breaking news
Vikarabad District News
-
పసందైన భోజనం
కొడంగల్: వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లోని 670 ప్రభుత్వ పాఠశాలలు, 12 జూనియర్ కళాశాలల్లో ఉదయం పూట అల్పాహారం, మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారు. సర్కారు బడుల్లో విద్యార్థుల ఆకలి కేకలు వినించరాదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పసందైన భోజనం పెట్టిస్తున్నారు. హరేకృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్టు ఈ బృహత్కర కార్యక్రమాన్ని చేపట్టింది. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్, బొంరాస్పేట, దుద్యాల, దౌల్తాబాద్, పరిగి, తాండూరు, దోమ, కుల్కచర్ల, బషీరాబాద్, యాలాల, అలాగే నారాయణపేట జిల్లాలోని కోస్గి, మద్దూరు, గుండుమాల్, కొత్తపల్లి మండలాల్లో విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు. కొడంగల్, పరిగి, తాండూరు, బషీరాబాద్, బొంరాస్పేట, హకీంపేట, దోమ, కోస్గి, మద్దూరు, దౌల్తాబాద్, కొత్తపల్లి, గుండుమాల్ మండలాల్లోని 12 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 3,200 మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు హరేకృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ పీఆర్ మేనేజర్ నాగేశ్వర్రెడ్డి తెలిపారు. రోజూ ఉదయం 42 వాహనాల్లో టిఫిన్ను పాఠశాలలకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మెనూ ఇలా.. ఇడ్లీ సాంబారు, మిల్లెట్ ఇడ్లీ సాంబార్, దోశ చట్నీ, పూరీ ఆలూ కుర్మా, ఉప్మా చట్నీ, ఉగ్రాని – పొంగల్ – చట్నీ, బోండా చట్నీ రోజూ ఏదో ఒకటి అందిస్తున్నారు. రోజు విడిచి రోజు పాలు ఇస్తున్నారు. వేడి వేడి రుచికరంగా ఉండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి అంటూ విద్యార్థులు ఆస్వాదిస్తున్నారు. కొడంగల్లోని సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్లో వంటలు చేస్తున్నారు. హరేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్, వయాట్రీస్ సంస్థ, సింగరేణి సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం నడుస్తోంది. సీఎస్ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబిలిటీ) నిధులతో నడిపిస్తున్నారు. ప్రధాన కంపెనీలు వారి ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని ఈ పథకానికి కేటాయిస్తున్నారు. ఆశయం వెనుక ఐదుగురు పేద విద్యార్థులకు ఉదయం పూట బలవర్ధకమైన అల్ఫాహారం అందించే పథకం వెనుక ఐదుగురు వ్యక్తుల కృషి ఉంది. అందులో మొదటి వ్యక్తి సీఎం రేవంత్రెడ్డి. ఆయన చొరవతోనే ఈ పథకానికి రూపకల్పన చేశారు. హరేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ తెలంగాణ అధ్యక్షుడు సత్యగౌర చంద్ర దాస ప్రభూజీ, వయాట్రీస్ సంస్థ సీఎస్ఆర్ నిధుల ఇండియా హెడ్ మిచెల్ డొమినికా, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరామ్, తెలంగాణ సోషల్ ఇంఫాక్ట్ గ్రూప్ డైరెక్టర్ అర్చన సురేష్ సహకారం ఎంతో ఉంది. సర్కారు బడుల్లో రోజూ 52వేల మందికి అల్పాహారం 3,200 మందికి మధ్యాహ్న భోజనం 670 పాఠశాలలు, 12 జూనియర్ కళాశాలలకు ప్రయోజనం ఆనందం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు -
పంట మార్పిడితో ప్రయోజనం
ఇక్రిశాట్ ప్రిన్సిపాల్ సైంటిస్టు హరికిషన్ నందిని దౌల్తాబాద్: రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలబించాలని ఇక్రిశాట్ ప్రిన్సిపాల్ సైంటిస్టు హరికిషన్ నందిని సూచించారు. ఆరుతడి పంటలు పప్పు ధాన్యాల సాగు, ఆయిల్ పామ్ తోటలు పెంచాలన్నారు. బుధవారం మండలంలోని చల్లాపూర్ గ్రామంలో శాస్త్రవేత్తలు, నిపుణుల బృందంతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. సబ్సిడీపై విత్తనాలు, డ్రిప్ పరికరాలు అందజేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఓ తులసి, ఆయిల్ పాం ఫీల్డ్ ఆఫీసర్ మల్లికార్డున్ తదితరులు పాల్గొన్నారు. తాండూరు టౌన్/తాండూరు రూరల్: పాలిషింగ్ యూనిట్ల వద్ద ఎండు గంజాయి విక్రయిస్తున్న ఓ బీహారీని ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 1.150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా మద్య నిషేధ, ఆబ్కారీ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...బీహార్ రాష్ట్రం కటిహార్ జిల్లా బైరియా గ్రామానికి చెందిన మ్మద్ ముస్తకీమ్ అనే వ్యక్తి తాండూరు మండలం గోపాన్పల్లి సమీపంలోని పాలిషింగ్ యూనిట్ల వద్ద గంజాయి విక్రయిస్తున్నాడనే పక్కా సమాచారంతో తాండూరు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ రాణి ఆధ్వర్యంలో దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు ఎంఆర్ఐ ప్రేమ్ కుమార్ తుర్కయంజాల్: వరుసగా వివాదాలకు కారణమైన అబ్దుల్లాపూర్మెట్ మండలం తుర్కయంజాల్ సర్వే నెంబర్ 338లోని భూమిని స్వాధీనం చేసుకున్నామని ఎంఆర్ఐ ప్రేమ్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఈ భూమి పూర్తిగా రెవెన్యూ విభాగం ఆధీనంలో ఉందని.. ఎవరైనా ప్రవేశించినా, స్థలాన్ని కొనుగోలు, విక్రయాలు చేసినా, అనుమతి లేని నిర్మాణాలు చేపట్టిన చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సిపల్, పోలీస్ శాఖల అధికారులతో కలిసి పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. శవాన్ని వెలికితీసి పోస్టుమార్టం కొత్తూరు: అంత్యక్రియలు నిర్వహించిన శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించిన ఘటన మండల పరిధిలోని ఇన్ముల్నర్వ గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన దివ్యాంగుడైన పాత్లావత్ నరేష్(27) జేపీదర్గాలో భిక్షాటన చేస్తూ జీవించేవాడు. గత నెల 15న దర్గా నుంచి ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని ఉస్మానియాకు తరలించారు. బాధితుడి అన్న వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. రెండు రోజుల తర్వాత పోలీసులు, ఆస్పత్రి వర్గాలకు సమాచారం ఇవ్వకుండానే కుటుంబ సభ్యులు నరేశ్ను ఇంటికి తీసుకురాగా, రెండు రోజుల క్రితం మృతిచెందాడు. దీంతో అతని అంత్యక్రియలు పూర్తి చేశారు. నరేశ్ మృతిపై అనుమానాలు వ్యక్తంకావడంతో పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో మంగళవారం ఉస్మానియా నుంచి వచ్చిన నలుగురు వైద్యుల బృందం పూడ్చిన శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించింది. ఫాక్స్కాన్ ఉద్యోగుల గదుల్లో చోరీ ఇబ్రహీంపట్నం రూరల్: ఫాక్స్కాన్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్న వియత్నాం దేశానికి చెందిన ప్రతినిధుల గదుల్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిపై ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రమేశ్ తెలిపిన ప్రకారం. రోచీష్మతి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వియత్నాం దేశానికి చెందిన ఫాక్స్కాన్ ఉద్యోగుల గదుల్లో అదే డార్మిటరీ సూపర్వైజర్గా పని చేస్తున్న మారినేని చిన్న వెంకటరావు నగదు దొంగిలిస్తున్నాడు. ఓ ఉద్యోగి పెట్టిన స్పై కెమెరాలో చోరీకి పాల్పడిన వీడియో రికార్డయింది. రూ.7 వేలు నగదు దొంగిలిస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకుని నిందితుడిని పోలీసులకు అప్పగించారు. అపార్ట్మెంట్లోని ఆరు ఇళ్లలో రూ.లక్ష వరకు నగదు అపహరించాడని బాధితులు ఫిర్యాదు చేశారని.. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఉపాధ్యాయుల కొరత తీర్చండి
● సంగెంకలాన్ సర్పంచ్ మీనాక్షి ● పాఠశాల ఎదుట విద్యార్థులతో కలిసి ఆందోళన తాండూరు రూరల్: మండలంలోని సంగెంకలాన్ గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆ గ్రామ సర్పంచ్ మీనాక్షి డిమాండ్ చేశారు. బుధవారం పాఠశాల ఎదుట విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు వంద మందికి పైగా విద్యార్థులు ఉన్నారని, హెచ్ఎంతో కలిపి నలుగురు ఉపాధ్యాయులే ఉన్నారన్నారు. ఇందులో ఓ టీచర్ ప్రసూతి సెలవుల్లో వెళ్లిందన్నారు. మరో టీచర్ నాగలక్ష్మిని డిప్యూటేషన్పై దోమ మండలానికి వేశారని తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు ఉపాధ్యాయులతో ఏడు తరగతులు నిర్వహించడం చాలా కష్టంగా ఉందన్నారు. ఇంగ్లిష్, గణిత సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేక పాఠాలు సాగడం లేదన్నారు. ఈ విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామస్తులు రాజేందర్రెడ్డి, శ్రీనివాస్, పరికప్ప, శ్రీకాంత్రెడ్డి, జగదీష్, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఘనంగా ఎమ్మెల్యే బర్త్ డే
తాండూరు: స్థానిక ఎమ్మెల్యే బి.మనోహర్రెడ్డి బర్త్ డే వేడుకలను బుధవారం నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ప్రజాప్రతినిధులు, నాయకులు సంబరాల్లో పాల్గొని కేక్లు కట్ చేశారు. విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. చైర్పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్రెడ్డి రక్తదానం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నాగరాజు, ఎమ్మెల్యే తనయులు అవినాష్రెడ్డి, శివారెడ్డి, నాయకులు పట్లోళ్ల నర్సింహులు, బాల్రెడ్డి, అబ్దుల్ రజాక్, పురుషోత్తంరావు, సంతోష్, ప్రభాకర్గౌడ్, హబీబ్లాల, కౌన్సిలర్లు వెంకట్, స్వరూప, వేణుగోపాల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, అమెరికా పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే ప్రవాసభారతీయులు, మంత్రి జూపల్లి సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు. గౌతాపూర్ చౌరస్తాలో.. తాండూరు రూరల్: కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజ్కుమార్ ఆధ్వర్యంలో గౌతపూర్ చౌరస్తా వద్ద కేక్కట్ చేశారు. సీనియర్ నాయకులు మల్కాపూర్ జనార్దన్రెడ్డి, నాగప్ప పాల్గొన్నారు. వేర్వేరుగా వేడుకలు బషీరాబాద్: కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజవర్ధన్రెడ్డి, అజయ్ ప్రసాద్ వర్గీయులు ఒకవర్గంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాధవ్రెడ్డి, సొసైటీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ శంకర్రెడ్డి, రోహిత్ మహారాజ్, మాణిక్రెడ్డి, రాము నాయక్, కలాల్ నర్సింలు, పవన్ ఠాకూర్, కాశప్ప తదితరులు మరోవర్గంగా ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. -
రైతు సంక్షేమానికి ప్రాధాన్యత
నిబంధనలకు తూట్లు దౌల్తాబాద్ పీఏసీఎస్ కమిటీ పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్ల వ్యవహారం రోజుకో చర్చకు దారి తీస్తోంది.● పునరావాస, పునర్నిర్మాణానికి కృషి ● భూ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది ● కలెక్టర్ దీపక్ తివారి కొడంగల్: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. భూ నిర్వాసితులకు అండగా ఉంటూ పునరావాస, పునర్నిర్మాణానికి సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. దుద్యాల మండలంలో టీజీఐసీ ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు బుధవారం ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పట్టణంలోని ఓ పంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డితో కలిసి లగచర్ల, హకీంపేట, పోలేపల్లి గ్రామాల రైతులకు పట్టాలు అందజేశారు. హకీంపేటలో 288 మందికి, లగచర్లలో 227 మందికి, పోలేపల్లిలో 38 మందికి పట్టాలు ఇచ్చినట్లు కలెక్టర్ చెప్పారు. ఈ మూడు గ్రామాల పరిధిలో పలు అభివృద్ధి పనులకు 1,358 ఎకరాల భూమిని సేకరించించినట్లు తెలిపారు. అందరి సహకారంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఎడ్యూకేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. త్వరలో ఇండస్ట్రియల్ పార్కు వస్తుందన్నారు. హైదరాబాద్ – కొడంగల్ రేడియల్ రోడ్డుకు సహకరించాలన్నారు. రైతులకు ధన్యవాదాలు అభివృద్ధికి సహకరించి భూములు ఇచ్చిన రైతులకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు. భూములు కోల్పోయిన రైతులందరినీ ఆదుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్పీ స్నేహమెహ్ర, అదనపు కలెక్టర్ వెంకటాచాని, అదనపు ఎస్పీ రాజేష్మీన, తాండూరు ఆర్డీఓ అనిత, కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ గుప్తా, ఏఎంసీ చైర్మన్ అంబయ్య గౌడ్, హకీంపేట, పోలేపల్లి, లగచర్ల సర్పంచులు రవీంద్ర నర్సింహారెడ్డి, జింకల చంద్రయ్య, వెంకట్రాములు గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆవుటి శేఖర్, మున్సిపల్ కౌన్సిలర్ కృష్ణంరాజు, తహసీల్దార్ కిషన్, ఎంపీడీఓ జైపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉద్యాన పంటల సాగుకు చర్యలు కొడంగల్ రూరల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో ఉద్యాన, పట్టు పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ దీపక్తివారి తెలిపారు. బుధవారం పట్టణంలోని కడా కార్యాలయంలో ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి అధ్యక్షతన వ్యవసాయ రంగంపై చర్చించారు. ప్రముఖ పరిశోధనా సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, భారత ప్రభుత్వ సంస్థలు, శాస్త్రవేత్తలు, నిపుణుల బృందాలు పాల్గొన్నాయి. పంట ఉత్పత్తి విధానాలు, ఉద్యాన పంటల అభివృద్ధి, సహజ వనరుల నిర్వహణ, సాగునీటి వనరులు, మార్కెట్ అనుసంధానం, ఆహార ప్రొసెసింగ్, రైతు సంస్థలు, అనుబంధ వ్యవసాయ రంగాలపై చర్చించారు. ఇక్రిశాట్ సీనియర్ సైంటిస్ట్, నిపుణుల బృందం చైర్మన్ డాక్టర్ హరికిషన్ చిట్లపల్లిలో పర్యటించారు. అక్కడి కొడంగల్ ఫార్మర్ సర్వీస్ ప్రొడ్యూసర్ కంపెనీని సందర్శించారు. వికారాబాద్, నారాయణపేట జిల్లాల పర్యటన వివరాలు, తమ సిఫార్సులతో కూడిన సమగ్ర నివేదికలను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటి డైరెక్టర్ డీఏఓ, ఏడీ ఉద్యాన శాఖ జేడీ శ్రీబాబు, హార్టీకల్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా. ఏ భగవాన్, డీహెచ్ఎస్ఓ ఎంఏ సత్తార్, పట్టు పరిశ్రమ జేడీ లత, డీఆర్డీఏ కొడంగల్ హెచ్ఓ సురేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ పోరుబాట
వికారాబాద్: అభివృద్ధి పనుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక భూమిపూజ చేసి ప్రారంభించకుండా వదిలేసిన పనులపై వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పార్టీ క్యాడర్తో కలిసి స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ సొంత నియోజకవర్గం నుంచే నిరసనకు దిగటం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో మంజూరై నిర్లక్ష్యానికి గురవుతున్న పలు పనులతో పాటు కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో శిలాఫలకాలు వేసి పనులు చేపట్టని పనులపై ఉద్యమిస్తున్నారు. బుధవారం బీఆర్ఎస్ నేతలు వికారాబాద్ పట్టణంలో శిలాఫలకాల వద్ద కేక్కట్ చేసి రెండవ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. సీఎం వివక్షపై గళం ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి బాధ్యతలు చేపట్టగానే తన సొంత నియోజకవర్గం కొడంగల్ సమగ్రాభివృద్ధి కోసం కడా(కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ)ని ఏర్పాటు చేశారు. అభివృద్ధిని పరుగులు పెట్టించారు. అయితే మిగతా నియోజకవర్గాలు వికారాబాద్, పరిగి, తాండూరుపై వివక్ష చూపారనే విమర్శలు వచ్చాయి. ఏడాది క్రితం జిల్లా పరిధిలోని అన్ని జీపీలు, మున్సిపాలిటీలను కలుపుతూ వుడా(వికారాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ)ని ఏర్పాటు చేశారు. జీఓ మినహా పెద్దగా ఒరిగిందేమీ లేదని ప్రజలు, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వుడా అంశంపై కూడా బీఆర్ఎస్ ఉద్యమానికి సిద్ధమవుతోంది. కడా తరహాలోనే వుడాను కూడా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో అనేక అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచారు. ఏడాదిన్న కావస్తున్నా ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. పరిగి – వికారాబాద్, పరగి – షాద్నగర్ రోడ్లు మినహా మిగతా ఏ పనులు ప్రారంభానికి నోచుకోలేదు. కొడంగల్ మినహా మిగతా మూడు మున్సిపాలిటీలు నిధులలేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. వీటి పరిధిలో పెద్దగా అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులు విజయం కోసం భారీగా శ్రమించాల్సి వచ్చింది. జిల్లాలో అనేక రోడ్లు పూర్తిగా దెబ్బతిని ప్రయాణికులకు నరకం చూపుతున్నాయి. పనుల జాప్యంపై ఎమ్మెల్యేలు సైతం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ సమస్యలన్నింటిపై బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో పోరుబాటకు సిద్ధమైంది. ప్రభుత్వ వైఖరి, వివక్షపై గళం వినిపించేందుకు ఆ పార్టీ నేతలు కార్యాచరణ రూపొందించారు. పెండింగ్ పనులపై వినూత్న నిరసన శిలాఫలకాలకు పుట్టిన రోజు వేడుకలు స్పీకర్ నియోజకవర్గం నుంచే మొదలు సీఎం వివక్ష ధోరణిపై నేతల మండిపాటు వికారాబాద్ పట్టణంలో ఏడాది క్రితం ప్రభుత్వ అతిథి గృహ నిర్మాణానికి భూమిపూజ చేసి వదిలేశారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఆలంపల్లి నుంచి గెరిగేట్పల్లి మీదుగా వెళ్లే రోడ్డు పనులకు శిలాఫలకం వేసి ఏడాది పూర్తయినా పనులు ప్రారంభం కాలేదు. కొత్తగడి నుంచి మద్దులపల్లి బీటీ రోడ్డు శిలాఫలకానికే పరిమితమైంది. వికారాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ హయాంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు పనులు ప్రారంభం కాగా కాంగ్రెస్ వచ్చాక నిలిచిపోయాయి. హైదరాబాద్, పరిగి తదితర ప్రాంతాలకు వెళ్లేందుక కనెక్టివిటీగా ఉన్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జికి బీఆర్ఎస్ హయాంలో శంకుస్థాపన చేయగా పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. మోమిన్పేట మండలం ఎన్కెతల గ్రామంలో ఏడాది క్రితం పారిశ్రామిక వాడ ఏర్పాటుకు శిలాఫలకం వేసి వదలేశారు. తాండూరు – వికారాబాద్ మధ్య బీటీ రోడ్డు మంజూరైందని ఎమ్మెల్యే మనోహర్రెడ్డి రెండేళ్ల నుంచి చెబుతూనే ఉన్నారు. కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. తాండూరులో పారిశ్రామిక వాడకు ఏడాది క్రితం శిలాఫలకం వేసి వదిలేశారు. తాండూరు నియోజకవర్గం రాంపూర్ తండా, కరన్కోట్, జీవన్గీ రోడ్లు పూర్తి కావడం లేదు. పరిగి మున్సిపల్ పరిధిలో రూ.25 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థకు శిలాఫలకాలు వేసి ఏడాది దాటింది. పరిగి – లఖ్నాపూర్ రోడ్డు పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు. గడిసింగాపూర్ – రంగారెడ్డిపల్లి రోడ్డు పనులను ప్రారంభించి వదిలేశారు. -
విద్యతోనే ఉన్నత శిఖరాలు
● విద్యార్థులంతా కష్టపడి చదవాలి ● పల్లవి డీఈడీ కాలేజీ కరస్పాండెంట్ కొప్పుల అనిల్రెడ్డి పరిగి: తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని పల్లవి డీఈడీ కళాశాల కరస్పాండెంట్ కొప్పుల అనిల్రెడ్డి విద్యార్థులకు సూచించారు. బుధవారం పట్టణ కేంద్రంలోని కాలేజీలో ద్వితీయ సంవత్సర విద్యార్థులకు వీడ్కోలు సమావేశం, బోనాల వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. మంచి ఉద్యోగాలను సాధించి తల్లిదండ్రులకు, కళాశాలకు పేరుప్రతిష్టలు తీసుకురావాలన్నారు. విద్యతో ఏదైనా సాధ్యమనే విషయాన్ని గుర్తించి, కష్టపడి చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం
శంకర్పల్లి: సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని మోకిల సీఐ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ‘సైబర్ జాగ్రుక్తా దివస్’లో భాగంగా ప్రాచీన్ గ్లోబల్ స్కూల్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్లను వినియోగించడంతో సైబర్ నేరాలు జరగుతున్నాయన్నారు. అపరిచితులు మాయమాటలు చెప్పి బ్యాంకు ఖాతాల నుంచి కోట్లు కొల్లగొడుతున్నట్లు స్పష్టం చేశారు. ఫోన్లకు వచ్చే ఓటీపీ, కాల్స్కి స్పందించొద్దని, ఇంటి పరిసరాల్లో అనుమానితులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మోకిల ఎస్ఐ సురేశ్ గౌడ్, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. సీఐ శ్రీనివాస్రెడ్డి -
కలిసిసాగితేనే అభివృద్ధి
పరిగి: అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషిచేస్తానని పీఏసీఎస్ మాజీ చైర్మన్ శివన్నోళ్ల భాస్కర్ అన్నారు. ఆషాఢ బోనాలను పురస్కరించుకుని పట్టణంలోని నాలుగో వార్డు సయ్యద్మల్కాపూర్ పోచమ్మ ఆలయం చుట్టూ తన సొంత డబ్బులతో కాంక్రీట్ చిప్స్ పోయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డులోని సమస్యల పరిష్కారానికి తనవంతు కృషిచేస్తానని తెలిపారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని స్పష్టంచేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పరిసరాలతో పాటు ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవాలని, బురద, నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు. వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. కాలనీ అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో భాగంగా తన సతీమణి, కౌన్సిలర్ చంద్రకళ వార్డు ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని స్పష్టంచేశారు. దశలవారీగా సీసీ రోడ్డు, అండర్ డ్రైనేజీలు నిర్మిస్తామని చెప్పారు. ప్రజలందరి సహకారంతోనే కాలనీ పురోగతి సాధ్యమని తెలిపారు. ఈవిషయంలో సమష్టిగా ముందుకు సాగాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ శివన్నోళ్ల భాస్కర్ పోచమ్మ ఆలయం చుట్టూ కాంక్రీట్ చిప్స్ డంపింగ్ -
డిజిటల్ ప్రపంచంలో అప్రమత్తత అవసరం
తాండూరు టౌన్: డిజటల్ ప్రపంచంలో అప్రమత్తత ఎంతో అవసరమని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. బుధవారం తాండూరులోని ఇందిరా చౌక్ నుంచి సెయింట్ మార్క్స్ స్కూల్ వరకు సైబర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో విద్యార్థులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్లు, లింక్లు ఓపెన్ చేయరాదని, నకిలీ పెట్టుబడి ఆఫర్లు, పార్ట్టైం ఉద్యోగాల వలలో చిక్కరాదన్నారు. ఓటీపీ, సీవీవీ వివరాలు ఎవరికీ చెప్పరాదన్నారు. సైబర్ భద్రతపై విద్యార్థులు సైతం అవగాహన పెంచుకోవాలన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. పొరపాటున నేరగాళ్ల ఫోన్కాల్స్కు ఓటీపీ నంబర్లను చెప్పరాదన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, పట్టణ, రూరల్ సీఐలు పరమేశ్వర్, ప్రవీణ్ కుమార్, డివిజన్ ఎస్సైలు, పలు పాఠశాలల విద్యార్థులు, పట్టణ వాసులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు సైబర్ భద్రతపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి ఎస్పీ స్నేహ మెహ్ర -
బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా రమేష్కుమార్
తాండూరు: బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా యూ రమేష్కుమార్ నియమితులయ్యారు. బుధవారం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ గౌతమ్రావు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. తాండూరు నియోజకవర్గం నర్సాపూర్ గ్రామానికి చెందిన రమేష్కుమార్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేశారు. గతంలో పీఏసీఎస్ డైరక్టర్గా పని చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా సేవలందించారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డికి ప్రధాన అనుచరుడిగా పేరుంది. జిల్లా అధ్యక్ష పదవికి ముగ్గురు పోటీ పడగా పార్టీ అధిష్టానం రమేష్కుమార్కు బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావుకు, కేంద్ర మంత్రులు, ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాండూరు టౌన్: పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ సమీపంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ (బాలుర – పెద్దేముల్) గురుకుల కళాశాలలో ఇంటర్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ గ్రూపులో 12, బైపీసీలో 10 సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు నేటి నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే స్పాట్ అడ్మిషన్కు, అర్హత, ధ్రువపత్రాలతో హాజరు కావాలని కోరారు. బూర్గుపల్లి గురుకులంలో.. అనంతగిరి: వికారాబాద్ మండలం బూర్గుపల్లి గురుకుల పాఠశాల, కళాశాల(బాలికలు)లో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఖాళీల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ ఉషాకిరణ్ తెలిపారు. ఈ నెల 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు స్పాట్ అడ్మిషన్లు ఉంటాయని తెలిపారు. 2026లో పదో తరగతితో ఉత్తీర్ణులైన బాలికలు మాత్రమే అర్హులన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థినులు అన్ని సర్టిఫికెట్లతో హాజరు కావాలని కోరారు. కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో.. కొడంగల్ రూరల్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం నుంచి 11వ తేదీ వరకు దోస్త్ ద్వారా డిగ్రీ స్షెషల్ ఫేజ్ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వెబ్ ఆప్షన్స్ ఎంపిక ప్రారంభమవుతుందని ప్రిన్సిపాల్ డా. బీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. దోస్త్ చివరి దశలో చేరిన విద్యార్థులకు సైతం స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుందని తెలిపారు. కళాశాలలో బీఏ, బీకామ్, కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ బీజెడ్సీ, ఎంపీసీ, ఎంపీసీఎస్, బీఎస్సీ హెల్త్కేర్ కోర్సుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇతర వివరాలకు కళాశాల కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్ మేనేజర్ శ్రీదేవి వికారాబాద్ డిపో వద్ద గేట్ మీటింగ్ అనంతగిరి: నష్టాల్లో ఉన్న డిపోను లాభాల్లోకి తీసుకురావడానికి డిపో కార్మికులు, ఉద్యోగులు సమష్టిగా కృషి చేయాలని ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్ మేనేజర్ శ్రీదేవి సూచించారు. బుధవారం ఆమె వికారాబాద్ డిపోను సందర్శించారు. ఉద్యోగులతో గేటు మీటింగ్ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రూ.1.50 కోట్ల నష్టాల్లో ఉన్న వికారాబాద్ డిపోను అందరం సమర్థవంతంగా పనిచేసి లాభాల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఉద్యోగి మరింత బాధ్యతగా పనిచేయాలని సూచించారు. పెయి డ్ ప్యాసింజర్ను పెంచుకోవాలని, స్పెషల్ హైర్ బుకింగ్స్ పెంచుకోవాలని యాత్ర దానం స్పెషల్ బుకింగ్ లాంటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం డిపో ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎంఓ సరస్వతి, వికారాబాద్ డీఎం నమ్రత, షెడ్యూల్ సీఐ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరు ఘటనల్లో ముగ్గురు అదృశ్యం
శంకర్పల్లి: వెల్డింగ్ కార్మికుడు అదృశ్యమైన ఘటన మోకిల ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్రెడ్డి తెలిపిన ప్రకారం.. కేరళం రాష్ట్రానికి చెందిన అనిల్కుమార్(45) బతుకుదెరువు నిమిత్తం మోకిలకు వచ్చాడు. మిత్రుడు హేమంత్తో కలిసి ఉంటూ కొండకల్ అపర్ణ కంపెనీలో వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. హేమంత్ ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బుధవారం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. అదృశ్యమైన బాలిక తిరుపతిలో ఉన్నానని ఫోన్ పహాడీషరీఫ్: మానసిక స్థితి సరిగ్గా లేక ఐదు నెలల క్రితం అదృశ్యమైన ఓ బాలిక, తాను తిరుపతిలో ఉన్నట్లు రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. బాలాపూర్ ఎస్ఐ సోహెల్ తెలిపిన ప్రకారం.. కాచిగూడ నింబోలి అడ్డాకు చెందిన రాజు కుమార్తె పూజ(17)కు మానసిక స్థితి సరిగ్గా లేదు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ రిఫరెన్స్తో ఈ ఏడాది మార్చి మొదటివారం షాహిన్నగర్ సమీపంలోని ఐఎఫ్టీ బాలికల హోమ్లో చేర్పించారు. ఇదే నెల 10న బాలిక ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. హోమ్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక ఆచూకీ తెలిస్తే బాలాపూర్ పీఎస్లో లేదా 87126 62366 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. కుటుంబ కలహాలతో యువకుడు.. మాడ్గుల: కుటుంబ కలహాల కారణంగా ఓ యువకుడు అదృశ్యమైన ఘటన మాడ్గుల ఠాణా పరిధిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. సీఐ వేణుగోపాల్రావు తెలిపిన ప్రకారం.. చాంద్రాయణపల్లికి చెందిన మానుపాటి నరేశ్(24)కు మూడేళ్ల క్రితం వివాహమైంది. దంపతుల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆగస్టు 3వ తేదీన సాయంత్రం జరిగిన గొడవలో మనస్థాపంతో నరేశ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో నరేశ్ తల్లి వెంకటమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది. -
ఉపాధి పథకం ఎత్తివేతకు కుట్ర
● రాష్ట్రాల వాటా ఉపసంహరించుకోవాలి ● స్పీకర్ ప్రసాద్ కుమార్ డిమాండ్ బంట్వారం: ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆరోపించారు. బుధవారం బంట్వారం, కోట్పల్లిలో మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనతో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సర్కారు ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. వలసల నివారణ కోసం కాంగ్రెస్ తెచ్చిన ఈ పథకం పేరు మార్చడం సరికాదన్నారు. రాష్ట్రాల చెల్లింపు వాటా 40 శాతాన్ని ఉప సంహరించుకోవడంతోపాటు పాత పేరును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకున్నా ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామన్నారు. కేసీఆర్ చేసిన అప్పులు రూ.8.25 లక్షల కోట్లకు నెలనెలా రూ.6,500 కోట్ల వడ్డీ కడుతున్నట్లు తెలిపారు. అయినా సంక్షేమం, అభివృద్ధి ఆపడం లేదన్నారు. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన పేదలందరికీ పథకాలు వర్తింపజేస్తున్నట్లు వెల్లడించారు. అంతకుముందు ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. విద్యుత్ సమస్యపై సర్పంచ్లు మల్లేశం, గోరేమియ, సంజీవులు ట్రాన్స్కో ఇన్చార్జ్ ఏఈని నిలదీశారు. సమస్య చెబుదామని ఫోన్ చేస్తే స్పందించరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ నచ్చజెప్పి సదరు ఏఈని మందలించారు. వెంటనే సమస్యల పరిష్కారాని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్రెడ్డి, జెడ్పీ సీఈఓ సుధీర్, ఎంపీడీఓలు రాములు, హేమంత్, తహసీల్దార్లు విజయ్ కుమార్, ఆనంద్ రావు, డీఎస్పీ అంజయ్య, ఎంపీఓలు నాగరాజు, సురేందర్రెడ్డి, పీఆర్ డీఈ శ్రీనివాస్, ఏఓలు కరణాకర్రెడ్డి, శ్రావ్య, హార్టీకల్చర్ ఆఫీసర్ కమల, మెడికల్ ఆఫీసర్లు మజీద్ ఖాన్, మేఘన తదితరులు పాల్గొన్నారు. -
తప్పుడు నివేదికతో తప్పించారు
బషీరాబాద్: సీ్త్రనిధి రుణాల బకాయిలను వసూలు చేసి దుర్వినియోగం చేశారంటూ తమపై సస్పెన్షన్ వేటు వేయడం వెనక ఆడిటర్ల తప్పుడు నివేదికలే కారణమని ఎక్మాయి గ్రామ మహిళా సమాఖ్య వీఏఓలు స్వప్న, వాణీశ్రీ ఆరోపించారు. తాము వసూలు చేసిన డబ్బులను సీ్త్రనిధి ఖాతాల్లో జమ చేసినప్పటికీ వాటిని లెక్కల్లో చూపకుండా, మహిళల వద్ద ఉన్న మొండి బకాయిలను తమపై మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఎక్మాయిలో విలేకరులతో మాట్లాడుతూ.. కన్నీటి పర్యంతమయ్యారు. డబ్బులు వాడుకున్నట్లు రాయించుకున్నారు ఎక్మాయి గ్రామ సమాఖ్య వీఏఓ– 1 స్వప్న మాట్లాడుతూ.. తన పేరుపై రూ.4.58 లక్షల బకాయి చూపించారని తెలిపారు. అందులో రూ.2 లక్షలను జూలై నెలలోనే సీ్త్రనిధి ఖాతాలో జమ చేశానని చెప్పారు. మిగిలిన రూ.2.58 లక్షలు ఏడు సంఘాలకు చెందిన ఎనిమిది మంది మహిళల వద్ద మొండి బకాయిలుగా ఉన్నాయని వివరించారు. ఖాతాలో జమ చేసిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోకుండా తానే డబ్బులు వాడుకున్నట్లు లేఖ రాయించుకుని ఆడిటర్ సంగీత అన్యాయం చేశారని ఆరోపించారు. మొండిబకాయిలను లెక్క చూపారు వీఏఓ– 2 వాణీశ్రీ మాట్లాడుతూ.. తన పేరుపై రూ.3.05 లక్షల బకాయి ఉన్నట్లు ఆడిటర్ సంగీత బలవంతంగా లేఖ రాయించుకున్నారని ఆరోపించారు. తాను ఇప్పటికే రూ.1.74 లక్షలను సీ్త్రనిధి ఖాతా నంబర్ 79005829606లో జమ చేశానని తెలిపారు. మిగిలిన మొత్తం బాలాజీ, అర్చన పొదుపు సంఘాలకు చెందిన మహిళల వద్ద మొండి బకాయిలు ఉందని వివరించారు. సీసీ నిర్లక్ష్యమే.. బకాయిల వసూళ్లలో జాప్యానికి అప్పటి కమ్యూనిటీ కోఆర్డినేటర్ (సీసీ) రాములు నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఇద్దరు వీఏఓలు ఆరోపించారు. పలుమార్లు సమాచారం ఇచ్చినా మూడు నెలల వ్యవధిలో ఒక్కరోజు కూడా గ్రామానికి వచ్చి వసూళ్లపై దృష్టి పెట్టలేదని పేర్కొన్నారు. ఆడిట్ అధికారులు, సీ్త్రనిధి యాజమాన్యం వాస్తవాలను పక్కనపెట్టి తమపై చర్యలు తీసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము జమ చేసిన మొత్తాలకు సంబంధించిన బ్యాంకు రశీదులు, లావాదేవీల ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ వ్యవహారంపై పునర్విచారణ జరిపి న్యాయం చేయాలని, లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టంచేశారు. సూత్రధారి సీసీ రాములేనా..? ఈ వ్యవహారంలో అప్పటి సీసీ రాములే ప్రధాన సూత్రధారి అనే చర్చ ఐకేపీ వర్గాల్లో సాగుతోంది. విధుల పట్ల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపాలతో పాటు ఓ మహిళా సీసీతో సన్నిహితంగా ఉంటూ అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ అతన్ని విధుల నుంచి తొలగించారు. దీంతో ఎక్మాయి సీ్త్రనిధి వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. పునర్విచారణ ద్వారా వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత వీఏఓలు కోరుతున్నారు. సీ్త్రనిధి అక్రమాలపై వీఏఓల ఆవేదన ఖాతాలో జమచేసిన డబ్బులు లెక్కల్లో చూపలేదని వెల్లడి రశీదులు, ఆధారాలు ఉన్నాయని, అవసరమైతే న్యాయ పోరాటానికి సిద్ధమని ప్రకటన పెండింగ్ మొండి బకాయిలను తమపై మోపారని కన్నీటి పర్యంతం సీసీ నిర్లక్ష్యమే వీటన్నింటికీ కారణమని ఆరోపణ -
