Vikarabad District News
-
భగ్గుమన్న పాత కక్షలు
బషీరాబాద్: పాత కక్షలు రెండు కుటుంబాల మధ్య పాశవిక దాడులకు దారితీశాయి. ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా కర్రలతో కొట్టుకోవడంతో తొమ్మిది మందికి రక్తగాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన బషీరాబాద్ మండలం నీళ్లపల్లిలో చోటు చేసుకుంది. తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి, ఇరు కుటుంబాలు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సభావత్ శంకర్నాయక్, రమావత్ బాబునాయక్ కుటుంబాల మధ్య గత పంచాయతీ ఎన్నికల నుంచి కక్షలు కొనసాగుతున్నాయి. పది రోజుల క్రితం జరిగిన ఓ పెళ్లికి సంబంధించి, రెండు కుటుంబాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు గ్రామ పెద్దలు సమావేశమయ్యారు. ఈక్రమంలో బుధవారం ఉదయం రాథోడ్ లోక్యానాయక్ ఇంటి వద్ద స్థానిక గిరిజన నాయకుడు వెంకటేశ్నాయక్ మాట్లాడుతుండగా లక్ష్మణ్నాయక్ వచ్చి ఇంట్లోకూర్చుని మాట్లాడమేంటి.. ఆలయం వద్ద మాట్లాడాలి అంటూ గట్టిగా అరిచాడు. దీంతో పంచాయితీ గుడి వద్దకు చేరింది. ఇరు కుటుంబాల మధ్య మాటామాటా పెరగడంతో రమావత్ బాబునాయక్ కుటుంబ సభ్యులు సభావత్ శంకర్ నాయక్పై దాడికి దిగారు. దీంతో రెండు కుటుంబాలు అక్కడే ఉన్న వంట చెరుకు కర్రలతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకోవడంతో పాటు చేతికందిన కర్రలతో కొట్టుకున్నారు. ఈ దాడిలో శంకర్నాయక్ తలకు తీవ్రగాయాలు కావడంతో తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరి కుటుంబానికి చెందిన ఐదుగురికి రక్తగాయాలు కాగా, బాబునాయక్ తరఫున వారికి నలుగురికి గాయాలయ్యాయి. బషీరాబాద్ సివిల్ ఆస్పత్రిలో పోలీసులు వీరికి చికిత్సలు చేయించారు. 14 మందిపై కేసులు సభావత్ శంకర్నాయక్ కొడుకు మోత్యానాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాబునాయక్, లక్ష్మణ్నాయక్, మోహన్నాయక్, హద్దునాయక్, లోక్యానాయక్, బలరాంనాయక్, గోపాల్నాయక్పై పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే రమావత్ బాబునాయక్ ఫిర్యాదుతో సభావత్ శంకర్నాయక్, లక్ష్మణ్నాయక్, బలరాంనాయక్, మోత్యానాయక్, వెంకట్ నాయక్, రాజునాయక్, శాంతిభాయిపై కేసులు నమోదయ్యాయి. గ్రామంలో టెన్షన్ టెన్షన్ రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణతో నీళ్లపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరుకుటుంబాలకు రాజకీయ నేపథ్యం ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు వణికిపోతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ కార్యకర్తలపై దౌర్జన్యంగా దాడులు చేశారని, బీఆర్ఎస్ గ్రామ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తే.. తమపై కేసులు పెట్టారని మండిపడ్డారు. న్యాయం కోసం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గస్తీ కాస్తున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన శంకర్ నాయక్, రోదిస్తున్న భార్యకర్రలతో దాడి చేసుకున్న ఇరు కుటుంబాలు తొమ్మిది మందికి రక్త గాయాలు, ఒకరి పరిస్థితి విషమం 14 మందిపై కేసు నమోదు నీళ్లపల్లిలో ఉద్రిక్త వాతావరణం -
చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
మాట్లాడుతున్న ఎస్పీ స్నేహమెహ్రఅనంతగిరి: చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ స్నేహ మెహ్ర హెచ్చరించారు. బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా పోలీస్, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో బుధవారం కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని పశువుల సంతలు, చెక్పోస్టుల వద్ద సిబ్బంది నియమించాలని ఆదేశించారు. ఆవులు, దూడలను అక్రమంగా రవాణా చేసినా.. వధించినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు కొత్లాపూర్, రావులపల్లి, బషీరాబాద్ రైల్వే గేట్ వద్ద మూడు అంతర్రాష్ట్ర చెక్పోస్టులు, అంగడి చిట్టంపల్లి, మైతాబ్ ఖాన్ గూడ, అంతారం, లక్ష్మీనారాయణపూర్ క్రాస్ రోడ్ ప్రాంతాల్లో నాలుగు అంతర్ జిల్లా చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిరంతర నిఘా పెట్టామన్నారు. పశువుల అక్రమ రవాణాపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చర్యలు తప్పవన్నారు. బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. సమావేశంలో పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి సదానందం, అదనపు ఎస్పీ రాములు నాయక్, డీఎస్పీలు అంజయ్య, జానయ్య, శ్రీనివాస్, యాదయ్య, శ్రీనివాస్, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి పశువుల అక్రమ రవాణాపై నిఘా ఎస్పీ స్నేహ మెహ్ర -
ఆధ్యాత్మికతతో ప్రశాంతత
స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ మోమిన్పేట: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని చిన్న కోల్కుంద గ్రామంలో దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భక్తితో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ విశాల, మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు సురేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకర్, నాయకులు సంగమేశ్వర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ దీపక్ తివారి దుద్యాల్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు సూచించారు. బుధవారం దుద్యాల్ మండలం హస్నాబాద్లోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం తెచ్చిన వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి, తహసీల్దార్ కిషన్, జీపీఓ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి దుద్యాల్: నిరుపేదలకు ఇళ్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని జిలా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని హంసంపల్లిలో ఇందిరమ్మ ఇంటిని పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు సంక్షేమ ఫలాలు అందించాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. గత పాలకులు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు. కార్యక్రమంలో సర్పంచ్ పుష్పమ్మ, పంచాయతీ కార్యదర్శి పుష్పలత, కొడంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, మెట్లకుంట పీఏసీఎస్ చైర్మన్ జయకృష్ణ, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రవి నాయక్, మండల ఉపాధ్యక్షుడు కృష్ణ, ప్రధాన కార్యదర్శి సీతారాం, సర్పంచులు హన్మా నాయక్, మొగులయ్య, నాయకులు గోపాల్, మల్లికార్జున్, జెల్లరాజు, రాములు, శివ చౌహాన్, గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అనంతగిరి: నగరంలోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 11న నిర్వహించే మెగా జాబ్మేళాను నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ప్రసాద్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో యువజన విభాగం, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జాబ్మేళాకు హాజరయ్యే యువతి, యువకులు వెబ్సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కబిషనర్ విక్రం సింహారెడ్డి, జిల్లా క్రీడల శాఖ అధికారి సత్తార్ తదితరులు పాల్గొన్నారు. -
పునర్ నవీకరణ పూజలు ప్రారంభం
కొడంగల్: పట్టణంలోని బాలాజీ నగర్లో వెలిసిన పద్మావతీ సమేత మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్ నవీకరణ పూజలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తిరుమల అర్చకులు భగవత్ ప్రార్థన, పుణ్యహవచనం, పంచగవ్యారాధన, వాస్తు మండల పూజ, వాస్తు హోమం, పూర్ణాహుతి, హలయుగలాంగల పూజాకర్షణ తదితర వైదిక కార్యక్రమాలను వైఖానస ఆగమ శాస్త్రోకంగా నిర్వహించారు. ప్రత్యేకంగా సిద్ధం చేసిన యాగశాలలో హోమం తదితర పూజలను వైభవంగా చేశారు. గురువారం ఉదయం పుణ్యాహవాచనం, రక్షాబంధన పూజ, వాస్తు హోమం, గోగణ పూజ, గోగణ నివేదన, పూర్ణాహుతి, యాగశాల వాస్తు, అంకురార్పణ అగ్ని ప్రతిష్ఠ, చతుర్వేద శిలాశుద్ధి, మహాశాంతి హోమం ఉంటాయని తెలిపారు. 8వ తేదీ ఉదయం 7.10 గంటల నుంచి 8.20 గంటల మధ్యలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రథమ శిలేష్టికాన్యాస కార్యక్రమం నిర్వహిస్తారు. పూజల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి రావాలని అర్చకులు కోరారు. పూజా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ గుప్తా, ఆలయ ధర్మకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ నమూనా మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి నూతన ఆలయ నమూనాను అధికారులు సిద్ధం చేశారు. ఆలయ విస్తరణ ప్రభుత్వం రూ.110 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం పనులు ప్రారంభమయ్యాయి. తిరుమల తరహాలో వైఖానస ఆగమ శాస్త్రోకంగా నాలుగు మాఢ వీధులు, పుష్కరిణి, అన్నదాన సత్రం, కల్యాణ మండపం, ప్రధాన ఆలయం, అమ్మవార్ల ఆలయాలు, ఉప ఆలయాలు, క్యూలైన్, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, స్నాన ఘట్టాలు, మరుగుదొడ్లు, పార్కింగ్, ప్రసాదం కౌంటర్లు తదితర వాటికి నూతన భవనాలు నిర్మిస్తారు. -
వేసవి దుక్కులతో
గురువారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2026ఇది రైతు ప్రభుత్వంతాండూరు: ‘సాధారణంగా రైతులు ఖరీఫ్, రబీ సీజన్లు ముగిశాక పొలాలను అలాగే వదిలేస్తారు.. మళ్లీ వర్షాలు ప్రారంభమయ్యే వరకు భూములను దున్నకుండా వదిలేస్తారు.. దీంతో కలుపు, గడ్డి జాతి మొక్కలు పెరిగి నీరు, ఇతర పోషక పదార్థాలను గ్రహించి భూమి సత్తువ లేకుండా చేసి నిర్వీర్యం చేస్తాయి.. దీని వల్ల భూ సారం మందగించి భూమి లోపల పొరల నుంచి నీరు గ్రహింపబడి ఆవిరైపోతాయి. తీవ్రత అధికమయ్యే అవకాశం ఉందని’ జిల్లా వ్యవసాయాధికారి టీ రాజరత్నం అన్నారు. వేసవిలో భూముల చదును చేసుకునే విధానంపై ఆయన సలహాలు సూచనలు.. దుక్కులు దున్నక పోతే.. వేసవిలో వ్యవసాయ పొలాలను దుక్కులను దున్నక పోతే ముడి పోషకాల కొరత ఏర్పడుతుంది. అత్యధిక మోతాదులో రసాయన ఎరువులు వేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఏప్రిల్ చివరి వారం నుంచి మే నెలలో అడపాదడపా కురిసే వర్షాలను సద్వినియోగం చేసుకోవాలి. మాగాణి, మెట్ట, బీడు భూములను దున్నుకోవాలి. తగిన సమయంలో పంట విత్తు కోవాలన్నప్పుడు రైతులకు భూములు తయారుగా ఉండాలంటే ఈ వేసవిలో లోతైన దుక్కులు అవసరం ఎంతైనా ఉంది. రుతుపవనాల ఆరంభానికి ముందే భూమిని దున్ని ఉంచుకోవడం వల్ల తొలకరి వర్షాలు పడగానే పెళ్లలు మెత్తబడి నీరు త్వరగా భూమిలోకి ఇంకుతుంది. దీని వల్ల భూమి లోపలి పొరల్లో నీరు నిక్షిప్త సామర్థ్యం పెరగడంతో పాటు మొలక శాతం బాగుంటుంది. దున్నే విధానం లోతైన దుక్కులు వాలుకు అడ్డంగా చేయడం వల్ల వర్షపు నీరు పారుదల కాకుండా భూమి లోతుకు చేరుతుంది. ఒక వేళ వాలుకు అనుకూలంగా దున్నినట్లయితే నేల విపరీతమైన కోతకు గురికావచ్చు. సాళ్ల వెంట పడిన వర్షపు నీరు ప్రవహించి సారవంతమైన మట్టినంత ఒరవడికి గురిచేసి భూమిని నిస్సారంగా మారుస్తుంది. అడ్డంగా దున్నడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు. దిగుబడి మందగింపుపై.. సాధారణంగా భూమి పొరలు గట్టిబడి, దళసరి గోడలాగ తయారవడం వల్ల మొక్కల వేళ్లు లోనికి చొచ్చుకొని పోలేక, భూమి లోపల పోషక పదార్థాలు, నీరు, ఇతర ఖనిజ లవణాలును పొందక పోవడంతో పంటల ఆరోగ్యం దెబ్బతిని దిగుబడులు తగ్గిపోతాయి. నివారణ కోసం రైతులు వేసవిలో దుక్కులను లోతుగా దున్నుకున్నట్లయితో భూమి గుల్లబారి పొరలు ఏర్పడకుండా మెత్తగా తయారై నీటిని నిల్వ చేసుకొనే శక్తి పెరుగుతుంది. అంతే తేమతో జీవించే మేలు సూక్ష్మాతి సూక్ష్మి జీవులు గణనీయంగా వృద్ధి చెందడంతోపాటు వాన పాముల సంతతి కూడా భారీగా పెరుగుతుంది. దీంతో భూసార అభివృద్ధి అధికమవుతుంది. పొలాన్ని సాగుకు సిద్ధం చేస్తున్న రైతురబీ తర్వాత లోతైన దుక్కులు చేయాలి సేంద్రియ ఎరువులతో నేల సారవంతం జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అక్కంపల్లి, అగ్గనూరులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం సేంద్రియ సాగుతో.. సేంద్రియ ఎరువులతో దుక్కులు దున్నుకోవాలి. వేసవి దుక్కులు దున్నుకునే ముందు భూమిలో పశువుల ఎరువు, కంపోస్టు లేదా చెరువు మట్టిని చల్లడం వలన నేల సారవంతంగా మారుతుంది. దుక్కులు దున్నే ముందు పొలంలో పశువుల మందలు, గొర్రెలు, మెకల మందలను వదలాలి. ఇలా చేయడం వల్ల అవి విసర్జించే మల మూత్రాలు భూమిలోకి చేరి సేంద్రియ పదార్థం విపరితంగా పెరిగి భూసారం వృద్ధి చెందుతుంది. దీని వల్ల ప్రత్యేకించి పశువుల ఎరువును ఖరీదు చేసే పరిస్థితి కూడ తగ్గుతుంది. సేంద్రియ ఎరువులను అందించడం ద్వారా పండించే పంట పొలాల్లో సూక్ష్మ – స్థూల పోషక పదార్థాల లోపాలను నివారించుకోవచ్చు. -
సివిల్స్లో మైనార్టీలకు ఉచిత శిక్షణ
