరాస్పేట -
చేతి వృత్తిని వ్యాపారం చేస్తే ఊరుకోం
అనంతగిరి: కార్పొరేట్ సెలూన్లకు తావివ్వకుండా ప్రభుత్వ పెద్దలు, అధికారులు చొరవ తీసుకొని నాయీ బ్రాహ్మణులు సంక్షేమానికి కృషి చేయాలని ఆ విభాగం నేతలు, విశ్రాంత ప్రొఫెసర్ ఎం.భాగయ్య కోరారు. మంగళవారం వికారాబాద్ కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ను కలిసి ఈ మేరకు విన్నవించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నిజాం కాలంలో 12 కులాలకు ఇనామ్ భూములు ఇవ్వడం జరిగిందని, ఈ కులాల వారు వృత్తి ధర్మాన్ని నెరవేర్చే సేవకులని గుర్తు చేశారు. ముఖ్యంగా నాయీ బ్రాహ్మణులకు 5 వృత్తి ధర్మాలు ఉన్నాయని, అందులో ఒకటి క్షౌ రము, మంగళ వాయిద్యం, వైద్యము, మంత్రసాని, (కాగడా) దివిటీ. ఉదయం లేచిన కాడి నుంచి అన్ని ముఖ్య దేవాలయాల్లో మేలుకొలుపు నుంచి దివిటీ పట్టే వరకు నాయీ బ్రాహ్మణుల వృత్తి అని పేర్కొన్నారు. 1982లోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఫెడరేషన్లుగా సాధించుకోవడంతో పాటు కులవృత్తికి సంబంధించిన సామగ్రిని కూడా పొందడం జరిగిందన్నారు. ఇతర మతాలకు చెందిన కొందరు వచ్చి సెలూన్లు పెట్టుకొని నాయీ బ్రాహ్మణుల వృత్తి దోచేద్దామని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేమన్నారు. న్యాయం కోసం హై కోర్టును ఆశ్రయిస్తామన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగి సీపీ రెడ్డి, సంఘం సభ్యులు శేఖర్, రఘుపతి, రమేష్, భగవాన్, నాగరాజు, నరేష్, సంతోష్, రాజు, నర్సింలు, ఎం.నరేష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అన్య మతస్తులు కార్పొరేట్ సెలూన్లు పెట్టడానికి వీల్లేదు నాయీ బ్రాహ్మణుల సంక్షేమ విభాగం నేతలు, విశ్రాంత ప్రొఫెసర్ బాగయ్య అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేత -
ఆలయ అభివృద్ధికి కృషి
తాండూరు రూరల్: మండలంలోని కొత్లాపూర్లో వెలసిన రేణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి దేవాదాయ శాఖ నుంచి రూ.కోటి మంజూరయ్యేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే మనోహర్రెడ్డి తెలిపారు. మూడు రోజులుగా ఆలయంలో కొనసాగుతున్న మృత్యుంజయ హోమం మంగళవారంతో ముగిసింది. కర్ణాటక మాజీ మంత్రి అరవింద్ లింబావళితో కలిసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఆలయం ఎంతో పురాతనమైనదని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో మాట్లాడి నిధులు మంజూరయ్యేలా చూస్తానని తెలిపారు. త్వరలో కల్యాణ మండపం, స్నానపు గదులు, మరుగుదొడ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. నెలరోజుల పాటు జరిగే జాతరకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తారని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నవీన్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, నాయకులు సాయిలు, గోపాల్, రాందాస్, పండరి, రాంచెంద్రారెడ్డి, వడ్డె శ్రీను, ప్రదీప్రెడ్డి, వెంకట్రెడ్డి, డైరక్టర్లు రాజు, లాల్యనాయక్, లాలయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ముగిసిన మృత్యుంజయ హోమం -
ధ్రువపత్రాల పరిశీలనకు 183 మంది విద్యార్థులు
అనంతగిరి: వికారాబాద్ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం కళాశాల ప్రవేశాల కోసం స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించామని కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ తెలిపారు. మొదటి రోజు 194 మంది విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకోగా 183 మంది హాజరయ్యారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కశాశాల సిబ్బంది నారాయణ, రామలక్ష్మి, సుదీంద్రకుమార్, కిరణ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. హత్య కేసులో ఏడుగురు నిందితులకు రిమాండ్ దౌల్తాబాద్: భూతగాదాల్లో పాత కక్షలను మనసులో పెట్టుకుని వ్యక్తిని హత్య చేసిన సంఘటనలో పోలీసులు మంగళవారం ఏడుగురు నిందితులను రిమాండ్కు తరలించారు. జూన్ 30న పొలం బాట విషయంలో బండివాడకు చెందిన వెంకట్ నాయక్, హన్మానాయక్ తండాకు చెందిన జైపాల్ నాయక్, రాములు నాయక్, మాన్యానాయక్, విజయ్ నాయక్, వెంకట్ నాయక్, రవి నాయక్, అమ్రీబాయిల మధ్య గొడవ తలెత్తింది. ఈ ఘటనలో ఇరువర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. వెంకట్నాయక్ అదేరోజు రాత్రి తనబైక్పై ఇంటికి వెళ్తుండగా హన్మానాయక్ తండావాసులు దాడి చేశారు. తలకు బలమైన గాయాలవడంతో మృత్యువాతపడ్డాడు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు మంగళవారం నిందితులను అరెస్టు చేసి కొడంగల్లో కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించినట్లు సీఐ శ్రీధర్రెడ్డి, ఎస్ఐ రవిగౌడ్ తెలిపారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి దౌల్తాబాద్: నిద్రకు ఉపక్రమించిన ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోనలి గోకఫసల్వాద్లో మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గ్రామానికి చెందిన దామోదర్రెడ్డి(43), మాజీ కోఆప్షన్ సభ్యుడు జాకీర్అలీ కలిసిమెలిసి ఉండేవారు. దామోదర్రెడ్డి అప్పుడప్పుడు జాకీర్ ఇంట్లోనే నిద్రించేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇద్దరు జాకీర్అలీ ఇంట్లోనే భోజనం చేసి జాకీర్ అలీ పైన గదిలో పడుకోవడానికి వెళ్లగా దామోదర్రెడ్డి కింద గదిలో నిద్రించడానికి వెళ్లాడు. మంగళవారం ఉదయం జాకీర్అలీ లేచి చూసేవరకు విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే జాకీర్అలీ కుటుంబసభ్యులకు తెలిపాడు. వారు వచ్చి చూసి మృతిచెందినట్లు గుర్తించారు. ఈ విషయమై మృతుడి భార్య ప్రభావతమ్మ తన భర్త మృతిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ రవిగౌడ్ ఘటనా స్థలిని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ టోర్నీ విజేతగా రంగారెడ్డి జిల్లా ట్రోఫీ అందజేసిన సీపీ సాయి చైతన్య నిజామాబాద్ నాగారం: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియంలో నాలుగు రోజులుగా సాగిన రాష్ట్రస్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్ పోటీలు మంగళవారంతో ముగిసాయి. పోటీ ల్లో విజేతగా రంగారెడ్డి జిల్లా జట్టు నిలువగా, రన్నర్గా నిజామాబాద్ జట్టు నిలిచింది. ముగింపు కార్యక్రమానికి సీపీ సాయిచైతన్య ముఖ్య అతిథిగా హాజరై, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. -
దుండగులను అరెస్ట్ చేయాలి
పరిగి: పుట్టపహాడ్లో అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను అరెస్ట్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. దుండగులను పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వ్యహరిస్తున్నారన్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయకపోతే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు గోవింద్నాయక్, వెంకట్, సత్తయ్య పాల్గొన్నారు. లేదంటే ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ -
విద్యతోనే అంతరాలు లేని సమాజం
మంచాల: విద్య సమాజాభివృద్ధికి తోడ్పాటునిచ్చేలా ఉండాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను సందర్శించారు. అక్కడ కొనసాగుతున్న పనులు, బోధన తీరు, ఉపాధ్యాయుల కృషిని తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారిగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరుట్లలో ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. ప్రజల మధ్య అంతరాలు తొలగాలంటే విద్యతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధేశ్యాం, ఉపాధ్యక్షురాలు మంగ, సభ్యులు నాగమణి, ధనమూర్తి, జగన్నాథ్ ఆరుట్ల ప్రధానోపాధ్యాయుడు గిరిధర్ గౌడ్, సుప్రియ, మోహన్ గౌడ్, పేరెంట్స్ కమిటీ సభ్యులు భాస్కర్, రాజు, ఎం.డీ.జానీ పాష, జంగయ్య, జంగయ్య, మల్లేశ్, పార్వతి, జ్యోతి, ఉపాధ్యాయులు పాపిరెడ్డి, కిషన్ చౌహాన్, శ్రీకాంత్, జహీర్ పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్సీ నర్సింహారెడ్డి -
రెండు ఆలయాల్లో చోరీ
ఇబ్రహీంపట్నం: డివిజన్ పరిధిలోని ఓ గ్రామంలో రెండు ఆలయాల్లో విగ్రహాలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన ఇబ్రహీంపట్నం ఠాణా పరిధిలోని పోల్కంపల్లిలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారంగ్రామంలోని రామాలయంలో సీతారామలక్ష్మణ స్వాముల వారి పంచలోహ విగ్రహాలు, గంగాదేవి ఆలయంలో పెద్ద మ్మ తల్లి, గంగాదేవి విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. రామాలయంలోని సీసీ టీవీ పుటేజీలను పరిశిలీంచగా ఓ దొంగ విగ్రహాన్ని సంచిలో పెట్టుకుని వెళ్తున్నట్లు గుర్తించారు. అనుమానితులు పోలీసుల అదపులో ఉన్నట్లు సమాచారం.పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లిన దుండగులు -
ప్రజలకు ఇబ్బంది లేకుండా పంపిణీ
కుల్కచర్ల: ప్రజలకు ఇబ్బంది లేకుండా రేషన్ సరుకుల పంపిణీ సమయాన్ని పెంచడం జరుగుతుందని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, పీఏసీఎస్ చైర్మన్ కనకం మొగులయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో రేషన్ బియ్యం పంపిణీ కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. రేషన్బియ్యం ప్రతీ ఒక్క లబ్ధిదారుడికి మూడు నెలల బియ్యం చేరాలనే సంకల్పంతో జూలై 29 వరకు రేషన్ బియ్యం తీసుకునేందుకు అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఆనందం, మాజీ ఎంపీపీ అంజిలయ్య, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, రజక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్, నాయకులు రాంచంద్రయ్య, వెంకటేశ్, ఎల్లయ్య, భాను తదితరులు పాల్గొన్నారు. -
బడి వద్దకే బియ్యం
బొంరాస్పేట: ప్రభుత్వం సర్కారు బడులకు ప్రతీ నెల అందించే మధ్యాహ్న భోజన పథకం సన్న బియ్యం ఈ నెల నుంచి నేరుగా పాఠశాలలకే చేరనున్నాయి. రెండేళ్లుగా మండల కేంద్రం నుంచి లేదా మార్గమధ్యలో నుంచి సొంత ఖర్చులు భరించాల్సిన బాధలు తొలిగాయని బొంరాస్పేట, దుద్యాల ఎంఈఓలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పాఠశాలలకు రోడ్డు సౌకర్యం లేదని, వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్నామని కుంటిసాకులు చెబుతూ బియ్యం సరఫరా కాంట్రాక్టరు రవాణా డబ్బులు జేబులో వేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. మండల కేంద్రంలో డంప్ చేస్తుండడంతో అవి సకాలంలో పాఠశాలలకు అందక ముక్కిపోయి, పురుగులు పడి పాడైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. మండల కేంద్రం మార్గమధ్య నుంచి హెచ్ఎంలు ప్రైవేట్ వాహనాల్లో తమ పాఠశాలలకు మధ్యాహ్న భోజనం బియ్యం తెప్పించుకున్నారు. ఇటీవల ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టిన సమయంలో పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించి సన్నబియ్యం రవాణా ఇబ్బందలు తొలగిస్తామని చెప్పారు. సర్కార్ బడులకు ప్రతీనెల అందించే హమాలీ పేరుతో సీఆర్పీల నుంచి అక్రమ వసూళ్లు ఉండరాదని హెచ్చరించారు. ఈ నెల నుంచి స్టాక్ పాయింట్ నుంచి నేరుగా పాఠశాలలకు చేరవేత రెండేళ్లుగా సొంత ఖర్చులు భరించిన హెచ్ఎంలు వెతలు తీరాయని హర్షం ఉమ్మడి మండలంలో సన్న బియ్యం సరఫరా వివరాలు పాఠశాలలు 77 విద్యార్థుల సంఖ్య 2,800 ప్రతీ నెల సరఫరా చేసే బియ్యం 76.50 క్వింటాళ్లు 1–5 తరగతుల విద్యార్థులకు 100 గ్రాములు 6–9 తరగతుల విద్యార్థులకు 150 గ్రాములు -
అంగన్వాడీ టీచర్పై విచారణ
దోమ: కోడిగుడ్ల పంపిణీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంగన్వాడీ టీచర్పై సీడీపీఓ మెహర్ఉన్నీసా బేగం విచారణ చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని బట్ల చందారం గ్రామంలో కావలి మంగమ్మ(గర్భిణీ)కి అంగన్వాడీ టీచర్ ఆనంద గుడ్లు ఇవ్వాల్సి ఉంది. అయితే ఆమె పేరు నమోదు కాకపోవడంతో హైదరాబాద్ నగరంలో ఉంటూ మే 20న వచ్చి కేంద్రంలో రిజిస్టర్ చేసుకుంది. ఈ క్రమంలో జూన్ 20న అంగన్వాడీ కేంద్రానికి గుడ్లకు రాగా.. టీచర్తో మంగమ్మ భర్త సురేశ్ ఫోన్లో చిన్నపాటి వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటమాట పెరగడంతో టీచర్ ఆనంద, ఆమె భర్త వీరప్పతో కలిసి సురేశ్ ఇంటికి వెళ్లి దాడి చేశారు. ఈ మేరకు ఇరువురు పోలీసులకు ఫిర్యాదు చేసుకోగా, గత నెల 21న ఆనంద, వీరప్పలపై కేసు నమోదు చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంగన్వాడీ టీచర్పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీడీపీఓ, డీడబ్ల్యూఓకు ఫిర్యాదులు సైతం చేశారు. ఈ మేరకు మంగళవారం సీడీపీఓ గ్రామానికి వచ్చి గ్రామ మాజీ సర్పంచ్తో పాటు గ్రామస్తులతో కలిసి విచారణ చేపట్టారు. -
ఖర్చుకు వెనుకాడొద్దు
● నిధులు మంజూరు బాధ్యత నాది ● కలెక్టర్ నారాయణరెడ్డి ● వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలోఆకస్మిక తనిఖీ ● సమస్యలు వివరించిన మహేశ్వరం మెడికల్ కాలేజీ అనుబంధ ఆస్పత్రి వైద్య సిబ్బంది సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘కోవిడ్ సమయంలో ఆస్పత్రి భవనంపై ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్డు పైకప్పు లీకేజీ అవుతోంది. సిటీ స్కాన్ మంజూరైనప్పటికీ.. స్థలాభావ సమస్యతో ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు. టెక్నీషియన్లు అందుబాటులో లేరు. రక్తనిధి కేంద్రం లేకపోవడంతో రక్తస్త్రావంతో బాధపడుతున్న రోగులకు సత్వర సేవలు అందించలేకపోతున్నాం. వైద్యుల నిష్పత్తి మేరకు గదులు లేకపోవడంతో ఔట్ పేషంట్ విభాగానికి వచ్చే రోగులకు సేవలు అందించలేని పరిస్థితి తలెత్తుతోంది’అంటూ మహేశ్వరం మెడికల్ కాలేజీ అనుబంధ ఆస్పత్రి (వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి) వైద్య సిబ్బంది కలెక్టర్ నారాయణరెడ్డి ముందు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. వైద్యులు, సిబ్బంది చెప్పిన అంశాలను కలెక్టర్ సావధానంగా ఆలకించారు. ‘ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించే బాధ్యత నాదీ.. అయితే ఆస్పత్రికి ఆపదలో వచ్చిన నిరుపేద రోగులకు సత్వర, మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాల్సిన బాధ్యత మీదే’అని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆకస్మిక తనిఖీ.. వైద్యసేవలపై ఆరా మంగళవారం వనస్థలిపురం ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఔట్, ఇన్ పేషంట్ విభాగాలు సహా ఆపరేషన్ థియేటర్, ఫార్మసీ విభాగాలను పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్య పరీక్షలు చేస్తున్నారా? మందులు ఇస్తున్నారా? అంటూ రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది రోగుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆస్పత్రి పడకల సామర్థ్యాన్ని 100 నుంచి 200 పెంచారు కానీ..అనువైన స్థలం లేక అదనపు పడకలను ఏర్పాటు చేయలేకపోతున్నట్లు స్పష్టం చేయగా, ఆస్పత్రి భవనం పై అంతస్తులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్డుకు తక్షణమే రిపేర్లు చేసి, రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. ఇందుకు ఎంత ఖర్చైనా వెనుకాడొద్దన్నారు. వెంటనే పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సీటీస్కాన్ పెట్టండి.. టెక్నీషియన్లను తీసుకోండి మెడికల్ కాలేజీ నిబంధనల ప్రకారం ఆస్పత్రిలో సీటీస్కాన్ ఏర్పాటు చేయాల్సి ఉందని, 2024లోనే సీటీస్కాన్ మంజూరైందని, ఆస్పత్రిలో అనువైన స్థలం లేక ఏర్పాటు చేయలేకపోయినట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. ఆస్పత్రి ఆవరణలోని ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ డిస్పెన్సరీలను పక్కనే ఉన్న వార్డు ఆఫీసుకు తరలించి, ఆ ఖాళీ ప్రదేశంలో సీటీస్కాన్ ఏర్పాటు చేయించాలని అధికారులకు సూచించారు. రక్తనిధి కేంద్రం ఏర్పాటు సహా అవసరమైన టెక్నీషియన్లను ఔట్సోర్సింగ్ ప్రతిపాదికను నియమించుకోవాలని ఆదేశించారు. రోగులకు సేవలు అందించే విషయంలో రాజీపడొద్దన్నారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్యలోపం, తాగునీటి కొరత లేకుండా చూసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, అదనపు డీఎండీ డాక్టర్ వాణి, ప్రిన్సిపాల్ డాక్టర్ త్రివేణి, వైస్ ప్రిన్సిపాల్ తఖీయుద్దీన్, ఆర్ఎంఓలు జయమాల, రాజ్కుమార్, వైద్య మౌలిక సదుపాయాల సంస్థ చీఫ్ ఇంజనీర్ దేవేందర్, ఈఈ అజీజ్, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి, ఎల్బీనగర్ డిప్యూటీ కమిషనర్ యాదయ్య తదితరులు ఉన్నారు. -
‘చెత్త’మున్సిపాలిటీలు
వికారాబాద్: వికారాబాద్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య మెరుగుకు ఏటా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని పాలకులు, అధికారులు చెబుతున్నా కాలనీలు మాత్రం కంపు వీడటం లేదు. రోజూ ఏదో ఒక కాలనీలో మురుగు సమస్య దర్శనమిస్తోంది. చిన్నపాటి వర్షం పడితే చాలు పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. రోడ్లు, వీధులు మురుగు నీటితో నిండిపోతాయి. ప్రజలు నడిచే పరిస్థితి కూడా ఉండదు. వికారాబాద్ నడిబొడ్డున బాబు జగ్జీవన్రామ్ చౌరస్తాలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు. అవసరాల మేర మురుగు కాలువలు లేవు. వికారాబాద్ పట్టణ జనాభా దాదాపు 80 వేల వరకు ఉంటుంది. జిల్లా కేంద్రం కావడంతో ఆయా ప్రాంతాల నుంచి వివిధ అవసరాల నిమిత్తం రోజూ 20వేల నుంచి 30వేల మంది ఇక్కడికి వస్తుంటారు. మున్సిపల్ పరిధిలో పది చోట్ల మాత్రమే పబ్లిక్ టాయిలెట్లు ఉ న్నాయి. ప్రస్తుత అవసరాలకు ఇవి సరిపోవ డం లేదు. మరో పదిచోట్ల టాయిలెట్లు నిర్మించాల్సి ఉంది. మున్సిపల్ పరిధిలో 33.50 కిలోమీటర్ల మేర సీసీ డ్రైనేజీ, 3.38 కిలోమీటర్ల రాతి డ్రైనేజీ, మరో ఐదు కిలోమీటర్ల కచ్చా డ్రైనేజీ ఉంది. మరో 40 కిలోమీటర్ల సాధారణ డ్రైనేజీ, 60 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అవసరమని అధికారులు అంచనా వేశారు. పట్టణ అవసరాల మేరకు డ్రైజేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు, పారిశుద్ధ్య మెరుగుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.పరిగి పట్టణంలోని 5వ వార్డులో ఇళ్ల మధ్య నిలిచిన మురుగు ప్రతిపాదనల్లోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు జిల్లా కేంద్రంలో పరిస్థితిమరీ అధ్వానం పట్టించుకోని అధికారులు ఇబ్బందుల్లో ప్రజలు డ్రైనేజీ వ్యవస్థ లేక పాట్లుపరిగి: పరిగి మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం పడకేసింది. ఎక్కడ చూసినా చెత్తాచెదారం కనిపిస్తోంది. కొన్ని కాలనీలకే చెత్త సేకరణ వాహనాలు వస్తుండటంతో మిగిలిన కాలనీల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. విధిలేక ప్రజలు వీధుల్లో, ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేస్తున్నారు. పట్టణంలోని 5వ వార్డు, విద్యానగర్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, టీచర్స్కాలనీ, ఇంద్రనగర్ తదితర ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ లేదు. దీంతో మురుగు రోడ్లపై ప్రవహిస్తోంది. ఈ నీటిని ఖాళీ ప్లాట్లలోకి మళ్లించారు. దీంతో ఈగలు, దోమలు వృద్ధి చెంది ప్రజ లు రోగాల బారిన పడుతున్నారు. మున్సిపల్ పరిధిలోని పలు కాలనీల నుంచి 19 వాహనాలతో రోజుకు 8 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. 78 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నా చెత్త సేకరణ సరిగ్గా లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. కాలనీల్లో చెత్తాచెదారం పేరుకుపోయి కంపుకొడుతున్నాయి. కాలువల్లో వ్యర్థాలు చేరి మురుగు ముందుకు కదలడం లేదు. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో చెత్త కుళ్లి ఈగలు, దోమలు వృద్ధి చెందుతున్నాయి. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణ తీరుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు -
మెడికల్ కౌన్సిల్ దాడులు
● అనుమతులు లేని ఆస్పత్రులపై కొరడా ● తనిఖీల్లో పట్టుబడ్డ నకిలీ వైద్యులు సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ విభాగాల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. విద్యార్హతలు అసలే లేవు. అయినా వైద్యులుగా చలామణి అవుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కాంపౌండర్లపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు కొరడా ఝులిపించారు. సోమవారం షాబాద్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన వైద్యుల బృందం ఏడు క్లినిక్లపై కేసులు నమోదు చేసింది. ఓం సాయి ఫస్ట్ ఎయిడ్ సెంటర్, శ్రావణ్ ఫస్ట్ఎయిడ్ ఎంటర్, మధు శ్రీ క్లినిక్, ముస్తాఫా క్లినిక్, మాస్టర్ క్లినిక్, శ్రీ సాయితిని, జంజం క్లినిక్లకు అనుమతులు లేవని గుర్తించింది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డా.మహేశ్కుమార్, ఉపాధ్యక్షు డు శ్రీనివాస్ మీడియాకు వివరాలు వెల్లడించారు. జంజం క్లినిక్లో వందల సంఖ్యలో డైకోఫెన్స్ సోడి యం ఇంజక్షన్లు, కాల్షియం గ్లూకోనేట్ ఇంజక్షన్లు, స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్ ఇంజక్షన్లు గుర్తించినట్టు తెలిపారు. కనీస అర్హత లేకుండా అల్లోపతి దవాఖానా నిర్వహిస్తున్నారని అన్నారు. రోగంతో సంబంధం లేకుండా యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, మాత్రలను అధిక మోతాదులో ఇస్తున్నారని పేర్కొన్నారు. చట్ట ప్రకారం ఎంబీబీఎస్ వైద్యులు మాత్రమే మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేయించుకుని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందన్నారు. అర్హత లేని వ్యక్తులు వైద్యం చేసినట్లైతే ఎన్ఎంసీ చట్టం 34, 35 ప్రకారం కేసులు నమోదు చేయడంతో పాటు రూ.5 లక్షల జరిమానా, ఏడాది జైలు శిక్షణ విధిస్తామని వెల్లడించారు. మెడికల్ స్టోర్స్లో క్వాలిఫైడ్ వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా, ఫార్మసిస్ట్లు లేకుండా యాంటిబయాటిక్స్, స్టేరాయిడ్, ఇతర షెడ్యూల్ డ్రగ్స్ విక్రయిస్తునట్టు గుర్తించామని తెలిపారు. -
విదేశీ వస్తువులను బహిష్కరించాలి
పరిగి/కుల్కచర్ల: విదేశీ వస్తువులను బహిష్కరించాలని స్వదేశీ జాగరన్ మంచ్ రాష్ట్ర నాయకుడు, ప్రముఖ వక్త బెంగాల్ ఈశ్వర్ అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలో స్వదేశీ జాగరన్ మంచ్ ఆధ్వర్యంలో శ్రీసాయి ఒకేషనల్ కళాశాలలో స్వదేశీ వస్తువుల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. నేడు దేశంలో స్వదేశీ అనేది ఒక ఉద్యమంలా సాగాలని సూచించారు. విదేశీ వ్యాపార సంస్థలైన అమెజాన్, ఫ్లిప్కార్ట్ తదితర వాటిలో వస్తువులు కొనుగోలు చేయొద్దని సూచించారు. ఈ కామర్స్ వల్ల దేశంలోని 3 లక్షలకు పైగా చిన్న చిన్న దుకాణాదారులు రోడ్డున పడ్డారన్నారు. మన సాంస్కృతిక సంప్రదాయాలను మనమే కాపాడుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో విభాగ్ కన్వీనర్ ప్రభాకర్రెడ్డి, కళాశాల డైరెక్టర్ రాముయాదవ్, ప్రిన్సిపాల్ శ్రీశైలం, హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కుల్కచర్ల మండల కేంద్రంలోని కృష్ణవేణి పాఠశాలలో స్వదేశీ జాగరణ మంచ్ కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. -
దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి
యాలాల: మండల పరిధిలోని హాజీపూర్ గ్రామానికి చెందిన దళిత కౌలు రైతుపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు డిమాండ్ చేశారు. సోమవారం హాజీపూర్ గ్రామానికి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్యతో కలిసి బాధిత రైతును పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గోరేపల్లికి చెందిన కోటం శ్రీనివాస్కు చెందిన పొలాన్ని ఏడేళ్లుగా రవి కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటున్నాడన్నారు. గత నెల 17న పొలంలో విత్తనాలు వేస్తుండగా అదే గ్రామానికి చెందిన కోటం విష్ణు, పకీరప్పలు మరో 18 మందితో కలిసి రవిపై దాడి చేసి హత్యాయత్నానికి యత్నించారని వివరించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసిన నిందితులను అరెస్టు చేయలేదన్నారు. దళిత రైతుపై దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని.. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మహిపాల్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప, గ్రామస్తులు పాష, మహిపాల్ తదితరులు ఉన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు -
చికిత్స పొందుతున్న మహిళ మృతి
దుద్యాల్: తమ కూతురుతో కలిసి స్కూటీపై వెళ్తున్న దంపతులను లారీ ఢీకొట్టిన ఘటనలో మరొకరు మృతి చెందారు. వివరాలు.. ఈ నెల 25న కోస్గికి చెందిన వెంకటేశ్, అనిత దంపతులు తమ మూడేళ్ల కూతురు అక్షితతో కలిసి కొడంగల్ వెళ్తుండగా.. దుద్యాల్ గేట్ వద్ద ఓ లారీ అదుపుతప్పి వీరి స్కూటీని ఢీకొట్టింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా దంపతులను నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న అనిత పరిస్థితి విషమించి సోమవారం మృతిచెందింది. వెంకటేశ్ పరిస్థితి కూడా విషమంగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం కోస్గిలో అనిత అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు సోమవారం కొడంగల్ ఠాణాకు తరలించారు. -
హకీంపేట్లో ఇంటర్ కళాశాల ప్రారంభోత్సవం
దుద్యాల్: మండల పరిధిలోని హకీంపేటలో ఇంటర్ కళాశాలను మంజూరు చేయడం వికారాబాద్, నారాయణపేట జిల్లా విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి శంకర్నాయక్ సూచించారు. సోమవారం ఆయన మండల పరిధిలోని హకీంపేట్లో నూతనంగా మంజూరైన ఇంటర్ కళాశాలను ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శంకర్నాయక్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో హకీంపేట అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు అందించారు. ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే 80 మంది విద్యార్థులు కళాశాలలో అడ్మిషన్లు తీసుకున్నారని చెప్పారు. దౌల్తాబాద్, బొంరాస్పేట్ కళాశాల్లో అడ్మిషన్లు లేక రెండేళ్లుగా కళాశాలలు ప్రారంభానికి నోచుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, గోశాల యజమాని కృష్ణ స్వామి, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్తులు ఆంజనేయులు యాదవ్, శ్రీనివాస్, దాసు, యాదయ్య, మహేశ్, గోవర్ధన్, రఘు తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా పదవుల పంపిణీ
● నామినేటెడ్, పార్టీ పదవుల్లో సీనియర్లకు ప్రాధాన్యం ● డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్రెడ్డి ● అర్హులకు పథకాలు అందేలా చూస్తాం ● ఎమ్మెల్యే మనోహర్రెడ్డి బషీరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలలోపు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా గ్రామ, మండల, డివిజన్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం బషీరాబాద్లో పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పరిశీలకులు వినోద్రెడ్డి, నరేందర్, తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. పదవులు ఆశించే నాయకులు వివరాలు ఇవ్వాలని సూచించారు. జిల్లాకు రెండు రాష్ట్రస్థాయి డైరెక్టర్ పదువులతో పాటు గ్రామ, మండల, డివిజన్ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. అన్యాయం జరగనివ్వం: మనోహర్రెడ్డి పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్న సీనియర్ నాయకులకు పదవుల పంపిణీలో అన్యాయం జరగనివ్వమని తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి భరోసా ఇచ్చారు. 2017 కంటే ముందు నుంచి ఉన్నవారికి ముఖ్యమైన పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఎక్మాయిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో జరిగిన అక్రమాలపై విచారణ జరిపామని త్వరలో చర్యలు ఉంటాయని తెలిపారు. కొత్త వారిదే పెత్తనం: రమేష్ మహరాజ్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచిపార్టీలో చేరిన నాయకులు పెత్తనం చెలాయిస్తున్నా రని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు రమేష్ మహ రాజ్ ఆరోపించారు.తాను నాలుగేళ్లుగా పార్టీలో పనిచేస్తున్నానని, మీరంతా రెండేళ్ల కిందట వచ్చారంటూ ఎమ్మెల్యేను ఉద్దేశించి అనడంతో సమావేశంలో గందరగోళం ఏర్పడింది. ఇందిరమ్మ కమిటీల్లోనూ సీనియర్లకు చోటు ఇవ్వలేదన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కలాల్ నర్సింలు, మార్కె ట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, సొసైటీ చైర్మన్ వెంకట్రామ్రెడ్డి, వైస్ చైర్మన్ అజయ్ప్రసాద్, సీనియర్ నాయకులు వెంకటేశ్ మహరాజ్, శంకరప్ప, రామ్ నాయక్, శంకర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సుధాకర్రెడ్డి, శ్రావణ్కుమార్, శాంతిభాయి, తలారి సురేష్, అనిల్ కుమార్, సతీష్, మాణిక్రావు పాల్గొన్నారు. పాతవారికే పదవులుతాండూరు రూరల్: 2017 కంటే ముందు నుంచి పార్టీలో ఉన్న నేతలకే పదవులు ఇస్తామని ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణ శివారులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం పని చేసిన వారికి గుర్తింపు ఉంటుందన్నారు. ఎమ్మెల్యే మనోహర్రెడ్డి సహకారంతో తాండూరు అన్నీవిధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఉత్తమ్చందులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది
తాండూరు రూరల్: ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని డీసీసీబీ వైస్ చైర్మన్ సంగెం రవిగౌడ్ అన్నారు. సోమవారం పీఆర్టీయూ ఆధ్వర్యంలో మండల పరిధిలోని జినుగుర్తి జెడ్పీహెచ్ఎస్ జీహెచ్ఎం మృత్యుంజయస్వామి పదవీవిరమణ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రవిగౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేశక్తి ఉపాధ్యాయుడికే ఉంటుందన్నారు. బడి లేని ఊరు ఉంటుందేమోకాని ఉపాధ్యాయుడు లేని ఊరు ఉండదన్నారు. 38 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తికే వన్నెతెచ్చిన గొప్ప వ్యక్తి మృత్యుంజయస్వామి అని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్, అమర్నాథ్, గౌరవ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, ఏంఈఓ వెంకటయ్య, తాండూరు మండల అధ్యక్ష, కార్యదర్శులు వినోద్కుమార్, పురుషోత్తంరెడ్డి, నాయకులు జైపాల్రెడ్డి, నాగప్ప, కిష్టప్ప, అంబమ్మ, రాంనర్సింహారెడ్డి, ప్రభు, బాల్రాజ్, రాజేశ్వర్, శ్రీధర్, సతీశ్ తదితరులు ఉన్నారు. డీసీసీబీ వైస్ చైర్మన్ సంగెం రవిగౌడ్ ఘనంగా మృత్యుంజయస్వామి పదవీవిరమణ కార్యక్రమం -
3న సర్టిఫికెట్ల పరిశీలన
అనంతగిరి: జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 12 పోస్టుల భర్తీలో భాగంగా ఈ నెల 3వ తేదీ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని డీఈఓ రేణుకాదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2022 – 23లో స్పెషల్ ఆఫీసర్, పీజీసీఆర్టీ, పీఈటీ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలో మెరిట్ లిస్టులోని అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు ఉదయం 11గంటలకు సంబంధిత ఒరిజినల్స్, రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలతో హాజరుకావాలని తెలిపారు. తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలి దోమ: ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన పరిగి తహసీల్దార్ను వెంటనే సస్పెండ్ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు. సోమవారం దోమ మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిగి మండలం రంగంపల్లి సర్వే నంబర్ 146లో మొత్తం 4.17 గుంటల భూమి ఉందని, అందులోని ఎకరం భూమిని గత నెల 9న ఇతరుల పేరిట అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. ఇదే గ్రామంలోని సర్వే నంబర్ 256లో 20.23 గుంటల భూమి ఆక్రమించేందుకు కొందరు రియల్టర్లు ప్రయత్నిస్తూన్నా తహసీల్దార్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నేతలు సత్తయ్య, చెన్నారెడ్డి, వెంకటేశ్, రాములు, ఆనంద్, రాజు పాల్గొన్నారు. హామీలు అమలు చేయాలి మొయినాబాద్: ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమనేత దేశమొళ్ల ఆంజనేయులు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం మున్సిపల్ కేంద్రంలో ఉద్యమకారులు రిలే నిరహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులను అన్ని విధాలా ఆదుకుంటామని ఎన్నికల ముందు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మర్చిపోయిందని విమర్శించారు. ఉద్యమకారులను మరవద్దనే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఉద్యమకారుల సంఘం మండల అధ్యక్షుడు మహిపాల్, నాయకులు కుమ్మరి రమేష్, భిక్షపతి, మధు, అవినాష్, ముకుందరెడ్డి, బన్సీలాల్, రత్నం, కేబుల్ రాజు తదితరులు పాల్గొన్నారు. మరకత శివాలయం సందర్శన శంకర్పల్లి: మండల పరిధిలోని చెందిప్పలో వెలసిన శ్రీ బ్రహ్మాసూత్ర మరకత శివాలయా న్ని సోమవారం సినీ నటుడు బాలాజీ దర్శించుకున్నారు. స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. మరకత శివాలయం ఎంతో అద్భుతంగా ఉందని, సమయం దొరికినప్పుడల్లా ఇక్కడికి వచ్చేందుకు ప్రయత్నిస్తుంటానని తెలిపారు. -
ప్రతీ కార్యకర్తకు న్యాయం చేస్తాం
యాలాల: కష్టకాలంలో కాంగ్రెస్కు అండగా నిలిచిన ప్రతీ కార్యకర్తకు, నాయకులకు తగిన పదవి ఇచ్చి న్యాయం చేస్తామని డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మె ల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్రెడ్డి, ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు రమేశ్మహరాజ్, అధికార ప్రతినిధి నరేందర్తో కలిసి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పార్టీ పటిష్టతకు పాత, కొత్త తేడా లేకుండా పనిచేయాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు సూచించిన వారికే ఎంపీటీసీ, సర్పంచ్ టిక్కెట్లు ఇస్తామన్నారు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించే బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. అనంతరం పార్టీ కమిటీల్లో భాగంగా పదవులను ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ సురేందర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి, మాజీ అధ్యక్షుడు భీమప్ప, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వీరేశం, మాజీ సర్పంచ్లు శ్రీనివాస్, మధుసూదనరెడ్డి, బస్వరాజ్, భీమప్ప, ఏఎంసీ డైరెక్టర్లు నర్సింలుగౌడ్, రాజు, మొగులయ్య, శ్రీనివాస్, నాయకులు చంద్రశేఖర్గౌడ్, అమృతప్ప, సత్యనారాయణరెడ్డి, రవినాయక్ తదితరులు ఉన్నారు. డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి -
చెత్త సేకరణలో నిర్లక్ష్యం
తాండూరు: తాండూరు మున్సిపల్ పరిధిలో చెత్తసేకరణ అధ్వానంగా మారింది. మున్సిపల్ పాలకవర్గం గడువు ముగియడం.. ప్రత్యేక అధికారుల పాలనలో పారిశుద్ధ్యంపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త పెరుకుపోయి డంపింగ్ యార్డులను తలపిస్తోంది. చెత్త సేకరణ వాహనాలు సరిగ్గా రావడం లేదని స్థానికులు తెలిపారు. పట్టణ పరిధిలో మురుగు కాల్వలు సరిగ్గా లేకపోవడంతో వ్యర్థ జలాలు ఎక్కడికక్కడ నిలిచి దుర్గంధం వెదజల్లుతున్నాయి. దీంతో దోమలు, ఈగలు వృద్ధి చెంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ప్రధాన రహదారిలో మురుగు కాల్వలు సరిగ్గా లేక మురుగు నీరు రోడ్డుపై నిలుస్తోంది. మున్సిపల్ పరిధిలో 36 వార్డులు 85 వేల జనాభా ఉంది. రోజూ ఇతర ప్రాంతాల నుంచి మరో 30 వేల మంది పట్టణానికి వచ్చి వెళ్తుంటారు. మూత్రశాలలు లేకపోవడంతో ప్రజలు ఖాళీ ప్రదేశాల్లో కానిచ్చేస్తున్నారు. అధికారులు స్పందించి తాండూరు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య మెరుగుకు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
18 లీటర్ల సారా పట్టివేత
ఆమనగల్లు: పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో 18 లీటర్ల నాటుసార సీజ్ చేసి ఒకరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఆమనగల్లు ఎక్సైజ్ సీఐ బద్యానాద్ చౌహాన్ తెలిపిన ప్రకారం.. వెల్దండ మండలం పోచమ్మగడ్డ తండా నుంచి మాడ్గుల మండలం కలకొండ గ్రామానికి నాటుసారా తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు సీఐ బద్యానాద్ చౌహాన్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. పోచమ్మగడ్డ తండా నుంచి కలకొండకు ప్రయాణిస్తున్న ఆటోను తనిఖీ చేయగా అందులో తొమ్మిది ప్లాస్టిక్ బాటిల్స్లో 18 లీటర్ల సారా పట్టుబడింది. సారా, ఆటోను సీజ్ చేసి సారా తరలిస్తున్న పాండును అరెస్టు చేశారు. ఈ తనిఖీలో ఎక్సైజ్ ఎస్ఐ అరుణ్కుమార్, సిబ్బంది శంకర్, దశరథ్, శ్రీను, బాబు, ఆమని, శ్రీజ పాల్గొన్నారు. -
భూ తగాదాలతో వ్యక్తి హత్య
● రాడ్డుతో తలపై మోది దారుణం ● మరొకరికి తీవ్ర గాయాలు దౌల్తాబాద్: భూతగాదాలతో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యా యి. ఈ సంఘటన దౌల్తాబాద్ మండలం బండివా డ తండా శివారులో సోమవారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులుస్థానికుల కథనం ప్రకారం.. బండివాడ తండా,హన్మ్యానాయక్ తండాలు పక్కనే పక్క నే ఉంటాయి. ఈ రెండు తండాల్లోని బాబునాయక్, విజయ్నాయక్కు కొన్నేళ్లుగా భూతగాదాలు ఉన్నా యి. ఇరువర్గాల మధ్య ఆదివారం మధ్యా హ్నం గొడవ జరిగింది. విజయ్నాయక్ వర్గం బాబునాయక్ వర్గంపై దాడి చేయడంతో ఐదుమందికి గాయాలయ్యాయి. దీంతో క్షత పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాత్రి బాబునాయక్, అతని తమ్ముడు వెంకట్నాయక్ మరో వ్యక్తి శ్రీరాంలు బైక్పై ఇంటికి వెళ్తున్న క్రమంలో విజయ్ వర్గం కాపుకాచి రాడ్డుతో దాడి చేసింది. గాయాలతో బాబునాయక్ తప్పించుకున్నారు. వెంకట్నాయక్(38)పై తలపై రాడ్డుతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను చుట్టుపక్కల వారు కొడంగల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దీంతో తండాలో పోలీ సు పికెట్ ఏర్పాటు చేశారు. మృతుడికి ఒక కుమారుడు. ముగ్గురు కూతుర్లు ఉన్నారు. సంఘటన స్థలాన్ని సీఐ శ్రీధరెడ్డి, ఎస్ఐ రవిగౌడ్ పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆటో నుంచి కిందపడి వ్యక్తి మృతి
కొడంగల్ రూరల్: ఆటో నుంచి కిందపడిన ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని చిట్లపల్లి టోల్ప్లాజా దగ్గర చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన మహ్మద్అలీ(65) తన కుటుంబంతో కలిసి హైదరాబాద్లో స్థిరపడ్డారు. సోమవారం మొహరం(పీర్ల పండగ)సంతాప దినాలను పురస్కరించుకొని స్వగ్రామానికి బయలుదేరారు. నగరం నుంచి కొడంగల్ చేరాక, ఇక్కడి నుంచి రుద్రారానికి ఆటోలో వెళ్లారు. మార్గమధ్యలో చిట్లపల్లి టోల్ ప్లాజా సమీపంలో స్పీడ్ బ్రేకర్ దాటుతున్న క్రమంలో అకస్మాత్తుగా మహ్మద్అలీ ఆటోలో నుంచి జారి కింద పడ్డారు. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని చికిత్స నిమిత్తం కొడంగల్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుమారుడు యూసుఫ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. మట్టి దందా నిలిపివేత దోమ: మల్లేపల్లితండా, దాదాపూర్ గ్రామాల సమీపంలో కొన్ని రోజులుగా కొందరు అక్రమార్కులు యథేచ్చగా కొనసాగుతున్న మట్టి దందాను రెవెన్యూ అధికారులు నిలిపివేశారు. శనివారం శ్రీసాక్షిశ్రీదినపత్రికలో శ్రీతోడేస్తున్నారుశ్రీఅనే కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన రెవన్యూ అధికారులు సోమవారం ఘటనా స్థలికి చేరుకుని తవ్వకాలను నిలిపివేసే చర్యలు చేపట్టారు. వాహనాలను వదిలేసి, ఎలాంటి ఫెనాల్టీలు విధించనట్లు సమాచారం. అక్రమార్కులపై తహసీల్దార్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పాఠశాల సమయానికి బస్సులు నడిపించాలి కొడంగల్ రూరల్: పాఠశాలల సమయానికి బస్సులను నడిపించాలని ఎంఈఓ రాంరెడ్డి అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. తాండూరు ఆర్టీసీ డిపో అధికారులకు బస్సులను పాఠశాలల సమయానికి నడిపించాలని కోరినట్లు ఆయన తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8.45గంటలకు కొడంగల్కు బస్సులు చేరేటట్లు చర్యలు తీసుకోవాలని, కొడంగల్ నుంచి సాయంత్రం 4.40గంటలకు తిరుగు ప్రయాణం అయ్యేటట్లు చర్యలు తీసుకోవాలని కోరినట్లు కోరారు. -
చినుకు పడితే చిత్తడే
కొడంగల్: కొడంగల్ మున్సిపల్ పరిధిలోని పలు గ్రామాల్లో చినుకు పడితే చిత్తడిగా మారుతోంది. మున్సిపల్లో విలీనమైన గ్రామాల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కొడంగల్ మేజర్ గ్రామ పంచాయతీకి 2018లో మున్సిపల్ హోదా లభించింది. అప్పట్లో కొండారెడ్డిపల్లి, గుండ్లకుంట, పాత కొడంగల్, పాత కొడంగల్ తండా, బూల్కాపూర్, ఐనన్పల్లి గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఈ గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించిందని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. బూల్కాపూర్లో మైసమ్మ దేవాలయానికి వెళ్లే దారిలో మురుగు నీరు రోడ్డుపై నిలుస్తోంది. దీంతో గ్రామస్తుల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఈ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు నీరు రోడ్లపైకి వస్తోంది. బూల్కాపూర్లో మురుగు కాల్వలు లేవు. వ్యక్తిగత మరుగుదొడ్లు లేవు. గ్రామానికి వెళ్లే దారిలో రోడ్డుకు ఇరువైపులా గ్రామస్తులు బహిర్భుమికి వెళ్తున్నారు. గ్రామంలోకి వెళ్లాలంటేనే ఇబ్బందిగా ఉంది. వర్షాకాలంలో గ్రామంలో రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
డీసీసీ ప్రధానకార్యదర్శి హన్మంత్ ముదిరాజ్ పరిగి: డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామంటూ గత ప్రభుత్వం పేదలను మోసం చేసిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుందని డీసీసీ ప్రధాన కార్యదర్శి హన్మంత్ ముదిరాజ్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని నస్కల్లో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందజేసి ఇంటి నిర్మాణ పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కృష్ణ, అశోక్, శ్రీనివాస్, చంద్రయ్య, నరేశ్, అశోక్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. సమ్మెలో పాల్గొంటాం అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అనంతగిరి: ఈ నెల 9న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ సమ్మెలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పాల్గొంటుందని తెలుపుతూ వికారాబాద్ సీడీపీఓ వెంకటలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు వనజ, అరుణ, పుష్ప, ఆండాలు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న ఫార్మర్ రిజిస్ట్రీ తాండూరు రూరల్: ప్రతి రైతుకు ఆధార్ తరహాలో ఫార్మర్ రిజిస్ట్రీ గుర్తింపు నంబర్ ఉండాలని వ్యవసాయశాఖ తాండూరు డివిజన్ ఏడీఏ రుద్రమూర్తి అన్నారు. సోమవారం మండలంలోని వ్యవసాయశాఖ కార్యాలయంలో ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని ఏఓ కొమరయ్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలు వర్తించాలంటే ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్కార్డు, ఫోన్ నంబర్ తీసుకొని సంబంధిత ఏఈవోల వద్ద నమోదు చేయించుకోవాలన్నారు. రైతుల వివరాలను ఒకే చోట డిజిటల్గా భద్రపరిచి, పథకాల అమలును మరింత సమర్థవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఫార్మర్ రిజిస్ట్రీ చేపట్టారని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
భూ తగాదాల్లో జోక్యం వద్దు
● నేరాల అదుపులో సీసీ కెమెరాలదే కీలక పాత్ర ● నవాబుపేట పోలీసుల పనితీరు భేష్ ● ఎస్పీ నారాయణరెడ్డి నవాబుపేట: నేరాలను అదుపు చేయడంలో సీసీ కెమెరాలు కీలకంగా పనిచేస్తాయని ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం నవాబుపేట పోలీస్ స్టేషన్ ఆయన సందర్శించారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇళ్ల ముందు, షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చొరవ తీసుకోవాలని సూచించారు. చాలామంది నేరస్తులను సీసీ కెమెరాల ద్వారానే గుర్తిస్తున్నట్లు తెలిపారు. రోడ్ల పరిస్థితి బాగులేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. భూ తగాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోరాదని, రెవెన్యూ శాఖ సూచనల మేరకు ముందుకు వెళ్లాలన్నారు. 80 శాతం దొంగతనాలు, దోపిడీలు, ట్రాన్స్ ఫార్మర్ల చోరీలు పాత నేరస్తుల పనేనని పేర్కొన్నారు. వారిపై నిఘా ఉంచామన్నారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా, నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నవాబుపే ట పోలీసుల పనితీరు బాగుందని, ఇంకా మెరుగ్గా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, సీఐ వెంకటేష్, ఎస్ఐ అరుణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం
తాండూరు టౌన్: శాంతి భద్రతల పరిరక్షణే తమ ధ్యేయమని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలో ర్యాడిప్ యాక్షన్ ఫోర్స్ టీం కవాతు నిర్వహించింది. పట్టణంలోని ఆలయాలు, మజీదులు, పురవీధుల మీదుగా కవాతు కొనసాగింది. డీఎస్పీ వెంట సీఐ సంతోశ్కుమార్ తదితరులున్నారు. ఎస్ఐ మహిపాల్ రెడ్డి సేవలు అభినందనీయం తాండూరు పట్టణ ఎస్ఐ మహిపాల్ రెడ్డి సేవలు అభినందనీయమని తాండూరు డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి అన్నారు. పట్టణ ఎస్సైగా విధులు నిర్వర్తించి సోమవారం పదవీ విరమణ పొందిన మహిపాల్ రెడ్డిని డీఎస్పీ తన కార్యాలయంలో సన్మానించారు. 1984లో కానిస్టేబుల్గా విధుల్లో చేరిన మహిపాల్ రెడ్డి ఏఎస్ఐగా, ఎస్ఐగా పదోన్నతి సాధించారు. జిల్లాలోని బషీరాబాద్, బంట్వారం, తాండూరు పట్టణంతో పాటు సంగారెడ్డి జిల్లాలోనూ ఆయన ఎస్ఐగా విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. కానిస్టేబుల్గా ఉద్యోగాన్ని సాధించి, ఎస్ఐగా రిటైర్డ్ అయిన మహిపాల్ రెడ్డి విధుల పట్ల అంకితభావంతో ఉండేవారన్నారు. పోలీసు శాఖలో సుదీర్ఘంగా ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు. ఏ ఉద్యోగికై నా పదవీ విరమణ తప్పదన్నారు. అనంతరం మహిపాల్రెడ్డి మాట్లాడుతూ 41 ఏళ్ల పాటు పోలీసు శాఖలో ఉంటూ ప్రజలకు విధుల పరంగా సహాయ సహకారాలు అందించానన్నారు. తన ఉద్యోగ కాలంలో సహకరించిన ఉన్నతాధికారులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ సంతోశ్ కుమార్, ఎస్ఐ సాజిద్ తదితరులు ఉన్నారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి -
బాధ్యతగా పనిచేస్తే గుర్తింపు
● కలెక్టర్ ప్రతీక్ జైన్ ● ఉద్యోగ విరమణ పొందిన డీఎంహెచ్ఓ, కుల్కచర్ల తహసీల్దార్ ● ఘనంగా వీడ్కోలు అనంతగిరి: నిజాయితీగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తే జీవితంలో ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం ఉద్యోగ విరమణ పొందుతున్న డీఎంహెచ్ఓ వెంకటరవణ, కుల్కచర్ల తహసీల్దార్ మురళీధర్ను కలెక్టరేట్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాధ్యతగా పనిచేస్తే మంచి గుర్తింపు వస్తుందన్నారు. ప్రజలకు సేవ చేసే భాగ్యం అందరికీ రాదన్నారు. అనంతరం వెంకటరవణ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి, డీఆర్డీఓ శ్రీనివాస్, ఉద్యాన వన శాఖ అధికారి మహమ్మద్ సత్తార్, ఏఓ ఫరహీన్ బేగం, నెమత్ హాలీ తదితరులు పాల్గొన్నారు. బాల కార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే విధంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అక్రమ రవాణాకు గురవుతున్న, తప్పిపోయిన పిల్లలను గుర్తించాలని ఆదేశించారు. బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలన్నారు. తప్పిపోయిన పిల్లలను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించాలన్నారు. మతిస్థిమితం లేని వారిని వారిని పునరావాస కేంద్రాలకు తరలించి వైద్య సేవలు అందించాలని తెలిపారు. పిల్లలను పనుల్లో పెట్టుకోవడం చట్ట రీత్యా నేరమన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎం.సుధీర్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష చౌదరి, డీడబ్ల్యూఓ కృష్ణవేణి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ వెంకటేశం, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ వాల్యా నాయక్, అడిషనల్ ఎస్పీ (డీటీసీ) మురళీధర్, డీసీపీఓ శ్రీకాంత్ పాల్గొన్నారు. సత్వరం పరిష్కరించాలి ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నిర్వహించిన ప్రజావాణికి 185 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచరాదని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ఆర్డీఓ వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
అంతా ఆన్లైన్!
నేటి నుంచివికారాబాద్: జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి ఆన్లైన్ అటెండెన్స్ సిస్టం అమలు చేయనున్నారు. ప్రభుత్వ యంత్రాంగం విధులకు హాజరుకావటంలో పారదర్శకతకు ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపుతుండగా అమలుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ముందుగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అన్ని శాఖల హెచ్ఓడీ కార్యాలయాల నుంచే ఈ విధానం మొదలు పెట్టనున్నారు. కలెక్టరేట్లో ఆన్లైన్ హాజరు విధానం అమలు కానుంది. అనంతరం ఆరోగ్య, విద్యాశాఖల్లో సైతం ఏర్పాటుకు నిర్ణయించారు. హెల్త్ డిపార్ట్మెంట్లో జిల్లాలో 24 పీహెచ్సీలు ఉండగా రామయ్యగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. విద్యాశాఖ పరిధిలో 1,063 పాఠశాలలు ఉండగా ముందుగా వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్నెపల్లి పాఠశాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. వారం రోజుల్లో ఎంప్లాయి ఐడీలతో పాటు వారి ఆధార్ నంబర్లు సేకరించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో మొత్తం 6,500 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. పర్యవేక్షణ ఉంటేనే ఫలితం గత కలెక్టర్ నారాయణరెడ్డి హయాంలో జిల్లాలో మొదటిసారి జీఓ అటెండెన్స్ పేరుతో ఆన్లైన్ హాజరు విధానం అమలు చేశారు. ఆయన బదిలీపై వెళ్లిపోయాక బయోమెట్రిక్, ఆన్లైన్ అటెండెన్స్ విధానానికి స్వస్తి పలికారు. విధి నిర్వహణ, రోజువారీ హాజరులో పారదర్శకత కొరవడిన విషయం గమనించిన ప్రస్తుత కలెక్టర్ ప్రతీక్జైన్ తిరిగి ఆన్లైన్ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం మొబైల్ యాప్ ద్వారా ఈ ఆన్లైన్ హాజరు విధానం అమలు చేయనున్నారు. అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నెల వారీ పర్యవేక్షణ ఉంటేనే సక్సెస్ అవుతుందని అంచనా వేశారు. గతంలో ఎన్ని రోజులు విధులకు హాజరయ్యారు...? ఎన్ని రోజులు ఆలస్యంగా వచ్చారు...? వారిని గుర్తించి.. శాఖాపరమైన చర్యలు తీసుకోలేదు. దీంతో ఆన్లైన్ హాజరును ఉద్యోగులు లైట్ తీసుకున్నారు. మూణ్నాళ్ల ముచ్చటగా యంత్రాంగంలో ఎక్కువ మంది ఉద్యోగులతో నడిచే వైద్య, విద్యా శాఖల్లో ఐదారు ఏళ్ల క్రితమే బయోమెట్రిక్ విధానం అమలు చేశారు. రోజువారీ హాజరు పర్యవేక్షణ కోసం ప్రభుత్వం పాఠశాలల్లో మార్పును ఆశించి ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానం మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. ఇప్పటికే కళాశాలలు, గురుకుల పాఠశాలలు తదితర సంస్థలోల బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నారు. సర్కారు 2018లో ఆస్పత్రులతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మిషన్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు కింద ముందుగా 10 జిల్లాలను తీసుకోగా అందులో వికారాబాద్ జిల్లా కూడా ఉంది. ప్రయోగాత్మక కార్యక్రమం విజయవంతం కావటంతో ఆరు నెలల తరువాత ఇదే విధానం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారు. ఆ సమయంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు మెరుగు పడిందని అధికారులు పేర్కొన్నారు. అయితే కొద్ది రోజులకే చిన్న చిన్న సాకుగా చూపి బయోమెట్రిక్ మిషన్లు మూలన పడేశారు.బయోమెట్రిక్తో అధికారుల హాజరు నమోదు పారదర్శకత కోసం ప్రత్యేక కార్యాచరణ ముందుగా కలెక్టరేట్లో అమలు వైద్య, విద్యా శాఖల్లోనూ పైలెట్ ప్రాజెక్టు ఎంపిక -
టాటా
సోమవారం శ్రీ 30 శ్రీ జూన్ శ్రీ 2025టీబీకి 8లోuకొడంగల్ రూరల్: క్షయ కట్టడికి జిల్లా అధికారులు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు బాధితులను గుర్తిస్తూ మందులు పంపిణీ చేస్తూ టీబీ నివారణకు కృషిచేస్తున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో వ్యాధిని గుర్తిస్తూ చికిత్స విధానాలపై అవగాహన కల్పిస్తూ కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. టీబీ సోకినవారు ఆందోళన చెందకుండా ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా మందులు వాడాలని.. ఇతరులకు వ్యాధి సోకకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. సరైన సమయంలో చికిత్స అవసరం క్షయ నివారణకు వైద్యుల సూచనలు పాటిస్తూ సరైన చికిత్స తీసుకోవాలి. ఇది మనిషిని బలహీన పరుస్తుందని.. ఇది అంటు వ్యాధి అయినందున జాగ్రత్తలు పాటించాలి. క్రమం తప్పకుండా మందులు తీసుకుంటే వ్యాధిని కట్టడి చేయొచ్చని సూచిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు వ్యాధిగ్రస్తులకు ఎప్పటికప్పుడు మందులు ఇస్తూ నివారణ చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు తప్పనిసరి ప్రైవేటు ఆస్పత్రుల్లో క్షయ బాధితులను గుర్తిస్తే వారి వివరాలను జిల్లా క్షయ నియంత్రణ శాఖకు సమాచారం ఇవ్వాలి. బాధితుడికి ఆరు నెలలపాటు చికిత్స అందించాలి. బాధిత కుటుంబసభ్యులు, ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బంది, వ్యాధి సోకిన వ్యక్తులు ప్రతీ ఒక్కరి సమష్టి కృషితోనే వ్యాధి నివారణ సాధ్యమవుతుంది. వ్యాధి గుర్తింపు రెండు వారాలకు మించి ఎడతెరిపి లేకుండా దగ్గు, సాయంత్రం జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, చాతిలో నొప్పి తదితర లక్షణాలుంటే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలి. ఉచితంగా తెమడ పరీక్షలు చేసి వ్యాధిని గుర్తిస్తారు. ఈ వ్యాధి ఊపిరితిత్తులపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. పొగ తాగేవారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. శిబిరాలను వినియోగించుకోవాలి వైద్య శిబిరాల్లో డయాబెటిస్, డయాలసిస్, 60 ఏళ్ల పైబడిన వృద్ధులు, బీపీ, షుగర్, పాత టీబీ వ్యాధిగ్రస్తులు, ప్రస్తుతం లక్షణాలు కనిపించే వ్యక్తులు, హెచ్ఐవీ తదితర వ్యాధులకు పరీక్షలు నిర్వహిస్తూ ఉచితంగా మందులను అందిస్తున్నారు. జిల్లాలోని మర్పల్లి, వికారాబాద్, పరిగి, కొడంగల్, తాండూరు ఆస్పత్రుల పరిధిలోని సబ్ సెంటర్లలోని గ్రామాల్లో సోమ, మంగళ, బుధ, శుక్రవారం వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. అవగాహనతో వ్యాధి దూరం న్యూస్రీల్ క్షయ కట్టడికి టీబీ ముక్త్ భారత్ అభియాన్ శిబిరాలు కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు వ్యాధి నివారణపై బాధితులకు సూచనలు సమష్టి కృషితో నివారణ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వాడాలి. ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు టీబీకి సంబంధించి ఏ ఒక్క లక్షణం కనిపించినా వ్యాధిగ్రస్తులను ప్రభుత్వ ఆస్పత్రులకు పంపించాలి. ప్రైవేటు ఆస్పత్రుల, ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు, వ్యాధిగ్రస్తులు, వ్యాధిగ్రస్తుల కుటుంబసభ్యులు సమష్టిగా, బాధ్యతగా వ్యవహరిస్తూ టీబీ నియంత్రణకు కృషిచేయాలి. వ్యాధి నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ రవీంద్రయాదవ్, జిల్లా క్షయ నియంత్రణ అధికారి -
ఘనంగా సత్యసాయి శత జయంతి
పరిగి: మండల పరిధిలోని రంగాపూర్ శ్రీ సత్యసాయి సేవా సమితి కేంద్రంలో ఆదివారం శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నామ సంకీర్తనను పుర వీధుల గుండా నిర్వహించారు. ఉత్సవాలల్లో భాగంగా టైలరింగ్ శిక్షణ పొందిన 108 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను అందజేశారు. అనంతరం సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు మాట్లాడుతూ.. శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యం ఏదో ఒక కార్యక్రమాలు నిర్వహిస్తుంటామన్నారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాబా ఆశిస్సులతో నిత్యం ప్రజలకు సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
శిథిలావస్థకు చెరువు తూము
దుద్యాల్: మండలంలోని ఆలేడ్ గ్రామంలో ఉన్న తూము లీకేజీ కావడంతో చెరువులో ఉన్న నీరు వృథాగా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది పూర్తిస్థాయి నీటి మట్టం నిండుకుంది. చెరువు తూము లీకేజీ కావడంతో నీరు వృథాగా పోయిందని రైతులు వాపోతున్నారు. తూము నుంచి నీరు బయటకు పోకుండా ఉపయోగించే ఇనుప రాడ్డు పూర్తిగా లోపలికి పడిపోయిందని అన్నదాతలు పేర్కొంటున్నారు. చెరువు తూము లీకేజీ అవుతున్నా ఇప్పటివరకు ఏ అధికారి కూడా పరిశీలించిన దాఖలాలు లేవు. ఇప్పటికై న సంబంధిత అధికారులు స్పందించి తూముకు మరమ్మతులు చేయాలని వ్యవసాయదారులు కోరుతున్నారు. యువత వ్యసనాల బారిన పడొద్దు గ్రీన్ ఫార్మాసిటీ సీఐ లిక్కి కృష్ణంరాజు యాచారం: యువత చెడు అలవాట్లకు గురై జీవితాలను నాశనం చేసుకోవద్దని హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ లిక్కి కృష్ణంరాజు సూచించారు. పీఎస్ పరిధిలోని కుర్మిద్ద గ్రామంలో ఆదివారం సాయంత్రం గంజాయి, డ్రగ్స్ నియంత్రణ, రోడ్డు నిబంధనలు, ఘర్షణల వల్ల జీవితాల నాశనం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు యువతనేనని, అలాంటి వారు వ్యసనాలకు గురై జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. గొప్ప లక్ష్యంతో యువత ఆసక్తి కలిగిన రంగాల్లో రాణించాలని సూచించారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో కేసులు నమోదుతో పాటు జరిమానాలు విధిస్తామన్నారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, బంధువుల ఇళ్లకు, శుభకార్యాలకు వెళ్లేటప్పుడు విలువైన వస్తువులు, బంగారు నగలను ఇంట్లో ఉంచి వెళ్లరాదని సూచించారు. సమావేశంలో రాచకొండ సీఐ జోసఫ్, ఎస్ఐ తేజంరెడ్డి పాల్గొన్నారు. అర్ధరాత్రి విహరిస్తే కఠిన చర్యలు మీర్పేట సీఐ నాగరాజు మీర్పేట: వేడుకలు, ఇతర కారణాలతో అనవసరంగా అర్ధరాత్రి రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మీర్పేట పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ నాగరాజు యువతను హెచ్చరించారు. శనివారం అర్ధరాత్రి తరువాత స్టేషన్ పరిధి నందనవనం, ఆర్ఎన్రెడ్డినగర్, భూపేష్గుప్తానగర్లలో పోలీసులు ఆపరేషన్ చబుత్ర చేపట్టారు. ఈ సందర్భంగా రాత్రిళ్లు రోడ్లపై తిరుగుతున్న 122 మంది యువకులను గుర్తించారు. జన్మదిన వేడుకల పేరుతో కాలనీ కూడళ్లు, ప్రధాన రహదారులపైకి రావడం, అదే విధంగా రాత్రంతా బాక్స్ టైపు క్రికెట్ ఆడుతూ ఇతరులను ఇబ్బందులకు గురి చేయవద్దని ఇన్స్పెక్టర్ సూచించారు. ఏ కారణం లేకున్నా యువత రోడ్లపై ద్విచక్ర వాహనాలను విచ్చలవిడిగా నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకోవడంతో పాటు గొడవలకు కారణమవుతాయని అవగాహన కల్పించారు. ఆపరేషన్ చబుత్రలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గౌరునాయుడు, ఎస్ఐ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. 12న ఐటీ ఉద్యోగులకు అవగాహన రాయదుర్గం: ఐటీ ఉద్యోగుల కోసం గచ్చిబౌలిలోని శాంతిసరోవర్లో జూలై 12వ తేదీన ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. శాంతిసరోవర్ క్యాంపస్లోని ఇన్నర్స్పేస్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం సాగుతుంది. ఈ సందర్భంగా ‘ఇన్నర్ ఎక్స్లెన్స్ రీట్రీట్’ పేరిట ‘ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికి మనస్సును పున:ప్రారంభించడం’పై ప్రత్యేక అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. -
తెలంగాణ సాహిత్యాన్ని కాపాడుకోవాలి
చేవెళ్ల: మన కవుల సాహిత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అనంత సాహిత్యం–సాంస్కృతిక వేదిక వ్యవస్థాపకుడు దోరవేటి చెన్నయ్య, అధ్యక్షుడు తూర్పు మల్లారెడ్డి సూచించారు. ఆదివారం మండల కేంద్రంలోని వివేకానంద కళాశాలలో అనంత సాహిత్యం–సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ మహాకవుల జయంతిని ఘనంగా నిర్వహించుకుని, భావితరాలకు అందించాలన్నారు. అనంతరం సంస్థ నూతన కమిటీని ఎన్నుకున్నారు. వారు ఈ సంవత్సరం నిర్వహించే కార్యక్రమాల క్యాలెండర్ను రూపొందించుకున్నట్లు తెలిపారు. జూలై 27న వికారాబాద్లో దాశరథి, సి.నారాయణరెడ్డిల జయంతి, చేవెళ్లలో కాళోజీ జయంతి నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆయా శాఖల వారీగా ఉగాది కవి సమ్మేళనాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చేవెళ్ల ప్రాంతం నుంచి అనంత ప్రతినిధులుగా ఘనపురం పరమేశ్వర్, పాపిరెడ్డిలను ఎన్నుకున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ప్రముఖ కవి కడియాల మధుసూదన్, అనంత సాహిత్యం–సాంస్కృతిక వేదిక ప్రధాన కార్యదర్శి కమలేశ్, కార్యదర్శి శ్రీనివాస్, హనుమంత్, సభ్యులు ఆశీర్వాదం, నర్సయ్య, ప్రసాద్, శ్రీనయ్య తదితరులు పాల్గొన్నారు.అనంత సాహిత్యం–సాంస్కృతిక వేదిక సభ్యులు -
రహదారి.. ప్రతిపాదనలతోనే సరి
వికారాబాద్: గతంలో కురిసిన వర్షాలకు పాడైన రోడ్లు చిన్నపాటి వర్షం కురిసినా చిత్తడిగా మారుతున్నాయి. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, మున్సిపల్ అనే తేడా లేకుండా రోడ్లన్నీ అధ్వానంగా మారాయి. అధికారులను ప్రశ్నిస్తే ప్రతిపాదనలు పంపామంటూ చేతులు దులుపుకొంటున్నారు తప్ప కనీస మరమ్మతులు కూడా చేపట్టడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. వర్షాలు కురిసిన ప్రతీసారి దెబ్బతిన్న రోడ్ల వివరాలు సేకరించామంటున్నారే తప్పితే ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. టెండర్లకే పరిమితమైన మరమ్మతులు జిల్లాలో గతేడాది కురిసిన వర్షాలకు పాడైన ఆర్అండ్బీ రోడ్లకు సంబంధించి ఆ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపారు. అధికారుల సర్వేలో జిల్లా వ్యాప్తంగా 198 కిలోమీటర్ల మేర రోడ్లు పాడైనట్లు తేలింది. వీటిని పూర్తి స్థాయిలో పర్మినెంట్గా బాగు చేసేందుకు రూ.89 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.8కోట్ల నిధులు అవసరమవుతాయని ప్రతిపాదనల్లో ప్రస్తావించారు. ఇందులో ఆర్అండ్బీ శాఖ 98 కిలోమీర్ల మేర రోడ్ల మరమ్మతులకు రూ.39 కోట్లు, పంచాయతీ రాజ్ నుంచి రూ. 20 కోట్లు మంజూరయ్యాయి. అయితే ఈ రెండు శాఖల్లోనూ పాడైన రోడ్ల మరమ్మతులకు ప్రతిపాదనలు, రోడ్లు మంజూరు, టెండర్ల ప్రక్రియ దగ్గరే నిలిచిపోయింది. మెజార్టీ రోడ్లన్నీ అంతే జిల్లాలో ఒకటి రెండు రోడ్లు మినహా మెజారిటీ రోడ్లు అధ్వానంగా మారాయి. వికారాబాద్–పరిగి, వికారాబాద్–నవాబుపేట, వికారాబాద్–బుగ్గదేవాలయం వేళ్లే దారి, వికారాబాద్–తాండూరు రహదారి, కొడంగల్–తాండూరు, కొడంగల్–మహబూబ్నగర్, పరిగి–మిట్టకోడూర్, దోమ మండల పరిధిలోని దోర్నాల్పల్లి–గొడుగోనిపల్లి , ఐనాపూర్–పాలెపల్లి, గడిసింగాపూర్–మల్లెపల్లి, వికారాబాద్–సదాశివాపేట్, కోటాలగూడ–లాల్సింగ్తండా, మన్నెగూడ–మిర్జాపూర్ మీదుగా లాల్సింగ్ తండా, వికారాబాద్–దామగుండ తదితర రోడ్లన్నీ ప్రయాణానికి ఇబ్బందిగా మారాయి.పరిగి మున్సిపల్లో కొడంగల్ చౌరస్తా నుంచి వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే రోడ్డు దుస్థితి అధ్వానంగా అంతర్గత రోడ్లు చిన్నపాటి వర్షానికే చిత్తడిగా మారుతున్న వైనం వాహనదారులకు నరకయాతన పట్టించుకోని ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ శాఖలు కొత్తరోడ్లు మంజూరయ్యాయంటూ దాటవేస్తున్న అధికారులు -
రక్తదానానికి ముందుకు రావాలి
పహాడీషరీఫ్: తలసేమియా బాధితులను ఆదుకునేందుకు రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని సరూర్నగర్ మండల మాజీ వైస్ ఎంపీపీ ఉమర్ బామ్ అన్నారు. మజ్లిస్–ఏ–ఉలమాయే హుఫాజ్ వా దానిశ్వరనే మిల్లత్ ఆధ్వర్యంలో షాహిన్నగర్లో ఆదివారం ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నెల నెల రక్తమార్పిడి అవసరమయ్యే వారికి రక్తదానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏటా మనదేశంలో 10–12 వేల మంది తలసేమియా పిల్లలు జన్మిస్తున్నారన్నారు. ప్రభుత్వాలు కూడా తలసేమియాను ప్రజారోగ్య సమస్యగా ప్రకటించాలన్నారు. ఎర్ర రక్తకణాలలో హీమోగ్లోబిన్ లోపం వల్ల ఒక మాదిరి నుంచి తీవ్రమైన రక్తహీనత లక్షణాలు కలిగి, రక్త సంబంధమైన అనువంశిక రుగ్మతే తలసేమియా మేజర్గా పేర్కొంటారన్నారు. దాదాపు 390 మంది దాతలు రక్తదానం చేసి తలసేమియా సికిల్ సెల్ సొసైటీకి అందజేశారు. కార్యక్రమంలో హాఫీజ్ అబ్దుల్ హాది, డాక్టర్ ముస్తఫా అలీ సుఫియానీ, సయ్యద్ యూసుఫ్ పటేల్, అబ్దుల్ రవూఫ్, ఎం.ఎ.బారీ, అలీం బేగ్ తదితరులు పాల్గొన్నారు. -
తేలేదెప్పుడో..?
● కొలిక్కిరాని ఎనికేపల్లి భూముల వ్యవహారం ● ఎన్నిసార్లు చర్చలు జరిగినా తేలని పరిహారం ● రెండుసార్లు సర్వే చేయకుండానే వెనుదిరిగిన అధికారులు ● కొనసాగుతున్న పోలీస్ పహారా మొయినాబాద్: ఎనికేపల్లి భూముల వ్యవహారం ఎటూ తేలడంలేదు. పరిహారం విషయంలో అటు అధికారులు, ఇటు రైతులు పట్టు వీడడంలేదు. ఇప్పటికే పలు దఫాలుగా అధికారులు రైతులతో చర్చలు జరిపారు. పరిహారం విషయంలో ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో నెల రోజులుగా సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. రెవెన్యూ రికార్డుల్లో సర్కారు భూమి ఎనికేపల్లి సర్వేనంబర్ 180లోని 99.14 ఎకరాలు 1954 నుంచి రెవెన్యూ రికార్డుల్లో సర్కారి భూమిగానే నమోదవుతూ వస్తోంది. 1954లో ఈ భూమిని హరిజనులు సాగుచేసుకోవడానికి ఇచ్చినట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉంది. కొన్నేళ్ల పాటు రైతుల పేరు కబ్జా కాలంలో వచ్చాయి తప్ప అసైనీలుగా పేర్కొనలేదు. రెవెన్యూ రికార్డుల్లో పూర్తిగా సర్కారు భూమిగా కొనసాగుతూ వచ్చింది. గ్రామానికి చెందిన సుమారు 50 మంది రైతులు డైబ్బె ఏళ్లుగా ఇక్కడ సాగుచేసుకుంటున్నారు. ఈ భూములను ప్రభుత్వం ఇటీవల గోశాల ఏర్పాటుకు కేటాయించింది. విషయం తెలిసిన గ్రామస్తులు నెల రోజుల నుంచి ఆందోళన మొదలు పెట్టారు. ఈ భూములనే నమ్ముకుని జీవిస్తున్నామని, తమకే అసైన్డ్ చేయాలని డిమాండ్ చేశారు. పలు రాజకీయ పార్టీల నేతలు సైతం భూములను పరిశీలించి రైతులకు మద్దతుగా ఉంటామని ప్రకటించారు. చర్చలు విఫలం భూములు సాగుచేసుకుంటున్న రైతులతో రెవెన్యూ అధికారులు పలుమార్లు చర్చలు జరిపారు. చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ, మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్కుమార్ పరిహారం విషయంపై వారితో చర్చించారు. ఎకరాకు వెయ్యి గజాల చొప్పున పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎకరాకు 200 గజాల చొప్పున ఇస్తామని అధికారులు తేల్చి చెప్పారు. మూడుసార్లు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. ఎమ్మెల్యేపై భారం వేసిన రైతులు పరిహారం విషయంలో రైతులు ఎమ్మెల్యే కాలె యాదయ్యపై భారం వేశారు. పలుమార్లు ఆయనను కలిసి ప్రభుత్వంతో చర్చించి మంచి పరిహారం ఇప్పించాలని కోరారు. రైతులను తీసు కుని కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసిన ఎమ్మెల్యే పరిహారం విషయంపై చర్చించారు. ఎకరాకు 800 గజాలు పరిహారంగా ఇవ్వాలని ఎమ్మెల్యే కోరగా 250 గజాలు ఇస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. కనీసం ఎకరాాకు 400 గజాలైనా ఇవ్వాలని ఎమ్మె ల్యే కోరారు. ఈ విషయమై శనివారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి చర్చించారు. ఎకరాకు 350 గజాల స్థలం ఇచ్చేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ పరిహారంపై కొందరు రైతులు సంతృప్తిగానే ఉన్నట్లు సమాచారం. రెండు సార్లు సర్వే చేయకుండానే.. గోశాలకు కేటాయించిన భూములను సర్వే చేసేందుకు హెచ్ఎండీఏ అధికారులు రెండుసార్లు వచ్చారు. పరిహారం విషయం తేలకపోవడంతో సర్వే చేయకుండానే వెనుదిరిగారు. మరోవైపు ఎనికేపల్లి భూముల వద్ద పోలీస్ పహారా కొనసాగుతోంది. కొత్త వ్యక్తులు, రైతులను అటువైపు రాకుండా కాపలా కాస్తున్నారు. ఎనికేపల్లిలో గోశాలకు కేటాయించిన భూమి మా బతుకులు ఏం కావాలి తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్నాం. ప్రభుత్వం ఇప్పుడు గోశాలకు ఇస్తే మా బతుకులు ఏం కావాలి. 1954 నుంచి 1998 వరకు పహణీల్లో మా పేర్లు వచ్చాయి. తరువాత సర్కారు భూమి అని వచ్చింది. మోకిలలో ఇచ్చినట్లు ఎకరాకు 750 గజాల చొప్పున పరిహారం ఇస్తే మంచిది. – న్యాలట మహిపాల్, రైతు, ఎనికేపల్లిప్రభుత్వమే ఆదుకోవాలి సాగుచేసుకుంటున్న భూములు తీసుకుంటే మా బతుకులు ఆగమైతయి. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. ఎంత పరిహారం ఇస్తామన్న విషయం అధికారులు సరిగా చెప్పడంలేదు. ఎమ్మెల్యేపైనే భారం పెట్టాం. ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడి పరిహారం ఇప్పిస్తామని చెప్పారు. – అనుసూయ, మహిళా రైతు, ఎనికేపల్లి -
రెండేళ్లకోసారి..