నావంద్గీ సొసైటీలో కలకలం
బషీరాబాద్: నావంద్గీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)లో గోల్డ్ లోన్ మంజూరు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సంఘం బ్యాంకుకు చెందిన ఓ ఉద్యోగికి నిబంధనలకు విరుద్ధంగా బంగారు రుణం మంజూరు చేసినట్లు అనుమానం రావడంతో బుధవారం సొసైటీ చైర్మన్ వెంకట్రామ్రెడ్డి జిల్లా సహకార అధికారి (డీసీఓ)కు ఫిర్యాదు చేశారు. దీంతో డీసీఓ ఆదేశాల మేరకు లక్ష్మీనారాయణపూర్ డీసీసీబీ బ్యాంకు మేనేజర్ డి.మమత సొసైటీలో విచారణ చేపట్టారు. యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ డీసీసీబీ బ్యాంకులో కలెక్షన్ అధికారిగా పనిచేస్తున్న పి.రాములు ఈ నెల 4న నావంద్గీ సొసైటీలో బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రూ.3.50 లక్షల రుణం పొందాడు. అయితే ఈ రుణం మంజూరులో నిబంధనలు పాటించలేదనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా అప్రైజర్ ద్వారా బంగారం విలువ నిర్ధారణ చేయకుండానే సీఈఓ వెంకటయ్య రుణం మంజూరు చేసినట్లు తేలింది. ఫిర్యాదుకు ముందు చైర్మన్ వెంకట్రామ్రెడ్డి సొసైటీ లాకర్, స్ట్రాంగ్రూమ్ను సీజ్ చేశారు. విచారణకు వచ్చిన లక్ష్మీనారాయణపూర్ డీసీసీబీ బ్యాంకు మేనేజర్ డి.మమత లాకర్లో ఉన్న 510 గోల్డ్ లోన్ ఖాతాలు, వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. విచారణలో పి.రాములు గతంలో మే 7న కూడా ఇదే సొసైటీ నుంచి రూ.3.50 లక్షల గోల్డ్ లోన్ తీసుకున్నట్లు గుర్తించారు. అనంతరం జులై 4న రుణాన్ని చెల్లించి, తిరిగి ఈ నెల 4న మరోసారి అదే మొత్తంలో రుణం పొందినట్లు రికార్డుల్లో తేలింది. విచారణ అనంతరం డి.మమత మాట్లాడుతూ.. గోల్డ్ లోన్ మంజూరుకు ముందు అప్రైజర్ వేదాంతచారి బంగారు ఆభరణాలను పరిశీలించి విలువ నిర్ధారించడం తప్పనిసరి అని తెలిపారు. అయితే సంబంధిత రుణం విషయంలో అప్రైజర్ పరిశీలన లేకుండానే సీఈఓ వెంకటయ్య రూ.3.50 లక్షల రుణాన్ని మంజూరు చేసినట్లు గుర్తించినట్లు చెప్పారు. ఇది సహకార సంఘాల నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని వెల్లడించారు. ఈ వ్యవహారం అనుమానాస్పదంగా ఉండటంతోనే అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చైర్మన్ వెంకట్రామ్రెడ్డి తెలిపారు. విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని సహకార వర్గాలు తెలిపాయి. ఉద్యోగికి బంగారు రుణంపై అనుమానాలు డీసీఓకు చైర్మన్ ఫిర్యాదు.. లాకర్ సీజ్ విచారణ జరిపిన డీసీసీబీ మేనేజర్ నిబంధనల ప్రకారం రుణం ఇవ్వలేదని తేటతెల్లం -
అరుణాచలం ఆర్టీసీ సర్వీసు హర్షణీయం
తాండూరు టౌన్: తాండూరు డిపో నుంచి తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంకు బస్సు నడపడం అభినందనీయమని పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ అన్నారు. మంగళవారం ఆమె తొలి సర్వీస్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించిందన్నారు. భక్తుల కోసం తాండూరు నుంచి అరుణాచలంకు బస్సు సర్వీసు నడపడం హర్షణీయమన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం డిపో మేనేజర్ ప్రవీ ణ్కుమార్ మాట్లాడుతూ.. అరుణాచలం ఆధ్యాత్మిక టూర్ పేరుతో భక్తుల కోసం ఈ సౌకర్యాన్ని కల్పించామన్నారు. భక్తులకు కాణిపాకంలోని వరసిద్ధి వినాయక ఆలయం, వెల్లూర్లోని గోల్డెన్ టెంపుల్తో పాటు అరుణాచలేశ్వర స్వామి వారి దర్శనం కల్పిస్తామన్నారు. ఫుల్ టికెట్ రూ.3,600, హాఫ్ టికెట్ రూ.2వేలు ఉంటుందన్నారు. ఇందుకు భక్తులు ముందస్తుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని కోరారు. వివరాలకు 9948947422, 8309348157 నంబర్లలో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్రెడ్డి, ట్రాఫిక్ ఇన్చార్జి వెంకటేశం, ఆర్టీసి అధికారులు తదితరులు పాల్గొన్నారు. తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ నీరజ -
వాము సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం
● ఎకరాకు రూ.8 వేల సబ్సిడీ ● రైతులు ముందుకు రావాలి ● జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి సత్తార్ అనంతగిరి: ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వాము సాగును ప్రోత్సహిస్తున్నట్లు ఆ శాఖ జిల్లా అధికారి ఎంఏ సత్తార్ మంగళవారం తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు ముందుకు వస్తే ఎకరాకు ప్రభుత్వం రూ.8వేల సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. వాము పంటకు ఏడాది పొడవునా మంచి డిమాండ్ ఉంటుందన్నారు. ఔషధ, మసాలా పరిశ్రమలు పంట దిగుబడిని కొంటాయని తెలిపారు. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటి అవసరంతో పంట చేతికి వస్తుందని, అధిక ఆదాయం పొందచ్చని తెలిపారు. ప్రస్తుతం సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకం కింద వాము సాగు చేసే రైతులకు ఎకరాకు రూ.8 వేల చొప్పున, గరిష్టంగా 5 ఎకరాల వరకు ఆర్థిక సహాయం అందించనున్నుట్ల వివరించారు. వాము సాగుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. తక్కువ నీటితో పంట చేతికొస్తుందన్నారు. స్వల్ప కాల వ్యవధిలో (120 – 150 రోజులు) పంట కోతకు వస్తుంది. ఔషధ, మసాలా పరిశ్రమల్లో డిమాండ్ ఉంటుంది. నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉండటం వల్ల రైతులు అనుకూల ధరకు విక్రయించుకునే అవకాశం ఉంటుంది. వర్షాధార ప్రాంతాల్లో కూడా విజయవంతంగా సాగు చేయవచ్చు. పంటల మార్పిడి విధానంలో అనుకూలమైన పంట. సాగు విధానం ● నీటి పారుదల కలిగిన ఎర్ర నేలలు, ఇసుక, మిశ్రమ నేలలు అనుకూలం ● ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు విత్తడం ఉత్తమం ● ఎకరాకు సుమారు 2.5 కిలోల నాణ్యమైన విత్తనం అవసరం ● వరుసల మధ్య 30 సెం.మీ., మొక్కల మధ్య 10 –15 సెం.మీ. దూరం పాటించాలి. ● భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. ● ప్రారంభ దశలో కలుపు నివారణ, అవసరమైన సమయంలో తేలిక పాటి నీటి పారుదల కల్పించాలి. ● సమగ్ర చీడపీడల యాజమాన్య పద్ధతులను అ నుసరిస్తే మంచి దిగుబడి, నాణ్యత లభిస్తుంది. ● గత సంవత్సరం ఈ పథకం కింద వాము సాగుకు సబ్సిడీ పొందిన రైతులు ఈ సంవత్సరం అర్హులు కారు. పరిమిత లక్ష్యాల మేరకు ముందుగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన రైతులకు ప్రాధాన్యత కల్పిస్తాం. దరఖాస్తుకు అవసరమైన పత్రాలు ● పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ ఖాతా బుక్ మొదటి పేజీ జిరాక్స్, పాస్పోర్ట్ సైజు ఫొటో ● అర్హులైన రైతులు సంబంధించిన మండల ఉద్యాన శాఖ అధికారిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. -
దంచికొట్టిన వాన
కొడంగల్: మండల వ్యాప్తంగా సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలో ఎడ్యుకేషన్ హబ్లో నిర్మాణంలో ఉన్న డీగ్రీ కళాశాలలోకి భారీగా వరద చేరడంతో పనులకు అంతరాయం ఏర్పడింది. ధారూరులో 32.5 మి.మీల వర్షపాతం ధారూరు: మండలంలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 32.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తహసీల్దార్ సాజిదాబేగం తెలిపారు. జిల్లాలోని కొడంగల్లో అత్యధికంగా 108.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా మర్పల్లిలో 1.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎబ్బనూర్ చెరువు పూర్తిగా నిండిపోగా కోట్పల్లి ప్రాజెక్టులో 22 అడుగుల వరకు నీరు చేరింది. మరో రెండు అడుగుల నీరు చేరితే ప్రాజెక్టు పూర్తిగా నిండిపోతుంది. పొంగిపొర్గిన వాగులు, వంకలు -
చరాస్తులను జప్తు చేయండి
అనంతగిరి: వికారాబాద్లో నాలుగు దశాబ్దాలుగా సాగుతున్న ఓ భూ పరిహారం కేసు సంచలన మలుపు తిరిగింది. బాధిత రైతు శశాంక్రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ రైతుకు చెల్లించాల్సిన రూ.61.29 లక్షల పరిహారం అందించకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన వికారాబాద్ సీనియర్ సివిల్ కోర్టు ఏకంగా ఆర్డీఓ కార్యాలయంలోని చరాస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. దీంతో మంగళవారం కోర్టు కార్యాలయానికి చేరుకుని జప్తు ప్రక్రియ చేపట్టి జప్తు వస్తువులను తిరిగి కార్యాలయ కస్టడీకి అప్పగించారని తెలిపారు. కాగా అధికారులు మరింత గడువు కావాలని కోరడంతోపాటు విషయాన్ని ఉన్నతాధికారులకు, రైల్వే శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. 1986– 87 సంవత్సంలో పట్టణంలోని రైల్వే లైన్ కోసం రైతు శశాకాంక్రెడ్డి కుటుంబానికి చెందిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అప్పట్లో గజానికి రూ.50 మాత్రమే పరిహారం నిర్ణయించారు. దీనిపై బాధిత రైతు కోర్టును ఆశ్రయించగా ఇటు బాధితుడు అటు ప్రభుత్వం మధ్య జిల్లా, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం కొనసాగింది. చివరికి గజానికి రూ.125 చొప్పున పరిహారం పొందే హక్కును బాధిత రైతు సాధించుకున్నారు. ఈ విషయంలో 2018లో పరిహారం కోసం సీనియర్ సివిల్ కోర్టులో ఈపీ దాఖలుచేశారు. కాగా సంవత్సరం క్రితం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో కార్యాలయాలనికి వచ్చినపుడల్లా అధికారులు గడువు కోరుతున్నారని, పరిహారం ఇవ్వడం లేదని రైతు శశాంక్రెడ్డి తెలిపారు. వికారాబాద్ సీనియర్సివిల్ కోర్టు ఆదేశం భూనిర్వాసితుడికి పరిహారం చెల్లింపులో జాప్యంపై అసంతృప్తి -
తాగునీటికి అధిక ప్రాధాన్యత
మోమిన్పేట: జిల్లాలో తాగు, సాగునీటి కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తెలిపారు. మంగళవారం మోమిన్పేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో తాగునీటి అవసరాల కోసం రూ.10 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఏ గ్రామంలో కూడా నీటి సమస్య ఉండొద్దన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు తెస్తే గత ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్తో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాకు నీరిచ్చే అవకాశం లేదన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి జూరాల నుంచి జిల్లాకు సాగునీరు ఇవ్వాలని కోరామన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. నియోజకవర్గంలో రూ.300 కోట్లతో ఆర్అండ్బీ రోడ్లు వేస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ శాఖ ఏఈఈ అందుబాటులో ఉండడం లేదని, ఫోన్ చేసినా స్పందించడం లేదని పలువురు సర్పంచులు సభ దృష్టికి తెచ్చారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని ఫిర్యాదు చేశారు. అధికారుల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచులు ఫోన్ చేస్తే స్పందించాలని సూచించారు. మన ఊరు – మన బడి పథకం కింద చేసిన పనులకు దాదాపు రూ.25 లక్షల బిల్లు రావాల్సి ఉందని టేకులపల్లి సర్పంచ్ విష్ణువర్ధన్రెడ్డి సభ దృష్టికి తెచ్చారు. వెంటనే మంజూరయ్యేలా చూస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు. శిథిలావస్థకు చేరిన పాఠశాలల భవనాలను కూల్చి వేసేందుకు అనుమతులు ఇవ్వాలని ఎన్కేపల్లి సర్పంచ్ సురేందర్ కోరారు. అనంతరం కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ.. సర్పంచ్లు సభ దృష్టికి తెచ్చిన సమస్యలను 45 రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్రెడ్డి, జెడ్పీ సీఈఓ సుధీర్, మండల ప్రత్యేకాధికారి సదానందం, ఇన్చార్జ్ ఎంపీడీఓ రాజమల్లయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమ రంగాలకు పెద్దపీట మర్పల్లి: అభివృద్ధి, సంక్షేమ రంగాలకు సీఎం రేవంత్రెడ్డి భారీగా నిధులు సమకూరుస్తున్నట్లు స్పీకర్ ప్రసాద్కుమార్ తెలిపారు. మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రత్యేకాధికారి వెంకటకృష్ణారావు అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మర్పల్లి ఏఎంసీ చైర్మన్ మహేందర్ రెడ్డి, జెడ్పీ సీఈఓ సుధీర్, ఎంపీడీఓ శాంత, డీఎస్పీ అంజయ్య, పంచాయత్ రాజ్ శాఖ డీఈ శ్రీనివాస్, హార్టీకల్చర్ అధికారి అక్షిత రెడ్డి, పట్లూర్ పీహెచ్సీ డాక్టర్ మానస, ససర్పంచ్ రామేశ్వర్, ఈఓపీఆర్డీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జూరాల నుంచి జిల్లాకు సాగునీరు సీఎం సానుకూలంగా ఉన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ -
జేబు దొంగలకు రిమాండ్
మొయినాబాద్: ఇటీవల ఓ కార్యక్రమంలో పిక్పాకెటింగ్కు పాల్పడిన ఇద్దరు జేబు దొంగలను మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 2న మున్సిపాలిటీలోని జేపీఎల్ కన్వెన్షన్లో పట్నం రుక్కమ్మ దశదిన కర్మ కార్యక్రమం జరిగింది. దీనికి చాలా మంది ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో జేబుదొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. ఆరు మంది జేబుల్లో నుంచి నగదును దొంగించారు. వారంతా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వేర్వేరుగా కేసులు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. లంగర్హౌస్కు చెందిన మహ్మద్ షకీల్ అలియాస్ లంగ్డా అలియాస్ మోటా, పాతబస్తీకి చెందిన దేవరకొండ దుర్గారావు అలియాస్ శ్రీనులను సోమవారం అరెస్టు చేశారు. ఇద్దరిని మంగళవారం రిమాండ్కు తరలించారు. మరో నిందితుడు శ్రీరామ్ గోపి పరారీలో ఉన్నాడు. నిందితులపై నగరంలోని పలు పోలీస్స్టేషన్లలో దొంగతనాలు, చైన్స్నాచింగ్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
కక్షపూరిత రాజకీయాలు సరికాదు
● ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు భద్రత పునరుద్ధరించాలి ● బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ ఆర్యక్షత్రియపరిగి: రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేయడం సరికాదని బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ ఆర్యక్షత్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు భద్రత కుందింపునకు నిరసనగా మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు భద్రత కుదింపు రాజ్యాంగ విరుద్ధమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కక్షపూరితంగానే ఈ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నక్సల్స్, టెర్రరిస్టుల నుంచి ప్రమాదం ఉన్నందునే గత ప్రభుత్వాలు బుల్లెట్ ఫ్రూప్ వాహనం, భద్రతా సిబ్బందిని కల్పించాయని సర్కార్కు గుర్తుచేశారు. వెంటనే భద్రత పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, జిల్లా నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి, సురేందర్, పట్టణ అధ్యక్షుడు అంజయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ ముకుందఅశోక్కుమార్, జాక్ రవి, కృష్ణ, రవికుమార్, ఆంజనేయులు, ఆనంద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పనుల్లో వేగం పెంచండి
అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ కొడంగల్: దుద్యాల మండలం హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణాల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. మంగళవారం వివిధ విద్యాలయాల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని గురించి ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అవసరం అయితే కూలీల సంఖ్యను పెంచుకొని సకాలంలో నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎడ్యుకేషన్ హబ్ అధికారులు షఫీ, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ● ముగ్గురు రైతులకు నష్టం ● అధికారుల దర్యాప్తులో వెలుగులోకి యాలాల: మండలంలోని రాస్నం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఐకేపీ సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. రైతులు విక్రయించిన ధాన్యం డబ్బులు వారి ఖాతాల్లో జమ కాకపోవడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ధాన్యం సొమ్ము దారి మళ్లిందా? అనే శీర్షిక కథనం ప్రచురితమైంది. డీఆర్డీఏ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్, సీసీ శ్రీశైలం, అకౌంటెంట్ చిరంజీవి గ్రామంలో విచారణ చేపట్టారు. ఆరుగురు రైతులు తమ ధాన్యం డబ్బులు ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి జమ అయ్యాయని చేసిన నేపథ్యంలో కేంద్ర నిర్వాహకులు, వీఓఏను విచారించారు. ముగ్గురు రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం బిల్లుల చెల్లింపులకు సంబంధించి గ్రామ వీఓఏ ఓపీఎంఎస్ సైట్లో సకాలంలో నమోదు చేయకపోవడంతో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కాలేదు. గడువు ముగిసిపోవడంతో ఓపీఎంఎస్ సైట్ను రాష్ట్ర ప్రభుత్వం క్లోజ్ చేసింది. దీంతో బాధిత రైతులకు సంబంధించి సుమారు రూ.2 లక్షలకు పైగా ధాన్యం డబ్బులు కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, వీఓఏలు చెల్లించాల్సి ఉంటుందని ఏపీఎం శ్రీనివాస్ తెలిపారు. విచారణకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా అధికారులకు నివేదిక అందజేస్తామని, తదుపరి ఆదేశాల మేరకు సిబ్బందిపై చర్యలు ఉంటాయని ఏపీఎం తెలిపారు. కొడంగల్ రూరల్: పట్టణ పరిధి ఉడిమేశ్వరం గేటు సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్లో ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ బీ రామదాసు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6వ తేదీ ఉదయం 9.30 నుంచి స్పాట్ అడ్మిషన్లు ఉంటాయన్నారు. బాలుర విభాగంలో ఎంపీసీలో ఎస్సీ 8, మైనారిటీ 1 మొత్తం 9 సీట్లు ఖాళీ ఉన్నట్లు తెలిపారు. బైపీసీలో ఎస్సీ 1, ఎస్టీ 1, ఓసీ 1, మైనారిటీ 1 మొత్తం నాలుగు సీట్ల కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2025 – 26 విద్యా సంవత్సంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే అర్హులన్నారు. ఎస్ఎస్సీ మార్కుల మెమో, బోనాఫైడ్, కుల, ఆదాయ ధ్రువ పత్రాలతో ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్లతో హాజరుకావాలని తెలిపారు. కొడంగల్: మండలంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు నిండుగా ప్రవహించాయి. చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరింది. కుండపోత వానకు కంది, పత్తి, మినుము, పెసర పంట పొలాల్లో నీరు నిలిచింది. కొడంగల్, హస్నాబాద్, పెద్ద నందిగామ, పర్సాపూర్, అంగడిరాయిచూర్ నోటీఫైడ్ చెరువుల్లోకి నీరు చేరింది. చిట్లపల్లి నుంచి ఖాజాఅహ్మద్పల్లి, అన్నారం వెళ్లే దారిలో వాగు రోడ్డుపై నుంచి పొంగి ప్రవహించింది. ఖాజాఅహ్మద్పల్లి గ్రామస్తులకు రాకపోకలు నిలిచాయి. అంగడిరాయిచూర్ వాగు నిండుగా ప్రవహించింది. -
లిఫ్టు ఎక్కుతుండగా.. ఇరుక్కొని మహిళ మృతి
చందానగర్: అపార్ట్మెంట్ లిఫ్టులో ఇరుక్కొని ఓ మహిళ మృతి చెందిందని చందానగర్ పోలీసులు తెలిపారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్లకు చెందిన దాడి శ్రీనివాస్ నల్లగండ్లలోని అపర్ణ జినిత్లో సెక్యూరిటీ గార్డు. తన భార్య అనసూయ(43)తో కలిసి చందానగర్ అన్నపూర్ణ ఎన్క్లేవ్లోని చాట్వాజ్ మాన్షన్ అపార్ట్మెంట్లో ఉండే మేనమామ గోవింద్ వద్దకు వచ్చారు. రెండో అంతస్తుకు వెళ్లడానికి లిఫ్ట్లోకి అతను ఎక్కగానే, ఆమె కూడా అందులోకి వెళ్లడానికి ప్రయత్నించింది. ఒక్కసారిగా లిఫ్టు తలుపులు మూసుకొని పైఅంతస్తులకు దూసుకెళ్లింది. దీంతో ఆమె శారీర సగభాగం లిఫ్టు లోపల, మిగతా భాగం తలుపుల మధ్యలో ఇరుక్కుపోయింది. లిఫ్ట్ కొద్దిగా పైకి వెళ్లి ఆగిపోయింది. వెంటనే ఆమె భర్త కేకలు వేయడంతో హుటాహుటిన వచ్చిన అపార్ట్మెంట్ వాసులు లిఫ్టు తలుపులు తెరిచి ఆమెను బయటకు తీశారు. తీవ్ర గాయాలైన ఆమెను ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా, అప్పటికే మృతి చెందిందని వైద్యులు చెప్పారు. కేసు దర్యాప్తులో ఉంది. కాగా, సూచిక బోర్డులు పెట్టకుండా, విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా లిఫ్ట్కు మరమ్మతులు చేపట్టడంతోనే నిండు ప్రాణం బలి అయిందని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వెలుగులో రూ.12 లక్షల దోపిడీ!
బషీరాబాద్: పేద మహిళల ఆర్థిక అభివృద్ధికి అండగా నిలవాల్సిన ‘వెలుగు’ వ్యవస్థలోనే భారీ అక్రమాలు బయటపడ్డాయి. స్వయం సహాయక సంఘాల మహిళలు కష్టపడి చెల్లించిన సీ్త్ర నిధి రుణ వాయిదాలను బ్యాంకుల్లో జమ చేయకుండా సిబ్బంది దుర్వినియోగం చేశారు. ఎక్మాయి గ్రామంలోని 20 మహిళా సంఘాల సభ్యుల నుంచి వసూలు చేసిన సుమారు రూ.12 లక్షల మేర నిధులు గల్లంతైనట్లు ఆడిటింగ్లో తేలడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. మహిళల సొమ్మును స్వాహా చేసిన ఇద్దరు వీఏఓలపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వ్యవహారంలో పర్యవేక్షణ లోపాలపై ఉన్నతాధికారులు దృష్టిసారించినట్లు సమాచారం. 2020లో లోన్.. 2020లో సీ్త్రనిధి పథకం కింద ఏక్మాయికి చెందిన సుమారు 20 స్వయం సహాయక సంఘాల సభ్యులు రుణాలు పొందారు. అనంతరం గ్రామ స్థాయిలో పనిచేస్తున్న వీఏఓలకు ప్రతినెలా డబ్బులు చెల్లిస్తూ వచ్చారు. కానీ, ఈ మొత్తం సంబంధిత బ్యాంకు ఖాతాలకు చేరలేదు. ప్రాథమిక విచారణలో మహిళా సంఘాల సభ్యుల నుంచి వీఏఓ స్వరూప రూ.4,05,761, మరో వీఏఓ వాణిశ్రీ రూ.3,05,498 వసూలు చేసినట్లు రికార్డులు వెల్లడించాయి. ఈ మొత్తాన్ని బ్యాంకుల్లో జమ చేయలేదని ఎంకై ్వరీలో తేలింది. అంతేకాకుండా మరో రూ.4 లక్షలకు పైగా లావాదేవీలపై కూడా స్పష్టత లేకపోవడంతో పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. తాము చెల్లించిన మొత్తాన్ని కూడా రుణ బకాయిలుగానే చూపిస్తున్నారని పలువురు సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆడిటింగ్లో గుట్టు రట్టు జూలై 3న నిర్వహించిన ప్రత్యేక ఆడిట్లో అధికారులు సీ్త్ర నిధి రుణాల లావాదేవీలను పరిశీలించారు. రుణాలు తీసుకున్న మహిళలు క్రమం తప్పకుండా చెల్లింపులు చేస్తున్నప్పటికీ బ్యాంకు రికార్డుల్లో బకాయిలు కొనసాగుతుండటంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. మహిళా సంఘాల సభ్యుల వాంగ్మూలాలు, రశీదులు, బ్యాంకు లావాదేవీలను పరిశీలించగా వసూలు చేసిన నగదు బ్యాంకుల్లో జమ కాలేదని తేలింది. దీంతో విషయం జిల్లా అధికారుల దృష్టికి చేరింది. రంగంలోకి దిగిన సీ్త్ర నిధి ప్రత్యేక అధికారులు గ్రామంలో విచారణ చేపట్టారు. మహిళల నుంచి వివరాలు సేకరించి, చెల్లింపుల రికార్డులను పరిశీలించారు. వసూలైన డబ్బు లు బ్యాంకు ఖాతాలకు చేరకపోవడం, రఽశీదులు, ఖాతాల మధ్య వ్యత్యాసాలు ఉండటంతో అక్రమా లు జరిగినట్లు నిర్ధారించారు. అయితే తేడా వచ్చిన డబ్బులు తాము చెల్లిస్తామని ఇద్దరు వీఏఓలు ఆడిటింగ్ అధికారులకు రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. దీనిపై జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. ఇద్దరిపై వేటు విచారణ నివేదిక ఆధారంగా డీఆర్డీఓ శ్రీనివాస్ చర్యలు తీసుకున్నారు. వీఏఓలు స్వరూప, వాణిశ్రీని విధుల నుంచి తొలగిస్తూ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే తాము ఏ తప్పు చేయలేదని, ఎక్కడో జరిగిన పొరపాటు తమపై పడిందని స్వరూప, వాణిశ్రీ తెలిపారు. సీ్త్రనిధి రుణాల వసూళ్లలో భారీ అక్రమాలు మహిళల నుంచి డబ్బులు తీసుకుని బ్యాంకుల్లో జమ చేయని సిబ్బంది ఆడిటింగ్లో బయటపడిన అవకతవకలు ఇద్దరు వీఏఓలపై సస్పెన్షన్ వేటు ఏపీఎం, సీసీకి మెమోలుఈ కేసులో తనకు సంబంధం లేనట్లుగా వ్యవహరించిన బషీరాబాద్ ఏపీఎం పద్మారావు, ప్రస్తుతం ఎక్మాయిలో విధులు నిర్వహిస్తున్న సీసీ కవితకు సైతం డీఆర్డీఓ మెమోలు జారీ చేసినట్లు సమాచారం. రుణాల రికవరీలో అవకతవకలు తెలిసినా, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా, వాస్తవాలను దాచిపెట్టినట్లు వీరిపై ఆరోపణలున్నాయి. -
ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు
తాండూరు: ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని తాండూరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం వారు మున్సిపల్ కమిషనర్ రాకేశ్రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధి సర్వే నంబర్ 135లోని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. ప్రభుత్వ భూములు కాపాడాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ అండదండలతోనే అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని వాపోయారు. ఇప్పటికే సర్వేనెంబర్ 111 వివాదాస్పద భూమిలో పూర్తి స్థాయిలో ఆక్రమించి నిర్మాణాలు పూర్తి చేశారని తాజాగా సర్వేనెంబర్ 135లోను నిర్మాణాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు షేక్ ఇర్షద్, యోగానంద్, పార్టీ నాయకుడు సంతోష్గౌడ్ ఉన్నారు. చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు -
నేడు ప్లాట్ల పంపిణీ
● ఏర్పాట్లు పూర్తి చేసిన రెవెన్యూ అధికారులు ● పారిశ్రామిక వాడ భూ నిర్వాసితుల హర్షం కొడంగల్: దుద్యాల మండలంలో ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక వాడలో భాగంగా భూములు అప్పగించిన లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి, రోటిబండతండా, పులిచర్లకుంటతండా రైతులకు ప్లాట్లు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. హకీంపేట్ సమీపంలో సుమారు వంద ఎకరాల్లో ప్రత్యేకంగా రూపొందించిన డీటీసీపీ లేఔట్లో ఇళ్ల స్థలాలు పంపిణీకి రెడీ అయ్యాయి. 570 మందికి బుధవారం లక్కీడిప్ విధానంలో ప్లాట్లను కేటాయించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తాండూరు ఆర్డీఓ అనిత, స్థానిక తహసీల్దార్ కిషన్ తెలిపారు. కొడంగల్లోని బసిరెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించే కార్యక్రమానికి ప్లాట్ల జాబితాలో పేరున్న రైతులు హాజరు కావాలని సూచించారు. ఆధార్ కార్డు, రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకురావాలన్నారు. ఎకరా పట్టా భూమిని కోల్పోయిన ఒక్కో రైతుకు 150 గజాలు, ఎకరా అసైన్డ్ భూమిని ఇచ్చిన వారికి 120 గజాలు, అర ఎకరం లేదా అంతకంటే తక్కువ భూమి కోల్పోయిన వారికి 80 గజాల చొప్పున నివాస స్థలం ఇవ్వనున్నారు. ఎనిమిది ఎకరాలు ఇచ్చాం.. మా కుటుంబానికి సంబంధించి ఎనిమిదెకరాల భూమిని పారిశ్రామిక వాడ కోసం ప్రభుత్వానికి ఇచ్చాం. పరిహారం అందింది. బుధవారం ఇళ్ల స్థలాలు ఇస్తామని అధికారులు సమాచారం ఇచ్చారు. ఎకరానికి ఒకటి చొప్పున మాకు ఎనిమిది ప్లాట్లు వస్తాయి.. చాలా సంతోషంగా ఉంది. – దొరమోని అనంతమ్మ, హకీంపేట్ -
నకిలీ ఎరువులు విక్రయిస్తే చర్యలు
దోమ: నకిలీ ఎరువులు విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని ఎంపీడీఓ గ్యామా, వ్యవసాయాధికారి ప్రభాకర్ రావు, డీటీ నర్సింలు హెచ్చరించారు. మంగళవారం వారు మండల పరిధిలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు నకిలీ ఎరువులు విక్రయించేందుకు యత్నిస్తే ఉపేక్షించమన్నారు. ప్రభుత్వం గుర్తించిన నాణ్యమైన ఎరువులు, డీఏపీలు, విత్తనాలను మాత్రమే అందించాలని సూచించారు. ఈ కారక్రమంలో స్థానిక వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి మోమిన్పేట: ఇరవై ఏళ్లుగా ఉపాధి హామీ (వీబీజీరామ్జీ) పథకంలో పనిచేస్తున్న తమను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని పథకం సిబ్బంది కోరారు. ఈ మేరకు మంగళవారం శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు వినతిపత్రం అందజేశారు. గత నాలుగు నెలలుగా వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. పీఎఫ్, ఈఎస్ఐ, ఆరోగ్య బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడంతో పాటు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధి సిబ్బంది, ఫీల్డ్అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఎరువుల విక్రయాలకు ‘ఎఫ్ఎఫ్ఎస్’ వ్యవసాయ శాఖ ఏడీఏ అరుణ తాండూరు రూరల్: ఎరువుల విక్రయాల్లో పారదర్శకత, సమర్థత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన యాప్ వ్యవస్థను ప్రకటించిందని వ్యవసాయ శాఖ తాండూరు డివిజన్ ఏడీఏ అరుణ అన్నారు మంగళవారం ఆమె తన విలేకరులతో మాట్లాడుతూ.. భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎఫ్ఎఫ్ఎస్ (ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్) యాప్ను ప్రభుత్వం ప్రకటించిందన్నారు. జిల్లా వ్యాప్తంగా గురువారం(6వ తేదీ)నుంచి అమలులోకి వస్తోందని తెలిపారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రస్తుతం అమలులో ఉన్న ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ సేవలు ప్రభుత్వం నిలిపివేయనుందన్నారు. నూతన యాప్ ద్వారా రైతులు తమ ఆధార్ ఆధారిత ధృవీకరణతో సులభంగా ఎరువులు పొందవచ్చన్నారు. ఎఫ్ఎఫ్ఎస్ విధానం ద్వారా మీ సేవా కేంద్రాల్లోనూ ఎరువులు బుకింగ్ చేసుకోవచ్చన్నారు. ప్రతీ ఫర్టిలైజర్ దుకాణం వద్ద యాజమాన్యం స్వచ్ఛందంగా సేవకులను నియామించాలని ఆదేశించారు. నేడు బంట్వారానికి స్పీకర్ ప్రసాద్కుమార్ బంట్వారం: మండల కేంద్రంలో బుధవారం నిర్వహించే సర్వసభ్య సమావేశానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు ఎంపీడీఓ రాములు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. ప్రజా ప్రతినిధులు, ఆయా శాఖల అధి కారులు సకాలంలో హాజరు కావాలన్నారు. మండల అభివృద్ధిపై సమీక్ష ఉంటుందన్నారు. కోట్పల్లిలో.. కోట్పల్లి మండల సర్వసభ్య సమావేశం బుధవారం మధ్యాహ్న 2.30 గంటలకు ఉంటుందని ఎంపీడీఓ హేమంత్ తెలిపారు. ముఖ్య అతిథిగా స్పీకర్ ప్రసాద్కుమార్ హాజరవుతారన్నారు. సర్పంచ్లు, అధికారులు హాజరు కావాలని ఆయన కోరారు. టీచర్ డిప్యూటేషన్ రద్దుకు వినతి తాండూరు రూరల్: మండల పరిధిలోని సంగెంకలాన్ ప్రాథమికోన్నత పాఠశాలలో పని చేస్తున్న టీచర్ నాగలక్ష్మి డిప్యూటేషన్ను రద్దు చేయాలని గ్రామ సర్పంచు మీనాక్షి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్, డీఈఓను కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ– కర్ణాటక సరిహద్దులోని తమ గ్రామంలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు వంద మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. ఇక్కడ ఉపాధ్యాయుల కొరత ఉందని, ఈసమయంలో ఎలాంటి సమాచారం లేకుండా నాగలక్ష్మి అనే ఉపాధ్యాయురాలిని డిప్యూటేషన్పై దోమ మండలానికి పంపించారని తెలిపారు. వెంటనే ఆమె డిప్యూటేషన్ను రద్దు చేయాలని లేదంటే మరొకరినైనా నియమించాలని కోరారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి
డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్ బంట్వారం: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్ సూచించారు. మంగళవారం బంట్వారం పీహెచ్సీని సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అవుట్ పేషెంట్ల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. మందుల స్టాక్పై ఆరా తీశారు. సమస్యలు ఏమైనా ఉంటే చెప్పాలన్నారు. బాధ్యతగా పని చేసి వైద్య ఆరోగ్య శాఖ లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ మజీద్ ఖాన్, సీహెచ్ఓ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ వ్యవస్థపై నమ్మకం పెంచుదాం
అనంతగిరి: పోలీస్ వ్యవస్థపై నమ్మకం కలిగేలా సేవలందించాలని, స్టేషన్కు వచ్చే బాధిత మహిళలతో గౌరవంగా వ్యవహరించి ధైర్యం చెప్పాలని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. మంగళవారం వికారాబాద్లోని మహిళా పోలీస్ స్టేషన్ను సందర్శించారు. సిబ్బంది పనితీరు, కేసుల విచారణ, పురోగతి, బాధిత మహిళలకు అందుతున్న సేవలు, రికార్డుల నిర్వహణపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెండింగ్ కేసుల్లో వేగం పెంచి సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. మహిళలపై వేధింపులు, గృహహింస, వరకట్న వేధింపులు వంటి ఫిర్యాదులపై అత్యంత సున్నితంగా, వేగవంతంగా స్పందించాలన్నారు. ప్రతి ఫిర్యాదును చట్టపరంగా, నిష్పక్షపాతంగా విచారించి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల విచారణలో ఆలస్యం వహించరాదని, ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించడం, పూర్తిస్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజేష్ మీనా, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకట్రాం నాయక్, ఎస్సైలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెలా మొదటి బుధవారం నిర్వహించే సైబర్ జాగ్రోక్తా దివస్ కార్యక్రమంలో భాగగా జిల్లా వ్యాప్తంగా అన్ని పీఎస్ల పరిధిలో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ స్నేహమెహ్ర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా పోలీసులు పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, మార్కెట్ ప్రాంతాలు, జన సంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆమె తెలిపారు. ఆకస్మిక తనిఖీ ఎస్పీ కార్యాలయ ఆవరణలోని డీసీఆర్బీ కార్యాలయాన్ని ఎస్పీ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కేసుల రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల వివరాలు, నేర గణాంకాల నిర్వహణ, సీసీటీఎన్ఎస్లో కేసుల నమోదు విధానం, రికార్డుల భద్రపరిచే విధానం తదితర అంశాలను పరిశీలించారు. మహిళల కేసుల్లో సున్నితంగా వ్యవహరించాలి ఎస్పీ స్నేహ మెహ్ర -
బట్టి చదువులకు స్వస్తి పలకండి
తాండూరు: ప్రైవేటు విద్యా సంస్థల్లో బట్టి చదువులకు స్వస్తి పలికి మానసిన వ్యక్తిత్వ వికాస విలువలతో కూడిన విద్యా భోధనను విద్యార్థులకు అందించాలని బీసీ కమిషన్ రాష్ట్ర మాజీ సభ్యుడు శుభప్రద్పటేల్ అన్నారు. మంగళవారం ఆయన ఎన్ఎస్మీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తాండూరు అధ్యక్షుడు మోహన్కృష్ణగౌడ్, గౌరవ అధ్యక్షులు కీర్తి శర్మ, ఉపాధ్యక్షుడు అబ్దుల్ వహీద్, కార్యదర్శి వెంకటేశం, సంయుక్త కార్యదర్శి సునీత, కోశాధికారి రమేశ్గౌడ్, సలహాదారు సోహెల్ఉమ్రిలను సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులకు పాఠశాల బోధనకే పరిమితం చేయకుండా నైతిక విలువలు, క్రమశిక్షణ, కుటుంబ బాంధవ్యాల ప్రాముఖ్యతను వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు భానుప్రసాద్, మహేశ్, శేఖర్, సాయి, మనోహర్, తదితరులు పాల్గొన్నారు. బీసీ కమిషన్ రాష్ట్ర మాజీ సభ్యుడు శుభప్రద్పటేల్ -
వసూళ్ల పర్వం!