అనంతగిరి: తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్, కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ (యూపీఎస్సీ) ఎగ్జామినేషన్– 2027 కోసం మైనార్టీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తామని మైనార్టీ జిల్లా సంక్షేమాధికారి రాజేశ్వరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకుచెంది, ఆసక్తి ఉన్న మైనార్టీ విద్యార్థులు (ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన, బౌద్ద, పార్సి) ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని, స్క్రీనింగ్ పరీక్ష జూన్ 14న ఉంటుందని పేర్కొన్నారు. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 040– 2323 6112లో సంప్రదించాలని సూచించారు. విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ పరిధి శివరాంనగర్లో విద్యుదాఘాతంతో ఓ ఇల్లు దగ్ధమైంది. వివరాలిలా ఉన్నాయి. శివారంనగర్కు చెందిన నరసింహచారి కుటుంబ సమేతంగా తన ఇంట్లోని రెండో అంతస్థులో నివా సం ఉంటున్నారు. బుధవారం వారందరూ బయటకు వెళ్లగా.. చారి తండ్రి ఒక్కడే ఉన్నా డు. మధ్యాహ్నం ఇంట్లో మంటలు చెలరేగి, దట్టమైన పొగ కమ్మేసింది. ఇది గమనించిన స్థానికులు మంటలు ఆర్పేందుకు యత్నించారు. ఇంట్లో ఉన్న వ్యక్తిని బయటకు తీసుకువ చ్చారు. ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వగా.. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఫర్నిచర్ తదితర సామగ్రి కాలిపోయింది. రూ.10 లక్షలకు పైగా నష్టం జరిగిందని బాధితుడు తెలిపారు. సీఐ రఘుకుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక నామినేషన్ల పరిశీలన తాండూరు: మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక నామినేషన్లను సంబంధిత అధికారులు బుధవారం పరిశీలించారు. ఈ నెల 4వ తేదీ వరకు కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు మొత్తం 19 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో మైనార్టీ విభాగం నుంచి పురుషులు నలుగురు, మహిళలు ఇద్దరు ఉన్నారు. అనుభవజ్ఞుల విభాగం నుంచి 13 నామపత్రాలు వచ్చాయి. ఇందులో పురుషులు 8, మహిళలు 5గురు ఉన్నారు. పత్రాల పరిశీలనలో 7 నామినేషన్లు తిరస్కరణకు గురికాగా.. 12 మంది ఎన్నికకు అర్హత సాధించారు. ఈ నెల 11న ఎన్నికలు నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం రూరల్: ఉప్పరిగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం డైరెక్టర్ పదవులకు ఇద్దరు రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం పీఏసీఎస్ సీఈఓ గణేశ్కు రాజీనామా లేఖలను అందజేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్గా ఎన్నికై న టేకుల సుదర్శన్రెడ్డి, కౌన్సిలర్గా గెలుపొందిన క్యామా శంకర్ పీఏసీఎస్ డైరెక్టర్లుగా ఉన్నారు. జోడి పదవులు ఉండకూడదని రాజీనామా చేసినట్లు తెలిపారు . -
పండుగ వాతావరణం ఉట్టిపడాలి
కొడంగల్ రూరల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొడంగల్ పర్యటనలో పండుగ వాతావరణం ఉట్టిపడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ముకుందరెడ్డి సూచించారు. బుధవారం పట్టణంలోని కడా కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష చేశారు. సభా వేధిక, ప్రాంగణం, పార్కింగ్, ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు జగన్, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, ఆర్ఐఈ రాములు, డీపీఆర్ఓ చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ వికాసమే బీజేపీ లక్ష్యం
షాద్నగర్: తెలంగాణ వికాసమే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఏబీ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... దేశంలో కుటుంబ పాలనకు కాలం చెల్లిందన్నారు. బెంగాల్, తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో కుటుంబ పార్టీలను ప్రజలు ఇంటికి పంపించారని అన్నారు. తెలంగాణలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ సర్కార్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని.. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన ఆరంభం మాత్రమేనని అన్నారు. వికసిత తెలంగాణ లక్ష్యంగా ద్యేయంగా కేంద్రం పని చేస్తోందన్నారు. ఈ నెల 10న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే మోదీ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్బంగా సభకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగి రాజభూపాల్, నాయకులు అందె బాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి, కక్కునూరి వెంకటేష్గుప్తా, దేపల్లి అశోక్, చెంది మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి -
కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించండి
ఇబ్రహీంపట్నం రూరల్: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు బోసుపల్లి ప్రతాప్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన పార్టీ మండల అధ్యక్షుడు గోదల శేఖర్రెడ్డి ఆధ్వర్యంలో దండుమైలారంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట ఎక్కువ తూకం వేస్తున్నారని ఆరోపించారు. మిల్లర్లు ధాన్యం అన్లోడ్ చేయకపోవడంతో రైతులు ఇబ్బందిపడుతున్నారన్నారు. దండుమైలారం ఐకేపీ సెంటర్లో సీజన్కి 80 వేల నుంచి లక్షా బస్తాలు కొనుగోలు చేస్తుండగా సూమారుగా 640 క్వింటాళ్ల ధాన్యం అదనంగా రైతుల నుంచి ఐకేపీ సెంటర్ నిర్వాహకులు, అధికారులు, మిల్లర్లతో కుమ్మకై ్క రైతులకు రూ.25 లక్షల వరకు నష్టం చేకూరుస్తున్నారని ఆరోపించారు. కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేవన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చొరవ తీసుకొని సౌకర్యాలు కల్పించాలని కోరారు. లేదంటే కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దొండ రమణారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, నెర్రపల్లి సర్పంచ్ శ్రీహరి, వేణుగోపాల్రెడ్డి, తదితరులు ఉన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు ప్రతాప్ -
మోదీ పాలనలో పెరిగింది పేదరికమే
చేవెళ్ల: కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టాక పేదరికం, నిరుద్యోగం పెరిగిందని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కె.రామస్వామి అన్నారు. మండల కేంద్రంలో బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో ధరల నియంత్రించాలనే డిమాండ్తో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో మోదీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ పేదల నడ్డి విరుస్తోందన్నారు. వికసిత్భారత్ లక్ష్యం ధరల పెంచడమేనా అని ఎద్దేవా చేశారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సత్తిరెడ్డి, ప్రభులింగం, వడ్ల సత్యనారాయణ, మక్బూల్, మంజుల, పాపయ్య, కార్మికులు మల్లయ్య, వెంకయ్య, యాదమ్మ, నర్సింలు, వెంకటమ్మ, రాజు, శేఖర్, శివ పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు రామస్వామి -
రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
బషీరాబాద్: మండల పరిధి ఎక్మాయి వాగు నుంచి మంగళవారం అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. కంసాన్పల్లి(బి) గ్రామానికి చెందిన వెంకటయ్య, గొల్ల బసప్పకు చెందిన (టీఎస్34 కే 3452, ఏపీ39 ఎల్ఎఫ్7192) నంబర్ గల రెండు ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తుండగా పోలీసులు లోక్యానాయక్, నర్సింహులు స్వాధీనం చేసుకున్నారు. పీఎస్కు తరలించి, ఇరువురిపై కేసులు నమోదు చేశారు. జొన్న పంట దగ్ధం ధారూరు: ప్రమాదవశాత్తు జొన్న పంట దగ్ధమైంది. ధారూరు మండలం బాచారం గ్రామానికి చెందిన రైతు కావలి బాలమణి.. తనకున్న రెండు ఎకరాల్లో జొన్న సాగుచేశారు. ఇందుకోసం పెట్టుబడిగా రూ.35 వేలు వెచ్చించారు. పంట కోతకు రాగా.. మంగళవారం సాయంత్రం వరకు ఆరడానికి వదిలిపెట్టారు. అదే రోజు మంటలు చెలరేగి పంట కాలి బూడిదయింది. పంటను విక్రయిస్తే రూ.70 వేల వరకు వచ్చేవని, ఇప్పుడు పెట్టుబడి సైతం కోల్పోవాల్సి వచ్చిందని బాధిత రైతు వాపోయింది. వ్యవసాయ అధికారులు పరిశీలించి, తగిన పరిహారం అందించాలని కోరారు. యాచారం: వీధి కుక్కల దాడిలో జింక మృతి చెందింది. వివరాలు.. మండల పరిధిలోని మాల్–కొత్తపల్లి గ్రామాల మధ్య ప్రభుత్వ భూమిలోని గుట్టల ప్రాంతం నుంచి బుధవారం ఓ జింక కిషన్పల్లి సమీపంలోకి వచ్చింది. ఇది గమనించిన వీధి కుక్కలు జింకను వెంటాడి దాడి చేసి చంపేశాయి. గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వచ్చి కళేబారాన్ని అటవీ ప్రాంతంలో ఖననం చేశారు. జ్ఞానం ముందు తరాలకు అందించాలి ● ప్రొఫెసర్ ఖాసీం ● అప్పాయిపల్లిలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ బొంరాస్పేట: చదువు అనే జ్ఞానాన్ని ముందు తరాలకు అందించాలని, అలాగే సంస్కృతి, సంప్రదాయాలను పిల్లలకు పంచాలని ప్రొ. ఖాసీం అన్నారు. బుధవారం కొడంగల్ మండలం అప్పాయిపల్లిలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ చూపిన బాటలో నడవాలన్నారు. మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. రెండు వందల ఏళ్ల క్రితమే సీ్త్ర విద్యను జ్యోతిరావు పూలే స్థాపించారని గుర్తు చేశారు. రేలారే రేలా ప్రసాద్ కళాబృందం నిర్వహించిన ధూమ్ధామ్ ఆకట్టుకుంది. కార్యక్రమంలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కమిటీ అధ్యక్షుడు గోకుల్సింగ్, సర్పంచ్ వెంకటయ్య, నిర్వాహకులు శ్రీనివాస్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శివకుమార్, రమేశ్బాబు, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
● యువకుడికి తీవ్ర గాయాలు ● తలకొండపల్లి వద్ద బైక్ను లారీ ఢీకొట్టడంతో ఘటనఆమనగల్లు: తలకొండపల్లి సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తలకొండపల్లి ఎస్హెచ్ఓ జానకిరాంరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లింగరావ్పల్లికి చెందిన కుమార్ తన అత్త జంగమ్మ(50)ను తీసుకుని బైక్పై తలకొండపల్లికి వెళ్తుండగా కాటన్మిల్లు వద్ద ఎదురుగా వచ్చిన లారీ అంతివేగంతో ఢీకొట్టింది. ఘటనలో జంగమ్మ మృతిచెందింది. తీవ్ర గాయాలపాలైన కుమార్ను చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ జానకిరాంరెడ్డి తెలిపారు. -
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వద్దు
ఇబ్రహీంపట్నం: వరి ధాన్యం కొనుగోలును తక్షణమే ప్రారంభించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. మండలంలోని రాయపోల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాసంగి కోతలు పూర్తికావస్తున్నా ఇంకా ధాన్యం కొనుగోలును ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్దనే ధాన్యం ఉండటంతో వర్షాలు పడితే రైతులు నష్టపోయే ప్రమాదముందన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు నానా అవస్థలు పడాల్సివస్తోందన్నారు. కిరాయికి పట్టాలు తెచ్చుకొని ధాన్యం ఆరబోసుకుంటున్నారని.. ప్రభుత్వమే ఉచితంగా పట్టాలు ఇవ్వాలన్నారు. తేమ, తాలు పేరుతో క్వింటాలుకు నాలుగైదు కిలోల తరుగు తీస్తున్నారని.. ఇది రైతులను దోచుకోవడమేనని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. రాయపోల్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఇటీవల వడదెబ్బకు గురై మృతి చెందిన రైతు గౌరయ్య కుటుంబానికి ప్రభుత్వం రూ.30 లక్షల ఎక్స్గ్రేషియా ప్రటించాలని జాన్వెస్లీ డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పి.యాదయ్య, కార్యదర్శివర్గ సభ్యుడు సామెల్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి దుబ్బాక రామంచందర్, సీహెచ్ బుగ్గరాములు, పి.జగన్, సీహెచ్ జంగయ్య, ఎ.నర్సింహ, సీహెచ్ ముసలయ్య, భిక్షపతి, యాదగిరి, నర్సింహ, అశోక్ పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
సంచార జాతులకు వెసులుబాటు
కొడంగల్: రాష్ట్ర ప్రభుత్వం డీఎన్టీ సర్టిఫికెట్ జారీతో సంచార జాతి కులాలకు మేలు చేకూరుతుందని బైలు కమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ సూర్యవంశీ, రాష్ట్ర సంచార జాతుల ఉపాధ్యక్షుడు మోహన్ చవాన్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గం తమ కులాలకు న్యాయం చేశారని కొనియాడారు. మంగళవారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంచార జాతుల సంక్షేమం, గుర్తింపు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. బీసీ ఏ గ్రూపులో ఉన్న 49 కులాలు, బీసీ ఈ గ్రూపులో ఉన్న 2 కులాలను కలిపి మొత్తం 51 కులాలను సంచార జాతులుగా గుర్తించారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల తరహాలో ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సంచార జాతులను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో బైలు కమ్మర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ సలోంకి, శివాజీ, కృష్ణ, భీమయ్య, కొడంగల్ బైలు కమ్మర సంఘం అధ్యక్షుడు ఆనంద్ పవార్, జనరల్ సెక్రటరి శివాజీ, విజయ్, సంజు, బాబు చవాన్ తదితరులు పాల్గొన్నారు. -