కొడంగల్: పేదల తిరుపతిగా పేరుగాంచిన పట్టణంలోని మహాలక్ష్మీ సమేత వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జులై 19వ తేదీ నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆదివారం ఆలయ ధర్మకర్తలు భక్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. పవిత్రోత్సవాల నిర్వహణపై చర్చించారు. ప్రతి ఒక్కరూ భగవంతుని కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ధర్మకర్తలు కోరారు. ఆలయ పవిత్రతతో పాటు పట్టణ పురోగతి కోసం పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కొడంగల్ శ్రీవారి ఆలయంలో రెండేళ్లకు ఒకసారి ఈ పవిత్రోత్సవాలు జరుగుతాయని వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులతో పాటు ఆలయ అర్చకులు పాల్గొని ఉత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తారని తెలిపారు. శ్రీవారి ఆలయంలో నిత్యం జరిగే కై ంకర్యాలు, ధూప దీప నివేదనలో ఏమైనా పొరపాటు జరిగితే మంత్ర లోపము, ద్రవ్యలోపము, క్రియా లోపము వలన కలుగు దోషములకు నివారణ కలుగుతుందన్నారు. లోక కల్యాణంతోపాటు విశ్వశాంతి కలుగుతుందన్నారు. జూలై 22న ఉత్సవాలు ముగుస్తాయని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీవారి పవిత్రోత్సవాలు జూలై 19 నుంచి టీటీడీ తరహాలో నిర్వహణ పోస్టర్ ఆవిష్కరించిన ఆలయ కమిటీ సభ్యులు -
సాగుకు సాయం.. రైతు మురిపెం
దౌల్తాబాద్: వానాకాలం పంట సాగు సమయంలో ఎకరాకు రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం అందడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఈ సీజన్కు అమలు చేస్తున్న రైతు భరోసా పథకంతో పంటల సాగుకు ధీమా లభించింది. యాసంగి సాగులో ఈ పథకానికి పరిమితి విధించగా ఈ సారి ఎత్తివేసింది. వానాకాలం పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు తొమ్మిది రోజుల్లో జమ చేసింది. తొలిరోజు ఎకరా నుంచి మొదలు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. దుక్కులు సిద్ధం చేసుకుని ఎరువులు విత్తనాలు కొనేందుకు ఎదురుచూస్తున్న సమయంలో సకాలంలో రైతు భరోసా నిధులు విడుదల కావడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న సమయంలో సాయం డబ్బులు జమ కావడంతో రైతులకు ప్రయోజనం చేకూరింది. సాగు ప్రారంభంలోనే... వానాకాలం సాగు పనులు ఇప్పుడిప్పుడే జోరందుకున్నాయి. చాలా చోట్ల పత్తి విత్తనాలు విత్తగా కొన్ని చోట్ల కలుపులు తీస్తున్నారు. ఇప్పటివరకు సరైన వర్షాలు లేకపోవడంతో వరి సాగు పనులు ఆలస్యమవుతున్నాయి. సాగు ప్రారంభంలోనే ఎదురు చూడకుండానే పెట్టుబడికి సాయం నిధులు అందడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. కొడంగల్ డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 56,459 మంది రైతులకుగాను రూ.70.59 కోట్ల నిధులు జమ అయ్యాయని అధికారులు తెలిపారు.భరోసా నిధులతో వ్యవసాయ పనులకు ఊతం -
ఆర్టీసీ టూర్ ప్యాకేజీకి విశేష స్పందన
అనంతగిరి: ఆలయాల సందర్శనకు ఆర్టీసీ ప్రవేశపెట్టిన టూర్ ప్యాకేజీకి విశేష స్పందన లభిస్తుందని వికారాబాద్ డీఎం అరుణ అన్నారు. ఈ ప్యాకేజీలో 64 మంది ప్రయాణికులు ఈ నెల 27న ధర్మపురి ఆలయాల సందర్శనకు బయలుదేరారని చెప్పారు. వికారాబాద్, హైదరాబాద్, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఆలయాల దర్శనానికి ప్రత్యేక ప్యాకేజీలతో రెండు బస్సులు నడిపినట్లు ఆమె తెలిపారు. అరుణాచలం, మంత్రాలయం, భద్రాచలం, పంచారామాలు వివిధ ప్రత్యేక ప్యాకేజీలతో బస్సులు నడుతున్నామని పరిసర ప్రాంత ప్రజలందతా సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. కనీసం 30–40 మంది ప్రయాణికులు ముందుకు వస్తే నేరుగా వారి కాలనీ వద్దకే బస్సు పంపుతామని చెప్పారు. వివరాలకు 99592 26252 నంబర్లో సంప్రదించాలన్నారు. రేణుక ఎల్లమ్మ ఆలయంలో మృత్యుంజయ హోమం నేడు కర్ణాటక మాజీ మంత్రి లింబావళి రాక తాండూరు రూరల్: మండల పరిధిలోని కొత్లాపూర్ శివారులోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. మూడు రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు హోమాలు నిర్వహించనున్నారు. సోమవారం కర్ణాటక మాజీ మంత్రి అరవింద్ లింబావళి తమ ఇంటి దేవత కొత్లాపూర్ రేణుక ఎల్లమ్మ ఆలయానికి విచ్చేయనున్నారు. ఆలయానికి దోషం ఉందని చెప్పడంతో కేరళ నుంచి తొమ్మిది మంది పూజారులతో మృత్యుంజయ హోమం నిర్వహించనున్నారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ నవీన్ రెడ్డి, డైరక్టర్లు రాజు, లాలయ్యగౌడ్, శాంతప్ప, లాల్య నాయక్, ఈశ్వరమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విద్య, ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి పరిగి: విద్య, ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాడుతామని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని తపస్ కార్యాలయంలో జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ప్రతీ ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలున్నా తమదృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రతీ పాఠశాలలో తాగునీటి వసతి కల్పిస్తామన్నారు. ఉపాధ్యాయుల నుంచి వస్తున్న మల్టీ జోన్–2లో ఖాళీగా ఉన్న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీఆర్ఎం దక్షిణ మధ్య క్షేత్రప్రముఖ్ విష్ణువర్థన్రెడ్డి, మండల విద్యాధికారి గోపాల్, రమేశ్యాదవ్, లక్ష్మయ్య, సాయిబాబ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ పరిగి: కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లు రద్దు చేసేందుకు యత్నిస్తున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలనే డిమాండ్తో జూలై 9వ తేదీన నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం పట్టణ కేంద్రంలో సమ్మెకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్మికులపై కక్షసాధింపులకు పాల్పడుతోందన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ దేశ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. -
తాగునీటికి తండ్లాట!
నవాబుపేట: ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామన్న ప్రభుత్వ పెద్దల మాటలు నీటి మీది రాతలుగా మారాయి. అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా కొనసాగుతుంటే ఆ ఊరిలో మాత్రం అలాంటి సదుపాయం లేదు. కేవలం బోరు మోటారుతో తమ అవసరాలను తీర్చుకుంటున్న పరిస్థితి. అది కూడా కాలిపోయి 15 రోజులు అవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వాపోతున్నారు. ఇదీ మండల పరిధిలోని మీనపల్లికలాన్ గ్రామం ఎస్సీ కాలనీలోని దుస్థితి. మిషన్ భగీరథ పైపులైన్ లేదు కాలనీలో దాదాపు 80కిపైగా కుటుంబాలుంటాయి. కానీ ఇప్పటివరకు మిషన్ భగీరథ పైపు లైన్ వేయలేదు. ఒక్క ఇంటికి సైతంకుళాయి కనెక్షన్ బిగించిన పాపాన పోలేదు. గతంలో చేసిన పనులకుగాను కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించకపోవడంతో మధ్యలో వదిలేసినట్లు సమాచారం. దీంతో అప్పటికే ఉన్న ప్రభుత్వ బోరు మోటార్తో మాత్రమే కాలనీవాసులు తమ అవసరాలను తీర్చుకుంటూ వస్తున్నారు. గత 15 రోజులు క్రితం ఉన్న కాస్త మోటారు కాలిపోయింది. స్థానికుల ఫిర్యాదు మేరకు పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి బోరు మోటారును బాగు చేయిస్తామని తీసుకు పోయారు. కానీ ఇంతవరకు తిరిగి తీసుకు రాలేదు. దీంతో కాలనీలో నీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు కార్యదర్శిని సంప్రదిస్తే బోరుమోటారు పూర్తిగా కాలిపోయిందని, కొత్తది కొనడానికి డబ్బులు లేవని చెప్పారు. ఈ సమస్యను ఉన్నతాధికారులకు చెప్పామన్నారు. డబ్బులు రాగానే నూతన బోరుమోటారు తీసుకు వస్తామని తెలిపినట్లు గ్రామస్తులు వివరించారు. సమస్యను పరిష్కరిస్తా ఈ విషయమై గ్రామ ప్రత్యేకాధికారి బుచ్చయ్య(తహసీల్దార్) వివరణ కోరగా.. గ్రామంలోని ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య ఉందని ఇటీవలే తన దృష్టికి వచ్చిందన్నారు. సోమవారం తాను స్వయంగా వెళ్లి మోటారు బిగించి తాగునీటి సమస్య పరిష్కరిస్తానని తెలిపారు. 15 రోజులుగా తీవ్ర అవస్థలు వ్యవసాయ బోర్లను ఆశ్రయించిన వైనం పట్టించుకోని అధికార యంత్రాంగం మీనపల్లికలాన్ ఎస్సీకాలనీ దుస్థితి -
కొరత చూపి.. రైతులను దోచేసి
● అధిక ధరలకు ఎరువుల విక్రయాలు ●వానాకాలం సాగులో 7ఇక్కట్లు కొందుర్గు: ప్రస్తుత వానాకాలం సీజన్లో రైతులు పత్తి, మొక్కజొన్న, వరి తదితర పంటల సాగు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇందుకోసం ప్రస్తుతం మొదటి దఫా అధికంగా రైతులు డీఏపీ వాడుతారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం డీఏపీ బస్తా ధర రూ.1,350 ఉంటే డీలర్లు రూ.1,500 వరకు అన్నదాతలకు విక్రయిస్తున్నారు. అదే విధంగా యూరియా బస్తా ధర రూ.266 ఉండగా రూ.300 పైనే అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. షాద్నగర్ నియోజకవర్గంలోనే కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండలాల్లో అధికంగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తారు. ఇక్కడ పత్తి, మొక్కజొన్న పంటలను అధికంగా సాగు చేస్తారు. కానీ ప్రస్తుతం డీఏపీ, యూరియా కొరత సృష్టించడంతో తాము అధిక ధరలకు ఎరువులు కొనుగోలు చేసి నష్టపోతున్నామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై వ్యవసాయాధికారులను వివరణ కోరగా డీఏపీ కొరత ఉన్నది వాస్తవమేనని, వాటి స్థానంలో కాంప్లెక్స్ ఎరువులు వాడా లని సూచిస్తున్నారు. కాగా కాంప్లెక్స్ ఎరువులు మొదటి దఫాలో వాడడంతో పంటలు బాగా పెరిగి చీడపీడలకు గురయ్యే ప్రమాదం ఉంటుందని వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. -
ఫుట్పాత్ల ఆక్రమణలపై
శంషాబాద్: 15 రోజుల కిందట సాతంరాయిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీకి సమీపంలో రోడ్డుకు ఆనుకుని ఉన్న చిరువ్యాపారాలకు సంబంధించిన డబ్బాలు తొలగించాలని ఉన్నతస్థాయి నుంచి అందిన ఆదేశాలను అధికారులు క్షణాల్లో పూర్తి చేశారు. పక్కాగా పోలీసుల సహకారంతో జేసీబీలను ఏర్పాటు చేసి అక్కడున్న గరీబోళ్ల డబ్బాలను వెంటనే తొలగించి పెద్దసార్ల ఆదేశాలను ఆదేశాలను తూచాతప్పకుండా పూర్తి చేశారు. నాలాను ఆనుకుని ఆక్రమణలున్న కారణంగానే ఫిర్యాదులు అందగానే వాటిని తొలగించినట్లు మున్సిపల్ అధికారులు చెప్పుకొచ్చారు. మరి ఇక్కడ..? శంషాబాద్ పట్టణ ప్రధాన కేద్రంలో ప్రజలకు తీవ్ర ఇబ్బంది కరంగా మారుతున్న ఫుట్పాత్ల ఆక్రమణపై మున్సిపల్ అధికారులు ఏడేళ్లుగా ఒక్కటంటే ఒక్కసారి కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గతంలో అనేక మార్లు ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు కౌన్సిల్లో తీర్మానాలు చేసి అవి కార్చాచరణకు నోచుకున్న దాఖలు కూడా లేవు. రోడ్డులను ఆక్రమించి హోటళ్లు, వ్యాపారాలు చేసుకుంటున్నా కన్నెత్తి చూసిన పాపాన పోవడం లేదు. అద్దెకిచ్చేస్తున్నారు... ఫుట్పాత్లను ఆక్రమించి కొందరు సొంత వ్యాపారాలను విస్తరిస్తుండగా మరికొందరు తమ దుకాణాల ముందు చిరువ్యాపారులకు అద్దెకిస్తున్నారు. రోడ్డును అద్దెకిచ్చి ఏళ్లుగా లక్షల రూపాయలు సంపాదిస్తున్న తీరు కూడా ఇక్కడ షరామాములే అన్నట్లుగా మారింది. పట్టణంలోని రాళ్లగూడ రహదారిలో ఫిరంగి నాలాను ఆనుకుని పదుల సంఖ్యలో డబ్బాలను ఏర్పాటు చేసి అద్దెకిచ్చేస్తున్నారు. దీనిపై ఇంతవరకు మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఫుట్పాత్ల ఆక్రమణ కారణంగా సాధారణ ప్రజలతో పాటు ప్రయాణికులు సైతం నిత్యం నరకం చూస్తున్నారు. జనాభా రద్దీలేని సాతంరాయిలో పెద్దసార్ల ఆదేశాలతో ఆగమేఘాల మీద ఆక్రమణ తొలగింపులు చేసిన అధికారులు అదే రీతిన పట్టణంలో ఉన్న ఫుట్పాత్ల ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హైవే ఫుట్పాత్పై కంటైనర్ వేసి ఏర్పాటు చేసిన హోటల్ శంషాబాద్లో విచ్చలవిడిగా ఫుట్పాత్ల ఆక్రమణ కంటైనర్ల ఏర్పాటు చేసిదందా చేస్తున్నా చర్యలు శూన్యం సాతంరాయిలో యుద్ధప్రాతిపదికన డబ్బాలు తొలగించిన మున్సిపల్ అధికారులు పట్టణ ప్రధాన కేంద్రంలో పట్టించుకోని యంత్రాంగంఆక్రమణలను తొలగిస్తాం.. పట్టణంలో ఫుట్పాత్లను ఆక్రమించుకుని ఉ న్న కట్టడాలు, డబ్బాలను తప్పకుండా తొలగిస్తాం. రహదారులను ఆక్రమించి ఉంటే కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఆక్రమణలు ఎవరివైనా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. – సుమన్రావు, శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ -
సర్కారు బడికి రాంరాం!
ఏటా తగ్గుతున్న విద్యార్థుల నమోదువికారాబాద్: ప్రభుత్వ పాఠశాలలపై చాలామంది తల్లిదండ్రులకు నమ్మకం కుదరడం లేదు. నిష్ణాతు లైన ఉపాధ్యాయులు ఉన్నా..ఫీజుల బాధ లేకు న్నా .. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, మ ధ్యాహ్న భోజన సదుపాయం కల్పిస్తున్నా చాలా మంది ప్రైవేటుకే మొగ్గుచూపుతున్నారు. గడిచిన ప దేళ్ల కాలంలో విద్యా వ్యవస్థలో వేగంగా చోటు చేసుకుంటున్న మార్పులతో ప్రభుత్వ బడులకు ప్రైవేటు స్కూళ్లు సమాంతర వ్యవస్థగా తయారయ్యాయి. గ తంలో పట్టణ ప్రాంత వాసులు మాత్రమే వారి పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చేర్చేవారు. ప్రస్తుతం గ్రా మీణ ప్రాంత ప్రజలు కూడా ప్రైవేటు బాట పట్టా రు. ఇది సర్కారు బడులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.గడిచిన నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య 40శాతం మేర తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి.జిల్లాలో 1,0 63 ప్రభుత్వ బడులు ఉండగా84,208 మంది విద్యార్థులు ఉన్నారు.185 ప్రైవేటు పాఠశాలల్లో 45,042 మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సర్కారు బడులకు గడ్డు కాలమే నని విద్యా వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడికి పంపడంలోనూ వివక్ష పురుషాధిక్య సమాజంలో అనేక రూపాల్లో లింగవివక్ష అనాదిగా కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే.. బాల్య వివాహాలు, ఇంట్లో పనులు చేసే విషయంలో, పునర్వివాహాల్లో లింగవివక్ష కొట్టొచ్చి నట్లు కనిపించేది. గతంలో మగపిల్లలను బడులకు పంపి ఆడపిల్లలకు చదువెందుకులే అంటూ చిన్నచూపు చూసేవారు. బ్రూణహత్యల్లోనూ లింగవివక్ష కనిపించేది. తాజాగా చిన్నారులను బడులకు పంపించే విషయంలోనూ లింగవివక్ష స్పష్టంగా కనిపిస్తోంది. పట్టణాల్లో బాల బాలికలిద్దరినీ వారి ఆర్థిక స్తోమతను బట్టి ప్రైవేటు స్కూళ్లకు పంపిస్తుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వివక్ష కనిపిస్తోంది. ఇంట్లో ఒక ఆడపిల్ల ఒక మగ పిల్లాడు ఉంటే వారిలో కుమారుడిని ప్రైవేటుకు కుమార్తెను ప్రభుత్వ బడికి పంపుతున్నారనే వాదన వినిపిస్తోంది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు జరిపిన సర్వేల్లో కూడా ఈ విషయం స్పష్టమవుతోంది. ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు బడులలో నమోదవుతున్న బాలబాలికల నిష్పత్తి గమనిస్తే కూడా ఈ విషయం నిజమనే అనిపిస్తుంది. ప్రైవేటులో విద్యార్థుల సంఖ్య 24,773 ఉండగా బాలికలు 20,269 మంది ఉన్నా రు. అంటే బాలికల కంటే బాలురు సంఖ్య 4,504 మంది ఎక్కువ. అదే ప్రభుత్వ బడులలో బాలుర సంఖ్య 41,285 ఉండగా.. బాలికలు 42,923 మంది ఉన్నారు. అంటే బాలుర కంటే బాలికలు 1,638 మంది అధికంగా నమోదయ్యారు. గడిచిన నాలుగేళ్లలో ప్రభుత్వ బడులలో విద్యార్థుల నమోదు సంఖ్య ఇలా.. విద్యా సంవత్సరం చేరిన విద్యార్థులు 2022 – 23 9,085 2023 – 24 7,784 2024 – 25 7,078 2025 – 26 6,124 నమోదుపై పది ఫలితాల ప్రభావం పదో తరగతి ఫలితాలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదుపై ప్రభావం చూపుతున్నాయి. పది ఫలితాల్లో జిల్లా ప్రతిసారీ చివరి స్థానంలో నిలుస్తోంది. దీంతో తల్లిదండ్రులు పిల్లలను సర్కారు బడిలో చేర్చేందుకు జంకుతున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా విద్యాశాఖ దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. పదేళ్ల క్రితం ప్రభుత్వ బడులల్లో ఒకటవ తరగతిలో 9,500 మంది విద్యార్థులు నమోదు కాగా ఈ ఏడాది 6,124 మందితో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. ప్రైవేటు స్కూళ్లలో మాత్రం 2,640 మంది నుంచి 7,522 మందికి చేరడం సర్కారు బడుల పనితీరుకు అద్దం పడుతోంది. నాలుగేళ్లలో 40శాతం కిందకు.. ప్రభావం చూపుతున్న పది ఫలితాలు ప్రైవేటుకే మొగ్గు చూపుతున్న తల్లిదండ్రులుపాఠశాలల బలోపేతానికి ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఆశించిన మేర ఫలితాలు రావడం లేదు. విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ఏటా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా బాలకార్మికులను స్కూళ్లలో చేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవేవీ విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కలసిరావడం లేదు. ఎప్పటి లాగే ఈసారి కూడా సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గింది. పిల్లల సంఖ్య పెంచేందుకు కృషి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నాం. పదో తరగతి ఫలితాల్లో వెనుకబడటానికి గల కారణాలను అన్వేషిస్తున్నాం. రెండేళ్ల క్రితం 65శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత కాగా గత ఏడాది 73.97 శాతంతో కాస్త మెరుగైన ఫలితాలు సాధించాం. ఈ సారి వంద సాతం ఫలితాల కోసం కృషి చేస్తున్నాం. ప్రభుత్వ బడులపై నమ్మకం కలిగించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నాం. – జి.రేణుకాదేవి, డీఈఓ -
ఉద్యాన పంటలకు ప్రోత్సాహం
చేవెళ్ల: ఉద్యాన పంటలు, డెయిరీల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. మున్సిపల్ పరిధిలోని దేవునిఎర్రవల్లిలో శనివారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణరెడ్డి పొలంలో 21 ఎకరాల్లో చేపట్టిన ఆయిల్పామ్ ప్లాంటేషన్ను స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఉద్యానశాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్బాషాలతో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆయిల్పామ్ డిమాండ్కు తగిన విధంగా రైతులు ముందుకురావాలన్నారు. సంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య పంటలపై దృష్టిసారించాలని సూచించారు. రాష్ట్రంలో డిమాండ్కు సరిపడా కూరగాయలు పండకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని తెలిపారు. ఆయిల్పామ్ సాగుకు తెలుగు రాష్ట్రాల భూములు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. దేశానికి సరిపడా కావాలంటే 70లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయాల్సి ఉందన్నారు. తెలంగాణలో జిల్లాకో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటే లక్ష్యమని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్ల రైతుభరోసా నిధులు విడుదల చేశామని వెల్లడించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ డ్రిప్ పరికరాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జిల్లాలో శనివారం ఒక్కరోజే 557 ఎకరాల్లో ప్లాంటేషన్ చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. 5వేల ఎకరాల్లో పంట సాగుకు చర్య లు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముప్పై ఏళ్ల పాటు ఆదాయం హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ.. ఆయిల్పామ్ సాగుకు ఎకరానికి 52 వేల సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు. ఒక్కసారి సాగు చేస్తే ముప్పై ఏళ్ల పాటు ఆదాయం వస్తుందన్నారు. ఇది రైతులకు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వంటి కార్యక్రమమని స్పష్టంచేశారు. ఫ్యాక్టరీ ఏర్పాటు చేయండి జిల్లాతోపాటు చేవెళ్ల నియోజకవర్గంలోని రైతుతులు ఎక్కువగా ఆయిల్పామ్సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. స్థానికంగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. అందరికీ అందుబాటులో ఉండేలా గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్లో లేదా అజీజ్నగర్లో ఏర్పాటు చేయాలన్నారు. డ్రోన్ ఇప్పించండి సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. మంత్రి స్ఫూర్తితోనే ఆయిల్పామ్సాగుకు ముందుకు వచ్చినట్లు చెప్పారు. తమ గ్రామంలోని రైతు సంఘానికి ఓ డ్రోన్ ఇప్పించాలని, చేవెళ్లలో డివిజన్ వ్యవసాయ, ఉద్యాన కార్యాలయలకు భవనాలు కేటాయించాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో గిండ్డంగుల సంస్థల చైర్మన్ ఆర్.నాగేశ్వర్రావు, ఆర్డీఓ చంద్రకళ, జేడీఏ నర్సింహ్మరావు, పీఏసీఎస్ చైర్మన్లు వెంకట్రెడ్డి, సురేందర్రెడ్డి, గోనే ప్రతాప్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్యగౌడ్, గోపాల్రెడ్డి, నాయకులు జనార్దన్రెడ్డి, కృష్ణారెడ్డి, మానిక్యరెడ్డి, మధుసూదన్గుప్తా, ఆగిరెడ్డి, వసంతం, దర్శన్, కాలె శ్రీకాంత్, ప్రభాకర్ పాల్గొన్నారు. వాణిజ్య రైతులు దృష్టిసారించాలి Ð]lÅÐ]l-ÝëĶæ$ Ô>Q Ð]l$…{† ˘™èl$Ð]l$ÃÌS ¯éVóS-ÔèæÓ-ÆŠ‡-Æ>Ð]l# దేవునిఎర్రవల్లిలో ఆయిల్పామ్ సాగు ప్లాంటేషన్ -
‘బెస్ట్ అవైలబుల్’కు విద్యార్థుల ఎంపిక
అనంతగిరి: షెడ్యూల్ కులాల, గిరిజన సంక్షేమ శా ఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్కు డ్రా పద్ధ తిన విద్యార్థులను ఎంపిక చేసినట్లు అదనపు కలెక్టర్ ఎం.సుధీర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థుల ఎంపిక కోసం డ్రా తీశారు. గిరిజన సంక్షేమ శాఖలో 3, 5, 8వ తరగతులకు 22 మందిని తల్లిదండ్రుల సమక్షంలో ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. షెడ్యూల్ కులాల విభాగంలో ఒకటవ తరగతిలో 88 ఖాళీలకు గాను 139 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. గ్రూపుల వారీగా సీట్ల కేటాయింపు జరిగిందని వివరించారు. గ్రూప్ వన్లో 6 సీట్ల గాను ఇద్దరు, గ్రూప్ 2లో 53 సీట్లకు గాను 87 మంది దరఖాస్తు చేశారని తెలిపారు. గ్రూప్ 3లో 29 సీట్లకు గాను 50 మంది దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. ఒకటవ తరగతిలో 88 సీట్లకు గాను 84 మంది విద్యార్థులు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. 5వ తరగతిలో 91 సీట్లకు గాను 17 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా వారందరినీ ఎంపిక చేయడం జరిగిందన్నారు. డ్రా పద్ధతిలో ఎంపికై న విద్యార్థులకు జూలై 3న పత్రాలను అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ అధికారి కమలాకర్రెడ్డి, సహాయ సంక్షేమ అధికారులు శుక్రవర్ధన్ రెడ్డి, వీరానందం, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
పూడూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానా లు గెలిచి సత్తా చాటాలని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి కార్యకర్తలు, నాయకులకు సూచించారు. శనివారం మండలంలోని మన్నేగూ డలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో కలసికట్టుగా పని చేసి పార్టీ నాయకులను గెలిపించుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు. గ్రామస్థాయి నుంచి మండలస్థాయి వరకు మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవాలని సూచించారు. మండల కార్యవర్గంలో ఖాళీగా ఉన్న పదవులను వారంలోగా భర్తీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ సతీష్రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు ఆనందం, డీసీసీ కార్యదర్శులు శ్రీనివాస్రెడ్డి, పెంటయ్య, అజీం పటేల్, శ్రీనివాస్, షకీల్ తదితరులు పాల్గొన్నారు. త్వరలో అన్ని కమిటీలు వేస్తాం కుల్కచర్ల: త్వరలో అర్హులైన వారికి పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు అందుతాయని, ఆ దిశగా సీఎం రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారని పరిగి ఎమ్మెల్యే టీ.రామ్మోహన్రెడ్డి అన్నారు. శనివారం కుల్కచర్ల, చౌడాపూర్ మండల కేంద్రాల్లో కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో గ్రామ, మండల కమిటీ, జిల్లా కమిటీలను ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. పార్టీకోసం కష్టపడే వారికి చోటు లభిస్తుందని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర పరిశీలకులు నరేందర్, వినోద్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, పీఏసీఎస్ చైర్మన్ మొగులయ్య, పాంబండ ఆలయ చైర్మన్ మైపాల్ రెడ్డి, బ్లాక్ బి అధ్యక్షుడు భరత్కుమార్, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు వెంకటయ్య, జిల్లా కార్యదర్శి నర్సింలు యాదవ్, యువజన విభాగం మండల అధ్యక్షుడు జంగయ్య, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్నాయక్, మాజీ ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ అంజిలయ్య తదితరులు పాల్గొన్నారు. ● ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి -
కొడంగల్లో ఆర్పీఎఫ్ బలగాల కవాతు
కొడంగల్: పట్టణంలోని పలు కాలనీల్లో ఆర్పీఎఫ్ బలగాలు శనివారం కవాతు నిర్వహించాయి. 99 బెటాలియన్ హకీంపేటకు చెందిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు జవానులు కొడంగల్ పుర వీధుల గుండా తిరిగారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించడం వల్ల ప్రజల్లో భరోసా కల్పించడం కోసం కవాతు నిర్వహిస్తున్నట్లు సీఐ శ్రీధర్రెడ్డి, ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. అంబేడ్కర్ చౌరస్తా నుంచి మెయిన్ రోడ్డు మీదుగా వినాయక చౌరస్తా, సంత బజార్, బ్రాహ్మనవాడ, తెలుగుగేరి, బాలాజీనగర్ మీదుగా కవాతు సాగింది. ప్రజలతో మమేకం కండి ఎస్పీ నారాయణరెడ్డి అనంతగిరి: ప్రజలతో మమేకమై పనిచేస్తే మంచి పేరు వస్తుందని ఎస్పీ నారాయణరెడ్డి సిబ్బందికి సూచించారు. శనివారం వికారాబాద్లోని ఎస్పీ కార్యాలయంలో తాండూరు పీఎస్లో ఎస్ఐగా పనిచేసి ఉద్యోగ విమరణ పొందుతున్న మైపాల్రెడ్డికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఘనంగా సన్మానించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాల పాటు పోలీసు ఉద్యోగం చేయడమంటే చాలా గొప్ప విషయమన్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న అధికారిగా మైపాల్రెడ్డి మంచిపేరు తెచ్చుకున్నారని కొనియాడారు. విధి నిర్వహణలో ప్రజలకు మనం చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ వీరేష్, జిల్లా పోలీసు ప్రెసిడెంట్ అశోక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. హారికకు ప్రావీణ్య పురస్కార్ అవార్డు కొడంగల్: పట్టణంలోని నవీన ఆదర్శ పాఠశాల విద్యార్థిని హారికకు రాష్ట్ర స్థాయిలో ప్రావీణ్య పురస్కార్ అవార్డు వరించింది. జాతీయ సెమ్స్ ఒలంపియాడ్ ఆధ్వర్యంలో మార్చి నెలలో జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలు నిర్వహించారు. ఈ పోటీల్లో హారిక రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించింది. శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో సెమ్స్ ఫౌండేషన్ డైరెక్టర్ రాంచందర్రెడ్డి, ట్రస్టు రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి హారికకు అవార్డు, మెమొంటో, మెడల్ అందజేశారు. శాలువా కప్పి అభినందించారు. నవీన ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరేష్ రాజ్ను విశేష పురస్కార్ అవార్డుతో సన్మానం చేశారు. యాదవులపై దాడులను ఆపాలి బీసీ సంఘం జాతీయ కార్యదర్శి బీరయ్య యాదవ్ మోమిన్పేట: ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో యాదవులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీసీ సంఘం జాతీయ కార్యదర్శి బీరయ్య యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదవులపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కార్య క్రమంలో నాయకులు మల్లయ్య, యాదగిరి యదవ్, మానయ్య, అంజయ్య, బిచ్చయ్య, అంజి, పాపయ్య, శ్రీను పాల్గొన్నారు. -
రేషన్ బియ్యం పంపిణీ గడువు పెంచాలి
● బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ యాదవ్ బంట్వారం: ప్రస్తుతం మూడు నెలల బియ్యం పంపిణీ ఒకే సారి ఇస్తున్నందున గడువును మరో 15రోజుల పాటు పొడిగించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అత్తెల్లి లక్ష్మణ్ యాదవ్ శనివారం ఓ ప్రకటనలో కోరారు. పౌరసరఫరాల శాఖ విధించిన గడు వు ఈ నెల 30వ తేదీతో ముగుస్తుందని ఈ క్రమంలో చాలామంది లబ్ధిదారులు రేషన్ బియ్యం తీసుకోలేకపోయారని అన్నారు. మూడు నెలల రేషన్ కోటా ఒకే సారి ఇస్తుండటంతో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందన్నారు. ఒక్కో లబ్ధిదారుడికి రేషన్ ఇవ్వాలంటే 20 నిమిషాలకు పైగా సమయం పడుతోందన్నారు. త్వరగా వేలిముద్రలు రాకపోవడం, ఇతర కారణాలతో అర్హులందరూ రేషన్ తీసుకోలేకపోయారని ఆయన తెలిపారు. మరింత గడువు పెంచాలని డిమాండ్ చేశారు.. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. -
అటవీ భూమి కబ్జాకు యత్నం
● అడ్డుకున్న ఫారెస్టు అధికారులు ● పరారీలో నిందితులు ● కేసు నమోదు బషీరాబాద్: మండలంలోని మైల్వార్ రిజర్వ్డ్ ఫారెస్టులో ఆక్రమణలు ఆగడం లేదు. తాజాగా మైల్వార్ తండాకు చెందిన ఇద్దరు వ్యక్తులు మూడు రోజులుగా సర్వే నంబర్ 218లో రెండు ఎకరాల అటవీ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించారు. సుమా రు 50 వరకు చెట్లను నరికి ట్రాక్టర్తో చదును చేశారు. విషయం తెలుసుకున్న అటవీ సెక్షన్ అధికారులు స్నేహశ్రీ, ఫీర్యానాయక్, మమత, బీట్ అధికారి మల్లప్ప అక్కడికి చేరుకున్నారు. అధికారుల రాకను గుర్తించిన కబ్జాదారులు, ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యారు. తండాకు చెందిన గోపాల్ రాథోడ్, రతన్ రాథోడ్ అటవీ భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. భూమిని చదును చేసేందుకు మైల్వా ర్కు చెందిన షఫీ ట్రాక్టర్ను వినియోగించినట్లు తేల్చారు. వాహనాన్ని సీజ్ చేయడానికి వెళితే అప్పటికే దాన్ని రహస్య ప్రాంతానికి తరలించి సదరు యజమాని పరారైనట్లు అధికారులు తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సెక్షన్ అధికారి స్నేహశ్రీ తెలిపారు. అటవీ ప్రాంతంలో చెట్లను నరికినా, భూమిని కబ్జా చేయాలని ప్రయత్నించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
గంజాయి పట్టివేత
కొడంగల్: ఇద్దరు వ్యక్తుల నుంచి అరకిలో గంజాయిని స్వాధీనం చేసుకున్న ఘటన కొడంగల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీధర్రెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాండూరుకు చెందిన శ్రీనివాస్రెడ్డి, నిఖిల్ బీదర్లోని ఇరానీగల్లిలో అరకిలో గంజాయిని కొనుగోలు చేశారు. దీన్ని తీసుకొని బుల్లెడ్ బండిపై కొడంగల్లో విక్రయించడానికి వస్తుండగా పట్టణ శివారులో పోలీసులు పట్టుకున్నారు. విచారణ అనంతరం వారిపై కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. ఈ సమావేశంలో ఎస్ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో రైతు మృతి
బంట్వారం: ప్రమాదవ శాత్తు విద్యుత్ షాక్తో ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం కోట్పల్లి మండలంలోని బార్వాద్ గ్రామంలో చోటు చేసుకుంది. కోట్పల్లి ఎస్ఐ శైలజ తెలిపిన వివరాల ప్రకారం.. పట్లోల్ల మహేందర్రెడ్డి (57) తన పొలం చుట్టూ సోలార్ వైర్ వేసుకున్నాడు. ఎప్పటిలాగే ఉదయం వేళ పొలం పనులకు వెళ్లాడు. అక్కడ విద్యుత్ తీగ తెగిపడి సోలార్ వైర్పై పడి ఉంది. ఈ విషయాన్ని గమనించకుండా వెళ్లిన మహేందర్రెడ్డి సోలార్ వైర్కు కాలు తగలడంతో విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. మృతుడి భార్య నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారని ఎస్ఐ శైలజ తెలిపారు. ట్రాక్టర్ ట్రాలీ ఢీకొని వ్యక్తి మృతి కొడంగల్ రూరల్: ట్రాక్ట ర్ ట్రాలీ ఢీకొట్టడంతో బైక్పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని రావులపల్లి సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని అప్పాయిపల్లికి చెందిన శేఖర్(30) రావులపల్లిలోని ఓ బేకరీలో పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే శనివారం ఉదయం అప్పాయిపల్లి నుంచి విధులకు బయల్దేరాడు. ఈ క్రమంలో రావులపల్లి సమీపంలో ముందు వెళ్తున్న ఓ ట్రాక్టర్ టైర్ అకస్మాత్తుగా పేలడంతో ట్రాలీ పక్కకు తిరిగి వెనక ఉన్న బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శేఖర్ కిందపడడంతో తీవ్రగాలయ్యాయి. ఇది గమనించిన పలువురు 108లో కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా శేఖర్ మృతిచెందాడు. మృతదేహాన్ని కొడంగల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు. శేఖర్ భార్య అంబమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ జీవీ సత్యనారాయణ తెలిపారు. వ్యక్తి అదృశ్యం పహాడీషరీఫ్: వ్యక్తి అదృశ్యమైన సంఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పహాడీషరీఫ్కు చెందిన హబీబుల్లాఖాన్ కుమారుడు రహ్మతుల్లాఖాన్(40) తాగుడకు బానిసయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు 2024 జనవరిలో బాలాపూర్ మెట్రో సిటీలోని మా హెల్ప్ డిటెక్షన్ సెంటర్లో చేర్పించారు. ఆరు నెలల పాటు చికిత్స పొందిన అనంతరం రహ్మతుల్లా ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. అతని ఆచూకీ కోసం వెతికినా లాభం లేకపోవడంతో సోదరుడు అంజదుల్లాఖాన్ శుక్రవారం రాత్రి పీఎస్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు బాలాపూర్ పీఎస్లో లేదా 87126 62366 నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. వ్యక్తి బలవన్మరణం మాడ్గుల: చికెన్ తీసుకుని వస్తానని ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని నర్సాయిపల్లిలో చోటు చేసుకుంది. సీఐ వేణుగోపాల్రావు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన కడారి అంజన్కుమార్(36) శుక్రవారం సాయంత్రం చికెన్ తీసుకువస్తానని చెప్పి వేయిరూపాయలు తీసుకుని కొలుకులపల్లికి వెళ్లాడు. రాత్రైనా రాకపోవడంతో ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది. శనివారం గ్రామ శివారులోని గుట్టమీద రేల చెట్టుకు పంచతో ఉరేసుకున్నట్లు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. మృతుడికి భార్య అలివేలు, ఓ కూతురు ఉన్నారు. అంజన్కుమార్ తల్లి అంజమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అభివృద్ధి పనులు ప్రారంభం రాజేంద్రనగర్: శివరాంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.3 కోట్లతో మౌలిక వసతులను కల్పించేందుకు విర్టుసా మల్టీ నేషనల్ కంపెనీ ముందుకు వచ్చింది. పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పడమటి శ్రీధర్ రెడ్డి చేతులు మీదుగా శనివారం పూజ చేశారు. ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లింగ్, భవనం మొత్తాకి ఐరన్ గ్రిల్స్, పెయింటింగ్ మొదటి విడదతలో చేపట్టింది. ఈ మొత్తం పని జరిగితే కార్పొరేట్ పాఠశాల భవనం మాదిరిగా ఉంటుంది. -
కోర్టు కాంప్లెక్స్ సందర్శన
ఇబ్రహీంపట్నం: జిల్లా ప్రధాన న్యాయయూర్తి కర్ణ కుమార్ శనివారం ఇబ్రహీంపట్నం కోర్టు కాంప్లెక్స్ను సందర్శించారు. ఇక్కడ కొనసాగుతున్న 15వ అదనపు జిల్లా న్యాయస్థానం, సీనియర్, జూనియర్ కోర్టులను పరిశీలించి, ప్రాంగణంలో మొక్కలు నాటారు. అదనంగా కోర్టు బిల్డింగ్, క్యాంటిన్, ఫ్యామిలీ కోర్టు తదితర అవసరాలకు సంబంధించిన ప్రతిపాదనలను పంపిస్తే.. తాను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి పనులు వేగవంతమయ్యేలా చూస్తా నని తెలిపారు. ఆయన వెంట ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్ శ్రీదేవి, అదనపు సీనియర్ సివిల్ జడ్జి రీటా లాల్చంద్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి యశ్వంత్సింగ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముద్దం వెంకటేశం, ప్రధాన కార్యదర్శి అరిగే శ్రీనివాస్కుమార్, ఉపాధ్యక్షులు భాస్కర్, సహాయ కార్యదర్శి కృష్ణ, సీనియర్ న్యాయవాదులు శ్రీనివాస్రెడ్డి, అంజన్రెడ్డి, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం బార్ ఆధ్వర్యంలో జిల్లా న్యాయమూర్తి కర్ణకుమార్ను ఘనంగా సన్మానించారు. కోర్టు ఆవరణలో మొక్కలు నాటిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణకుమార్ బార్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం -
ఆలయాలకు దారి మూసేయడం తగదు
పహాడీషరీఫ్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నగర శివారులోని విలువైన ప్రభుత్వ భూములను విక్రయించడమే పనిగా పెట్టుకుందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి విమర్శించారు. శనివారం ఆమె గ్రామస్తులతో కలిసి హౌజింగ్ బోర్డు అధికారులు ప్రీ కాస్ట్ గోడలను నిర్మిస్తున్న మామిడిపల్లిలోని దొంతరాల గుట్టపై ఉన్న మల్లన్న స్వామి, ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆలయానికి వెళ్లకుండా అధికారులు ప్రహారీ నిర్మిస్తున్నారని స్థానికులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ ఎక్కడ ప్రభుత్వ భూములున్నాయో గుర్తించి, వాటిని అమ్మడమే ఎజెండాగా పెట్టుకుందన్నారు. హెచ్సీయూ భూముల విక్రయం వెలుగులోకి వచ్చి ఆగిపోవడంతో, చివరకు ఆ భూములను తాకట్టు పెట్టి బ్యాంక్లలో రూ.10 వేల కోట్లు రుణం తీసుకొచ్చిందన్నారు. ఇతర ప్రాంతాలలోని భూములను కూడా విక్రయించడంలో భాగంగానే రావిరాలలోని భూముల వద్దకు రావడంతో అడ్డుకున్నామన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నిర్మాణ సమయంలో మామిడిపల్లి రైతులు పెద్ద ఎత్తున పొలాలు ఇచ్చారన్నారు. ఇందులోని 50 ఎకరాలను ప్రభుత్వం హౌజింగ్ బోర్డుకు కేటాయించిందన్నా రు. రైతులకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వనందున, హౌజింగ్ బోర్డు అధికారులు స్థలాన్ని ఆధీనంలోకి తీసుకునే సమయంలో రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని అప్పట్లోనే కోరామని గుర్తు చేశారు. విమానాశ్రయం నిర్మాణానికి ముందే ఇక్కడ ఆలయాన్ని నిర్మించుకున్నారని, ప్రస్తుతం ఆలయానికి కూడా వెళ్లకుండా అధికారులు ప్రీ కాస్ట్ వాల్ నిర్మించడం సరికాదన్నారు. దేవాలయం జోలికి రావద్దని అధికారులకు సూచించారు. రావిరాల జొన్నాయిగూడలో లక్ష్మీనర్సింహ స్వామి ఆలయానికి గతంలో 30 ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందని, ప్రస్తుతం అవసరం లేనప్పటికీ, పాత రోడ్డును వదిలేసి ఆలయు భూ ముల్లో నుంచి కొత్త రోడ్డు వేస్తున్నారన్నారు. అనంతరం ఆమె హౌజింగ్ బోర్డు అధికారులను ఫోన్లో సంపద్రించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పవన్ కుమార్ యాదవ్, శివకుమార్, ఆలయ కమిటీ ప్రతినిధులు నరేష్ యాదవ్, గోపాల్ యాదవ్, బాలరాజు యాదవ్, గ్రామస్తులు నందీశ్వర్, దశరథ, శ్రీనివాస్ రెడ్డి, రంగనాథ్, మహేందర్ యాదవ్, శంకర్ యాదవ్, చంద్రయ్య యాదవ్, ఎల్.శ్రీనివాస్, ఎన్.యాదగిరి, కె.బాబు తదితరులు పాల్గొన్నారు. ఎమ్యెల్యే, మాజీ మంత్రి సబితారెడ్డి -
దేశ రక్షణలో యువత కీలకం
మొయినాబాద్ రూరల్: దేశ రక్షణలో యువత కీలకమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. హిమాయత్నగర్ చౌరస్తాలోని స్వామి నారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ పాఠశాలలో శనివారం నిర్వహించిన ఇన్వెస్టించర్ కార్యక్రమ ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే దేశభక్తితో పాటు రాజకీయాలపై మక్కు వ పెంచుకోవాలన్నారు. దేశ భద్రతలో భాగస్వా ములు కావాలని పిలుపునిచ్చారు. పాఠశాల ప్రధా న స్వామీజీ సుక్వల్లభ్, ప్రిన్సిపల్ ప్రవీణ్కుమార్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ -
కర్షకలోకం పొలంబాట
బషీరాబాద్: ఖరీఫ్ సీజన్ కావడంతో పల్లెల్లో కర్షకులు సాగు పనుల్లో బిజీ అయ్యారు. సూర్యోదయంతో పొలం బాటపడుతున్నారు. నాలుగైదు రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలతో పంటలకు జీవం పోసినట్లయింది. బషీరాబాద్ మండలంలో సుమారు పది వేల ఎకరాలకు పైగా కంది, పత్తి, పెసర, మినుము పంటలు సాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్లో మే చివరి వారం నుంచే విత్తనాలు వేశారు. అయితే విత్తిన తర్వాత వారం పదిరోజులు వర్షాలు కురవక పోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. ఎట్టకేలకు వర్షాలు కురుస్తుండటంతో పంటలకు జీవం పోసినట్లయింది. పగటిపూట పల్లెలు ఖాళీ.. రైతులు, రైతు కూలీలు కలుపుతీత, విత్తనాలు వేయడం వంటి పనులు ముమ్మరంగా చేస్తున్నారు. దీంతో పగటి పూట జనాలు లేక గ్రామాలు బోసిపోతున్నాయి. మండలంలోని కాశీంపూర్, మంతట్టి, రెడ్డిఘనాపూర్, గొట్టిగఖుర్ధు, గొట్టిగకలాన్, నవల్గా, జీవన్గీ, క్యాద్గిరా, గంగ్వార్, ఇందర్చెడ్, నావంద్గి, ఎక్మాయి, మర్పల్లి, పర్వత్పల్లి, దామర్చెడ్ గ్రామాల్లో సాగు చేసిన పంటలు ఆశాజనకంగా ఉన్నాయి. పంట సాల్ల నడుమ దంతె, గుంటుక తోలుతున్నారు. ఇందర్చెడ్, దామర్చెడ్, నీళ్లపల్లి, రెడ్డిఘణాపూర్, ఇస్మాయిల్పూర్ గ్రామాల్లో పెసర పంట జోరుగా సాగవుతోంది. -
నేడు రౌండ్ టేబుల్ సమావేశం
అనంతగిరి: వీడీడీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం వికారాబాద్ జిల్లా సమగ్రాభివృద్ధిపై చర్చించేందుకు, కార్యాచరణ రూపొందించేందుకు గాను రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30గంటలకు పట్టణంలోని సంకల్ప్ స్కూల్లో సమావేశం ఉంటుందన్నారు. కావున జిల్లాస్థాయి ఉద్యోగ, ఉపాధ్యాయులు, అధ్యాపక, న్యాయవాద, మేధావి, మహిళ, రైతు, వ్యాపార, వాణిజ్య, స్వచ్ఛంద, యువజన, ప్రజాసంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. యువతి అదృశ్యం పహాడీషరీఫ్: యువతి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం పోలీసులు తెలిపిన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జయరాం కుటుంబం తుక్కుగూడలోని నార్త్ స్టార్ ఏర్పోర్ట్ బాలియార్డ్ విల్లాలో నివాసం ఉంటోంది. ఈయన కుమార్తె సురేఖ వెంకట దుర్గ(24) ప్రైవేట్ ఉద్యోగి. ఈ నెల 23వ తేదీన కుటుంబ సభ్యులు నిద్రలేచి చూసేసరికి వెంకట దుర్గ కనిపించలేదు. ఆమె ఆచూకీ కోసం వెతికినా లాభం లేకుండా పోయింది. శివ అనే యువకుడిపై అనుమానం ఉందని తల్లి దేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది. -
మార్కెట్ యార్డు దశ మారేనా?