ఆర్టీఏ కార్యాలయంలో అంతులేని అవినీతి ● ఒక్కో పనికి ఒక్కో రేటు ● వాహనాలు చూడకుండానే ఫిట్నెస్ సర్టిఫికెట్లు ● ఏజెంట్లను నియమించుకొని దండుకుంటున్న వైనం ● రవాణా శాఖ మంత్రి దృష్టికి కరప్షన్ భాగోతం వికారాబాద్: ఆర్టీఏ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. ప్రభుత్వం నిర్ణయించిన రుసుంకు ఏ ఒక్క సేవ కూడా అందడం లేదు. కొన్ని పనులకు రెండింతలు, మరికొన్నింటికి ఐదింతలు దండుకొంటున్నారు. ద్విచక్ర, ఫోర్ వీలర్ లైసెన్సులు, వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ ఇలా ఏ పని కావాలన్నా కార్యాలయంలోని అధికారులను ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఏజెంట్లను నియమించుకొని దందాకు పాల్పడుతున్నారు. ఇటీవల ఈ వ్యవహారం రవాణా శాఖ మంత్రి వరకు వెళ్లినట్లు తెలిసింది. కొంత మంది బ్రోకర్లు.. ఆర్టీఏ అధికారుల మధ్య పంపకాల వివాదం తలెత్తి చివరకు మంత్రిని కలిసి ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. డీటీఓ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ బీజేపీ నేతలు బాధితులతో కలిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు ఫిర్యాదు చేశారు. ఆర్టీఏ అవినీతిపై ఏసీబీ అధికారులు సైతం నిఘా పెట్టినట్టు సమాచారం. ఇటీవల కుల్కచర్ల మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన కనకం మైబమ్మ ట్రాక్టర్ కొనుగోలు చేసింది. దాన్ని వ్యవసాయ అవసరాల నిమిత్తం రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంది. భూమి లేదనే కారణంతో ఆర్టీఏ అధికారులు రిజక్ట్ చేశారు. అయితే మైబమ్మ భర్త పేరిట ఏడెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ విషయాన్ని సదరు మహిళ అధికారుల దృష్టికి తెచ్చినా వారు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. రేటు ఫిక్స్ చేసి.. ఆర్టీఏ అధికారులు ఒక్కో పనికి ఒక్కో రేటు ఫిక్స్ చేశారు. బ్రోకర్ల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్నెస్, లెర్నింగ్ లైసెన్స్, లైసెన్స్, ట్రయల్ రన్ ఇలా ఒక్కో పనికి ఒక్కో రేటు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం టూ వీలర్ లెర్నింగ్ లైసెన్స్కు రూ.300, ట్రయల్ రన్కు రూ.1,200, ఫోర్ వీలర్(కారు)లెర్నింగ్కు రూ.450, ట్రయల్ రన్కు రూ.1,350 రుసుం వసూలు చేయాలి. అలాగే ఆటో ఫిట్నెస్ సర్టిఫికెట్కు రూ.800, క్యాబ్ వెహికల్కు రూ.1,000, లారీకి రూ.1,200 తీసుకోవాలి. కానీ ఆటోకు రూ.2 వేలు, లారీకి రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు దండుకొంటున్నారు. డబ్బులు ఎక్కువ ఇస్తే వీడియో కాల్లో వాహనాన్ని చూసి ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వెళితే ముందుగా కౌంటర్ వేసి ప్రాసెస్ను ప్రారంభిస్తారు. కౌంటర్ వేయడానికి డీటీఓ సంతకం చేయాలి. ఇక్కడి నుంచే వసూళ్ల పర్వం ప్రారంభమవుతుంది. ఆర్డర్కు రూ.1,000, కౌంటర్కు రూ.300, ఏఓకు రూ.500, వాహనాన్ని చెక్ చేసే ఇన్స్పెక్టర్కు రూ.600, వాహనం చూపించిన కానిస్టేబుల్కు రూ.200 ఇవ్వాల్సిందే. వ్యవసాయ ట్రాక్టర్ రిజిస్ట్రేషన్కు రూ.1,500 రుసుం చెల్లించాలి. కానీ రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే కొర్రీలు పెట్టి తిప్పి పంపుతున్నారు. జిల్లాలో మూడు చోట్ల(వికారాబాద్, పరిగి, తాండూరు) ఆర్టీఏ కార్యాలయాలు ఉన్నాయి. పరిగిలో మాత్రమే టెస్ట్ డ్రైవింగ్ ట్రాక్ ఉంది. వికారాబాద్, తాండూరులో బహిరంగ ప్రదేశాల్లో డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి లైసెన్సులు జారీ చేస్తున్నారు. దీంతో వచ్చీరాని డ్రైవింగ్తో పలువురు రోడ్లపైకి వాహనాలతో వచ్చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 1.3లక్షల వాహనాలు ఉండగా ఏటా ప్రభుత్వానికి రూ.కోట్లలో ఆదాయం సమకూరుతోంది.ప్రభుత్వ నిబంధనల మేరకే ఆర్టీఏ సేవలు అందేలా చూస్తున్నాం. రైతు పేరిట ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ చేయాలంటే కచ్చితంగా సదరు వ్యక్తి పేరిట భూమి ఉండాలి. కుటుంబ సభ్యుల పేరిట భూమి ఉంటే రిజిస్ట్రేషన్ చేయడం సాధ్యం కాదు. ఆర్టీఏ సేవల కోసం ఎవరూ బ్రోకర్ల వద్దకు వెళ్లరాదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రుసుం చెల్లించి సేవలు పొందాలి. – సుభాష్రెడ్డి, డీటీఓ, వికారాబాద్ -
నిషేధిత జాబితా నుంచి తీసేయండి
అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు డీటీసీపీ అనుమతులు ఉన్న సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో తప్పుగా నమోదు చేయడం జరిగిందని, వాటిని తీసేయాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు. సోమవారం బాధితులతో కలిసి కలెక్టర్ దీపక్ తివారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని అనుమతులు ఉన్న పలు సర్వే నంబర్లను పీఓపీలో పెట్టడంతో ప్రజలు క్రయ, విక్రయాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ తప్పు జరిగిందో వెంటనే గుర్తించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బాధితులు, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లకు ప్రతిపాదనలు పంపండి
అనంతగిరి: రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారి జాబితాను ఈ నెల 15వ తేదీలోగా పంపాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. మొదటి విడతలో మంజూరై పనులు ప్రారంభించని వాటిని రద్దు చేసి వాటి స్థానంలో కొత్త ప్రతిపాదనలు పంపాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అన్ని మండలాల ఎంపీడీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హుల జాబితాను పంపాలని ఆదేశించారు. కొడంగల్ నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలన్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని తెలిపారు. వర్షాలు పడుతున్నందున వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, హౌసింగ్ పీడీ ముక్రం బాబా, డీఆర్డీఏ శ్రీనివాస్, డీపీఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు. సర్ వేగవంతానికి చర్యలు నిర్ణీత గడువులోగా సర్ ప్రక్రియను పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 78శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్లు పేర్కొన్నారు. సోమవారం నగరం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియపై కలెక్టర్ ఎన్నికల ఎన్నికల అధికారికి వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకటాచారి, మున్సిపల్ కమిషనర్ విక్రమ్సింహారెడ్డి, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ నెమత్ అలీ తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణికి 110 వినతులు ప్రజావాణి అర్జీలను పెండింగ్లో ఉంచరాదని, సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 110 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, ట్రైయినీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టుర్, జెడ్పీ సీఈఓ సుధీర్, డీఆర్ఓ స్వర్ణలత, డీఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సభ్యత్వం కార్డు అందజేత రెడ్ క్రాస్ సొసైటీలో కలెక్టర్ దీపక్ తివారి సభ్యత్వం తీసుకోవడంతో ఇందుకు సంబంధించిన కార్డును ఆ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి అందజేశారు. సోమవారం కలెక్టరేట్లో కలిసి కార్డును అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, ట్రైయినీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూర్ తదితరులు పాల్గొన్నారు. 15లోగా అర్హుల జాబితా అందాలి కలెక్టర్ దీపక్ తివారి -
నేర నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం
అనంతగిరి: నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని ఏఎస్పీ రాజేష్ మీనా అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు, పర్యవేక్షణ, విస్తరణ చర్యలపై సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ పోలీస్ స్టేషన్ల వారీగా సీసీ కెమెరాలను ఆయా పీఎస్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. నేరాల నియంత్రణ, కేసుల ఛేదన, ప్రజల భద్రతలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ప్రతి పీఎస్ పరిధిలో నిఘా నేత్రాల సంఖ్యను మరింత పెంచేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించాలన్నారు. కార్యక్రమంలో డీటీసీ డీఎస్పీ శ్రీనివాస్, డీసీఆర్బీ డీఎస్పీ జానయ్య, తాండూరు డీఎస్పీ యాదయ్య, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ స్నేహ మెహ్ర ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. బాధితుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని ఆమె తెలిపారు.ఏఎస్పీ రాజేష్ మీనా -
మండలాల వారీగా విడుదలైన నిధులు
బషీరాబాద్: గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. 2024 – 25 సంవత్సరానికి గాను జిల్లాలోని 594(16 గ్రామాలు మినహా) జీపీలకు రూ.24.23 కోట్లు జమయ్యాయి. ఈ నిధులను తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించనున్నారు. కొన్ని నెలలుగా గ్రామ పంచాయతీలు రోజువారీ నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తాగునీటి మోటార్ల మరమ్మతులు, విద్యుత్ బిల్లుల చెల్లింపులు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు, చెత్త సేకరణ వాహనాల నిర్వహణ వంటి పనులకు నిధుల కొరత ఏర్పడింది. తాజాగా విడుదలైన గ్రాంట్లతో గ్రామాల్లో అత్యవసర పనులకు కొంత మేర పరిష్కారం లభించనుంది. ప్రధానంగా గ్రామాల్లో తాగునీటి వసతుల మెరుగుదల, పైప్లైన్ల మరమ్మతులు, బోర్లు, నీటి మోటార్ల నిర్వహణ, మురుగు కాలువలను శుభ్రం చేయించడం, చెత్త సేకరణ వ్యవస్థ బలోపేతం, పారిశుద్ధ్య పనులు చేపట్టనున్నారు. ఆన్లైన్ కాక.. జిల్లాలో మొత్తం 594 గ్రామ పంచాయతీలు ఉండగా, ఈ విడతలో 578 జీపీలకే నిధులు అందాయి. మిగిలిన 16 వాటికి గ్రాంట్ అందలేదు. నిధుల విడుదల సమయంలో కొన్ని జీపీల బ్యాంక్ ఖాతాలు ఆన్లైన్ వ్యవస్థకు అనుసంధానం కాకపోవడం, సాంకేతిక సమస్యలు తలెత్తడంతో నిధులు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ సమస్యలు పరిష్కరించిన అనంతరం తదుపరి విడతలో ఆయా గ్రామాలకు నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిందే 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో పారదర్శకతకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ప్రతి రూపాయి ఖర్చుకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. చేపట్టిన పనులు, చెల్లింపులు, పనుల పురోగతిని డిజిటల్ విధానంలో నమోదు చేయాల్సి ఉంటుంది. నిధులను నిబంధనలకు అనుగుణంగా వినియోగిస్తున్నారా లేదా అనే అంశంపై జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించనున్నారు. గ్రామాల్లో ప్రజలకు ఉపయోగపడే పనులకే నిధులను వినియోగించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిధుల సక్రమ వినియోగంతో మౌలిక వసతులు మెరుగుపడటమే కాకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంది. మండలం జీపీలు నిధులు (రూ.లక్షల్లో..) బంట్వారం 11 56.63 బషీరాబాద్ 36 134.90 బొంరాస్పేట 33 118.60 చౌడాపూర్ 24 87.30 ధారూరు 33 125.65 దోమ 36 154.29 దౌల్తాబాద్ 31 143.41 దుద్యాల్ 19 70.57 కొడంగల్ 25 119.13 కోట్పల్లి 18 68.34 కుల్కచర్ల 32 137.56 మర్పల్లి 28 160.45 మోమిన్పేట 28 140.40 నవాబుపేట 32 129.50 పరిగి 32 115.26 పెద్దేముల్ 37 145.59 పూడూరు 31 136.37 తాండూరు 33 158.96 వికారాబాద్ 21 84.00 యాలాల 38 136.45 578 24.23 కోట్లు -
చెత్తాచెదారం.. పందుల విహారం!
మురికికూపంలా తాండూరు బస్టాండ్తాండూరు: నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే తాండూరులోని ఆర్టీసీ బస్టాండ్ అపరిశుభ్రతకు నిలయంగా మారింది. ఈప్రాంగణంలోనే వంద బస్సులతో డిపో కూడా కొనసాగుతోంది. 355 మంది ఉద్యోగులు విధులు ని ర్వర్తిస్తుండగా.. 35 రూట్ల ద్వారా ప్రతిరోజు 35 వేల నుంచి 40 వేల మంది ప్రయాణికులు గ మ్యస్థానాలకు వెళ్తుంటారు.. ఇలా ఆర్టీసీకి ని త్యం రూ.16 లక్షలు, బస్టాండ్ ప్రాంగణంలోని దుకాణాల ద్వారా ప్రతినెలా రూ.3 లక్షల ఆదా యం సమకూరుతోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా బస్టాండ్లోకి వెళ్లే ప్రధాన దారితో పాటు పరిసరాలు మురుగు కూపాన్ని తలపిస్తున్నా యి. ఎక్కడ చూసినా పందులు, కుక్కల సంచా రం, చెత్తాచెదారం దర్శనమిస్తోంది. భరించలేని కంపుతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
హక్కుల సాధనకు పోరాటం
బంట్వారం: విద్య, ఉద్యోగ అవకాశాల్లో సరైన న్యాయం జరగాలంటే మాదిగలంతా సంఘటితం కావాల్సిందేనని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కే మల్లికార్జున్ మాదిగ అన్నారు. సోమవారం బంట్వారంలో మండల కమిటీని నియమించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హక్కుల సాధన కోసం మాదిగ జాతి నడుం బిగించి పోరాటానికి సిద్ధం కావాలన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా బాధితులకు ఎమ్మార్పీఎస్ అండగా నిలబడి ప్రశ్నిస్తుందన్నారు. అనంతరం మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ప్రవీణ్కుమార్(తొర్మామిమిడి), అధికార ప్రతినిధిగా ఎల్లయ్య, ఉపాధ్యక్షుడిగా ఎం.ప్రేమ్కుమార్, ప్రధాన కార్యదర్శిగా బి.కుమార్, కార్యదర్శిగా శ్రావణ్కుమార్, కోశాధికారిగా సాయికుమార్, సలహదారుడిగా డి.సుధాకర్, ప్రచార కార్యదర్శిగా ఆర్.ప్రేమ్కుమార్, కార్యవర్గ సభ్యులుగా శ్యాంసన్, రాజు ,శ్రీకాంత్ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి భరత్కుమార్, ప్రతినిధులు గోపాల్, శ్రీనివాస్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. మాదిగలంతా సంఘటితం కావాలి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ -
తల్లిపాలు అమృతంతో సమానం
డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్ కుల్కచర్ల: తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని జిల్లా వైద్యాధికారి సుధాకర్ లాల్ అన్నారు. సోమవారం కుల్కచర్ల పీహెచ్సీలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిశువు పుట్టిన వెంటనే ముర్రుపాలు పడితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఆరు నెలల వరకు బిడ్డకు తల్లిపాలు పట్టాలన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డా.కిరణ్కుమార్ గౌడ్, సిబ్బంది యాదమ్మ, రాజు, సిరాజ్, జంగమ్మ, మంగమ్మ, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతగిరి: మేరా యువ భారత్ ఆధ్వర్యంలో పట్టణంలోని మహవీర్ మెడికల్ కళాశాలలో నషా ముక్త్ యువ వికసిత్ భారత్ పేరిట జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. జానపద సంగీతం, నృత్యం, లఘుచిత్రం, మైమ్, స్లామ్పోయెట్రీ, వకృత్వం, చిత్రలేఖనం, నినాద రచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా యువజన క్రీడల అధికారి నర్సింలు మాట్లాడుతూ.. ప్రథమ స్థానంలో నిలిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మై భారత్ డిప్యూటీ డైరక్టర్ స్నేహల్ బసుత్కర్, మెడికల్ కళాశాల డీన్ డాక్టర్ ఖలీల్, మై భారత్ వంటీర్లు దాసరి శ్రీశైలం, ర వి, ఖాజా కరీమొద్దీన్, కార్తీక్, అర్చన, సింహాద్రి, వైద్య విద్యార్థులు తదితరులుపాల్గొన్నారు. యాలాల: మండలంలోని రాస్నం వరి కొనుగోలు కేంద్రంలో రైతుల ధాన్యం డబ్బులు ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి వెళ్లాయనే ఆరోపణలపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు దృష్టి సారించారు. కొనుగోలు కేంద్రంలో జరిగిన అవకతవకలపై సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘ధాన్యం సొమ్ము దారి మళ్లిందా? అనే శీర్షికన ప్రచురితమైన కథనం మండలంలో చర్చకు దారి తీసింది. ఇదే అంశంపై ప్రజా సంఘాల నాయకులు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కాగా కొనుగోలు కేంద్రం బాధ్యతలు తీసుకున్న ఐకేపీ సిబ్బంది, బుక్ కీపర్లను విచారించాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. కాగా మంగళవారం గ్రామంలో ఐకేపీ సిబ్బందిని విచారించే అవకాశాలున్నాయి. కుల్కచర్ల: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ముజాహిద్పూర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతిహెప్సిభా అన్నారు. ఇటీవల తాండూరులో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో తమ పాఠశాల విద్యార్థి అరుణ్కుమార్ ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. సోమవారం బాలుడిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పీఈటీ కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బొంరాస్పేట: మండలంలో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి 9గంటల వరకు వాన దంచికొట్టింది. చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. వరి నాట్లు వేసేందుకు ఇదే సరైన సమయమని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. -
‘పాలమూరు’తో సస్యశ్యామలం
ధారూరు: పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేస్తామని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి సిద్ధంగా ఉన్నారని పేర్కొ న్నారు. సోమవారం ధారూరు రైతు వేదికలో జిల్లా రెవెన్యూ అధికారి స్వర్ణలత అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల్లో నెలకొన్న సమస్యలపై సర్పంచులు నేరుగా తనను సంప్రదించాలని సూచించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ఇళ్ల నుంచి వృథాగా పోయే నీటిని కాపాడుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మించుకోవాలన్నారు. ప్రభుత్వం రూ.6 వేలు ఇస్తుందని తెలిపారు. త్వరలో అసైన్డ్ భూములకు పట్టాలిస్తామన్నారు. మండలంలో ఎన్ని ఇరిగేషన్ చెరువులు, కుంటలు ఉన్నాయి.. ఏయే పనులు చేయాల్సి ఉందో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఏఈ జ్యోతిని ఆదేశించారు. ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో తిష్టవేసిన ఐకేపీ సీసీలు రాజకీయం చేస్తున్నారని, వీరిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని పలువురు సభ్యులు స్పీకర్ను కోరారు. ఏపీఎం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని, వెలుగు కార్యాలయంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొందని ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. కొత్త గ్రామ పంచాయతీలకు ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించలేదని, ఎఫ్ఏలు ఎవరి మాట వినడం లేదని పలువురు ఆరోపించారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసి ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తోందని స్పీకర్ ఆరోపించారు. అధికారులు బాధ్యతగా.. జవాబుదారీగా పనిచేయాలని ఆదేశించారు. ధారూరుకు ఇందిరమ్మ ఇళ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ ప్రమీల గౌడ్ స్పీకర్ను కోరారు. అల్లాపూర్ పాఠశాల పక్కన పెద్దగుంత ఏర్పడి విద్యార్థులకు ఇబ్బందిగా మారిందని, వెంటనే దాన్ని పూడ్చివేయాలని సర్పంచ్ విజయలక్ష్మి కోరారు. మండలంలోని ఆరు అంగన్వాడీ కేంద్రాల్లో 16 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని సభ్యులు విన్నవించారు. ధారూరు, నాగసమందర్ గ్రామాల్లో పశు వైద్యులు లేరని, దీంతో జీవాలకు సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నాయని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ధారూరు – పగిడాల మీదుగా దోన్నాల్, రాస్నం వరకు డబుల్ రోడ్డు నిర్మించాలని, అసంపూర్తిగా ఉన్న ధారూరు – పీలారం రోడ్డును పూర్తి చేయాలని కోరారు. మండలానికి కొత్తగా 1,814 రేషన్ కా ర్డులు మంజూరైనట్లు తహసీల్దార్ సాజిదాబేగం తెలిపారు. పూలు, ఉల్లి సాగు చేసే రైతులకు 50శాతం రాయితీ ఇస్తున్నట్లు ఉద్యాన వన మండల అధికారి యమున తెలిపారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ సుధీర్, ఎంపీడీఓ నర్సింహులు, పీఆర్ డీఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారు త్వరలో అసైన్డ్ భూములకు పట్టాలిస్తాం స్పీకర్ ప్రసాద్ కుమార్ -
ఆఖరి మజిలీకి అవస్థలు!
తాండూరు రూరల్: శ్మశానవాటికకు వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో ఆఖరి మజిలీకి అవస్థలు తప్పడం లేదు. వర్షాకాలం వచ్చిందంటే అంతిమయాత్ర గగనంగా మారుతోంది. పెద్దేముల్ మండలం తింసాన్పల్లి గ్రామ శివారులో పల్లె చెల్మ వాగు ఉంది. దీనికి అవతలి వైపు ఎస్సీ శ్మశానవాటికతో పాటు పలువురు రైతుల వ్యవసాయ పొలాలున్నాయి. వానా కాలం వస్తే తరచూ వాగు పారి అవతలి గట్టుకు వెళ్లే పరిస్థితి ఉండటం లేదు. దీంతో రైతులు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చనిపోగా, అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానవాటికకు బయల్దేరారు. వాగు వద్ద పారుతున్న నీటిలో నుంచి నడుస్తూనే పాడె మోశారు. వరద ఉధృతి ఎక్కువగా ఉంటే దాటలేని పరిస్థితి ఉంటుందని, ఒక్కోసారి గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ స్పందించి ఇక్కడ బ్రిడ్జి నిర్మించి శ్మశానవాటికకు దారి చూపాలని వేడుకున్నారు. వాగు దాటితేనే శ్మశానవాటికకు చేరేది వరద పారితే వెళ్లడం కష్టమే బ్రిడ్జి నిర్మించాలని తింసాన్పల్లివాసుల వినతి -
ఒకరి తప్పు.. మరొకరికి శిక్ష!
ధారూరు: ఓ కానిస్టేబుల్ నిర్వాకంతో ఏ తప్పూ చేయని ఓ లారీ డ్రైవర్తో పాటు ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదివారం రాత్రి సిమెంట్ బస్తాల లోడ్తో ఓ లారీ తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తోంది. ఈసమయంలో బైక్పై వెళ్తున్న ఓ మందుబాబు ఫుళ్లుగా తాగి లారీ వెనకాల కొద్ది దూరంలో అదుపు తప్పి పడిపోయాడు. ఇది గమనించి సదరు కానిస్టేబుల్ లారీ ఢీకొట్టడంతోనే వాహనదారుడు పడిపోయాడంటూ డ్రైవర్ను బెదిరించాడు. ప్రమాదానికి కారణం తాను కాదని ఎంత బతిమాలినా పట్టించుకోలేదు. ప్రమాదానికి గురైన వ్యక్తి వచ్చి తానే పడిపోయానని, ఇందులో లారీ డ్రైవర్ తప్పేమీ లేదని చెప్పినా కానిస్టేబుల్ వినిపించుకోలేదు. లారీని పీఎస్కు తీసుకురావాలని ఒత్తిడి చేయడంతో చేసేదేమీ లేక స్టేషన్కు బయల్దేరాడు. పీఎస్ పక్కన ఉన్న పొలంలో లారీని పార్క్ చేయమని కానిస్టేబుల్ ఆదేశించడంతో డ్రైవర్ వాహనాన్ని రోడ్డు కిందకు దించగానే అక్కడే దిగబడిపోయింది. దీంతో 18గంటల పాటు డ్రైవర్ ఇక్కడే ఇరుక్కుపోయాడు. సంచులను కిందికి దింపి, లారీని బయటకు లాగిన అనంతరం మళ్లీ లోడ్ చేయించుకుని సోమవారం సాయంత్రం ఉసూరుమంటూ వెళ్లిపోయాడు. తన వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని చెప్పినా కానిస్టేబుల్ పట్టించుకోలేదని వాపోయాడు. ఉద్దేశపూర్వకంగానే లారీ డ్రైవర్ను ఇబ్బంది పెట్టాడని పలువురు వాహనదారులు తెలిపారు. -
‘ముసురు’తున్నాయ్!
చాపకింది నీరులా సీజనల్ వ్యాధులు జిల్లాలోని వనస్థలిపురం, కొండాపూర్ సహా జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవఖానాల ఔట్పేషంట్ విభాగాలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. మహేశ్వరం మెడికల్ కాలేజీ అనుబంధ (వనస్థలిపురం) ఆస్పత్రిలో బయటి రోగుల సంఖ్య గతంతో పోలిస్తే ప్రస్తుతం రెట్టింపైంది. రోగుల నిష్పత్తి మేరకు మౌలిక సదుపాయాలు లేకపోవడంతో రోగులతో పాటు వైద్యులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. చేవెళ్ల, షాద్నగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, యాచారం కమ్యూనిటీ సెంటర్లలోనూ రద్దీ పెరిగింది. 30 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 70 బస్తీ దావఖానాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆయా ఆస్పత్రుల సాధారణ ఓపీల్లో 40 శాతం మంది జ్వర పీడితులే కన్పిస్తున్నారు. కునుకు లేకుండా చేస్తున్న దోమలు ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఇళ్ల చుట్టూ మురుగు నీరు చేరి, దోమలకు నిలయంగా మారుతున్నాయి. చిరుజల్లులకు రాత్రిపూట ఫీడర్లు ట్రిప్పవుతుండటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. ఇంట్లో ఫ్యాన్లు కూడా తిరకపోవడంతో దోమలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పగటిపూట ఇంట్లో నిద్రించే పిల్లలు, వృద్ధులపై దాడి చేస్తున్నాయి. ఫలితంగా వారు విపరీతమైన జ్వరం, ఒంటినొప్పులతో బాధపడుతున్నారు. వీల్ చైర్లో తీసుకెళ్లేవారులేక తన భార్యను స్వయంగా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తున్న భర్తవనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో రద్దీవర్షాల వెన్నంటే వ్యాధులు ముసురుతున్నాయి. పారిశుద్ధ్యలోపం, నీటి కాలుష్యం, దోమకాటుతో రోగాలు వ్యాపిస్తున్నాయి. పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా అనేక మంది దగ్గు, జ్వరం, ఒంటినొప్పులు, వాంతులు, విరేచనాలు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. – సాక్షి, రంగారెడ్డిజిల్లా ఆస్పత్రులకు క్యూ కడుతున్న జ్వరపీడితులు యూపీహెచ్సీలు, బస్తీ దవాఖానాలు కిటకిట మహేశ్వరం మెడికల్ కాలేజీ అనుబంధ ఆస్పత్రిలో గతంలో ఓపీకి రోజుకు సగటున 500 మంది వస్తే ప్రస్తుతం 1,600 దాటింది. ఇక్కడికి వస్తున్న వారిలో మెజార్టీ బాధితులు దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతున్న వాళ్లే. 220 పడకలు, మూడు ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ విభాగాలు ఉన్నాయి. సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ సిష్టం రెడీగా ఉంది. ఎంత మంది వచ్చినా చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. వచ్చిన వారికి మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. పైసా ఖర్చు లేకుండా ఖరీదైన వైద్యసేవలు పొందొచ్చు. – డాక్టర్ నాగేందర్, సూపరింటెండెంట్, మహేశ్వరం మెడికల్ కాలేజీ -
తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరం
హుడాకాంప్లెక్స్: పుట్టిన ప్రతి బిడ్డకు ముర్రుపాలు పట్టించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ స్వర్ణకుమారి అన్నారు. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని సోమవారం సరూర్నగర్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి గర్భిణి కాన్పు జరిగిన వెంటనే బిడ్డకు ముర్రుపాలు ఇవ్వాలని సూచించారు. ఈ పాలలో ఇమ్యూనిటీ ఇచ్చే ఇమ్యునోగ్లోబిన్ ఉంటుందని, ఇది బిడ్డకు సహజ యాంటీ బయోటిక్గా పనిచేస్తుందని తెలిపారు. ఇందులో బిడ్డకు సరిపోయే ప్రొటీన్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయన్నారు. పుట్టిన ప్రతి బిడ్డకు ఆరు నెలల వరకు ఎలాంటి ఆహార పదార్థాలు తినిపించొద్దని, కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలన్నారు. తల్లిపాలు ఇవ్వడం ద్వారా తల్లి ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సత్యవతి, డీఐఓ డాక్టర్ షీబా, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్ అర్చన, సుష్మిత, మాస్మీడియా అధికారులు మంజుల, శ్రీనివాసులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు శ్రీనివాసులు, పరాంకుశం, ఆరోగ్య విస్తరణ అధికారులు పోల శ్రీధర్, కె.శ్రీనివాసులు, పీహెచ్ఎన్ మల్లీశ్వరి, సూపర్వైజర్లు అజయ్, ఉమ, ఇందిర, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. -
‘ఇండస్ట్రియల్’ సర్వే ప్రారంభం
దోమ: ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు భూ సేకరణలో భాగంగా సోమవారం రైతుల పొలాల్లో సర్వే ప్రారంభించారు. మండల పరిధిలోని కొండాయపల్లిలో నలుగురు తహసీల్దార్లతో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సర్వే చేస్తున్నారు. పోలీసుల పహారా మధ్య ఈ ప్రక్రియ కొనసాగుతోంది. మూడు రోజుల్లో సర్వే పూర్తవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఆర్డీఓ వాసుచంద్ర, స్థానిక తహసీల్దార్ రవీందర్ సర్వేను పరిశీలించారు. పారదర్శకంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. రైతులు సర్వేకు సహకరించాలని కోరారు. భూములు కోల్పోతున్న వారికి ప్రభుత్వం తగిన పరిహారం అందిస్తుందని తెలిపారు. అనంతరం రేడియల్ రోడ్డుకు భూమిని సేకరిస్తున్న రైతుల పొలాలను పరిశీలించారు. బట్లచందారంలో పర్యటించి, భూ నిర్వాసితులతో మాట్లాడారు. పలువురు రైతుల అభిప్రాయాలను సేకరించారు. తగిన పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ వెంకటేశ్, సీనియర్ అసిస్టెంట్ ఫర్వేజ్, సీఐ కొండల్రెడ్డి, ఎస్ఐ వసంత్ జాదవ్, పోలీస్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నాలుగు ప్రత్యేక బృందాలతో కొనసాగుతున్న పనులు మూడు రోజుల్లో పూర్తి చేస్తామంటున్న అధికారులు కొండాయపల్లి, బట్లచందారంలో ఆర్డీఓ వాసుచంద్ర పర్యటన -
ఎక్కువ సామర్థ్యం ట్రాన్స్ఫార్మర్లు అమర్చండి
దుద్యాల్: ఓవర్ లోడ్ కారణంగా మండలంలోని దుద్యాల్, ఈర్లపలి తదితర గ్రామాల్లో వ్యవసాయ బోరు మోటార్లు కాలిపోతున్నాయని, ఎక్కవ సామర్థ్యం కలిగిన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మేరుగు శ్రీకాంత్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రవి నాయక్ కోరారు. సోమవారం కొడంగల్లో కడా ప్రత్యేక అధికారిని కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దుద్యాల్ చెరువ సమీపంలో దుద్యాల్, అల్లిఖాన్పల్లి గ్రామాల రైతుల కోసం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారని, వ్యవసాయ కనెక్షన్లు ఎక్కువగా ఉండటంతో తరచూ ట్రాన్స్ఫార్మర్, బోరు మోటార్లు కాలిపోతున్నట్లు తెలిపారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. రైతుల సమస్యను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఎక్కువ సామర్థ్యం ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని వారు కోరారు. వినతి పత్రం అందించిన వారిలో యువజన కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్, వడిత్య కృష్ణ తదితరులు ఉన్నారు. యూత్ కాంగ్రెస్ మండల నాయకులు -
జిల్లా వైద్యాధికారి డాక్టర్ స్వర్ణకుమారి సూచనలు..
● పగటి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గాల్లో తేమశాతం పెరగడంతో వైరస్ వ్యాప్తికి అనుకూలంగా ఉంటుంది. శరీరం ఈ మార్పులకు అలవాటు పడేందుకు కొంతసమయం పడుతుంది. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఫ్లూ కారక వైరస్లు సులభంగా వ్యాపిస్తుంటాయి. దగ్గు, జలుబు, జ్వరం ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తుంటాయి. ఈ లక్షణాలతో కన్పించే పిల్లలను బడికి పంపకపోవడం ఉత్తమం. ● ప్రస్తుతం చెరువుల్లోకి కొత్త నీరు వచ్చి చేరుతోంది. వరదతో పాటే అనేక రకాల బ్యాక్టీరియా చేరుతోంది. సరిగా శుద్ధి చేయని ఈ నీటిని తాగడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కలుషిత నీరు పైపుల నుంచి ఇంట్లోకి సరఫరా అవుతుండడం, విషయం తెలియక వాటిని అలాగే తాగడం ద్వారా వాంతులు, విరేచనాల బారినపడుతుంటారు. ● సాధ్యమైనంత వరకు ఇంటికప్పుపై ఉన్న ఖాళీ బా టిళ్లు, కుండీల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మంచినీటి ట్యాంకులపై మూత పెట్టాలి. మస్కిటో కాయిల్స్, మస్కిటో మ్యాట్, కిటికీలకు జాలీలను ఏర్పాటు చేసుకోవడం, కాళ్లు, చేతులు పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తులు ధరించడం, దోమ తెరలను వాడటం వంటి స్వీయ జాగ్రత్తలతో డెంగీని దరిచేరనీయకుండా చూసుకోవచ్చు. ● సాధ్యమైనంత వరకు బయటి ఆహారాన్ని తీసుకొవద్దు. నిల్వ చేసిన ఆహారానికి బదులు ఇంట్లో అప్పుడే తాజాగా వండివార్చిన ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. కాచి చల్లార్చిన నీటిని తాగడం, సీవిటమిన్ పుష్కలంగా లభించే తాజా పండ్లు తినడం ద్వారా సీజనల్ వ్యాధుల బారి నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. -
జీపీ వర్కర్స్ సంఘం కోశాధికారిగా రాంచంద్రయ్య
కేశంపేట: గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘం (ఏఐటీయూసీ) రాష్ట్ర కోశాధికారిగా మండల కేంద్రానికి చెందిన ఆదిరాల రాంచంద్రయ్య ఎంపికయ్యారు. గత నెల 26న ఖమ్మం జిల్లా రఘనాథపాలెంలో పంచాయతీ వర్కర్స్ సంఘం రాష్ట్రస్థాయి 3వ మహాసభలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో సంఘం రాష్ట్ర కోశాధికారిగా కేశంపేట పంచాయతీలో విధులు నిర్వర్తిస్తున్న రాంచంద్రయ్యను ఎంపిక చేస్తూ తీర్మానం చేశారు. రాష్ట్ర కమిటీ నుంచి రాంచంద్రయ్య సోమవారం నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. -
విద్యుత్ షాక్తో పాడి ఆవు మృతి
బొంరాస్పేట: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద షాక్కు గురై పాడి ఆవు మృతిచెందిన ఘటన మండలంలోని ఎన్కేపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జబ్బార్మియా సోమవారం ఉదయం చనిపోయిన ఆవును చూసి బోరుమన్నాడు. పాడి ఆవు మృతితో రూ.60 వేల నష్టం వాటిల్లిందని అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరాడు. రుక్కమ్మ అస్తికల నిమజ్జనం తాండూరు: శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి సోదరులు సోమవారం కాశీలోని గంగానదిలో తమ తల్లి రుక్కమ్మ అస్తికలను నిమజ్జనం చేశారు. అనంతరం రుక్కమ్మ మనవళ్లు అవినాష్రెడ్డి, ప్రకాశ్రెడ్డి తదితరులతో కలిసి కాశీవిశ్వేశ్వరుడిని దర్శించుకున్నారు. యూనిఫాం మరింత ఆలస్యమే! తాండూరు: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కూల్ యూనిఫాంల పంపిణీ మరింత ఆలస్యం కానుంది. మున్సిపల్ పరిధిలో 33 ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహ విద్యార్థులకు సంబంధించి యూనిఫాం కట్టే బాధ్యతలను మహిళా సమాఖ్య సంఘాలకు అప్పగించారు. 7,224 మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున యూనిఫాంలు అందజేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 5,022 మాత్రమే సిద్ధం చేశారు. మరో 12,955 యూనిఫామ్లను కుట్టాల్సి ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు పూర్తి కావస్తున్నా యూనిఫామ్ల పంపిణీ ఇంకా పూర్తి కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పెండింగ్ వేతనాలు ఇవ్వాలి ఇబ్రహీంపట్నం రూరల్: మండలంలో పని చేస్తున్న తమకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని ఫీల్డ్ అసిస్టెంట్లు కోరారు. ఈ మేరకు సోమవారం జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడు నెలల నుంచి జీతాలు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీఓలు, ఈసీలు, టీఏ, సీఓ సమ్మెలో పాల్గొంటే తాము విధుల్లో ఉన్నామని తెలిపారు. సమ్మెతో ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అధికారులు స్పందించి వెంటనే జీతాలు ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు దాన య్య, బాల్రాజ్, రామలింగం పాల్గొన్నారు. చేవెళ్ల: ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడిగా చేవెళ్ల ప్రాంతానికి చెందిన వడ్ల సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తుక్కుగూడలో ఆదివారం జరిగిన ఏఐటీయూసీ జిల్లా మహాసభల్లో జిల్లా నూతన అధ్యక్షుడిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్మికుల హక్కులకోసం, వారి సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని తెలిపారు. -
ప్రత్యామ్నాయ పంటలే మేలు
రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి ఇబ్రహీంపట్నం రూరల్: ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు, కూరగాయల సాగు చేసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. కలెక్టరేట్లో సోమవారం ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో సాగు మార్గదర్శక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరికి బదులు ఆయిల్పామ్, కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకునే విధంగా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు ఎంపిక చేసుకోవా లని తెలిపారు. నిపుణుల కమిటీ రూపొందించిన మార్గదర్శక పుస్తకం రైతులకు శాసీ్త్రయ సాగు విధానాలపై అవగాహన కల్పించి, మెరుగైన దిగుబడులు సాధించడానికి దోహదపడుతుందని చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు ఈ మార్గదర్శకాలను రైతులకు విస్తృతంగా చేరవేసి, అవసరమైన సాంకేతిక సూచనలు అందించాలని ఆదేశించారు. ప్రజావాణికి 120 ఫిర్యాదులు ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణిలో నేరుగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలన్నారు. ఈ వారం ప్రజావాణికి 102 ఫిర్యాదులు అందినట్టు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, కిరణ్మయి, జిల్లా రెవెన్యూ అధికారి శారద తదితరులు పాల్గొన్నారు. తల్లిపాల వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్ను కలెక్టరేట్లో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శిశువు పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వడం అత్యంత ముఖ్యమని తెలిపారు. ఈ ఏడాది తల్లిపాలకు ప్రాధాన్యత ఇద్దాం.. సుస్థిరమైన సహాయ వ్యవస్థలను ఏర్పాటు చేద్దాం అనే సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా చేర్చేందుకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్మయి, జిల్లా సంక్షేమ అధికారి శాంతిశ్రీ, జిల్లా వైద్యాధికారి స్వర్ణలత, ఏఓ సునీల్, సీడీపీఓలు, డీహెచ్ఈడబ్ల్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
తల్లిపాలు బిడ్డకు శ్రీరామ రక్ష
● శిశువు పుట్టిన గంటలోపే ముర్రుపాలు పట్టాలి ● ఆరు నెలల వరకు తల్లిపాలే తాగించాలి ● 7వ తేదీ వరకు వారోత్సవాలు దుద్యాల్: పుట్టిన బిడ్డకు తొలి ఆహారం, మొదటి టీకా అమ్మపాలే. పిల్లలకు తల్లిపాలు ఎంతగానో తోడ్పడుతాయని వైద్యులు చెబుతున్నారు. శిశువు జన్మించిన గంటలోపే ముర్రుపాలు తాగించాలని సూచిస్తున్నారు. ఆ పాలు తాగిన పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఈ నెల 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఐసీడీఎస్ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచే తల్లిపాల ఆవశ్యకత, బిడ్డ పోషణ, ఆరోగ్యంపై సూచనలు, సలహాలు ఇస్తున్నారు. లేనిపోని అపోహలతో బిడ్డను తల్లిపాలకు దూరం చేయరాదంటున్నారు. ఎంత త్వరగా ముర్రుపాలు పడితే శిశువు అంత ఆరోగ్యంగా ఉంటారని ఐసీడీఎస్ అధికారులు చెబుతున్నారు. సోమవారం నుంచి ప్రతి అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కొడంగల్ సీడీపీఓ సరోజ తెలిపారు. మండలంలో 20 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 10 మంది బాలింతలు, గర్భిణులు ఉన్నారు. వీరికి తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తామని అంగన్వాడీ సూపర్ వైజర్లు తెలిపారు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ముర్రుపాలలో విటమిన్ – ఏ, – బీ, తగినంత ఐరన్ ఉంటుంది. ఈ పాలు శిశువు జీర్ణశక్తిని పెంచుతాయి. కామెర్లు, విరేచనాల వంటి వ్యాధుల నుంచి బిడ్డను కాపాడతాయి. -
నేడు రక్తదాన శిబిరం
కొడంగల్ రూరల్: ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం కొడంగల్లోని ప్రభుత్వాస్పత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు యువసేన ఫ్రెండ్స్ అసోషియేషన్ సభ్యులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రక్తదాన శిబిరం కొనసాగుతుందన్నారు. యువత అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రక్తదానం మరొకరికి ప్రాణదానం లాంటిదన్నారు. బొంరాస్పేట: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ నెల 9న కొత్తగూడెంలో జరిగే గిరిజన సభను విజయవంతం చేయాలని ఎల్హెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సూర్యానాయక్ కోరారు. శనివారం చలో కొత్తగూడెం సోషల్ మీడియా పత్రాన్ని ఆవిష్కరించారు. గిరిజన ఆదివాసీల ఆత్మగౌరవం కోసం నిర్వహిస్తున్న సభకు బంజారాలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. కుల్కచర్ల: దూరవిద్యా విధానం ద్వారా డిగ్రీ చేయాలనుకునే వారు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అందించే డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చని శ్రీ రామలింగేశ్వర డిగ్రీ కళాశాల ఓపెన్ యూనివర్సిటీ ఇన్చార్జ్ వెంకటేశ్వర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7వ తేదీ వరకు ఆన్లైన్లో డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు చేసి.. అట్టి ధ్రువీకరణ పత్రాలను కుల్కచర్లలోని శ్రీ రామలింగేశ్వర కళాశాలలో అందజేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 9441679846లో సంప్రదించాలన్నారు. కుల్కచర్ల: చౌడాపూర్, కుల్కచర్ల మండలాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రీ ప్రైమరీ పాఠశాలలకు ఇన్స్ట్రక్టర్లు, ఆయాలను నియమిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కుల్కచర్ల సెంటర్కు అలవేలు, పుట్టపహాడ్కు మమత, బండవెల్కిచర్లకు లక్ష్మిదేవి, కుస్మసముద్రంకు ఫరానా బేగం, ముజాహిద్పూర్కు రవలికను ఎంపిక చేశారు. చౌడాపూర్ మండలం మరికల్ సెంటర్కు మాలతి, వీరాపూర్కు మహేశ్వరి, చౌడాపూర్కు సంధ్య, కొత్తపల్లికి ఎల్లమ్మ, చాకల్పల్లికి బొమ్మరాసి మహేశ్వరి ఎంపికయ్యారు. ఆయా కేంద్రాలకు ఆయాలను కూడా నియమించారు. కేశవరావును కోరిన టఫ్ నాయకులు కొడంగల్ రూరల్: ఉద్యమకారుల కమిటీ చైర్మన్, పీసీసీ మాజీ అధ్యక్షుడు కే కేశవరావును శనివారం నగరంలో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్(టఫ్) చైర్ పర్సన్ విమలక్క అధ్యక్షతన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలయ్యేలా చూడాలని కోరారు. స్పందించిన కేశవరావు నాయకులు అందించిన ప్రతిపాదనలను కమిటీతో చర్చించి అమలు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లాకన్వీనర్ శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా బాధ్యులు కొర్ర పాండు తదితరులు పాల్గొన్నారు. హయత్నగర్: టీఎస్ ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్లుగా పని చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హయత్నగర్–1 డిపో మేనేజర్ లావణ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హెవీ వాహన లైసెన్స్ కలిగి, కనీసం రెండేళ్ల అనుభవం ఉన్న వారు అర్హులన్నారు. అభ్యర్థులు ఆధార్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టు సైజు ఫొటోను జత చేసి ఈనెల 8వ తేదీలోపు డిపోలో నేరుగా దరఖాస్తు చేయాలన్నారు. -
వెల్కమ్ కిట్!