బలవంతపు భూ సేకరణ వద్దు
పరిగి: పరిశ్రమల పేరుతో ప్రభుత్వం రైతుల భూములు లాక్కోవడం దారుణమని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పశ్య పద్మ అన్నారు. మండలంలోని కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల్లో రైతులు 43 రోజులుగా చేస్తున్న దీక్షకు మంగళవారం మద్దతు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి పంట పొలాలను లాక్కోవడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. రియల్ దందా చేయడం తప్పా కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. గత ప్రభుత్వం కూడా ఇలాంటి తప్పులే చేసిందని పేర్కొన్నారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ అడుగు జాడల్లో నడుస్తోందని ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. బాధిత రైతులకు సంఘం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వేల ఎకరాల పోడు భూములు ఉన్నాయని.. వాటిలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులకు అన్యాయం చేసిన ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన చరిత్ర లేదన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు పీర్ మహ్మద్, వెంకటేశ్, విజయలక్ష్మి ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. పంట పొలాల్లోపరిశ్రమల ఏర్పాటు దారుణం రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పద్మ -
ఇసుక డంప్ సీజ్
బషీరాబాద్: మండలంలోని జీవన్గీ గ్రామ శివారు కాగ్నానది ఒడ్డున నిల్వ చేసిన భారీ ఇసుక డంపును రెవెన్యూ అధికారులు మంగళవారం సీజ్ చేశారు. నదీ పరీవాహక గ్రామాలైనా క్యాద్గీరా, జెట్టూరు గ్రామాల సర్పంచులు జైపాల్రెడ్డి, వెంకట్రెడ్డి, రైతులు సూర్య ప్రకాశ్ రెడ్డి, మల్లికార్జున్, బల్రామ్ మంగళవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ఇసుక డంపు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రంగంలోకి దిగిన జీపీఓలు అస్లాం, మధు, రికార్డు అసిస్టెంట్ మున్నెప్ప అక్కడికి చేరుకొని 15 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేశారు. ఈ ఇసుక మహబూబ్నగర్కు చెందిన ఓ మాజీ ఎంపీకి చెందినదిగా రైతులు ఫిర్యాదు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గోశాల నిర్మాణం కోసం ఇసుక డంపు చేసినట్లు రెవెన్యూ అధికారుల విచారణలో తేలింది. షాద్నగర్: వృద్ధుల సేవాశ్రమం నిర్వహిస్తూ 25 ఏళ్లుగా సేవలందిస్తున్న పట్టణానికి చెందిన రంగారెడ్డి దాసరి నారాయణరావు సేవారత్న అవార్డు అందుకున్నారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాసరి నారాయణరావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న పలువురికి నిర్వాహకులు దాసరి నారాయణ రావు సేవారత్న అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా షాద్నగర్ పట్టణంలోని అయ్యప్ప కాలనీలో 25 ఏళ్లుగా నవోదయ వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తూ వృద్ధులకు సేవ చేస్తున్న రంగారెడ్డి సేవారత్న అవార్డుకు ఎంపికయ్యారు. సాంస్కృతిక శాఖ డైరక్టర్ డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. కందుకూరు: విద్యార్థులకు విద్యాబోధనతో పాటు ఉత్తమ సేవలు అందిస్తున్న మండల పరిధిలోని సాయిరెడ్డిగూడ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అండేకార్ నాగరత్నం రాష్ట్రస్థాయిలో ప్రశంసా పత్రం అందుకున్నాడు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడంతో పాటు వారికి నాణ్యమైన విద్య అందించడం, సమాజంలో మంచి పౌరులుగా ఎదిగేలా తర్ఫీదు ఇవ్వడం, తన సొంత పిల్లలను కూడా అదే పాఠశాలల చదివించి ఆదర్శంగా నిలవడం, కోర్టులు, ఇతర ప్రభుత్వ శాఖల పని తీరును తెలుసుకునేలా విద్యార్థులను నేరుగా తీసుకెళ్లడం లాంటి చేస్తుండడంతో ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఐఏఎస్, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ.నవీన్ నికోలస్ ఆయనను సన్మానించి ప్రశంసా పత్రం అందించారు. కందుకూరు: సిటిజన్ విజిలెన్స్, మానిటరింగ్ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో మంగళవారం దళిత, గిరిజన, ఆదివాసి, ప్రజాసంఘాలు, మేధావులు, విలేకరులు, న్యాయవాదులు, డీవీఎంసీ సభ్యులు సమావేశమై కమిటీని ఎన్నుకుని ప్రకటించారు. జిల్లా కన్వీనర్గా బోడ కృష్ణ, కో కన్వీనర్గా జోగు రమేష్, సభ్యులుగా దివ్యశ్రీ, కంబాలపల్లి సంతోష, దరువుల శంకర్, మిన్నాల డేవిడ్, మమత, రఘు, రాములు, యాచారం మండల కన్వీనర్గా బడే భాగ్యమ్మను ఎన్నికయ్యారు. కార్యక్రమంలో డీబీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు గండు నరసింహ, హైకోర్టు అడ్వకేట్ దివ్యశ్రీ, అంబేడ్కర్ జాతర ఫౌండర్ జి.సుధాకర్, ప్రజా సంఘాల నాయకులు నరసింహ, శేఖర్, యాదయ్య, భగవంతు, బాలమణి, కుమార్, సంతోష్, తాండ్ర యాదయ్య, గోరేటి జగన్ పాల్గొన్నారు. -
సర్వం సిద్ధం
శ్రీవారి ఆలయ అభివృద్ధికి కొడంగల్: పట్టణంలోని బాలాజీనగర్లో వెలిసిన పద్మావతీ సమేత మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నవీకరణ పూజలు నేటి(బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. రూ.110 కోట్ల వ్యయంతో ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 8వ తేదీ ఉదయం 7.10 నుంచి 8.20 గంటల మధ్యలో శంకుస్థాపన చేస్తారు. సీఎం దంపతులు ప్రథమ శిలేష్టికాన్యాస (శంకుస్థాపన, భూమి పూజ) కార్యక్రమం నిర్వహిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. తిరుమల తరహాలో నాలుగు మాఢ వీధులు, పుష్కరిణి, అన్నదాన సత్రం, కల్యాణ మండపం, ప్రధాన ఆలయం, అమ్మవార్ల ఆలయాలు, ఉప ఆలయాలు, క్యూ లైన్, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, స్నాన ఘట్టాలు, మరుగుదొడ్లు, పార్కింగ్, ప్రసాదం కౌంటర్లు తదితర వాటికి నూతన భవనాలు నిర్మించనున్నారు. కార్యక్రమ వివరాలు ● 6వ తేదీ(బుధవరం) ఉదయం భగవత్ ప్రార్థన, పుణ్యహవచనం, పంచగవ్యారాధన, వాస్తు మండల పూజ, వాస్తు హోమం, పూర్ణాహుతి, హలయుగలాంగల పూజాకర్షణం నిర్వహిస్తారు. ● 7వ తేదీ(గురువారం) పుణ్యాహవాచనం, రక్షాబంధన పూజ, వాస్తు హోమం, గోగణ పూజ, గోగణ నివేదన, పూర్ణాహుతి, యాగశాల వాస్తు, అంకురార్పణ అగ్ని ప్రతిష్ఠ, చతుర్వేద శిలాశుద్ధి, మహాశాంతి హోమం ఉంటాయి. ● 8వ తేదీ(శుక్రవారం) ఉదయం కుంభారాధన, చతుర్వేద శిలలకు అభిషేకం, హోమాలు, పుర్ణాహుతి, ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రథమ శిలేష్టికాన్యాస (శంకుస్థాపన) కార్యక్రమాలు ఉంటాయి. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొడంగల్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు మంగళవారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్ర, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి బహిరంగ సభ ప్రాంగణం, యాగశాల, ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఏర్పాట్లు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ గుప్తా, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. నేటి నుంచి పునర్నవీకరణ పూజలు 8న సీఎం రేవంత్రెడ్డిచేతుల మీదుగా శంకుస్థాపన ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం -
తప్పులకు ఆస్కారం ఇవ్వొద్దు
జిల్లా సెన్సెస్ అదనపు అధికారి రవీందర్రావు తాండూరు: తప్పులకు ఆస్కారం లేకుండా జనగణన నిర్వహించాలని జిల్లా సెన్సెస్ అదనపు అధికారి రవీందర్రావు సూచించారు. మంగళవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఎన్యుమరేటర్ల శిక్షణ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనగణన పక్కాగా నిర్వహించాలన్నారు. సాంకేతిక సమస్యలు ఎదురైతే సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారి జంగయ్య, మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ, కమిషనర్ మధుసూదర్రెడ్డి, మేనేజర్ నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మరోసారి ఎల్ఆర్ఎస్
ప్లాట్ల క్రమబద్ధీకరణ గడువు పెంపు పరిగి మండలంలో అనుమతులు లేకుండా చేసిన వెంచర్వికారాబాద్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ప్రభుత్వం మరోసారి తీపికబురు అందించింది. 2024లో అప్పటి ప్రభుత్వం మొదటిసారి ప్లాట్ల రెగ్యులరైజేషన్కు అవకాశం కల్పించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 33వేల మందికి లబ్ధి చేకూరే అవకాశం లభించింది. 20 నెలలుగా అనేక మార్లు గడువు పొడిగిస్తూ వస్తోంది. తాజాగా మరో రెండు నెలలు అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అనేక సంవత్సరాలుగా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో డీటీసీపీ అనుమతులు లేకుండా వెంచర్లు చేస్తూ వచ్చారు. రియల్టర్లు కొనుగోలుదారుల ఇబ్బందులను పట్టించుకోకుండా ప్లాట్లు విక్రయిస్తూ వెళ్లారు. 2020లో అప్పటి ప్రభుత్వం టీఎస్ బీపాస్ నిబంధన అమలులోకి తెచ్చింది. అనుమతిలేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు షాక్కు గురయ్యారు. ఇంటి నిర్మాణ అనుమతులు పొందాలంటే ప్లాట్లు, వెంచర్లకు అనుమతులు తప్పనిసరి చేశారు. దీంతో విధిగా క్రమబద్ధీకరణ చేసుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. ఆరేళ్ల క్రితం అప్పటి సర్కారు ఎల్ఆర్ఎస్ చేసుకునేందుకు దరఖాస్తులు స్వీకరించింది. తదనంతర ప్రక్రియను విస్మరించింది. అనుమతులు లేనివే అధికం జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేని లే అవుట్లే అధికంగా ఉన్నాయి. దాదాపు 550 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు సమాచారం. వీటిలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు కనీస రుసుం చెల్లించి ఎల్ఆర్ఎస్(ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్) చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆరేళ్ల క్రితం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిలిపి వేసింది. దీంతో నాలుగు నెలల పాటు వ్యవసాయేతర భూములు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. ఈ క్రమంలో ఎల్ఆర్ఎస్ చేసుకునేందుకు ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 20,968, గ్రామ పంచాయతీల్లో 12,745 దర ఖాస్తులు వచ్చాయి. వీటిలో కొన్నింటిని క్రమబద్ధీకరించగా మెజార్టీ అర్జీలు పెండింగ్లోనే ఉన్నాయి. మరో రెండు నెలలు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం 25శాతం రాయితీ కూడా.. నాలుగు మున్సిపాలిటీల్లో 20,968 దరఖాస్తులు గ్రామ పంచాయతీల్లో 12,745 అర్జీలు పరిశీలనకు త్రిసభ్య కమిటీలుతరచూ గడువు పొడిగింపుతో.. అక్రమ లేఅవుట్లు చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫమైందనే ఆరోపణలు ఉన్నాయి. ప్లాట్ల క్రమబద్ధీకరణ గడువును తరచూ పొడిగిస్తుండటంతో ఎవరూ ముందుకు రావడంలేదు. తాజాగా రెగ్యులరైజ్ చేసుకునేందుకు 25 శాతం ఫీజు రాయితీ కూడా ప్రకటించింది. గతంలో రూ. 1,000 చెల్లించి దరఖాస్తు చేసుకోగా.. మరి కొందరు రూ.10వేలు చెల్లించి అర్జీ పెట్టుకున్నారు. ఇందులో రూ.1,000 చెల్లించిన వారికి ప్రభుత్వం అవకాశం ఇవ్వగా రూ.10 వేలు చెల్లించిన వారు ఎదురుచూస్తున్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనకు మూడు శాఖల అధికారులతో త్రిసభ్య కమిటీలు వేశారు. -
ప్లాస్టిక్ గోదాంలో మంటలు
పహాడీషరీఫ్: ప్లాస్టిక్ గోదాంలో అంటుకున్న మంటలు పక్కనే ఉన్న బిస్కట్ కంపెనీకి అలుముకున్న సంఘటన బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట గాలిబ్ కాలనీలో మంగళవారం మధ్యాహ్నం ప్లాస్టిక్ కవర్ల స్క్రాప్ గోదాములో మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో ఆ మంటలు దానిని ఆనుకొని ఉన్న అత్తార్ బేకరీ ప్రొడక్ట్స్ (బిస్కట్ మ్యాన్ఫ్యాక్చరింగ్ యూనిట్)కు అంటుకొని అందులోని ముడిసరుకు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు మూడు ఫైరింజన్లను రప్పించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బేకరీ యజమాని సయ్యద్ ఇబ్రహీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
రేపు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్స్