కొడంగల్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఏర్పడి సుమారు మూడు దశాబ్దాలు కావసస్తోంది. నాటి నుంచి నేటి వరకు అందులో క్రయ విక్రయాలు జరగ లేదు. యార్డులోని దుకాణాలు నిరుపయోగంగా ఉన్నాయి. అయినా జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. గతం నుంచి నిర్లక్ష్యానికి గురైన కొడంగల్ మార్కెట్ యార్డు దశ ఇప్పుడైనా మారుతుందేమోనని రైతులు, వ్యాపారులు ఎదురు చూస్తున్నారు. 1994న అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్రెడ్డి కొడంగల్ ఉప మార్కెట్ యార్డుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతరైతులకు యార్డును అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో శ్రీకారం చుట్టారు. అయితే కొంతకాలం సజావుగా సాగిన క్రయవిక్రయాలు కొద్ది నెలలకే ఆగిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యాపారం జరగడం లేదు. యార్డు ఏర్పడి 30 ఏళ్లు దాటినా అధికారులు పట్టించుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మార్కెట్ యార్డుకు మహర్దశ వస్తుందనిరైతులు భావించారు. అయితే వారి ఆశలు అడియాశలయయ్యాయి. 40 వేల హెక్టార్లలో సాగు కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్పేట, దుద్యాల్ మండలాల్లో సుమారు 40 వేల హెక్టార్లలో పంటలు సాగవుతాయి. కంది, పత్తి, పెసర, మినుము, వరి, జొన్న వంటి పంటలు వేస్తారు. మార్కెట్ యార్డ్ అందుబాటులో లేకపోవడంతో పంట దిగుబడిని దళారులకు విక్రయించి రైతులు మోసపోతున్నారు. ధరలోనూ తూకంలోనూ అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసస్తున్నారు. సరైన మార్కెట్ సౌకర్యం లేకపోవడం వల్ల ఆరుగాలం కష్టించి పండిన పంటను దళారులకు అమ్ముకోవాల్సి వస్తోందని పలువురు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని నల్లరేగడి భూముల్లో కంది పంట ఎక్కువగా పండుతోంది. ఇక్కడ పండించిన కందులకు తాండూరు, కర్నూల్, మహారాష్ట్రల్లో మంచి డిమాండ్ ఉంది. మార్కెట్ యార్డును తిరిగి ప్రారంభిస్తే మేలు జరుగుతుందని ఈ ప్రాంత రైతులు భావిస్తున్నారు. రూ.3 కోట్లతో గోదాం నిర్మాణం స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో రూ.3 కోట్ల వ్యయంతో భారీ గోదాం నిర్మించారు. ఈ గోదాంలో 5వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉంది. ప్రస్తుతం దీనన్ని వివిధ పనులకు వినియోగిస్తున్నారు. ఈ ప్రాంతంలోని రైతులు కంది, పత్తి, వరి, పెసర, మినుము పంటలను అధికంగా పండిస్తున్నారు. మార్కెట్ యార్డును తిరిగి ప్రారంభిస్తే ఈ గోదాం రైతులకు ఉపయోగపడుతుంది.కొడంగల్ మార్కెట్ యార్డు ఆవరణలో ఈ మధ్య కాలంలో 10 దుకాణాలు నిర్మించారు. వాటికి అద్దె నిర్ణయించి వేలం ద్వారా వ్యాపారులకు కేటాయించారు. మూడు దశాబ్దాలుగా నిరుపయోగం క్రయవిక్రయాలు లేక వెలవెల పట్టించుకోని అధికార యంత్రాంగం -
పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు
పరిగి: పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తను గుర్తిస్తుందని ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు టి రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామన్నారు. పార్టీ కోసం పనిచేసే వారు పార్టీలో పదవుల కోసం దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీచేసే వారే ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని సూచించారు. పార్టీ ఎవరికీ టికెట్ కేటాయించిన గెలిపించుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు అందిస్తున్న సంక్షేమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇటీవల ప్రతీ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పత్రాలు అందజేశామని అందరితో మాట్లాడి పార్టీ అభ్యర్థులు గెలిచేల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. అనంతరం మాజీ ప్రధాని పీవి నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్కుమార్రెడ్డి, కో ఆబ్జర్వర్ నరేందర్, బ్లాక్ అధ్యక్షుడు పార్థసారథి, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్కృష్ణ, ప్రధాన కార్యదర్శి హన్మంతుముదిరాజ్, పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, నాయకులు అశోక్, ఆంజనేయులు, తౌరియా, ఆయూబ్, ఆనంద్, నాగవర్థన్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం... దోమ: కాంగ్రెస్ బలోపేతం చేయడమే లక్ష్యమని పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం దోమ మండల కేంద్రంలో కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా రాష్ట్ర నాయకత్వం ప్రణాళికాయుతంగా ముందుకు సాగుతుందన్నారు. రానున్నరోజుల్లో కార్యకర్తలు కష్టపడి పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకోసం పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్కుమార్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ యాదవ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు ప్రభాకర్ రెడ్డి, శాంతకుమార్, బద్రి, డీసీసీ ఉపాధ్యక్షుడు రాములు, జాకటి వెంకటయ్య, శివకుమార్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, బంగ్ల యాదయ్య, అంతిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రమేష్ గౌడ్, బాల్రెడ్డి, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి -
రెవె‘న్యూ’ సేవలు
బొంరాస్పేట: ప్రజలకు మెరుగైన, సత్వర సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రెవెన్యూ సేవలను మరింత సులభతరం చేసింది. మీసేవ కేంద్రాల ద్వారా కులం, ఆదాయం, మార్కెట్ వ్యాల్యూ ధ్రువీకరణ పత్రాలు మరింత సులువుగా అందించే కొత్త వెసులుబాటు అమలులోకి వచ్చింది. మీసేవలో దరఖాస్తు చేసుకుంటే చాలు ఇంటి వద్దకే ఇసుక వచ్చే అవకాశం ఏర్పడింది. ఈ అవకాశాలు ఈ నెల 27 నుంచి అమలులోకి వచ్చాయి. దీంతో అర్జీదారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సత్వర సేవలు రెండు రోజుల క్రితం వరకు కుల ధ్రవీకరణ పత్రం కావాలంటే నిర్దిష్ట సమయం 30రోజులు పట్టేది. కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం మీసేవ కేంద్రాలు, తహసీల్దారు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేంది. పత్రాలు సకాలంలో అందక సామాన్యులు కొన్ని పథకాలకు దూరమయ్యే వారు. విద్యార్థులు ప్రవేశాలు పొందక, యువత ఉద్యోగాలు చేజార్చుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. అలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మీసేవల్లో ఈ కొత్త విధానం అమలులోకి తెచ్చింది. ఇప్పటి నుంచి నిమిషంలోనే కుల ధ్రువీకరణ పత్రం అందనుంది. అందుకోసం అర్జీదారులు సమీపంలోని మీసేవ కేంద్రంలో తమ పాత పత్రం నంబరు లేదా ఆధార్కార్డు నంబరు చెప్పాలి. ఓటీపీ నంబరుతో వెంటనే ధ్రువీకరణ పత్రం అందుతుంది. వాల్యూ సర్టిఫికెట్లు కూడా.. అలాగే రిజిస్ట్రేషన్ శాఖ అందించే మార్కెట్ వ్యాల్యూ సర్టిఫికెట్లు సైతం ఈ విధానంతోనే అందే వెసులుబాటు కల్పించింది. ఇదివరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండేది. కొత్త విధానం అమలులోకి రావడంతో ఇక నుంచి రాష్ట్రంలో ఎక్కడినుంచైనా మీసేవ కేంద్రాల్లో పొందే అవకాశం లభించనుంది. ఇంటి వద్దకే ఇసుక ఇసుక అవసరమైన వారు సమీపంలోని మీసేవలో బుక్చేస్తే చాలు కావాల్సినంత ఇసుక అధికారికంగా ఇంటి వద్దకే వస్తుంది. మీసేవ కేంద్రంలో తమ మొబైల్ నంబరుతో రిజిస్టర్ చేసుకోవాలి. ఇసుక రవాణా చేసే వాహనం రకం, వాహనం నంబరు, ఇసుక పరిమాణం, ఎక్కడికి కావాలో, ఏ తేదీన కావాలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ వివరాల నమోదు, రుసుం చెల్లింపులు అనంతరం ఇంటికి వద్దకే ఇసుక అందించే అధికారిక ప్రక్రియ కల్పించారు. తహసీల్దారు ధ్రువీకరణతో అర్జీదారుల ఇళ్ల వద్దకు సులభంగా ఇసుక అందుతుంది. అక్రమాలకు అడ్డుకట్టవేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కొత్త విధానం అమలులోకి తెచ్చినట్లు తెలిసింది. అమలులోకి వచ్చిన నూతన సేవలు మీసేవ కేంద్రాల్లో అందుబాటులోకి.. దరఖాస్తు చేసిన వెంటనే కులం, ఆదాయ ధ్రువపత్రాలు ఇక నుంచి ఇంటి వద్దకే ఇసుక హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు జిల్లాలోని మున్సిపాలిటీలు – 4 మొత్తం మండలాలు – 32 మీసేవా కేంద్రాలు – 84 -
సాగు అగమ్యగోచరం
మోమిన్పేట: వరుణుడి జాడ లేకపోవడంతో వానాకాలం సాగు అగమ్యగోచరంగా మారిందని రైతన్నలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మృగశిర కార్తెలో కురిసిన చిన్నపాటి వర్షాలకు కొంతమంది పత్తి విత్తనాలు నాటారు. ఆతర్వాత పదిహేను రోజులు గడిచినా వాన లేకపోవడంతో మొలకలు ఎండిపోతున్నాయని వాపోతున్నారు. సరైన తేమ లేకపోవడంతో 50నుంచి 60 శాతం మాత్రమే మొలకలు వచ్చాయని, ప్రస్తుతం ఇవి కూడా ఎండిపోతున్నాయని దిగులు చెందుతున్నారు. ఆకాశంలోని మేఘాలు నిత్యం ఊరిస్తున్నాయే తప్ప చినుకు కురవడం లేదని పేర్కొంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వానలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంటున్నా ఫలితం కనిపించడం లేదంటున్నారు. ఇలాంటి పరిస్థితిని ముందెన్నడూ చూడలేదని, మళ్లీ విత్తనాలు వేయాలంటే రెండింతల పెట్టుబడి అవుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పత్తాలేని వరుణుడు ఎండుతున్న మొలకలు -
గంజాయి విక్రేతకు రిమాండ్
తాండూరు: పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ఓ యువకుడిని పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ ఘటన శుక్రవారం పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కేసు వివరాలను తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి విలేకరులకు వెల్లడించారు. తాండూరు సబ్ డివిజన్ పరిధిలోని యాలాల మండలం రాస్నం గ్రామానికి చెందిన లాల్ మహ్మద్ పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు తాండూరు సీఐ సంతోశ్కుమార్కు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు ఆయన తన సిబ్బంది ఎస్ఐ అంబర్యా, హెడ్ కానిస్టేబుల్ అమ్జద్, శివకుమార్, కానిస్టేబుల్స్తో కలిసి రైల్వే స్టేషన్ ఎదుట తనిఖీలు చేపట్టారు. ఓ యువకుడు అనుమానాస్పదంగా కనిపిండంతో అతన్ని అదుపులోకి తీసుకుని బ్యాగును తనిఖీ చేయగా 1.2 కిలోల గంజాయి లభ్యమైంది. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఎవరైనా మత్తుపదార్థాలు విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. -
వైద్య చికిత్సలతో టీబీ దూరం
కుల్కచర్ల: వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఏడాదిపాటు మందులు వాడితే టీబీని పూర్తిగా నివారించవచ్చునని మండల వైద్యాధికారి కిరణ్గౌడ్ అన్నారు. టీబీ ముక్త్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చౌడాపూర్ సబ్ సెంటర్లో క్షయ, రక్తపోటు, మధుమేహం, హెచ్ఐవీ తదితర వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్గౌడ్ మాట్లాడుతూ.. టీబీ సోకిన వారు ఏడాది పాటు మందులు వాడితే వ్యాధి పూర్తిగా నయమవుతుందన్నారు. పౌష్టికాహారం తీసుకుంటూ.. వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. టీబీ వ్యాధిగ్రస్తులకు ప్రతీ నెల రూ.1,000 పౌష్టికాహారం కోసం అందజేస్తుందన్నారు. ఆరు నెలల పాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో టీబీ అధికారి రవీంద్రయాదవ్, టీబీ హెల్త్ విజిటర్ రాజు నాయక్, మెడికల్ అసిస్టెంట్ అంజూ, సూపర్వైజర్ విజయలక్ష్మి, సిబ్బంది యాదమ్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ కిరణ్గౌడ్ -
ఒకే భవనం.. రెండు కార్యాలయాలు
గదిలో అంగన్వాడీ.. వరండాలో గ్రామ పంచాయతీ మండల పరిధిలోని సత్తర్కుంట తండాలో ఒకే గదిలో రెండు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తండాలను పంచాయతీలుగా అప్గ్రేడ్ చేసిన సమయంలో తండాలో ప్రభుత్వ భవనాలు లేకపోవడంతో అంగన్వాడీ కేంద్రంలో తాత్కాలికంగా గ్రామ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఉన్న ఒక్క భవనంలో సగభాగం అంగన్వాడీ కేంద్రం, మరో సగంలో పంచాయతీకి సంబంధించిన సామగ్రిని ఏర్పాటు చేశారు. దీంతో చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీకి సొంత భవనం నిర్మాణానికి నిధులు కేటాయించాలని తండావాసులు కోరుతున్నారు. – దుద్యాల్ -
అప్పులు తీర్చేందుకు చోరీల బాట
● సీసీ కెమెరాలకు చిక్కిన నిందితులు ● అన్నదమ్ములకు రిమాండ్ యాచారం: ప్రైవేట్ ఉద్యోగస్తులైన ఇద్దరు అన్నదమ్ము లు అప్పులు తీర్చేందుకు చోరీల బాటపట్టారు. చివరకు సీసీ కెమె రాల ఆధారంగా పోలీసులకు చిక్కారు. ఈ మేరకు శుక్రవారం వారిని రిమాండ్కు తరలించారు. యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని కుర్మిద్ద గ్రామానికి చెందిన నరేశ్, ఇబ్రహీంపట్నం మండలం మంగల్పల్లికి చెందిన వెంకటేశ్ వరుసకు అన్నదమ్ములు. ఈ నెల 23న మాడ్గుల మండలం అప్పారెడ్డిపల్లికి చెందిన బండ పార్వ తమ్మ నక్కర్తమేడిపల్లిలో బంధువుల ఇంటికి వచ్చి స్వగ్రామానికి వెళ్లే క్రమంలో తక్కళ్లపల్లి గేట్ వద్ద బస్సు ఎక్కేందుకు రోడ్డుపై వేచియుంది. ఈ క్రమంలో ఆమె ఒంటరిగా ఉందని గమనించిన అనదమ్ము లు హెల్మెట్లు ధరించి బైక్వచ్చి పార్వతమ్మ మెడలోంచి మూడు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కెల్లారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసు లు శుక్రవారం వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. ఈ మేరకు వారి వద్ద నుంచి అపహరించిన పుస్తెలతాడును స్వాధీ నం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించామని పోలీసులు తెలిపారు. గోదాం పైనుంచి పడి కూలీ మృతి హయత్నగర్: రేకుల షెడ్డు పైకప్పు నుంచి కింద పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన హయత్నగర్ ఠాణా పరిఽధిలో శుక్రవారం చో టుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తుర్కయంజాల్ మున్సిపాలిటీ కొహెడకు చెందిన పొట్లచెరువు మల్లేశ్(55) తోటి కార్మికులతో కలిసి శుక్రవారం ఉదయం స్థానికంగా ఉన్న ఓ విత్తనాల కంపెనీ గోదాం పైకప్పు రేకులను మార్చే పని చేస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడ్డాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయమైంది. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారిని చిదిమేసిన టిప్పర్ లారీ తల్లి కళ్లెదుటే ఆరేళ్ల బాలుడి దుర్మరణం దుండిగల్: రెప్పపాటు క్షణంలో ఆరేళ్ల బాలుడు ప్రాణాలు వదిలాడు. తన కళ్లెదుటే కుమారుడు విగత జీవిగా మారడంతో ఆ తల్లి గుండెలు పగిలేలా రోదించడం స్థానికుల హృదయాలను కలచివేసింది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ జిల్లా కేశవాపూర్ ప్రాంతానికి చెందిన రాజురెడ్డి, నిహారిక రెడ్డి దంపతులు కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి మల్లంపేటలోని ఆకాశ్ లేఅవుట్లో నివాసముంటున్నారు. రాజురెడ్డి ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా నిహారిక రెడ్డి గృహిణి. వీరికి అభిమన్షురెడ్డి (6), మరో చిన్నారి సంతానం. అభిమన్షు రెడ్డి బౌరంపేటలోని గీతాంజలి స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్నాడు. రోజూ మాదిరిగానే నిహారిక శుక్రవారం ఉదయం 8 గంటలకు కుమారుడిని స్కూల్ వద్ద దింపేందుకు స్కూటీపై బయలుదేరింది. ఈ క్రమంలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఎదురుగా వెనుక నుంచి వచ్చిన టిప్పర్ లారీ వీరి స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నిహారిక ఎడమ వైపు పడగా.. అభిమన్షు కుడి వైపు రోడ్డుపై పడడంతో టిప్పర్ లారీ వెనుక టైరు బాలుడి తలపై నుంచి వెళ్లింది. దీంతో తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మేడ్చల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బందోబస్తు మధ్య గుడిసె తొలగింపు
నందిగామ: మోత్కులగూడలోని ఓ వివాదాస్పద స్థలంలో ఏర్పాటు చేసిన గుడిసెను గ్రామ కార్యదర్శి చెన్నయ్య శుక్రవారం పోలీసు బందోబస్తు మధ్య తొలగించారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ స్థలాన్ని గతంలో ప్రభుత్వం మాకే కేటాయించిందని ఒకరు, కాదు మాకే కేటాయించిందని మరొకరు గొడవ పడుతున్నారు. ఇరువురి మధ్య నెలకొన్న ఈవివాదం చినికిచినికి గాలివానలా మారడంతో రాజకీయ రంగు పులుముకుంది. ఈ స్థలంలో ఓ వ్యక్తి ఇటీవల ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోయగా, ఆ స్థలం తమదేనని, తనకు పట్టాతో పాటు, ఏళ్ల తరబడి కబ్జాలో ఉన్నామని మరో వ్యక్తి నిర్మాణాన్ని అడ్డుకున్నాడు. ఇరవై రోజులుగా ఈ పంచాయితీ కొనసాగుతోంది. ఇరువురూ ఒకరిపై ఒకరు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. తనకు పట్టా ఉందని చెబుతున్న వ్యక్తి సదరు స్థలంలో ఇటీవల గుడిసె వేశారు. దీన్ని తొలగించాలని కోరుతూ మరో వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో శుక్రవారం గ్రామ కార్యదర్శి చెన్నయ్య స్థానిక పోలీసుల బందోబస్తు మధ్య గుడిసెను తొలగించారు. ఈసమయంలో ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పటికీ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ విషయమై ఎంపీడీఓ సుమతిని వివరణ కోరగా.. ఇరువురు వ్యక్తులు ప్లాట్లు తమవేనంటున్నారని తెలిపారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టా సర్టిఫికెట్లు, లే అవుట్ మ్యాప్ను పరిశీలించి ప్లాటు ఎవరిదో నిర్ధారిస్తామని, అప్పటివరకు ఎవరూ అందులోకి వెళ్లకూడదని చెప్పామన్నారు. మోత్కులగూడలో ఉద్రిక్త పరిస్థితులు సదరు స్థలంలోకి ఎవరూ వెళ్లొద్దన్న అధికారులు -
సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి
కుల్కచర్ల ఎస్ఐ రమేశ్ కుల్కచర్ల: దుకాణదారులు ప్రతీ ఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవానలి కుల్కచర్ల ఎస్ఐ రమేశ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా వంద కెమెరాలతో సమానమన్నారు. రోడ్డు ప్రమాదాలు, చోరీలు జరిగిన సమయంలో నిందుతులను సులువుగా పట్టుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. టీ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం ద్విచక్ర వాహనదారుడికి తీవ్రగాయాలు ఇబ్రహీంపట్నం రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్ తెలిపిన ప్రకారం.. యాచారం మండలం గడ్డమల్లయ్యగూడకు చెందిన దార మహేందర్ బైక్పై వండల్ లా జంక్షన్ నుంచి కొంగరకలాన్వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లే టీ జంక్షన్ వద్ద ముందు వెళ్తున్న కాంక్రీట్ మిక్సర్ లారీ ఒక్కసారిగా కుడివైపునకు మలుపు తిప్పాడు. దీంతో వెనుకాల వస్తున్న బైక్ లారీ ఢీ కొట్టడంతో ద్విచక్రవాహనదారుడు కిందపడిపోయి తలకు గాయాలయ్యాయి. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వీధి కుక్క స్వైర విహారం కొందుర్గు: జిల్లేడ్ చౌదరిగూడ మండలం వాచ్చతండా గ్రామపంచాయతీ దేవులనాయక్తండాలో శుక్రవారం వీధికుక్క స్థైర్య విహారం చేసింది. తండాకు చెందిన ముగ్గురు వ్యక్తులపై దాడిచేసి, గాయపరిచింది. మేకలు, కోళ్ల వెంటపడుతున్న కుక్కను నేనావత్ చందర్, సబావత్ సక్రీబాయ్ అదిలించే ప్రయత్నం చేయగా వారిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచిందని స్థానికులు తెలిపారు. పక్కనే ఉన్న ముడావత్ హర్షవర్ధన్(5)పై దాడిచేసి గాయపరిచిందని పేర్కొన్నారు. కుక్కల దాడిలో గాయపడిన వారిని చికిత్స కోసం షాద్నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. హుండీ చోరీకి విఫలయత్నం ఇబ్రహీంపట్నం: గుర్తు తెలియని దుండగులు దర్గాలో హుండీ చోరీకి విఫలయత్నం చేశారు. ఈ ఘటన ఇబ్రహీంపట్నం ఠాణా పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన ్పరకారం.. చర్లపటేల్గూడకు వెళ్లే మార్గంలోని జహంగీర్పీర్దర్గా వద్ద హుండీని భూమిలోకి ఉంచి చుట్టూ సిమెంట్తో ఏర్పాటు చేశారు. ఈ హుండీని పెకిలిచేందుకు గుర్తు తెలియని దుండుగుల చుట్టూ ఉన్న సిమెంట్ తవ్వారు. ప్రయత్నం విఫలమవడంతో మధ్యలోనే వదిలి వెళ్లారు. దుండగుల ఆచూకీకి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
పాఠశాల స్థలంలో ఇళ్ల నిర్మాణం
చేవెళ్ల: ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చేవెళ్ల తహసీల్దార్ కృష్ణయ్య హెచ్చరించారు. నాంచేరి రెవెన్యూ పరిధిలోని ఇంద్రారెడ్డి నగర్లో ప్రభుత్వ పాఠశాలకు కేటాయించిన స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న ఏడు ఇళ్లను శుక్రవారం పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఇంద్రారెడ్డి నగర్లో ప్రభుత్వ పాఠశాలకు సర్కార్ 2.20 ఎకరాల స్థలం కేటాయించింది. ఇక్కడ ప్రస్తుతం ప్రాథమిక పాఠశాల కొనసాగుతోంది. చుట్టూ ఖాళీ స్థలం ఉండడంతో ఏడుగురు స్థానికులు ఆక్రమించి ఎలాంటి అనుమతులు లేకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ కృష్ణయ్య, ఆర్ఐలు చంద్రమోహన్, పవన్, సీఐ భూపాల్ శ్రీధర్, ఎస్ఐ సంతోష్కుమార్ వెళ్లి నిర్మాణాలను కూల్చివేశారు. ఈ కూల్చివేతల్లో రెవన్యూ సిబ్బంది నర్సింలు, ప్రకాశ్, ఆంజనేయులు, రవీందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నిర్మాణాల్లో అధికార పార్టీకి చెందిన నాయకుడి కుమారుడి ఇళ్లు ఉండడం విశేషం. కూల్చివేయించిన రెవెన్యూ అధికారులు -
బీఆర్ఎస్లో భారీగా చేరికలు
పూడురు: స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుందామని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండల పరిధిలోని రెగడి మామిడిపల్లి, బార్లపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు మైపాల్రెడ్డి తన అనుచరులతో కలిసి మహేశ్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం బార్లపల్లిలోని హనుమాన్ ఆలయానికి రూ.లక్ష విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మల్లేశం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజహారుద్దీన్, నాయకులు అదీముద్దీన్, రైస్ఖాన్, రాజేందర్ రెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు మట్కారాయుళ్ల అరెస్టు
తాండూరు: పట్టణంలోని ప్రధాన కూడలిలో మట్కానిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన శుక్రవారం తాండూరు టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ సంతోశ్కుమార్ తెలిపిన ప్రకారం.. పట్టణంలోని గాంధీనగర్కు చెందిన షేక్ అబ్దుల్ సత్తార్, ఇందిరమ్మ కాలనీకి చెందిన మహ్మద్ షఫీ మధ్యాహ్నం వినాయక చౌక్ కూడలి ప్రాంతంలో మట్కా నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తనిఖీలు చేపట్టగా రూ.4,210 నగదు మట్కా చిట్టీలు లభ్యమయ్యాయి. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. -
జీపీ కార్మికుల ఆందోళన
జీతాల కోసందోమ: పారిశుద్ధ్య కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారి పస్తులుండాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటర్ మెన్లు, ట్రాక్టర్ డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, కారోబార్ల ఇదే పరిస్థితి అని వాపోతున్నారు. ప్రస్తుతం మండల పరిధిలో 118 మంది కార్మికులకు ప్రతీ నెల రూ.9,500 వేతనం చెల్లిస్తున్నారు. పెరిగిన ఖర్చుల రీత్యా తమ వేతనాలు పెంచాలని ఓ వైపు డిమాండ్ చేస్తుంటే ప్రస్తుత వేతనం కూడా సమయానికి ఇవ్వక అప్పులపాలు కావాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ నెల రూ.20వేల కనీ వేతనం ఎస్టీఓ ద్వారా చెల్లించడం, ఉద్యోగ భద్రత కల్పించడం, ప్రమాదబీమాల అలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సీఐటీయూ పిలుపుమేరకు శుక్రవారం నగరంలోని పంచాయతీ రాజ్ కార్యాలయం ముట్టడికి వెళ్లేందుకు జిల్లా కార్మికులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు జీపీ కార్మికులను ముందుస్తు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. మూడు నెలలుగా అందని వేతనాలు పస్తులుంటున్నామంటూ ప్రభుత్వంపై ఆగ్రహం పంచాయతీ రాజ్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన సీఐటీయూ ముందస్తుగా అరెస్ట్ చేసిన పోలీసులు -
సైన్స్ టీచర్పై సస్పెన్షన్ ఎత్తివేయాలి
యాలాల: మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన సైన్స్ టీచర్ ఖాసీం బీపై పెట్టిన సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ వెంకటరత్నం, రాములు డిమాండ్ చేశారు. శుక్రవారం వారు బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి హెచ్ఎంతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పాఠ్యాంశ బోధనలో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు చనిపోయిన జంతువు మెదడును ప్రదర్శించిందన్నారు. ఈ విషయంలో పాఠ్యాంశానికి, పాఠశాలకు సంబంధం లేని వ్యక్తులు ఆందోళన చేసి స్కూల్ వాతావరణాన్ని చెడగొట్టారన్నారు. శాసీ్త్రయ పద్ధతిలో అంకిత భావంతో ప్రయోగాత్మక పద్ధతిలో బోధించే టీచరును సస్పెండ్ చేయడాన్ని వారు తప్పుబట్టారు. ఇది అనాలోచిత చర్యగా వారు పేర్కొన్నారు. ఖాసీం బీ సస్పెన్షన్ను వెంటనే ఎత్తేయాలని వారు కోరారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నర్సింహులు, కోశాధికారి మూవీస్కాన్, కార్యదర్శులు బాబురావు, సలీం రత్నం, కృష్ణవేణి, వెంకటయ్య, శివరాజ్, మల్లేశం, పరశురాం, భానుచైతన్య, గుడుమియా తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ నేతల డిమాండ్ పాఠశాలను సందర్శించి వివరాల సేకరణ -
ఆపరేషన్ ముస్కాన్ను విజయవంతం చేద్దాం
అనంతగిరి: ఆపరేషన్ ముస్కాన్–11ను విజయవంతం చేయాలని డీటీసీ అదనపు ఎస్పీ పీవీ మురళీధర్ పిలుపునిచ్చారు. పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆపరేషన్ ముస్కాన్పై రాష్ట్రస్థాయి ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి కార్మిక, సీ్త్రశిశు సంక్షేమ శాఖ, పోలీస్, బాలల సంక్షేమం, సమితి, రెవెన్యూ, విద్య, పంచాయతీ రాజ్, ఆరోగ్య శాఖల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూలై ఒకటవ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆపరేషన్ ముస్కాన్ను విజయవంతం చేయాలన్నారు. తప్పిపోయిన పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని సూచించారు. బాల్యవివాహాలను అరికట్టాలని, పిల్లలతో భిక్షాటన చేయించకుండా చూడాలని ఆదేశించారు. పిల్లలతో పనులు చేయించడం చట్టరీత్యా నేరమన్నారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు. బడీడు పిల్లలను చదువుకోనివ్వాలని, వీధి బాలలను రక్షించాలన్నారు. మానవ అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆపరేషన్ ముస్కాన్ –11 కోసం ఏహెచ్టీయూ ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ షేక్ అన్వర్ పాషా ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఈ బృందాలు జిల్లా అంతటా నిరంతరం తిరుగుతూ బాల కార్మికులను గుర్తిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్మన్ వెంకటేశం, సభ్యులు ప్రకాష్, సంగమేశ్వర్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు జి.కాంతారావు, శ్రీకాంత్, నరేష్ కుమార్, రాజునాయక్, సంతోష్ రెడ్డి, యశోద తదితరులు పాల్గొన్నారు. పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు డీటీసీ అదనపు ఎస్పీ మురళీధర్ -