● ఇంటర్ విద్యార్థులకు ఏడు రకాల సామగ్రి ● సంఖ్య పెంచేందుకుప్రభుత్వం సరికొత్త ఆలోచన ● మొదటి విడతలో బూట్ల పంపిణీ ● ఐదువేల మందికి ప్రయోజనం దౌల్తాబాద్: జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థులకు వెల్కమ్ కిట్ అందజేయాలని నిర్ణయించింది. ఇందుకోసం వేల రూపాయలు వెచ్చించనుంది. ఇది ఆర్థిక భారమైనా ఏ ఒక్క విద్యార్థీ చదువుకు దూరం కాకూడదని భావిస్తోంది. పాఠశాలల తరహాలోనే జూనియర్ కళాశాలల్లో కూడా ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఉచితంగా ఏడు రకాల వస్తువులతో కూడిన కిట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. అంతేకాకుండా కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 14 జూనియర్ కళాశాలలు ఉండగా వాటిలో 5వేల మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. ఒక్కొక్కరికి రూ.4,100 చొప్పున ప్రతి విద్యార్థికీ సుమారు రూ.4,100 విలువ చేసే వస్తువులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. రెండు జతల యూనిఫాం, ఒక జత షూ, రెండు జతల సాక్సులు, కాలేజీ బ్యాగ్, గుర్తింపు కార్డు, బెల్టు, దాదాపు నోట్బుక్స్ అందించనుంది. మొదటి విడతగా బూట్లు పంపిణీ చేశారు. విద్యార్థులకు ప్రయోజనం ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు విద్యార్థుల వివరాలు సేకరించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రయోజనాలు అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. విద్యార్థులకు బ్రాండెడ్ కంపెనీ వస్తువులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇంటర్లో డ్రాపౌట్లను అడ్డుకోవడానికి ప్రభుత్వం సరి కొత్త ఆలోచన చేసింది. పదో తరగతి తర్వాత ఆర్థిక ఇబ్బందులతో పేద విద్యార్థులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువతీయువకులు చదువు ఆపేస్తున్నారు. అలాంటి వారికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికే జిల్లాలోని ఎనిమిది కళాశాలల్లో మధ్యాహ్న భోజనం కూడా అమలు చేస్తున్నాం. – శంకర్నాయక్, డీఐఈఓ, వికారాబాద్ -
సన్న బియ్యం బోనస్ కోసం అన్నదాతల ఎదురుచూపులు
ఆదివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2026రూ.6.42 కోట్లువికారాబాద్: సన్న బియ్యం బోనస్ కోసం అన్నదాతలు నిరీక్షిస్తున్నారు. రెండు సీజన్లకు సంబంధించిన డబ్బు జమకాలేదు. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్వింటాలు సన్నరకం వడ్లకు ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ధాన్యం విక్రయించి ఏడాది కావస్తున్నా బోనస్ విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. రైతులు కొనుగోలు కేంద్రాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. నిర్వాహకులు ఈ రోజు రేపంటూ కాలయాపన చేస్తున్నారు. 2025 యాసంగికి సబంధించిన బోనస్ డబ్బులు పెండింగ్లో ఉండగా 2026లో రికార్డు స్థాయిలో సన్నాలు సేకరించారు. డబ్బుల చెల్లింపులో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుండంతో పలువురు రైతులు ఈ సారి ప్రైవేటుగా అమ్మేందుకు సిద్ధమవుతున్నారు. రికార్డు స్థాయిలో.. రెండు మూడు సీజన్లతో పోలిస్తే గత యాసంగిలో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించారు. 92వేల ఎకరాల్లో వరి సాగు చేయగా.. 2లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రైవేటుగా పోనూ 90వేల నుంచి లక్ష మెట్రిక్ టన్నులు కొను గోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. లక్ష్యం మేరకు సేకరించారు. దొడ్డు రకం తోపాటు 8,421మెట్రిక్ టన్నుల సన్నరకం వడ్లను కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన బోనస్ డబ్బులు రూ.4.46 కోట్లు రైతులకు చెల్లించలేదు. 2026 యాసంగిలో 90వేల ఎకరాల్లో వరి పంట వేయగా 1.10లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. వీటితో పాటు 3,900 మెట్రిక్ టన్నుల సన్నరకం వడ్లు సేకరించారు. ఇందుకు సంబంధించి రూ.1.96 కోట్లు చెల్లించాల్సి ఉంది. రెండు సీజన్లుగా జమకాని నగదు 2025 యాసంగిలో సేకరించిన ధాన్యం 8,421 మెట్రిక్ టన్నులు చెల్లించాల్సిన మొత్తం రూ.4.46 కోట్లు 2026 యాసంగిలో 3,900 మెట్రిక్ టన్నులు చెల్లించాల్సిన డబ్బు రూ.1.96 కోట్లు -
ముర్రుపాలు అమృతంతో సమానం
● శిశువు పుట్టిన గంటలోపే పట్టాలి ● డీఎంహెచ్ఓ డాక్టర్ సుధాకర్ లాల్ అనంతగిరి: శిశువు పుట్టిన గంటలోపే ముర్రుపాలు తాపించాలని, ఈ పాలు పిల్లల పాలిట అమృతంతో సమానమని డీఎంహెచ్ఓ డాక్టర్ కే సుధాకర్ లాల్ అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను (ఆగస్టు ఒకటి నుంచి 7వ తేదీ వరకు) పురస్కరించుకొని శనివారం వికారాబాద్ పట్టణం రామయ్యగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేశారు. పుట్టిన పిల్లలకు ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే పట్టాలన్నారు. తల్లిపాలలో రోగ నిరోధక శక్తి ఉంటుందన్నారు. పిల్లల మెదడుకు, శారీరక ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుందన్నారు. తల్లి బిడ్డల మధ్యలో అనుబంధం పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ వరలక్ష్మి, డాక్టర్ అమృత లక్ష్మి, వైద్యాధికారి డాక్టర్ సౌమ్య, డిప్యూటీ డెమో శ్రీనివాసులు, మురళి, మహేశ్కుమార్, వైద్యారోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం!
మొయినాబాద్: పాఠశాల విద్యార్థులను తరలించే ప్రైవేటు బస్సులు ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పాటించడం లేదు. వీరి చర్యలతో పిల్లలకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని దుస్థితి నెలకొంది. ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్లో వెళ్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మొయినాబాద్లోని హైదరాబాద్– బీజాపూర్ జాతీయ రహదారిపై ఎన్నో యూటర్న్లు ఉన్నా.. శ్రీచైతన్య స్కూల్ బస్సులు నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో రాంగ్ రూట్లోనే ప్రయాణం సాగిస్తున్నాయి. వీరి చర్యలను చూసి మిగిలిన వాహనదారులు, స్థానికులు మండిపడుతున్నారు. పిల్లలకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారులు స్పందించి నిబంధనలు పాటించని ప్రైవేటు స్కూళ్ల బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిత్యం రాంగ్ రూట్లో వెళ్తున్న స్కూల్ బస్సులు -
ధర్నాకు తరలిన తపస్ నేతలు
కుల్కచర్ల: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తపస్ నిర్విరామంగా కృషిచేస్తోందని ఆ సంఘం మండల అధ్యక్షుడు స్వయంప్రకాశ్ అన్నారు. చలో ఇందిరాపార్క్ మహాధర్నా కార్యక్రమానికి శనివారం కుల్కచర్ల నుంచి భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని, 2008 డీఎస్సీ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. పీఆర్సీ సాధన, డీఏ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం స్పందించే వరకూ తమ పోరాటం సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మహేంద్ర బహదూర్, రవికుమార్, బుచ్చిలింగం, వెంకటయ్య, శ్రీనివాస్గౌడ్, శ్రీను, కృష్ణయ్య, గాంగ్యనాయక్ తదితరులు పాల్లొన్నారు. -
ఆలయాల అభివృద్ధికి కృషి
కాంగ్రెస్ నేత బుయ్యని శ్రీనివాస్రెడ్డి దోమ: ఆలయాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఆర్బీఓఎల్ సీఈఓ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బుయ్యని శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని దొంగ ఎన్కేపల్లిలో శివాయల నిర్మాణానికి రూ.50 వేలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాలను కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ వెంకట్రెడ్డి, ఉప సర్పంచ్ సంజీవ్కుమార్, గ్రామస్తులు సంతోష్రెడ్డి, వెంకన్న, సాయి, బాబు, గోపాల్, శేఖర్రెడ్డి, శ్రీపివాస్రెడ్డి, ఆలయ అర్చకుడు శివకుమార్, తదితరులు పాల్గొన్నారు. నియామకం మర్పల్లి: తెలంగాణ వార్డు మెంబర్స్ ఫోరం జిల్లా కన్వీనర్గా మర్పల్లి మండలం పంచలింగాల గ్రామానికి చెందిన విజయ్కుమార్ ఎన్నికయ్యారు. రాష్ట్ర ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్ల ఫోరం వ్యవస్థాపకులు బొట్ల కార్తీక్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా శనివారం వికారాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్తీక్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ ఫోరం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వార్డు మెంబర్ల ఫోరం గౌరవ అధ్యక్షుడు కనకమామిడి విష్ణు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ ప్రశాంత్, వివిధ గ్రామాల వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రి వద్ద అల్పాహారం పంపిణీ తాండూరు: మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్రెడ్డి దంపతులు శనివారం తాండూరులోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, మాతాశిశు ఆస్పత్రి ఆవరణలో పేదలు, రోగులకు అల్పా హారం పంపిణీ చేశారు. ఈనెల 5న ఎమ్మెల్యే మనోహర్రెడ్డి పుట్టిన రోజు ఉందని, ఆయన అమెరికా పర్యటనలో ఉన్నందున ముందస్తు వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పట్నంకు పైలెట్ పరామర్శ తాండూరు: తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి.. శనివారం శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిలను పరామర్శించారు. అనంతరం మహేందర్రెడ్డి తల్లి రుక్కమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. యువకుడికి విద్యుత్ షాక్ తాండూరు: రోడ్డు దాటుతున్న యువకుడు విద్యుత్ షాక్కు గురయ్యాడు. సైకిల్ టైర్ సహాయంతో బయట పడ్డాడు. ఈ ఘటన తాండూరు పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పెద్దేముల్ మండలం జనగాం గ్రామానికి చెందిన నవీన్ తాండూరులోని అంబేడ్కర్ చౌక్ సమీపంలో గల అపోలో ఫార్మసీలో పని చేస్తున్నాడు. శనివారం సాయంత్రం బహిర్భుమికి వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా డివైడర్ మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని తాకాడు. దీంతో ఒక్కసారిగా షాక్ కొట్టింది. గమనించిన యువకులు సైకిల్ టైర్ సాయంతో నవీన్ను పక్కకు నెట్టేశారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. -
నేడు ఉచిత కంటి వైద్య శిబిరం
ధారూరు: మండలంలోని కేరెళ్లిలో ఆదివారం ఉచిత కంటివైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు కేరెళ్లి సత్యసాయి సార్వజనిక కేంద్ర నిర్వాహకులు ఎం.ప్రేమ్కుమార్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శిబిరం కొనసాగుతుందని తెలిపారు. ఈఅవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతుల ఇబ్బందులు తొలగించాలి అనంతగిరి: ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్లో రైతుల ఇబ్బందులు తొలగించాలని బీజేపీ పరిగి అసెంబ్లీ ఇన్చార్జి మారుతి కిరణ్ బూనేటి కోరారు. శనివారం జిల్లా ఆర్టీఓకు వినతిపత్రం అందజేశారు. రైతులకు నిబంధనలు తెలియజేయకుండా ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధమైన విధానం అమలు చేసి, అర్హులైన రైతుల ట్రాక్టర్లకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని పేర్కొన్నారు. దుకాణంలోకి నాగుపాము తాండూరు: పట్టణంలోని ఓ షాపులోకి శనివారం నాగుపాము ప్రవేశించింది. మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ దాన్ని పట్టుకొని బయట వదిలేశారు. వివరాలిలా ఉన్నాయి. తాండూరు రైల్వే ఫ్లయ్ ఓవర్ బ్రిడ్జ్ సమీపంలోని ఓ కిరాణంలోకి నాగుపాము వచ్చింది. కుటుంబ సభ్యులు భయంతో బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ ఆ ఇంటికి వెళ్లి నాగుపామును పట్టుకొని బయట వదిలేశారు. శంకర్పల్లి: రైలు కింద పడి ఓ గుర్తు తెలియని వృద్ధురాలు(60) మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామ సమీపంలోని రైలు పట్టాలపై ఓ గుర్తు తెలియని మృతదేహం పడి ఉంది. గమనించిన లైన్మెన్ వెంటనే వికారాబాద్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పరిశీలించి, వికారాబాద్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వృద్ధురాలు కదులుతున్న రైలులో నుంచి పడి మృతి చెందినట్లుగా రైల్వే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మీర్పేట: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన బాలిక అదృశ్యమైన సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బడంగ్పేటకు చెందిన ఎర్రమల్ల భీమరాజు కుమార్తె శాలిని(17) ఇంటర్మీడియట్ చదువుతోంది. గత నెల 20వ తేదీన శాలిని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం బంధువులు, తెలిసిన వారి వద్ద వెతికినా ప్రయోజనం లేకపోవడంతో శనివారం తండ్రి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పొలాలకు దారి చూపండి
తహసీల్దార్కు మంబాపూర్ రైతుల వినతి తాండూరు రూరల్: తమ పొలాలకు వేళ్లేందుకు దారి చూపాలని పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామ రైతులు కోరారు. ఈ మేరకు శనివారం తహసీల్దార్ వెంకట్ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామ శివారులోని 115 నుంచి 117 సర్వే నంబర్లకు సంబంధించిన సుమారు ఇరవై మంది రైతులు పొలాలకు వెళ్లేందుకు సరైన దారి లేక నిత్యం అవస్థలు పడుతున్నారన్నారు. గ్రామానికి చెందిన ఒకరిద్దరు రైతులు పానాదిని ఆక్రమించడంతోనే ఈ దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయమై బాధితులమంతా కలిసి హైకోర్టును ఆశ్రయించామని వివరించారు. పానాదిని క్లియర్ చేయాలంటూ న్యాయస్థానం నుంచి వచ్చిన ఆదేశాల కాపీని తహసీల్దార్, ఎస్ఐకి అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో కోట్పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ సర్పంచు ప్రకాశం, రైతులు బిచ్చయ్య, దస్తయ్య, లాలయ్య, శ్రీనివాస్, సావిత్రమ్మ, దశరథ్, కిరణ్, బాలయ్య, భీమయ్య, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. -
మహిళ కడుపులో పది కిలోల కణతి
ఆపరేషన్ ద్వారా తొలగించిన వినాయక ఆస్పత్రి వైద్య బృందం తాండూరు: పట్టణంలోని వినాయక ఆస్పత్రిలో ఓ మహిళ కడుపు లోనుంచి పది కిలోల బరువున్న కణతిని తొలగించారు. తాండూరుకు చెందిన శశికళ కొంతకాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. స్కానింగ్ నిర్వహించగా భారీ కణతి ఉన్నట్లు గుర్తించారు. ఆందోళనకు గురైన శశికళ కుటుంబ సభ్యులు శాంతినగర్ పార్క్ ఎదుట ఉన్న వినాయక ఆస్పత్రిలో సంప్రదించగా గైనకాలజిస్ట్ డాక్టర్ అమృత్, సర్జన్ అర్జున్, మత్తు వైద్యుడు హరీష్ బృందం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో విజయవంతంగా ఆపరేషన్ పూర్తిచేశారు. శశికళ కడుపు లోనుంచి 10.06 కిలోల కణతిని తొలగించారు. -
స్నేహమేవ జయతే
హుడాకాంప్లెక్స్: ‘అల్లాయే దిగివచ్చి.. ఏమి కావాలంటే..? మిద్దెలొద్దు.. మేడలొద్దు.. పెద్దలెక్కే గద్దెలొద్దంటా.. ఉన్ననాడు.. లేనినాడు ఒకే ప్రాణమై నిలిచే.. ఒక్క దోస్తే చాలంటా.. స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. స్నేహమేరానాకున్నది.. స్నేహమే నాపెన్నిధి’ అంటూ సినీనటుడు కై కాల, ఎన్టీఆర్ ఏళ్ల క్రితం ఆలపించిన ఆ పాట చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఇదే స్ఫూర్తితో రంగారెడ్డి జిల్లా హస్తినాపురానికి చెందిన రాందేశ్పాండే 2008లో స్నేహితుల కలయిక కోసం ‘స్నేహమేవ జయతే’ సంక్షేమ సంఘాన్ని స్థాపించారు. కేవలం నలుగురు మిత్రులతో మొదలైన ఈ స్నేహ ప్రస్థానం.. ప్రస్తుతం మూడు వందల మందికిపైగా విస్తరించింది. ‘స్నేహాన్ని కన్న మిన్న లోకాన లేదురా’ అంటూ దోస్తీ గొప్పతనాన్ని నేటి తరానికి వివరిస్తుంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆగస్టు 2న స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వీరంతా ఒకే వేదికపై కలుసుకుని, ఆర్థికంగా వెనుకబడిన స్నేహితులకు అండగా నిలబడటంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులకు నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేస్తుంటారు. ఆ తర్వాత వినాయక చవితిని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తుంటారు. వీధుల్లో ప్రమాదకరంగా మారిన గుంతలను పూడ్చే కార్యక్రమం సహా స్నేహం విలువను చాటి చెబుతుంటారు. పర్యావరణ పరిరక్షణ, నీటిపొదుపు, పాలిథిన్ బ్యాగుల నిషేధం, అనాథ శరణాలయాల్లో అన్నదానం జాతి నేతల గొప్పతనంపై కరపత్రాల పంపిణీ, రాఖీ రోజున ఫ్రెండ్షిప్ బాండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతూ నవతరం స్నేహితులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నలుగురితో మొదలై.. నేడు 300 మందికి విస్తరణ స్నేహం విలువను చాటి చెబుతున్న స్నేహమేవ జయతే సంస్థ సభ్యులు -
వాగ్వివాదాల నడుమ అభివృద్ధి పనులపై చర్చ
గ్రామసభ.. రసాభాస బొంరాస్పేట: గ్రామ సమస్యలు, అభివృద్ధి పనుల గురించి చర్చించాల్సిన గ్రామసభ రసాభాసగా మారింది. మండల కేంద్రమైన బొంరాస్పేటలో సర్పంచ్ వీరేశలింగం అధ్యక్షతన శనివారం నిర్వహించిన సభలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య కొంత వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం గ్రామ సమస్యలు, అభివృద్ధి పనుల గురించి చర్చించారు. పారిశుధ్యం అంశాలపై చర్యలు తీసుకోవాలని సభదృష్టికి తెచ్చారు. సీసీరోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలన్నారు. వీధిలైట్లు, ప్రమాదకరంగా ఉన్న కరెంటు తీగలు సరిచేయాలన్నారు. ఉప్పరికాలనీ, గొల్లవాడలకు తాగునీటి సమస్య తీర్చాలన్నారు. అంగన్వాడీలు పాఠశాలల ఆవరణల్లో ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంగన్వాడీ కార్యకర్తలు పేర్కొన్నారు. దీనికి స్పందించిన ఎన్ఆర్ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నర్సింలుగౌడ్ మాట్లాడుతూ.. ఎస్సీ, బీసీ కాలనీల్లో అంగన్వాడీ కేంద్రాలకు నూతన భవనాలు మంజూరయ్యాయని తెలిపారు. గ్రామ సభలకు అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని నేతలు సూచించారు. ఇందులో ఎంపీఓ రవినాయక్, పీహెచ్సీ మెడికల్ అధికారి హేమంత్కుమార్, గ్రామ కార్యదర్శి సుచిత్ర, ఉప సర్పంచ్ నందిని, బీజేపీ మండల అధ్యక్షుడు జగదీశ్సాగర్, రామకృష్ణగౌడ్, అనిల్, సంగాయిపల్లి నర్సింలు, రాములు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
రోడ్లు ఛిద్రం.. ప్రయాణం నరకం
పూడూరు: వరుస వర్షాలతో గ్రామీణ ప్రాంతాల దారులన్నీ ఛిద్రమయ్యాయి. గోతులు ఏర్పడి, నీరు నిలిచి ప్రమాదాలకు నిలయంగా మారాయి. వాహనం నడపాలంటే వెన్నులో వణుకుపుడుతోందని చోదకులు వాపోతున్నారు. ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొంటున్నారు. పూడూరు మండల పరిధి అంగడిచిట్టంపల్లి– లాల్పహాడ్ రోడ్డు పూర్తిగా రూపం కోల్పోయింది. అంగడిచిట్టంపల్లి, మీర్జాపూర్, పూడూరు, కంకల్, చన్గోముల్ ప్రధాన రోడ్డు అధ్వానంగా మారాయి. ఇందులో లాల్పహాడ్– కంకల్ రహదారి విస్తరణ పనులను సదరు కాంట్రాక్టర్ మధ్యలో వదిలేయడంతో ఆ మార్గం మరింత దయనీయంగా మారింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రోడ్డు కుంటను తలపిస్తోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి, రహదారుల మరమ్మతు, నిర్మాణ పనులు నాణ్యతగా త్వరంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
జైల్భరోను జయప్రదం చేయండి
అనంతగిరి: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ విధానాలను నిరసిస్తూ ఈ నెల 10న చేపట్టనున్న జైల్భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి పద్మ పిలుపునిచ్చారు. శనివారం వికారాబాద్ సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని విస్మరిస్తుందని ఆరోపించారు. వ్యాపార వేత్తలకు లబ్ధిచేకూరే విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు. ఈ విధానాలను ఉపసంహరించుకోవాలని సూచించారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, వెంకటయ్య, బుగ్గప్ప, రామకృష్ణ పాల్గొన్నారు. -
నకిలీ డీఏపీ పట్టివేత
49 బస్తాలు స్వాధీనం బంట్వారం: నకిలీ డీఏపీ 49 బస్తాలు పట్టుబడ్డాయి. ఈ సంఘంటన మండల పరిధి రొంపల్లిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ రైతులు కొందరు.. పెద్దేముల్కు చెందిన పి.రాజు దగ్గర డీఏపీని కొనుగోలు చేశారు. శనివారం పంటలకు వేసే సమయంలో అనుమానం రావడంతో వ్యవసాయ అఽధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఏఓ శ్రావ్య, ఎస్ఐ విమల గ్రామానికి చేరుకున్నారు. రైతులతో మాట్లాడి డీఏపీని పరిశీలించారు. ఐదు మంది రైతుల వద్ద 49 అనుమానాస్పద బస్తాలను స్వాధీనం చేసుకున్నామని ఏఓ తెలిపారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించామన్నారు. నకిలీ డీఏపీ విక్రయించిన రాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు, చేస్తున్నామని ఎస్ఐ చెప్పారు. లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దే ఎరువులు కొనుగోలు చేయాలని, బిల్లులు తప్పని సరిగా తీసుకోవాలని సూచించారు. -
సమన్వయంతో పనిచేయండి
నవాబుపేట: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలు పరిష్కరించాలని జెడ్పీ సీఈఓ సుధీర్ సూచించారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సమీక్షాసమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ఆయా శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ, విద్య, వైద్య ఆరోగ్యం, విద్యుత్, హౌసింగ్, మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా, పశుసంవర్ధక, ఆర్అండ్బీ, ఉద్యాన, ఎకై ్సజ్, ఇరిగేషన్, ఫారెస్ట్, వెటర్నరీ తదితర శాఖల అధికారులతో మాట్లాడి ఆయా విభాగాల పురోగతిని ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచ్లు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన సీఈఓ ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని అధకారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారంపై ఎప్పటికప్పుడు స్పందించాలన్నారు. వీబీజీరాజ్జీ పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆర్అండ్బీ ఏఈ సుస్మిత సభలో నివేదికను వివరిస్తుండగా.. ఆర్అండ్బీ రోడ్లు మంజూరై ఏళ్లు గడుస్తున్నా ఎందుకు నిర్మించడం లేదని సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు కొండల్ యాదవ్ ప్రశ్నించారు. రోడ్లు అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే కాలె యాదయ్య చెబుతున్నా ఎక్కడా ఆ దాఖలాలు కనిపించడం లేదన్నారు. ఈవిషయంపై దాతాపూర్ సర్పంచ్ బల్వంత్రెడ్డి స్పందిస్తూ ఎమ్మెల్యే గ్రామాలను అభివృద్ధి చేశారని, రోడ్ల నిర్మాణం కూడా జరుగుతోందని చెప్పడంతో కొద్దిసేపు సభలో గందరగోళం నెలకొంది. పోలీసులు, అధికారులు కలగజేసుకొని ఇద్దరికీ నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. మండల ప్రత్యేక అధికారి కవిత అధ్యక్షతన, ఎంపీడీఓ అనురాధ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, ఎంఈఓ అబ్దుల్ రహమాన్, ఎంహెచ్ఓ రోహిత్, డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కుమార్రెడ్డి, ఎంపీఓ విజయ్కుమార్, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాసమస్యలను పరిష్కరించండి జెడ్పీ సీఈఓ సుధీర్ ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్ష -
సాగు కళకళ
● పొలం బాటలో అన్నదాతలు ● వరినాట్లు వేసేందుకు కరిగెట్లు ● ఆశాజనకంగా పత్తి, మొక్కజొన్న నాలుగు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షానికి అన్నదాతలు పొలం బాట పట్టారు. ఎప్పుడెప్పుడా అని నింగి వైపు చూసిన రైతులను వరుణుడు కరుణించాడు. దీంతో వరి నాటు వేసేందుకు కరిగెట్లు చేస్తున్నారు. పత్తి, మొక్కజొన్న పంటలు కళకళలాడుతున్నాయి. – షాబాద్ నరెడ్లగూడలో పత్తి పంట మల్లారెడ్డిగూడలో కళకళలాడుతున్న మొక్కజొన్న -
గుప్త నిధుల పేరిట మోసం!
బషీరాబాద్: గుప్తనిధి ఆశ చూపించాడు.. ఇంటి ఆవరణలో కోట్ల విలువైన నిధి దాగి ఉందంటూ నమ్మించాడు. ప్రత్యేక పూజలు, తంత్రాలు చేస్తే అది బయటపడుతుందని చెప్పాడు. ఇందుకోసం విడతలవారీగా రూ.8 లక్షలు వసూలు చేసి, మాయమయ్యాడు. నమ్మకంగా వల.. కర్ణాటకకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి ద్వారా జీవన్గీకి చెందిన ఇద్దరు వ్యక్తులకు గతేడాది ఆగస్టులో హైదరాబాద్ దూల్పేట వాసి లక్ష్మణ్సింగ్ హజారీ పరిచయమయ్యాడు. అతీంద్రియ శక్తులు కలిగిన బాబాగా తనకు తాను చెప్పుకొన్నాడు. ఒకరోజు జీవన్గీకి వచ్చి ఓ ఇంటిని పరిశీలించిన సదరు బాబా.. ఇంట్లో కోట్ల విలువైన బంగారు నిధి ఉందని, ప్రత్యేక పూజలు, మంత్రాలతో వెలికి తీస్తానని నమ్మించాడు. ఆతర్వాత నిధికి నాగబంధం ఉందని, దాన్ని తొలగించేందుకు ప్రత్యేక హోమాలు, అరుదైన పూజా సామగ్రి అవసరమని చెప్పాడు. ఇందుకోసం దశలవారీగా ఇద్దరి నుంచి సుమారు రూ.8 లక్షలు వసూలు చేశాడు. మట్టి కుండతో మాయాజాలం ఓ రోజు నిధిని బయటకు తీస్తానని చెప్పిన బాబా.. ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి, ఎవరినీ రావొద్దన్నాడు. అర్ధరాత్రి సమయంలో పూజలు నిర్వహించి, తవ్వకాలు చేపట్టి ముందుగానే పాతిపెట్టినట్లు అనుమానిస్తున్న ఓ మట్టి కుండను వెలికి తీశాడు. అందులో నుంచి ఓ బంగారు రంగున్న బిల్లను చూపించి నిధి బయటపడిందని చెప్పాడు. దీంతో తవ్వకాలు చేయించినవారు ఎంతో సంతోషించారు. అయితే నాగబంధం పూర్తిగా తొలగిపోలేదని, వారం రోజుల్లో తిరిగి వచ్చి, ప్రత్యేక పూజల అనంతరం పూర్తి నిధిని అప్పగిస్తానని, అప్పటి వరకు కుండను ఎవరు తాకినా ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించి వెళ్లిపోయాడు. ఆరోజు నుంచి నకిలీ బాబా తిరిగిరాలేదు. ఫోన్ చేసినా అందుబాటులోకి రాకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది. కొద్ది రోజుల తర్వాత కుండను తెరిచి చూడగా అందులో 78 బంగారు రంగు బిళ్లలను గుర్తించారు. వీటిని కర్ణాటకలోని ఓ బంగారం వ్యాపారి వద్దకు తీసుకెళ్లి పరీక్షించగా నకిలీవని తేలడంతో మోసపోయామని గుర్తించి లోలోపలే మదనపడ్డారు. ఈ విషయం బయటకు తెలిస్తే పరువుపోతుందని, పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. ఎలాగైనా తమను మోసగించిన బాబాను పట్టుకోవాలని పలుమార్లు దూల్పేట్లోని అతని ఇంటికి వెళ్లినా ఆచూకీ లభించలేదు. అతడి భార్య దివ్యభాయి కూడా ఇలాంటి మోసాలకు పాల్పడి జైలుకు వెళ్లిందని చుట్టుపక్కల వారు చెప్పడంతో బాధితులు నిరాశగా తిరిగి వచ్చినట్లు సమాచారం. గుప్తనిధులు తవ్వించిన ఇద్దరు వ్యక్తులు.. బాబాకు సమర్పించిన రూ.8 లక్షల్లో.. మరికొంత మంది వద్ద తీసుకున్న డబ్బులు కూడా ఉన్నాయి. నిధి దొరికిన తర్వాత పెద్దమొత్తంలో తిరిగిస్తామని చెప్పడంతో వారు కూడా సరేనన్నారు. కానీ, ఏడాది కావస్తున్నా ఇచ్చిన డబ్బులైనా చేతికి అందకపోవడంతో సదరు వ్యక్తుల ఇళ్లకు వెళ్లి గొడవ పెట్టుకున్నారు. బాబా ఎవరో తమకు తెలియదని, మిమ్మల్ని నమ్మి ఇచ్చాం కాబట్టి మీరు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఈవిషయం ఈనోటా ఆనోటా బయటకు పొక్కింది. ఇద్దరి నుంచి రూ.8 లక్షలు వసూలు చేసిన నకిలీబాబా జీవన్గీలో నాటకీయంగా వెలుగుచూసిన ఘటన -
చెట్లపొదల్లోకి దూసుకెళ్లిన కారు
కుల్కచర్ల: అదుపు తప్పిన కారు చెట్లపొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. చెల్లాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుల్కచర్లకు కారులో వస్తుండగా ముందు టైరు పేలడంతో రోడ్డు కిందకు వేగంగా దూసుకెళ్లింద. వాహనంలోని ఇద్దరు పిల్లలకు స్వల్పగాయాలయ్యాయి. రూ.2 కోట్ల విలువైన సామగ్రి స్వాధీనం హుజూర్నగర్: మార్కెట్లో డీఏపీ కొరతను ఆసరాగా చేసుకుని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కొందరు ముఠాగా ఏర్పడి నకిలీ డీఏపీ తయారు చేసి విక్రయిస్తున్న ఆరుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన కొండేటి పిచ్చిరెడ్డితో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది ముఠాగా ఏర్పడి నకిలీ డీఏపీ దందాకు తెరలేపారు. హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్మెట్లో గోడౌన్ ఏర్పాటు చేసి నకిలీ డీఏపీని తయారు చేసి అక్కడి నుంచి పలు దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. రైతులకు నకిలీ ఎరువు బస్తాలు వస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈనెల 15న మఠంపల్లి ఏఓ బొలిశెట్టి శ్రీనివాస్ పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు రఘునాథపాలెంలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ కొండేటి పిచ్చిరెడ్డి అనే వ్యాపారి దగ్గర నకిలీ డీఏపీ బస్తాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మఠంపల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి సీఐ చరమందరాజు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఆరుగురు నిందితుల అరెస్ట్.. పరారీలో ఇద్దరు పిచ్చిరెడ్డి ఇచ్చిన సమాచారంతో అబ్దుల్లాపూర్మెట్లోని జగదీష్ అలియాస్ జక్కప్ప, ఆనంద్ రావుకు సంబంధించిన తయారీ కంపెనీలో పోలీసులు తనిఖీ చేశారు. అక్కడ 1000 డీఏపీ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరీక్షించగా.. నకిలీదని తేలింది. దీంతో రఘునాథపాలెం గ్రామానికి చెందిన కొండేటి పిచ్చిరెడ్డి, వికారాబాద్ జిల్లా పెద్దేముల్ గ్రామానికి చెందిన పొలే వెంకటేశ్వర్లు, ఏపీలోని కర్నూలు పట్టణానికి చెందిన పింజారి మౌలాలి, జోగులాంబ గద్వాల జిల్లాలోని లింగనవాయి గ్రామానికి చెందిన అబ్దుల్ రెహమాన్, కర్నాటక రాష్ట్రంలోని విజయపురి జిల్లా దేవరౌప్పరి తాలూకా మానూర్ గ్రామానికి చెందిన హీర్లకొండ సంతోష్ కుమార్, మఠంపల్లి మండలం బక్కమంతుగూడేనికి చెందిన పింగళి గంగామహేశ్వరరెడ్డిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి డీసీఎం, ఓ కారు, ఐదు సెల్ఫోన్లు, వివిధ కంపెనీల లేబుల్ కలిగిన నకిలీ డీఏపీ బస్తాలు, నకిలీ ఎరువు మందులు తయారు చేయడానికి వాడిన మిషన్, నకిలీ పాస్పేట్, దాదాపు రూ.2 కోట్ల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆనంద్, జగదీశ్ అనే ఇద్దరు పరారీలో ఉన్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. కేసు విచారణలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐలు ప్రవీణ్, నవీన్, ఏఎస్ఐ బలరాం రెడ్డి, సిబ్బంది శంభయ్య, నాగరాజును అభినందించారు. షాబాద్: ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలైన సంఘటన నాగరగూడ ఎక్స్ రోడ్డులో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని నాగరగూడ ఎక్స్ రోడ్డు వద్ద షాద్నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును శంషాబాద్ వైపు నుంచి వస్తున్న లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 15 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్రంగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారికి నాగరగూడ శ్రీనివాస ఆస్పత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిలో చేవెళ్ల మండలం దేవరంపల్లి గ్రామానికి చెందిన నామ మమత, శంషాబాద్ మండలం సుల్తాన్పల్లికి చెందిన శిరీష, మరో ఇద్దరు ఉన్నారు. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కాలె శ్రీకాంత్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఆయన వెంట చేవెళ్లకు చెందిన కాంగ్రెస్ నాయకుడు మధుసూదన్గుప్తా ఉన్నారు. షాద్నగర్: వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని నందిగామ సీఐ వీరబాబు అన్నారు. శుక్రవారం నందిగామ మండల కేంద్రంలో పోలీసులు ప్రత్యేక నాకాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. 80 వాహనాలు తనిఖీ చేసి 53 వాహనాలకు పెండింగ్లో ఉన్న చలాన్లను క్లియర్ చేయించారు. ఎనిమిది మంది వాహనదారులకు స్పాట్ చలాన్లు విధించారు. డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనం నడిపిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీఐ వీరబాబు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపట్టామన్నారు. -
రైతుల త్యాగం గుర్తుండిపోతుంది
● భూ సేకరణకు సహకరించాలి ● బాధిత రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది ● తాండూరు ఆర్డీఓ అనితబొంరాస్పేట: సాగునీటి ప్రాజెక్టుల కోసం భూములిచ్చే రైతుల త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతుందని తాండూరు ఆర్డీఓ అనిత అన్నారు. మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా కాలువ నిర్మాణానికి అవసరమైన భూములు ఇచ్చి సహకరించాలని రైతులను కోరారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రతి ఎకరాకు రూ.20 లక్షల చొప్పన నష్టపరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. శుక్రవారం మండలంలోని చౌదర్పల్లి భూ సేకరణలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొడంగల్ నియోజకవర్గంలో 1,400 ఎకరాలు, దౌల్తాబాద్ మండలంలో 900 ఎకరాలు, బొంరాస్పేట మండలంలో 200 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. దౌల్తాబాద్ మండలం తిమ్మారెడ్డిపల్లి, నీటూరు, మాటూరు, కొడంగల్ మండలం పెద్దనందిగామ, దుద్యాల్ మండలం గౌరారం, హంసాన్పల్లి, బొంరాస్పేట మండలం చౌదర్పల్లి, తుంకిమెట్ల తదితర గ్రామాల మీదుగా కాలువ వెళ్తుందన్నారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేరి రాజేశ్రెడ్డి మాట్లాడుతూ.. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. భూగర్భ జలాలు పెరిగి సస్యశ్యామలం అవుతుందన్నారు. భూములు ఇచ్చి ప్రభుత్వానికి సహకరించాలన్నారు. రైతుల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ పద్మావతి, ఇరిగేషన్ అధికారి కృష్ణమోహన్గౌడ్, ఆర్ఐ శిరీష, సర్పంచ్ కల్పనారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
పరిసరాల పరిశుభ్రత మన బాధ్యత
● సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి ● రోగులకు మెరుగైన వైద్యం అందాలి ● డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్ దోమ: పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా వైద్యాధికారి సుధాకర్ లాల్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా రికార్డులు, ఆస్పత్రి గదులను పరిశీలించారు. ఆస్పత్రి ఆవరణలో పెరిగిన గడ్డిని సిబ్బందితో కలిసి తొలగించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించడం మన బాధ్యత అని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి రజిత, సర్పంచ్ మాలిష్ శివకుమార్ రెడ్డి, హెచ్ఈఓ ప్రభులింగం, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆకస్మిక తనిఖీ అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని స్కైలార్క్ డయాగ్నస్టిక్స్ సెంటర్ను జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ లాల్ శుక్రవారం తనిఖీ చేశారు. ప్రయోగశాల, మౌలిక వసతులు, పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. -
ఆయిల్ పామ్తో స్థిర ఆదాయం
చేరువైన దూరవిద్య! చదువు మానేసి, చదువుకోవాలన్న ఆసక్తి ఉన్న వారికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా దూరవిద్య అందనుంది.● రైతులు మొగ్గు చూపాలి ● త్వరలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ● కలెక్టర్ దీపక్ తివారి పరిగి: ఆయిల్ పామ్ సాగుతో దీర్ఘకాలిక ఆదాయం పొందవచ్చని, రైతులు మొగ్గు చూపాలని కలెక్టర్ దీపక్ సూచించారు. శుక్రవారం మండలంలోని సుల్తాన్పూర్ తండాలో సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటను, అంతర పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు పంట మార్పిడిపై దృష్టి సారించాలన్నారు. ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం అనేక సబ్సిడీలు అందజేస్తోందని తెలిపారు. త్వరలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పరిగి మండలంలో వెయ్యి ఎకరాల్లో సాగు చేసేందుకు రైతులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆసక్తి గల రైతులు ఉద్యాన శాఖ అధికారుల సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్(ట్రైయినీ) సచిన్ బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. సుడిగాలి పర్యటన బొంరాస్పేట: మండలంలో శుక్రవారం కలెక్టర్ దీపక్ తివారి పర్యటించారు. బొంరాస్పేట్ పీహెచ్సీ, ఆశ్రమ పాఠశాల, పూరిళ్లను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. బొట్లోనితండా గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. వంటలను తనిఖీ చేశారు. భోజనాన్ని పరిశీలించారు. పాఠశాల నూతన భవన నిర్మాణం కోసం తుంకిమెట్ల శివారులో గల రెండు ఎకరాల భూమిని కేటాయించాలని తహసీల్దార్ పద్మావతికి సూచించారు. నాగిరెడ్డిపల్లిలో పూరింట్లో ఉన్న వారిని పలకరించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి, డీటీడీఓ జనార్దన్, ఇంచార్జ్ ఎంపీడీఓ వెంకన్గౌడ్, వైద్యాధికారి హేమంత్కుమార్, హెచ్ఎం విక్రమంసింగ్, వార్డన్ రాజన్న తదితరులు పాల్గొన్నారు. పనుల్లో వేగం పెంచండి దుద్యాల్: హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. శుక్రవారం ఎస్సీ స్నేహమెహ్రతో కలసి ఎడ్యుకేషన్ హబ్లో పర్యటించారు. నర్సింగ్ కళాశాల, పార మెడికల్, ఫిజియోతెరపీ, వెటర్నరీ హాస్పిటల్, మెడికల్ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణాలపై ఆరా తీశారు. ప్రస్తుతం ఉన్న వనరులు సరిపోకుంటే మరిన్ని యంత్రాలు సమకూర్చుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన గడువు కంటే ముందే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్(ట్రైయినీ) సచిన్ బస్వరాజ్ గుట్టూర్ తదితరులు పాల్గొన్నారు. -
పట్నం కుటుంబానికి పరామర్శ
షాబాద్: శాసన మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పట్నం అవినాశ్రెడ్డి కుటుంబ సభ్యులను శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌర్ పరామర్శించారు. మహేందర్రెడ్డి తల్లి పట్నం రుక్కమ్మ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సాట్ చైర్మన్ శివసేనరెడ్డి, తాండూరు మాజీ ఎమ్మెల్యే రమేశ్మహరాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధూసూదన్రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, పామెన భీంభరత్, కాలె శ్రీకాంత్, పెంటారెడ్డి, సర్పంచ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది
అనంతగిరి: ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని స్పీకర్ ప్రసాద్కుమార్ అన్నారు. వికారాబాద్ మండలం సిద్దులూర్ జెడ్పీహెచ్ఎస్ జీహెచ్ఎం రామకృష్ణారెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమం శుక్రవారం పట్టణంలోని కొండా బాలకృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగికీ పదవీ విరమణ తప్పదన్నారు. విధి నిర్వహణలో మనం చేసిన సేవలే చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. రామకృష్ణారెడ్డి ఎక్కడ విధులు నిర్వహించినా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. విద్యార్థులతో మమేకమై విద్యాబుద్ధులు నేర్పించారని కొనియాడారు. అనంతరం ఆయన్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్రెడ్డి, జిల్లా అధ్యక్షులు కడియాల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి అమర్నాథ్, మున్సిపల్ వైస్చైర్మన్ సుధాకర్రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్కుమార్, సీనియర్ నాయకులు కిషన్నాయక్, ఎండీ హఫీజ్, సిద్దులూర్ సర్పంచ్ శ్రీనివాస్, కౌన్సిలర్లు బాదం అనురాధ అశోక్, రమ్య శ్రీకాంత్, రామకృష్ణారెడ్డి, శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. స్పీకర్ ప్రసాద్కుమార్ -
నకిలీ డీఏపీ పట్టివేత
తాండూరు రూరల్: నియోజకవర్గంలో నకిలీ డీఏపీ కలకలం రేపుతోంది. ఇప్పటికే పరిగి, యాలాల మండలాల్లో నకిలీ డీఏపీని వ్యవసాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకోగా.. శుక్రవారం తాండూరు మండలం చెంగోల్ గ్రామంలో నకిలీ డీఏపీ పట్టుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, కరన్కోట్ పోలీసులు 89 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. తాండూరు ఏడీఏ అరుణ, పోలీసుల కథనం ప్రకారం.. ఉదయం గ్రామంలోని పలువురి రైతుల ఇళ్లల్లో తనిఖీ చేశారు. 89 బస్తాలను స్వాధీనం చేసుకొని కరన్కోట్ పోలీస్స్టేషన్కు తరలించారు. పెద్దేముల్ గ్రామానికి చెందిన పోల రాజు, ఆత్కూర్కు చెందిన శివకుమార్ వీటిని విక్రయించినట్లు తేలింది. దీంతో వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధాన సూత్రధారి పెద్దేముల్ వాసి జిల్లాలో నకిలీ డీఏపీ విక్రయించడంలో పెద్దేముల్ గ్రామానికి చెందిన పోల రాజుగా పోలీసులు గుర్తించారు. పరిగి, యాలాల కూడా ఆయనపై కేసులు నమోదయ్యాయి. చెంగోల్లో దాదాపు 200 బస్తాలు విక్రయించినట్లు తెలిసింది. ప్రస్తుతం 89 బస్తాలను స్వాధీనం చేసుకోగా మిగిలిన 111 బస్తాలను రైతులు పొలాల్లో వరి, పత్తి పంటలకు వాడినట్లు అధికారులు గుర్తించారు. రైతులు నకిలీ డీఏపీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఏడీఏ అరుణ, మండల అధికారి కొమురయ్య సూచించారు. ● 89 బస్తాలను స్వాధీనం చేసుకున్న అధికారులు ● చెంగోల్లో ఘటన -
ఉద్యమకారుల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి
ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి పరిగి: తెలంగాణ ఉద్యమకారుల రెండు తరాల అపూర్వ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు పిడమర్తి రవి అన్నారు. శుక్రవారం పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సమ్మేళనం వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 16న నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించనున్న సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారుల న్యాయమైన హక్కులు, సంక్షేమ ప్రయోజనాలు అందేలా ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించడం స్వాగతిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు నక్క రమేష్, సురేష్, రహీం, పీర్మహ్మద్ తదితరులు పాల్గొన్నారు. తాండూరు: మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారు. పది రోజుల పాటు వర్జీనియా రాష్ట్రంలో పర్యటించనున్నారు. లీస్బర్గ్లోని స్టోన్ టవర్ వైనరీని పరిశీలించారు. వైనరీల తయారీ విధానం, ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. జర్నలిస్టుల సమస్యలపై నిరంతర పోరాటం టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ అనంతగిరి: జర్నలిస్టుల సమస్యలు, ఇళ్ల స్థలా ల సాధన కోసం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(హెచ్143) ఆధ్వర్యంలో నిరంతరం పోరాటం సాగిస్తామని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చి న హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయా లని డిమాండ్ చేశారు. శుక్రవారం వికారాబాద్లో జిల్లా అడహక్ కమిటీ సన్నాహక సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాల కేటాయించాలన్నారు. అనంతరం టీయూడబ్ల్యూజే జిల్లా నూతన అడహక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కన్వీనర్గా ఎం.రవీందర్, కోకన్వీనర్లుగా ప్రహ్లాదాచారి, శ్రీనివాస్, నర్సింలు, ఆనంద్, జావీద్, రాజు, బస్వరాజ్, సంతోష్, మల్కయ్య గౌడ్, కృష్ణ, రాజేందర్ గౌడ్ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కోశాఽ దికారి యేగానంద్, జాతీయ కౌన్సిల్ స భ్యుడు తిరుపతినాయక్, కన్వీనర్ ఆసీఫ్ హు స్సేన్, జిల్లా నాయకులు రవీందర్, ఆసీఫ్ ప్రహ్లాదాచారి, శ్రీనివాస్, నర్సింలు, ఆనంద్, జావీద్, రాజు, బస్వరాజ్, సంతోష్, మల్కయ్య గౌడ్, కృష్ణ పాల్గొన్నారు. ఘన సన్మానం అనంతగిరి: విధి నిర్వహణలో మనం చేసిన సే వలే చిరకాలం నిలిచిపోతాయని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. ఉద్యోగ విరమణ పొందన చంగోముల ఎస్ఐ చంద్రయ్య, డీసీఆర్బీ ఎస్ఐ అబ్దుల్ గఫార్, బషీరాబాద్ ఏఎస్ఐ చంద్ర శేఖర్, నవాబ్పేట్ పీఎస్ కానిస్టేబుల్ ఇర్షాద్ అలీని శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. -
పనుల్లో వేగం పెంచండి
● బ్రహ్మోత్సవాల నాటికి ఆలయ నిర్మాణం పూర్తి కావాలి ● సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు కొడంగల్: పట్టణంలోని పద్మావతీ సమేత మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ నవీకరణ పనుల్లో వేగం పెంచాలని సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు అన్నారు. శుక్రవారం కలెక్టర్ దీపక్ తివారితో కలిసి కొడంగల్లో పర్యటించారు. శ్రీవారి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. కొత్తగా నిర్మిస్తున్న కట్టడాలను గమనించారు. పనుల్లో పురోగతి సాధించాలని కాంట్రార్లకు సూచించారు. అనంతరం కడా కార్యాలయంలో ఇంజనీరింగ్, కన్సల్టెన్సీ ఏజెన్సీ, ప్లానింగ్ డిజైనర్స్, కాంట్రాక్టర్లతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి నెలలో నిర్వహించే బ్రహ్మోత్సవాల నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. భూ సేకరణ పనులను పూర్తి చేయాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా నిర్మాణ పనులు చేయాలన్నారు. సంప్రదాయ శైలిని కాపాడుతూ నాణ్యతా ప్రమాణాలను పాటించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ప్రధాన ఆలయం, అమ్మవార్ల ఆలయాలు, ఉప ఆలయాలు, మాడ వీధులు, క్యూలైన్, కల్యాణ మంటపం, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, స్నాన ఘట్టాలు, ప్రత్యేక అవసరాల గదులు, పార్కింగ్, పుష్కరిణి, ప్రసాదం కౌంటర్లు నిర్మించాలన్నారు. పనుల్లో జాప్యం జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో ట్రైయినీ అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ బస్వరాజ్, మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ గుప్తా, ఆర్అండ్బీ ఎస్ఈ వసంతనాయక్, డీఈ శ్రీధర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బలరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
చివరికి చిక్కారు
చోరీబాట పట్టారు..ఇబ్రహీంపట్నం రూరల్: తాళాలు పగులగొట్టి ఇళ్లలో చోరీకి పాల్పడుతున్న ఘరానా దొంగను ఆదిభట్ల పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఏసీపీ ప్రదీప్రెడ్డి, సీఐ రమేష్ శుక్రవారం వివరాలు వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రం జుజువార్ గ్రామానికి చెందిన ముకేష్ చౌదరి (35) హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో నివాసం ఉంటూ డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. గతంలో యాప్రాల్లో హార్డ్వేర్ దుకాణం నిర్వహించిన అతను చెడు అలవాట్లకు లోనై వ్యాపారంలో నష్టాలు రావడంతో చోరీబాట పట్టాడు. అతనిపై పీడీయాక్ట్ కూడా నమోదైంది. ఆదిభట్ల పోలీస్స్టేషన్ పరిధిలో ఈ నెల 19న జరిగిన చోరీ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి సుమారు రూ.ఆరు లక్షల విలువైన బంగారం, 30 తులాల వెండి అభరణాలు, మొబైల్, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఆయా పోలీస్స్టేషన్లలో 17 కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు. ఇద్దరు బైక్ దొంగల అరెస్టు పార్కింగ్ చేసిన బైక్లను దొంగిలిస్తున్న యువకులను ఆదిభట్ల, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. నగరానికి చెందిన సయ్యద్ ఖాసీం హుస్సేన్ (18), మహమ్మద్ కరీమ్ (19) బైక్ చోరీలకు పాల్పడుతున్నారు. వీరిపై హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐదు కేసులు నమోదై ఉన్నాయి. నిందితులను శుక్రవారం ఆదిభట్ల, సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీరి నుంచి ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కేసులను ఛేదించిన ఎస్ఐ నోయల్రాజ్, క్రైమ్టీం ఎల్.రవికుమార్, కిరణ్రెడ్డి, ఎల్లయ్య, ఉపేందర్రెడ్డి, సందీప్, శివచంద్ర, సంతోష్కుమార్, సంతోష్, భరత్కుమార్గౌడ్ను ఏసీపీ అభినందించారు. ఆయా కేసుల్లో ముగ్గురు నిందితుల అరెస్టు బంగారం, వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం -
హడల్!