తాండూరు టౌన్: వికారాబాద్ పట్టణంలో బుధవారం జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు ఆ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రాము, మధు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జంప్, త్రో, 400 మీటర్ల రన్నింగ్ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ మార్క్స్ పాఠశాలలో ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు కుల ధ్రువీకరణ పత్రం, ఎస్సెస్సీ మెమోతో రిపోర్ట్ చేయాలన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల 10న వరంగల్లో జరగనున్న అంతర్ జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో, ఈ నెల 17 హైదరాబాద్లో జరగనున్న రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అంతర్ జిల్లా బాలబాలికల పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. వివరాలకు సెల్ నంబర్ల 9951343432, 6300075229లో సంప్రదించాలన్నారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప యాలాల: రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న ఆశవర్కర్ల వేతనాలను వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఉప్పలి మల్కయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆశవర్కర్ల యూనియన్ పిలుపు మేరకు మంగళవారం పీహెచ్సీ వైద్యురాలు రూబియానాజ్కు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆశవర్కర్లకు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలన్నారు. ఆశవర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనాన్ని అందించి, ఇతర సమస్యల పరిష్కారానికి ఎన్హెచ్ఎంలకు సరిపడా నిధులు కేటాయించాలన్నారు. గత 20 ఏళ్లుగా పేద ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఆశవర్కర్ల విషయంలో ప్రభుత్వం అనుకూలంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఆశవర్కర్ల సంఘం మండల అధ్యక్షురాలు అనిత, కార్యదర్శి శశికళ, ఆశ వర్కర్లు అనిత, వెంకటమ్మ, దస్తమ్మ తదితరులు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ వినోద్రెడ్డి తాండూరు రూరల్: కర్ణాటక – తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న రేణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ వినోద్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని కొత్లాపూర్ గ్రామ శివారులో వెలసిన ఎల్లమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ నిర్వాహకులు వినోద్రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పట్లోళ్ల ప్రవీణ్రెడ్డి, ఈఓలు శేఖర్గౌడ్, శాంతు, ఉప సర్పంచ్ రాజు, సిబ్బంది అమరేష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవితను కలిసిన ఫార్మా భూ బాధితులు యాచారం: ఫార్మాసిటీ భూ బాధితులు మంగళవారం ఎమ్మెల్సీ కవితను నగరంలోని ఆమె నివాసంలో కలిశారు. గత బీఆర్ఎస్ సర్కార్ మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని తెలిపారు. గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణం కోసం బలవంతపు భూసేకరణ చేస్తోందని, 40 రోజులకు పైగా రైతులు దీక్షలు చేస్తున్నా చలనం లేదన్నారు. ఫార్మాసిటీ పేరుతో రైతుల పేర్లపై ఉన్న భూ రికార్డులను టీజీఐఐసీ పేరు మీద మార్చేసి, పరిహారాన్ని అథారిటీలో జమ చేసి ఆ భూములు సర్కార్వేనని భయపెట్టాలని చూస్తున్నారని వాపోయారు. దీంతో స్పందించిన ఆమె త్వరలోనే కుర్మిద్ద తండాలో గిరిజన రైతులు చేస్తున్న దీక్ష వద్దకు వచ్చి సంఘీభావం తెలుపుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామా ల రైతులతో పాటు ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు కవుల సరస్వతి, నేనావత్ శ్రీకాంత్నాయక్, కిషన్ నాయక్ పాల్గొన్నారు. -
ఉద్యాన పంటలతో అధిక లాభాలు
అనంతగిరి: ఉద్యాన పంటల సాగుతో అధిక లాభాలు పొందవచ్చని.. ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆయిల్ పామ్ సాగు, రైతు సంక్షేమ పథకాలపై ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల ఆర్థిక ఎదుగుదలకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తోందని తెలిపారు. జిల్లాలో లక్ష్యాలకు అనుగుణంగా ఆయిల్ పామ్ సాగుకు అధికారులు కృషి చేస్తున్నట్లు వివరించారు. రైతులు కూడా సాగు చేసేందుకు ముందుకు రావాలన్నారు. సాగుపై అవగాహన కల్పించేందుకు అశ్వరావుపేట్ ప్రాంత పర్యటనకు రైతులను తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. ఆయిల్ పామ్ సాగుతో పాటు పండ్లు, పూలు, కూరగాయల సాగుకు రైతులను సన్నద్ధం చేయాలని పేర్కొన్నారు. వారం రోజుల్లో పూర్తిస్థాయిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. జూన్ మాసంలో జొన్నల కొనుగోలు కేంద్రాలను ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం, ఉద్యాన, పట్టు పరిశ్రమల జిల్లా అధికారి సత్తార్, మార్కెట్ కమిటీ చైర్మన్లు చాపల శ్రీనివాస్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పకడ్బందీగా ధాన్యం సేకరించాలి జిల్లాలో పకడ్బందీగా ధాన్యం సేకరించాలని కలెక్టర్ దీపక్ తివారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన తన చాంబర్లో అధికారులతో సమావేశమయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ, తూకం యంత్రాలు, ప్యాడి క్లీనర్లు, గోనె సంచులు అందుబాటులో ఉంచాలన్నారు. కొనుగోలు చేసిన వడ్లను వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, డీఆర్డీఏ శ్రీనివాస్, డీఎస్ఓ సుదర్శన్, డీఎంసీఎస్ మోహన్ కృష్ణ, జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం, మార్కెటింగ్ ఎండీ రియాజ్, మార్క్ఫెడ్ అధికారి రేఖ, డీసీఓ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి కలెక్టర్ దీపక్ తివారి -
ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం
దుద్యాల్: ఆయిల్ పామ్ సాగుతో స్థిరమైన లాభాలు పొందవచ్చని కొడంగల్ ఏడీఏ శంకర్ రాథోడ్ అన్నారు. మంగళవారం మండలంలోని హస్నాబాద్ రైతు వేదికలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని కోరారు. కొడంగల్లో నియోజకవర్గంలో ఆయిల్ పామ్ కంపెనీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం ఉద్యాన శాఖ అధికారి సురేందర్ నాథ్ మాట్లాడుతూ.. రైతులు ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వస్తే ప్రభుత్వం సబ్సిడీ అందించి ప్రోత్సహిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నీటి వసతి ఉన్న రైతులు మాత్రమే సాగుకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పద్మమ్మ, దుద్యాల్, కొడంగల్, దౌల్తాబాద్ మండలాల వ్యవసాయ అధికారులు నాగరాజు, శ్రీలత, లావణ్య, హార్టీకల్చర్ విస్తరణ అధికారి బాబ్యానాయక్, ఇకో పామ్ ఫీల్డ్ సిబ్బంది మల్లికార్జున్, మొగులప్ప తదితరులు పాల్గొన్నారు. ఏడీఏ శంకర్ రాఽథోడ్ -
రుణాలు చెల్లించరే!
యాచారం: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీఎస్)లో దీర్ఘకాలిక రుణాలు పొంది, తిరిగి చెల్లించని వారి ఆస్తుల జప్తునకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సిద్ధమవుతోంది. యాచారం పీఏసీఎస్లో 1,500 మంది రైతులకు పైగా తమ పట్టాదారు, పాసుపుస్తకాలను మార్టిగేజ్ చేసి రూ.50 కోట్లకు పైగా లాంగ్టర్మ్ లోన్లు పొందారు. వీరంతా పౌల్ట్రీ, డెయిరీఫాం, మేకలు, గొర్రెల పెంపకం చేపట్టారు. తీసుకున్న రుణాలను ఏటా మార్చి 30లోపు వాయిదాలతో కూడిన రుణం, వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. 550 మందికి పైగా రైతులు ఏటా సక్రమంగా వాయిదాలు చెల్లిస్తూ పీఏసీఎస్కు సహకరిస్తున్నారు. మిగిలిన వారు మొండికేశారు. దీంతో అధికారులు వీరి ఇళ్లు, వ్యవసాయ బావుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. హెచ్డీసీసీ ఉన్నతాధికారులతో పాటు స్థానిక పీఏసీఎస్ అధికారులు పలుమార్లు రైతులను కలిసి బకాయిలు చెల్లించాలని హెచ్చరికలు చేసినా మార్పు రావడం లేదు. లీగల్ నోటీసులు అందజేత యాచారం పీఏసీఎస్లో గత మూడేళ్లుగా 932 మంది రైతులు సక్రమంగా వాయిదాలు చెల్లించడం లేదు. వీరికి లీగల్ నోటీసులు పంపినా ఫలితం లేకుండాపోతోంది. దీంతో రుణాల కోసం తాకట్టు పెట్టిన పొలాల జప్తునకు అధికారులు రెడీ అయ్యారు. ఈనెల 15న ఉదయం 11 గంటలకు యాచారం పీఏసీఎస్లో అసలు, వడ్డీతో కలిపి అప్పులు చెల్లించాలని, లేదంటే వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని హెచ్డీసీసీ జాయింట్ రిజిస్ట్రార్ మనోజ్కుమార్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. లేని పక్షంలో ఈ నెల 30 లోపు తీసుకున్న అప్పు మొత్తంతో పాటు అపరాధ రుసం కలిపి, ఆస్తులు జప్తు చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. చింతపట్ల, నల్లవెల్లి, మంతన్గౌరెల్లి, తమ్మలోనిగూడ, నందివనపర్తి, యాచారం, చౌదర్పల్లి, మంతన్గౌరెల్లి, నక్కర్తమేడిపల్లి, నస్దిక్సింగారం తదితర గ్రామాల్లో మొండి బకాయిలు అధికంగా ఉన్నట్లు తెలిపారు. ఈ విషయమై రైతులకు అవగాహన కల్పించినా స్పందన లేదన్నారు. కొత్త వారికి అందని రుణాలు దీర్ఘకాలిక రుణాలు పొందిన రైతులు సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంతో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు యాచారం పీఏసీఎస్ను బ్లాక్ లిస్టులో పెట్టింది. వసూళ్ల సేకరణలో అప్పటి పాలకవర్గంతో పాటు సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించింది. దీంతో మూడేళ్లుగా యాచారం పీఏసీఎస్కు రూపాయి కూడా కేటాయించలేదు. ఇదిలా ఉండగా, వివిధ గ్రామాలకు చెందిన సుమారు వంద మందికి పైగా రైతులు లాంగ్టర్మ్ లోన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి రుణాలు అందకపోవడంతో చాలా మంది తమ అప్లికేషన్లను వెనక్కి తీసుకుని, కమర్షియల్ బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటున్నారు. మూడేళ్లుగా రుణాల వసూలు పరిస్థితి ఏడాది టార్గెట్ వసూలైంది బకాయి 2023– 24 రూ.26 కోట్లు రూ.10 కోట్లు రూ.16 కోట్లు 2024– 25 రూ.34 కోట్లు రూ.13 కోట్లు రూ. 21 కోట్లు 2025– 26 రూ.32 కోట్లు రూ.12 కోట్లు రూ.20 కోట్లు మొండి బకాయిలతో పీఏసీఎస్కు అవస్థలు ఈనెల 15లోపు చెల్లించాలని నోటీసులు రైతులు స్పందించాలని సూచన లేదంటే ఆస్తులు జప్తుచేస్తామని హెచ్చరిక -
ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు చేయాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా బాధ్యతగా పని చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మను చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మను చౌదరి మాట్లాడుతూ.. ఈ నెల 10న మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో కూడా పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అధికారులు తమకు నిర్దేశించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలన్నారు. ఎక్కడా ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా చూడాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, కిరణ్మయి, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, పోలిస్ శాఖ, విద్యుత్, ట్రాన్స్పోర్టు, ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మను చౌదరి -
చిన్నారులు ఉన్నతస్థాయికి ఎదగాలి
హుడాకాంప్లెక్స్: చిన్నారులు క్రమశిక్షణతో ఉన్నతస్థాయికి ఎదగాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ సుజాత ఆకాంక్షించారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో కొనసాగుతున్న వేసవి శిక్షణ శిబిరాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. శిక్షణ పొందుతున్న చిన్నారులతో నేరుగా మాట్లాడి, వారి ప్రదర్శనను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె కోచ్లకు పలు సలహాలు, సూచనలు చేశారు. శిక్షణలో మరింత నాణ్యత పెంచాలని సూచించారు. జిల్లా యువజన క్రీడల అధికారి స్వర్ణలత మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ కోచింగ్ క్యాంపులో నమోదు చేయించి వారి క్రీడా భవిష్యత్కు పునాదులు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ శిబిరంలో బ్యాడ్మింటన్, జిమ్నాస్టిక్స్, క్రికెట్, స్విమ్మింగ్, స్కేటింగ్, బాస్కెట్బాల్, లాన్ టెన్నిస్, అథ్లెటిక్స్, వాలీబాల్, బాక్సింగ్, కబడ్డీ, కరాటే, టేబుల్ టెన్నిస్ తదితర విభాగాల్లో శిక్షణ ఇసున్నట్టు తెలిపారు. శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
పరిగి సీఐగా కొండల్రెడ్డి