సత్వరం పూర్తి చేయండి
కలెక్టర్ ప్రతీక్ జైన్ అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేపట్టిన వివిధ మరమ్మతు పనులను సత్వరం పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ వైద్యాధికారులకు సూచించారు. శుక్రవారం ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి అవసరమైన విభాగాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ఆస్పత్రిని తీర్చిదిద్దుకోవాలన్నారు. మరమ్మతు పనులు ఏ దశలో ఉన్నాయని పంచాయతీ రాజ్ ఈఈ ఉమేష్ కుమార్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శివారెడ్డిపేటలోని గోదాంను పరిశీలించారు. మరమ్మతులు చేసి గోదాంను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, డీఆర్డీఏ శ్రీనివాస్, డాక్టర్ జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు. స్లాట్ బుక్ చేసుకోండి అనంతగిరి: పాలిసెట్ – 2025లో ఉత్తీర్ణులైన విద్యార్థులు కళాశాలలో ప్రవేశాల కోసం స్లాట్ బుక్చేసుకొని శని, ఆదివారాల్లో జరిగే ధ్రువపత్రాల పరిశీలను హాజరు కావాలని జిల్లా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ తెలిపారు. 144 మంది విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకొని శుక్రవారం ధ్రువపత్రాల పరిశీలనకు 130 మంది హాజరయ్యారని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు డీఎస్పీ శ్రీనివాస్ పరిగి: చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పరిగి డీఎస్పీ శ్రీనివాస్ హెచ్చరించారు. శుక్రవారం పరిగి పట్టణంలోని పలు వీధుల్లో కేంద్ర సాయుధ బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరమన్నారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తారని అన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా పోలీసుల సాయం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్రెడ్డి, ఎస్సై సంతోష్కుమార్ పాల్గొన్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదు పరిగి: కాంగ్రెస్ మాట ఇస్తే తప్పక నెరవేరుస్తుందని డీసీసీ ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్ అన్నారు. శుక్రవారం పరిగి పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తోందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఒక్క డబుల్ బెడ్రూం కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వమన్నారు. వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందన్నారు. సీఎం రేవంత్రెడ్డి అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, నాయకులు చిన్న నర్సింలు, శ్రీనివాస్, చంద్రయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పరిగి పట్టణంలో కవాతు నిర్వహిస్తున్న పోలీసులు -
రాసుకొని వెళ్లిపోతారని అనుకోకండి
తాండూరు రూరల్: ఉపాధి హామీ పథకం పనుల వివరాలు తెలుసుకునేందుకు వచ్చే అధికారులు కేవలం రాసుకొని వెళ్లిపోతారు అనుకుంటే పొరపాటని అక్రమాలు తేలితే కఠిన చర్యలు తప్పవని డీఆర్డీఏ ఏపీడీ సరళ హెచ్చరించారు. శుక్రవారం తాండూరు ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. మండలంలో 2024 జనవరి నుంచి 2025 మార్చి వరకు రూ.6.42 కోట్ల విలువ చేసే పనులు చేపట్టారు. వీటిపై 16 బృందాలతో 33 గ్రామాల్లో ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పనుల్లో అక్రమాలకు పాల్పడిన వారి నుంచి రూ.3 లక్షల 5 వేల 733 రికవరీకి చేశామని తెలిపారు. అదేవిధంగా రూ.24 వేలు ఫైన్ వేసినట్లు వివరించారు. బినామీ పేర్లతో పనులు చేసినట్లు గుర్తించామన్నారు. రికార్డు నమోదు కూడా సక్రమంగా చేయలేదన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విశ్వప్రసాద్, అంబుడ్స్మెన్ రాములు, విజిలెన్స్ ఆఫీసర్ భార్గవి, ఏపీఓ నరోత్తంరెడ్డి, ఆపరేటర్ అమృత, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. అక్రమాలు తేలితే కఠిన చర్యలు డీఆర్డీఏ ఏపీడీ సరళ తాండూరులో ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదిక -
హెల్మెట్ తప్పనిసరి
తుర్కయంజాల్: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరి హెల్మెట్ ధరించాలని మహేశ్వరం ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ అన్నారు. పురపాలక సంఘం పరిధి తుర్కయంజాల్లో శుక్రవారం సీఐ గురునాయుడుతో కలిసి వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే ప్రమాదాల బారిన పడ్డప్పుడు తలకు బలమైన గాయాలు తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. హెల్మెట్ ఉంటే ప్రాణాలు కాపాడుకోవచ్చని చెప్పారు. అనంతరం హెల్మెట్ లేకుండా సాగర్ రహదారిపై ప్రయాణిస్తున్న వారికి చలాన్లకు బదులు కొత్త వాటిని కొనుగోలు చేయించారు. ఆయన వెంట ఎస్ఐ సాయినాథ్ ఉన్నారు. -
సామగ్రి కొనుగోలులో చేతివాటం
తాండూరు టౌన్: తాండూరు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పరిరక్షణ సామగ్రి కొనుగోలులో గోల్మాల్ జరిగిందని మాజీ కౌన్సిలర్ సంగీతా ఠాకూర్ ఆరోపించారు. శుక్రవారం సమాచార హక్కు చట్టం కింద వివరాలను ఇవ్వాలంటూ మున్సిపల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కు దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్మికులకు సామగ్రి కొనుగోలు కోసం పెద్ద మొత్తంలో రూ.40 లక్షల నిధులను వెచ్చించాలని గత కౌన్సిల్లో చర్చ జరిగినప్పుడు, వారికి ఖర్చు చేసే నిధులపై అభ్యంతరం తెలిపామన్నారు. అలాంటిది ఇట్టి నిధులకు మరో రూ.10లక్షలు కలిపి మొత్తం రూ.50 లక్షలతో సామగ్రి కొనడం విడ్డూరమన్నారు. మహిళా కార్మికుల కోసం రూ.1800 పెట్టి ఒక్కో చీర కొనుగోలు చేశామని చెప్పడంలోనే అసలు స్కాం బయట పడిందన్నారు. అంతేకాకుండా ఇతర సామగ్రి కొనుగోలులో కూడా స్కాం జరిగినట్లు తెలుస్తోందన్నారు. కావున జరిగిన అవినీతిని బయట పెట్టేందుకే ఆర్టీఐ ద్వారా దరఖాస్తు దాఖలు చేశానని ఆమె తెలిపారు. ఆర్టీఐ దరఖాస్తును చూపుతున్న మాజీ కౌన్సిలర్ సంగీతా ఠాకూర్ మాజీ కౌన్సిలర్ సంగీత ఆరోపణ వివరాలు ఇవ్వాలంటూ స.హ. చట్టం కింద దరఖాస్తు -
పెద్దపీట
సంక్షేమానికి● స్పీకర్ ప్రసాద్కుమార్ ● లబ్ధిదారులకుసీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత అనంతగిరి: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్కుమార్ అన్నారు. శుక్రవారం వికారాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో మండలానికి చెందిన పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పేదలకు అనేక పథకాలు తీసుకొచ్చిందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్టీఏ సభ్యుడు ఎర్రవల్లి జాఫర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, నాయకులు శివయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతగిరిని అభివృద్ధి చేస్తా అనంతగిరిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని స్పీకర్ ప్రసాద్కుమార్ అన్నారు. స్వదేశీ దర్శన్ ప్రాజెక్టులో భాగంగా శుక్రవారం వికారాబాద్ పట్టణంలో అనంతగిరి గుట్టపై పర్యాటకులకు రూ.6 కోట్లతో తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రానికి సమీపంలో అనంతగిరులు ఉండటంతో అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పర్యాటకంగా అభివృద్ధి చేస్తే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్జైన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్కుమార్, మాజీ కౌన్సిలర్ మురళి, సీనియర్ నాయకులు రంగరాజు, బాదం అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
జీపీ కార్మికుల ఆందోళన మూడు నెలలుగా వేతనాలు అందక పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
శనివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 20258లోuవికారాబాద్: హస్తం పార్టీలో అసంతుష్ట నేతలు పెరిగిపోతున్నారు. నామినేటెడ్ పదవులు ఆశిస్తూ వస్తున్న పలువులు ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాదిన్నర దాటినా వారి ఆకాంక్ష తీరకపోవడంతో నిరాలో ఉన్నారు. ఈ జాబితా రోజురోజుకూ పెరిగిపోవడం ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారుతోంది. పదవులను ఆశించే వారిలో కేడర్ నుంచి లీడర్ వరకు ఉన్నారు. జిల్లాలో ఇది ఒక్క నియోజకవర్గానికో పరిమితం కాకుండా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో అదే పరిస్థితి కనిపిస్తోంది. పదవుల పందెరంలో చోటు దక్కకపోవడంతో నేతల నిరీక్షణ కాస్త పార్టీలో లుకలుకలకు దారితీస్తోంది. ప్రస్తుతం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు నిర్వహిస్తున్న అంతర్గత సమావేశాల్లో అసంతృప్తి నేతలు గళం విప్పుతున్నారు. ఇది పార్టీ పెద్దలకు మింగుడు పడటం లేదు. ఆశావహుల్లో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఎవరికి వారు.. ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పెద్ద నాయులు దేశ రాజధాని ఢిల్లీ స్థాయిలో పాపులు కదుపుతుండగా గల్లి నేతలు రాష్ట్ర రాజధాని గాంధీ భవన్లో ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద నేతలు సైతం.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జిల్లా నేతకే సీఎం పదవి దక్కింది. సీఎం పదవి తోపాటు శాసన సభ స్పీకర్ పీఠం కూడా జిల్లాకు చెందిన గడ్డం ప్రసాధ్కుమార్కే దక్కింది. అయితే జిల్లాకు చెందిన పెద్ద నాయకులు ఇంకా పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్కు చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డికి రాష్ట్రస్థాయి పోస్టు దక్కగా అదే నియోజకవర్గానికి చెందిన మరో నాయకుడికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి కట్టబెట్టారు. సీఎం నియోజకవర్గంలో ఈ రెండు పదవులు మినహా జిల్లా నేతలకు ఇంకే ఇతర పెద్ద పదవులు దక్కలేదు. స్పీకర్ ప్రసాద్కుమార్కు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుత క్యాబినెట్లో కూడా ఆయన పోర్టుపోలియోను ఆశించారు. సామాజిక వర్గాల ప్రాతిపదికగా జరిగిన ఈక్వేషన్లో ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం కుదరలేదు. దీంతో స్పీకర్ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. క్యాబినెట్ హోదాతో పోలిస్తే ప్రోటోకాల్ పెద్దదే అయినా ఆయన మంత్రి పదవికే మొగ్గు చూపారు. ఇటీవలి జరిగిన మంత్రివర్గ విస్తరణలోనూ పదవి దక్కుతుందని ఆశించారు. కానీ నిరాశే మిగిలింది. ఇక జిల్లాకు చెందిన మరో సీనియర్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు అయిన టీ రామ్మోహన్రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. 2014 మరియు 2018తో పాటు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున రెండు సార్లు గెలుపొందిన వారందరు ప్రస్తుతం మంత్రి వర్గంలో ఉన్నారు. ఒక్క నాకు మాత్రమే ఆ అవకాశం దక్కలేదని ఆయన పేర్కొంటున్నారు. గడచిన రెండు దశాబ్దాల ముందు నుంచే ఎలాంటి గడ్డు పరిస్థితిలోనైనా పార్టీని వీడకుండా నమ్మకంగా ఉన్న నాకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన ఆయన ఇదే విషయం అధిష్టనం ముందుంచారు. మరో నాయకుడు రఘువీరారెడ్డి సైతం నామినేటెడ్ పదవుల్లో సముచత స్థానం కల్పించాలని కోరుతూ వస్తున్నారు. ధారూరు మండలంలో తాజాగా జరిగిన క్షేత్రస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయనకు పదవి ఇవ్వాలని పలువురు నాయకులు నిరసన తెలిపారు. దీంతో సమావేశం గందరగోళంగా మారింది. రోడ్డుపై ధర్నా చేసే దాకా ఈ వ్యవహారం నడిచింది. పెరుగుతున్న ఆశావహులు జిల్లాలో ఆశావహులు, అసంతుష్టులు పెరిగిపోతున్నారు. మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి తప్ప జిల్లా నేతలకు పెద్దగా నామినేటెడ్ పదవులు దక్కలేదు. పరిగి నియోజకవర్గంలో సీనియర్ నాయకులు హన్మంతు ముదిరాజ్, లాల్ కృష్ణప్రసాద్, అశ్రఫ్, చంద్రయ్య, శ్రీనివాస్ తదితరులు పదవులు ఆశిస్తూ వస్తున్నారు. తాండూరులో బుయ్యని శ్రీనివాస్రెడ్డికే ముందుగా కాంగ్రెస్ టికెట్ ఇస్తారనే ప్రచారం జరగ్గా చివరి నిమిషంలో మనోహర్రెడ్డి రంగప్రవేశం చేశారు. దీంతో మంచి స్థానం కల్పిస్తామని శ్రీనివాస్రెడ్డిని అప్పట్లో సముదాయించారు. ఆయనకు కూడా ఇప్పటి వరకు ఏ పదవి దక్కలేదు. ఇతర సీనియర్ నాయకులు పురుషోత్తంరావ్, అబ్దుల్ రహూఫ్, విజయాదేవి, నర్సింహులు, స్వప్నపరిమళ్ కూడా పదవులు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. వికారాబాద్లో సుధాకర్రెడ్డి, రఘువీరారెడ్డి, రాంచంద్రారెడ్డి, కిషన్నాయక్, నరోత్తంరెడ్డి, కొండల్రెడ్డి, లక్ష్మణ్ తదితరులు కూడా పదవులపై ఆశలు పెట్టుకున్నారు. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన నందారం ప్రశాంత్, మహ్మద్ యూసుఫ్, ముద్దప్ప తదితరులు ఆశావహుల జాబితాలో ఉన్నారు. న్యూస్రీల్ -
ప్రతి ఇంటికీ భగీరథ నీరు అందాలి
పరిగి: మండలంలోని ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ సూచించారు. శుక్రవారం జాపర్పల్లిలోని మిషన్ భగీరథ ప్లాంట్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉంటుందన్నారు. అనంతరం పూడూరు మండలంలో మీర్జాపూర్ రోడ్డు పనులను పరిశీలించారు. పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ, చెత్త సేకరణపై ఆరా తీశారు. ఇక్కడి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, సమస్యలపై సత్వరం స్పందించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు మిషన్ భగీరథ కనెక్షన్ ఇవ్వాలని డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్కృష్ణ కోరగా ప్రిన్సిపల్ సెక్రటరీ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్జైన్, అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలి ఆర్డబ్ల్యూఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ -
మహర్దశ
బొంరాస్పేట చెరువుకుబొంరాస్పేట: మండల పరిధిలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న బొంరాస్పేట చెరువు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందనుంది. సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవతో త్వరలో రూ.10 కోట్లతో ఎకో టూరిజం ఏర్పాటు కాబోతోంది. గురువారం జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్, కడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. చెరువులో బోటింగ్ ఏర్పాటు చేసి మరో ట్యాంక్ బండ్గా తీర్చిదద్దనున్నారు. చెరువుకు పక్కనే ఉన్న సంగమేశ్వర ఆలయ పరిసరాలు, అటవీశాఖ పరిధిలోని స్థలాన్ని టూరిజం హబ్గా తీర్చిదిద్దనున్నారు. పార్క్తోపాటు, చిన్నారుల కోసం ఆట వస్తువులు అందుబాటులో ఉంచనున్నారు. బొంరాస్పేట చెరువు జాతీయ రహదారికి పక్కనే ఉండటంతో ప్రయాణికులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. రెండు రోజుల్లో నివేదికలు అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న టూరిజం పార్కుకు సంబంధించిన వివరాలను డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్ వివరించారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రయాణికులు సేదతీరడానికి బొంరాస్పేట చెరువు పరిసరాలు ఎంతో అనువుగా ఉంటాయన్నారు. గతంలో స్థల సమస్య కారణంగా పార్కులను అభివృద్ధి చేయలేకపోయామని, ప్రస్తుతం అడ్డంకులు తొలగిపోయినట్లు తెలిపారు. ఎకో టూరిజం పార్కు, చెరువులో బోటింగ్ కోసం అనుమతులు వచ్చాయన్నారు. ఇందు కోసం రూ.10 కోట్లు మంజూరు కానున్నట్లు వివరించారు. రెండు రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపనున్నట్లు పేర్కొన్నారు. డీఎఫ్ఓ వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేరి రాజేశ్రెడ్డి, ఇరిగేషన్ శాఖ డీఈ కిరణ్కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింలుగౌడ్, నాయకులు జయకృష్ణ, రాంచంద్రారెడ్డి, మల్లేశం, అంజిల్రెడ్డి, భీమయ్యగౌడ్, బాల్రాజ్గౌడ్ తదితరులు ఉన్నారు. రూ.10 కోట్లతో ఎకో టూరిజం ఏర్పాటు క్షేత్రస్థాయి పరిశీలన చేసిన డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్ -
నిజం తేల్చకుండానే సస్పెన్షన్ ఏమిటి?
యాలాల: నిజ నిర్ధారణ చేయకుండానే ఏకపక్షంగా టీచర్ను సస్పెండ్ చేయడం ఏమిటని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు గురువారం ఎంఈఓ రమేశ్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర మైనార్టీ హక్కుల పోరాట సమితి, కేవీపీఎస్, సీఐటీయూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ హక్కుల పోరాట సమితి, పీడీఎస్యూ, ఉద్యమకారుల ఐక్యవేదిక, పబ్లిక్ వాయిస్, పూలే అంబేడ్కర్ తదితర సంఘాల నాయకులు మాట్లాడుతూ.. పాఠ్య బోధనలో భాగంగా సైన్స్ టీచరు ఖాసీం బీ గొర్రె మెదడును పదర్శించారన్నారు. ఈ విషయంలో మరో జంతువు మెదడు తెచ్చారంటూ ఆందోళన చేయడం సరికాదని తెలిపారు. ఈ విషయంలో నిజనిర్ధారణ చేయకుండా ఓ మైనార్టీ టీచర్ను అన్యాయంగా సస్పెండ్ చేశారని మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు అబ్దుల్ వాహాబ్, ఉప్పలి మల్కయ్య, శ్రీనివాస్, చంద్రప్ప, గుమ్మడి రత్నం, సమియొద్దీన్, శ్రీనివాస్, వాజిద్, జిలానీ, రఘుపతి, అహ్మద్, అక్బర్బాబా, ముస్తఫా, రియాజ్ తదితరులు ఉన్నారు. ఏకపక్ష నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి విద్యాశాఖ అధికారులకు ప్రజాసంఘాల వినతి -
మత్తుతో జీవితం చిత్తు!
తాండూరు టౌన్: మాదక ద్రవ్యాల వినియోగంతో జీవితాలు చిత్తవుతాయని తాండూరు డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పలు కళాశాల విద్యార్థులతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ డ్రగ్స్ వినియోగం, విక్రయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఇందిరాచౌక్లో ఏర్పాటు చేసిన వేదికపై డీఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు బానిసలైన యువత నేరాలకు పాల్పడతున్నారన్నారు. యువత సన్మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ సంతోశ్ కుమార్, ఐఎంఏ తాండూరు అధ్యక్షుడు డాక్టర్ జయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్తో కలిగే అనర్థాలపై.. బొంరాస్పేట: ప్రతిఒక్కరూ వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ మోహనచంద్ర, ఎంఈఓ హరిలాల్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ప్రతీ విద్యార్థి ఉన్నత ఆశయాలను ఎంచుకొని చదువుకోవాలన్నారు. ఉత్తమ విద్యార్థిగా రాణించి భవిష్యత్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. మత్తు అలవాటైతే విలువైన జీవితం చిత్తవుతుందని హెచ్చరించారు. సెల్ఫోన్లకు దూరంగా.. ప్రతిఒక్కరూ సెల్ఫోన్లకు దూరంగా ఉంటే మేలు జరుగుతుందన్నారు. ఏదైన సందేహాలు, మంచి విషయాలకు, విద్యాభ్యాసం వంటివి మెరుగుపరుచుకోవడానికి తప్ప మరే సందర్భంలోనూ వాడొద్దన్నారు. గేమ్లు, బెట్టింగులు, ఫోన్లకు వచ్చే లింకులకు ఎట్టి పరిస్థితుల్లోను ఓటీపీ వంటివి చెప్పొదన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ దినేశ్, ఏఎస్ఐ ఆనంద్, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల జోలికి వెళ్లొద్దు మోమిన్పేట: విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాల జోలికి వెళ్లొద్దని సీఐ వెంకట్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు మాదక ద్రవ్యాలను నివారించేందుకు అవగాహన కల్పించి, ప్రధాన వీదుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. మత్తుతో భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఉన్నత పాఠశాల ప్రదానోపాధ్యాయుడు శ్రీనివాస్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత సమాజానికి కృషి కుల్కచర్ల: డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కేజీబీవీ ప్రత్యేకాధికారి దేవి, చౌడాపూర్ కేజీబీవీ ప్రత్యేకాధికారి జ్యోతి పేర్కొన్నారు. కుల్కచర్ల మండల కేంద్రంలోని కస్తుర్బాగాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలలో డ్రగ్స్ నివారణకు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... మత్తుపదార్థాలకు అలవాటు పడితే జీవితాలు నాశనం అవుతాయన్నారు. దుద్యాల్లో.. దుద్యాల్: మాదక ద్రవ్యాలను నిర్మూలించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని మండల విద్యాధికారి విజయ రామారావు పేర్కొన్నారు. ఎంపీడీవో కార్యాలయం ఎదుట అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మాదకద్రవ్యాలు లేకుండా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకుసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో సత్యనారాయణ, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. బంట్వారం: మాదకద్రవ్యాలను నిర్మూలించాలని కోట్పల్లి, బంట్వారం ఎస్ఐలు శైలజ, విమల పేర్కొన్నారు. కోట్పల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ విద్యార్థులతో చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. డ్రగ్స్, గంజాయి, అమ్మకం, కొనుగోలు చేసినట్లు తెలిస్తే సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు. వ్యసనాలకు యువత దూరంగా ఉండాలి తాండూరు డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి డ్రగ్స్పై అవగాహన విద్యార్థుల ర్యాలీ, మానవహారం అలవాటు చేసుకోవద్దు కొడంగల్: ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కొడంగల్ సీఐ శ్రీధర్ రెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ, డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి వినాయక చౌరస్తా నుంచి బసిరెడ్డి ఫంక్షన్హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డ్రగ్స్, మత్తు పదార్థాలకు అలవాటు చేసుకోవదన్నారు. ఈ కార్యక్రమంలో కొడంగల్, దౌల్తాబాద్, దుద్యాల్ ఎస్ఐలు సత్యనారాయణ, రవి గౌడ్, యాదగిరి, కళాశాలల ప్రిన్సిపాల్లు, పాల్గొన్నారు. -
హోటళ్లలో తనిఖీలు
తాండూరు టౌన్: పట్టణంలోని పలు హోటళ్లు, పాస్ట్ ఫుడ్ సెంటర్లలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది గురువారం తనిఖీలు నిర్వహించారు. దర్బార్, అల్ఫూర్ఖాన్, న్యూ సన్మాన్, రాయల్ ఫుడ్, సోహైల్ హోటళ్లతో పాటు పలు పాస్ట్ ఫుడ్ సెంటర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. కిచెన్, ఫ్రిడ్జ్ శుభ్రత నిర్వహణ, తాగునీరు, వంటలకు ఉపయోగిస్తున్న పదార్థాలను తనిఖీ చేశారు. పాడైపోయిన నూడుల్స్, నిల్వ చేసిన సాస్లను స్వాధీనం చేసుకున్నారు. శుభ్రత పాటించని పాత కూరగాయల మార్కెట్లోని ఓ హోటల్ను సీజ్ చేశారు. ఈసందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమేష్ మాట్లాడుతూ.. వర్షాకాలం, వ్యాధుల సీజన్ కావడంతో పరిశుభ్రత పాటించాలని నిర్వాహకులకు సూచించా రు. కుళ్లిన పదార్థాలను నిల్వ చేసి వినియోగిస్తే చర్యలు తప్పవన్నారు. పలు హోటళ్ల నుంచి నిల్వ ఉన్న పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపా రు. ఈ తనిఖీల్లో మున్సిపల్ జవాన్లు పాల్గొన్నారు. పాస్ట్ ఫుడ్ సెంటర్లలో శుభ్రత పరిశీలన కుళ్లిన, నిల్వ చేసిన పదార్థాలు వాడొద్దని హెచ్చరిక ఓ హోటల్ను సీజ్ చేసిన మున్సిపల్ అధికారులు -
పడిపోతున్న చిరు ధాన్యాల సాగు
● వాణిజ్య పంటల వైపు మొగ్గుచూపుతున్న అన్నదాతలు ● డిమాండ్ ఉన్నా నామమాత్రంగానే సాగు ● ప్రభుత్వ ప్రోత్సాహం కరువు నవాబుపేట: చిరు ధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటిలో పోషక విలువలు మెండుగా ఉంటాయి. ఇలాంటి పంటల సాగు విస్తీర్ణం ఏటా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు వీటిని రైతులు సంప్రదాయ పంటలుగా సాగు చేసేవారు. ఇటీవల కాలంలో వాణిజ్య పంటల సాగుపై అన్నదాతలు మక్కువ చూపుతున్నారు. చిరుధాన్యాలైన పెసలు, ఉలవలు, సజ్జలు, కొర్రలు, పచ్చజొన్నలు, మినుములు, అనుములు వంటి పప్పుదినుసుల సాగు పెద్దగా కనిపించడం లేదు. నూనె గింజల సాగు సైతం భారీగా తగ్గింది. నువ్వులు, తెల్లకుసుమ, గడ్డి నువ్వులు వంటి సాగు తగ్గుముఖం పట్టింది. వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలు మాత్రమే అక్కడక్కడ కనిపిస్తున్నాయి. సంప్రదాయ పంటల స్థానాన్ని నేడు వాణిజ్య పంటలైన పత్తి, మొక్కజొన్న, కూరగాయలు, కంది, గోధుమ వంటివి ఆక్రమిస్తున్నాయి. నల్లరేగడి నేలల్లో పండించే కొర్రలు, సజ్జలు, మినుములు, అనుములు, మంచి నువ్వులు పూర్తిగా తగ్గాయి. పదేళ్ల క్రితం వరకు మండలంలో చిరుధాన్యాల పంటల సాగు దాదాపు 5వేల ఎకరాల్లో ఉండేది.. ప్రస్తుతం వంద ఎకరాలకు పడిపోయింది. ఏటా తగ్గుముఖం గతేడాది మండలంలో పత్తి పంట 21,539 ఎకరాల్లో సాగు చేశారు. మొక్కజొన్న 744 ఎకరాల్లో, కందులు 2,284 ఎకరాల్లో, కూరగాయల 2,177 ఎకరాల్లో, వరి 393 ఎకరాల్లో సాగు చేశారు. చిరుధాన్యాలైన పెసర కేవలం 18 ఎకరాల్లో, మినుములు 9 ఎకరాల్లో, ఉలవలు 3 ఎకరాలు, నూనె గింజలు(పొద్దుతిరుగుడు, తెల్ల కుసుమలు) 722 ఎకరాల్లో మాత్రమే సాగైంది. రాగులు, కొర్రలు, సజ్జలు, అవుశలు మచ్చుకై నా కనిపించలేదు. ఈ సారి సైతం చిరుధాన్యాల సాగు అంతంత మాత్రంగానే ఉండవచ్చని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం కరువు సంప్రదాయ పంటలైన చిరుధాన్యాలు, పలు రకాల నూనె గింజల సాగు రోజు రోజుకు కరుమరుగవుతోంది. వాటి సాగును ప్రోత్సహించేందు ప్రభుత్వా లు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణ లు ఉన్నాయి. కూరగాయలు, పండ్ల తోటల సాగు కు రాయితీలు ఇచ్చే ప్రభుత్వాలు చిరు ధాన్యాల సాగును విస్మరించడం సరికాదని పలువురు అంటున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుంటే చిరుధాన్యాల సాగు పెరిగే అవకాశం లేకపోలేదని పలువురు రైతులు పేర్కొన్నారు. మంచి ధరలు చిరుధాన్యాలకు మర్కెట్ మంచి ధరలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునే వారు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో పెసర్ల ధర రూ.120 వరకు ఉంది. కిలో మినుములు రూ.100 పైనే, కిలో బెబ్బర్లు రూ.90, కిలో ఉలవలు రూ.100, పచ్చజొన్నలు రూ.40 వరకు పలుకుతున్నాయి. ఆసక్తి చూపని రైతులు చిరుధాన్యాల సాగుపై రైతు లు ఆసక్తి చూపడం లేదు. వాణిజ్య పంటల వైపే మొ గ్గుచూపుతు న్నారు. చిరు ధాన్యాల సాగుకు పెట్టుబ డి తక్కువ. దిగుబడికి మంచి డిమాండ్ ఉంటుంది. ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నా శ్రద్ధ చూపడం లేదు. – జ్యోతి, మండల వ్యవసాయాధికారి, నవాబుపేట -
వ్యసనాలకు దూరంగా ఉండాలి
తాండూరు రూరల్: విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కరన్కోట్ ఎస్ఐ విఠల్ అన్నారు. తాండూరు మండలం జినుగుర్తి గేటు వద్ద ఉన్న మోడల్ స్కూల్లో గురువారం మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. వ్యసనాల వలన కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించారు. గంజాయి, డ్రగ్స్, మద్యపానం, పొగాకు వంటివి జీవితాలను నాశనం చేస్తున్నాయని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి, మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీదేవి, ఏఏస్ఐ పవన్కుమార్, కానిస్టేబుళ్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
‘ఇందిరమ్మ’లో ఇంటి దొంగలు!