శనివారం శ్రీ 1 శ్రీ ఆగస్టు శ్రీ 2026సీజనల్..వికారాబాద్: సీజనల్ వ్యాధులు భయపెడుతున్నాయి. జలుబు, జ్వరం, కీళ్ల నొప్పులతో ప్రజలు మంచాన పడుతున్నారు. అంటువ్యాధులతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. వాంతులు, విరోచనాలతో చేరుతున్న వారి సంఖ్యలో క్రమంగా పెరుగుతోంది. పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో వందకుపైగా ఓపీ నమోదు అవుతోంది. ఇందులో 50కి పైగా సీజనల్ వ్యాధుల బారిన పడిన వారే ఉన్నారు. పది మందికి పైగా వాంతులు, విరేచనాలతో చేరుతున్నారు. వికారాబాద్ జనరల్ ఆస్పత్రిలో 400 పైగా ఓపీ నమోదు అవుతోంది. వందకు పైగా సీజనల్ వ్యాధులతో చేరుతున్నారు. ఓపీలో 50 వరకు వాంతులు విరేచనాలతో వస్తున్న వారు ఉంటున్నారు. పది మందికి పైగా అడ్మిట్ అవుతున్నారు. ఇంతకు రెండు మూడు రెట్లు ప్రైవేటు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. చికన్గున్య, మలేరియా, టైఫాయిడ్ తదితర రోగాల బారిన పడుతున్నారు. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఫీవర్ సర్వే నిర్వహించగా వందల సంఖ్యలో రోగులు మంచం పట్టినట్టు తేలింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,77,452 ఇళ్లకు వెళ్లి 4,82,798 మందికి చెందిన శాంపిల్స్ సేకరించి టెస్టులు నిర్వహించారు. ఇందులో 1,980 జ్వర పీడితులు ఉన్నారు. డెంగీ కేసులు మూడు నమోదయ్యాయి. గురువారం రాత్రి వాంతులు విరేచనాలతో ఓ మహిళ మృతి చెందింది. నవాబుపేట మండలం అక్నాపూర్ గ్రామానికి చెందిన లింగంపల్లి కాంతమ్మ వికారాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పడకేసిన పారిశుద్ధ్యం గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం లోపించడంతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. గ్రామాల్లో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండగా.. పట్టణాల్లో పారిశుద్ధ్య సమస్యలు రోజురోజుకూ అధికమవుతున్నాయి. ప్రస్తుతం వరుసగా వర్షాలు కురుస్తుండటంతో సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది. మున్సిపాలిటీల్లో చెత్త సక్రమంగా సేకరించడం లేదు. పట్టణ శివారు ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా డంప్ చేస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దుర్గంధంతోపాటు దోమలు, ఈగలు పెరిగి ఆస్పత్రుల పాలవుతున్నారు. గతంలో పట్టణ ప్రగతి పేరుతో హడావిడి చేసిన మున్సిపల్ అధికారులు సీజనల్ వ్యాధుల సమయంలో వీధుల్లో కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. పెద్దేముల్ మండలం మంబాపూర్ బీసీ గురుకుల పాఠశాల గేటు ముందు మురుగు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. పలు సార్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆస్పత్రులకు క్యూ కడుతున్న జనం నిత్యం పదుల సంఖ్యలో చేరుతున్న రోగులు జిల్లాలో నమోదైన ఫీవర్ కేసులు 1,980 డెంగీ కేసులు 3 వాంతులు విరేచనాలతో మహిళ మృతి రోజురోజుకూ పెరుగుతున్న పారిశుద్ధ్య సమస్య జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉండగా వాటి పరిధిలోని చాలా కాలనీల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది. ఇళ్ల మధ్య మురుగు చెత్తాచెదారం, మురుగు పేరుకుపోవడంతో పందులు సంచరిస్తున్నాయి. అధికరులు పట్టించుకోవడం లేదని ఆయా కాలనీల ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ పట్టణాల్లో చెత్త సేకరణ అస్తవ్యస్తంగా తయారైంది. -
‘ఫీజు’ బకాయిలు చెల్లించాలి
● బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్ ● ఆర్డీఓ కార్యాలయం ముట్టడి తాండూరు టౌన్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ బీసీ సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులతో కలిసి ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్ మాట్లాడారు. ఏళ్ల తరబడిగా విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ కళాశాల యాజమాన్యాలకు చెల్లించకపోవడంతో విద్యార్థుల ఉన్నత చదువులకు అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయన్నారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న ప్రభుత్వ తీరుపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. వెంటనే బకాయి పడిన రూ.8 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు మధులత, జిల్లా నాయకులు వెంకటేష్, వీరమణి, బస్వరాజ్, జోసఫ్, రాజుగౌడ్, పరమేష్, తాండ్ర నరేష్, రాజు, రాము, కిరణ్, పలు కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
నాలుగు కిలోమీటర్లు మట్టే..
బంట్వారం: మండల పరిధిలోని మాద్వాపూర్– కోట్పల్లి లింక్ రోడ్డు చిన్నపాటి వర్షానికే చిత్తడిగా మారుతోంది. నాలుగు కిలోమీటర్ల మేర ఉన్న మట్టి రోడ్డుతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు జంకుతున్నారు. మాద్వాపూర్ నుంచి కోట్పల్లి వెళ్లేవారు సల్బత్తాపూర్ మీదుగా వెళ్తే ఎక్కువ దూరం అవుతుందని ఈమార్గాన్నే ఆశ్రయిస్తుంటారు. ప్రతీ సోమవారం కోట్పల్లిలో నిర్వహించే సంతకు వెళ్లి సరుకులు, కూరగాయలు తెచ్చుకుంటారు. రోడ్డు బురదమయం కావడంతో కాలినకడన కోట్పల్లి వెళ్తున్నామని చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఈమార్గంలో బీటీ వేయాలని కోరుతున్నారు. -
పోలీస్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
● దరఖాస్తులకు చివరి తేదీ ఆగష్టు 6 ● 8నుంచి తరగతుల ప్రారంభం ● మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్కుమార్ కొడంగల్ రూరల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశంతో పోలీస్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్కుమార్ తెలిపారు. గురువారం కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. నిరుద్యోగులు ఉద్యోగాలు పొందేందుకు కృషిచేయాలని తెలిపారు. ఉచిత శిక్షణ శిబిరంలో చేరేందుకు ఆగష్టు 06వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆగష్టు 8వ తేదీలోపు ఆధార్కార్డు జిరాక్స్, రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలు, ఇంటర్, డిగ్రీ విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్లు కడా కార్యాలయంలో అందజేయాలన్నారు. ఇదే రోజున స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తరగతులు ప్రారంభమవుతాయని స్పష్టంచేశారు. అభ్యర్థులకు అవసరమయ్యే స్టడీ మెటీరియల్ అందజేస్తామని, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఈవెంట్స్ తదితర అంశాలపై పూర్తి స్థాయి ట్రైనింగ్ ఉంటుందన్నారు. హైదరాబాద్, మహబూబ్నగర్, కర్నూల్ తదితర ప్రాంతాలకు చెందిన అనుభవజ్ఞులైన అధ్యాపకులతో శిబిరం నిర్వహించనున్నట్లు చెప్పారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
సింధూరం వెంకటేశ్కు ఉత్తమ పురస్కారం
దౌల్తాబాద్: మండలంలోని సురాయిపల్లి గ్రామానికి చెందిన రచయిత సింధూరం వెంకటేష్ ఉత్తమ పురస్కారం అందుకున్నారు. మహాకవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో అవార్డు తీసుకున్నారు. పోగొట్టుకున్న సెల్ఫోన్ల అప్పగింత ధారూరు: చోరీకి గురైన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని గురువారం బాధితులకు అప్పగించామని ధారూరు ఎస్ఐ రాఘవేందర్ తెలిపారు. పరిగి మండలం నస్కల్ గ్రామానికి చెందిన బైండ్ల గంగాధర్, ధారూరు మండలం దోర్నాల్తండాకు చెందిన రవీందర్, నాగర్కర్నూల్కు చెందిన శ్రీశైలంకు సెల్ఫోన్లు అందజేశామని స్పష్టంచేశారు. ఎవరైనా మొబైల్ ఫోన్లు పోగొట్టుకుంటే వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు విక్రయించే ఫోన్లను కొనుగోలు చేయొద్దని తెలిపారు. విద్యుత్ షాక్తో పాడి గేదె మృతి బొంరాస్పేట: విద్యుత్ షాక్తో ఓ గేదె మృతిచెందిన ఘటన రేగడిమైలారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్న నర్సిరెడ్డికి చెందిన రూ.70 వేల విలువచేసే పాడి గేదె గురువారం మేతకు వెళ్లి, తిరిగి వస్తుండగా ఊరి శివారులోని మహాదేవుని ఆలయం వెనక ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందింది. ఈశ్వరప్ప సేవలు అభినందనీయం బీజేపీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదరావు కుల్కచర్ల: ఆలయాల అభివృద్ధికి బీజేపీ ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప చేస్తున్న సేవ ఎంతో అభినందనీయమని పార్టీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదరావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి ఈశ్వరప్ప లక్ష రూపాయల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాలను పరిరక్షించుకోవడం, అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువుపై ఉందన్నారు. మన చరిత్రకు మూలం ఆలయాలే అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అంజిలయ్య, ఉప సర్పంచ్ విజయకుమార్, మాజీ సర్పంచ్ సౌమ్యారెడ్డి, నాయకులు మైపాల్, చందు, భీమయ్య, కర్ణయ్య, సురేందర్, ప్రవీణ్, చంద్రకాంత్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. కళాశాల భవనాన్ని పూర్తి చేయాలి ఈడబ్ల్యూఐడీసీ చీఫ్ ఇంజనీర్ షఫీమియా దౌల్తాబాద్: మండల కేంద్రంలో రూ.5 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని ఆగస్టు నెలాఖరు వరకు పూర్తి చేసేలా పనులు వేగవంతం చేయాలని ఈడబ్ల్యూఐడీసీ చీఫ్ ఇంజనీర్ షఫీమియా ఆదేశించారు. గురువారం భవన నిర్మాణ పనులను పరిశీలించా రు. పనులు ఎంత మేరకు జరిగాయి.. ఇంకా పెండింగ్ ఉన్నవి ఏమిటని ఆరా తీశారు. సీఎం సూచనల మేరకు దౌల్తాబాద్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఈ విజయ్భాస్కర్రెడ్డి, డీఈ శ్రీనివాసులు, నాయకులు వీరన్న తదితరులు పాల్గొన్నారు. -
చన్గోముల్ ఎస్ఐని సస్పెండ్ చేయాలి
● ప్రజాసంఘాల నేతల డిమాండ్ ● బాధితుడిపైనే కేసు నమోదు చేశారని ఆందోళన బొంరాస్పేట: దళితుడి భూమి ఆక్రమణకు సహకరిస్తూ బాధితుడిపైనే కేసు నమోదు చేసిన పూడూరు మండలం చన్గోముల్ ఎస్ఐ భరత్రెడ్డిని సస్పెండ్ చేయాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బొంరాస్పేటలో గురువారం వారు మాట్లాడుతూ.. పూడూరు మండల సోమన్గుర్తి గ్రామానికి చెందిన దళిత రైతు జైదుపల్లి నర్సింలుకు చెందిన సర్వే నం.120లో 1.35 ఎకరాల్లోని 30గుంటల భూమిని ఏసీఈ టైర్స్ కంపెనీ యాజమాన్యం ఆక్రమించిందన్నారు. దీనిపై విచారణ చేయకుండా స్థానిక ఎస్సై దళిత రైతుపై కేసు పెట్టారని ఆరోపించారు. కంపెనీ యాజమాన్యం ఆక్రమించిన భూమిని వెంటనే ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బాధితుడి పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి నర్సింలు, ప్రజాసంఘాల నాయకులు రమేశ్, మొగులయ్య, రాములు, ఎల్లప్ప, వెంకటయ్య, నరేశ్, ప్రవీణ్, రాంచందర్ తదితరులు ఉన్నారు. -
మాపై ఎందుకీ వివక్ష?
బషీరాబాద్: కొంతమంది అధికారులు తమపట్ల వివక్ష చూపుతున్నారని బీఆర్ఎస్ సర్పంచ్లు, ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అంతకుముందు కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాస్ను విధుల నుంచి తొలగించాలని కోరుతూ మండల పరిషత్ సూపరింటెండెంట్ విజయకుమారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎంపీడీఓ కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది తమ గ్రామాలకు సంబంధించిన ఏఒక్క పనిని కూడా సకాలంలో పూర్తి చేయడం లేదని ఆరోపించారు. కంప్యూటర్ ఆపరేటర్లు మొదలుకుని ఎంపీడీఓ వరకు బీఆర్ఎస్ సర్పంచ్లను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వివిధ పనులకు సంబంధించిన చెక్కులను నెలల తరబడి ఆన్లైన్ చేయకుండా జాప్యం చేస్తున్నారన్నారు. ముఖ్యంగా జీపీల చెక్కులు క్లియర్ చేసే కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాస్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందంచడం లేదని, ఆఫీసుకు వెళ్లి అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి, సర్పంచులు పాండురంగారెడ్డి, నవీన్కుమార్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి, బసప్ప, జైపాల్రెడ్డి, కృష్ణకుమార్తో పాటు నాయకులు రంగారెడ్డి, వడ్డీ శ్రీనివాస్, శ్రీనివాస్, వెంకట్రెడ్డి, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండల పరిషత్లో ఒక్క పని కూడా కావడం లేదు చెక్కుల క్లియరెన్స్లో నెలల తరబడి జాప్యం చేస్తున్నారు బీఆర్ఎస్ సర్పంచ్లు, నాయకుల ఆవేదన ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా -
అభివృద్ధిలో సర్పంచ్లే కీలకం
డీఆర్డీఓ పీడీ, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి కేశంపేట: గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్లు కీలకపాత్ర పోషించాలని డీఆర్డీఓ పీడీ, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి అన్నారు. గురువారం మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారి రమాదేవి అధ్యక్షతన మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లతో పాటుగా మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మండల స్థాయి సమావేశంలో సర్పంచ్లు సమావేశం దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను మళ్లీ నిర్వహించే మండల స్థాయి సమావేశం లోపు పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు. ఇంటింటికి ఇంకుడుగుంతలను నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. తాగునీటి సరాఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. జలసిరి పథకంలో భాగంగా రైతులు వ్యవసాయ పొలాల్లో ఫాంపాండ్లు నిర్మించుకోవాలలని చెప్పారు. అనంతరం కేశంపేట, అల్వాల గ్రామాల్లో విబిజీ రామ్జీ పథకంలో భాగంగా ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీఓ రవిచంద్రకుమార్రెడ్డి, ఎంపీఓ దయానంద్, విద్యుత్ ఏఈ ఈశ్వర్, పంచాయతీరాజ్ ఏఈ నర్సింగ్రావు, ఎంపీఓ అజీజ్, వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. -
ప్రమాదాలకు మార్గం!
తాండూరు రూరల్: పెద్దేముల్ రోడ్డు అధ్వానంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల్లో నీరు చేరి, ప్రమాదకరంగా తయారైంది. రాత్రి సమయంలో ఈ మార్గంలో ప్రయాణిస్తున్న వారు ప్రమాదాల బారిన పడుతున్నారు. తాండూరు నుంచి సంగారెడ్డికి వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి. ఈ మార్గంలో తాండూరు నుంచి అంతారం, కందనెల్లితండా, గాజీపూర్, బుద్దారం, పెద్దేముల్ మీదుగా సంగారెడ్డికి వెళ్తుంటారు. ఈరూట్లో బుద్దారం బ్రిడ్జి నుంచి పెద్దేముల్ కొత్త బస్టాండ్ వరకు రహదారి పూర్తిగా ధ్వంసమైంది. గాజీపూర్ బ్రిడ్జి బురదమయం గాజీపూర్ వాగు వద్ద కొద్ది సంవతర్సాల క్రితం కొత్త బిడ్జ్రి నిర్మించారు. దీనికి ఇరువైపులా బీటీస వేయకుండా మట్టి నింపి వదిలేశారు. దీంతో చిన్నపాటి వర్షానికే ఈ ప్రాంతమంతా బురదమయమవుతోంది. మనోహార్రెడ్డి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టి 30 నెలలు గడుస్తున్నా బ్రిడ్జి వద్ద బీటీ వేయించడంలేదని గాజీపూర్వాసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిధులు మంజూరు చేయాలి మద్వాపూర్ నుంచి కోట్పల్లికి వెళ్లే మట్టి రోడ్డును బీటీగా మార్చాలి. ప్రభుత్వం ఇందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలి. వర్షాకాలం ముగిసే వరకూ కనీసం కంకర రోడ్డయినా వేస్తే వాహనదారులకు కొంత సౌకర్యం కలుగుతుంది. – ప్రభు, మద్వాపూర్ అధ్వానంగా పెద్దేముల్, మాద్వాపూర్– కోట్పల్లి రహదారులు ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు, వాహనదారులు పట్టించుకోని పాలకులు, అధికారులు త్వరలో మరమ్మతులు గుంతలమయమైన పెద్దేముల్ రోడ్డుకు త్వరలోనే మరమ్మతులు చేయిస్తాం. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(హ్యామ్)కింద ప్రభుత్వం తాండూరు నుంచి కోట్పల్లి వరకు 25 కిలోమీటర్ల రోడ్డుకు రూ.74 కోట్ల 71 లక్షలు మంజూరు చేసింది. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత పనులు ప్రారంభిస్తాం. – శ్రవణ్, డీఈ, ఆర్అండ్బీ శాఖ -
శరవేగంగా డిజిటలైజేషన్
● ఇప్పటి వరకు 83శాతం ప్రక్రియ పూర్తి ● కలెక్టర్ దీపక్ తివారి అనంతగిరి: అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సర్ ప్రక్రియపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 10,17,671 ఓటర్లకు గాను ఇప్పటి వరకు 7,96,005 డిజిటలైజేషన్ చేయడం జరిగిందన్నారు. 83 శాతం ప్రక్రియ పూర్తయిందన్నారు. 1,13,092 ఏఎస్డీ(ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్, డూప్లికేట్) ఓటర్లుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. ఈ జాబితాను గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో ప్రదర్శించడం జరిగిందన్నారు. జాబితాలో ఏవైనా సమస్యలు ఉంటే రాజకీయ పార్టీ ప్రతినిధులు, బూతు స్థాయి ఏజెంట్లు అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. ఆగస్టు 3వ తేదీ నాటికి 100 శాతం పూర్తి చేసేలా అధికారులు పనిచేస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. 1,200 మంది ఓటర్లు ఉంటే అదనంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓట్లు ఉండే విధంగా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఓటు అనేది చాలా ముఖ్యమని, రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎస్ఐఆర్లో అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదయ్యేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, డీఆర్ఓ స్వర్ణలత, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ నెమత్ అలీ, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అప్రమత్తంగా ఉండాలి భారీ వర్షాల నేపథ్యంలో యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. గురువారం హైదరాబాద్ నుంచి డీజీపీ సీవీ ఆనంద్ అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించి రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎస్పీ స్నేహ మెహ్ర, అదనపు కలెక్టర్ వెంకటాచారి, అదనపు ఎస్పీ రాజేష్ మీనా, జెడ్పీ సీఈఓ సుధీర్, సీపీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ధారూరులో భారీ వర్షం
● వాగులు, చెరువులకు జలకళ ● హర్షం వ్యక్తంచేస్తున్న అన్నదాతలు ధారూరు: మండలంలో బుధవారం 10.6 మిల్లీమీటర్ల వర్షం కురవగా గురువారం 4.02 సెంటీమీటర్ల వర్షం కురిసిందని తహసీల్దార్ సాజిదాబేగం తెలిపారు. ప్రమాదకరమైన వాగులు, కాల్వలను దాటొద్దని సూచించారు. భారీ వానలు కరుస్తున్న నేపద్యంలో అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దన్నారు. వర్షాలు లేక ఆందోళన చెందుతున్న రైతన్నలకు భారీ వాన ఊరటనిచ్చింది. తుఫాను ప్రభావంతో కురిసిన కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన నీటి వనరులైన కోట్పల్లి ప్రాజెక్టుతో పాటు అల్లీపూర్, ఎబ్బనూర్, మున్నూరుసోమారం, రుద్రారం, గట్టెపల్లి, రాంపూర్తండా, అంపల్లి, గురుదోట్ల, నాగారం, రాజాపూర్, కేరెళ్లి తదితర గ్రామాల్లోని చెరువుల్లో నీరు చేరి జలకళను సంతరించుకున్నాయి. -
సీ్త్రనిధి బోర్డు ఆఫ్ డైరెక్టర్గా అరుంధతి
షాద్నగర్: ఉమ్మడి జిల్లా సీ్త్రనిధి బోర్డు ఆఫ్ డైరెక్టర్గా ఫరూఖ్నగర్ మండలం నాగులపల్లికి చెందిన అరుంధతి ఎన్నికయ్యారు. మండల సమాఖ్య అధ్యక్షురాలిగా పని చేస్తున్న ఆమె ఇటీవల నిర్వహించిన బోర్డు ఎన్నికల్లో విజయం సాధించారు. గురువారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మహిళా సంఘాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ కుల్కచర్ల: చెంచుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ అన్నారు. గురువారం మండలంలోని సాల్వీడు గ్రామంలో పర్యటించారు. అధికారులు, గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకం కింద కాలనీకి రూ.1.72 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ఈ నిధులతో నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని లబ్ధిదారులకు సూచించారు. ఇందుకు అధికారుల సహకారం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సంతోష, సర్పంచ్ లక్ష్మమ్మ, ఉప సర్పంచ్ సంధ్యారాణి, పంచాయతీ కార్యదర్శి హర్శద్ తదితరులు పాల్గొన్నారు. యాలాల: రైతులకు విక్రయించేందుకు నిల్వ ఉంచిన 43 బస్తాల నకిలీ డీఏపీని అధికారులు పట్టుకున్నారు. గురువారం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మండల వ్యవసాయ అఽధికారి శ్వేతరాణి తెలిపిన వివరాల ప్రకారం.. హాజీపూర్లో నకిలీ డీఏపీ రైతులకు విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో వ్యవసాయ శాఖ, పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన రాచూరి ఆశన్న, శంకిరి బిచ్చప్ప ఇంట్లో నిల్వ ఉన్న 43 నకిలీ డీఏపీ బ్యాగులను గుర్తించారు. వీటిని పెద్దేముల్ మండలానికి చెందిన పోల రాజు అనే వ్యక్తి విక్రయించినట్లు గుర్తించామన్నారు. నకిలీ డీఏపీ విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఇలా విక్రయించే వారి విషయంలో వ్యవసాయ శాఖ, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి కుల్కచర్ల: ఎస్ఐఆర్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. గురువారం కుల్కచర్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో కొనసాగుతున్న సర్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ఏ ఒక్కరూ ఓటు నష్టపోకుండా చూడాలన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రక్రియను కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ అంజిలయ్య, ఉప సర్పంచ్ విజయకుమార్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు మాలె కృష్ణయ్య, రైతుబంధు మాజీ అధ్యక్షుడు రాజు, పీఏసీఎస్ మాజీ డైరక్టర్ కొండయ్య, నాయకులు మహేశ్వరం రాములు, జనార్దన్ రెడ్డి, మొగులయ్య, బిచ్చయ్య, సత్యయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
వర్షాల వేళ అప్రమత్తంగా ఉండాలి
కోట్పల్లి ఎస్ఐ శైలజ బంట్వారం: వర్షాల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోట్పల్లి ఎస్ఐ శైలజ తెలిపారు. గురువారం ఆమె ఠాణాలో విలేకరులతో మాట్లాడారు. ఉధృతంగా పారే వాగులు, వంకలు దాడకూడదన్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. చిన్నపిల్లలు నీటి ప్రవాహాల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన ఇళ్లలో నివసించే వారిని గుర్తించి ఖాళీ చేయించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఎమ్మెల్యేపై వ్యక్తిగత విమర్శలు సరికాదు జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కాలె శ్రీకాంత్ మొయినాబాద్: పీసీసీ సభ్యుడు షాబాద్ దర్శన్ తీరు ‘ఒడెక్కే వరకు ఓడ మల్లన్న.. ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న’ అనే చందంగా ఉందని జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కాలె శ్రీకాంత్ అన్నారు. గురువారం మొయినాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కాలె యాదయ్య, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ భీంభరత్, మాజీ ఎంపీ రంజిత్రెడ్డితో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కష్టపడి పనిచేయడంతోనే దర్శన్ సతీమణి సోనియాకు మున్సిపల్ చైర్పర్సన్ పదవి దక్కిందన్నారు. కుర్చీలో కూర్చున్న తర్వాత ఎమ్మెల్యే యాదయ్యపై వ్యక్తిగత విమర్శలకు దిగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పార్టీ పదవులు అమ్ముకుంటున్నారంటూ ఆయన చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీలో అంతర్గతంగా చర్చించి, పరిష్కరించుకోవాలని అంతేకానీ బహిరంగ వేదికలపై విమర్శలు చేయడగం తగదని హితవుపలికారు. -
చేప పిల్లల అంచనాలు సిద్ధం
వికారాబాద్: చేప పిల్లల పంపిణీకి మత్స్య శాఖ కసరత్తు చేస్తోంది. ఇటీవల ప్రభుత్వం నిధులు కేటాయిస్తామని ప్రకటించడంతో అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. అనుకూలంగా ఉన్న చెరువులను గుర్తించి అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. అనుమతులు రాగానే టెండర్లు పిలిచే అవకాశం ఉంటుంది. జిల్లాలో మొత్తం 1,179 చెరువులు, కుంటలు ఉండగా 779 చెరువులు చేపల పెంపకానికి అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. 1.29 కోట్ల చేప పిల్లలు, 14.97 లక్షల రొయ్య పిల్లలు వదలాలని లక్ష్యం పెట్టుకున్నారు. 152 మత్స్య సహకార సంఘాలు.. 5,665 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నందున చెరువుల్లోకి నీరు చేరడం ప్రారంభమైంది. ఆగస్టు మొదటి రెండో వారంలో చేప పిల్లలు వదిలే అవకాశం కనిపిస్తోంది. లక్ష్యానికి దూరంగా పంపిణీ చెరువుల్లో చేపపిల్లలు వదిలే విషయంలో అధికారులు ఎంచుకున్న లక్ష్యానికి వదులుతున్న దానికి ఏ మాత్రం పొంతన లేకుండా పోతోంది. ఏటా ఇదే తంతు కనిపిస్తోంది. ఎంచుకున లక్ష్యంలో 60 నుంచి 70 శాతం వరకే వదిలి చేతులు దులుపుకొంటున్నారు. ఈ ఏడాది అయిన చెరువుల్లో సరిపడా చేపపిల్లలు వదలాలని మత్స్య సహకరా సంఘాలు కోరుతున్నాయి. నాసిరకం పిల్లలు ఏటా నాసిరకం చేప పిల్లలను పంపిణీ చేస్తున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. మూడు నుంచి నాలుగు ఇంచులు ఉండాల్సిన పిల్ల ఒక ఇంచుకు మించి ఉండటంలేదని తెలిపారు. గతంలో ఇలాంటి వాటిని మత్స్యకారులు వెనక్కు పంపారు. అధికారులతో గొడవలు కూడా జరిగాయి. లక్ష చేప పిల్లల వదిలితే అందులో 50వేలు కూడా బతకడం లేదని తెలిపారు. సైజు కూడా రావడం లేదన్నారు. ఈ సారైనా. అధికారులు దృష్టి సారించి నాణ్యమైన చేపపిల్లలు పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి చేరిన నివేదిక జిల్లాలో మొత్తం చెరువులు 1,179 చేపలు వదిలేందుకు ఎంపిక చేసినవి 779 మత్స్య సహకార సంఘాలు 152, సభ్యులు 5,665 మందిజిల్లాలోని చెరువుల ఆధారంగా ఎన్ని చేప పిల్లలు అవసరం అనే దానిపై అంచనాలు సిద్ధం చేశాం. ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి పంపాం. ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. అనుమతులు రాగానే టెండర్ ప్రక్రియను ప్రారంభించి చేప పిల్లలు వదిలేందుకు ఏర్పాట్లు చేస్తాం. – వెంకయ్య, జిల్లా మత్స్య శాఖ అధికారి -
మానవ అక్రమ రవాణా నేరం
అనంతగిరి: మానవ అక్రమ రవాణాను అరికడదామని, ఇందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని జిల్లా మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారి కాంతారావు అన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం వికారాబాద్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణా అనేది సమాజానికి తీవ్రమైన ముప్పన్నారు. అనుమానాస్పద ఘటనలు జరిగితే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. మానవ అక్రమ రవాణా వల్ల మహిళలు, చిన్నారులు ఎదుర్కొనే ప్రమాదాలు, బాధితులకు అందుబాటులో ఉన్న రక్షణ, పునరావాస సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. అనంతరం అవగాహన వాల్ పోస్టర్ విడుదల చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, డీఎల్ఎస్ ఏ వెంకటేశం, కార్యక్రమ ఇంచార్జి సీఐ అన్వర్ పాషా , సీడీపీఓ శ్రీలత, మెప్మా కోఆర్డినేటర్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారి కాంతారావు -
పెండింగ్ 36,676