పరిగి: పరిగి సీఐగా కొండల్రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న శ్రీనివాస్రెడ్డి మల్టీజోన్ –2 ప్యూచర్ సిటీ కమిషనరేట్ కార్యాలయానికి బదిలీ అయినట్టు అధికారులు తెలిపారు. నల్లగొండ జిల్లా సాలిగౌరారం సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న కొండల్రెడ్డిని పరిగి సీఐగా బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. పరిగి: మండలంలోని జాఫర్పల్లి మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కుక్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ అంజయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు మాత్రమే అర్హులని తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 7వ తేదీ లోపు మండల విద్యాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేయాలన్నారు. కోర్టు ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేసిన ప్రత్యేక కమిషనర్ వికారాబాద్: పీఏసీఎస్ చైర్మన్ల పదవీ కాలం పొడిగిస్తూ ప్రత్యేక కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఫిబ్రవరి 15తో పీఏసీఎస్ పాలక మండళ్ల పదవీ కాలం పూర్తయ్యింది. ఆరు నెలల పాటు పొడిగించిన ప్రభుత్వం ఆ తర్వాత సహకార సంఘాలను రద్దు చేసింది. జిల్లాలో మొత్తం 19 సహకార సంఘాలు ఉండగా ఇందులో మెజార్టీ చైర్మన్లు బీఆర్ఎస్కు చెందిన వారే ఉన్నారు. దీంతో వారిని కొనసాగించటం ఇష్టం లేని ప్రభుత్వం వారి పదవీ కాలం పూర్తవగానే అధికారులను పర్సన్ ఇన్చార్జ్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అధికారుల నియామకం చట్ట విరుద్దమంటూ గత పాలక మండళ్లు కోర్టును ఆశ్రయించాయి. ఎన్నికలు నిర్వహించే వరకు గత పాలక మండళ్లనే కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే వరకు గత ఫిబ్రవరి 14వ, తేదీ వరకు ఉన్న కమిటీలను కొనసాగించాలని తాజాగా వెలువరించిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పూడూరు: రైతులు తప్పని సరిగా భూసార పరీక్షలు చేయించుకుని దానికి తగ్గట్టుగా ఎరువులు వాడాలని భారతీయ నూనె గింజల ప్రధాన శాస్త్ర వేత్త డాక్టర్ జవహర్లాల్ సూచించారు. సోమవారం మండలంలోని మంచన్పల్లి రైతు వేదికలో సమతూల్య ఎరువుల వినియోగంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాఘవేందర్, శాస్త్రవేత్తలు ఉషాకిరణ, రమ్య, చంద్రిక, ఏఓ ప్రభాకర్, ఏఈఓ మహిపాల్, తదితరులు పాల్గొన్నారు. తాండూరు రూరల్: మండలంలోని కొత్లాపూర్ రేణుక ఎల్లమ్మ జాతరకు రావాలని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డిని ఆలయ కమిటీ చైర్మన్ పట్లోళ్ల ప్రవీణ్రెడ్డి, ఈఓ శేఖర్గౌడ్ కోరారు. సోమవారం తాండూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన్ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ నెల 15న జరిగే రథోత్సవం, సిడె కార్యక్రమాల్లో పాల్గొనాలని వారు కోరారు. మీర్పేట: మేడే స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్యంగా ఉద్యమించాలని యూటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జంగయ్య పిలుపునిచ్చారు. మేడే వారోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లెలగూడ వార్డు కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించేలా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లతో పనిగంటల భారం పడడంతో పాటు స్వేచ్ఛ లేకుండా చేసిందని ఆరోపించారు. -
8న ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
● వైఖానస శాస్త్రోక్తంగా పనులు ● హాజరుకానున్న సీఎం రేవంత్రెడ్డి● పనులను పరిశీలించిన ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు కొడంగల్: పట్టణంలోని బాలాజీ నగర్లో వెలిసిన పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులను ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, ఎండోమెంట్ కమిషనర్ హన్మంత్ రావ్ సోమవారం పరిశీలించారు. ఈ నెల 8న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి పనులను పరిశీలించారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విస్తరణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. శ్రీవారి దైవిక కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. ఈ విషయంలో అధికారులు, పోలీసులు సమన్వయంతో పని చేయాలన్నారు. రూ.110 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం శ్రీవారి ఆలయాన్ని రూ.110 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. తిరుమల తిరుపతి తరహాలో వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా పనులు చేపడుతున్నారు. సంప్రదాయ నిర్మాణ శైలిని కాపాడుతూ నాణ్యతా ప్రమాణాలకు పాటిస్తూ రెండేళ్లలోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, వాస్తు నిపుణులు, ఆలయ నిర్మాణ స్తపతులు, ఆలయ నిర్మాణ శిల్పులు భవిష్యత్ ఆలయానికి రూపకల్పన చేశారు. ఆలయాన్ని విస్తరించి మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. తిరుమల తరహాలో ప్రధాన ఆలయం, అమ్మవార్ల ఆలయాలు, ఉప ఆలయాలు, మాడ వీధులు, క్యూలైన్, కల్యాణ మంటపం, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, స్నాన ఘట్టాలు, మరుగుదొడ్లు, పార్కింగ్, పుష్కరిణి, ప్రసాదం కౌంటర్లు తదితర వాటికి నూతన భవనాలు నిర్మించనున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ నందారం ప్రశాంత్ గుప్త, ఈఓ రాజేందర్రెడ్డి, ఎండోమెంట్, ఆర్అండ్బీ, ట్రాన్స్కో, హౌసింగ్, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సేంద్రియ పద్ధతిలో సాగు మేలు
మంచాల: వ్యవసాయ పంటల సాగులో రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలని జిల్లా వ్యవసాయాధికారి డి.ఉష అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో సోమవారం నిర్వహించిన రైతు వారోత్సవాలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు పంటల సాగు విషయంలో నూతన పద్ధతులు అవలంబించాలన్నారు. సేంద్రియ పద్ధతిలో పంటలను సాగు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. భూసార పరీక్షలు చేయించుకొని నేలలో పోషకాల లోపాలను గుర్తించాలని, తదనుగుణంగా ఎరువులు వాడాలన్నారు. లైసెన్స్ ఉన్న ఫర్టిలైజర్ దుకాణాల్లోనే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. రైతులకు నానో యూరియా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. పచ్చి రొట్ట ఎరువులు సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఏడీఏ సుజాత, ఏఓ వెంకటేశ్, సర్పంచ్ మానస వినయ్, వ్యవసాయాధికారులు వనజాత, హరినాథ్, నవీన, లింగస్వామి, నిఖిత, సాయిసిరి, రైతు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా వ్యవసాయాధికారి ఉష -
బాధ్యతగా పని చేద్దాం
అనంతగిరి: ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వెంకటాచారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిషారంలో అధికారులు బాధ్యతగా పని చేయాలని సూచించారు. ప్రజలు ఇచ్చే దరఖాస్తులను పరిశీలించి సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సుధీర్, డీఆర్డీఓ శ్రీనివాస్, డీపీఓ జయసుధ, డీటీడీఓ కమలాకర్ రెడ్డి, డీఎస్సీడీఓ జైపాల్ రెడ్డి, డీబీసీడీఓ మాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధాన్యం సేకరణకు సమాయత్తం కండి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మౌలిక సదుపాయాలు కల్పించాలని అదనపు కలెక్టర్ వెంకటాచారి అధికారులను ఆదేశించారు. సోమవారం నగరం నుంచి అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై పలు సూచనలు చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 129 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అవసరం మేరకు గోనె సంచులను సరఫరా చేయాలని సంబంధిత అధికారికి ఆదేశించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల జిల్లా మేనేజర్ మురళీకృష్ణ, జిల్లా పౌరసరఫరాల అధికారి సుదర్శన్, డీఆర్డీఓ శ్రీనివాస్, డీసీఓ నాగార్జున, డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ వెంకట్ రెడ్డి, అదనపు డీఆర్డీఓ నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
చెరువుల మరమ్మతులు పూర్తి చేయాలి
పరిగి: వర్షాకాలానికి ముందే చెరువుల మరమ్మతులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి సూచించారు. సోమవారం పట్టణంలోని తన నివాసంలో ఆయా మండలాల నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయకట్టు భూములకు పూర్తిస్థాయిలో నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువులు, కుంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలు ఉంటే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ రవికుమార్, ఈఈ రేణుక, డీఈఈలు పార్థసారథి, కృష్ణారెడ్డి, ఏఈలు పాల్గొన్నారు. అభివృద్ధి చూసే చేరికలు పూడూరు: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసే ఇతర పార్టీలకు చెందిన పలువురు హస్తం పార్టీలో చేరుతున్నారని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని చన్గోముల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, జెడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు అజిమొద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అజిమొద్దీన్ మాట్లాడుతూ.. మండలంలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సురేందర్ ముదిరాజ్, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, మాజీ సర్పంచ్ రామస్వామి, నాయకులు శ్రీనివాస్ గుప్తా, తిర్మల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి -
కాంగ్రెస్తోనే పేదలకు న్యాయం
అనంతగిరి: కాంగ్రెస్తోనే పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని స్పీకర్ ప్రసాద్కుమార్ అన్నారు. సోమవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరిపల్లి వార్డులో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సొంతింటి కళను కాంగ్రెస్ నిజం చేస్తోందన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం అన్ని వాగ్దానాలను నెరవేరుస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. మున్సిపాలిటీకి అత్యధిక నిధులు తీసుకువచ్చి అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ సుధాకర్రెడ్డి, నాయకులు రెడ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. త్వరలో జొన్న కొనుగోలు కేంద్రం ధారూరు: మండల కేంద్రంలో జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తెలిపారు. సోమవారం గట్టెపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు కోసం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. మండలంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం దోర్నాల్, గురుదోట్ల గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ భాస్కర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాన్సింగ్, డీసీసీ కార్యదర్శి మహ్మద్ బాబాఖాన్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాములు, ధారూరు, హరిదాస్పల్లి పీఏసీఎస్ల సీఈఓలు నర్సింహులు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. స్పీకర్ ప్రసాద్కుమార్ -
ఉపాధి కూలీలకు అందని వేతనాలు
షాద్నగర్: ఉపాధి హామీ కూలీలకు వేతనాలు అందకపోవడంతో వారు ఇబ్బంది పడుతున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనునాయక్ ఆరోపించారు. సోమవారం ఫరూఖ్నగర్ మండలం బూర్గుల గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రదేశాన్ని శ్రీనునాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు ఫిబ్రవరి నుంచి నేటి వరకు వేతనాలు చెల్లించాల్సి ఉందన్నారు. వేతనాలు సరిగా ఇవ్వకపోవడంతో వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అదేవిధంగా కూలీలకు ప్రతి వారం పేస్లిప్పులు ఇవ్వాలని, ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం య థావిధిగా కొనసాగించాలని, కొత్తగా తీసుకొచ్చిన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కూలీలకు వేతనాలు, పని దినాలు పెంచాలన్నారు. అదేవిధంగా పని ప్రదేశంలో రోజుకు రెండు పూటలా ఫొటోలు తీసే విధానాన్ని రద్దు చేయాలన్నారు. కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. -
ఆశ్రమం.. ఆదర్శం