బషీరాబాద్: గూడు లేని నిరుపేదల కోసం ప్రభుత్వం ‘ఇందిరమ్మ’ పథకం కింద ఇళ్లు మంజూరు చేస్తుండగా.. కొంతమంది కింది స్థాయి నాయకులు అక్రమాలకు తెరలేపారు. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామానికి 26 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. నలుగురు అధికార పార్టీ నేతలు వీటిని పంచుకొని రూ.3 వేలు ఇచ్చిన వారి వివరాలతో జాబితా తయారు చేసి, అధికారుల ద్వారా మంజూరు చేయించారు. అయితే ఇందులో చాలా మంది అనర్హులు ఉన్నారని బాధితులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అర్హులకు మొండిచేయి గ్రామంలో 46 మందితో కూడిన జాబితాను నలుగురు కాంగ్రెస్ నేతలు మండల అధికారులకు అందజేశారు. అధికారులు కూడా ఎలాంటి నిబంధనలు చూడకుండా జాబితాలోని 26 మందికి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఇందులో నిరుపేదలు, అర్హులైన వారికి ఇళ్లు మంజూరు కాలేదు. ఎమ్మెల్యే హెచ్చరించినా.. స్థానిక నాయకులంతా ఒక్కటై ఇందిరమ్మ లబ్ధిదారుల వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేసినట్లు వారం రోజుల క్రితమే తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి దృష్టికి వెళ్లింది. ఈ విషయమై ఆయన సదరు నాయకులను తీవ్రంగా హెచ్చరించినట్లు తెలిసింది. లబ్ధిదారుల నుంచి డబ్బులు తీసుకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని గట్టిగా మందలించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సొంత పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నిరుపేదలకు అందని గూడు లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు ఎమ్మెల్యే హెచ్చరించినా మారని తీరు రూ.10 వేలు తీసుకున్నాడు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని నా వద్ద ఓ కాంగ్రెస్ నాయకుడు రూ.10 వేలు తీసుకున్నాడు. తీరా ప్రొసిడింగ్ రాలేదని నిలదీయగా రెండో విడతలో ఇప్పిస్తానని చెబుతున్నాడు. ఇల్లు లేకపోవడంతో ఓ చిన్న గదిలో కిరాయికి ఉంటున్నాం. ఇళ్లు ఉన్నవారికే ప్రొసీడింగ్లు ఇచ్చారు. నావద్ద డబ్బులు తీసుకుని కూడా ఇవ్వలేదు. ఈ విషయం ఎవరికై నా చెబితే రేషన్ కార్డు కూడా కట్ చేస్తామని బెదిరిస్తున్నారు. – తెలుకూరి మంజుల, ఎక్మాయి -
జాతీయ స్థాయి శిక్షణకు ఎంపిక
పూడూరు: కంకల్ పాఠశాల ఉపాధ్యాయుడు ఈశ్వరరావు జాతీయ స్థాయి శిక్షణకు ఎంకయ్యారని మండల విద్యాధికారి సాయిరెడ్డి తెలిపారు. రాష్ట్ర స్థాయి విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎన్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రదర్శనలో సత్తాచాటారన్నారు. నూతన అభ్యసన ప్రక్రియలకు సంబంధించి అన్ని జిల్లాల నుంచి ప్రదర్శనలు రాగా ఉత్తమ ప్రదర్శన అందించిన ఉపాధ్యాయులను జాయతీ స్థాయికి ఎంపిక చేశారన్నాని స్పష్టంచేశారు. వీరు జూలై 3నుంచి 17వ తేదీ వరకు ఢిల్లీలో నిర్వహించే శిక్షణలో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగాగురువారం కాంప్లెక్స్ హెచ్ఎం పుష్ప, లక్ష్మణ్, ఉపాధ్యాయులు ఈశ్వరరావును సన్మానించారు. -
హకీంపేట్ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు
దుద్యాల్: మండలం ఏర్పాటయ్యి మూడు సంవత్సరాలు గడుస్తున్నా, ఇంటర్మీడియట్ కాలేజీ లేకపోవడంతో విద్యార్థులు ఇతర మండలాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. 6 నెలల క్రితం సీఎం రేవంత్రెడ్డి హకీంపేట్కు ఇంటర్ కళాశాల మంజూరు చేశారు. దీంతో గ్రామంలోని గోశాల సమీపంలో తాత్కాలికంగా కళాశాల కోసం మూడు గదులు ఏర్పాటు చేశారు. ప్రస్తుత అకాడమీక్ సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభించారు. ఈ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులకు గాను సిబ్బంది అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎంపీసీ–10, బైపీసీ–32, సీఈసీ–16, హెచ్ఈసీ–06, ఎంఎల్టీ–05, ఎంపీహెచ్డబ్ల్యు–11 సీట్లను బర్తీ చేసినట్లు అధికారులు తెలిపారు. -
ఆపరేషన్ ముస్కాన్
వికారాబాద్: బాల్యం పిల్లల హక్కు.. చిన్నారులు ఉండాల్సింది పాఠశాలల్లోనే.. వారితో పనులు చేయిస్తే వారి ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. చిన్నారుల రక్షణ కోసం అనేక చట్టాలు వచ్చాయి. అందులో ఒకటి విద్యాహక్కు చట్టం. ఈ చట్టం అమల్లోకి వచ్చినా పిల్లలు పనులకు వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. చిన్నారులను పాఠశాలలో ఉంచడం కోసం నియమించిన ఆయా శాఖల అధికారులు తూతూ మంత్రపు కార్యక్రమాలతో మమా అనిపిస్తున్నారు. దీంతో బాల కార్మికులు రోజురోజుకూ పెరుగుతున్నారే తప్ప.. తగ్గడంలేదు. ఆరు నెలలకోసారి చేపట్టే ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ లాంటి కార్యక్రమాలు సైతం సత్ఫలితాల నివ్వడంలేదు. ఇప్పటి వరకు జిల్లాలో 13 సార్లు ఈ కార్యక్రమలు నిర్వహించిన అధికారులు 14వ విడతకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వచ్చే వారంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాదికి రెండుసార్లు ఆయా పనుల్లో మగ్గుతున్న బాలకార్మికులకు విముక్తి కల్పించి వారిని బడులకు పంపాలనే లక్ష్యంతో అధికారులు ఆపరేషన్ ముస్కాన్.. ఆపరేషన్ స్మైల్ పేరుతో కార్యక్రమాలు రూపొందించారు. ఇందులో భాగంగా పోలీస్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, విద్య, ఆరోగ్య శాఖ, చైల్డ్ లైన్ సభ్యులతో బృందాలను ఏర్పాటు చేస్తారు. ప్రతి ఆరు నెలలకోసారి ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ కొనసాగుతోంది. ఈ కార్యక్రమాలు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నిరంతర ప్రక్రియగా సాగుతున్నాయి. మన జిల్లాలో మాత్రం ఏడాదికి రెండు సార్లు కార్యక్రమం నిర్వహించి మమా అనిపిస్తున్నారు. పనులు మాన్పించినా.. ఆపరేషన్ ముస్కాన్.. స్మైల్ కార్యక్రమాల ద్వారా బాల కార్మికులకు పనుల నుంచి విముక్తి కల్పిస్తున్న అధికారులు వారు పాఠశాలలకు వెళ్తున్నారా? తిరిగి పనులకు వెళ్తున్నారా అనే విషయం పరిశీలించడం లేదు. పిల్లలను పనుల్లో పెట్టుకుంటున్న వారిపై కేసులు నమోదు చేసి చిన్నారులను హోంకు తరలిస్తున్నారు. ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. హోంకు చేరిన పిల్లల వయస్సు ఆధారంగా ఆయా తరగతుల్లో చేర్చాలి. అలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కొద్ది రోజుల తర్వాత చిన్నారులు బయటికి వచ్చి తిరిగి పనులకు వెళ్తున్నారు. పరిహారం ఊసేలేదు బాల కార్మికులను పనులు మాన్పించి బడులకు పంపే బాధ్యత విద్యాశాఖ, కార్మిక శాఖ పైనే ఉంటుంది. ఎవరైనా పిల్లలను పనుల్లో పెట్టుకుంటే కేసులు నమోదు చేయడం తోపాటు యజమానుల నుంచి పరిహారం ఇప్పించాలి. ఇప్పటి వరకు వందల సంఖ్యలో బాల కార్మికులను విముక్తి కల్పించినా ఒక్కరికి కూడా పరిహారం ఇప్పించిన పాపాన పోలేదు. పై రెండు శాఖల అధికారులు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో పాల్గొనడంలేదు. పోలీసు, చైల్డ్ లైన్ ప్రతినిధులు మాత్రమే రిస్కు తీసుకుంటున్నారు. గత ఏడాది పోలీసులు దాదాపు 65 కేసులు నమోదు చేశారు. జిల్లాలో 1,200 మందికి పైగా బాల కార్మికులు ఉన్నట్లు స్వచ్ఛంద సంస్థల గణాంకాలు చెబుతున్నా విద్యాశాఖ వద్ద మాత్రం సరైన లెక్కలు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గత ఏడాది ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 65 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించినట్లు అధికారులు తెలిపారు. వందల్లో బాలకార్మికులు.. పదుల్లో విముక్తి సత్ఫలితాలివ్వని ఆపరేషన్ ముస్కాన్, స్మైల్ కార్యక్రమాలు 14వ విడతకు కసరత్తు ప్రత్యేక బృందాల ఏర్పాటు జిల్లాలో 1,200 మందికిపైగా బాలకార్మికులు గత ఏడాది 65 మందికే విముక్తి మళ్లీ పనులకు వెళ్తున్న చిన్నారులుహోంలలో సౌకర్యాల కరువు బాల కార్మికులకు పునరావాసం కల్పించేందుకు జిల్లాలో నాలుగు హోంలు (శిశుగృహ, బాలసదనం, యజ్ఞ ఫౌండేషన్, హెల్ఫ్ ఆల్ సొసైటీ) ఉన్నాయి. వీటిలో సౌకర్యాలు లేక చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. పనుల నుంచి విముక్తి కల్పించిన బాలలను బడుల్లో చేర్పించే వరకు హోంలోనే ఉంచాల్సి ఉంటుంది. వారి సంరక్షణ కోసం కేర్ టేకర్లు, వార్డెన్లు, కౌన్సెలింగ్ చేసేందుకు ప్రత్యేక నిపుణులు, బ్రిడ్జి కోర్స్ ఇచ్చేందుకు వలంటీర్లు ఉండాలి. కానీ నాలుగు హోంలలో ఒకరు చొప్పున కేర్ టేకర్లు ఉన్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు బాల కార్మికులు పాఠశాలలకు వెళ్లేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
డ్రగ్స్తో భవిష్యత్ నాశనం
అనంతగిరి: యువత చెడు మార్గాలకు ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్జైన్ సూచించారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా యువజన క్రీడలు, శిశు సంక్షేమం, పోలీసు శాఖల ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా నుంచి బీజేఆర్ చౌరస్తా వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. యువత చెడు అలవాట్ల వైపు ఆకర్షితులైతే వచ్చే కష్ట నష్టాలను తల్లిదండ్రులు వివరించాలన్నారు. కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందో తెలియజేయాలని సూచించారు. నేటి యువతే రేపటి భావి భారత పౌరులన్నారు. కొంతమంది డ్రగ్స్కు బానిసలై భవిష్యత్ను చేజేతులారా నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. యువత డ్రగ్స్, గుట్కా, గంజాయి, సిగరెట్ వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని పేర్కొన్నారు. అనంతరం ఎస్పీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. భారత దేశానికి యువత పట్టుకొమ్మ లాంటి వారని, వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం, దేశం బాగుపడుతుందని అన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం, క్రమశిక్షణ చాలా ముఖ్యమన్నారు. మనం చెడు అలవాట్లకు బానిసలైతే తల్లిదండ్రులు పడే క్షోభ వర్ణనాతీతమని, ఇది గుర్తుంచుకొని మెలగాలని యువతకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి మహమ్మద్ సత్తార్, శిశు సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, జిల్లా అధికారులు, పోలీస్, ఎకై ్సజ్ శాఖ అధికారులు, విద్యార్థినీ, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉందాం బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం కలెక్టర్ ప్రతీక్జైన్ వికారాబాద్లో భారీ ర్యాలీ -
కల్తీ విత్తనాలు అమ్మితే చర్యలు
బంట్వారం: కల్తీ విత్తనాలు అమ్మితే పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేసి లైసెన్సులు రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్రెడ్డి హెచ్చరించారు. గురువారం మండల కేంద్రంలోని ఫెర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. పురుగు మందులు, విత్తనాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డీలర్లు స్టాక్ వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా విక్రయాలు జరిపితే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. పురుగు మందులు, విత్తనాలు, ఎరువు కొనుగోలు చేసే రైతులు విధిగా రసీదులు తీసుకోవాలన్నారు. అనంతరం మద్వాపూర్ గ్రామాన్ని సందర్శించి రైతు రిజిస్ట్రేషన్పై అవగాహన కల్పించారు. వర్షాకాలం పంటల సాగుకు సంబంధించి వ్యవసాయ అధికారుల సలహాలు, సూచననలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఓ శ్రావ్య, ఏఈఓ శిరీష తదితరులు పాల్గొన్నారు.జిల్లా వ్యవసాయ అధికారి మోహన్రెడ్డి -
రహదారులతోనేప్రాంతాల అభివృద్ధి
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి బొంరాస్పేట: రహదారులతోనే ప్రాంతాల అభివృద్ధి చెందుతాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బాపల్లి నుంచి దోమ మండలం బడెంపల్లి వరకు డబుల్ రోడ్డు పనులను ప్రారంభించారు. ఇందుకోసం రూ.2.24 కోట్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింలుగౌడ్, నాయకులు వెంకట్రాములు గౌడ్, జయకృష్ణ, రాంచంద్రారెడ్డి, మల్లేశం, అంజిల్రెడ్డి, మల్లికార్జున్, మోత్యానాయక్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఫలితాలు, అడ్మిషన్లలో తాండూరు కళాశాల భేష్ ● విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా ● నోడల్ ఆఫీసర్ శంకర్నాయక్కు సన్మానం తాండూరు టౌన్: ఇంటర్ ఫలితాల్లో, అడ్మిషన్లలో తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల అద్భుతంగా ఉందని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా కితాబు ఇచ్చారు. గురువారం నగరంలో ఆమె రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాండూరు జూనియర్ కళాశాలలో ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో 550 మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకోవడం, గత సంవత్సరం ఫలితాల్లో 83శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంతో జిల్లా నోడల్ అధికారి శంకర్నాయక్ను ఆమె ఘనంగా సన్మానించారు. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకోవడం పట్ల కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ మల్లినాథప్ప, అధ్యాపకులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. వాల్పోస్టర్ ఆవిష్కరణ అనంతగిరి: నేషనల్ గ్రీన్ కాప్స్ ఆధ్వర్యంలో నిర్వహించే నేషనల్ స్టూడెంట్ పర్యావరణ్ కాంపిటీషన్ – 2025 పోటీలను విజయవంతం చేయాలని డీఈఓ రేణుకాదేవి కోరారు. గురువారం వికారాబాద్లో ఇందుకు సంబంధించి వాల్పోస్టర్ను ఆవిష్కరిచారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి విశ్వేశ్వర్, ఏవో రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలిపరిగి: ప్రభుత్వ భూములను అక్రమ రిజిస్ట్రే షన్ చేస్తున్న పరిగి తహసీల్దార్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటయ్య డిమాండ్ చేశారు. గురువారం పరిగి పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంగంపల్లి గ్రామంలో ఎకరా ప్రభుత్వ భూమిని ఇతరులకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. అలాగే గోవిందాపూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 52లో 16 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేశారన్నారు. తహసీల్దార్పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి గోవింద్నాయక్, రాంచంద్రయ్య పాల్గొన్నారు. -
త్వరలో మెడికల్ కళాశాల తరగతులు
తాండూరు టౌన్: తాండూరు పట్టణంలో త్వరలో మెడికల్ కళాశాల తరగతులు ప్రారంభం కానున్నట్లు తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. గురువారం పట్టణంలో రూ.26 కోట్లతో చేపట్టిన(నిర్మాణ దశలో ఉన్న) భవనాన్ని ఆయన పరిశీలించారు. ఎంబీబీఎస్ మొదటి సంవత్సర తరగతుల కోసం కావాల్సిన మౌలిక సదుపాయాలు, వసతులు, గదులు, ల్యాబ్లు, హాస్టల్ను క్షుణ్ణంగా పరిశీలించారు. భవనం ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుందని ఆరా తీశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటైన మెడికల్ కళాశాలల కోసం నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. పూర్తి వివరాలను ఈనెల 30న ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు చెప్పారు. తాండూరు, కొడంగల్లో భవన నిర్మాణ పనులు ఏమేరకు పూర్తయ్యాయనే విషయమై పరిశీలనకు వచ్చామన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి తాండూరులో మెడికల్ కళాశాల తరగతులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. మరో మూడు నెలల్లో భవనం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. 56 మంది విద్యార్థులకు సరిపడా హాస్టల్ భవన నిర్మాణ పనులను పరిశీలించామన్నారు. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న తాండూ రు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలు విస్తత పరచనున్నట్లు వివరించారు. సిటి స్కాన్ నుంచి ఎంఆర్ఐ వరకు అధునాతన టెక్నాలజీ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. కొడంగల్ కళాశాల తాండూరులో.. సీఎం రేవంత్రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్కు మంజూరైన మెడికల్ కళాశాల తరగతులను తాండూరులో ఎందుకు కొనసాగించనున్నారని విలేకరులు కమిషనర్ను ప్రశ్నించగా, దీనికి ఆయన ఇలా సమాధానమిచ్చారు. మెడికల్ కళాశాల కొడంగల్కు మంజూరైన విషయం తెలిసిందేనని, అయితే తాండూరులో నర్సింగ్ కళాశాల కోసం నిర్మిస్తున్న భవనాన్ని మెడికల్ కళాశాల కోసం ఉపయోగించుకోవాలని ప్రభుత్వం సూచించినట్లు చెప్పారు. నర్సింగ్ విద్యార్థినుల కోసం అవసరమైతే మరో చోట భవన నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అనంతరం కమిషనర్ మాతాశిశు ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిని పరిశీలించారు. ఆయన వెంట టీజీఎంఐడీసీ ఎస్ఈ సురేందర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీకృష్ణ, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆనందం, ఎంసీహెచ్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్లు డాక్టర్ సునీత, డాక్టర్ వినయ్కుమార్ ఉన్నారు. పనుల్లో వేగం పెంచండి కొడంగల్: కొడంగల్ పట్టణంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ ఆదేశించారు. గురువారం కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని, నాణ్యతలో రాజీ పడరాదని సూచించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రప్రియ, డాక్టర్లు సాకేత్, శివశంకర్, పూజ, శ్రావణి, వైద సిబ్బంది మోహన్, గీత, సంగీత తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ తాండూరు పట్టణంలో భవనం పరిశీలన -
కన్నబిడ్డల్లా చూసుకోవాలి
తాండూరు రూరల్: తల్లిదండ్రులను వదలి హాస్టల్లో ఉంటున్న విద్యార్థులను ఉపాధ్యాయులు కన్నబిడ్డల్లా చూసుకోవాలని ట్రెయినీ కలెక్టర్ హర్షిత్ చౌదరి అన్నారు. గురువారం మండలంలోని ఐనెల్లి శివారులో గల కేజీబీవీని తనిఖీ చేశారు. హాస్టల్లోని వంట గదిని పరిశీలించారు. సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. భోజన విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిర్వాహకులకు సూచించారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తహసీల్దార్ తారాసింగ్, స్పెషల్ ఆఫీసర్ ఆశలత, ఆర్ఐ గోపి తదితరులు పాల్గొన్నారు. ట్రెయినీ కలెక్టర్ హర్షిత్ చౌదరి -
దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
యాలాల: మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన దళిత రైతు రవికుమార్పై దాడిచేసి గాయపరిచిన వారిని వెంటనే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్, దళిత ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయమై బుధవారం కలెక్టర్ ప్రతీక్ జైన్ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం దళిత ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ..హాజీపూర్కు చెందిన రవికుమార్ గోరేపల్లి గ్రామానికి చెందిన కోటం శ్రీనివాస్కు చెందిన పొలాన్ని ఏడేళ్లుగా కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఈ నెల 17న పొలంలో విత్తనాలు వేసేందుకు వెళ్లగా, అదే గ్రామానికి చెందిన కోటం విష్ణు, ఫకీరప్ప తమ అనుచరులతో వచ్చి రవిపై కర్రలతో దాడి చేసి చంపేందుకు యత్నించారన్నారు. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటకి నిందితులను అరెస్టు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు మహిపాల్, శ్రీనివాస్, బుస్సా శ్రీనివాస్, వ్య.కా.స. జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల పోరాట సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్తూరు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్కు ఫిర్యాదు -
భూదాన భూములను కాపాడాలి
షాబాద్: అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ, భూదాన భూములను కాపాడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని ముదిరాజ్ భవన్లో సీపీఐ మండల మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమార్కులు అసైన్డ్ భూములను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. సీపీఐ వందేళ్ల ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించాలన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ఆనాటి బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమ స్ఫూర్తితో ఈ దేశంలో విప్లవ ఉద్యమాలు జరిగాయన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ కార్యకర్తలు ప్రజలు ఆందోళన నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు రామస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రభులింగం, మండల కార్యదర్శి జంగయ్య, నాయకులు సత్తిరెడ్డి, మక్బూల్, మంజుల, అంజయ్య, రఘురాం, మధు, నారాయణ, రుక్కయ్య తదితరులు పాల్గొన్నారు. నూతన కమిటీ ఎన్నిక అనంతరం సీపీఐ షాబాద్ మండల నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జంగయ్య ప్రకటించారు. మండల కార్యదర్శిగా నాగర్కుంట గ్రామానికి చెందిన పాలమాలకు శ్రీశైలంను ఎనుకున్నారు. సహాయ కార్యదర్శులుగా గడ్డం వెంకటేష్, రాములు, వీరితో పాటు 15 మంది కౌన్సిల్ సభ్యులను కమిటీలోకి తీసుకున్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగయ్య -
కారు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి
మొయినాబాద్: కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఇద్దరు మహిళలను బలిగొంది. మరో మహిళ మృత్యువుతో పోరాడుతోంది. స్థానికులు, ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఖైరతాబాద్కు చెందిన నందకిషోర్, అశ్విని(37) దంపతుల పిల్లలు మొయినాబాద్లోని సుజాత స్కూల్లో చదువుతున్నారు. దీంతో వీరి కుటుంబం కొంతకాలంగా హిమాయత్నగర్లో అద్దెకు ఉంటున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు అశ్విని తన మరదలు లక్ష్మి స్కూటీపై రెడ్డిపల్లిలోని మీసేవ కేంద్రానికి బయలుదేరారు. చిలుకూరుకు వెళ్లగానే మేడిపల్లికి చెందిన కుమ్మరి సుశీల(60) యూకో బ్యాంకుకు వచ్చి తిరిగి వెళ్లేందుకు వీరిని లిఫ్ట్ అడిగింది. ముగ్గురూ స్కూటీపై వెళ్తుండగా రెడ్డిపల్లి సమీపంలో ఎదురుగా వచ్చిన కారు అతివేగంతో ఢీకొట్టింది. దీంతో ముగ్గురూ ఎగిరి రోడ్డుపై పడ్డారు. తీవ్ర గాయాలపాలైన వీరిని చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అశ్విని, సుశీల మృతిచెందారు. లక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. అర కిలోమీటర్ దూరంలోనే... స్కూటీపై వెళ్తున్న మహిళలు మరో రెండు నిమిషాల్లో గమ్య స్థానానికి చేరుకునేవారు. అరకిలోమీటర్ దూరంలో దూరంలో ప్రమాదానికి గురికావడంతో ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిశాయి. కారు అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన చోట ఓ షాపులో ఉన్న సీసీ కెమరాల్లో ప్రమాదం జరిగిన తీరు నిక్షిప్తమైంది. కారు అతివేగంతో వచ్చి స్కూటీని ఢీకొట్టినట్లు సీసీ టీవీలో రికార్డయ్యింది. ప్రాణాపాయ స్థితిలో మరో మహిళ స్కూటీని కారు ఢీకొట్టడంతో ప్రమాదం మొయినాబాద్ మండలం రెడ్డిపల్లి సమీపంలో ఘటన -
పట్టుబడిన నల్లబెల్లం ధ్వంసం
ఆమనగల్లు: వివిధ కేసుల్లో పట్టుబడిన నాటుసారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం, ఇతర ముడి పదార్థాలను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆమనగల్లు ఎకై ్సజ్ సీఐ బద్యానాద్చౌహాన్ ఆధ్వర్యంలో బుధవారం ధ్వంసం చేశారు. పట్టణ సమీపంలో పెద్ద గోతిని తీసి మున్సిపాలిటీ సిబ్బంది సహాయంతో వివిధ కేసులలో పట్టుబడిన 780 కిలోల నల్లబెల్లం, 80 కిలోల పటిక, 40 కిలోల విప్ప పువ్వును నాశనం చేశారు. కార్యక్రమంలో ఎస్ఐలు కృష్ణప్రసాద్, అరుణ్కుమార్, సిబ్బంది శంకర్, దశరథ్, బాబు, లోక్య, శ్రీను, ఉపేందర్, శ్రీజ, ఆమని తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థికి కాంస్యపతకం
కొడంగల్ రూరల్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ తృతీయ సంవత్సరం చదువుతున్న అల్వాల్ సాయికిరణ్కు షాట్పుట్ విభాగంలో కాంస్య పతకం వచ్చిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కళాశాలలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో నిర్వహించిన 23వ జాతీయ జూనియర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ విభాగంలో విద్యార్థి సాయికిరణ్ కాంస్య పతకం సాధించ డం హర్షణీయమన్నారు. తమ కళాశాల విద్యార్థి జాతీయ స్థాయిలో పతకం సాధించడం గర్వ కారణమన్నారు. క్రీడలతో విద్యార్థులకు మానసికోల్లాసం, శారీరక దృడత్వం, సామాజిక గుర్తింపు లభిస్తుందన్నారు. విద్యార్థులు చదు వుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. బావిలో పడి వృద్ధుడు మృతి పరిగి: పొలానికి వెళ్లిన వృద్ధుడు బావిలో పడి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ సంతోష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోయ ఈదయ్య(70)కు కొంత కాలం క్రితం కుమారుడు చనిపోవడంతో కోడలు, మనవళ్ల దగ్గర ఉంటున్నాడు. రోజు మాదిరిగానే మంగళవారం పొలం దగ్గర స్నానం చేసివస్తానని చెప్పి వెళ్లాడు. దీంతో మనవళ్లు బైక్పై ఎక్కించుకుని పొలం దగ్గర దించి వచ్చారు. మళ్లీ టిఫిన్ తీసుకుని వెళ్లి అక్కడ పెట్టి వచ్చారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో పొలం దగ్గర చూడగా ఈదయ్య కనిపించ లేదు. దీంతో అక్కడ చుట్టు పక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించ లేదు. బావి దగ్గరకు వెళ్లి చూడగా గట్టుపైన చెప్పులు కనిపించాయి. ఈ విషయాన్ని గ్రామస్తులకు సమాచారం అందించడంతో వారొచ్చి బావిలో నుంచి మృతదేహాన్ని బయటికి తీశారు. బుధవారం మృతుడి కోడలు వెంకటమ్మ మామ మృతిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా శరణు బసప్ప నియామకం జులై 6న ప్రమాణ స్వీకారం తాండూరు టౌన్: తాండూరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా ఆర్ శరణు బసప్పను నియమించారు. ఆయనతో పాటు క్లబ్ కార్యదర్శిగా మంకాల్ నటరాజ్, కోశాధికారిగా గౌరీ శంకర్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా నూతన కమిటీ పనిచేస్తుందన్నారు. వచ్చే నెల 6వ తేదీన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన లయన్స్ క్లబ్ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. బీసీల హక్కులపై చర్చించండి షాద్నగర్రూరల్: హైదరాబాద్లోని విద్యానగర్లో రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్యను బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్ ఆధ్వర్యంలో నాయకులు బుధవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా బీసీల హక్కుల సాధన కోసం, బీసీసేన గ్రామ కమిటీలు, కార్యాచరణపై చర్చించారు. బీసీలకు రావాల్సిన 42 శాతం రిజర్వేషన్పై ప్రభుత్వంతో చర్చించాలని ఆర్.కృష్ణయ్యను నాయకులు కోరారు. గ్రామీణ స్థాయి నుంచి బీసీసేన కమిటీలను పటిష్టంగా వేసుకోవాలని, కులాలకతీతంగా భాగస్వాములను చేయాలని కృష్ణయ్య సూచించారు. బీసీలను అన్ని రంగాల్లో చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు. -
అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్ అరెస్టు
షాద్నగర్రూరల్: మహిళల మెడలో బంగారు పుస్తెల తాళ్లనే లక్ష్యంగా చేసుకొని చోరీలకు తెగబడుతున్న ఓ దుండగుడిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల పాలు చేశారు. బుధవారం పట్టణంలోని పోలీస్స్టేషన్లో సీఐ విజయ్కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని నాగులపల్లి గ్రామానికి చెందిన నల్లపురం బల్వంత్రెడ్డి, అనసూయ దంపతులు ఈ నెల 11న ద్విచక్ర వాహనంపై రామేశ్వరం దైవ దర్శనానికి వెళుతున్నారు. హజిపల్లి శివారు దాటుతుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వెనక నుంచి వచ్చి అనసూయ మెడలో ఉన్న నాలుగున్నర తులాల బంగారు పుస్తెల తాడును తెంచుకొని పారిపోయారు. ఈ ఘటనపై దంపతులు అదే రోజు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఉత్తర్ప్రదేశ్కు చెందిన వారీగా సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించారు. పోలీసులు లక్నోలో ప్రధాన నిందితుడు మహేంద్రరాస్తోగిని అరెస్టు చేయగా, మరో నిందితుడు చాంద్బాబు పరారీలో ఉన్నాడు. తమదైన శైలిలో విచారించగా ప్రధాన నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. నిందితుడి నుంచి ద్విచక్రవాహనం, సెల్ఫోన్ స్వాఽధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. అతడిపై కర్నూల్, విజయనగరం, ఆదిలాబాద్, మహబూబ్నగర్, షాద్నగర్, అల్వాల్, బాచుపల్లితో పాటుగా ఉత్తర్ప్రదేశ్లో బైక్, చైన్స్నాచింగ్, మర్డర్, గంజాయికి సంబంధించి 20పైగా కేసులు ఉన్నాయి. చాకచాక్యంగా కేసును ఛేదించిన క్రైమ్ పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. బంగారం చోరీ చేసి యూపీకి పరారీ -
‘స్థానిక’ ఎన్నికలు వెంటనే నిర్వహించాలి
బొంరాస్పేట: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక ఏడాదిన్నర కావస్తుందని, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో హాజరైన అనంతరం మండల కేంద్రంలో విలేకర్ల సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు. ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్రెడ్డిని విమర్శించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా ఎస్పీ స్పందించాలి రెవెన్యూ అధికారులను, పోలీసులను అదుపులో పెట్టుకొని సొంత పాలన కొనసాగిస్తున్నారని ఫైర్ అయ్యారు. పోలీసులు అక్రమ కేసులతో భయపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో జిల్లా ఎస్పీ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్ఐని రెండు రోజుల్లో సస్పెండ్ చేయాలని, లేదంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోట్ల యాదగిరి, నాయకులు మహేందర్రెడ్డి, నారాయణరెడ్డి, సుదర్శన్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, చాంద్పాషా, మధుయాదవ్, శ్యామలయ్యగౌడ్, గోవింద్రెడ్డి, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు. సాయిచంద్ వర్ధంతికి రావాలి సాయిచంద్ మౌర్య రెండవ వర్ధంతి కార్యక్రమాన్ని ఈ నెల 29న ఆయన స్వగ్రామంలో నిర్వహిస్తున్నామని ఎరన్పల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా నరేందర్రెడ్డి గోడపత్రికను విడుదల చేశారు. వర్ధంతి సభకు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. ఇందులో మాసాని వెంకటయ్య, నెహ్రూనాయక్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆరు గ్యారెంటీల అమలు ఉత్తిదే అక్రమ కేసులతో భయపెడుతున్నారు ఎస్ఐ రవూఫ్ను రెండు రోజుల్లో సస్పెండ్ చేయాలి లేదంటే ఆందోళన విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి -
సమన్వయం చేసుకుంటూ పనులు చేయాలి
అనంతగిరి: జిల్లాలోని విద్యుత్ అధికారులు రైతులను సమన్వయం చేసుకుని పనులు త్వరితగతిన పూర్తి చేయాలని టీజీఎస్పీడీసీఎల్ సంస్థ చీఫ్ ఇంజనీర్లు సాయిబాబా, పెరుమాళ్ల ఆనంద్, బాలస్వామి అన్నారు. వికారాబాద్లోని విద్యుత్ కార్యాలయంలో టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ ఫరూకి ఆదేశాల మేరకు బుధవారం సంస్థ చీఫ్ ఇంజనీర్లు జిల్లా విద్యుత్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది ఇప్పటివరకు 2,058 విద్యుత్ కనెక్షన్లు విడుదల చేశామన్నారు. ఇందులో 277 నియంత్రికలు, 116 కేఎం కండక్టర్, 78 కేఎం కేబుల్ సంబంధిత విద్యుత్ స్తంభాలు, మ్యాచింగ్ మెటీరియల్ రైతులకు అందజేశామన్నారు. వచ్చే జులైలో మరో 2వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేయనున్నట్లు చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్ఈ రవిప్రసాద్, డీఈలు, ఎస్ఏఓలు, ఏడీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేట్ స్కూల్లో పుస్తకాలు సీజ్
తాండూరు టౌన్: తాండూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం పుస్తకాల విక్రయ దందా కొనసాగిస్తున్న విషయం తెలుసుకున్న బీసీ జేఏసీ నాయకులు బుధవారం స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేని చోట పుస్తకాలు విక్రయిస్తున్న విషయంపై మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎంఈఓ అక్కడికి చేరుకుని సుమారు రూ. 4లక్షల విలువైన పుస్తకాలను సీజ్ చేశారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ పాఠశాలల్లో పుస్తకాలు విక్రయించొద్దని గతంలోనే సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశామన్నారు. ఐనప్పటికీ సదరు స్కూల్ యాజమాన్యం ఓ గదిలో పుస్తకాలు, బ్యాగులు తదితర స్టేషనరీ సామాన్లను విక్రయిస్తోందన్నారు. ఈ మేరకు పుస్తకాలు నిల్వ చేసిన గదిని సీజ్ చేసి, ఈ విషయాన్ని జిల్లా విద్యాధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం సదరు పాఠశాలపై చర్యలు తీసుకుంటామని ఎంఈఓ పేర్కొన్నారు. బీజేపీ నాయకుల ఆందోళనతో స్పందించిన విద్యాశాఖ అధికారులు -
ఆర్బీఓఎల్ పరిశ్రమ సీఈఓ శ్రీనివాస్రెడ్డి
ఇథనాల్ సరఫరాకు ఒప్పందం తాండూరు: పెట్రో ధరల నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ పరిశ్రమలను ప్రోత్సహిస్తోందని ఆర్బీఓఎల్ పరిశ్రమ సీఈఓ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. బుధవారం యాలాల మండలం జెక్కెపల్లి గ్రామ శివారులోని పరిశ్రమలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఏడాది కాలంలో మూడు కోట్ల లీటర్ల ఇథనాల్ సరఫరా చేయాలని పెట్రోలియం సంస్థలైన బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్లు ఆర్బీఓఎల్ పరిశ్రమతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సరఫరా కొనసాగుతోందన్నారు. పరిశ్రమ నుంచి వచ్చే ఆదాయంలో గ్రీన్ బడ్జెట్ సీఎస్ఆర్ నిధులను రెండు నెలలుగా రక్షణ శాఖకు అందిస్తున్నామని వివరించారు. -
బైక్ అదుపుతప్పి ఏఈకి గాయాలు
యాలాల: బైక్ అదుపు తప్పి కింద పడటంతో మండల ట్రాన్స్కో ఏఈకి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. నారాయణపేట జిల్లాకు చెందిన రఘువీర్ యాలాల మండల ట్రాన్స్కో ఏఈగా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం స్వస్థలానికి వెళ్లి బుధవారం జిల్లా కేంద్రంలో సమావేశానికి హాజరయ్యేందుకు బైక్పై వస్తున్నాడు. కోస్గి సమీపంలోని చంద్రవంచ వద్ద బైక్ అదుపు తప్పి కిందపడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఆయనను మహబూబ్నగర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ట్రాన్స్కో సిబ్బంది తెలిపారు.కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యకేశంపేట: పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగిరాకపోవడం, చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు, తెలిపిన వివరాల ప్రకారం... లేమామిడి శివారు తుర్కలపల్లికి చెందిన దిద్దెల ప్రశాంత్ (30) కూలీ పనులు చేస్తూ భార్య కృష్ణవేణి, ఇద్దరు పిల్లలతో కలిసి జీవించేవాడు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలు నెలకొడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం కృష్ణవేణి పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఈనెల 23న ఆమెను తీసుకువచ్చేందుకు వెళ్లగా తిరస్కరించడంతో మరుసటి రోజు తిరిగి వచ్చేశాడు. మంగళవారం రాత్రి తన ఇంట్లోని రేకుల పైపు నకు ఉరేసుకున్నాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు తలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యు లు నిర్ధారించారు. షాద్నగర్ ప్రభుత్వ ఆస్ప త్రిలో పోస్టుమార్టం ని ర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.అతిగా మద్యం తాగించి లైంగిక దాడిగచ్చిబౌలి: వైన్ షాపు ముందు పరిచయమైన ఓ యువకుడు అతిగా మద్యం తాగించి యువతిపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపిన ప్రకారం.. ఈవెంట్ల లో డ్యాన్సర్గా పని చేసే ఓ యువతి(23) గచ్చిబౌలి జంక్షన్లోని వైన్ షాపు వద్ద మద్యం తాగుతోంది. కుక్గా పనిచేసే ఉత్తర్ప్రదేశ్కు చెందిన ప్రకాష్ మద్యం తాగుతున్న యువతిని పరిచ యం చేసుకొని..దగ్గర్లోనే తన రూమ్ ఉందని న మ్మించి తీసుకెళ్లాడు. ఇద్దరు మద్యం తాగి నిద్రపోయారు. రాత్రి 2 గంటలకు యువతికి మెళకువ రావడంతో.. ఒంటిపై బట్టలు లేకపోవడంతో లైంగిక దాడి జరిగిందని ఫిర్యాదు చేసింది. -
కిలోన్నర గంజాయి పట్టివేత
తాండూరు టౌన్: గంజాయి విక్రయిస్తున్నాడన్న పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తాండూరు పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన రఫీక్ అనే వ్యక్తి కొంత కాలంగా కర్ణాటక రాష్ట్రం నుంచి గంజాయి తెచ్చి పలువురికి విక్రయిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో బుధవారం స్థానిక విలియంమూన్ గ్రౌండ్ సమీపంలో స్థానిక పోలీసులతో కలిసి రఫీక్ను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి కిలోన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఎమర్జెన్సీ..స్వేచ్ఛకు చీకటి దినం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ కుమార్ తాండూరు టౌన్: నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడం స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు చీకటి దినమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ కుమార్ అన్నారు. బుధవారం పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ సమయంలో జైలు జీవితం గడిపిన పలువురిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు ఆనాటి చీకటి దినాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం రమేష్ కుమార్ మాట్లాడుతూ.. జాతీయ అత్యవసర పరిస్థితి విధించి, అప్పటి ప్రధాని ఇందిరాగాంఽధీ, ప్రజాస్వామ్యా న్ని ఖూనీ చేసి.. అనేక మందిని అకారణంగా జైల్లో పెట్టిందన్నారు. అప్పటి చీకటి రోజులు తిరిగి రాకూడదని, రాజ్యాంగం అమలు పకడ్బందీగా జరగాలని కోరుతున్నట్లు చెప్పారు. ఎమర్జెన్సీ సందర్భంగా జైలుకు వెళ్లిన ప్యాట నారాయణరెడ్డి, కె.నర్సిరెడ్డి, జి.ప్రభులింగం, ఆలంపల్లి రాంరెడ్డి, ఖాంజాపూర్ రాంరెడ్డి, దోర్నాల అనంతరెడ్డి తదితరులను ఘనంగా సన్మానించామన్నారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణ ముదిరాజ్, శాంత్కుమార్, లలిత, భద్రేశ్వర్, చంద్రశేఖర్, గౌరీ శంకర్, పటేల్ విజయ్, సుదర్శన్ గౌడ్, జగదీష్ యాదవ్, దోమ కృష్ణ, ప్రకాష్, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్, బిచ్చప్ప తదితరులు పాల్గొన్నారు. రేపు రెండో విడత కౌన్సెలింగ్ అనంతగిరి: డీసెట్ – 2025 ధ్రువపత్రాల పరిశీలనకు మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా డైట్ కళాశాల ప్రిన్సిపాల్ రామాచారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన జూన్ 27న నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కాగా వెబ్ కౌన్సెలింగ్ 28 నుంచి 30వ తేదీ వరకు ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 944107 1533లో సంప్రదించాలన్నారు. రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు ఏడీఏ పద్మావతి యాచారం: విత్తనాలు, ఎరువుల విక్రయాల్లో రైతులను మోసం చేస్తే జైలు శిక్ష తప్పదని జిల్లా వ్యవసాయ శాఖ ఏడీఏ పద్మావతి హెచ్చరించారు. బుధవారం ఆమె మండల కేంద్రంలోని పలు విత్తనాలు, ఎరువులు విక్రయించే దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి ఏ ధరకు విత్తనా లు, ఎరువులు అమ్ముతున్నారు, ధరలు ఎలా ఉన్నా యి, రైతులకు రసీదులు ఇస్తున్నారా.? కాలం చెల్లిన విత్తనాలను, ఎరువులను రైతులకు విక్రయిస్తున్నా రా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యాపారులు అధిక లాభార్జన ఆశతో రైతులను మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొనుగోళ్లపై రైతులకు వెంటనే రసీదులు ఇవ్వాలని సూచించారు. స్టాక్బోర్డులు, ధరల పట్టిక ఏర్పాటు చేయాలని సూచించారు. -
ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచండి
● లబ్ధిదారుల్లో చైతన్యం తేవాలి ● కలెక్టర్ ప్రతీక్ జైన్ అనంతగిరి: పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశ గా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై ఎంపీడీఓలు, ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇప్పటి వరకు ఎన్ని గ్రౌండింగ్ అయ్యాయి, ఎన్నింటికి మార్కింగ్ ఇచ్చారు, ఎప్పటిలోగా పూర్తి చేస్తారు అనే విషయాలపై ఆరా తీశారు. మండలాల వారీగా ఇళ్ల నిర్మాణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు విడతల్లో మంజురైన ఇళ్ల నిర్మా ణ పనులను జాగ్రత్తగా పరిశీలించాలని ఆదేశించారు. వైద్యులు అందుబాటులో ఉండాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఎంపీడీఓలు పీహెచ్సీలను పరిశీలించి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీయాలన్నారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేలా చొరవ చూపాలన్నారు. పాఠశాలల్లో మరమ్మతు పనులను పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో వనమహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, లక్ష్యం మేర మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం ఉపాధి హామీ పథకం పనులపై ఆరా తీశారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, డీఆర్డీఏ శ్రీనివాస్, డీపీఓ జయసుధ, డీఎంహెచ్ఓ వెంకటరవణ, అన్ని మండలాల ఎంపీడీఓలు, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తులను పరిశీలించాలి భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను అన్ని మాడ్యూల్స్లో పరిశీలించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ తహసీల్దార్లకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండలాల తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిశీలించి డేటా ఎంట్రీ చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఆర్డీఓ వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య
● విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలి ● డీఈఓ రేణుకాదేవి బంట్వారం: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని డీఈఓ రేణుకాదేవి అన్నారు. బుధవారం కోట్పల్లి మండలం ఎన్నారం జెడ్పీహెచ్ఎస్, ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల నమోదు సంఖ్యను మరింతగా పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం బోధనా తీరును పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి పాఠ్యాంశాలను అడిగి తెలుసుకున్నారు. ఏఐ బోధన విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చూడాలన్నారు. విధి నిర్వహణలో ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి పలు సబ్జెక్టులకు సబంధించి సూచనలు చేశారు. సమయాన్ని వృథా చేయకుండా బాగా చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. కష్టంతో కాకుండా ఇష్టపడి చదవడం అలవర్చుకోవాలన్నారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. చదువుతోపాటు క్రమ శిక్షణ కూడా చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతిరోజూ దినపత్రికలు చదివి జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ చంద్రప్ప, జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం శారద, పీఎస్ హెచ్ఎం శేఖర్, ఉపాధ్యాయులు హర్షబేగం, లావణ్య తదితరులు పాల్గొన్నారు. -
వికటించిన ‘పాఠం’
● బయాలజీ టీచర్పై వేటు ● ఆవు మెదడుతో ప్రయోగాత్మక బోధన ● ఉపాధ్యాయురాలి తీరుపై హిందూసంఘాలు, బీజేపీ ఆందోళన ● ఘటనపై విచారణ జరిపిన ఎంఈఓ, సీఐ ● టీచర్ను సస్పెండ్ చేస్తూ డీఈఓ ఉత్తర్వులు ● హెచ్ఎం ఫిర్యాదుతోపీఎస్లో కేసు నమోదు యాలాల: పదో తరగతి విద్యార్థులకు ప్రయోగాత్మక విద్య చెప్పాలనుకున్న బయాలజీ టీచర్ ఆలోచన వికటించింది. జంతువుల్లో మెదడు పనితీరు, నియంత్రణ విషయాలను వివరించేందుకు ఆవు మెదడును స్కూల్కు తీసుకెళ్లడం తీవ్ర దుమారం రేపింది. ఈ విషయమై హిందూ సంఘాలు, బీజేపీ నాయకుల ఆందోళనలతో ఘటనపై విచారణ జరిపిన విద్యాశాఖ అధికారులు సదరు టీచర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఖాసీమాబీ బయాలజీ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వరిస్తున్నారు. ఇదిలా ఉండగా మెదడు పనితీరు, నియంత్రణ అంశంపై గత మంగళవారం టెన్త్ విద్యార్థులకు పాఠం బోధించారు. ఈ సమయంలో ఓ జంతువు మెదడును ప్రదర్శిస్తూ విద్యార్థులకు లెస్స్న్ చెప్పారు. ఇది ఏ జంతువు మెదడు మేడమ్..? అని విద్యార్థులు అడగగా.. ఆవు మెదడు అని చెప్పారు. సాయంత్రం ఇంటికి వెళ్లిన విద్యార్థులు ఆవు మెదడును తెచ్చి తమ మేడమ్ పాఠం చెప్పారని తల్లిదండ్రులకు వివరించారు. ఈ విషయం స్థానిక యువకులు, హిందూ సంఘాల నాయకులకు తెలియడంతో బుధవారం గ్రామంలో నిరసన ర్యాలీ చేపట్టారు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గోమాత మెదడును ప్రదర్శించిన టీచర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై సమాచారం అందుకున్న రూరల్ సీఐ నగేష్, ఎస్ఐ గిరి, ఎంఈఓ రమేశ్ స్కూల్కు చేరుకుని, వివరాలు సేకరించారు. పాఠ్యాంశం విన్న విద్యార్థులతో పాటు తోటి ఉపా ధ్యాయుల నుంచి వివరాలు సేకరించి, జిల్లా విదాధికారికి నివేదిక అందజేశారు. ఘటనకు కారణమైన టీచర్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ, ఎంఈఓ పేర్కొనడంతో ఆందోళనకారులు శాంతించారు. అధికారుల రిపోర్ట్ అందుకున్న డీఈఓ రేణుకాదేవి టీచర్ ఖాసీమా బీని సస్పెండ్ చేస్తూ సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశా రు. మరో వైపు ఇదే ఘటనకు సంబంధించి పాఠశాల హెచ్ఎం మల్లమ్మ ఫిర్యాదు మేరకు పీఎస్లో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గిరి తెలిపారు. -
వ్యసనాలకు దూరంగా ఉండాలి
కుల్కచర్ల: వెనుకబడిన తరగతుల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వాలు కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కమలాకర్రెడ్డి సూచించారు. బుధవారం మండలంలోని అల్లాపూర్ గ్రామ పంచాయతీలో ప్రజలకు పీఎం జన్మన్, జాతీయ గౌరవ్ ఉత్సవ్ అభియాన్ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన తరగతుల వారి సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రస్తుతం గ్రామంలోని ప్రతి కుటుంబానికి బ్యాంక్ ఖాతా ఇప్పించడం, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం ఇప్పించడం జరుగుతుందన్నారు. ఇళ్లు లేని వారి వివరాలను సేకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ముజాహిద్పూర్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ఆఫీసర్ గోవింద్, పంచాయతీ కార్యదర్శి మైమూనాబేగం తదితరులు పాల్గొన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి నషా ముక్త్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం కుల్కచర్ల మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమాలాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని పేర్కొన్నారు. కొన్ని క్షణాల ఆనందం కోసం ఎంతో విలువైన జీవితాన్ని కోల్పోరాదని సూచించారు. కార్యక్రమంలో కుల్కచర్ల వసతి గృహ ప్రత్యేకాధికారి సుందర్, స్పోర్ట్స్ ఇన్చార్జ్ రాజేందర్ రాథోడ్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ● జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కమలాకర్రెడ్డి -
మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సంతోషి పరిగి: మహిళల అఽభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని ఆ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సంతోషి అన్నారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో నియోజకవర్గంలోని మహిళా నా యకులతో సన్నాహక సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రా ష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయాల నే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రతి పథకంలో వారికి పెద్ద పీట వే స్తోందని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చి వారి ఆర్థిక ఎదుగుదలకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షురాలు సురేఖ, పట్టణ అధ్యక్షురాలు రజితరెడ్డి, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. స్వేరోస్ నెట్వర్క్ జిల్లా కమిటీ ఏకగ్రీవం అధ్యక్షుడిగా రాజేష్ పరిగి: స్వేరోస్ నెట్వర్క్ జిల్లా అధ్యక్షుడిగా రాజేష్ను జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్నాపూర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పరిగి పట్టణంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్(మర్పల్లి), ఉపాధ్యక్షులుగా ముకుంద(కొడంగల్), నరేందర్, రాజు, అధికార ప్రతినిధిగా బిచ్చన్న, కోశాధికారిగా రాజేందర్ను ఎన్నుకున్నారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్వేరోలు జ్ఞాన సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని సూచించారు. అంబేడ్కర్, జ్యోతిరావుపూలే వంటి మహానీయులు చూపిన మార్గాన్ని ఎంచుకోవాలని తెలిపారు. యువతకు, విద్యార్థులకు వారి ఆశయాల సాధన దిశగా స్వేరోస్ ముందుకు వెళ్తుందన్నారు. చేనేత కార్మికులసమస్యలు పరిష్కరిస్తాం చేనేత శాఖ డీఎంఓ కళింగరెడ్డి దౌల్తాబాద్: చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆ శాఖ డీఎంఓ కళింగరెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని బాలంపేట గ్రామంలో మండలంలోని చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. ఇటీవల కార్మికులు వారి సమస్యలను కడా ప్రత్యేక అధికారి దృష్టికి తేవడంతో తాము ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. కార్మిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం కార్మికులు మాట్లాడుతూ.. సంఘాలను పునరుద్ధరించి కొత్త సొసైటీలను ఏర్పాటు చేయాలని కోరారు. సభ్యుల ఆర్థిక ఎదుగుదలకు సహకరించాలని విన్నవించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా చేనేత శాఖ అధికారిణి ఇంద్ర, తహసీల్దారు గాయత్రి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రావు, నాయకులు వీరన్న తదితరులు పాల్గొన్నారు. అదనపు డ్యూటీలు రద్దు చేయాలి అనంతగిరి: అంగన్వాడీ టీచర్లతో బీఎల్ఓ అదనపు డ్యూటీలు రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మిహిపాల్ డిమాండ్ చేశారు. సోమవారం వికరాబాద్లోని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూని యన్ నాయకులు భారతి, మనోహర, విజయలక్ష్మి, నిర్మల, సంతోష, బుజ్జమ్మ, అండాలు, స్వరూపరాణి, కవిత పాల్గొన్నారు. -
సగం
ఇంట్లో.. మట్టిలో..సీజన్ ప్రారంభమై నెల దాటినా 60శాతమే విత్తు ● ఊరిస్తున్న మేఘాలు ● చిరుజల్లులతో సరిపెడుతున్న వరుణుడు ● ఆకాశం వైపు చూస్తున్న అన్నదాత ● పెసర, మినుము, జొన్న సాగు చేయొద్దంటున్న అధికారులు వికారాబాద్: వానాకాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటినా రైతన్న ఇంకా ఆకాశం కేసి చూడాల్సి వస్తోంది. వరుణుడి కోసం 15 రోజులుగా ఎదురు చూపులు తప్పడంలేదు. వర్షాకాలం ప్రారంభమైంది మొదలు ఒక్కసారి కూడా పెద్ద వాన పడకపోవడంతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. మొదట్లో అడపా దడపా వర్షాలు కురవగా సగం మంది రైతులు విత్తనాలు వేశారు. ఆ వెంటనే వర్షాలు మొహం చాటేశాయి. వారం రోజులుగా మేఘాలు ఊరిస్తున్నా చిరుజల్లులకే పరిమితం అవుతున్నాయి. పూర్తిస్థాయిలో విత్తుకు సరిపడా పదును కావడం లేదు. ఇప్పటికే రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి ఇళ్లకు తెచ్చుకున్నారు. జిల్లాలో 5.61లక్షల ఎకరాల్లో ఆయా రకాల పంటలు వేయనున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. 60 మిల్లీ మీటర్ల మేర రెండు మూడు సార్లు వర్షాలు కురిస్తేనే విత్తుకు అనుకూలమని అధికారులు అంటున్నారు. అయితే రెండు మూడు మండలాలు మినహా తగినంత వర్షపాతం నమోదు కాలేదు. అదును అయ్యే వరకు విత్తనాలు వేయకపోడమే మేలని అధికారులు సూచిస్తున్నారు. తెచ్చుకున్న విత్తనాలు సగం ఇంట్లో.. సగం మట్టిలో అన్నట్లు పరిస్థితి తయారైంది. 2.90 లక్షల ఎకరాల్లో విత్తనాలు ఒక వేళ ముందుగా వర్షాలు పడితే రోహిణి కార్తెలో లేదంటే మృగశిర కార్తెలో విత్తనాలు వేస్తారు. ఈ ఏడాది మే 24న రోహిణి కార్తె ప్రారంభమైంది. నెల రోజులు కావస్తున్నా ఇంకా 60శాతం విత్తనాలే వేశారు. 40శాతం విత్తనాలు ఇళ్లలోనే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితిలో పెసర, మినుము, జొన్న పంటలు వేయకపోవడమే మంచిదని వ్యవసాయ శాఖ అఽధికారులు అంటున్నారు. జిల్లాలో మొత్తం 5.61లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా ఇప్పటి వరకు 2.90 లక్షల ఎకరాల్లో మాత్రమే విత్తు వేశారు. ఓ పక్క మేఘాలు ఊరిస్తున్నా సాగుకు సరిపడా మాత్రం కురవడంలేదు. ధైర్యం చేసి కొంతమంది రైతులు విత్తనాలు వేయగా అవి మొలకెత్తుతాయా లేదా అనే ఆందోళనలో రైతన్న ఉన్నాడు. కొన్ని చోట్ల మొలకెత్తాక కూడా ఎండిపోయాయి. మరికొన్ని చోట్ల మొలకెత్తలేదు. 16 పంటల సాగు జిల్లాలో మొత్తం 16 రకాల పంటలు సాగు చేస్తారు. వీటిలో సింహభాగం పత్తి, కంది, మొక్కజొన్న, వరి పంటలు. గతేడాది క్వింటాలు పత్తి రూ.8 వేలకు పైగా అమ్ముడుపోవడంతో ఈ సారి పత్తి సాగుకు రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 2.5లక్షల ఎకరాలు కాగా ఈ ఏడాది అంతకు మించవచ్చని అధికారులు అంచనా వేశారు. వరి, కంది సాగు సైతం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కోతుల బెడద ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూరగాయలు, వేరుశనగ సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉంది. ఆ పంటలు వద్దు ప్రస్తుత సీజన్కు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాం. నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాం. సరిపడా వర్షాలు లేక సగం మేర విత్తనాలు వేయలేదు. మరో వారం రోజుల పాటు వర్షాలు పడకపోతే పెసర, మినుము, జొన్న సాగు చేయకపోవడం మంచిది. మిగతా పంటలు జూలై వరకు సాగు చేసుకోవచ్చు. – మోహన్రెడ్డి, డీఏఓ వర్షాల కోసం ఎదురుచూపు ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా సాగుకు సరిపడా వర్షాలు పడలేదు. మొదట్లో కురిసిన వర్షాలకు విత్తనం వేశాం. ఇప్పుడు వర్షాల జాడలేదు. సాయంత్రం కాగానే కారుమబ్బులు కనిపిస్తున్నాయి. కానీ చినుకులు పడటం లేదు. పొలంలో వేసిన విత్తనాలను ఎలా కాపాడుకోవాలో అర్థం కావడంలేదు. మరో వారం రోజుల్లో వర్షాలు పడకపోతే ఆర్థికంగా నష్టపోతాం. – గోవింద్రెడ్డి, రైతు, దౌల్తాబాద్ -
యాజమాన్య హక్కులు కల్పించాలి
● ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్అనంతగిరి: ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములపై పేద రైతులకు యాజమాన్య హక్కులు కల్పించాలని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం బొంరాస్పేట మండలం దుప్చర్ల గ్రామ రైతుల తరఫున కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో దాదాపు 200 ఏళ్ల నుంచి పెద్దవాగు సమీపంలో 40 ఎకరాల మిగులు భూమిని నిరుపేద దళితులు సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సుభాష్ తదితరులు పాల్గొన్నారు. -
దళితులపై దాడులను అరికట్టండి
తాండూరు టౌన్: నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో దళితులపై జరుగుతున్న దాడులకు అడ్డకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా, దళిత సంఘాల ఆధ్వర్యంలో సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. యాలా ల మండలం రాస్నం గ్రామంలోని దళితుల శ్మశాన వాటిక స్థలాన్ని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కబ్జా చేసి, సీసీ రోడ్డును తవ్వేశారన్నారు. ఈ విషయం గురించి అడిగేందుకు వెళ్లిన దళితులను కులం పేరుతో దూషించారన్నారు. హాజీపూర్కు చెందిన రవికుమార్ భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తుండగా కొందరు వ్యక్తులు దాడి చేశారన్నారు. అలాగే తాండూరు మండలం చెన్గేష్పూర్ గ్రామానికి చెందిన ఎరుకలి కులస్తులైన బస్వరాజ్ దంపతులపై పలువురు దాడి చేసి భభయబ్రాంతులకు గురి చేశారన్నారు. ఇలా నియోజకవర్గ పరిధిలో అగ్ర కులస్తులు.. దళితులపై అకారణంగా దాడులు చేస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్కు వినతిపత్రం అందజేశామన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్, సీఐటీయూ, పలు ప్రజా, దళిత సంఘాల నాయకులు మల్కయ్య, కె.శ్రీనివాస్, బాధితులు ఆశప్ప, అంజిలప్ప, భాస్కర్, లక్ష్మప్ప, వీరప్ప, అంజిలయ్య, రవి, బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా, దళిత సంఘాల నేతల డిమాండ్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన -
నషా ముక్త్ భారత్ అభియాన్ను విజయవంతం చేద్దాం
మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా జిల్లాలో ఈ నెల 20నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రతీక్జైన్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనన్నట్లు తెలిపారు. దీనిపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. అధికారులు సమన్వ యంతో పని చేసి వికారాబాద్ను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. డ్రగ్స్ మూలాలను గుర్తించి, వాటి రవాణా, విక్రయాలు, వినియోగం జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లలు పెడదోవ పట్టకుండా కాపాడాలన్నారు. విద్యా సంస్థల్లో మాదకద్రవ్యాల నిరోధక కమిటీలను బలోపేతం చేసి అవి క్రియాశీలకంగా పని చేసేలా చూడాలన్నారు. ఈ నెల 25న పాఠ శాలలు, కళాశాలల్లో మాదకద్రవ్యాల నియంత్రణపై విద్యార్థులకు పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. మత్తు పదార్థాల విక్రయాలు జరుగుతున్నట్లు తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1908కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనంతరం ఎస్పీ నారాయణరెడ్డి మాట్లాడారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి, డీఎంహెచ్ఓ వెంకటరవణ, జిల్లా సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, డీఎస్పీ జానయ్య, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
గొలుసుకట్టు కాలువలను పునరుద్ధరిస్తాం
● ఇరిగేషన్ డీఈ చెన్నకేశవరెడ్డి తుర్కయంజాల్: గొలుసుకట్టు కాలువలను పునరుద్ధరించి ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీరు సులువుగా ప్రవహించేలా చర్యలు చేపట్టనున్నట్టు ఇరిగేషన్ డీఈ చెన్నకేశవ రెడ్డి తెలిపారు. భారీ వర్షాలు కురిస్తే చెరువులు అలుగు పారే అవకాశాలు ఉండడంతో తుర్కయంజాల్లోని మాసబ్ చెరువు, ఇంజాపూర్లోని దిలావర్ ఖాన్ చెరువు, ఈదుల చెరువుల కాలువలను ఏఈ వంశీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ.. కాలువులు పూడిక తీయకంపోవడంతో పలు చోట్ల ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. వరద వచ్చినా సులువుగా ప్రవహించి, కాలనీలు ముంపునకు గురవకుండా చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలి
● బనకచర్ల ప్రాజెక్టుతో రాష్ట్రానికి నష్టం జరగనీయం ● మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ షాద్నగర్: సంచనలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. కమ్మదనం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను హరిస్తూ గత పాలకులు స్వార్థరాజకీయాలకు పాల్పడి, ప్రజా జీవితాలకు భంగం కలిగే విధంగా వ్యవహరించారని విమర్శించారు. భార్యాభర్తలు మాట్లాడుకున్న మాటలు కూడా వినడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన సూత్రధారులు, పాత్రదారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బనకచర్ల ప్రాజెక్టు గురించి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కేంద్రంతో మాట్లాడారని, తెలంగాణకు ఏవిధంగా నష్టం జరుగుతుందో స్పష్టంగా వివరించారని తెలిపారు. ఈ విషయంలో కేంద్రానికి స్పష్టత ఉందన్నారు. ఏ ప్రాజెక్టు విషయంలోనైనా తెలంగాణకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం పార్టీ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె బాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి, శ్రీవర్ధన్రెడ్డి, నాయకులు మహేందర్రెడ్డి, అశోక్గౌడ్, మోహన్సింగ్, విజయ్ భాస్కర్, ఇస్నాతి శ్రీనివాస్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
దరఖాస్తు చేసుకోండి
డీఈఓ రేణుకాదేవి అనంతగిరి: జిల్లాలోని 9 మండలాల్లో ఉన్న భవిత సెంటర్లలో ప్రత్యేక అవసరాల గల విద్యార్థులకు ఫిజియోథెరపీ చేసేందుకు అర్హులైన ఫిజియోథెపిస్టులు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ రేణుకాదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాండూరు, బషీరాబాద్, మర్పల్లి, బొంరాస్పేట, ధారూరు, చౌడాపూర్, కోట్పల్లి, బంట్వారం, కుల్కచర్ల మండలాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అర్హులైన బీపీటీతో పాటు పామా మెడికల్ అసోసియేషన్లో రిజిస్ట్రేషన్ కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు పేర్కొన్నారు. పై అర్హతలు ఉన్న జిల్లాకు చెందిన స్థానిక అభ్యర్థులు తమ కార్యాలయంలో ఈ నెల 28వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
అన్నదాత ఆందోళన
దౌల్తాబాద్: పచ్చటి పైర్లతో కళకళలాడాల్సిన పొలాలు వరుణుడి కరుణ లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. ఆకాశం మేఘావృతమవుతున్నా వానజాడ కనిపించడం లేదు. దీంతో రైతులు దిగులు చెందుతున్నారు. మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. పొలాలను దున్ని విత్తు వేశారు. విత్తనాలు మొలకెత్తకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కొన్ని విత్తనాలు మొలకెత్తినా వర్షాలు లేక ఎండుముఖం పట్టాయి. వేల రూపాయలు వెచ్చించి పత్తి, జొన్న, కంది, పెసర తదితర రకాల విత్తనాలు వేస్తే భూమిపాలయ్యాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎకరాకు దాదాపు రూ.8 వేల నుంచి రూ.10వేల వరకు ఖర్చు చేశామని రైతులు తెలిపారు. మండల వ్యాప్తంగా దాదాపు 8 వేల ఎకరాల్లో వివిధ పంటలను సాగుచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో విత్తనాలు ఉంటాయో ఎండుతాయా అనే ఆందోళనలో రైతన్న ఉన్నాడు. -
బయోమెట్రిక్ అమలుకు చర్యలు
● అధికారులు సమయపాలన పాటించాలి ● ప్రజావాణి దరఖాస్తులనుసత్వరం పరిష్కరించాలి ● కలెక్టర్ ప్రతీక్ జైన్అనంతగిరి: జిల్లా కేంద్రంతోపాటు, మండల కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ విధానం అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు సమస్యల పరిష్కారం కోసం 146 దరఖాస్తులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు విధిగా సమయపాలన పాటించాలన్నారు. ఇందుకోసం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ యంత్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులను పూర్తి స్థాయిలో సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, రెవెన్యూ సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఆర్డీఓ వాసుచంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో వన్ మెడీ హబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరాన్ని ప్రారంభించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కొలెస్ట్రాల్, కిడ్నీ, లివర్, కాల్షియం, క్రియాటిన్ తదితర పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. మనుషుల జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వాతావరణ మార్పుల వల్ల అనారోగ్యాలకు గురవుతున్నామన్నారు. నేడు కలెక్టరేట్కు వచ్చే ప్రజలకు, ఉద్యో గులకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలో క్షయ వ్యాధి నిర్మూలించే దిశగా ప్రాథమిక, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, ఎం.సుధీర్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి , డీఎంహెచ్ఓ వెంకటరవణ, వన్ మెడీ హబ్ ఫౌండర్ సంతోష్, డాక్టర్ శ్రీకాంత్, ల్యాబ్ టెక్నీషియన్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్తోనే సొంతింటి కల సాకారం
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి బొంరాస్పేట: పేదల సొంతింటి కల కాంగ్రెస్తోనే సాకారమవుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేరి రాజేశ్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని బాపన్చెరువుతండా పంచాయతీ పరిధిలోని బీక్యానాయక్ తండాలో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం ఇంటి నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రాజేశ్రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజాపాలన కొనసాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నర్సింలుగౌడ్, పార్టీ మండల ఉపాధ్యక్షుడు దాసరి చంద్రప్ప, పీఏసీఎస్ చైర్మన్ జయకృష్ణ, అంజిల్రెడ్డి, రాంచంద్రారెడ్డి, గుండప్ప, మాజీ సర్పంచ్ లక్ష్మణ్, గోపాల్, చిన్న నర్సింలు, సాయిలు, వెంకటేశ్ తదితరులు ఉన్నారు. వ్యసనాలకు దూరంగా ఉండాలి ఎస్ఐ అబ్దుల్ రవూఫ్ బొంరాస్పేట: యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ అబ్దుల్ రవూఫ్ సూచించారు. సోమవారం మండల పరిధిలోని బొట్లోనిగూడ తండా గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. ప్రకృతి కాపాడాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సిట్ విచారణకు హాజరు తాండూరు: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పలువురు స్థానిక వ్యక్తులు సిట్ విచారణకు హాజరవుతున్నారు. సోమవారం నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన విచారణకు ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు నర్సిరెడ్డి హాజరయ్యారు. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ నేత డాక్టర్ సంపత్కుమార్ స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డ్ చేసిన విషయం తెలిసిందే. 2023 నవంబర్ 15నుంచి 30 వరకు ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు పోలీసులు చెప్పారన్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న నర్సిరెడ్డి ఫోన్ను ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిందనే అంశంపై సిట్ అధికారులు వివరాలు సేకరించినట్లు సమాచారం. రీల్స్ కోసం బైక్పై ప్రమాదకర స్టంట్ రాజేంద్రనగర్: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఎనిమిది మంది యువకులు ఓ ఎలక్ట్రి క్ ద్విచక్ర వాహనంపై అర్ధరాత్రి రీల్స్ కోసం స్టంట్ చేశారు. జాతీయ రహదారిపై ఈ స్టంట్ కొనసాగుతుండటంతో ఈ మర్గంలో వెళ్తున్న వారు తమ సెల్ఫోన్లో బంధించి ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు వెళ్లే దారిలో ఇలాంటి స్టంట్ అర్ధరాత్రి వేళ జరుగుతుండటంతో పలువురు తమ ఎక్స్ వేదికల ద్వారా దీనిని సైబరాబాద్ పోలీసుల దృష్టి కి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు నిందితులను పట్టుకొని ఆర్జీఐ పోలీసు లకు అప్పగించారు. పట్టుబడిన వారిలో ముగ్గురు మైనర్లు ఉండటం గమనార్హం. రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తెలిపిన ప్రకారం... ఈ నెల 21న అర్థరాత్రి 1.30 గంటల సమయంలో శంషాబాద్ ప్రాంతానికి చెందిన ఎని మిది మంది యువకులు బైక్పై శంషాబాద్ నుంచి ఆరాంఘర్ వైపు పయనమయ్యారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు మైనర్లతో పాటు ఐదుగురు యువకులు పయనిస్తూ రీల్స్ చేశా రు. ప్రమాదభరితంగా ఈ జాతీయ రహదారిపై స్టంట్ నిర్వహించారు. ఈ దృశ్యాలను అటుగా వెళుతున్న పలువురు చిత్రీకరించి ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు వెళ్లే ఈ రహదారి రాత్రి సమయాల్లో బిజీగా ఉంటుంది. అర్ధరాత్రి సమయంలో వీఐపీల రాకపోకలతో అలర్ట్గా ఉంటుంది. ఈ స్టంట్ విషయమై పలువురు సైబరాబాద్ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితులను సోమవారం గుర్తించారు. బైక్తో పాటు ఐదుగురు యువకులను, ముగ్గురు మైనర్లను రాజేంద్రనగర్ పోలీసులకు సోమవా రం సాయంత్రం అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గ్రామ పంచాయతీగా వాల్యానాయక్ తండా
దుద్యాల్: సోమ్లానాయక్ తండా స్థానంలో వాల్యానాయక్ తండాను గ్రామ పంచాయతీగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమ్లానాయక్ తండాలో జనాభా తక్కువగా ఉండడంతో వాల్యానాయక్ తండాకు అనుబంధంగా సోమ్లానాయక్ తండా, రక్తమైసమ్మ తండా, కస్న నాయక్ తండా, జీడిగడ్డ తండాలను అనుబంధ గ్రామాలుగా కలిపారు. ఈ మేరకు వాల్యానాయక్ తండా వాసులు ఎంపీడీఓ మహేశ్కుమార్, ఎంపీఓ సత్యనారాయణను ఘనంగా సన్మానించారు. అనతరం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తండా వాసులు రవీందర్ నాయక్, హన్మంత్ నాయక్, వెంకట్ నాయక్, శ్రీనివాస్ నాయక్, అంబర్ సింగ్, శంకర్ నాయక్, మోహన్ నాయక్ పాలొన్నారు. -
వ్యవసాయ శాఖ ఏడీఏ రుద్రమూర్తి
ఫార్మర్ రిజిసీ్ట్ర తప్పనిసరి తాండూరు రూరల్: ౖరెతులు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పక చేసుకోవాలని తాండూరు డివిజన్ వ్యవసాయ శాఖ ఏడీఏ రుద్రమూర్తి అన్నారు. సోమవారం ఆయన వ్యవసాయ శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రుద్రమూర్తి మాట్లాడుతూ.. రైతులు పట్టాదారు పాస్పుస్తకం, ఆధార్ కార్డు, ఆధార్తో లింకు ఉన్న మొబైల్తో సంబంధిత ఏఈఓల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఫార్మర్ రిజసీ్ట్ర ఉంటేనే భవిష్యత్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సబ్సిడీ పథకాలు వర్తిస్తాయని చెప్పారు. అపోహలకు తావులేకుండా రైతులంతా ఫార్మర్ రిజిసీ్ట్ర చేసుకోవాలని సూచించారు. డివిజన్ పరిధిలోని రైతుల వివరాలు మండలం రైతులు తాండూరు 14,804 పెద్దేముల్ 15,161 యాలాల 14,798 బషీరాబాద్ 14,512 -
ఓఆర్ఆర్ పరిధిలోనూ భరోసా ఇవ్వాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ఓఆర్ఆర్ను ఆనుకుని ఉన్న మండలాలకు రైతు భరోసా విడుదల చేయాలని ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ కృపేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వారు బీఆర్ఎస్ ఎల్మినేడు గ్రామ అధ్యక్షుడు దొమకొండ నర్సింహ అధ్యక్షతన మహాధర్నా చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కృపేష్, బుగ్గరాములు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రెండు దఫాలుగా రైతు భరోసా ఇవ్వకపోవడం సిగ్గు చేటు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం మండలాల రైతులు ఓట్లు వేయలేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో వివక్ష చూపకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తోందన్నారు. రైతులపై వివక్ష చూపడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు భరోసా విడుదల చేయకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల మాజీ అధ్యక్షుడు మొద్దు అంజిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మహేందర్రెడ్డి, బుట్టి మహేశ్, నిట్టు జగదీశ్వర్, బాష, యాదయ్య, రాజు, విష్ణువర్ధన్రెడ్డి, రాంరెడ్డి, పలువరు రైతులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ కృపేశ్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎల్మినేడులో ధర్నా -
మోదీ పాలనలో దేశం పురోగతి
చేవెళ్ల: దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రధాని మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్.రత్నం అన్నారు. స్థానిక కేవీఆర్ గ్రౌండ్లో సోమవారం చేవెళ్ల మున్సిపాలిటీ బూత్స్థాయిలో తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి నివాళులర్పించారు. మోదీ సారథ్యంలో దేశం ఎంతో పురోగతి సాధించిందన్నారు. తల్లికి వందనంతో దేశంలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతీ బూత్లో కనీసం 50 మొక్కలు నాటాలని, నియోజకవర్గంలో 25వేల మొక్కలు నాటాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్వానం పాలన సాగిస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు అత్తెల్లి అనంత్రెడ్డి, యువ నాయకుడు డాక్టర్ మల్గారి వైభవ్రెడ్డి, రాష్ట్ర నాయకులు విఠల్రెడ్డి, జిల్లా నాయకులు వెంకట్రెడ్డి, వెంకట్రాంరెడ్డి, కుంచం శ్రీనివాస్, నాయకులు మధుసుధన్రెడ్డి, ప్రవీణ్రెడ్డి, మధుసుధన్రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్.రత్నం -
నీటి గుంతలో పడి మహిళ మృతి
మొయినాబాద్: బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఓ మహిళ దుస్తులు ఉతకడానికి వెళ్లి నీటి గుంతలో పడి మృతి చెందింది. ఈ సంఘటన మొయినాబాద్లో సోమవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం రిబ్బన్పల్లికి చెందిన మంజుల(31) కుటుంబం కొన్నేళ్ల క్రితం మొయినాబాద్కు వలస వచ్చింది. కొంత కాలం క్రితం ఆమె భర్త రవికుమార్ మృతి చెందాడు. ముగ్గురు పిల్లలతో కలిసి సురంగల్ రోడ్డు పక్కన ఓ గుడిసె వెసుకుని నివాసముంటూ కూలీ పనిచేస్తూ పిల్లలను పోషిస్తోంది. ఇదిలా ఉండగా ఆదివారం మొయినాబాద్ సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు పక్కన ఉన్న ఓ నీటి గుంతలో దుస్తులు ఉతికేందుకు వెళ్లింది. ఈక్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి అందులో పడిపోయింది. సోమవారం అటుగా వెళ్లిన ఓ వ్యక్తి గుంతలో తేలిన శవాన్ని గమనించి, మున్సిపల్ వార్డు అధికారి సుదర్శన్కు సమాచారం అందించాడు. సుదర్శన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. గతంలో తండ్రి, ఇప్పుడు తల్లి మరణించడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. -
దుండగులపై చర్యలు తీసుకోవాలి
పరిగి: కుల్కచర్ల మండలం పుట్టపహాడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి వెంకటయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పట్టణ కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని ధ్వంసం చేయడం అంటే దేశ ద్రోహుల కిందే లెక్కగట్టాలన్నారు. పేదలు, దేశాభ్యున్నతికి పాటుపడిన మహనీయుడికి అవమానం జరగడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించి దుండగులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చంద్రయ్య, వెంకటయ్య, ప్రశాంత్, రాము, ప్రభు, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. అఖిలపక్ష నాయకుల ఆందోళన కుల్కచర్ల: మండల పరిధిలోని పుట్టపహాడ్లో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీల నేతలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా బీజేపీ మండల నాయకులు పుట్టపహాడ్ నుంచి కుల్కచర్ల వరకు నిరసన పాదయాత్ర చేపట్టారు. పలువురు నాయకులు మాట్లాడుతూ.. మహనీయుడి విగ్రహంపై దాడి హేయనీయం అన్నారు. వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మొగులయ్య, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రహ్లాదరావు, డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, మాజీ ఎంపీపీ సత్యమ్మ, బ్లాక్ బి అధ్యక్షుడు భరత్కుమార్, ఏఐసీసీ నాయకులు రాములు, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కఠినంగా శిక్షించాలి అనంతగిరి: కుల్కచర్ల మండలం పుట్టపహాడ్లో అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ ప్రతీక్జైన్, ఎస్పీ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. విగ్రహ ధ్వంసం చేసిన సంఘం విద్రోహ శక్తులను ప్రోత్సహించే వ్యక్తులను, వ్యవస్థను రూపుమాపాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠింనంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు రాములు, మొగులయ్య, శ్రీనివాస్, వినోద్కుమార్, భరత్కుమార్, శ్రీనివా స్, వెంకట్, బుగ్గన, బుచ్చన్న, నరేందర్, రాము లు, వెంకట్రాములు, కృష్ణ తదితరులు ఉన్నారు. అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం చేయడం సిగ్గుచేటు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటయ్య -
కేజీబీవీల్లో కొత్త రుచులు
కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో (కేజీబీవీ) బాలికలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం కొత్త మెనూ తీసుకువచ్చింది. నెలలో రెండుసార్లు మటన్, ఐదుసార్లు గుడ్లు, ప్రతీ రోజు నెయ్యి ఉండేలా మెనూ ప్రకటించారు. దౌల్తాబాద్: నాణ్యమైన విద్య, మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా కేజీవీలు నిర్వహిస్తోంది. వీటి నిర్వహణ బాధ్యతలు రాష్ట్రప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కేజీబీవీల బలోపేతానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. బాలిక ఆరోగ్యంపై సర్వే చేపట్టగా పౌష్టికాహారలోపంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కుంటున్నట్లు తేలింది. దీంతో ప్రభుత్వం బాలికలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు కేజీబీవీల్లో మెస్ చార్జీలు పెంచి ఆహార మెనూలో మార్పులు చేసింది. దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులకు కొత్త మెనూ ప్రకారం ఆహారం అందజేస్తున్నారు. మెనూ ఇలా.. ఉదయం: టమాట కిచిడీ, సాంబార్, రాగిజావ, బూస్టు, పూరి, ఉప్మా, పులిహోరా, బోండా, వడ, చపాతీ, జీరారైస్, అరటిపండు మధ్యాహ్నం: టమాట పప్పుతో అన్నం, నేయి, రసం, పెరుగు, ఉడకించిన గుడ్డు, చికెన్ సాయంత్రం: ఉడికించిన శనగలు, బజ్జీలు, అల్లం టీ, మిల్లెట్ బిస్కెట్, పకోడి రాత్రి: అన్నం వివిధ రకాల కాయగూరలు, సాంబారు, మజ్జిగ వీటితో పాటు నెలలో రెండుసార్లు మటన్, ఐదుసార్గుల గుడ్లు, ప్రతీరోజు నెయ్యి ఇవ్వాల్సి ఉంటుంది. బాలికల పౌష్టికాహారం కోసం నూతన మెనూ నెలలో రెండు సార్లు మటన్, ఐదుసార్లు గుడ్లు మెస్చార్జీలు పెంచిన ప్రభుత్వంకొత్త మెనూ ప్రకారమే.. విద్యా సంవత్సరం ప్రారంభం నాటి నుంచే మెనూను కేజీబీవీల్లో అమలు చేస్తున్నాం. ఇప్పటికే కొత్త మెనూ పక్కాగా అమలు చేయాలని ఎస్ఓలకు ఆదేశాలు జారీ చేశాం. కొత్త మెనూను ప్రదర్శనకు ఉంచాలని సూచించాం. – శ్రీదేవి, జీసీడీఓ, వికారాబాద్ -
పొలాల వద్ద ఇసుక డంపులు
దోమ: ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని ఎస్ఐ ఆనంద్కుమార్ అన్నారు. సోమవా రం మండల కేంద్రంలోని అనుబంధ గ్రామమైన ఉదన్రావుపల్లికి చెందిన తొమ్మిది మంది రైతులు అక్రమంగా పాలేపల్లి–ఉదన్రావుపల్లి వాగు నుంచి ట్రాక్టర్ల సాయంతో ఇసుక తీసుకువచ్చి పొలాల వద్ద డంపులుగా నిల్వ చేసుకున్నారనే సమాచారం అందిందన్నారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టి వాటిని సీజ్ చేశామన్నారు. మంగళవారం తహసీల్దార్ గోవిందమ్మ ఎదుట బైండోవర్ చేసి జరిమానా విధిస్తామన్నారు. ఇసుక అవసరమున్న వారు తహసీల్దార్ వద్ద అనుమతులు తీసుకొని ట్రాక్టర్ల సహాయంతో తరలించుకోవాలని సూచించారు. ఈ దాడుల్లో ఆర్ఐ సుదర్శన్, హెడ్ కానిస్టేబుల్ నర్సింలు పాల్గొన్నారు. సీజ్ చేసిన అధికారులు -
రైతులకు మేలు చేసేందుకు చర్యలు
నవాబుపేట: పేదలకు, రైతులకు మేలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో జాతీయ ఆహార భద్రతా మిషన్ పథకం కింద రైతులకు ఉచితంగా కంది విత్తనాల మినీకిట్స్ (చిరు సంచులు) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కంది సాగును ప్రోత్సహించేదుకు ఉచితంగా కంది విత్తనాలు సరఫరా చేస్తుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, తహసీల్దార్ బుచ్చయ్య, మండల వ్యవసాయ అధికారి జ్యోతి, ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్ నాయక్, టీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, ఏఈఓలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య -
రూ.7 కోట్ల విలువైన భూమికి ఎసరు!