తాండూరు నియోజకవర్గంలో యాలాల, బషీరాబాద్, పెద్దేముల్, కోట్పల్లి(సగం) తాండూరు మండలాలు ఉన్నాయి. ఆయా మండలాల్లో 90 శాతానికి పైగా ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయింది. తాండూరు మున్సిపాలిటీలో మాత్రం భారీగా తగ్గింది. ఇక్కడ 70 పోలింగ్ కేంద్రాలు.. 73,959 మంది ఓటర్లు ఉన్నారు. సర్ ప్రక్రియలో 50,991 మంది మాత్రమే ఫారాలు ఇచ్చారు. 22,968 మంది ఎన్యూమరేషన్కు దూరంగా ఉన్నారు. సొంత గ్రామాల్లో నమోదు చేసుకోవడంతోనే ఈ పరిస్థితి ఎదురవుతున్నట్లు ఆయా రాజకీయ పార్టీ నాయకులు భావిస్తున్నారు. తాండూరు: నియోజకవర్గంలో భారీగా ఓట్లు తగ్గే అవకాశం కనిపిస్తోంది. సర్ గడువు సమీపిస్తున్నా వేలాది మంది ఎన్యూమరేషన్కు దూరంగా ఉన్నారు. ఓటరు జాబితా నుంచి సుమారు 36,676 మంది పేర్లు తొలగనున్నట్ల సమాచారం. ఇవి డబుల్ ఓట్లా.. లేకుంటే వలస ఓటర్లా, మరణించిన వారా అనేది తేలాల్సి ఉంది. తాండూరు మున్సిపల్ పరిధిలో 36 వార్డుల్లో సర్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. నియోజకవర్గంలో 269 పోలింగ్ బూత్లు.. 2,52,235 మంది ఓటర్ల కోసం బీఎల్ఓలు ఎన్యూమరేషన్ కార్యక్రమం చేపట్టారు. ఇప్పటి వరకు 2,15,559 మంది ఫారాలను పూర్తి చేసి బీఎల్ఓలకు అందజేశారు. ఇందులో 1,82,804 మంది ఫారాలను డిజిటలైజేషన్ చేశారు. మరో 36,676 మంది ఎన్యూమరేషన్కు దూరంగా ఉన్నారు. 33 పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం ఎన్యూమరేషన్ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఎన్యూమరేషన్కు దూరంగా వేలాది మంది ఓటర్లు తాండూరు మున్సిపాలిటీలో భారీగా తగ్గనున్న ఓట్లు 33 పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం డిజిటలైజేషన్ పూర్తి మండలం పోలింగ్ బూత్ ఓటర్లు డిజిటలైజేషన్ పెండింగ్ శాతం పెద్దేముల్ 46 41326 38,304 3,022 92.69 కోట్పల్లి 8 6,315 5,817 498 92.11 తాండూరు (మం) 50 46,983 41,197 5786 87.68 తాండూరు అర్బన్ 70 73,959 50,991 22,968 68.94 యాలాల 48 42,331 39,272 3.059 92.77 బషీరాబాద్ 47 41,321 39,978 1,343 96.75 మొత్తం 269 2,52,235 2,15,559 36,676 85.46 -
‘కోట్పల్లి’కి వరద
● 21.5 అడుగులకు చేరిన నీటి మట్టం ధారూరు: మండలంలోని కోట్పల్లి ప్రాజెక్టుకు క్రమంగా నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు పడుతుండటంతో గురువారం నాటికి 21.5 అడుగుల మేర నీరు చేరింది. కాలువలు సరిగ్గా లేక గత ఏడాది జూలై నెలలో చుక్కనీరు రాలేదు. ప్రస్తుతం ప్రాజెక్టు ఆధునీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. కాల్వలకు నీరు వదలకపోవడంతో ప్రాజెక్టులో 18 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. మరో 2.5 అడుగుల నీరు చేరితే ప్రాజెక్టు పూర్తిగా నిండనుంది. ఆధునీకరణ పనులు పూర్తయితే తప్ప రబీ పంటలకు నీరు అందే అవకాశం లేదు. పనుల్లో వేగం పెంచి సాగుకు నీరందించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. -
వానలే వానలు
మండలం వర్షపాతం మర్పల్లి 20 మోమిన్పేట్ 29.8 నవాబుపేట 29 వికారాబాద్ 37.1 పూడూరు 43.4 పరిగి 33.3 కుల్కచర్ల 36.7 దోమ 24.3 బొంరాస్పేట్ 42.8 ధారూరు 42 కోట్పల్లి 19.6 బంట్వారం 13.8 పెద్దేముల్ 32.8 తాండూరు 29.2 బషీరాబాద్ 49.8 యాలాల 43.1 కొడంగల్ 37.6 దౌల్తాబాద్ 43.2 చౌడాపూర్ 30 దుద్యాల్ 36.8వికారాబాద్: రెండు రోజుల క్రితం ప్రారంభమైన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. జన జీవనం స్తంభించింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరుతోంది. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు వస్తోంది. వాగులు తీవ్ర రూపం దాల్చడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గడిచిన 24 గంటల్లో ఆరు మండలాల్లో 40 మిల్లీ మీటర్లకు మించి వర్షపాతం నమోదైంది. రెండు రోజుల క్రితం వరకు 15 మండలాల్లో లోటు వర్షపాతం ఉండగా ప్రస్తుతం అధికం, అత్యధిక వర్షపాతం నమోదైంది. అప్రమత్తమైన యంత్రాంగం భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్ర అన్ని శాఖలను అప్రమత్తం చేశారు. 50కి పైగా ప్రమాద ప్రదేశాలను గుర్తించి వాటి వద్ద భద్రతా ఏర్పాట్లు చేశారు. వానలు తగ్గే వరకు ఎవరూ బయటకు రావొద్దని, ఉధృతంగా ప్రవహించే వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధారూరు మండలం కోట్పల్లి ప్రాజెక్టుకు, పరిగి మండలం లఖ్నాపూర్కు, యాలాల మండలం జుంటుపల్లి, శివసాగర్, వికారాబాద్ మండలం శివారెడ్డిపేట్ ప్రాజెక్టుల్లోకి వరద చేరుతోంది. దెబ్బతిన్న రోడ్లు కాగ్నా, మూసీ, ఈసీ నదులు ఉధృతగా ప్రవహిస్తున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైతులు పొలాల్లోకి వెళ్ల లేని పరిస్థితి నెలకొంది. ● ధారూరు మండలం దోర్నాల, రుద్రారం, నాగసముందర్, పరిగి, గొడుగోనిపల్లి, గెర్గేట్పల్లి మార్గాల్లో వాగులు తీవ్ర రూపం దాల్చాయి. పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ● వికారాబాద్ – పరిగి మార్గంలో చిట్టెంపల్లి వద్ద తాత్కాలిక రోడ్డుకు గండి పడింది.అధికారులు, పోలీసులు మరమ్మతులు చేయించి రాకపోకలను పునరుద్ధరించారు. నవాబుపేట మండలం మూలమడ వాగుపై గల బ్రిడ్జికి ఓ వైపు గండి పడటంతో పోలీసులు దగ్గరుండి మరమ్మతులు చేయించారు. ● తాండూరు నియోజకవర్గంలో కగ్నా పరవళ్లు తొక్కుతోంది. బషీరాబాద్, యాలాల, తాండూరు మండలాల్లో ఉధృతంగా ప్రవహిస్తోంది. జిల్లాలోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. ● భారీ వర్షాల నేపథ్యంలో యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టారు. హెల్ప్లైన్ ఏర్పాటు చేశారు. సహాయం కావాల్సిన వారు టోల్ ఫ్రీ నంబర్ 8712670056 లేదా డయల్ 100కు కాల్ చేయాలని కలెక్టర్, ఎస్పీ సూచించారు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పారుతున్న వాగులు, వంకలు చెరువుల్లోకి చేరుతున్న వరదనీరు పలుచోట్ల దెబ్బతిన్న రోడ్లు రాకపోకలకు తీవ్ర అంతరాయం పలు మండలాల్లో లోటు నుంచి అధిక వర్షపాతం -
నేరాల నియంత్రణకు చర్యలు
కుల్కచర్ల: పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలగాలని పరిగి డీఎస్పీ శ్రీనివాస్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం ఆయన కుల్కచర్ల స్టేషన్ను సందర్శించారు. దొంగతనాలు, చిన్నారులు, వృద్ధులపై దాడులు జరగకుండా ప్రత్యేక కార్చాచరణతో ముందుకుసాగాలన్నారు. సైబర్ మోసాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం చౌడాపూర్లో సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమన్నారు. కారక్రమంలో పరిగి సీఐ కొండల్ రెడ్డి, కుల్కచర్ల ఎస్ఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు. చౌడాపూర్లో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి. మండల కేంద్రంగా ఏర్పడి ఐదేళ్లు కావస్తున్నా చౌడాపూర్లో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయలేదని వెంటనే చర్యలు తీసుకోవాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బీ వెంకటేష్ కోరారు. చౌడాపూర్కు వచ్చిన పరిగి డీఎస్పీకి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. పరిగి డీఎస్పీ శ్రీనివాస్ -
ప్రజాసేవను అదృష్టంగా భావించాలి
● లయన్స్ క్లబ్ ఫౌండర్, మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డి ● నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం కొడంగల్: పేదలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావించాలని కొడంగల్ లయన్స్ క్లబ్ ఫౌండర్, మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డి అన్నారు. గురువారం రాత్రి పట్టణంలోని రాఘవేంద్ర గార్డెన్స్లో లయన్స్ క్లబ్ 37వ ఇన్స్టాలేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న గురునాథ్రెడ్డి, నటరాజ్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. కొడంగల్లో కంటి ఆసుపత్రి నిర్మించడానికి కృషి చేయాలన్నారు. స్థలం కేటాయిస్తే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి నిధులు మంజూరు చేయిస్తామని చెప్పారు. ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకునే అవకాశం ఉందన్నారు. కొడంగల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చిత కంటి వైద్య శిబిరాలు, ఉత్తమ సేవకులకు నన్మానాలు, మొక్కలు నాటడం, వినికిడి యంత్రాల పంపిణీ వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న డాక్టర్ రవీంద్ర యాదవ్ మాట్లాడుతూ.. 2026– 27లో తమ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామన్నారు. ఇన్స్టాలేషన్ అధికారిగా డాక్టర్ శశికాంత్, ఇండక్షన్ ఆఫీసర్గా మృత్యుంజయ, చైర్మన్గా ముద్దప్ప దేశ్ముఖ్ వ్యవహరించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు దాసప్ప యాదవ్, భీమన్న గౌడ్, రాంరెడ్డి, వెంకట్రెడ్డి దేశ్ముఖ్, శ్రీకిషన్రావు, శివకుమార్ గుప్త, మిఠాయిరాజు, భీమరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ పరిధిలోని ఐనన్పల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేశారు. పట్టణ లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా డాక్టర్ రవీంద్రయాదవ్, కార్యదర్శిగా డాక్టర్ సాకేత్, కోశాధికారిగా ముర హరి వశిష్టను లయన్స్క్లబ్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈసందర్భంగా గురువారం రాత్రి వీరు ప్రమాణ స్వీకారం చేశారు. కొడంగల్ లయన్స్ క్లబ్లో కొత్తగా ఏడుగురు సభ్యులు చేరారు. -
ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం
● బీజేవైఎం జిల్లా నేత సాయిచరణ్రెడ్డి ● ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల విడుదలకు డిమాండ్ తాండూరు టౌన్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధమవుతున్నామని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు చిట్యాల సాయిచరణ్రెడ్డి స్పష్టం చేశారు. ఈమేరకు గురువారం పట్టణంలోని శాలివాహన డిగ్రీ కళాశాల, భాష్యం జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో సమావేశమయ్యారు. అనంతరం ‘ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి’ పోస్టర్ విడుదల చేసి మాట్లాడారు. మూడేళ్లుగా రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతోందని మండిపడ్డారు. బకాయిలు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీంతో ఎంతో మంది ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రూ.15 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి విద్యా సంవత్సరంలో నిర్ణీత గడువులోగా చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. లేదంటే పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నాగారం మల్లేశం, కౌన్సిలర్ కిరణ్ ముదిరాజ్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు తాండ్ర నరేష్, నాయకులు శోభన్, శ్రీనివాస్, హర్షవర్ధన్రెడ్డి, మంజునాథ్రెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎకరాకు రూ.60 లక్షలు ఇస్తే ఓకే
● ప్రజాభిప్రాయ సేకరణ సభలో ఈర్లపల్లి రైతులు ● చట్టం ప్రకారం న్యాయం చేస్తాం: అదనపు కలెక్టర్ వెంకటాచారి దుద్యాల్: మార్కెట్ విలువ ఆధారంగా భూ పరిహారం చెల్లించాలని ఈర్లపల్లి, నన్యానాయక్ తండా, సంట్రకుంటతండా రైతులు అధికారులను కోరారు. పారిశ్రామిక వాడ ఏర్పాటులో భూములు కోల్పోతున్న రైతులతో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తాండూరు ఆర్డీఓ అనిత మాట్లాడుతూ.. 146.30 ఎకరాల పట్టాభూములున్న రైతుల వివరాలు, 88 సర్వే నంబర్లో 213 ఎకరాలు ఉండగా భూ భారతిలో నమోదైన 95 ఎకరాల రైతుల వివరాలు చదివి వినిపించారు. మిగిలిన 118 ఎకరాల అసైన్డ్ భూములకు సమస్యలున్నాయని చెప్పారు. పొజిషన్లో ఉండి పట్టా లేకపోవడం, పట్టా ఉండి పొజిషన్లో లేకపోవడం వంటి సమస్యలు గుర్తించామని.. ఎంజాయ్మెంట్ సర్వే చేపడితే పూర్తి సమాచారం తెలుస్తుందన్నారు. అనంతరం పలువురు రైతులు మాట్లాడుతూ.. మార్కెట్ విలువ ఆధారంగా ఎకరాకు రూ.60 లక్షల పరిహారం, హకీంపేట్లో మాదిరిగా భూములు కోల్పోయే రైతులకు ఇళ్ల స్థలాలు, పారిశ్రామికవాడలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) వెంకటాచారి మాట్లాడుతూ.. చట్ట ప్రకారం ప్రతీ రైతుకు న్యాయం చేస్తామని.. ఆందోళన చెందొద్దని సూచించారు. 118 ఎకరాలకు సంబంధించిన సమస్యను పరిష్కరించేందుకు రైతులు సహకరించాలని కోరారు. గిరిజనులకు సంబంధించిన అసైన్డ్ భూములు వారికే చెందాలని కోరగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిషన్, డీటీ శివకుమార్, ఆర్ఐ నవీన్, జీపీఓలు రమేశ్, గోపాల్, పంచాయతీ కార్యదర్శులు కిషన్, సూర్యప్రకాశ్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు మొగులయ్య, మాణిక్యనాయక్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రవి నాయక్, రైతులు, తదితరులు పాల్గొన్నారు. భారీగా పోలీసు బందోబస్త్ ఈర్లపల్లిలో నిర్వహించిన రైతు ప్రజాభిప్రాయ సేకరణ సభలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీ రాజేశ్ మీనా ఆధ్వర్యంలో దాదాపు 150 మంది పోలీసు బలగాలు అక్కడ మోహరించాయి. వికారాబాద్, పరిగి డీఎస్పీలు వీరేశ్, శ్రీనివాస్లు భద్రతాఏర్పాట్లను పర్యవేక్షించారు. నలుగురు సీఐలు, పది మంది ఎస్ఐలు పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆయిల్పామ్ సాగుతో దీర్ఘకాలిక ఆదాయం
జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి సత్తార్ దుద్యాల్/బొంరాస్పేట్: ఆయిల్పామ్ సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి ఎంఏ సత్తార్ అన్నారు. మంగళవారం ఆయన దుద్యాల్, బొంరాస్పేట్ మండలాల్లో పర్యటించారు. దుద్యాల్ మండలం పల్లెగడ్డకు చెందిన వెంకట్రెడ్డి, బొంరాస్పేట్ మండలానికి చెందిన వెంకటరాములు గౌడ్ ఆయిల్పామ్ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయిల్పామ్ సాగుతో దీర్ఘకాలిక ఆదాయం సమకూరుతుందన్నారు. రైతులు యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ఆయిల్పామ్ సాగుకు ప్రభుత్వం సబ్సిడీ అందజేసి రైతులను ప్రోత్సహింస్తోందని.. ఆసక్తి ఉన్నవారు ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించాలన్నారు. దుద్యాల్ మండలంలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తుండడం ఇక్కడి రైతుల అదృష్టం అన్నారు. ఈ కార్యక్రమంలో కొడంగల్ ఉద్యన అధికారి సురేంద్రనాథ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పేరిట భూముల కబ్జా
తాండూరు టౌన్: అభివృద్ధి పేరిట ముఖ్యమంత్రి సొంత జిల్లాలో దళిత, పేద రైతుల భూములు కబ్జాకు పాల్పడుతున్నారని.. ఇట్టి భూమికి భూమి ఇవ్వాల్సిందేనని కేవీపీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం వారు బాధిత రైతులతో కలిసి తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాలాల మండలం దౌలాపూర్ రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 73లో చెన్నారం, దౌలాపూర్కు చెందిన 11 మంది దళిత, వడ్డెర కులస్తులకు 25 ఎకరాల భూమిని 1980లో అప్పటి ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరిట రైతులకు సమాచారం లేకుండా సాగు భూమల నుంచి ఎర్రమట్టి తరలిస్తున్నారన్నారు. ఎలాంటి నష్టపరిహారం ఇప్పించకుండా రెవెన్యూ అధికారులు కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. దళితుల భూములను సాగుకు పనికిరాకుండా చేయడం దారుణమని, భూమికి భూమి లేదా వెంటనే నష్టపరిహారాన్ని అందజేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప, పలు సంఘాల నాయకులు చంద్రయ్య, గుమ్మడి రత్నం, చంద్రమ్మ, అంజిలమ్మ, వెంకటయ్య, మన్యప్ప, బాలరాజ్, సత్యమ్మ, అమృతమ్మ తదితరులు ఉన్నారు.కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య -
ఆర్టీసీపై నమ్మకం పెంచండి
తాండూరు టౌన్: సమయానుకూలంగా బస్సులు నడిపిస్తూ ప్రయాణికులకు ఆర్టీసీపై నమ్మకాన్ని పెంచాలని ఆ సంస్థ రీజనల్ మేనేజర్ శ్రీదేవి అన్నారు. మంగళవారం ఆమె డిప్యూటీ రీజినల్ మేనేజర్ సరస్వతితో కలిసి తాండూరు డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె డ్రైవర్లు, కండక్టర్లతో సమావేశమయ్యారు. డిపో నుంచి రోజు వారీగా తిరుగుతున్న బస్సులు, ఆదాయం, ఖర్చులు తదితర అంశాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం డిపో ఆవరణలో మొక్కను నాటి మాట్లాడారు. మహాలక్ష్మి పథకం ఉచిత టికెట్లతో పాటు, నగదు టికెట్ల జారీపై దృష్టి సారించాలన్నారు. విధుల పట్ల బాధ్యత, క్రమశిక్షణతో మెలిగితే డిపో లాభాల బాటలో నడుస్తుందన్నారు. ప్రయాణికుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ ఆర్టీసి సిబ్బంది ఉన్నారు. ఎమ్మెల్యేను కలిసిన ఆర్టీసీ అధికారులు టీజీ ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి, డిప్యూటీ ఆర్ఎం సరస్వతి, డీఎం ప్రవీణ్ కుమార్ మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, మహాలక్ష్మి పథకం ఆటంకం లేకుండా కొనసాగేలా చూడాలని ఎమ్మెల్యే, ఆర్టీసీ అధికారులకు సూచించారు. తాండూరు డిపో ఎదుట తొలగించిన డబ్బాల స్థానంలో త్వరితగతిన స్టాల్స్ నిర్మించి చిరు వ్యాపారులకు అప్పగించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. డిపోలోని పలు సమస్యలను అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. టీజీ ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి -
పనుల్లో పురోగతి కనిపించాలి
దుద్యాల్: హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనుల్లో పురోగతిపై కలెక్టర్ దీపక్ తివారి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈడబ్ల్యూఐడీసీ ఇంజనీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆయన పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. నర్సింగ్, మెడికల్ కళాశాలలు, బాలికల, బాలుర హాస్టళ్లు, డిగ్రీ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను ఎక్కువ మంది లేబర్లతో రెండు షిప్టులుగా పనులు చేపట్టాలని కాంట్రాక్లర్లకు, ఎడ్యుకేషన్ హబ్ ఇంజినీర్లకు సూచనలిచ్చారు. ఆగస్టు 5వ తేదీ వరకు పనుల్లో పనుల్లో పురోగతి కనిపించాలన్నారు. అనంతరం ఎడ్యుకేషన్ హబ్లో నిర్మాణాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి, ఈడబ్ల్యూఐడీసీ సీఈ షఫీ, ఏఈ విజయ భాస్కర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, రఫీక్, ఇంజనీర్ కృష్ణ ప్రసాద్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రైతు సంక్షేమానికి ప్రాధాన్యం
పరిగి: ప్రజాప్రభుత్వం అభివృద్ధి, రైతు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిందని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దోమ మండలం గూడూరు, దొంగఎన్కేపల్లి, కుల్కచర్ల మండలంలోని అల్లాపూర్ గ్రామాల పరిధిలో రేడియల్ రోడ్డులో భూములు కోల్పోతున్న బాధిత రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. 66 ఎకరాల భూమికి రూ.16.227 కోట్ల పరిహారం చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వానికి సహకరిస్తున్న రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కార్ రైతుల త్యాగాన్ని గౌరవిస్తూ పారదర్శకంగా మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం అందజేస్తోందన్నారు. రైతులు ప్రభుత్వంపై విశ్వాసం ఉంచి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించడం అభినందనీయమన్నారు. పరిగి ప్రాంతప్రజలకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, పీఏసీఎస్ చైర్మన్ పార్థసారథిపంతులు, కాంగ్రెస్ దోమ మండల అధ్యక్షుడు శాంత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు
కడ్తాల్/షాద్నగర్ రూరల్: భార్యను హత్య చేసిన కేసులో నిందితుడికి జీవితఖైదు విధిస్తూ షాద్నగర్ 16వ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి స్వాతిరెడ్డి బుధవారం తీర్పునిచ్చినట్లు సీఐ సైదిరెడ్డి తెలిపారు. వివరాలు.. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం తుంగతుర్తి గ్రామానికి చెంది వల్లపుడాస్ స్వరూప, శ్రీనివాస్ భార్యాభర్తలు. వీరు మండల పరిధిలోని కర్కల్పహాడ్ శివారులోని ఓ ఫాంహౌస్లో కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవారు. మద్యానికి బానిసైన శ్రీనివాస్ స్వరూపను తరుచూ వేధించేవాడు. 2023 జూన్ 11న రాత్రి దంపతులు గొడవపడ్డారు. ఈ క్రమంలో భార్య స్వరూపను హత్య చేసి పరారయ్యాడు. 2023 జూన్ 12న సమాచారం అందుకున్న అప్పటి సీఐ ఉపేందర్, ఎస్ఐ హరిశంకర్గౌడ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. నేరం రుజువు కావడంతో షాద్నగర్ 16 వ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి స్వాతిరెడ్డి నిందితుడు శ్రీనివాస్కు జీవిత ఖైదుతో పాటు, రూ.5 వేలు జరిమానా విధి స్తూ తీర్పు వెలువరించినట్లు పోలీసులు తెలిపారు. ఉన్నతాధికారుల అభినందనలు హత్య కేసు దర్యాప్తులో సమర్థవంతంగా పనిచేయడంతో పాటు, సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరిచిన సీఐలు ఉపేందర్, వెంకటేశ్వర్లు, సైదిరెడ్డి, ఎస్ఐ హరిశంకర్గౌడ్, కానిస్టేబుల్స్ సుమిత్ర, దివ్యవాణిలను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. -
31న అథ్లెటిక్స్ సెలక్షన్స్
తాండూరు టౌన్: వికారాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 31వ తేదీన తాండూరులో బాలబాలికలకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు, సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మధు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు రాములు, రాము మంగళవారం ఓసంయుక్త ప్రకటనలో తెలిపారు. తాండూరులోని పాత శాలివాహన మైదానంలో సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో ఉదయం 8.30 గంటలకు ఈ పోటీలు ప్రారంభమవుతాయన్నారు. బాలబాలికలకు అండర్ 6, 8, 10, 12 విభాగాల్లో 60 మీటర్లు, 150, 200, 300, 400ల మీటర్ల రన్నింగ్ పోటీలు, బ్రాడ్ జంప్, లాంగ్ జంప్, అండర్ 14, 16, 20 విభాగాల్లో జావెలిన్ త్రో, అండర్ 18 విభాగంలో రన్నింగ్, జంపింగ్, త్రోయింగ్ పోటీలు ఉంటాయన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తహసీల్దార్చే జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రంతో హాజరుకావాలన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. వివరాలకు 99513 43432, 63000 75229 నంబర్లలో సంప్రదించాలన్నారు. సీఆర్పీఎఫ్ జిల్లా కన్వీనర్ శివరాజ్ అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణం త్వరితగతిన పూర్తిచేసి తాగునీటి వసతి కల్పించాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక(సీఆర్పీఎఫ్) జిల్లా కన్వీనర్ శివరాజ్ కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితం కళాశాలకు భవనం మంజూరైనప్పటికీ నేటికీ నిర్మాణం పూర్తి చేయలేదన్నారు. గతేడాది కలెక్టర్ చొరవ తీసుకుని అయిదు గదులు పూర్తిచేయించారన్నారు. కళాశాలలో వసతులు లేక 600 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికై నా స్పందించి కళాశాలలో సమస్యలు లేకుండా చూడాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సీఆర్పీఎఫ్ ఉపాధ్యక్షుడు నాగరాజ్, శ్రీనివాస్ ఉన్నారు. తాండూరు టౌన్: మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల జీతాలు పెంచాలని తెలంగాణ మున్సిపల్ స్టాఫ్ అండ్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం ఆయన సంఘం సభ్యులతో కలిసి మున్సిపల్ కమిషనర్ రాకేశ్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులు పేదరికంలో మగ్గుతున్నారని, పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా వారి జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో సంఘం తాండూరు ప్రధాన కార్యదర్శి పి.నర్సింలు, నాయకులు అశోక్, లాలప్ప, వెంకటేశ్, వెంకటప్ప తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ధారాసింగ్ మర్పల్లి: సర్ ప్రక్రియను గడువు లోపు పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధారాసింగ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కట్మర్పల్లి గ్రామంలో బూత్ లెవల్ అధికారులు చేపడుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం సర్పంచ్ అధక్షతన గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన సమీక్షలో మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరు తప్పని సరిగా సర్ ఫారం పూర్తి చేసి సంబంధిత బూత్ లెవల్ అధికారులకు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు సురేష్, నాయకులు రాములుయాదవ్, మహేష్, బూత్ లెవల్ పార్టీ శ్రేణులు, అధికారులు ఉన్నారు. -
చినుకు పడి.. చిత్తడిగా మారి
అసౌకర్యంగా మారిన రోడ్లు తాండూరు టౌన్: చిరుజల్లులకే రోడ్లన్నీ బురదమయంగా మారాయని 8వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ జావీద్ అసహనం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన.. పట్టణ శివారు ఇందిరమ్మ, రాజీవ్కాలనీల రోడ్లను పరిశీలించి మాట్లాడారు. కాలనీల రోడ్లు అధ్వానంగా ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీఅధికారం చేపట్టి రెండున్నరేళ్లు అయినా వార్డుల్లో పూర్తి స్థాయిలో సీసీరోడ్లు, మురుగు కాల్వలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఎమ్మెల్యే మనోహర్రెడ్డి స్పందించి, అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. లేని పక్షంలోఆందోళనలు తప్పవన్నారు. అధైర్యం వద్దు.. వచ్చేది మనమే తాండూరు: అధైర్య పడకండి.. మరో రెండేళ్లలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. బుధవారం మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ పట్లోళ్ల దీపనర్సింహులు ఆధ్వర్యంలో పార్టీ కౌన్సిలర్లు, నాయకులు నగరంలో రోహిత్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాండూరు రాజకీయాలపై కౌన్సిలర్లతో చర్చించారు. తమకు తాండూరులో భద్రత లేదని శ్రేణులు ఆందోళన వ్యక్తం చేయగా.. పైలెట్ పై విధంగా భరోసా ఇచ్చారు. విద్యుదాఘాతంతో ఆవు మృత్యువాత యాచారం: విద్యుదాఘాతంతో ఆవు మృతి చెందిన సంఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ పరిధిలోని కుర్మిద్ద అనుబంధ గ్రామం మంగలిగడ్డ తండాలో చోటు చేసుకుంది. నేనావత్ సోనాకు చెందిన రూ.50 వేల విలువ చేసే పాలిచ్చే ఆవు బుధవారం మధ్యాహ్నం ఓ ప్రైవేట్ కంపెనీ ఏర్పాటు చేసిన గదుల వద్దకు వెళ్లింది. అక్కడ స్తంభానికున్న స్టార్టర్ డబ్బాకు తగిలి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆవు మృతికి కారణమైన ప్రైవేట్ కంపెనీ యాజమాన్యమే నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతు డిమాండ్ చేశారు. రాజేంద్రనగర్: ఆరాంఘర్ చౌరస్తా నుండి పీడీపీ చౌరస్తా వైపు వెళ్తున్న కారులో బుధవారం ఉదయం ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కారు నడుపుతున్న వ్యక్తి భయంతో కారు దిగి బయటికి వచ్చాడు. ఇదే సమయంలో రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కరుణాకర్ అటుగా వెళుతూ వెంటనే స్పందించాడు. పక్కనే ఉన్న ఇంటి నుంచి పైపును తీసుకొని మంటలను అదుపులోకి తెచ్చాడు. 20 నిమిషాల అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. అప్పటికే కారు దాదాపు 50 శాతం కాలిపోయింది. అతి వేగమే ఉసురు తీసింది గచ్చిబౌలి: ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు పేర్కొంటున్నారు. మంగళవారం నియో పోలీస్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగిఉన్న లారీని కారు ఢీకొనడంతో కత్రావత్ సురేందర్ (19), ముత్యాల ప్రణతి రెడ్డి (20) మృతి చెందిన విషయం తెలిసిందే. కోకాపేట్ నుంచి కొల్లూరు వైపు వెళుతున్న కారు ఆగిఉన్న లారీని 120 కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కారు మీటరు కూడా పగిలిపోవడంతో ఓఆర్ఆర్పై ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అతివేగంగా వెళ్లడమే కాకుండా బ్రేక్ కూడా వేసే ప్రయత్నం చేయకపోవడంతో లారీ వెనక భాగంలో కారు కూరుకుపోయిందని చెబుతున్నారు. కారు నడిపిన సురేందర్కు లైసెన్స్ లేదని, డ్రైవింగ్ కూడా సరిగ్గా రాకపోవచ్చని పోలీసులు పేర్కొంటున్నారు. కొంతకాలంగా ఇద్దరూ స్నేహంగా ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే కారులో వెళ్లి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. బుధవారం ఉస్మానియా ఆస్పత్రిలో ముత్యాల ప్రణతి రెడ్డి, కత్రావత్ సురేందర్ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మరియాల గ్రామానికి ప్రణతి మృతదేహం, పక్కనే ఉండే నాయకుని తండాకు సురేందర్ మృతదేహాలను తరలించారు. -
అడ్రస్ లేకపాయె!!