‘పది’ ఫలితాల్లో సత్తా చాటుతున్న ఆశ్రమ పాఠశాలల విద్యార్థినులుబొంరాస్పేట: జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. కార్పొరేట్ విద్యా సంస్థలకు ఏ మాత్రం తీసిపోకుండా పదో తరగతిలో ఉత్తమ ఫలితాలను తన ఖాతాలో వేసుకుంటున్నాయి. చౌడాపూర్ మండలం కొత్తపల్లిలో, మర్పల్లిలో ఆశ్రమ పాఠశాలలు.. బొంరాస్పేట మండలం బొట్లోనితండా, కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల, రాంపూర్లో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. కుల్కచర్ల, తాండూరు పట్టణాల్లో ఎస్సీ బాలికల హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో అనాథ పిల్లలు, చదువు మానేసిన చిన్నారులు, వలస కుటుంబాలకు చెందిన పిల్లలు, నిరుపేదల పిల్లలు చదువుకుంటున్నారు. ఏటా 3 నుంచి 10వ తరగతి వరకు 450 మంది విద్యనభ్యసిస్తున్నారు. మన జిల్లాతోపాటు, మహబూబ్నగర్, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాలకు చెందిన పేద విద్యార్థులు చదువుకొంటున్నారు. ఇప్పటి వరకు ఆయా పాఠశాలల్లో చదువు పూర్తి చేసుకున్న సుమారు పాతిక మందికిపైగా మంచి కొలువుల్లో స్థిరపడ్డారు. అలాంటి వారిలో కొందరు.. వైద్య విద్య చేస్తూ.. మండలంలోని ఊరెనికి తండాకు చెందిన రుక్కీబాయి, మోహన్నాయక్ దంపతుల కూతురు కోమల్. బొంరాస్పేట మండలం బొట్లోనితండా గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో (2018–19) పదో తరగతిలో 9.7 గ్రేడ్తో మండల టాపర్గా నిలిచింది. ఆ తర్వాత ఇంటర్ పూర్తి చేసి ఎంబీబీఎస్లో ఉచిత సీటు సాధించింది. ప్రస్తుతం వికారాబాద్ మహవీర్ ఆస్పత్రిలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా.. బొట్లోనితండాకు చెందిన రాథోడ్ కమల (2017–18) పదో తరగతిలో మంచి మార్కులు సాధించింది. పట్టుదలతో పైచదువులు పూర్తి చేసి ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీయర్ పని చేస్తోంది. తండ్రి హర్యానాయక్ ఆటో డ్రైవర్. ఏఎన్ఎంగా.. బిచ్చాల్తండాకు చెందిన అనూష(2017–18)పదో తరగతి వరకు చదివింది. పాఠశాలలో మెరుగైనా మార్కులు సాధించింది. మధ్యలో చదువు మానేయకుండా ఏఎన్ఎం చేసి తిరిగి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు వైద్యసేవలు అందిస్తోంది. సర్పంచ్గా గెలిచి.. మండల పరిధిలోని బాపల్లితండాకు చెందిన కోమల్(2017–18) ఇదే ఆశ్రమ పాఠశాలలో చదివి బీటెక్ పూర్తి చేసింది. తల్లి లక్ష్మి అంగన్వాడీ కార్యకర్త. విద్యావంతురాలైన కోమల్ కోస్గిలో జరిగిన సీఎం సభలో రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్గా ప్రమాణస్వీకారం చేసి అందరి మన్ననలు పొందింది. పదికి పది కొడంగల్ నియోజకవర్గానికి చెందిన లక్ష్మి ముదిరాజ్(2021–22) పదో తరగతిలో 10/10 మార్కులతో మండల టాపర్గా నిలిచింది. ప్రస్తుతం మహబూబ్నగర్లో బీఎస్సీ నర్సింగ్ చేస్తోంది. ఉన్నతంగా జీవించాలని.. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం సెగిరెడ్డిఘనపూర్కు చెందిన పద్మ(2022–23) పదో తరగతిలో 9.5 మార్కులు సాధించింది. ప్రస్తుతం బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఉద్యోగంతో ఉన్నతంగా జీవించాలనే పట్టుదలతో ఉన్నానని పద్మ చెబుతోంది. ప్రస్తుతం ఐఐటీ కోచింగ్ తీసుకుంటోంది. మండల టాపర్గా.. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం, దాచకపల్లికి చెందిన చెంచుబిడ్డ స్రవంతి (2023–24) పదో తరగతిలో 9.3 గ్రేడ్ సాధించి మండల టాపర్గా నిలిచింది. ప్రస్తుతం ఇంటర్ పూర్తి చేసింది. దాతలు సహకారం అందితే ఉన్నత చదువులు చదువుతానని చెబుతోంది. పెళ్లి తిరస్కరించి.. యాలాల మండలం ముద్దాయిపేట తండాకు చెందిన లక్ష్మి (2024–25) పదో తరగతిలో 535 మార్కులతో మండల రెండో స్థానంలో నిలిచింది. నాన్న దుబాయిలో వలస కూలీగా పనిచేస్తున్నాడు. పెళ్లి సంబంధం తిరస్కరించి ఇంటర్మిడియెట్ చదువుతోంది. మండలంలో రెండో స్థానం.. మండల పరిధిలోని సీత్యానాయక్ తండాకు చెందిన నందిని (2025–26) పదో తరగతిలో 529 మార్కులు సాధించింది. మండలంలో ద్వితీయ స్థానంలో నిలిచి ఆశ్రమ పాఠశాల పేరు నిలబెట్టింది. గురుకులాల్లోని సీఓఈ కళాశాలకు వెళాల్లని ఎదురుచూస్తోంది. తల్లి కష్టం తెలిసి.. ప్రశాంతి నాన్న హోంగార్డుగా పని చేస్తూ పదేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. తాను చదువుతున్న ఆశ్రమ పాఠశాలలో తల్లి మణెమ్మ వంట మనిషిగా చేస్తోంది. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 527 మార్కులతో ఆశ్రమ పాఠశాల రెండో స్థానంలో నిలిచింది. ఇలా అనేక మంది పేద విద్యార్థినులు ఆశ్రమ పాఠశాలల్లో చదివి ఉత్తమ ఫలితాలు సొంతం చేసుకున్నారు. మండల టాపర్లుగా నిలుస్తున్న గిరిజన బిడ్డలు కన్నవారి కలలను సాకారం చేస్తున్న బాలికలు ఎంబీబీఎస్, సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో రాణిస్తున్న వైనంలక్ష్యం నెరవేరుతోంది జిల్లాలోని బొట్లోనితండా బాలికల ఆశ్రమ పాఠశాల పదో తరగతి ఫలితాల్లో ఆదర్శంగా నిలుస్తోంది. చదువుకు దూరమైన సంచార, గిరిజన విద్యార్థులను వృద్ధిలోకి తీసుకరావాలన్నదే గిరిజన సంక్షేమ శాఖ లక్ష్యం. ఆ కళ నేడు సాకారమవుతోంది. ఉపాధ్యాయులు చక్కగా బోధన చేయడం కలిసివస్తోంది. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. – కమలాకర్రెడ్డి, డీటీడీఓ, వికారాబాద్ పదో తరగతిలో ఉత్తమ ఫలితాలకు చక్కటి వేదికలవుతున్నాయి గిరిజన ఆశ్రమ పాఠశాలలు. వీటిలో చదువుతున్న చెంచు, లంబాడా, ఎరుకల తెగకు చెందిన విద్యార్థినులు ఏటా మండల టాపర్లుగా సత్తా చాటుతున్నారు. గతంలో ఉత్తీర్ణులైన పలువురు పై చదువులు పూర్తి చేసి ప్రస్తుతం ఉన్నత కొలువుల్లో స్థిరపడ్డారు -
‘కూలీ’ల డబ్బులు చెల్లించండి
బంట్వారం: ఉపాధి కూలీలకు పెండింగ్లో ఉన్న 14 వారాల కూలీ డబ్బులను వెంటనే చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన బంట్వారం మండలం తొర్మామిడి, బస్వాపూర్ గ్రామాల్లో ఉపాధిహామీ కూలీలలో మాట్లాడారు. పని ప్రదేశంలో కూలీలకు టెంట్లు వేసి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలన్నారు. మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. దినసరి కూలీ రూ.307 నుంచి రూ.600కు పెంచడంతో పాటు 200 రోజులు కల్పించాలని కోరారు. ప్రమాద బీమా కల్పించాలని, అడిగిన వెంటనే కొత్త జాబ్ కార్డులు ఇవ్వాలని పేర్కొన్నారు. రోజుకు రెండు సార్లు ఫొటోలు తీయడం వలన 4 గంటల సమయం వృథా అవుతుందని, పాత పద్ధతినే కొనసాగించాలని సూచించారు. రైతు కూలీల వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింలు, సీపీఎం కార్యకర్తలు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మహిపాల్ -
వైద్యరంగానికి ప్రాధ్యానత ఇవ్వాలి
చేవెళ్ల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్యరంగానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని అరబిందో ఫార్మా లిమిటెడ్ డైరెక్టర్ మధన్మోహన్రెడ్డి, కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ రమేశ్రెడ్డి అన్నారు. చేవెళ్లలోని డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి జనరల్ ఆస్పత్రిలో సోమవారం వైద్యకళాశాల విద్యార్థులె శ్రీట్రోయ్ జియాంజ్శ్రీ పేరుతో గ్రాడ్యుయేషన్ ఘనంగా నిర్వహించారు. వేడుకలను శాసనమండలి చీఫ్ విఫ్ డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి, ఎస్ఆర్ యూనివర్సిటీ వైస్ చైర్మన్ వరదారెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్రెడ్డితో కలిసి ముఖ్యఅతిథులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. విద్యార్థులకు డాక్టరేట్ పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైద్యవృత్తి చెప్పటిన విద్యార్థులు వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించేలా సేవలు అందించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం వైద్యంలో అగ్రగామిగా నిలుస్తోందని చెప్పారు. ప్రతి విద్యార్థి నిరంతర పరిశోధకుడిగా ముందుకు సాగాలని, తల్లిదండ్రులు కష్టాన్ని మరిచిపోవద్దని సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు తిరుపతిరెడ్డి, సంతోష్రెడ్డి, ప్రిన్సిపాల్ జోయారాణి, మెడికల్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ గౌరి, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో ఎద్దు మృతి
నవాబుపేట: విద్యుదాఘాతంతో ఎద్దు మృతి చెందింది. ఈ సంఘటన సోమవారం ఎక్ మామిడి గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నవాబ్పేట్ పసుల రాజు తన రెండు ఎడ్లతో పొలానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో.. ఊరు చివరన ఉన్న ట్రాన్స్ఫార్మర్కు ఓ ఎద్దు తగలి.. విద్యుదాఘాతంతో మృత్యువాత పడింది. ఎద్దు విలువ రూ.లక్ష వరకు ఉంటుందని, ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యం వలనే నష్టపోయాయని రైతు పేర్కొన్నాడు. ట్రాన్స్ఫార్మర్కు కంచె ఉంటే ఈ ప్రమాదం జరిగుండేది కాదని వాపోయారు. అధికారులు స్పందించి, తగిన న్యాయం చేయాలని కోరాడు. కడ్తాల్: న్యామతాపూర్లోని ఓ వ్యవసాయ పొలం వద్ద గ్రామానికి చెందిన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికుడు నల్లవోతుల లక్ష్మయ్య (30) గ్రామంలోని మద్దూరు రామిరెడ్డి వ్యవసాయ పొలం వద్ద కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. ఈనెల 2న శనివారం ఉదయం పనికి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు మూడు రోజుల పాటు వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం ఊరి శివారులోని ఓ బావిలో మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు లక్ష్మయ్యగా గుర్తించడంతో బాడీని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి వివాహం కాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ సైదిరెడ్డి తెలిపారు. 40 అడుగుల లోతున్న బావిలో నుంచి శవాన్ని తీసేందుకు పోలీసులకు సహకరించిన స్థానికులు తానేషా, రాములును పీఎస్కు పిలిపించి సన్మానించడంతో పాటు నగదు అందించారు. ఎస్ఐలు వరప్రసాద్, చంద్రశేఖర్ ఉన్నారు. హత్య కేసులో నిందితుల రిమాండ్ కొందుర్గు: హత్య కేసులో నిందితులను రిమాండ్కు తరలించారు. ఎస్ఐ విజయ్ కథనం ప్రకారం.. జిల్లేడ్ చౌదరిగూడ మండలం రావిర్యాల గ్రామానికి చెందిన కడమూరి పోచమ్మ (70)ని ఆస్తికోసం కన్న కొడుకు భీమయ్య, కోడలు పద్మమ్మ కలిసి హ్యతచేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితులను ఆదివారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. శంకర్పల్లి: పట్టణానికి చెందిన ఓ టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) నాయకుడు సోమవారం నిర్వహించిన తన కూతురు మొదటి పుట్టిన రోజు వేడుకకు ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. -
విషాదం నింపిన ప్రమాదం
● శుభకార్యానికి వెళ్లి వస్తుండగాఇద్దరు యువ ఫొటో గ్రాఫర్ల దుర్మరణం ● శోకసంద్రంలో మృతుల కుటుంబాలు మంచాల: పొట్టకూటి కోసం ఇంటి నుంచి బయలు దేరిన ఫొటోగ్రాఫర్లు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులకు తీరని విషాదం నింపారు. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదల కుటుంబాలు. ఇప్పుడిప్పడే యువకులు చేతికి వచ్చి కుటుంబానికి ఆసరా ఉంటున్నారు. రోడ్డు ప్రమాదం వారి ఇళ్లలో చీకట్లు నింపింది. ఆదివారం సిద్దిపేటలోని శివం గార్డెన్లో ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రజ్ఞాపూర్ రింగ్రోడ్డు వద్ద కారు అదుపుతప్పడంతో మండల పరిధిలోని తిప్పాయిగూడకు చెందిన గ్యార గౌతమ్(21), ఆగాపల్లికి చెందిన అన్నారం అఖిల్(23) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. శోకసంద్రంలో తిప్పాయిగూడ తిప్పాయిగూడకు చెందిన గ్యార పెంటయ్య–మనోహర దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు గౌతమ్ ఇప్పుడిప్పుడే పనులు చేసుకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. సాఫీగా సాగుతున్న వీరి ప్రయాణంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఎదిగిన కొడుకు కుటుంబానికి అండగా ఉంటాడనుకుంటే దేవుడు తీసుకెళ్లాడంటూ కుటుంబ సభ్యులు రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. ఆగాపల్లికి చెందిన అన్నారం సంతోష–శేఖర్ దంపతులకు ఒక్కగాను ఒక్క కొడుకుడు అఖిల్(23) కొన్ని రోజులుగా ఫొటోగ్రాఫర్ వృత్తిలో పని చేస్తున్నాడు. పనికి వెళ్లిన కొడుకు శవమై తిరిగిరావడంతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఉన్న ఒక్క కొడుకు చనిపోయాడు మేము ఎవరి కోసం బతకాలని రోదిస్తున్నారు. అందరితో కలివిడిగా ఉండే అఖిల్ మృతితో ఆగాపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. సోమవారం మృతుల అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆగాపల్లికి చెందిన అనిరుద్ ప్రస్తుతం నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
108లో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం
షాబాద్: 108 వాహనంలో ఓ తల్లి ప్రసవించి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. షాబాద్ 108 సిబ్బంది రాజేశ్, భూపాల్ సెల్పులు తెలిపిన ప్రకారం బిహార్కు చెందిన ఓ జంట ఎలికట్ట గ్రామంలో జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో కుమారికి మధ్యాహ్నం పురిటి నొప్పులురావడంతో ఆమె భర్త 108కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్లో ఆమెను షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువవడంతో సిబ్బంది ఆమెకు ప్రసవం చేశారు. అనంతరం షాద్నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని తెలిపారు. -
పంట భూముల జోలికి రావద్దు