షాద్నగర్ రూరల్: ధరణి లొసుగులు.. మీసేవ నిర్వాహకుల సహకారంతో తండ్రీకొడుకులు రూ.7 కోట్ల విలువైన నాలుగు ఎకరాల భూమికి ఎసరుపెట్టారు. ప్రభుత్వం ఇటీవల చిల్కమర్రిలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. బాధితులు రెవెన్యూ అధికారులను ఆశ్రయించడంతో తహసీల్దార్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీసేవ నిర్వాహకులతో కుమ్మకై ్క.. గ్రామానికి చెందిన కొత్తపల్లి వినోద, శ్రీనివాస్రెడ్డి దంపతులు. కొంత కాలం క్రితం శ్రీనివాస్రెడ్డి చనిపోవడంతో ఆయన పేరిట ఉన్న 2.8 ఎకరాల భూమి 2022లో వినోద పేరిట విరాసత్ జరిగింది. ఈ భూమిపై కన్నేసిన వినోద మామ సుభాన్రెడ్డి, బావ మధుసూదన్ రెడ్డి పట్టణంలోని ఓ మీసేవ నిర్వాహకులతో కుమ్మక్కయ్యారు. వినోదకు తెలియకుండా ఆమె ఫోన్కు వచ్చిన ఓటీపీని సంపాదించి దొంగ జీపీఏ డాక్యుమెంట్ సృష్టించారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో భూ వివరాలు తెలుసుకునేందుకు రెవెన్యూ అధికారులను ఆశ్రయింగా జీపీఏ ద్వారా ఇతరులకు మారిందని చెప్పారు. సదస్సులు ముగిసిన తర్వాత వినోద తహసీల్దార్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఇదే గ్రామంలో మరొకరి భూమిని ఇదే గ్రామానికి చెందిన కొత్తపల్లినర్సింహారెడ్డి, నవనీత దంపతులకు మనస్పర్థలు రావడంతో వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. నర్సింహారెడ్డి పేరిట 1.29 ఎకరాల భూమిని కాజేసేందుకు సుభాన్రెడ్డి, మధుసూదన్రెడ్డి ఆమె భార్య నవనీతను రంగంలోకి దింపారు. భర్త ఫోన్ నవనీత దగ్గరే ఉండడంతో ఓటీపీ తీసుకుని జీపీఏ డాక్యుమెంట్ సృష్టించారు. సదరు భూమిని దేవిరెడ్డి శ్రీకాంత్రెడ్డికి సేల్డీడ్ చేశారు. తహసీల్దార్ విచారణలో ఈ తతంగమంతా బయటపడింది. ఇద్దరు పట్టాదారులకు సంబంధించి రూ.7కోట్ల విలువైన దాదాపు నాలుగు ఎకరాల భూమిని కాజేసినట్లు తేలింది. పోలీస్స్టేషన్లో తహసీల్దార్ ఫిర్యాదు పట్టాదారులకు తెలియకుండా భూములు చేతులు మారడంతో తహసీల్దారు పార్థసారధి సదరు భూముల రిజిస్ట్రేషన్పై విచారించారు. స్లాట్ బుకింగ్, డాక్యుమెంట్ తయారీ ఎక్కడ జరిగిందనే విషయాలను పరిశీలించారు. మీసేవ సెంటర్లో ఓటీపీలతో డాక్యుమెంట్ తయారు చేసినట్లు గుర్తించారు. సదరు మీసేవ నిర్వాహకులతో పాటుగా దొంగ జీపీఏ, రిజిస్ట్రేషన్ చేసిన వారిపై ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చిల్కమర్రి రెవెన్యూ సదస్సులో వెలుగులోకి.. అధికారులను ఆశ్రయించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసిన తహసీల్దార్ -
నిధులు లేక కటకట
● పంచాయతీ నిర్వహణకుఅప్పులభారం ● ట్రాక్టర్ డీజిల్కు సైతం ఇబ్బంది ● సొంత నిధులు వెచ్చించలేమని కార్యదర్శుల ఆవేదన ● గ్రామాల్లో అటకెక్కిన పరిపాలన పరిగి: గ్రామాల్లో ప్రత్యేక పాలన వెక్కిరిస్తోంది. నిధులు లేకపోవడంతో పనులు సాగడం లేదు. దీంతో పాలన కార్యదర్శులకు రోజురోజుకూ భారంగా మారుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు నెలల తరబడి విడుదల కాకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు అప్పుల పాలవుతున్నారు. చిన్న పంచాయతీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇటీవల పరిగి, దోమ మండలాల్లోని అన్ని గ్రామాల కార్యదర్శులు సమస్యల పరిష్కారానికి డబ్బులు లేవని ఎంపీఓ, ఎంపీడీఓలకు వినతిపత్రం అందజేసి పంచాయతీ ట్రాక్టర్ల తాళాలను అందజేశారు. అదే బాటలో మిగతా కార్యదర్శులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న జీపీలు కుదేలు జిల్లాలో 20 మండలాలు ఉండగా 566 గ్రామ పంచాయతీలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల కాక పోవడంతో విద్యుత్ బిల్లులు, కార్మికుల వేతనాలు, వీధి దీపాల బిల్లులు, ట్రాక్టర్ నిర్వహణ, బోరు మోటార్ల మరమ్మతులు తదితర వాటికి కాసులు లేక అరిగోసలు పడుతున్నారు. పెద్ద పంచాయతీలకు వస్తున్న కొద్దిపాటి ఆదాయంతో అభివృద్ధి పనులు ఓ మోస్తరుగా సాగుతున్నాయి. కానీ చిన్న పంచాయతీల్లో మాత్రం ఎలాంటి పనులు జరగడం లేదు. రోజు రోజుకూ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి దీనంగా మారుతుందని, అప్పుల కుప్పలుగా మారుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. తాము గ్రామాల్లో సొంత ఖర్చులతో పనులు చేయలేమని కార్యదర్శులు ఉన్నతాధికారులకు తేల్చి చెప్పారు. కొరవడిన ప్రభుత్వ సహకారం కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు విడుదల కావడం లేదు. గత 20 నెలలుగా గ్రామాలకు ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు. ఇక రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులైతే 2022 నుంచి నిలుపుదల చేశారు. స్థానిక సంస్థల్లో పాలకవర్గం లేకపోవడంతో గ్రామ పంచాయతీలకు కేంద్రం నిధులు విడుదల చేయడం లేదు. కొంత కాలంగా పల్లెల్లో సమస్యలను పంచాయతీ కార్యదర్శులే నిర్వహిస్తున్నారు. ఇలా చాలా మంది కార్యదర్శులు అప్పులు చేసి పనులు చేపట్టారు. అయినా ప్రభుత్వం నుంచి సహకారం రాకపోవడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేశాం గ్రామంలో నిత్యం ఎక్కడో ఒక చోట సమస్యలుంటాయి. తొలుత ప్రత్యేక పాలనలో ఇబ్బందులు రాకున్నా దినదినం భారంగా మారుతుంది. వచ్చే జీతం డబ్బులు కూడా గ్రామ సమస్యల కోసం ఖర్చు చేస్తున్నాం. అవి సరిపోకపోవడంతో అప్పులు చేశాం. ఊరిలో సమస్యలు పరిష్కరించాలంటే ఇక సొంత డబ్బులు ఖర్చు చేయలేము. – వేమారెడ్డి, పంచాయతీ కార్యదర్శి, రాఘవపూర్ -
మున్సిపల్ నిధులు పక్కదారి!
తాండూరు: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు తాండూరు మున్సిపల్ అధికారులు చేపట్టిన చర్యల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కౌన్సిల్ సమావేశంలో ఆమోదం పొందని పనులకు అడ్డగోలుగా నిధులు వెచ్చించారని జోరుగా ప్రచారం జరుగుతోంది. పారిశుద్ధ్య కార్మికుల పేరిట, పాత స్టాక్ బ్లీచింగ్ పౌడర్ నిల్వలను చూపించి ఏకంగా రూ.15 లక్షలకు పైగా అవినీతికి పాల్పడినట్లు స్థానికంగా చర్చనీయాంశమైంది. ఒక్కో చీర రూ.1,800 తాండూరు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 36 వార్డులున్నాయి. దాదాపు 15 వేల గృహాలున్నాయి. అందుకు తగ్గట్లుగానే సుమారు 260 మంది వరకు పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేకంగా పారిశుద్ధ్య పనులు చేయిస్తారు. అందుకుగాను సిబ్బందికి శానిటరీ కిట్స్తో పాటు దుస్తులు పంపిణీ చేస్తారు. ఇటీవల మున్సిపల్ కమిషనర్తో పాటు సిబ్బంది ఆయా సామగ్రిని తీసుకొచ్చారు. ప్రత్యేకాధికారి సుధీర్ అనుమతితో హాకా సంస్థకు నామినేషన్ పద్ధతిన ఈ కాంట్రాక్ట్ మొదట అప్పగించారు. అది కాదని స్థానిక కాంట్రాక్టర్ ద్వారానే సామగ్రిని కొనుగోలు చేయించారు. ఇందులో నాసిరకం దుస్తులకే అధిక ధరలు చెల్లించినట్లు బిల్లులు సృష్టించారు. పారిశుద్ధ్య పనులు చేసే మహిళలకు ఇచ్చే ఒక్కో చీర రూ.500 వరకు ఉంటే ఏకంగా రూ.1,800 వెచ్చించినట్లు చూపారు. ఒక టవల్ ఖరీదు రూ.100 వరకు ఉంటే దాన్ని రూ.600లకు కొన్నట్లు బిల్లులు రూపొందించడం గమనార్హం. పాత స్టాక్ చూపి నిధులు స్వాహా బ్లీచింగ్ పౌడర్ నిధులను మున్సిపల్ అధికారులు పక్కదారి పట్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్లో బ్లీచింగ్ పౌడర్ 10 టన్నుల వరకు వినియోగం ఉంటుందంటూ రికార్డులు సిద్ధం చేశారు. అయితే క్వింటాలుకు సుమారు రూ.1,700ల వరకు పలుకుతోంది. అయితే పాత మున్సిపల్ కార్యాలయంలో బ్లీచింగ్ పౌడర్ పాత స్టాక్ నిల్వలున్నాయి. వాటినే చూయించి మున్సిపల్ అధికారులు నిధులను దారి మళ్లించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతరు ఈ ఏడాది జనవరి నెలలో మున్సిపల్ కౌన్సిల్ సభ్యులతో జరిగిన చివరి సమావేశంలో ఎజెండాలో శానిటేషన్ పనుల కోసం రూ.40 లక్షల నిధుల ఆమోదం కోసం తీసుకెళ్లారు. అయితే పలువురు కౌన్సిలర్లు బ్లీచింగ్ పౌడర్ పేరిట నిధులు దుర్వినియోగం చేస్తున్నారంటూ అప్పట్లోనే అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అంశాన్ని పక్కన పెట్టాలని కమిషనర్కు సూచించారు. ఆరు నెలల తర్వాత మున్సిపల్ అధికారులు రూ.40 లక్షలతో పాటు అదనంగా మరో రూ.10 లక్షలు పెంచి పారిశుద్ధ్య సామగ్రిని కొనుగోలు చేయడం విమర్శలకు తావిస్తోంది. రూ.10 లక్షల సామగ్రి కొనుగోలుకి రూ.50 లక్షల బిల్లు పాత బ్లీచింగ్ స్టాక్ చూయించి కాసులు నొక్కేసిన వైనం అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వివరాలు తెలుసుకుంటాను మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కోసం కొనుగోలు చేసిన సామ గ్రికి నిధులు ఎన్ని వెచ్చించారనే అంశం నా దృష్టికి రాలేదు. శానిటరీ ఇన్స్పెక్టర్ను అడిగి వివరాలు తెలుసుకుంటాను. ప్రత్యేకాధికారి ఆదేశాల మేరకే సామగ్రి కొనుగోళ్లు జరిగాయి. – విక్రమ్సింహారెడ్డి, కమిషనర్, తాండూరు -
అంబేడ్కర్ విగ్రహం ధ్వంసానికి యత్నం
కుల్కచర్ల: మండల పరిధిలోని పుట్టపహాడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న వివిధ పార్టీల నేతలు, అంబేడ్కర్ సంఘాల నాయకులు గ్రామానికి చేరుకుని ప్రధాన చౌరస్తాలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంబేడ్కర్ విగ్రహంపై దాడికి యత్నించడం సిగ్గుమాలిన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుడు రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రమేశ్ తెలిపారు. ఆందోళనలో డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, కుల్కచర్ల ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు, బ్లాక్ బి అధ్యక్షుడు భరత్కుమార్, పలువురు నాయకులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. పరిగి–మహబూబ్నగర్ ప్రధాన రహదారిపై ఆందోళన -
నిబంధనలకు తూట్లు
తాండూరు టౌన్: పట్టణం మీదుగా వెళ్తున్న నేషనల్ హైవే 167(ఎన్) డ్రైన్ నిర్మాణ పనులు ఇష్టానుసారంగా కొనసాగుతున్నాయి. అడిగేవారు లేరని సదరు ఆర్అండ్బీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారు. దీనిపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక బస్టాండు నుంచి చించోళి మార్గంలో నేషనల్ హైవే రోడ్డుకు ఇరువైపులా ఆర్అండ్బీ అధికారులు డ్రైన్ నిర్మాణ పనులు చేస్తున్నారు. అయితే రోడ్డుపై అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను, ట్రాన్స్ఫార్మర్లను తొలగించకుండానే పనులు ప్రారంభించారు. నిబంధనల ప్రకారం డ్రైన్కు లోపల ఉన్న విద్యుత్ సంబంఽధితమైనవి ఏవీ ఉన్నా వాటిని తొలగించిన తర్వాత నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే సదరు ఆర్అండ్బీ అధికారులు దీనికి భిన్నంగా ఎక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్లను అక్కడే ఉంచి ఇరుకుగా, వంకలు తిప్పుతూ పట్టణంలోని మల్లప్ప మడిగ వద్ద డ్రైన్ నిర్మిస్తున్నారు. దీంతో ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు తొలగించాలని విద్యుత్ అధికారులకు అర్జీ పెట్టుకుని, అందుకు అయ్యే ఖర్చును భరించాల్సి ఉంటుంది. కానీ అవేవి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి డ్రైన్ నిర్మాణ పనులు సక్రమంగా జరిగేలా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇష్టానుసారంగా హైవే డ్రైన్ నిర్మాణ పనులు -
మహాసభ సభ్యత్వం తీసుకోవాలి
మున్నూరు కాపు సంఘం తాలూకా నాయకులు కొడంగల్: రాష్ట్ర మహాసభలో కులస్తులందరూ సభ్యత్వం తీసుకోవాలని మున్నూరు కాపు సంఘం తాలూకా అధ్యక్షుడు బాకారం చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి బి.మల్లయ్య కోరారు. ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. హైదరాబాద్లోని కాచిగూడ కార్యాలయానికి మహాసభ అనుబంధంగా ఉంటుందన్నారు. నియోజకవర్గంలోని కొడంగల్, ఉడిమేశ్వరం, పర్సాపూర్, దుద్యాల, అలిఖాన్పల్లి, పాత కొడంగల్, కొండారెడ్డిపల్లి గ్రామ కమిటీ సభ్యులతో పాటు కొడంగల్, దుద్యాల, దౌల్తాబాద్ మండల కమిటీలు, యువజన కమిటీలు, మహిళా కమిటీ సభ్యులు రాష్ట్ర మహాసభ సభ్యత్వం తీసుకోవాలన్నారు. ఈనెల 26వ తేదీ వరకు సభ్యత్వం తీసుకోవడానికి నిర్ణయించినట్లు చెప్పారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు పెద్ది పెంటయ్య, ప్రధాన కార్యదర్శి జైపాల్రెడ్డి సూచన మేరకు సభ్యత్వాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కులస్తులందరూ రాష్ట్ర మహాసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం, ఓటు వేసే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు సిరుసని శ్యాంసుందర్, అరిగె ఓం ప్రకాశ్, కోశాధికారి కానుకుర్తి నర్సిరెడ్డి, ప్రచార కార్యదర్శి మున్నూరు బిచ్చప్ప తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు స్ఫూర్తి
కేశంపేట: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ప్ర యోగాల వైపు నడిపించి వారి ఆలోచనలకు పదు ను పెట్టి భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు ‘ఇ న్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసె ర్చ్’ (ఇన్స్పైర్) పేరుతో ఇన్స్పైర్ మనక్ పురస్కారాలను అందిస్తోంది. ఆన్లైన్ ద్వారా 2025–26 విద్యా సంవత్సరానికి నామినేషన్లు స్వీకరిస్తోంది. ఎవరు అర్హులంటే.. 10 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 6 నుంచి 10వ తరగతి చదివే ప్రతిభ కలిగిన విద్యార్థులకు అవకాశం. ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల, మోడల్ స్కూల్స్, కేజీబీవీ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు అర్హులు. వీరు పాఠశాలలోని సైన్స్ ఉపాధ్యాయుడి గైడ్లైన్స్ పాటిస్తూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే విధానం ● ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ● www.inspireawards-dst.gov.in వెబ్సైట్లోకి వెళ్లి న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. ● పాఠశాలకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకొని, సేవ్ చేసుకోవాలి. ఈ దరఖాస్తు జిల్లా అథారిటీకి వెళ్తుంది. ● వీరు ఆమోదిస్తే విద్యార్థికి సంబంధించి పొందుపర్చిన మెయిల్ ఐడీకి యూజర్ ఐడీతో కూడిన లింక్ వస్తుంది. ● అప్పుడు విద్యార్థులు యూజర్ ఐడీకి పాస్వర్డ్ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ● విద్యార్థి తన సమాచారంతో పాటు బ్యాంక్ అకౌంట్ నంబర్, ఆధార్ నంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది. ● విద్యార్థి ప్రదర్శించాలనుకున్న ప్రాజెక్టును సంక్షిప్తంగా వెబ్సైట్లో నమోదు చేయాలి. ● ఎంపికై న ప్రాజెక్టు ప్రయోగ నిమిత్తం విద్యార్థి బ్యాంక్ ఖాతాకు రూ.పదివేలు జమ చేస్తారు. ● రాష్ట్ర స్థాయికి ప్రాజెక్టు ఎంపికై తే రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు అందిస్తారు. ● ఆన్లైన్లో ఉచితంగా విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఎప్పటిలోగా అంటే.. విద్యార్థులు తమ పేర్లను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 15 వరకు కేంద్ర ప్రభుత్వం గడువు విధించింది. విద్యార్థులు తాము చదువుతున్న పాఠశాలల్లో సైన్స్ ఉపాధ్యాయులతో కలిసి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. రాష్ట్రపతి భవన్లో అతిథ్యం.. స్వయానా రాష్ట్రపతితో అభినందనలు.. కేంద్ర మంత్రులతో ప్రశంసలు.. దిగ్గజ శాస్త్రవేత్తలతో సమాలోచనలు.. ఇలాంటి అరుదైన అవకాశం వస్తుందంటే ఎవరు మాత్రం కాదంటారు.. కానీ అందుకోసం విద్యార్థులు కాస్త కష్టపడాల్సి ఉంటుంది. తమ తెలివికిపదును పెట్టాలి. జాతీయ స్థాయిలో ‘ఇన్స్పైర్ మనక్’ స్టూడెంట్స్ ఆవిష్కరణలకు ఆహ్వానం ప్రతిభ చూపినవారికి నగదు పురస్కారాలు ఆన్లైన్ ద్వారా సెస్టెంబర్ 15 వరకు దరఖాస్తుల స్వీకరణగత విద్యా సంవత్సరం.. 2024–25 విద్యా సంవత్సరంలో జిల్లా స్థాయికి 1,881 నామినేషన్లు ఎంపికయ్యాయి. వీటి నుంచి ఉత్తమ ప్రతిభ కనబర్చిన 198 నామినేషన్లు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. వీటి నుంచి నాలుగు జాతీయ స్థాయికి వెళ్లాయి. ఈ విద్యా సంవత్సరం జాతీయ స్థాయిలో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటే విధంగా సైన్స్ ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. -
పర్యాటక శోభ
కోట్పల్లి ప్రాజెక్టుకు ఆదివారం పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎండలు తగ్గడంతో కుటుంబసమేతంగా వచ్చిన సందర్శకులు ప్రాజెక్ట్ నీటిలో సందడిగా గడిపారు. యువతీ యువకులు బోటింగ్ చేస్తూ సెల్ఫీలు దిగుతూ కేరింతలు కొట్టారు. – ధారూరువికారాబాద్: గతంలో ఏడు జిల్లాలు హెచ్ఎండీఏ పరిధిలో ఉండగా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో 11 జిల్లాలకు విస్తరించింది. ఇందుకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ట్రిపుల్ ఆర్కు ఐదు కిలో మీటర్ల ఆవలి వరకు హెచ్ఎండీఏ పరిధిని విస్తరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ పరిధిలోకి మన జిల్లా సైతం వచ్చేసింది. జిల్లా పరిఽధిలోని ఐదు మండలాలకు చెందిన 54 రెవెన్యూ గ్రామాలు, మరో 20కి పైగా అనుబంధ గ్రామాలు హెచ్ఎండీఏ పరిధిలోకి చేరుస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. జిల్లా సమగ్రాభివృద్ధికి స్పెషల్ జీఓ రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న జిల్లా అభివృద్ధిలో అందరాని దూరంలో నిలిచిపోయింది. నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతూ నెట్టుకొస్తున్న జిల్లాకు ఏకకాలంలో ముఖ్యమంత్రి, స్పీకర్ పదవులు వరించాయి. సీఎంగా ఉన్న రేవంత్రెడ్డి తొలుత కడా(కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఏర్పాటు చేయడంతో అభివృద్ధి సొంత నియోజకవర్గానికే పరిమితం చేస్తారా అంటూ మిగిలిన జిల్లాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. జిల్లా పరిధిలోని మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వం జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రత్యేక జీఓ 190 విడుదల చేసిన విషయం విదితమే. వుడా(వికారాబాద్ అర్భన్ డెవలప్మెంట్ అథారిటీ) పేరుతో జిల్లాను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. మహానగరం మరింత విస్తరించనుంది. త్వరలో నిర్మించనున్న రీజినల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ ఆర్) ఆవల ఐదు కిలోమీటర్ల వరకు పరిధిని విస్తరించేందుకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అభివృద్ధికి ఊపందుకోనుందని జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వుడా పరిధిలో 493,హెచ్ఎండీఏలో 54 రెవెన్యూ గ్రామాలు జిల్లా సమగ్రాభివృద్ధికి మార్చిలో స్పెషల్ జీఓ 190 విడుదల చేయగా.. కడా పేరిట కొడంగల్ నియోజకవర్గంలో రూ.6 వేల కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. తాజా జిల్లాలోని పలు ప్రాంతాలు హెచ్ఎండీఏ పరిధిలోకి చేర్చడంతో అభివృద్ధి మరింత ఊపందుకుంటుందని జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వుడా పరిధిలోకి నాలుగు మున్సిపాలిటీలు (వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్)తో పాటు, 493 రెవెన్యూ గ్రామాలు రానున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలోకి ఐదు మండలాల నుంచి 54 రెవెన్యూ గ్రామాలు, 20 గ్రామాలు చేర్చే అవకాశం ఉంది. రాష్ట్ర అభివృద్ధిలో రాజధాని హైదరాబాద్తో పాటు శాటిలైట్ టౌన్షిప్ల డెవలప్మెంట్ కీలకం కానుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే పలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ఏర్పాటు చేసి అభివృద్ధి పనులను వేగిరం చేస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలోకి జిల్లా ఐదు మండలాలు, 54 రెవెన్యూ గ్రామాలు, 20కి పైగా గ్రామాలు ఒక్క పూడురు నుంచే 23 రెవెన్యూ గ్రామాలు ఊపందుకోనున్న అభివృద్ధి హెచ్ఎండీఏ పరిధిలోని రెవెన్యూ గ్రామాలు మండలం రెవెన్యూ గ్రామాలు అంగడిచిట్టెంపల్లి, చన్గోముల్, చీలాపూర్, చింతల్పల్లి, కండ్లపల్లి, కంకల్, కెరవెళ్లి, కడ్మూర్, కొత్తపల్లి, మంచన్పల్లి, మన్నెగూడ, మేడిపల్లి, మిర్జాపూర్, మిట్టకంకల్, నిజామ్పేట్ మేడిపల్లి, పెద్ద ఉమ్మెంతాల్, పూడూరు,కుద్భుల్లాపూర్, రేగడిమామిడిపల్లి, పోమన్గుర్తి, తిర్మలాపూర్, ఎన్కెపల్లి, తుర్కెన్కెపల్లి అక్నాపూర్, చించల్పేట్, గంగ్యాడ, గుబ్బడిఫతేపూర్, లింగంపల్లి, మాదిరెడ్డిపల్లి, ముబారక్పూర్, నవాబుపేట, పూలపల్లి, పులిమామిడి, ఎల్లకొండ వికారాబాద్(జిల్లా కేంద్రం) బూర్గుపల్లి, ధన్నారం, గెర్గెట్పల్లి, గుడుపల్లి, కొంపల్లి, మద్గుల్చిట్టెంపల్లి, పాతూరు, పీరంపల్లి, పులుసుమామిడి, సిద్దులూరు(చెంచలం), సిద్దులూరు(పాయాగ), సిద్దులూర్ (మునుగాల) మోమిన్పేట చీమల్ధరి, చక్రంపల్లి, దేవరంపల్లి పరిగి చిట్యాల్, మాదారం, రాపోల్, తొండపల్లి పూడూరునవాబుపేటవికారాబాద్ -
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి
మొయినాబాద్రూరల్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు యు.పోచయ్య అన్నారు. ఆదివారం హిమాయత్నగర్ సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో స్కూల్ టీచర్ సమాఖ్య(ఎస్టీఎఫ్) తెలంగాణ ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోచయ్యకు ఓడీ సౌకర్యం లభించడంతో ఆయనను ఆ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. దాంతో పాటే ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి.గోపాల్, ప్రతినిధులు విఠల్, రమేష్, రాంచంద్రయ్య, రాంచందర్, నర్సింహులు, లక్ష్మినారాయణ, దిలీప్, భగవత్గీత, రాజారావు, మొయినాబాద్ మండల అధ్యక్షుడు పి.సుధాకర్, వెంకటస్వామి, రజిత, సంతోష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పోచయ్య -
‘టెక్స్టైల్’ భూముల విక్రయానికి యత్నం!
నందిగామ: టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేసి, స్థానికులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కొనుగోలు చేసిన భూమిని విక్రయించేందుకు కొందరు డైరెక్టర్లు యత్నిస్తున్నారని సొసైటీ సభ్యులు ఆరోపించారు. కొందరు రైతులతో కలిసి ఆదివారం హైదరాబాద్ హైటెక్ టెక్స్టైల్ పార్క్ వద్ద ఆదివారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. 2002, 2003 సంవత్సరంలో టెక్స్టైల్ పార్క్ కోసం చేగూరు రెవెన్యూ పరిధి నర్సప్పగూడ గ్రామ శివారులో 142 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని తెలిపారు. ఆ సమయంలో 108 మంది సభ్యులు, 8 మంది డైరెక్టర్లతో ఒక సొసైటీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆ భూమిలో ప్రభుత్వ రాయితీతో పరిశ్రమలు ఏర్పాటు చేసి, స్థానికులకు, భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చామని వివరించారు. కానీ అనుకున్న ఆశయం నెరవేరకుండా కొందరు డైరెక్టర్లు ఎవరికీ తెలియకుండా ఆ భూములను అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. తామంతా కష్టపడి సంపాదించిన డబ్బులతో భూములు కొనుగోలు చేశామని, మా భూములు మాకు కేటాయిస్తే పరిశ్రమలు స్థాపించి, పలువురికి ఉపాధి చూపుతామని చెప్పారు. సంబంధిత అధికారులు స్పందించి, జాగల విక్రయానికి యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకుని, ఆ భూములను తమకు అప్పగించాలని కోరారు. కార్యక్రమంలో బోర్డు సభ్యులు పురుషోత్తం, గడ్డం దేవదాస్, వెంకటరమణ, శ్రీరాములు, సురేంద్ర, రవి, రమేష్, బలరాం తదితరులు పాల్గొన్నారు.నిరసన వ్యక్తంచేసిన సొసైటీ సభ్యులు -
లారీ ఢీకొని యువకుడి మృతి
ఆమనగల్లు: లారీ ఢీకొ న్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం పట్టణంలోని హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఎస్ఐ సీతారాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆమనగల్లు మున్సిపాలిటీ ముర్తుజపల్లి గ్రామానికి చెందిన మహేందర్నాథ్ అలియాస్ టిల్లు(23) బైక్పై వెళ్తున్న క్రమంలో కల్వకుర్తి నుంచి మధ్యప్రదేశ్కు పత్తిలోడ్తో వెళ్తున్న లారీ కాటన్మిల్లు సమీపంలో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఇదే సమయంలో కల్వకుర్తి నుంచి నగరానికి వెళ్తున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించాడు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆర్థిక సహాయం అందజేశారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మద్యం బాటిళ్ల పట్టివేత అనంతగిరి: హర్యానా ప్రాంతానికి చెందిన 20 డిఫెన్స్ మద్యం బాటిళ్లను హైదరాబాద్కు తీసుకెళ్తున్న క్రమంతో రంగారెడ్డి జిల్లా ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వికారాబాద్లో పట్టుకున్నారు. ఒక కారులో డిఫెన్స్ మద్యం వస్తుందనే పక్కా సమాచారంతో ఎన్ఫోర్స్మెంట్ సీఐ సుభాష్చంద్ర తన సిబ్బందితో కలిసి ఎన్నెపల్లి చౌరస్తాలో శనివారం తనిఖీలు చేశారు. కారులో నుంచి 20 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు అందులో ప్రయాణిస్తున్న నలుగురిపై కేసు నమోదు చేశారు. అనంతరం కార్ను సీజ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆర్.కిషన్ తెలిపారు. -
విద్య మాటున వ్యాపారం
గెట్ల పంచాయితీ! దౌల్తాబాద్కు చెందిన ఓ రైతు ఆరు నెలల క్రితం భూమి కొలత కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాడు.8లోu9లోuతాండూరు: పిల్లలను ఉన్నత విద్యావంతులను చేయాలనే తల్లిదండ్రుల కోరికను ప్రైవేట్ పాఠశాలలు ఆసరాగా చేసుకుంటున్నాయి. తల్లిదండ్రులకు పిల్లలపై ఉన్న ప్రేమ ప్రైవేట్ పాఠశాలలకు కాసుల వర్షం కురిపిస్తోంది. విద్యాసంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో న్యూ అడ్మిషన్లు, ఏడాది ఫీజు పేరిటప్రైవేట్ పాఠశాలల యాజమన్యాలు అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇంతటితో ఆగకుండా పుస్తకాలు తాము చెప్పిన చోటే కొనుగోలు చేయాలని హుకూం జారీ చేస్తున్నారు. ఈ విద్యావ్యాపారాన్ని అరికట్టాలని బీసీ జేఏసీ సంఘాలు, విద్యార్థి సంఘాలు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారే కరువయ్యాయరు. ప్రైవేట్ స్కూళ్లను హెచ్చరించాం ప్రైవేటు స్కూళ్లలో పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదును ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకొన్నారు. దీంతో ప్రైవేటు స్కూల్ యాజమాన్యాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించా రు. పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలను విక్రయించి నా, అధిక ఫీజులు వసూలు చేసినట్లు తెలిసినా అనుమతులను రద్దు చేస్తామని హెచ్చరించాం. – వెంకటయ్యగౌడ్, ఎంఈఓ, తాండూరు విద్యార్థుల పేరిట దోపిడీ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్య, నోట్ పుస్తకాలు విక్రయిస్తున్నారు. పాఠ్య పుస్తకాల ధరలను ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలే నిర్ణయిస్తున్నాయి. విద్యార్థుల పేరిట సాగిస్తున్న ఈ దోపిడీని అరికట్టాలి. ఈ విషయమై ఇప్పటికే విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశాం. – భాను ప్రసాద్, బీసీ జేఏసీ నాయకుడు, తాండూరు పాఠ్య, నోట్ పుస్తకాల విక్రయాల్లో ప్రైవేట్ పాఠశాలల మాయాజాలం తాము సూచించిన చోటే కొనుగోలు చేయాలని తల్లిదండ్రులకు చీటీలు అడ్మిషన్ పేరిట రూ.5 వేల నుంచి రూ.10వేల వరకు వసూళ్లు విద్యాశాఖకు ఫిర్యాదు చేసిన బీసీ జేఏసీ సంఘం సభ్యులు పట్టించుకోని అధికారులురూట్ మార్చి విక్రయాలు జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, 20 మండలాలున్నాయి. విద్యాశాఖ వెల్లడించిన ప్రకారం జిల్లా వ్యాప్తంగా 198 ప్రైవేటు పాఠశాలలు కొనసాగుతుండగా 47,534 మంది విద్యార్థులున్నారు. తాండూరు, కొడంగల్, వికారాబాద్, పరిగి పట్టణాలలో ప్రైవేటు స్కూళ్లు అధికంగా ఉన్నాయి. గతంలో పాఠశాల్లోనే నోట్ పుస్తకాలు, యూనిఫాంలు విక్రయించేవారు. మూడేళ్లుగా విద్యార్థి సంఘాలు, బీసీ జేఏసీ సంఘాలు ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో విక్రయాలు నిలిచిపోయాయి. రూట్ మార్చిన యాజమాన్యాలు తాము సూచించిన షాపుల్లోనే పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫాంలు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. 1వ తరగతి విద్యార్థికి పుస్తకాల సెట్కు రూ.6,500 నుంచి రూ.8 వేల వరకు, 2 నుంచి 10వ తరగతి విద్యార్థుల పుస్తకాల సెట్కు ఒక్కో విద్యార్థికి రూ.7వేల నుంచి రూ.13 వేల వరకు వెచ్చించాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. అదే సెట్ ఇతర సెంటర్లలో కొనుగోలు చేస్తే సగం ధరకే వస్తున్నాయని చెబుతున్నారు. యూనిఫాంలు సైతం పాఠశాల యాజమాన్యాలు సూచించిన దుకాణాల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే రూ.5వేల వరకు ఫీజులు పెరిగాయని అడ్మిషన్ ఫీజు రూ.5వేల నుంచి రూ.10 వేలకు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అర్ధరాత్రి గర్భిణీ అవస్థ
● 108కి కాల్ చేసినా స్పందన కరువు ● ప్రైవేటు వాహనంలో ఆస్పత్రికి తరలింపు బషీరాబాద్: మెడికల్ అత్యవసర సేవలు పడకేశాయి. అర్ధరాత్రి పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్లడానికి 108కి కాల్ చేస్తే బిజీ అంటూ రెండు గంటల పాటు ఎదురు చూశారు. చివరకు అంబులెన్స్ రాకపోవడంతో ఓ ప్రైవేటు వాహనంలో గర్భిణీని తాండూరు మాతాశిశు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పురిటి నొప్పులతో తల్లడిల్లిన ఆమెకి వైద్యులు కాన్పు చేశారు. ఈ ఘటన మండలంలోని నవల్గాలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కాశీంపూర్ శ్యామల నిండు గర్భిణీ. శనివారం రాత్రి 11.45 గంటలకు పురిటి నొప్పులు రావడంతో భర్త నరేష్ 108 అంబులెన్స్కు కాల్ చేశారు. అవి ఇతర సేవల్లో బిజీ ఉన్నాయి. 30 నిమిషాలు ఆగాలని టీల్ ఫ్రీ సిబ్బంది చెప్పారు. తీరా అర్ధ గంట తర్వాతా చేస్తే బిజీ ఉన్నాయి.. తర్వాత చేయండని రెండు గంటల పాటు తమను వేచి ఉండేలా చేశారని బాధితురాలి భర్త ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ప్రైవేట్ వాహనంలో తాండూరులోని మాతాశిశు ఆస్పత్రికి తరలించారు. గర్భిణీకి అక్కడి వైద్యులు కాన్పు చేయడంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఉద్యోగి అనుమానాస్పద మృతి మీర్పేట: అనుమానాస్ప ద స్థితిలో ఓ ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందిన సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కాలనీవాసులు, ఇన్స్పెక్టర్ నాగరాజు కథనం ప్రకారం.. ఏపీ కృష్ణా జిల్లా పెద్దమద్దాలి గ్రామానికి చెందిన బండి వెంకటేశ్వరరావు(59) పదేళ్లుగా బడంగ్పేట సాయిప్రభు హోమ్స్ కాలనీలో భార్య జయంతి, కుమారుడు రాజ్భరత్, కోడలు గౌతమితో కలిసి ఉంటున్నాడు. ఆయన ఆబిడ్స్లోని పేఅండ్ అకౌంట్స్ కార్యాలయంలో ఆడిటర్గా విధులు నిర్వహించేవాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం వెంకటేశ్వరరావు నీటి సంపులో శవమై తేలాడు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియాకు తరలించారు. మృతిపై అనుమానాలు కొంత కాలంగా తనను భార్య, కుమారుడు, కోడలు వేధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మృతుడు వెంకటేశ్వరరావు తరచూ తమతో చెప్పేవాడని కాలనీవాసులు పేర్కొన్నారు. తండ్రి చనిపోతే కుమారుడికి ఉద్యోగం వస్తుందని, అందుకే మానసికంగా వేధిస్తున్నారని తెలిపినట్లు చెప్పారు. ఇక్కడే ఉంటే తనను చంపేలా ఉన్నారని, వారం రోజుల్లో మలక్పేటలోని ప్రభుత్వ క్వార్టర్కు మారుతానని శనివారం రాత్రి చెప్పినట్లు స్థానికులు వెల్లడించారు. ఆయన మృతిపై అనుమానం ఉందని, మృతుడి కుమార్తె ధరణిదేవి మీర్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వేడుకగా వీరభద్రస్వామి ఆలయ వార్షికోత్సవం రాజేంద్రనగర్: బుద్వేల్లోని వీరభద్రస్వామి భద్రకాళి ఆలయ మూడవ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆ సందర్భంగా దేవాలయాన్ని వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. ఉదయం అభిషేకం, అలంకరణ అనంతరం భక్తులకు వీరభద్ర స్వామి భద్రకాళి అమ్మవారి దర్శనాన్ని ప్రారంభించారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా తగు ఏర్పాట్లు చేపట్టారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామి, అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. -
టైలరింగ్ శిక్షణతో ఉపాధి మార్గం
రాష్ట్ర సాగునీటి శాఖ ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి ధారూరు: ౖటెలరింగ్ నేర్పించడం అంటే ఉపాధి చూపినట్లేనని రాష్ట్ర సాగునీటి శాఖ ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి అన్నారు. మండల పరిధిలోని కేరెళ్లి శ్రీసత్యసాయి సార్వజనిక కేంద్రంలో ఆదివారం టైలరింగ్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన శిక్షణ పొందుతున్న వారికి పలు సూచనలు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో సత్యసాయి సేవా సంస్థల సేవలతో పేదలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. సత్యసాయి సేవా సంస్థల కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి, కేరెళ్లి శ్రీసత్యసాయి సార్వజినిక కేంద్రం అధ్యక్షుడు రఘునందన్, ప్రధాన కార్యదర్శి ప్రేమ్కుమార్, కన్వీనర్ రామకృష్ణారెడ్డి, సేవా సంస్థల బాధ్యులు సోమిరెడ్డి, నాగరాజు, బల్వంత్రెడ్డి, నర్సింలు, రవి, శ్రీకాంత్రెడ్డి మహిళలు పాల్గొన్నారు. టీఎంహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఖదీర్ బంట్వారం: తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి(టీఎంహెచ్పీఎస్) జిల్లా అధ్యక్షుడిగా తొర్మామిడికి చెందిన ఖదీర్ పాషా నియమితులయ్యారు. ఆదివారం పెద్దేముల్లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వహబ్ సమక్షంలో ఖదీర్ను ఏకగ్రీవంగా ఎన్నుకుని నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఖదీర్ మాట్లాడుతూ.. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మైనార్టీల హక్కుల సాధన కోసం శక్తి వంచన లేకుండా పని చేస్తానన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి మైనార్టీల సంక్షేమం కోసం కల్పించిన రిజర్వేషన్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో 14శాతం ఉన్న ముస్లింలను రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకు గానే వాడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వహబ్కు ప్రత్యేక కృతజ్ఙతలు తెలిపారు. రజకులను ఆదుకోవాలి రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపి కొడంగల్: రజకులకు సంక్షేమ పథకాలు వర్తింపజేస్తూ తమ కులస్తులను ఆదుకోవాలని రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక అన్నారు. ఆదివారం మండల పరిధిలోని అన్నారంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లు దాటినా రజకుల బతుకులు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ప్రమాదవశాత్తు మరణించిన రజకుల కుటుంబాలకు రూ.10లక్షల ఆర్థికసాయం అందజేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ప్రతీ గ్రామంలో దోబీఘాట్లు, కమ్యూనిటీ హాల్స్ నిర్మించి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రవీందర్, అశోక్, వెంకటేశ్, మోహన్, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు. మరకత శివాలయాన్ని దర్శించుకున్న వెన్నెల శంకర్పల్లి: మండలంలోని చెందిప్ప గ్రామంలో వెలసిన 11వ శతాబ్దపు బ్రహ్మసూత్ర మరకత శివాలయాన్ని ఆదివారం తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్, గుమ్మడి వెన్నెల గద్దర్ దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యు లు ఆమెకి శేషవస్త్రం కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం వెన్నెల మాట్లాడుతూ.. మరకత శివాలయాన్ని సందర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మళ్లీ సమ యం తీసుకొని వస్తానని, ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు సదానందం గౌడ్, చైర్మన్ గోపాల్రెడ్డి, సభ్యులు మోహన్, హన్మంతు పాల్గొన్నారు.