వికారాబాద్: మాటల్లో ఆర్భాటం.. చేతల్లో నిస్తేజం అన్న చందంగా విద్యాశాఖ పరిస్థితి తయారైంది. బడులు ఓపెన్ చేసే నాటికే యూనిఫాం, షూ, నోట్బుక్స్, బ్యాగులతో కూడిన నాణ్యమైన కిట్లు అందజేస్తామని చెప్పిన విద్యాశాఖ నేటికి వాటిని అందిచలేదు. పాఠశాలలు పునఃప్రారంభమై నెల పదిహేను రోజులు గడిచినా ఏకరూప దుస్తులు విద్యార్థులకు అందలేదు. కొందరు విద్యార్థులు ఏదో ఒకటి కుట్టించుకుని వేసుకుని వెళ్తుండగా.. మరికొందరు గతేడాది ఇచ్చిన దుస్తులే వేసుకుంటున్నారు. గతేడాది ఇదే తరహాలో జాప్యం చేస్తూ విద్యా సంవత్సరం చివరి వరకు ఇస్తూ వెళ్లిన అధికారులు ఈ ఏడాది సైతం అదే దోరణి అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు దుస్తుల వెతలు తప్పడం లేదు. సర్కారు బడి అయినా.. ప్రైవేటు స్కూల్ అయినా తల్లిదండ్రులకు యునిఫాంల తిప్పలు తప్పటంలేదు. స్థోమత లేక ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్న తల్లిదండ్రులు యునిఫాంలు కొనుగోలు చేయక తప్పడంలేదు. ఈ ఏడాది నుంచి నూతన తరహాలో యూనిఫాంలు డిజైన్ చేశారు. ఇందుకు సంబంధించి డిజైన్ చేసిన కలర్లకు అనుగుణంగా ఇటీవలే బట్ట కొనుగోలు చేశారు. బట్ట పంపిణీ ఆలస్యం వికారాబాద్ జిల్లాలో మొత్తం 1,063 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఇందులో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 73,861 మంది విద్యార్థులు నమోదై ఉన్నారు. వీరికి విద్యాశాఖ నుంచి ప్రతీ సంవత్సరం రెండు జతలు యునిఫాంలు ఉచితంగా అందజేస్తుంది. పాఠశాలల పునః ప్రారంభానికి ముందే బట్ట పంపిణీ చేసి కుట్టిస్తుంది. వాటికి సంబంధించి మండలాలు పాఠశాలల వారీగా విద్యాశాఖ కూలీ డబ్బులు అందిస్తుంది. ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున 1,47,722 దుస్తులు అవసరం కాగా ఇప్పటి వరకు విద్యాశాఖ ఒక జత కూడా అందజేయలేదు. కాగా ఈ ఏడాది స్థానిక మహిళా సంఘాలకు బట్ట పంపిణీ చేసి కుట్టిస్తున్నామని విద్యాశాఖ అధికారులు చెబుతుండగా.. బట్ట పంపిణీలో ఆలస్యం వల్లే కుట్టడం లేట్ అవుతోందని మహిళా సంఘాల సభ్యులు పేర్కొంటున్నారు. కూలీ డబ్బులు సైతం సకాలంలో చెల్లించకపోవడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. యునిఫాంలు కుట్టించేందుకు 820 స్వయం సహాయక సంఘాలను గుర్తించిన జిల్లా అధికారులు ఇటీవలే వారికి బట్ట అందజేశారు. కేజీబీవీ విద్యార్థులకు మాత్రం యూనిఫాంలు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు ఇటీవలే షూ చేరినా.. యూనిఫాంలతో పంపిణీ చేయాలని నిర్ణయించి పక్కన పెట్టారు. ఈ ఏడాది నుండి పంపిణీ చేస్తామన్న బ్యాగులు ఇతర వస్తువులపై స్పష్టత కొరవడింది. బడులు ప్రారంభమై నెలన్నర గడిచినా అందని యూనిఫాంలు పాత దుస్తులతోనే పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు నాణ్యతలోపం కారణంగా ఒక్కో బడికి ఒక్కోరకం దుస్తులు తల్లిదండ్రులకు ఆర్థిక భారం యూనిఫాంల విషయంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ప్రైవేటు స్కూళ్లకు మాత్రమే ఉండే యునిఫాంలు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లోనూ తప్పనిసరి చేశారు. పంపిణీ చేస్తున్న దుస్తులు ఒక్కో ఏడాది ఒక్కో రంగులో ఉంటున్నాయి. అవి నాణ్యతగా ఉండకపోవడంతో పాఠశాలల ఉపాధ్యాయులు ఆకర్శణీయంగా ఉండే వేరే రంగుల దుస్తులను తమ పాఠశాలలకు యునిఫాంగా పెట్టుకుంటున్నారు. దీంతో తల్లిదండ్రులు యూనిఫాంలు కొనుగోలు చేయకతప్పడం లేదు. ఒక్కో ప్రభుత్వ పాఠశాలకు ఒక్కోరకం దుస్తులు యూనిఫాంలుగా ఉంటున్నాయి. -
నిష్పక్షపాతంగా సర్వే
విద్యార్థుల్లేక.. మూతబడి గొల్లగూడలో గ్రామంలో విద్యార్థుల కొరత కారణంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మూతపడింది.కొడంగల్ రూరల్: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. మంగళవారం ఆయన పట్టణంలోని కడా కార్యాలయంలో కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్, దుద్యాల మండలాల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గుడిసెల్లో నివసిస్తున్న వారి గుర్తింపునకు ప్రత్యేక సర్వే చేపట్టి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. అర్హులైన ఏ ఒక్క కుటుంబం కూడా సర్వేలో మిగిలిపోకుండా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సర్వే నిర్వహించాలన్నారు. గ్రామ, వార్డు స్థాయిలో లబ్ధిదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ జాబితాలను సిద్ధం చేయాలన్నారు. అనంతరం కొడంగల్లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించి, త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టుర్, జెడ్పీ సీఈఓ సుధీర్, కడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి, హౌసింగ్ పీడీ ముక్రమ్బాబా, మున్సిపల్ కమిషనర్ బలరాంనాయక్, ఎంపీడీఓ ఉషశ్రీ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. మెరుగైన వైద్య సేవలందించాలి ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు వైద్యులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న 220 పడకల ఆస్పత్రి సమావేశం హాలులో జిల్లాలోని ఆస్పత్రుల వైద్యులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. పాము, కుక్క కాటుకు మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. త్వరితగతిన వైద్యం చేయాలి: ఎమ్మెల్యే ప్రభుత్వ ఆస్పత్రులను దేవాలయాలుగా భావిస్తూ రోగులకు త్వరితగతిన వైద్య సేవలందించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. తాండూరు మెడికల్ కళాశాల రెండేళ్ల అనంతరం హకీంపేటకు తరలిస్తారని అప్పటి వరకు తాండూరులోనే కొనసాగుతుందని స్పష్టత ఇచ్చారు. సెప్టెంబర్లో ప్రారంభించాలి: నందారం 220 పడకల ఆస్పత్రిని సెప్టెంబర్ చివరి వరకు అందుబాటులోకి తీసుకురావాలని మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్కుమార్ అన్నారు. కొడంగల్ ఆస్పత్రికి వచ్చే రోగులను తాండూరు, వికారాబాద్ ఆస్పత్రులకు రిఫర్ చేయంకుడా అన్ని వసతులు, సౌకర్యాలు, వైద్య సిబ్బంది, పరికరాలు సమకూర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్స్పాల్ రాజు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాలతి, టీడీఆర్ఐ ఎంఏ ప్రెసిడెంట్ జయప్రసాద్, టీజీఎంఈ ఐడీసీ ఈఈ రామ్మోహన్రెడ్డి, డీఎంహెచ్ఓ సుధాకర్లాల్, ఆర్ఎంఓలు సునీల్, రవీంద్రయాదవ్, పీహెచ్సీ సూపరింటెండెంట్ చంద్రప్రియ, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆనంద్, డాక్టర్ పద్మ సాకేత్ పాల్గొన్నారు. ఎకోపార్కు పనుల పరిశీలన బొంరాస్పేట్: కొడంగల్ రేంజ్ పరిధిలోని బొంరాస్పేట్లో ఏర్పాటు చేస్తున్న ఏకో పార్క్ పనులను మంగళవారం కలెక్టర్ దీపక్తివారి పరిఽశీలించారు. ఈ పార్క్కు రూ.5.65 కోట్ల నిధులు మంజూరవగా.. ఇప్పటి వరకు రూ.40లక్షలు మాత్రమే ఖర్చు చేశారని అధికారులు కలెక్టర్కు వివరించారు. దీంతో ఆయన పనులను వేగిరం చేయాలని సూచించారు. ఆయన వెంట కడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి, వికారాబాద్ అటవీ శాఖ అధికారి విశాల్, బాత్తుల, ఐఎఫ్ఎస్ విజయ్ కుమార్, కొడంగల్ ఎఫ్ఆర్ఓ రమేశ్, బొంరాస్పేట్ ఎఫ్ఎస్ఓ కార్తీక్ రెడ్డి ఉన్నారు. కలెక్టర్ దీపక్తివారి -
కాంగ్రెస్లో గ్రూపు విభేదాలు
మొయినాబాద్: కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు, ఎమ్మెల్యే కాలె యాదయ్య కుమారుడు కాలె శ్రీకాంత్, మున్సిపల్ చైర్పర్సన్ సోనియా భర్త, పీసీసీ సభ్యుడు షాబాద్ దర్శన్ మధ్య మాటల యుద్ధం నడిచింది. మరోవైపు పార్టీ కోసం కష్టపడ్డ వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి కొత్తగా చేరినవారికి పదవులు కట్టబెడుతున్నారంటూ కార్యకర్తలు మండిపడ్డారు. మొయినాబాద్ మండల, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏల సమీక్ష సమావేశం బుధవారం పార్టీ కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గం ఇన్చార్జి భీంభరత్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ముందే పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. షాబాద్ దర్శన్, కాలె శ్రీకాంత్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. వేదికపై ఉన్న నాయకులంతా ఇద్దరిని సమాదాయించారు. నామినేటెడ్, పార్టీ పదవులను డబ్బులకు అమ్ముకుంటున్నారని.. కష్టపడ్డవారికి పదవులు దక్కడంలేదంటూ కార్యకర్తలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ పరిస్థితి మారకుంటే రాబోయే రోజుల్లో చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీలో ఎవరూ మిగలరని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని జ్ఞానేశ్వర్ హామీ ఇవ్వడంతో కార్యకర్తలు కాస్త వెనక్కితగ్గారు. ఎస్ఐఆర్ వంద శాతం పూర్తి చేయాలి ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ ప్రక్రియ(ఎస్ఐఆర్)ను అన్ని గ్రామాలు, వార్డుల్లో వంద శాతం పూర్తి చేసే విధంగా చూడాలని రాష్ట్ర ముదిరాజ్ కార్పొరోషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ అన్నారు. బీఎల్ఏల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఎన్యూమరేషన్ ఫారంలో సమగ్ర వివరాలు నమోదు చేసి వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేసే విధంగా బీఎల్ఏలు కృషి చేయాలన్నారు. సమావేశంలో చేవెళ్ల నియోజకవర్గం ఇన్చార్జి భీంభరత్, పీసీసీ అధికార ప్రతినిధి గౌరి సతీష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
సర్.. వందశాతం లక్ష్యం
● కలిసికట్టుగా ముందుకు సాగండి ● ఆర్డీఓ వాసుచంద్ర పరిగి: సర్ ప్రక్రియలో పురోగతి తక్కువ ఉన్న పోలింగ్ స్టేషన్లపై దృష్టి సారించాలని ఆర్డీఓ వాసుచంద్ర అన్నారు. బుధవారం పట్టణ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఓటరు జాబితా సవరణ గురించి మాట్లాడారు. ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ ఆగస్టు 3 లోపు పూర్తికావాలని చెప్పారు. వందశాతం పూర్తి చేసేందుకు కృషి చేయాలని సూచించారు. ఇందుకు సమష్టిగా అందరూ ముందుకు సాగాలన్నారు. ఎన్యుమరేషన్ పత్రాలనుబీఎల్ఓలకు తిరిగి ఇవ్వని పక్షంలో హక్కు కోల్పోతారని ఓటర్లకు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకమని, దానిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 18 ఏళ్లు నిండిన వారు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇదే విషయమై నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వరి, డిప్యూటీ తహసీల్దార్లు అనిల్బాబు, విజయోందర్ తదితరులు పాల్గొన్నారు. -
తాండూరు టు అరుణాచలం
● ఆగస్టు 3నుంచి ఆర్టీసీ డీలక్స్ బస్సు ● ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి ● డిపో మేనేజర్ ప్రవీణ్కుమార్ తాండూరు టౌన్: తాండూరు నుంచి అరుణాచల క్షేత్రానికి ఆర్టీసీ డీలక్స్ బస్సు నడపనున్నట్లు డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 3 నుంచి 5వ తేదీ వరకు అరుణాచలం ఆధ్యాత్మిక యాత్ర కొనసాగనున్నట్లు తెలిపారు. మూడు రోజుల పాటు సాగే ఈ యాత్రకు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు. పెద్దలకు రూ.3,600, పిల్లలకు హాఫ్ టికెట్ రూ.2 వేలు ఉంటుందన్నారు. రాత్రి 9గంటలకు తాండూరు నుంచి బస్సు బయలుదేరి కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, తమిళనాడు వేలూరులోని గోల్డెన్ టెంపుల్, తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర స్వామి దర్శనం కల్పిస్తారన్నారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. 5వ తేదీ సాయంత్రం 5గంటలకు తిరుగు ప్రయాణం ఉంటుందని, 6వ తేదీ ఉదయం వరకు తాండూరుకు చేరుకుంటారన్నారు. ఆలయ దర్శనం, భోజనం, వసతి ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుందన్నారు. టికెట్ల బుకింగ్ కోసం సెల్ నంబర్ 9948947422, 8309348157లలో సంప్రదించాలన్నారు. ఈ ఆధ్యాత్మిక యాత్రను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని డీఎం కోరారు. -
భూ బాధితులకు ప్రభుత్వ అండ
● సర్వేకు రైతులు సహకరించాలి ● అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి దోమ: రేడియల్ రోడ్డు, పారిశ్రామిక వాడకు భూములు ఇచ్చే రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్ని విధాలా ఆదుకుంటుందని అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి అన్నారు. బుధవారం మండలంలోని కొండాయపల్లిలో ఆర్డీఓ వాసుచంద్రతో కలిసి ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు సర్వేకి సహకరించాలని కోరారు. మెరుగైన పరిహారం అందించడం తోపాటు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సి పని లేదన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, డీటీ నర్సింహులు, ఆర్ఐలు వెంకటేశ్, రాంచంద్రరావు, జీపీఓలు, వీఆర్ఏలు, గ్రామ రైతులు పాల్గొన్నారు. సమాచారం ఇవ్వలేదు భూములు కోల్పోతున్న తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, పోలీసు బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా సమావేశం నిర్వహించారని గ్రామానికి చెందిన నిమ్మలి సాయిలు, ఇరుకుంట భీములు, వార్ల నరేందర్ మరి కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో 456 ఎకరాల భూములు పోతాయని కేవలం కొంత మంది రైతులతో సమావేశం నిర్వహించడం ఏమిటని వారు ప్రశ్నించారు. చాలా మంది రైతులు హైదరాబాద్లో ఉంటున్నారని ముందుగా సమాచారం ఇవ్వకపోవడంతో వారు రాలేదన్నారు. బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే ఉద్యమం చేస్తామని రైతులు హెచ్చరించారు. -
మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలి
షాబాద్: మత్తు పదార్థాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇన్స్పెక్టర్ డీకే లక్ష్మిరెడ్డి అన్నారు. మండల పరిధిలోని కుర్వగూడ, లక్ష్మారావుగూడ గ్రామాల్లోని పలు దుఖాణాల్లో డాగ్స్వాడ్ బృందంతో కలిసి ఆయన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లోకి మత్తుపదార్థాలు, గంజాయి సరఫరా అవుతుందనే అనుమానంతో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ఎప్పటికప్పుడూ నిఘా పెట్టాలని సూచించారు. మండలంలోని పలు గ్రామాల్లో కంపెనీలు రావడంతో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఉద్యోగులు, కూలీలు ఇక్కడికి వస్తున్నారని.. వారంతా ఏం చేస్తున్నారో ప్రజలు నిఘా పెట్టి ఉంచాలన్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, 100కు డయల్ చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్ఐ చెన్నారెడ్డి, సర్పంచ్లు సంధ్యమల్లికార్జున్గౌడ్, కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.ఇన్స్పెక్టర్ డీకే లక్ష్మిరెడ్డి -
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత
మీర్పేట: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. బుధవారం ఆయన ప్రశాంతి హిల్స్ ద్వారకామయి సాయిబాబ పీఠంలో పీఠాధిపతి గోపాలకృష్ణానంద స్వామిజీ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపౌర్ణమి వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కేఎల్ఆర్తో కలిసి రహస్య తత్వార్థ బోధనలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ జానకి కొడపి, పీసీసీ సభ్యుడు దేప భాస్కర్రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర సభ్యులు సామిడి గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్బాబు -
సమస్యల తహసీల్ కథనంపై చర్చ
యాచారం: తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై ఉన్నతాధికారుల ఆరా తీసినట్లు తెలిసింది. బుధవారం ‘సాక్షి’దినపత్రికలో ‘సమస్యల తహసీల్!’కథనంపై జిల్లా వ్యాప్తంగా చర్చ సాగింది. తహసీల్దార్ అయ్యప్ప, ఇతర అధికారులపై ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధుల ఫిర్యాదులపై కలెక్టర్ నారాయణరెడ్డి ఆరా తీసినట్లు సమాచారం. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల వరుస ఫిర్యాదుల నేపథ్యంలో యాచారం తహసీల్దార్ అయ్యప్పను తక్షణమే సెలవులో వెళ్లాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది. ఉన్నతాధికారులకు సంజాయిషీ ఇచ్చుకునేందుకు వెళ్లిన తహసీల్దార్ మధ్యాహ్నం తర్వాత కార్యాలయానికి విచ్చేసి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. ఉపాధి కోసం వచ్చి.. చోరీలు ● ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠాసభ్యులకు రిమాండ్ ● ఏడు తులాల బంగారుఆభరణాలు, ఓ ద్విచక్రవాహనం, మూడు సెల్ఫోన్లు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్జోషి షాద్నగర్: ఉపాధి పేరుతో వచ్చి.. చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను షాద్నగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్జోషి వెల్లడించారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన సుఖ్దేవ్సింగ్, షమేర్ సింగ్, మన్ప్రీత్సింగ్ ఉపాధి కోసం కొంతకాలం క్రితం రాష్ట్రానికి వచ్చారు. హార్వెస్టర్ డ్రైవర్లు, కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సులువుగా డబ్బు సంపాదించేందుకు చైన్ స్నాచింగ్లకు, ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 25వ తేదీన కేశంపేట మండలం సంతాపూర్లో ఈ నలుగురు దుండగులు బైక్లపై వచ్చి ఓ వృద్ధురాలి మెడలోంచి నాలుగు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కెళ్లారు. కడ్తాల్ ఠాణా పరిధిలో మరో మహిళను బెదిరించి ఆమె మెడలోంచి మూడు తులాల పుస్తెల తాడును అపహరించుకెళ్లినట్లు తెలిపారు. జూలై 24న మహబూబ్నగర్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఏటీఎం వద్ద పార్కు చేసిన బైకును, జూన్లో వనపర్తి జిల్లా కొత్తకోటలో చోరీ చేసిన ద్విచక్రవాహనాలపై తిరుగుతూ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నట్లు తెలిపారు. కేశంపేటలో అరెస్టు కేశంపేట చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న సుఖ్దేవ్సింగ్, షమేర్ సింగ్, మన్ప్రీత్సింగ్లను అదుపులోకి తీసుకుని విచారించగా కేశంపేట, కడ్తాల్, మహబూబ్నగర్, కొత్తపేట ఠాణాల పరిధిలో చేసిన చోరీలను ఒప్పుకొన్నారని తెలిపారు. వారి వద్ద నుంచి ఏడు తులాల బంగారు ఆభరణాలు, మూడు సెల్ఫోన్లు, ఓ ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపా రు. ఈ సమావేశంలో షాద్నగర్ డీసీపీ శిరీషా రాఘవేంద్ర, ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ నరహరి, ఎస్ఐ రాజ్కుమార్ పాల్గొన్నారు. -
అప్రమత్తంగా ఉండండి
● భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున్న ముందస్తు చర్యలు తీసుకోవాలి ● ఆస్తి, ప్రాణ నష్టం జరగొద్దు ● లోతట్టు ప్రాంతాలు, వాగులపై ప్రత్యేక దృష్టి సారించాలి ● కలెక్టర్ దీపక్ తివారి అనంతగిరి: భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, నీటిపారుదల, ఇరిగేషన్, వైద్యం, గ్రామ పంచాయతీ, విద్యుత్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, కాలువలు, చెరువులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రహదారులపైకి నీరు చేరడం, పాత భవనాలు, చెట్లు కూలడం వంటి ఘటనలు జరిగితే వెంటనే స్పందించాలన్నారు. అవసరమైన యంత్రాంగాన్ని, సహాయక బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాగులు, వరద ప్రవాహం ఉన్న ప్రాంతాలకు వెళ్లరాదని సూచించారు. అనంతరం ఎస్పీ స్నేహమెహ్ర మాట్లాడారు. పోలీస్ శాఖ పరిధిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 24 గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉంటారని సహాయం కాల్సిన వారు కంట్రోల్ రూమ్ సెల్ నంబర్ 8712670056కు సమచారం ఇవ్వాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఉమాశంకర్ ప్రసాద్, వెంకటాచారి, ట్రైయినీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టుర్, అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా, డీఆర్ఓ స్వర్ణలత, ఆర్డీఓ వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు. డిజిటలైజేషన్ 78శాతం పూర్తి జిల్లాలో ఇప్పటి వరకు సర్ డిజిటలైజేషన్ 78శాతం పూర్తి చేసినట్లు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. మంగళవారం నగరం నుంచి ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. జిల్లాలో ఎస్ఐఆర్ గురించి కలెక్టర్ వివరించారు. -
గ్రామసభ.. తీర్మానాల వేదిక
ధారూరు: గ్రామసభ.. తీర్మానాలకు వేదికగా మారింది. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా పలు అంశాలపై చర్చించి, వాటి పరిష్కారానికి నిర్ణయించారు. బుధవారం ధారూరులో సర్పంచ్ ప్రమీళగౌడ్ అధ్యక్షతన జరిగిన సభలో.. కార్యదర్శి అంజానాయక్ జలసిరిపై వివరించారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్, అజీవిక మిషన్ ద్వారా ఇంకుడు గుంతలు, పంట కుంటలు, ఊటకుంట, బోరుబావు రీచార్జి నిర్మాణాలు చేపట్టేందుకు తీర్మానించారు. మండల కేంద్రంలో మొత్తం 3,930 ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేశామని, వాటిలో ఇప్పటి వరకు వరకు 2,841 ఫారాలను తిరిగి తీసుకొని, ఆన్లైన్లో నమోదు చేశామని సర్పంచ్ తెలిపారు. గుంతల్లో మట్టి వేయించి పూడ్చాలని ప్రజలు కోరారు. వీరభద్రేశ్వరస్వామి దేవాలయం నుంచి శాలివాహన కాలనీ వరకు మురికి కాల్వ నిర్మించాలని, బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ను మరో ప్రాంతానికి తరలించాలని నిర్ణయించారు. సమావేశంలో ఎల్ఎన్తండా సర్పంచ్ పూజ, ఉప సర్పంచ్ జహంగీర్, కోఆప్షన్ మాజీ సభ్యుడు హఫీజ్, డీసీసీ కార్యదర్శి బాబాఖాన్, వార్డు మెంబర్లు, ప్రజలు పాల్గొన్నారు. సమష్టి చర్చ..సమస్యల పరిష్కారానికి నిర్ణయం -
నైపుణ్య శక్తిని పెంపొందించుకోవాలి
షాద్నగర్రూరల్: విద్యార్థులు నైపుణ్య శక్తిని పెంపొందించుకొని ఉద్యోగాల్లో రాణించాలని గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీత అన్నారు. బుధవారం షాద్నగర్లోని గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఇంక్వి ల్యాబ్ ఫౌండేషన్, ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో హ్యాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఐడియేషన్, డిజైన్ థింకింగ్ ఇన్నోవేషన్ స్కిల్స్, స్టార్టప్ కంపెనీల ఏర్పాటుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపాల్ నీత మాట్లాడుతూ.. విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాస్తవ జీవిత, సామాజిక సమస్యలకు వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులు వేర్వేరు బృందాలుగా విడిపోయి వినూత్న ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సిబ్బంది ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. గిరిజన మహిళా డిగ్రీ కళాశాలప్రిన్సిపాల్ డాక్టర్ నీతా -
లబోదిబోమంటున్న రైతులు
జొన్నల డబ్బుల్లో కోత ధారూరు: కొనుగోలు కేంద్రంలో విక్రయించిన జొన్నలకు సంబంధించిన డబ్బుల్లో కోత పెట్టి వేధిస్తున్నారని మండలంలోని చింతకుంట గ్రామ రైతులు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. నెల రోజుల క్రితం ధారూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో రైతులు ఎం.వెంకటయ్య, పి.విజయలక్ష్మి, పట్లోళ్ల ప్రభాకర్రెడ్డి, వడ్డె పరమానందం, శేఖర్రెడ్డి, పి.సింధు జొన్నలు విక్రయించగా నిర్వాహకులు తక్ పట్టీలు ఇచ్చారు. బుధవారం వారి ఖాతాల్లో డబ్బు జమ అయినట్లు ఫోన్లకు సమాచారం వచ్చింది. విక్రయించిన బస్తాల కంటే తక్కువ వాటికి డబ్బు జమ చేసినట్లు గుర్తించారు. పరమానందంకు 1.50 క్వింటాళ్లు, ప్రభాకర్రెడ్డి, విజయలక్ష్మి, వెంకటయ్యలకు క్వింటాలు చొప్పున, శేఖర్రెడ్డి సింధుకు 50 కిలోల సంబంధించిన డబ్బులు తక్కువగా జమ చేసినట్లు బాధితులు తెలిపారు. మా సమక్షంలో తూకం వేసి తక్ పట్టీలు ఇచ్చినా డబ్బు తక్కువ వేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఈ విషయమై ధారూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో అధికారులను ప్రశ్నిస్తే సరైన సమాధానం ఇవ్వటం లేదన్నారు. ఈ విషయమై పీఏసీఎస్ సీఈఓ నర్సింహులును వివరణ కోరగా రైతుల విషయం తమ దృష్టికి వచ్చిందని, మార్క్ఫెడ్ అధికారులతో మాట్లాడి ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకుని న్యాయం జరిగేలా చూస్తామన్నారు. -
కార్మికులకు అన్యాయం చేస్తే ఊరుకోం
ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ తాండూరు రూరల్: సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికులకు యాజమాన్యాలు అన్యాయం చేస్తే ఊరుకోమని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్ అన్నారు. బుధవారం మండల పరిధి బెల్కటూర్లో ఆదాని సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద నాలుగో జిల్లా మహాసభలు నిర్వహించారు. ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. లెబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిమెంట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ ప్రతినిధులు విజయలక్ష్మి పండిత్, బాల శంకర్, దశరథ్ గౌడ్, జైపాల్రెడ్డి, రవీంధర్, వంశీకృష్ణ, తహర్ పాషా, జంగయ్య, అజయ్, రాజేశ్వర్రెడ్డి, పాండు, అశోక్, నర్సిములు, నాయకులు శరణు బసప్పలు పాల్గొన్నారు. -
విస్తారంగా వర్షాలు
వికారాబాద్: జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తుండటంతో పంటలకు జీవం పోసినట్లయింది. ఈ సీజన్లో ఇదే అత్యధిక వర్షపాతం. ఒకటి రెండు చోట్ల భారీగా.. మిగతా చోట్ల సాధారణ వర్షపాతం నమోదైంది. రైతన్నకు కాస్త ఉపశమనం లభించింది. వాగులు, వంకలు పారుతూ చెరువుల్లోకి నీరు చేరుతోంది. గడచిన మూడు రోజుల్లో మోమిన్పేటలో అత్యధికంగా 45మిల్లీమీటర్లు, నవాబుపేటలో 31 మి.మీ. మర్పల్లిలో 26.9మి.మీ. వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. పలు కాలనీలు నీటి కుంటలను తలపిస్తున్నాయి. రోడ్లన్నీ బురదమయంగా మారాయి. ఆనందంలో రైతులు వానాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పంటలకు సరిపడా వర్షం పడలేదు. అప్పుడప్పుడు కురిసినా పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. చెలకలు, ఇసుక పొలాల్లో మొక్కజొన్న తదితర విత్తనాలు సగం మొలకెత్తగా మిగతావి ఎండిపోయాయి. ప్రస్తుత వర్షాలు వరి నాట్లు వేసుకునే రైతులకు మేలు చేయనున్నాయి. వానలు ఇలాగే కొనసాగితే బోరు బావులు, చెరువుల్లో నీటి మట్టం పెరిగి నాట్లు ఊపందుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం పత్తి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసలు, కూరగాయలు, పసుపు తదితర పంటలకు జీవం పోసినట్టయ్యింది. పంటలు పచ్చగా ఉండటంతో రైతుల్లో ఆనందం కనిపిస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలోని నాలుగు మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా మూడు మండలాల్లో సాధారణం, మరో 13 మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. రెండు మూడు మండలాల్లో మినహా మిగతా అన్ని చోట్ల సాధారణ వర్షపాతానికి చేరువయ్యాయి. మొత్తంగా చూస్తే జిల్లాలో ఇంకా 25 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం కనిపిస్తోంది. అప్రమత్తమైన అధికారులు గత అనుభవాల నేపథ్యంలో రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యాయి. వాగులు, వంకల వద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో క్షేత్రస్థాయి అధికారుల ను అలర్ట్ చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పాఠశాలల హెచ్ఎంలతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎరువుల కోసం రైతులు పీఏసీఎస్ కేంద్రాలు, ఫెర్టిలైజర్ షాపుల బాట పడుతున్నారు. ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. మండలం వర్షపాతం – మర్పల్లి 26.9 లోటు మోమిన్పేట్ 45.5 అధికం నవాబుపేట 30.00 సాధారణం వికారాబాద్ 11.00 సాధారణం పూడూరు 11.5 అధికం పరిగి 4.5 లోటు కుల్కచర్ల 5.7 లోటు దోమ 6.5 లోటు బొంరాస్పేట్ 5.5 అధికం ధారూరు 10.6 లోటు కోట్పల్లి 7.2 లోటు బంట్వారం 12.1 లోటు పెద్దేముల్ 7.6 లోటు తాండూరు 4.7 లోటు బషీరాబాద్ 2.9 లోటు యాలాల 3.2 లోటు కొడంగల్ 14.00 లోటు దౌల్తాబాద్ 13.7 లోటు చౌడాపూర్ 6.8 అధికం దుద్యాల్ 6.8 సాధారణం పంటలకు జీవం రైతుల్లో చిగురించిన ఆశలు మూడు రోజులుగా కురుస్తున్న వానలు ఈ సీజన్లో ఇదే అత్యధికం మోమిన్పేటలో 45మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు ఎరువుల కోసం అన్నదాతల పరుగులు -
నీటి ప్రవాహం ఉన్న వాగులు దాటొద్దు
● రైతులు జాగ్రత్తగా ఉండాలి ● ఎస్పీ స్నేహ మెహ్ర మోమిన్పేట: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు, రైతులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ స్నేహ మెహ్ర సూచించారు. బుధవారం మోమిన్పేట పోలీస్స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పొలాలకు వెళ్లే రైతులు మార్గమధ్యలోని వాగులను దాటే క్రమంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటే దాటే సాహసం చేయరాదని సూచించారు. గత ఏడాది మండలంలోని మేకవనంపల్లి వద్ద వాగు దాటుతూ ఓ యువకుడు గల్లంతై మృతి చెందిన ఘటనను ఆమె గుర్తు చేశారు. మద్యం సేవించి, హెల్మెట్, సీటు బెల్టు లేకుండ వాహనాలు నడిపితే చర్యలు ఉంటాయన్నారు. నేరాల నియంత్రణకు ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. మండలంలోని 29 గ్రామ పంచాయల్లో 293 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ భరత్భూషణ్ ఎస్పీకి తెలిపారు. అనంతరం రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఎస్పీ అంజయ్య. సీఐ వెంకట్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
చెట్టుకు పుట్టిన రోజు వేడుకలు
పదేళ్లుగా పాటిస్తున్న కుటుంబం తాండూరు టౌన్: భౌతికంగా కుటుంబ పెద్ద తమ మధ్య లేకపోయినా, ఆయన నాటిన మొక్కను సంరక్షిస్తూ ఆ మొక్కలోనే ఆయనను చూసుకుంటోంది తాండూరు పట్టణానికి చెందిన ఓ కుటుంబం. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కొట్రిక విజయలక్ష్మి, భర్త కొట్రిక వెంకటయ్య పదేళ్ల క్రితం ఇంటి ఎదుట ఓ మొక్కను నాటారు. తర్వాత ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనపై ఉన్న ప్రేమ, వాత్సల్యంతో ఆ చెట్టుకు ఏటా వెంకటయ్య జయంతి రోజున పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ చెట్టు సంరక్షణార్థం వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో తిరిగి నాటారు. తాజాగా బుధవారం ఆయన జయంతి రోజు కావడంతో కుటుంబ సభ్యులు చెట్టుకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో కొట్రిక విజయలక్ష్మి, కొడుకు, కోడలు కొట్రిక శ్రీకాంత్, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ జావీద్ తాండూరు టౌన్: పట్టణంలోని డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు అర్హుల జాబితాపై మున్సిపల్ 8వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ జావీద్ బుధవారం కలెక్టరేట్లో సమాచార హక్కు కింద దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పూర్తిగా వ్యాపార ధోరణిలో అనర్హులకు ఇళ్లు కేటాయించారని ఆరోపించారు. ఇటీవల ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఏకంగా సీఎం చురకలంటించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అర్హులను ముందుగా గుర్తించి వారికి ఇళ్లు కేటాయించాల్సి ఉండగా, తొలుత ఇళ్లు కేటాయించి వారి అర్హతపై విచారణ చేపట్టడం హాస్యాస్పదమన్నారు. డబుల్ ఇళ్లకు కేసీఆర్ హయాంలో దరఖాస్తు చేసుకున్న వారిని పరిగణలోకి తీసుకున్నారా? ప్రస్తుతం కేటాయించిన ఇళ్ల విచారణాధికారి వివరాలు, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు, అర్హుల జాబితాను కోరుతూ కలెక్టరేట్లో ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేశానన్నారు. ఇట్టి ప్రశ్నలకు సరైన వివరణ రాకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శంకర్నాయక్ పరిగి: ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా అధ్యాపకులు కార్యాచరణను రూపొందించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శంకర్నాయక్ సూచించారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. చదువుతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందన్నారు. ఎలాంటి సందేహాలు ఉన్నా అధ్యాపకులను అడిగి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులు, కళాశాలకు పేరు తేవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, అధ్యాపకులు భాస్కరయోగి తదితరులు పాల్గొన్నారు. కొత్తూరు: చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళనకరమని ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ట్రాఫిక్ డీసీపీ శివం ఉపాధ్యాయ అన్నారు. పట్టణంలోని పెంజర్ల కూడలిలో బుధవారం ఆయన వాహనదారులు, ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఇటీవలి రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించని కారణంగానే మృతి చెందారన్నారు. కార్లలో ప్రయాణించే వారు సీట్బెల్టులు, ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు. -
బీఆర్ఎస్కు పూర్వ వైభవం ఖాయం
మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ బంట్వారం: బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం ఖాయమని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం మండలంలోని రొంపల్లిలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలే పార్టీకీ బలం బలగమన్నారు. కాంగ్రెస్ మునిగే నావలాంటిదన్నారు. భవిష్యత్ అంతా బీఆర్ఎస్దేనన్నారు. నాయకులు మనస్పర్థలు వీడి కలిసి పని చేయాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అంతకుముందు సర్ ప్రక్రియను పరిశీలించి పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. బీఆర్ఎస్ ఓట్లు గల్లంతు కాకుండా జాగత్త పడాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశం, నాయకులు బల్వంత్రెడ్డి, ఫిరోజ్, చందూ సింగ్, వీరప్ప, సాయిలు యాదవ్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా
రాజేంద్రనగర్ ఎస్ఈ శ్రీరామ్ మోహన్ మహేశ్వరం: పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా సరఫరా సామర్థ్యం పెంచుతున్నామని రాజేంద్రనగర్ విద్యుత్ సూపరింటెండింగ్ ఇంజనీర్(ఎస్ఈ) శ్రీరామ్ మోహన్ పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని తుమ్మలూరులో 33–11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లో రూ.కోటి నిధులతో అదనపు 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లో వోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా నిరంతరం విద్యుత్ సరఫరాను అందిస్తామన్నారు. విద్యుత్ డిమాండ్ను మరింత సమర్థవంతంగా ఎదుర్కోవడం, పవర్ ట్రాన్స్ఫార్మర్లపై లోడ్ను సమతుల్యం చేయడం, ఓవర్ లోడింగ్ను నివారించడం, వినియోగదారులకు నాణ్యతతో కూడిన విద్యుత్ సరఫరా అందించేందుకు ఈ ట్రాన్స్ఫార్మర్లు దోహదపడుతుందన్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా సబ్స్టేషన్ల సామర్థాన్ని పెంచడం, అవసరమైన ప్రాంతాల్లో అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కందుకూరు విద్యుత్ డీఈ గోపాలకృష్ణ, ఎంఆర్టీ ఏడీఈలు శంకర్, స్వాతి, శ్రీనివాస్, రామలింగారెడ్డి, మహేశ్వరం ఏఈ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. -
దళారులపై చర్యలకు వినతి
ఆమనగల్లు: స్థానిక కూరగాయల మార్కెట్లో రైతులను మోసం చేస్తున్న దళారులపై చర్యలు తీసుకోవాలని ఆమనగల్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాళ్ల రవీందర్ కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కొన్నేళ్లుగా మార్కెట్లో మోండా పేరుతో కొంతమంది దళారులు రైతులను దోచుకుంటున్నారని తెలిపారు. ఎలాంటి లైసెన్స్ లేకుండా రైతుల నుంచి కూరగాయలు కొనుగోలు చేయడంతో పాటు తరుగు, కమీషన్ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. వీరికి గతంలోనే మార్కెట్ కమిటీ నుంచి నోటీసులు అందజేశారని తెలిపారు. క్వారీ పనులు నిలిపివేయాలి.. ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లిలోని సర్వే నంబర్ 302, 304లో కొనసాగుతున్న క్వారీ పనులను ఆపేయాలని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపతంర అందజేశారు. క్రషర్తో విపరీతమైన దుమ్ము, శబ్ద కాలుష్యం వెలువడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రైతులను మోసం చేస్తున్నారని కలెక్టర్కు ఫిర్యాదు తరుగు, కమీషన్ పేరుతో దోచుకుంటున్నారని ఆరోపణ -
తాటిచెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోండి
ఇబ్రహీంపట్నం రూరల్: తాటి చెట్లు నరికి గీత వృత్తికి దూరం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం నాయకుడు గుండ్ల దానయ్యగౌడ్, కార్యదర్శి భాస్కర్గౌడ్ డిమాండ్ చేశారు. పోల్కంపల్లిలో తాటి చెట్లు నరికిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ సర్పంచ్ గుండ్ల కొండల్గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఇంటి స్థలాలు చూపించండి.. యాచారం మండలంలోని చింతుల్లలో ఇచ్చిన సర్టిఫికెట్లకు సంబంధించిన ఇళ్ల స్థలాలను చూపించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని సర్వే నంబరు 327లో ఐదెకరాల స్థలంలో ఇంటి పట్టాలు ఇచ్చారన్నారు. అప్పటి మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే నర్సింహ వీటిని పంపిణీ చేసినా, ఇప్పటికీ పొజిషన్ చూపించలేదని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మస్కు విజయ్, సామర్తి జగన్, వినోద్కుమార్, నర్సింహ, కుమార్, ఎస్ఎఫ్ఐ నాయకులు చరణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట గీత కార్మికుల ధర్నా -
‘ఆ నాయకుడి తీరు సిగ్గుచేటు’
చేవెళ్ల: బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సిగ్గుచేటని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. చేవెళ్లలో సోమవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 17వ వార్డు కౌన్సిలర్ ఎం.కృష్ణానాయక్ అర్ధరాత్రి మద్యం తాగి, పట్నం మహేందర్రెడ్డి ఆస్పత్రిలో హల్చల్ చేయడమే కాకుండా తానే స్వయంగా వీడియో తీసుకుంటూ వైద్యులు, యాజమాన్యాన్ని దూషించాడన్నారు. అంతటితో ఆగకుండా ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడని తెలిపారు. అధికార పార్టీ కౌన్సిలర్ననే అహంకారంతోనే ఆయన ఇలా ప్రవర్తించాడని మండిపడ్డారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తప్పు చేసి క్షేమాపణ చెబితే సరిపోదని మండిపడ్డారు. సమావేశంలో నాయకులు పి.ప్రభాకర్, కె. ఆనంద్, విజయ్భాస్కర్రెడ్డి, డీఎం.చందు, అనంత్రెడ్డి, మల్లారెడ్డి, దండు సత్తి, భాస్కర్రెడ్డి, దూత మల్లేశ్, శ్రీధర్రెడ్డి, కుర్వ మల్లేశ్, క్రిష్ణ, నరేందర్రెడ్డి, బాలు, శంకరయ్య, రాంప్రసాద్, మానిక్యరెడ్డి తదితరులు ఉన్నారు. -
మద్యం మత్తులో వీరంగం
చేవెళ్ల: పట్టణంలోని 17వ వార్డు కౌన్సిలర్ ఎం.కృష్ణానాయక్ మద్యం మత్తులో ఆదివారం రాత్రి పట్నం మహేందర్రెడ్డి ఆస్పత్రిలో హంగామా చేశారు. విధుల్లో ఉన్న డాక్టర్లు, సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడాడు. రాత్రి తన స్నేహితుడికి ప్రమాదం జరగడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. సిబ్బంది వచ్చి చికిత్స ప్రారంభిస్తుండగానే తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఫ్రీ అని ప్రచారం చేసూకుంటూ.. డబ్బులు తీసుకుంటున్నారంటూ మండిపడ్డారు. తాను అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్నని, తనకే ఇక్కడ న్యాయం జరగడం లేదని వీడియో తీసుకుని, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్ కావడంతో పోలీసులు అతన్ని పిలిపించి విచారించారు. తాను ఓ దావత్కు వెళ్లానని, తన స్నేహితుడు ఆస్పత్రిలో ఉండటంతో అక్కడికి వెళ్లి మద్యం మత్తులో వైద్యులు, సిబ్బందిపై అమర్యాదగా మాట్లాడానని అంగీకరించారు. తన వల్ల ఇబ్బంది పడిన వారికి క్షమాపణ చెబుతున్నానని, తనకు ఎవరిపైనా దురుద్దేశం లేదని చెబుతూ మరో వీడియో పోస్ట్ చేశారు. క్షమాపణ చెబుతూ కృష్ణానాయక్ఆసుపత్రిలో కౌన్సిలర్ హ ంగామా మైకం వదిలిన తర్వాత క్షమాపణ చర్చనీయాంశమైన కౌన్సిలర్ వ్యవహారం -
ఇంటిగ్రేటెడ్ స్కూల్ను వెంటనే ప్రారంభించాలి
చేవెళ్ల: రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను చేవెళ్లలో వెంటనే ప్రారంభించాలని బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు అత్తెల్లి అనంత్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ పురన్దాస్కు బీజేపీ నాయకులతో కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఈ పాఠశాల ఇప్పటివరకు నియోజకవర్గంలో ఎందుకు ప్రారంభించలేకపోయారో అధికార పార్టీ నాయకులు చెప్పాలన్నారు. మంజూరు చేసిన పాఠశాలను సైతం ఏర్పాటు చేసేందుకు ఇన్నాళ్లుగా కాలయాపన చేయటం విడ్డురంగా ఉందన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చేవెళ్లకు మంజూరైన ఇంటిగ్రేటెడ్ పాఠశాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రజలతో కలిసి బీజేపీ పెద్దఎత్తున ందోళన కార్యక్రమాలు చేపడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కృష్ణగౌడ్, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి అశోక్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు తదితరులు ఉన్నారు. ఎంఈఓకు బీజేపీ నాయకుల వినతి -