● రైతు వారోత్సవాల్లో కర్షకుల ఆందోళన ● ప్రభుత్వ నిర్ణయాన్నిఉపసంహరించుకోవాలని డిమాండ్ మొయినాబాద్ రూరల్: కూరగాయలు, పూల మార్కెట్ నిర్మిస్తామంటూ తమ భూముల జోలికి రావొద్దని అజీజ్నగర్ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన రైతు వారోత్సవాల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ సోనియాదర్శన్, కమిషనర్ ఖాజామొహియుద్దీన్, మండల వ్యవసాయ, అభివృద్ధి అధికారులకు విన్నవించారు. సర్వే నంబర్లు 151, 176లోని భూమిని తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వాపోయారు. ఈనిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు చనివెల్లి అమరేందర్రెడ్డి, చాకలి యాదగిరి, మాణిక్యం, శంకరయ్య, రైతులు మాడి రాంచంద్రారెడ్డి, సుధాకర్రెడ్డి, రాంభూపాల్, నరేందర్యాదవ్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
చైర్మన్గా బాధ్యతల స్వీకరణ
పూడూరు: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల చైర్మన్లను పొడిగించడంతో పూడూరు పీఏసీఎస్ చైర్మన్ పట్లోళ్ల సతీష్రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. మరోమారు రైతులకు సేవ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని, ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తానని తెలిపారు. మీర్పేట: హిట్ అండ్ రన్ కేసులో కారు డ్రైవర్ను రిమాండ్కు తరలించారు. ఈ ఘటన మీర్పేట ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఈ నెల 1వ తేదీన రాత్రి గాయత్రీ నగర్ వద్ద మీర్పేటకు చెందిన తండ్రీకొడులు జిలానీ, ఫైజల్ బైక్ వెళ్తున్నారు. సింగరేణి కాలనీకి చెందిన కారు డ్రైవర్ నీలకంఠం సత్యనారాయణ బైక్కు సైడ్ ఇవ్వకపోవడంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకంఉది. ఈ క్రమంలో సత్యనారాయణ కారులో కూర్చుని ఫైజల్ను తోసేయడంతో డివైడర్పై పడి గాయపడ్డాడు. అక్కడ నుంచి తప్పించుకునేందుకు యత్నించగా జిలానీ బైక్ను కారుకు అడ్డుగా పెట్టాడు. ఆయన్ను ఢీకొట్టడంతో బానైట్పై పడ్డాడు. కారు ఆపకుండా రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సత్యనారాయణను రిమాండ్కు తరలించారు. మొయినాబాద్: బంధువుల రిసెప్షన్కు వెళ్లి తిరిగి వచ్చి ఇంట్లో పడుకున్న యువతి తెల్లవారే సరికి కనిపించకుండా పోయింది. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని అజీజ్నగర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. అజీజ్నగర్కు చెందిన డప్పు చంద్రయ్య కుటుంబం ఆదివారం రాత్రి బంధువుల రిసెప్షన్కు వెళ్లి అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికి చేరుకున్నారు. సోమవారం ఉదయం 6 గంటలకు చంద్రయ్య నిద్ర లేచి చూడగా కూతురు చందన(19) కనిపించలేదు. పరిసర ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో మొయినాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఇది చరిత్రాత్మక గెలుపు
● సంక్షేమ పథకాలే పార్టీకి అండ ● బీజేపీ నాయకులు ● కమలనాథుల విజయోత్సవంఅనంతగిరి: పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపు చరిత్రాత్మకమని, ఇదీ ప్రజాస్వామ్య విజయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాధవరెడ్డి, శివరాజు అన్నారు. సోమవారం వికారాబాద్లో బాణసంచాలు కాల్చి సంబురాలు చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో ప్రజలు పార్టీకి బ్రహ్మరథం పట్టారని తెలిపారు. దేశంలో మోదీ గాలి వీస్తుందన్నారు.కేంద్రం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలే పార్టీకి అండగా నిలిచాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ ఇన్చార్జీ శ్రీధర్రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అనిల్యాదవ్, ముఖ్య నాయకులు నందు, నరోత్తంరెడ్డి, యాస్కి మల్లికార్జున్, సాయిచరణ్రెడ్డి శ్రీనివాస్గౌడ్, రాములు, రమేష్ పాల్గొన్నారు. మోదీకి బ్రహ్మరథం కుల్కచర్ల: దేశం మొత్తం ప్రధాని మోదీ నాయకత్వం కోరుకుంటుందని బీజేపీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదరావు అన్నారు. అందుకు నిదర్శనం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో ప్రజలు పార్టీకి బ్రహ్మరథం పట్టమేనని పేర్కొన్నారు. సోమవారం ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. అవినీతి, మతమార్పిడి, హిందువులపై దాడులు ఇలా ఎన్నో అరాచకాలకు కేంద్రంగా మారిన పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో పార్టీ అధికారంలోని రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీమండల అధ్యక్షుడు వెంకటయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ హరికృష్ణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు అంజిలయ్య, మైపాల్, సర్పంచ్ అంజిలయ్య, ఉప సర్పంచ్ విజయకుమార్, శంకర్, హన్మంతు, రాంచంద్రయ్య పాల్గొన్నారు. మూడు రాష్ట్రాల్లో విజయం మర్పల్లి: ఇటీవల నిర్వహించిన 5 రాష్ట్రాల శాసన సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ ఘన విజయం సాధించిందని పార్టీ మండల నాయకులు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం కమలనాథులు సంబురాలు చేసుకున్నారు. పార్టీ కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ తీశారు. బాణసంచాలు కాల్చారు. మిఠాయి పంపిణీ చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు రామేశ్వర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి శ్రీమంత్కుమార్, జిల్లా నాయకులు లక్ష్మణ్, బలరాంగౌడ్, నాగయ్య, మండల నాయకులు శివకుమార్, శేఖర్ తదితరులు ఉన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
షాద్నగర్రూరల్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టిందని ఆర్డీఓ ఆర్ఎన్ సరిత అన్నారు. మండల పరిధిలోని లింగారెడ్డిగూడ సమీపంలోని ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గతంలో తమ సమస్యలను విన్నవించేందుకు ప్రజలు కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి వెళ్లాల్సివచ్చేదని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం డివిజన్ పరిధిలోని ఆర్డీఓ కార్యాలయాల్లోనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. డివిజన్ స్థాయిలోని అన్నిశాఖల అధికారులు అందుబాటులో ఉంటారని, ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, విజ్ఞప్తులు, దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తారని చెప్పారు. కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, హౌసింగ్ డీఈ సురేష్, ఆర్అండ్బీ ఏఈ రాజశేఖర్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికే ప్రజావాణి చేవెళ్ల: ప్రజా సమస్యల పరిష్కారంకోసమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని చేవెళ్ల ఆర్డీఓ పార్థసింహారెడ్డి అన్నారు. చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని చెప్పారు. అర్జీలను పరిశీలించి ఆయా శాఖల ద్వారా తక్షణమే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ ప్రజావాణిలో ఏడు ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఇందులో హౌసింగ్ శాఖకు సంబంధించి 4, పెన్షన్ కోసం 1, ఎస్సీ కార్పొరేషన్ రుణాలకోసం 2 అర్జీలు వచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో అన్నిశాఖలకు సంబంధించి అధికారులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు ఇబ్రహీంపట్నం: డివిజన్ స్థాయి ప్రజావాణిని సోమవారం ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో ఆర్డీవో అనంతరెడ్డి నిర్వహించారు. రాష్ట్ర ప్రజావాణి కో–ఆర్డినేటర్ రాకేష్రెడ్డి సందర్శించి పిటిషనర్లకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రతి దరఖాస్తును ఆన్లైన్లో పొందుపరిచి, ఆయా శాఖల అధికారులకు పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భూ భారతికి సంబంధించి 27, ఇందిరమ్మ ఇళ్లకు 4, ఇనామ్ భూములకు 4, సదాబైనామ 3, విద్యుత్ శాఖకు సంబంధించి 3 దరఖాస్తులు వచ్చినట్లు ఆర్డీవో అనంతరెడ్డి వెల్లడించారు. కార్యక్రమానికి విద్యుత్ శాఖ డీఈఈ నరేష్కుమార్, డీఎల్పీఓ సాధన, సీడీపీఓ వినీత, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. -
హిందువులంతా సంఘటితమవ్వాలి
కుల్కచర్ల: హిందూ సంస్కృతి, సాంప్రదాయాన్ని మనమే కాపాడుకోవాలని వక్తలు ప్రథమేశానంద, యాదగిరి, హైందవి అన్నారు. శనివారం రాత్రి కుల్కచర్ల మండల కేంద్రంలో హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... హిందూమత రక్షణ మనందరి భాధ్యత అన్నారు. అన్యమతస్తులు లౌకికవాదమంటూ హిందూమతాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. హిందువులపై జరుగుతున్న దాడులను హిందువులు సైతం మన దగ్గర కాదులే, మనకు ఎందుకులే అనే విధానం అవలంబించడంతో ఐక్యత దెబ్బతిన దాడులు పెరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన నిర్వహణ కమిటీ, ఆర్ఎస్ఎస్ సంఘ నాయకులు, ఆయా పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఖార్ఖానా కుంటను కాపాడండి
హయత్నగర్: హైడ్రా అధికారులు అధికార పార్టీ ఎమ్మెల్యే మెప్పు కోసం పనిచేస్తూ కాలనీ ప్రహరీని కూల్చి వేస్తారా అంటూ ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మండిపడ్డారు. నాగోల్ సర్కిల్ పెద్దఅంబర్పేట్ డివిజన్ కుంట్లూర్ పరిధిలోని ప్రజయ్ గుల్మోర్ కాలనీ ప్రహరీని హైడ్రా అధికారులు ఇటీవల కూల్చివేశారు. కూల్చి వేసిన ప్రహరీని ఆదివారం మంచిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏడున్నర ఎకరాల్లో పక్కనే ఉన్న ఖార్ఖానా కుంట చెరువు కబ్జాకు గురై రెండు ఎకరాలు మాత్రమే మిగిలిందని అన్నారు. దానిని కాపాడలేని హైడ్రా అధికారులు ప్రహరీని కూల్చడం ఏమిటని ప్రశ్నించారు. హైడ్రా పద్ధతి మార్చుకోకపోతే తగిన విధంగా స్పందిస్తా మని హెచ్చరించారు. కార్యక్రమంలో కాలనీ నాయకులు కృపాసాగర్, శివరామకృష్ణ పాల్గొన్నారు. -
లక్కీడ్రాపై దుమారం
తాండూరు రూరల్: పట్టణంలో ఆదివారం ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి నిర్వహించిన లక్కీ డ్రా రాజకీయ దుమారం రేపింది. పట్టణంలోని జీఎంకే ట్రస్ట్ కార్యాలయంలో చైర్మన్ ముజీబ్ఖాన్ ఆధ్వర్యంలో 200 మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు లక్కీ డ్రా తీసారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ నీరజాబాల్రెడ్డి, వైస్ చైర్మన్ రజాక్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే మనోహర్రెడ్డి జీఎంకే ట్రస్ట్ ఆధ్వర్యంలో 200 మంది పేద మైనార్టీలకు ఇళ్లు ఇస్తామని చెప్పారని ట్రస్ట్ ప్రతినిధులు గుర్తు చేశారు. ఒకే వర్గానికి 200 ఇళ్లు ఎలా కేటాయిస్తారంటూ బీజేపీ కౌన్సిలర్ కిరణ్ మండిపడ్డాడు. ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్తో పాటు అధికారులు ఎవరూ లేకుండా డ్రా ఎలా నిర్వహిస్తారని బీఆర్ఎస్ కౌన్సిలర్ ఇర్షాద్ ప్రశ్నించారు. తాండూరులో 25 వేల మంది మైనార్టీలు ఉన్నారని.. 200 ఇళ్లు ఇస్తే ఎలా అని నిరుపేదలందరికీ ఇళ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు పత్రికా ప్రకటనలు విడుదల చేశారు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఇందిరమ్మ ఇళ్ల పంచాయతీ నెలకొంది. అయితే జీఎంకే ట్రస్ట్ ద్వారా లబ్ధిదారులను గుర్తించలేదని.. కేవలం దరఖాస్తులు స్వీకరించామని మున్సిపల్ చైర్పర్సన్ నీరజాబాల్ రెడ్డి పత్రిక ప్రకటనలో విడుదల చేశారు. ప్రతిపక్షాలు ఓర్వలేక అధికార కాంగ్రెస్, ఎమ్మెల్యేపై దుష్ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు హాబీబ్ లాల, జిల్లా అధికార ప్రతినిధి న్యాయవాది గోపాల్ మండిపడ్డారు. కాగా ఎమ్మెల్యే స్పందన కోసం మున్సిపల్ వాసులు వేచి చేస్తున్నారు. ఎమ్మెల్యే, అధికారులు లేకుండా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జీఎంకే ట్రస్ట్ ఆధ్వర్యంలో డ్రా నిర్వహించడంపై బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్ల ఆగ్రహం దరఖాస్తులు మాత్రమే స్వీకరించామని చెబుతున్న అధికార కాంగ్రెస్ నేతలు -
శతం.. గురుకులం సొంతం