యంత్రంలో నలిగి కార్మికుడి మృతి
షాద్నగర్: ఫరూక్నగర్ మండలం ఎలికట్ట గ్రామ శివారులోని ఓ పరిశ్రమలో వలస కార్మికుడు ప్ర మాదం బారిన పడి మృతిచెందాడు. ఆదివారం రాత్రి 7గంటలకు ఈ ఘటన చోటుచేసుకోగా కంపెనీ నిర్వాహకులు విషయాన్ని బయటకు రానీయలేదు. బతుకుదెరువు కోసం వచ్చి.. ఒడిశా రాష్ట్రానికి చెందిన బిజయ భద్ర (21)కు ఏడాదిన్నర క్రితం నూనిసింగ్తో వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరూ మూడు నెలల క్రితం బతుకుదెరువు నిమిత్తం షాద్నగర్కు వచ్చి, ఎలికట్ట శివారులోని చెట్టినాడ్ పరిశ్రమలో పని చేస్తున్నారు. ఇటీవల సొంతూరుకు వెళ్లిన భద్ర.. డెలివరీ నిమిత్తం భార్యను అక్కడే వదిలేసి ఎలికట్టకు వచ్చాడు. పది రోజుల క్రితం పాప పుట్టిందని తెలియడంతో మరో రెండు మూడు రోజుల్లో ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ విషయాన్ని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. కేసు నమోదు.. కార్మికుడు భద్ర కంపెనీలో టైల్స్ పౌడర్ తయారు చేసే యంత్రం వద్ద పనిచేస్తాడు. ప్రమాదవశాత్తు యంత్రంలో పడిపోయిన భద్ర అందులోనే నలిగి చనిపోయాడు. మృతదేహాన్ని వెలికి తీసి మార్చురీకి తరలించారు. ఇదే పరిశ్రమలో పని చేస్తున్న మృతుడి పెద్దనాన్న కొడుకు దూమ బదరా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పది రోజుల బిడ్డతో నూనీ బిజయ భద్ర (ఫైల్)అనాథలైన తల్లీబిడ్డ.. భద్ర రాకకోసం ఆశగా ఎదురుచూస్తున్న నూనీ తన బిడ్డను ఎప్పుడెప్పుడు అతనికి చూపిస్తానా అనే ఆత్రుతతో గడుపుతోంది. ఇంతలోనే పిడు గులాంటి వార్త ఆమె బతుకును దుర్భరం చేసింది. భద్ర ఇకలేడని, ప్రాణాలతో రాడని తెలియడంతో ఆమె రోదనలు మిన్నంటాయి. పరిశ్రమ నిర్లక్ష్యం కారణంగానే భద్ర మృతిచెందాడని గ్రామస్తులు ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎలికట్ట శివారులోని పరిశ్రమలో ప్రమాదం బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికుల డిమాండ్ -
‘సర్’ను వేగవంతంగా పూర్తిచేయాలి
చేవెళ్ల: సర్లో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, చేవెళ్ల పార్లమెంట్ సర్ ఇన్చార్జి జగదీశ్ అన్నారు. పట్టణంలోని అట్లాస్ ఫంక్షన్హాల్లో ఆదివారం నియోజకవర్గ స్థాయిలోని పార్టీ బీఎల్ఏ(బూత్ స్థాయి ఏజెంట్ల) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగదీశ్తో పాటు నియోజకవర్గ సర్ ఇన్చార్జి ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్లో పార్టీ తరఫున బీఎల్ఏల పాత్ర ఎంతో కీలకమైనదన్నారు. సర్ కార్యక్రమంలో పార్టీ నాయకులు, బీఎల్ఏల పనితీరు శూన్యంగా ఉందని, ఈ కారణంగా నియోజకవర్గం సీ–కేటగిరిలో ఉందన్నారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలకు కట్టుబడి పనిచేయాలన్నారు. ఇప్పటికై నా బూత్స్థాయిలో ఉన్న ఓటర్లును కాపాడుకునే ప్రయత్నం చేయాలన్నారు. వెంటనే బీఎల్ఏలతో మండలాల వారీగా సమావేశం నిర్వహించి, ప్రతి బీఎల్ఏ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే సాధ్యమవుతుందని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సమతారెడ్డి, మార్కెట్ చైర్మన్ పెంటయ్యగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీకాంత్, ఐదు మండలాల అధ్యక్షులు, మూడు మున్సిపాలిటీల అధ్యక్షులు, గిరిధర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, పెంటారెడ్డి, వెంకట్రెడ్డి, చంద్రమౌళి, వెంకట్రెడ్డి, నాయకులు జన్ధార్రెడ్డి, బల్వంత్రెడ్డి, ఆగిరెడ్డి, శ్రీనివాస్గౌడ్, ప్రభాకర్, గోపాల్రెడ్డి, వీరేందర్రెడ్డి, ఐదు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్ఏలు పాల్గొన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు, సర్ చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జి జగదీశ్ -
కాలేజీ.. ఏ క్యాజీ!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: నాణ్యమైన వైద్య విద్య సంగతేమో కానీ.. కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోలేపోతున్నారు మహేశ్వరం మెడికల్ కాలేజీ విద్యార్థులు. వైద్య విద్య ఇక్కడ మిథ్యలా మారింది. నగరానికి సమీపంలో ఉందని, మౌలిక సదుపాయాలకు కొదవ ఉండదని భావించి.. అడ్మిషన్ పొందిన మెజార్టీ విద్యార్థులు ఆ తర్వాత తాము ఇక్కడెందుకు వచ్చిపడ్డామా అని ఆందోళనకు గురవుతున్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ కాలేజీని అనుబంధ ఆస్పత్రి సమీపంలోకి మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు శనివారం కాలేజీ సందర్శనకు వచ్చిన అదనపు కలెక్టర్ కిరణ్మయికి విద్యార్థులతో పాటు అధ్యాపకులు ఇదే అంశంపై మొరపెట్టుకున్నారు. కనీస మౌలిక సదుపాయాలు లేని ఈ భవనాన్ని చూసి ఆమె కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అద్దె భవనం.. అరకొర సదుపాయాలు బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వం జిల్లాకు మహేశ్వరం మెడికల్ కాలేజీని మంజూరు చేసింది. మీర్ఖాన్పేటలో ఏర్పాటు చేయాలని భావించి ఆ మేరకు అక్కడ స్థలాన్ని కేటాయించింది. 2023లో శంకుస్థాపన చేసింది. తీరా ప్రభుత్వం మారిపోవడంతో కాలేజీ.. ఎంపిక ప్రదేశం కూడా మారింది. సొంత క్యాంపస్ సహా కనీస మౌలిక సదుపాయాలు లేకపోయినా ప్రభుత్వ కాలేజీ కావడంతో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా అడ్మిషన్లకు అనుమతి ఇచ్చింది. 2024లో అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టింది. 50 ఎంబీబీఎస్ సీట్లు ఉన్న ఈ కాలేజీలో ఇప్పటికే రెండు బ్యాచ్లు కొనసాగుతున్నాయి. 2026–27లో మూడో బ్యాచ్ అడుగుపెట్టబోతోంది. కాలేజీకి సొంత భవనం లేకపోవడంతో అధికారులు మంగళ్పల్లి సమీపంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. నెలకు రూ.16 లక్షలు చెల్లిస్తున్నారు. విశాలమైన క్యాంపస్ సహా ఐదు అంతస్తుల భవనం ఉన్నట్లు ఎంసీఐకి చూపించారు. తీరా అడ్మిషన్లు పూర్తై..తరగతులు మొదలైన తర్వాత అసలు విషయం బయటపడింది. భవన యాజమాన్యం, అప్పటి అధికారులు కుమ్మకై ్క మార్కెట్లో లేని అద్దె నిర్ణయించారు. అద్దె పెంపు విషయంలోనూ అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై ఆర్థికశాఖ నుంచి కాలేజీకి షోకాజ్ నోటీసులు అందినట్లు తెలిసింది. ఈనెల 31తో భవనం అద్దె గడువు ముగియనుంది. అద్దెను 20 శాతం పెంచాల్సిందిగా భవన యజమాని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఐదంతస్తుల ఈ భవనంలో రెండు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవి ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన తరగతి గదుల కిటికీలకు గ్లాసులు లేవు. చిన్నపాటి వర్షానికే గదుల్లోకి నీరు చేరుతోంది. చలిగాలులకు విద్యార్థులు గజగజ వణికిపోతున్నారు. మరుగుదొడ్లకు నీటి సౌకర్యం, కాలేజీకి కరెంట్ కనెక్షన్, ఫ్యాకల్టీ గదుల్లో ఫ్యాన్లు లేవు. అయినా నెలకు రూ.ఐదు లక్షల వరకు కరెంట్ బిల్లుల చెల్లింపునకు కేటాయిస్తున్నట్లు తెలిసింది. ఎంసీఐ నిబంధనల ప్రకారం 60 శాతం మంది విద్యార్థులకు అదే క్యాంపస్లో వసతి కల్పించాల్సి ఉంది. కానీ ఇక్కడ వసతి లేకపోవడంతో విద్యార్థులు ఇరుకై న ప్రైవేటు హాస్టల్ గదుల్లో ఇతర విద్యార్థులతో కలిసి ఉండాల్సి వస్తోంది. అంతేకాదు కాలేజీకి అనుబంధంగా వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిని ఎంపిక చేశారు. నిబంధనల మేరకు పది కిలోమీటర్లలోపే ఆస్పత్రి ఉండాలి. ఇక్కడ మాత్రం 18 కిలోమీటర్ల దూరం ఉండటంతో రాకపోకలకు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అనుబంధ ఆస్పత్రిలో పని చేసి, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసు రూమ్లో ఉండాల్సి వస్తోంది. ఇటు నుంచి అటు..అటు నుంచి ఇటు రాకపోకలకే రెండు గంటల సమయం పడుతోంది. ట్రాఫిక్ రద్దీలో కాలేజీ నుంచి ఆస్పత్రికి వచ్చి వెళ్లడం విద్యార్థులకు ప్రహసనంగా మారింది. దీనిపై కలెక్టర్కు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అద్దె భవనంలో మహేశ్వరం మెడికల్ కళాశాల కనీస మౌలిక సదుపాయాలు కరువు అయినప్పటికీ భవనానికి నెలకు రూ.16 లక్షల అద్దె కాలేజీ ఒకచోట.. అనుబంధ ఆస్పత్రి మరోచోట అటు, ఇటు తిరగలేక విద్యార్థుల అవస్థలు ఎంసీఐ నిబంధనలు బేఖాతరు -
అదుపుతప్పి కారు బోల్తా
నలుగురికి గాయాలు తాండూరు రూరల్: అతివేగంగా వెళ్తున్న ఓ కారు బోల్తా పడింది. ఈ సంఘటన పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తాండూరు పట్టణం ఇంద్రానగర్కు చెందిన ఓ కుటుంబం కారులో హైదరాబాద్ నుంచి తాండూరుకు వస్తున్నారు. మార్గమధ్యలో పెద్దేముల్ మండలం కందనెల్లి శివారు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికులు గమనించి కారులో ఉన్న వారిని బయటకు తీశారు. తర్వాత పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షత్రగాత్రుల్లో ఓ బాలుడు కూడా ఉన్నారు. ఈ విషయమై పెద్దేముల్ ఎస్ఐ ప్రశాంత్వర్థన్ను వివరణ కోరగా.. కారు బోల్తా పడిన ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందలేదన్నారు. -
రెండు చోట్ల ఓటు నేరం
● ఎక్కడైనా ఒకే చోట నమోదు చేయించుకోవాలి ● బషీరాబాద్ తహసీల్దార్ షాహేదాబేగం బషీరాబాద్: ఒకే వ్యక్తి రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఓటరుగా నమోదు కావడం చట్టరిత్యా నేరమని, ప్రతి అర్హుడైన ఓటరు తన సాధారణ నివాసం ఉన్న ప్రాంతంలో మాత్రమే ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని బషీరాబాద్ తహసీల్దార్ షాహేదా బేగం సూచించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా అధికారులు, బీఎల్వోలు అప్రమత్తంగా పనిచేసి, డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన వారి పేర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి నమోదులను గుర్తించి తొలగించాలని ఆదేశించారు. బషీరాబాద్ పంచాయతీ కార్యాలయంలో సోమవారం ఎంపీడీఓ సంత్కుమార్తో కలిసి బీఎల్ఓలు, వివిధ రాజకీయ పార్టీల బీఎల్ఏలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలో ఎస్ఐఆర్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, ఏఎస్డీలతో కలిపి ఇప్పటివరకు 95.11 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. మిగిలిన ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేసి, వందశాతం లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. అలాగే ఏఎస్డీ(అబ్సెంట్, షిఫ్టెడ్, డెత్) ఓట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, అలాంటి ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పూర్తిగా ధ్రువీకరించాలని ఆదేశించారు. ఓటరు జాబితా స్వచ్ఛంగా, పారదర్శకంగా ఉండేందుకు ప్రజలు కూడా సహకరించాలని, అర్హులైన ప్రతిఒక్కరూ తమ వివరాలను సరిచూసుకుని అవసరమైతే అభ్యంతరాలు, దరఖాస్తులు సమర్పించాలన్నారు. అధికారులు, బీఎల్వోలు సమన్వయంతో మిగిలిన డిజిటలైజేషన్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. -
ఇంటింటికి వెళ్లి.. ఫారాలు సేకరించి
ధారూరు: తొలుత ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేసిన బీఎల్ఓలు, అధికారులు.. సోమవారం మండల కేంద్రంలో సర్పంచ్తో కలసి ఇంటింటికి వెళ్లి పత్రాలు సేకరించారు. ఆగస్టు 3వ తేదీతో ఎస్ఐఆర్ గడువు ముగియనుండటంతో వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వార్డుల్లో పర్యటించారు. నింపని ఫారాలను పూరించారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రమీలగౌడ్, ఎంపీడీఓ నర్సింహులు, ఆర్ఐ స్వప్న, కార్యదర్శి ఆంజానాయక్, బీఎల్ఓలు పాల్గొన్నారు. ఫీజు కట్టకుంటే పరీక్షలు రాయనీయం గోల్కొండ: మొత్తం వార్షిక ఫీజు కడితేనే ఫార్మేటివ్ పరీక్షలు రాయనిస్తామని మెహిదీపట్నంలోని నారాయణ పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు తేల్చిచెప్పింది. ఫార్మేటివ్ టెస్టు లు సోమవారం నుంచి ప్రారంభం కాగా, విద్యార్థులు ఉదయం స్కూల్కు రాగానే ‘మీ రు ఫీజు కట్టలేదు, పరీక్షలు రాయనివ్వం’ అంటూ సిబ్బంది పలువురిని బయటే నిలబెట్టా రు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ప్రిన్సిపాల్ను ప్రశ్నించారు. ఫీజు విషయంపై ఒత్తిడి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీంతో సిబ్బందికి, విద్యార్థుల తల్లిదండ్రులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు తల్లిదండ్రులు తమ పిల్లలకు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ) ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. బోనాలకు మంత్రి శ్రీధర్బాబుకు ఆహ్వానం రాంగోపాల్పేట్: ఆగస్టు 2,3 తేదీల్లో జరుగనున్న ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరకు రావాలని మంత్రి శ్రీధర్బాబుకు నిర్వాహకులు ఆహ్వానం పలికారు. దేవాలయ ఈవో గుత్తా మనోహర్రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు డాక్టర్ శివకుమార్లాల్, గుండెల్లి వరప్రసాద్, మల్లికార్జున్, గీత, సోనల్, ముప్పిడి కిరణ్, రాజేందర్, ప్రధాన అర్చకులు రామతీర్థశర్మ మంత్రిని ఆహ్వానించారు. -
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
బషీరాబాద్: ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను ఆదివారం తెల్లవారుజామున బషీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని మైల్వార్ గ్రామానికి చెందిన మున్నూర్ శామప్ప మైల్వార్ వాగు నుంచి అర్ధరాత్రి ట్రాక్టర్లో ఇసుక తరలిస్తుంటే నిఘాపెట్టిన పోలీసులు పట్టుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న శ్యామప్పపై కేసు నమోదు, ట్రాక్టర్ను సీజ్ చేసినట్లు ఎస్ఐ విఠల్ తెలిపారు. యాచారం: పేకాడుతున్న ఏడుగురిని యాచారం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ మధు కథనం ప్రకారం.. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన జోగు కృష్ణయ్య, తాండ్ర లింగం, నారిమల్ల రమేష్, ఇస్లావత్ అరుణ్, గుర్రం రంజిత్, గడ్డం యాదయ్య, బోయపల్లి లింగం ఆదివారం యాచారంలోని ఓ ప్రాంతంలో పేకాడుతుండగా పోలీసులకు సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న పోలీసులు వారి నుంచి మూడు మోటార్సైకిళ్లు, రూ.13 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణకు ఆయన చేసిన సేవలు మరువలేనివని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ, మంత్రి అట్లూరి లక్ష్మణ్ అన్నారు. ఆదివారం నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన చెన్నయ్య వారి చేతుల మీదుగా అంబేడ్కర్ నేషనల్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్రీయ అధ్యక్షుడు గౌతమ్ మల్లేశ్, డాక్టర్ రాజు, మణీ, ఆంజనేయులు తదితరులు ఉన్నారు. వీర జవాన్లకు దత్తాత్రేయ నివాళి ముషీరాబాద్: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా భారత మాత కోసం తమ ప్రాణాలను అర్పించిన వీర జవాన్లకు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఘన నివాళులు అర్పించారు. రామ్ నగర్లోని ఆయన నివాసంలో జరిగిన కార్యక్రమంలో జవాన్ల సేవలను కొనియాడారు. వారి త్యాగాలను భావితరాలకు తెలియజేయడం, దేశభక్తి స్ఫూర్తిని యువతలో పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. చిన్నారులకు అండగా ప్రభుత్వం ● మంత్రి దామోదర్ రాజనర్సింహ మల్లాపూర్: మానసిక ఎదుగుదల లోపాలతో బాధపడుతున్న చిన్నారుల విషయంలో తల్లిదండ్రులతో పాటు సమాజం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహా అన్నారు. ఆదివారం మినిస్టర్స్ క్వార్టర్స్లో సాధన ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఇంటెలెక్చువల్లీ ఛాలెంజ్డ్ (సాధన ఫౌండేషన్)కు చెందిన మానసిక దివ్యాంగ చిన్నారులు, సంస్థ ప్రతినిధులు మంత్రిని కలిశారు. మానసిక ఎదుగుదల లోపాలతో బాధపడుతున్న చిన్నారులకు నాణ్యమైన వైద్య సేవలు, ప్రత్యేక విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థలను రూపొందించే దిశగా కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో సాధన దివ్యాంగుల వ్యవస్థాపకురాలు పడమటి సురేఖారెడ్డి, కార్యదర్శి మధుసూదన్రెడ్డి తదితరులున్నారు. కల్తీ టీ పొడి తయారీ ముఠా అరెస్టు ఫిలింనగర్: కల్తీ టీపొడి తయారీ ముఠాను ఫిలింనగర్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 1,290 కిలోల కల్తీ టీ పొడితో పాటు రసాయన ఫ్లేవరింగ్ పదార్థాలను స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఫిలింనగర్లోని దీన్దయాళ్నగర్లో కల్తీ టీ పొడి తయారీ జరుగుతుందన్న సమాచారంతో ఫిలింనగర్ ఎస్ఐ షేక్ సలీం ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. -
మోయలేని భారం
విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు ప్రైవేట్ పాఠశాలల్లో అవసరం కంటే ఎక్కువ నోట్బుక్స్ ఇవ్వకూడదు. ప్రాజెక్టు బుక్స్, టెక్ట్స్ బుక్స్ పాఠశాలలోనే ఉంచుకునేలా యజమాన్యాలు ఏర్పాటు చేసుకోవాలి. పిల్లలను ఇబ్బందులకు గురి చేయకూడదు. – వెంకట్స్వామి, ఎంఈఓ, దౌల్తాబాద్ దౌల్తాబాద్: బడికి వెళ్లే చిన్నారులు రోజురోజుకూ స్కూల్ బ్యాగుల భారంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు సొంత సిలబస్ పేరుతో అధిక సంఖ్యలో పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, గైడ్లు, ప్రాజెక్ట్ ఫైళ్లు, డ్రాయింగ్, స్క్రాప్ బుక్స్ వంటి వాటిని తప్పనిసరి చేయడంతో విద్యార్థులపై అదనపు భారం పడుతోంది. టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్, బూట్లు తదితర వస్తువులు కూడా బ్యాగు బరువును మరింత పెంచుతున్నాయి. కొందరు తల్లిదండ్రులు పిల్లల బాధను చూసి స్వయంగా బ్యాగులు మోసి పాఠశాల వరకు తీసుకెళ్తున్నారు. పరిస్థితి ఆందోళనకరం మండలంలోని 33 గ్రామపంచాయతీల పరిధిలో 50 పాఠశాలలు ఉండగా, వాటిలో 6 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. గతంలో కొన్ని సబ్జెక్టుల పుస్తకాలు, ఒక రఫ్ బుక్తో సరిపెట్టే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ప్రతి సబ్జెక్టుకు ప్రత్యేక నోట్బుక్తో పాటు గైడ్లు, ప్రాజెక్ట్ వర్క్, రికార్డులు, డైరీలు వంటి పుస్తకాలు తీసుకు రావాల్సి వస్తోంది. దీంతో 7వ తరగతి వరకు చదివే విద్యార్థులు సుమారు 6 నుంచి 12 కిలోల వరకు, 8, 9, 10వ తరగతి విద్యార్థులు 12 నుంచి 18 కిలోల వరకు బరువున్న బ్యాగులను నిత్యం మోస్తున్నారు. కొన్ని పాఠశాల బస్సులు గేట్ వరకు మాత్రమే వెళ్లడంతో, అక్కడి నుంచి బ్యాగులు మోసుకుంటూ నడవాల్సి వస్తోంది. ఈ పరిస్థితి కారణంగా చిన్నారుల్లో వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమలుకాని మార్గదర్శకాలు విద్యార్థులపై బ్యాగుల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర విద్యాశాఖ 2017లో మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం 1, 2 తరగతుల విద్యార్థుల బ్యాగు బరువు 1.5 కిలోలు, 3 నుంచి 5వ తరగతుల వారికి 3 కిలోలు, 6, 7 తరగతుల వారికి 4 కిలోలు, 8 నుంచి 10వ తరగతుల వారికి 5 కిలోలు మించకూడదని స్పష్టం చేసింది. అయితే ప్రైవేట్ పాఠశాలలు ఈ నిబంధనలను పట్టించుకోకుండా సొంత సిలబస్ పేరుతో అదనపు పుస్తకాలను విద్యార్థులపై మోపుతున్నాయి. విద్యాశాఖ అధికారులు పాఠశాలల్లో బ్యాగుల బరువుపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని తల్లిదండ్రులు, విద్యావేత్తలు కోరుతున్నారు. బడి పిల్లలపై బ్యాగు బండ విద్యార్థులపై పెరుగుతున్న పుస్తకాల మోత ప్రైవేట్ పాఠశాలల్లో మరింత బరువు తిప్పలు పడుతున్న చిన్నారులు -
విద్యుత్ షాక్తో రెండు గేదెలు మృతి
మొయినాబాద్రూరల్: విద్యుత్ షాక్తో రెండు గేదెలు మృతి చెందిన సంఘటన మండలంలోని మేడిపల్లిలో చోటు చేసుకుంది. మేడిపల్లి గ్రామానికి చెందిన చాకలి బాబయ్య, బాబు తండ్రీకొడుకులు. వారి వద్ద ఉన్న గేదెలను గడ్డి మేపేందుకు ఆదివారం మధ్యాహ్నం గ్రామంలోని శివాలయం సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లారు. గడ్డి మేస్తుండగా పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వైర్లు తగిలి రెండు గేదెలు మృత్యువాతపడ్డాయి. సర్పంచ్ శ్రీనివాస్, గ్రామస్తులు బాధితులను ఓదార్చారు. మృతి చెందిన గేదెల విలువ సుమారు రూ.రెండున్నర లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
అదుపు తప్పి లారీ బోల్తా
డ్రైవర్కు గాయాలు యాలాల: వేగంగా వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్కు ప్రాణాపాయం తప్పింది. మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గేటు సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఈప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటుక లోడ్ ఖాళీ చేసిన ఓ లారీ తాండూరు నుంచి కొడంగల్ వైపు వెళ్తుండగా మలుపు వద్ద బోల్తా పడింది. లారీ అద్దాలను పగలగొట్టిన స్థానికులు అందులో ఇరుక్కుపోయిన డ్రైవర్ నవీన్ను బయటకు తీసి తాండూరులోని ఆస్పత్రికి తరలించారు. లారీ బోల్తా పడిన ప్రదేశంలో పొలాల వద్ద పనిచేస్తున్న కూలీలు భోజనం చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో వీరు కూర్చున్న ప్రదేశానికి సమీపంలోనే లారీ బోల్తా పడటంతో భయాందోళనకు గురయ్యారు. యాలాల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అవకాశాలు ఓపెన్
● చదువు మధ్యలో ఆపేసిన వారికి వరం ● ఓపెన్ స్కూల్లో టెన్త్, ఇంటర్ అడ్మిషన్లు ● వచ్చేనెల 15వ తేదీ వరకు గడువు కేశంపేట: అనివార్య కారణాలతో చదువును మధ్యలోనే ఆపేసిన యువతీయువకులకు ఓపెన్ స్కూల్ వరంగా మారింది. ఓపెన్లో విద్యలో చదువు కొనసాగించి ఉన్నత శిఖరాలకు చేరినవారిలో ఎందరో ఉన్నారు. చదువుకోవాలనే ఆశ ఉన్నా పాఠశాలలకు వెళ్లలేని వారికి చేయూతనివ్వాలనే సంకల్పంతో ప్రభుత్వం ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా విద్యను అందిస్తోంది. పనులు చేసుకుంటూనే సెలవు దినాల్లో ఓపెన్ తరగతులకు హాజరయ్యే అవకాశం ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా, కొన్ని ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందాలన్నా పదో తరగతి ఉత్తీర్ణత అవసరం. దీంతో చాలామంది ఓపెన్ విద్య వైపు ఆసక్తి కనబురుస్తున్నారు. ప్రభుత్వం 2026–27 విద్యా సంవత్సరానికి తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్) ద్వారా అపరాధ రుసుంతో ఆగస్టు 29 వరకు అడ్మిషన్లు స్వీకరించనుంది. జిల్లావ్యాప్తంగా 68 కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా 68 ఓపెన్ టెన్త్, ఇంటర్ అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. వీటిలో పహాడీషరీఫ్ జెడ్పీ ఉన్నత పాఠశాల, హఫీజ్పేట జెడ్పీ ఉన్నత పాఠశాల, ఎన్టీఆర్నగర్ జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఉర్దూ మీడియంలో అడ్మిషన్లు పొంది చదువుకునేందుకు సైతం అవకాశం ఉంది. వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో.. వికారాబాద్ జిల్లాలో 25 ఓపెన్ టెన్త్, ఇంటర్ అధ్యయన కేంద్రాలు, మేడ్చల్ జిల్లాలో 34 సెంటర్లు ఉన్నాయి. ఆయా జిల్లాల్లో కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం రూ.లక్షల్లో నిధులు వెచ్చిస్తూ తోడ్పాటు అందిస్తోంది. అడ్మిషన్లు ఇలా.. ● చదువు మధ్యలో ఆపేసినవారు, గృహిణులు, వివిధ కారణాలతో చదువుకు దూరమైన వారు ఓపెన్ విద్యలో అడ్మిషన్లు పొందొచ్చు. ● ఆన్లైన్ లేదా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకొని సమీపంలోని అధ్యయన కేంద్రాల్లో సమర్పించాలి. ● అడ్మిషన్లు పొందిన వారు సెలవు దినాల్లో నిర్వహించే తరగతులకు హాజరుకావాల్సి ఉంటుంది. ● మరింత సమాచారం కోసం www.telanganaopenschool.org వెబ్సైట్లో సంప్రదించాలి. పదో తరగతి ప్రవేశాలకు.. ● ఆగస్టు 31 నాటికి 14 ఏళ్ల వయస్సు నిండిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతిలో 5 సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. ● గతంలో రెగ్యులర్ పరీక్షలు రాసి ఫెయిల్ అయిన వారు ఓపెన్లో రెండు సజ్జెక్టుల మార్కులను బదలాయించుకోవచ్చు. ● బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ మహిళలు రూ.1,150 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ పురుషులు రూ.1,250 చెల్లించాలి. ● ప్రభుత్వం ఉచితంగా పాఠ్యా పుస్తకాలు అందిస్తుంది. ● అడ్మిషన్ తీసుకున్న ఐదేళ్ల వరకు పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఇంటర్మీడియెట్లో ప్రవేశాలకు.. ● పదో తరగతి పాసై, ఒక్క ఏడాది గ్యాప్ ఉంటేనే అర్హులు. ● ఇంటర్మీడియెట్ విద్యార్థులకు 5 సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. ● బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ మహిళలకు రూ.1,500 స్కూల్ ఫీజు ఉంటుంది. జనరల్ పురుషులు రూ.1,850 చెల్లించాలి. ● ప్రభుత్వం ఉచితంగా పాఠ్యాపుస్తకాలు అందిస్తుంది. అవసరమైన పత్రాలు ● ఇటీవల తీసిన పాస్పోర్టు సైజ్ ఫొటోలు, ఆధార్కార్డు ● ఇంటర్మీడియెట్ చదివేవారికి ఎస్ఎస్సీ పాస్ సర్టిఫికెట్ ● పుట్టిన తేదీ సర్టిఫికెట్ . ఆగస్టు వరకు అవకాశం పదో తరగతి, ఇంటర్మీడియెట్లో ఆగస్టు 15వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా అడ్మిషన్ పొందొచ్చు. ప్రభుత్వం నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా పాఠశాలలో చదివే విద్యార్థుల నుంచి నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల వివరాలు, మహిళా సంఘాల నుంచి నిరక్షరాస్యుల వివరాలు సేకరిస్తున్నారు. పదో తరగతి వరకు చదవలేని వారు, చదువు మధ్యలో ఆపిన వారు, చదవడం, రాయడం వచ్చిన వారిని ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతిలో చేర్పించేందుకు ప్రతి మండలంలో అధికారులు అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. -
నమ్మించి.. మోసగించి
పరిగి: నకిలీ ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్న అధికార యంత్రాంగం మాటలు నీటి మీద రాతలుగా మారాయి. మరోవైపు మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా రైతుల పరిస్థితి దాపురించింది. అసలే వర్షాభావ పరిస్థితులకు విలవిలలాడుతున్న సమయంలో నకిలీ డీఏపీ వ్యవహారం కలకలం రేపుతోంది. పూడూరు, పరిగి మండలాల్లో నకిలీ ఎరువులతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. మార్కెట్ కన్నా తక్కువ ధరలకు ఎరువులను విక్రయిస్తుండటంతో ఎగబడి కొనుగోలు చేశారు. ఇప్పుడవి నకిలీవని ప్రచారం జరుగుతుండడంతో అయోమయంలో పడ్డారు. ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షాలకు డీఏపీకి డిమాండ్ పెరిగింది. డీలర్లు కూడా ప్రభుత్వం అందించాల్సిన ధర బస్తాకు రూ.1,350 కాకుండా రూ.1,800 విక్రయిస్తున్నారు. ఇదే అదునుగా కేటుగాళ్లు నేరుగా కంపెనీ నుంచి వచ్చి విక్రయిస్తున్నామని నమ్మించి మార్కెట్లో దొరికే హోలోగ్రామం ఉన్న బస్తాలను రూ.1,700 చొప్పున రైతులకు విక్రయించారు. అధికారుల కనుసన్నల్లోనే! ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ డీఏపీని కొనుగోలు చేసి గ్రామాల్లోని రైతులకు మధ్యవర్తుల ద్వారా విక్రయించారు. వారం పది రోజుల పాటు ఎలాంటి అనుమతులు లేకుండా దళారులు డీఏపీ విక్రయిస్తుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల కనుసన్నల్లోనే అక్రమ దందా జరిగిందని పలువురు రైతులు వాపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిగి చర్యలు తీసుకోవాలని ఆరుగాలం శ్రమించే అన్నదాతలు కోరుతున్నారు. గ్రామాల్లో నకిలీ డీఏపీ కలకలం పరిగి, పూడూరు మండలాల్లో వెలుగులోకి దందా వేల బస్తాలు రైతులకు విక్రయించినట్లు అనుమానాలు పట్టించుకోని వ్యవసాయ అధికారులుమార్కెట్ కన్నా తక్కువ ధరకు, నేరుగా ఇంటికే డీఏపీ ఎరువు వస్తుందని రైతులు సంబరపడ్డారు. తీసుకొని పంటకు వేస్తుండగా.. చేతులకు బొబ్బలు రావడం, నీటిలో కరగకపోవడంతో ఖంగుతిన్నారు. ఇదీ పరిగి, పూడూరు మండలాల్లో కొంతమంది రైతుల పరిస్థితి. పూడూరు మండలం మంచన్పల్లి గ్రామంలో ఓ వ్యక్తి గత వారం రోజులుగా సుమారు 500 బస్తాల నకిలీ డీఏపీ ఎరువును విక్రయించినట్లు సమాచారం. ఇదే వ్యక్తి పరిగి మండలం చిగురాల్పల్లిలో 200 బస్తాలు, బసిరెడ్డిపల్లిలో 100 బస్తాలు, కల్నాపూర్లో సుమారు 350 బస్తాల వరకు విక్రయించారు. ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు పొలాల్లో డీఏపీ ఎరువును వేస్తున్న సమయంలో కొందరి చేతులకు బొబ్బలు వచ్చాయి. అలాగే డీఏపీ నీటిలో కరగకపోవడంతో అది నకిలీ ఎరువని రైతులు అనుమానించారు. దీంతో సదరు వ్యక్తిని రైతులు నిలదీయగా, తాను తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ వ్యవహారాన్ని పోలీసులు, వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేస్తే డబ్బులు తిరిగి రావనే భయంతో పలువురు కర్షకులు ఫిర్యాదు చేయడానికి వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. -
నేడు వాహనాల వేలం
తాండూరు: స్థానిక ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో సోమవారం రెండు వాహనాలను వేలం వేస్తున్నట్లు తాండూరు ఎకై ్సజ్ సీఐ రాణి ఓ ప్రకటనలో తెలిపారు. సర్కిల్ పరిఽధిలో పలు రకాల కేసుల్లో పట్టుబడిన ద్విచక్ర వాహనాలను(టీవీఎస్ స్టార్ సిటీ, ఫ్యాషన్ ప్లస్) మధ్యాహ్నం 3 గంటలకు వేలం వేస్తున్నామని చెప్పారు. ప్రజలు ఈ వేలంలో పాల్గొని వాహనాలను సొంతం చేసుకోవాలని సూచించారు. కొడంగల్ రూరల్: పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని రకాల వసతులను కల్పించాలని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఆస్పత్రిలో పలు వార్డులను సందర్శిస్తూ.. మరుగుదొడ్లు, తాగునీరు, బ్లడ్ బ్యాంకు, ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్, అన్ని రకాల సర్జన్లను నియమించాలన్నారు. ఆస్పత్రిలో అన్ని రకాల పరికరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాజుకుమార్గౌడ్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మహిపాల్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సతీష్, జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్రామ్రెడ్డి, గురువయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎన్నికల పర్యవేక్షణ అధికారి నయిమత్అలీ మోమిన్పేట: ఒక్కరికి ఒక ఓటు మాత్రమే ఉండాలని జిల్లా ఎన్నికల పర్యవేక్షణ అధికారి నయిమత్అలీ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని మేకవనంపల్లి, మోమిన్పేట గ్రామాల్లో జరుగుతున్న సర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. దేశంలో ఎక్కడైన పౌరుడికి ఒక ఓటు మాత్రమే ఉంటుందన్నారు. గతంలో ఎక్కడ నివసిస్తే అక్కడ ఓటరుగా నమోదు చేసుకునే వారని, అందుకే ఒకటి రెండు చోట్ల ఓటరుగా నమోదు చేసుకునేవారని చెప్పారు. కానీ ప్రస్తుతం పూర్తిగా ఆన్లైన్ కావడంతో ఒక్క చోటే ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. గడువు దగ్గర పడుతుందని, వేగంగా డిజిటలైజేషన్ చేయాలన్నారు. ఆయన వెంట బీఎల్ఓలు సుభాష్గౌడ్, కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. తుర్కయంజాల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న నిర్వహించ తలపెట్టిన జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.చంద్రమోహన్, ఉపాధ్యక్షుడు డి.కిషన్ పిలుపునిచ్చారు. రాగన్నగూడలోని సీఐటీయూ కార్యాలయం వద్ద ఆదివారం నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. గడిచిన కొన్ని రోజులుగా కార్మిక, రైతు, వ్యవసాయ వ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ, అఖిల భారత కిసాన్ సభ, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న జైల్ భరోలో అన్ని రంగాల కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు ఎం.సత్యనారాయణ, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎ. భాస్కర్ రెడ్డి, లాయర్స్ యూనియన్ జిల్లా నాయకుడు కె.అరుణ్ కుమార్, నాయకులు ఐ.భాస్కర్, కె.వెంకటకృష్ణ, శ్రీనివాసులు, అండాలు తదితరులు పాల్గొన్నారు. ఆమనగల్లు: తలకొండపల్లి మండలం దేవునిపడకల్లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. పోటీలను మహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి ప్రారంభించారు. టోర్నమెంట్లో 32 టీమ్లు పాల్గొన్నాయి. మొదటి బహుమతిని దేవునిపడకల్, రెండో బహుమతిని పడకల్, మూడో బహుమతిని పాపిరెడ్డిగూడ, నాలుగో బహుమతిని ఆకుతోటపల్లి టీమ్ గెలుచుకున్నాయి. విజేతలకు సర్పంచ్ కానుగుల అనిత మల్లేశ్ బహుమతులు అందించారు. కార్యక్రమంలో వాలీబాల్ యూత్ ప్రెసిడెంట్ పులిజాల మహేశ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
ఎల్నినో వర్రీ
సోమవారం శ్రీ 27 శ్రీ జూలై శ్రీ 2026వికారాబాద్: ఎల్నినో ప్రభావంతో జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లాలో సాధారణంగా 1.31 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుండగా, గత ఏడాది అది 1.41 లక్షల ఎకరాలకు చేరింది. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 15 వేల ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు పూర్తయ్యాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని 1,187 చెరువుల్లో చాలా వరకు ఇంకా నీరు చేరకపోవడం, భూగర్భ జలాలు పెరగకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. 20 మండలాల్లో కేవలం ఐదు మండలాల్లోనే సాధారణ వర్షపాతం నమోదవగా, మిగతా ప్రాంతాల్లో లోటు లేదా అధిక లోటు వర్షపాతం నమోదైంది. వాతావరణం ఇప్పటికీ వేసవిని తలపించేలా ఉండటంతో సాగుపై ప్రభావం పడుతోంది. ఆందోళనలో కర్షకులు ఇప్పటికే నాట్లు సిద్ధం చేసుకున్న రైతుల్లో బోరుబావుల నీరు ఉన్నవారు మాత్రమే నాట్లు వేస్తున్నారు. చెరువులు, కుంటలపై ఆధారపడిన రైతులు మాత్రం వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు బోరుబావుల్లోనూ నీటి మట్టం తగ్గిపోవడంతో వేసిన పంట నిలుస్తుందా లేదా అనే సందేహం రైతులను వేధిస్తోంది. అధికారులు మాత్రం ఆగస్టు నెలాఖరు వరకు, అవసరమైతే సెప్టెంబర్ మొదటి వారం వరకు కూడా వరి నాట్లు వేయవచ్చని సూచిస్తున్నారు. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో నీటి లభ్యతను బట్టి మాత్రమే వరి సాగు చేయాలని సూచిస్తున్నారు. ఈ విత్తనాలు అనుకూలం ప్రస్తుతం జిల్లాలో రైతులు బీపీటీ–5204, ఎంటీయూ–1010, ఎంటీయూ–1001, చిట్టిముత్యాలు వంటి రకాల విత్తనాలు సాగు చేస్తున్నారు. అయితే ఖరీఫ్లో సంబామసూరి, బరణి, కాటన్ దొరసన్నలు, సోమశిల, సింహపురి, తెలంగాణ సోనా రకాలు సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఎంటీయూ–1010, ఎంటీయూ–1001 రకాలు రబీ సీజన్కు మరింత అనుకూలమని అధికారులు పేర్కొంటున్నారు. సెప్టెంబర్ తొలి వారంలోపు నాట్లు వేస్తే ఎకరానికి సుమారు 40 బస్తాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని, రబీలో మరో 5–10 బస్తాలు అధికంగా వచ్చే అవకాశముందని తెలిపారు. చెరువులు నిండక తగ్గనున్న సాగు విస్తీర్ణం 15 వేల ఎకరాల్లోనే నాట్లు వర్షాల కోసం రైతుల ఎదురుచూపు నీటి లభ్యతను బట్టి పంటలు ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచన వికారాబాద్లో వర్షాభావ పరిస్థితులు -
ఏరువాక.. నామమాత్రపు రుసుముతో అద్దెకు ఇవ్వాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఏరువాక రైతుసేవా కేంద్రం నిరుపయోగంగా మారింది.
దోమ: వానాకాలంలో విష సర్పాలు, తేళ్ల సంచారం ఎక్కువ. పొలాల్లో పనిచేసే రైతులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పాము, తేలు కాటుకు గురైనప్పుడు నాటు వైద్యం కాకుండా వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని చెబుతున్నారు. ఆందోళనకు గురైతే గుండెపోటు రావడానికి ఆస్కారం ఉంటుందంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు 33 మంది పాముకాటు బారిన పడి మృతి చెందారు. మరో 692 మందికి ఏఆర్వీ వ్యాక్సిన్ ఇచ్చారు. నాటు వైద్యం వద్దు వేసవిలో ముళ్ల పొదలు, రాళ్ల మధ్యలో దాగి ఉన్న పాములు, తేళ్లు వర్షాలు కురవడంతో బయటకు వస్తుంటాయి. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు, కూలీలు వాటి కాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో నాటు వైద్యానికి దూరంగా ఉండాలి. పాము కాటు బాధితుడిని ప్రశాంతంగా ఉంచి సమీప ఆస్పత్రికి తరలించాలి. భయపడితే గుండె వేగంగా కొట్టుకోవడంతో విషం శరీరమంతా త్వరగా వ్యాపించే అవకాశం ఉంటుంది. గాయాన్ని బ్లేడ్తో కోయడం, విషాన్ని నోటితో పీల్చడం వంటి చర్యలు ప్రమాదాన్ని మరింత పెంచుతాయని వైద్యులు చెబుతున్నారు. చేతికి ఉంగరాలు, గడియారాలు, బిగుతైన దుస్తులు ఉంటే వెంటనే తొలగించాలి. ఆ తేళ్లు ప్రమాదకరం పంట పొలాల్లో ఎక్కువగా ప్రమాదకర తేళ్లు బయటకు వస్తుంటాయి. నల్ల తేలు కుట్టినప్పుడు తీవ్రమైన నొప్పి, వాపు, మంట కలుగుతుంది. ఎరుపు తేలు కాటు గుండె, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. పసుపు రాతి తేళ్లు, చెక్క దిమ్మెల కింద ఎక్కువగా కనిపిస్తాయి. తేలు కుట్టిన శరీర భాగాలను సబ్బుతో శుభ్రంగా కడిగి ఐస్ప్యాక్ ఉంచాలి. కుట్టిన భాగాన్ని ఎక్కువగా కదపకుండా ఉంచి వెంటనే వైద్యులను సంప్రదించాలి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాముకాటుకు మందులు అందుబాటులో ఉన్నాయి. పాముకాటు బాధితులు వెంటనే సమీప సర్కారు దవాఖానకు తీసుకెళ్లి చికిత్స అందించాలి. నాటు వైద్యానికి దూరంగా ఉండాలి. రైతులు పొలాలకు వెళ్లేటప్పడు తగిన జాగ్రత్తలు పాటించాలి. – సుధాకర్లాల్, జిల్లా వైద్యాధికారి విష సర్పాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పాముకాటుకు గురైన వెంటనే సకాలంలో చికిత్స పొందడం ద్వారా ప్రాణాపాయాన్ని నివారించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన పెంపొందించడం ద్వారా విషసర్పాలు, తేళ్ల కాటుతో జరిగే మరణాలను గణనీయంగా తగ్గించే ఆస్కారం ఉంది. – రజిత, మండల వైద్యాధికారి, దోమ వర్షా కాలంలో విషసర్పాలు, తేళ్ల బెడద కాటేస్తే ప్రథమ చికిత్స తప్పనిసరి జిల్లా వ్యాప్తంగా 33 మంది మృతి దౌల్తాబాద్: పాముకాటుకు ఓ రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని ఈర్లపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఖాజాషా(60) ఉదయం తన సొంత పొలంలో గడ్డి కోస్తున్నారు. ఈ క్రమంలో చేతికి పాము కాటు వేసింది. వెంటనే గమనించి ఇంటికి వచ్చారు. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కోస్గి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే విషం శరీరంలోకి పాకడంతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనపై మృతుడి కుమారుడు మదర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ వేణుకుమార్ తెలిపారు. -
● వైభవంగా బోనాల ఊరేగింపు
కొడంగల్ రూరల్: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని పట్టణంలోని తెలంగవాడలో ఆదివారం బోనాల పండగను ఘనంగా నిర్వహించారు. మత్స్య సహకార సంఘం, ముదిరాజ్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో తెలంగవాడ నుంచి బండల ఎల్లమ్మ దేవాలయం వరకు మహిళలు బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా వెళ్లారు. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, బాజాబజంత్రీలు చప్పుళ్లు చూపరులను కనువిందు చేశాయి. వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని అమ్మవారికి బోనాల నైవేద్యాలు సమర్పించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
తోటికూలీలతో వెళ్తుండగా..
కడ్తాల్: తోటి కూలీలతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి గుర్తు తెలియని దుండగులు మూడు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కెళ్లారు. మక్తమాధారం గ్రామ సమీపంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది.. సీఐ సైదిరెడ్డి, బాధితురాలి కథనం ప్రకారం.. న్యామతాపూర్ గ్రామానికి చెందిన జాల మణెమ్మ తోటి మహిళా కూలీలతో కలిసి పనికోసం మక్తమాధారం వైపు వెళ్తున్నారు. ఈ సమయంలో షాద్నగర్ వైపు నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు మాస్క్ ధరించిన దుండగులు మణెమ్మ మెడలోంచి పుస్తెల తాడును లాక్కుని పరారయ్యారు. నంబర్ లేని బైక్పై వచ్చిన ముసుగు దొంగల చర్యతో మిగిలిన మహిళలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. అంతా అరుస్తుండగానే మక్తమాధారం వైపు పారిపోయారు. సమాచారం అందుకున్న సీఐ సైదిరెడ్డి పోలీసు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలితో మాట్లాడి, వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు.