కొడంగల్ రూరల్: పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో సర్కారు పాఠశాలలు, గురుకులాల విద్యార్థులు అత్యున్నత ప్రతిభ చూపారు. చాలా బడుల్లో నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు. పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల చిన్నారులు శతశాతంతో ప్రభంజనం సృష్టించారు. బీసీ గురుకుల ప్రిన్స్పాల్ కె.నగేష్, సాంఘిక సంక్షేమ గురుకుల ప్రిన్సిపాల్ బి.రామదాసు, ఉపాధ్యాయ సిబ్బంది సమష్టి కృషి, విద్యార్థుల పట్టుదల ఇందుకునిదర్శనమని పిల్లల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెన్నుతట్టి.. ప్రోత్సహించి బోధన సిబ్బంది.. ప్రతి నెల సమావేశాలు నిర్వహిస్తూ, విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలిస్తూ ప్రోత్సహించారు. వెనకబడిన వారిని వెన్నుతట్టారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి, సందేహాలను నివృత్తి చేస్తూ మెరికలుగా తీర్చిదిద్దారు. బీసీ గురుకులంలో 68 మందికి 68 మంది, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో 65 మందికి 65 మంది ఉత్తమ మార్కులతో వంద శాతం పాసయ్యారు. పాఠశాలలో 500లకు పైగా మార్కులను 16 మంది విద్యార్థులు సాధించారు. సోలోమన్ 540, పి.సన్ని 537, భవాని ప్రసాద్, వరుణ్ సందేష్లు 533 మార్కులు సాధించారని ప్రిన్సిపాల్ బి.రామదాసు తెలిపారు. పది ఫలితాల్లో ప్రభంజనం తోడ్పడిన ప్రత్యేక తరగతులు హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు పదో తరగతి పరీక్షల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక తరగతులు ఎంతగానో తోడ్పడ్డాయి. ఉపాధ్యాయులు వెన్నంటి ఉంటూ.. ప్రోత్సహించారు. సందేహాలను నివృత్తి చేస్తూ భయాందోళన చెందకుండా చేశారు. ఆందోళన చెందకుండా 540 మార్కులు సాధించాను. – సోలోమన్, సాంఘిక సంక్షేమ గురుకులం, కొడంగల్సమష్టి కృషితో సాధ్యం ఉపాధ్యాయుల సమష్టి కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ప్రత్యేక తరగతు లు నిర్వహిస్తూ.. వెనకబడిన వారికి సబ్జెక్టుపై అవగాహన కల్పించాం. వారితో మమేకమై ఆందోళన చెందకుండా చేశాం. పట్టుదలతో చిన్నారులు అత్యుత్తమ ప్రతిభ చూపారు. – బి.రామదాసు, సాంఘిక సంక్షేమ గురుకుల, ప్రిన్సిపాల్, కొడంగల్ -
నూతన వధూవరులకు ‘పట్నం’ ఆశీర్వాదం
తాండూరు రూరల్: మండలి చీఫ్ విప్ ఆదివారంలో తాండూరు పట్టణంలో పర్యటించారు. పట్టణంలో పలు వివాహా వేడుకలు, శుభకార్యాల్లో ఆయన పాల్గొన్నారు. అంతారం గ్రామానికి చెందిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్ కుమార్తె వివాహం పట్టణంలోని వినాయక ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. హాజరైన పట్నం మహేందర్రెడ్డి నూతన దంపతులను ఆశీర్వదించారు. దుద్యాల్: ప్రమాదవశాత్తు పశువుల పాక దగ్ధం అయింది. ఈ సంఘటన మండల పరిధి పోలేపల్ల అనుబంధ గ్రామమైన పల్లెగడ్డలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తడకలి కృష్ణయ్య ఎప్పటిలాగే తన పొలం వద్ద ఉన్న షెడ్డులో రెండు ఆవులు, రెండు దూడలను కట్టేశాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సుమారు 7 గంటలకు పాకలో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన సమీప రైతులు.. వెంటనే పాకలోని ఆవులు, దూడలను కాపాడారు. కానీ అప్పటికే వాటికి స్వల్పంగా కాలిన గాయాలు అయ్యాయి. అనంతరం 25 కిలో మీటర్ల దూరంలోని కొడంగల్ ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వగా.. సిబ్బంది వచ్చేలోగా కొట్టం కాలి బూడిదయింది. సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కృష్ణయ్య కోరారు. కాగా.. పాక ప్రమాదవశాత్తు తగల బడిందా, లేక ఎవరైనా నిప్పు పెట్టారా అని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. విజయనగర్కాలనీ: ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం ఆసిఫ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఎస్సై దయానంద్ తెలిపిన వివరాల ప్రకారం..... ఆసిఫ్నగర్ శ్యామ్నగర్ నమ్మక్ కార్ఖానా వద్ద శ్రీను (45) తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఈనెల 1న అర్ధరాత్రి మద్యం సేవించి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. అందరూ నిద్రిస్తుండగా మద్యం మత్తులో ఉన్న అతడు నీటి సంపు వద్దకు వచ్చి నీటిని తోడుతుండగా ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అంబులెన్స్కు ఫోన్ చేశారు. వారు వచ్చి పరీక్షించగా మృతి చెందినట్లు నిర్ధాంచారు. సమాచారం అందుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హయత్నగర్: ముందుగా వెళ్తున్న వాహనాలు సడెన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న మూడు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటన ఆదివారం హయత్నగర్లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... హయత్నగర్ బస్టాండ్ వద్ద ముందుగా వెళ్తున్న ఓ కారు డ్రైవర్ సడెన్ బ్రేకు వేశాడు. దాని వెనుకనే ఉన్న పల్లె వెలుగు బస్సు డ్రైవర్ కూడా సడెన్ బ్రేక్ వేశాడు. ఆ బస్సు వెనుకనే ఉన్న ఎలక్ట్రిక్ బస్సు పల్లె వెలుగు బస్సును ఢీ కొట్టింది. ఆ బస్సును దాని వెనకున్న మరో ఎలక్ట్రిక్ బస్సును ఢీ కొట్టింది. ఈ ఆ బస్సుల్లోని పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. బస్సుల వేగం తక్కువగా ఉండడంతో పె ద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. గన్ఫౌండ్రీ: ఏఐసీసీ అగ్ర నాయకుడు, కాంగ్రెస్ ప్రతిపక్ష నేత ఎంపీ రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దూరదర్శన్ యాంకర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో ఢిల్లీకి చెందిన దూరదర్శన్ యాంకర్ అశోక్ ఇటీవల రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. యూత్ కాంగ్రెస్ నాయకుడు నిఖిల్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పది రోజుల క్రితమే బేగంబజార్ పోలీసులు యాంకర్పై కేసు నమోదు చేసి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని... అవసరమైతే అశోక్ను తీసుకురావడానికి ఒక స్పెషల్ టీమ్ను ఏర్పాటు చేస్తామని ఆదివారం ఇన్స్పెక్టర్ భరత్కుమార్ తెలిపారు. -
డ్రంకెన్ డ్రైవ్తో ప్రమాదం
ధారూరు: మద్యం మత్తులో కారు నడిపి ప్రమాదానికి కారణమైన నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాఘవేందర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలు.. శనివారం రాత్రి రుద్రారం గ్రామానికి చెందిన బంటు వెంకటయ్య, అతని బావ పాండుతో కలిసి వికారాబాద్కు వెళ్లి స్వగ్రామానికి వస్తున్నారు. ధారూరు సమీప ట్రాక్టర్ గ్యారేజీ సమీపంలో వీరి బైక్ను కారు ఢీకొట్టింది. కారు డ్రైవింగ్ చేస్తున్న పెద్దెముల్ గ్రామానికి చెందిన ద్యావరి జయవర్దన్రెడ్డి మద్యం మత్తులో బైక్ను ఢీకొట్టి పక్కనే ఉన్న గుంతలోకి ఈడ్చుకెళ్లాడు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు. క్షతగాత్రుడి తండ్రి బంటు కిష్టయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్పై కేసు -
ఇళ్ల కేటాయింపా..?
అధికారులు లేకుండా తాండూరు రూరల్: ప్రభుత్వం కట్టించిన ఇళ్లను ప్రైవేట్ వ్యక్తులతో డ్రా తీయంచడం సరికాదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో ఆదివారం ఇందిరమ్మ ఇళ్ల పేరిట జీఎంకే ట్రస్ట్ ఆధ్వర్యంలో డ్రా ఎందుకు తీశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వారు డ్రా తీస్తే మున్సిపల్ చైర్పర్సన్తో పాటు కౌన్సిలర్లు వెళ్లి చప్పట్లు కొట్టడం హాస్యాస్పదమని మండిపడ్డారు. కార్యక్రమం బ్యానర్లో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ అని ఉందని.. తాండూరు మున్సిపాలిటీలో ఒక్క ఇందిరమ్మ ఇళ్లు కూడా నిర్మించలేదన్నారు. అవన్నీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ఇళ్లే అని చెప్పారు. అధికారులు లేకుండా ఆదివారం 200 మందికి ఇళ్లు కేటాయిస్తామని చెప్పి డ్రా ఎలా తీశారని మండిపడ్డారు. పేద మైనార్టీలకు ఇళ్లు ఇవ్వడం సంతోషమే.. కానీ తాండూరులో 25 వేల మంది మైనార్టీలు ఉన్నారని వారిలో 200 మంది పేదలు ఉన్నారా..? అని ప్రశ్నించారు. మైనార్టీలతో పాటు అన్ని వర్గాల వారికి ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కల్యాణలక్ష్మీ, షాదీమూబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇక నుంచి జీఎంకే ట్రస్ట్ నుంచి ఇస్తారా అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. వికారాబాద్లోని అనంతగిరి హిల్స్ని సైతం ప్రభుత్వం మెగా కృష్షారెడ్డికి దారదత్తం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని మండిపడ్డారు. జీఎంకే ట్రస్ట్తో ఎమ్మెల్యేకు ఏం సంబంధం: రాజుగౌడ్ తాండూరులో పేదలకు ఇళ్లు ఇవ్వాలంటే స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ డ్రా తీయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. ఆదివారం జీఎంకే ట్రస్ట్ ద్వారా 200 మందికి ఇళ్లు కేటాయిస్తాన్నట్లు డ్రా తీయడం సరికాదన్నారు. జీఎంకే ట్రస్ట్కు ఎమ్మెల్యే మనోహార్రెడ్డికి ఏం సంబంధం ఉందో ప్రజలకు చెప్పాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో ఎమ్మెల్యేకు ఎంత వాటా ఉందో చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో యాలాల, తాండూరు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రవీందర్రెడ్డి, వీరేంధర్రెడ్డి, నాయకులు శ్రీనివాస్ చారి, సిద్రాల శ్రీనివాస్, ఆసిఫ్, నరేందర్గౌడ్, కౌన్సిలర్లు జావిద్, సుప్రీత, నాగలక్ష్మీ, నవీన సంతోశ్గౌడ్, సురేశ్ నాయక్, అనిల్, యోగానంద్ పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలకు ప్రైవేట్ వ్యక్తులు డ్రా తీయడం సరికాదు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చి.. ఇందిరమ్మ ఇళ్లు అని చెప్పుకోవడం హాస్యాస్పదం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ -
ఇద్దరు బైక్ దొంగల అరెస్ట్
మొయినాబాద్రూరల్: ద్విచక్రవాహనాల దొంగలను అరెస్టు చేసి కటకటాల పాలు చేసిన ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గత నెలలో జరిగిన చోరీ కేసుల విషయంలో నిందితులను స్థానిక పోలీసులు గాలిస్తుండగా ఆదివారం మొయినాబాద్–సురంగల్ బైపాస్ వద్ద ఇద్దరు అనుమానితులను గుర్తించారు. నంబర్ ప్లేట్ లేని వాహనంపై మహబూబ్నగర్ జిల్లా గండేడు మండలం గోవింద్పల్లికి చెందిన రామకృష్ణ, అదే మండలానికి చెందిన విజయ్కుమార్ సంచరిస్తుండగా అదుపులోకి తీసుకొని విచారించారు. గతంలో ద్విచక్రవాహనాలను చోరీ చేసినట్లు నిందితులు అంగీకరించారు. మొయినాబాద్లో నాలుగు, చేవెళ్ల, కూకట్పల్లిలో ఒకటి చొప్పున బైక్లు అపహరించినట్లు చెప్పారు. ఈ మేరకు ఆరు బైక్లతో పాటు నిందితులను అరెస్టు చేసి రాజేంద్రనగర్ కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు మొయినాబాద్ సీఐ మల్లికార్జున్రెడ్డి, క్రైం సీఐ ఉపేందర్, డీఎస్ఐ సుభాష్లను ఉన్నతాధికారులు అభినందించారు. -
ఇరువర్గాల ఘర్షణ.. అంబులెన్స్పై దాడి
కుల్కచర్ల: ఇరువర్గాల గొడవలో అంబులెన్స్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. వైద్య సిబ్బంది, పోలీసులు తెలిపిన ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన శంకర్నాయక్, నారాయణ కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో శంకర్నాయక్ కుటుంబీకులు 108కి ఫోన్ చేసి తాము గాయపడ్డామని చెప్పడంతో అంబులెన్స్ వచ్చి వారిని కుల్కచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. ఈ క్రమంలో నారాయణ కుటుంబీకులు అంబులెన్స్ రాకముందే ఆస్పత్రికి చేరుకుని శంకర్ నాయక్ కుటుంబీకులపై దాడికి ప్రయత్నించారు. దీంతో వారు వాహనంలో ఉండిపోయారు. ఇది గమనించిన నారయణ కుటుంబీకులు ఇటుకలతో అంబులెన్స్పై దాడి చేయడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. అంబులెన్స్పై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమేశ్ తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు -
నేడు మరో భూ సర్వే
దుద్యాల్: గ్రామ శివారు 363 సర్వే నంబర్లో 85 మంది రైతులకు సంబంధించి 144 ఎకరాల అసైన్డ్ భూములకు అధికారులు సోమవారం ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించనున్నట్లు తహసీల్దార్ కిషన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. దుద్యాల్ శివారులోని నెమళ్ల కుచ్చ అనే ప్రాంతంలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు 2025 డిసెంబర్లో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల ఆ భూములకు సంబంధించిన రైతుల అభిప్రాయాలు సేకరించామన్నారు. వారు భూములిచ్చేందుకు అంగీకారం తెలపడంతో ప్రభుత్వం ఎంజాయ్మెంట్ సర్వే చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. సర్వేయర్ మహేశ్ ఈ ప్రక్రియ చేపట్టన్నుట్లు తెలిపారు. భూములు కోల్పోతున్న రైతులు అందరు కాస్తులో ఉన్న భూముల దగ్గర ఉండి సర్వే చేయించుకోవాలని సూచించారు. భూములు ఇవ్వడానికి వెనకాడని రైతులు తాండూర్ ఆర్డీఓ అనిత, తహసీల్దార్ కిషన్ భూములు కోల్పోతున్న 85 మంది రైతులతో ఏప్రిల్ 10న అభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన రైతులు భూములు ఇవ్వడానికి అంగీకారం తెలిపారు. కానీ కాస్తులో ఎక్కువ ఉండి రికార్డుల్లో తక్కువ ఉందని, రికార్డులో ఎక్కువ ఉండి కాస్తులో తక్కువ ఉన్న రైతులు చాలా మంది ఉన్నారని చెప్పారు. పరిహారం అందజేతకు ముందే వాటిని సరి చేయాలని వేడుకున్నారు. అందుకు అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణలో అంగీకారం తెలిపిన రైతులు 144 ఎకరాల అసైన్డ్ భూముల అనుభవదారుల గుర్తింపునకు ఎంజాయ్మెంట్ సర్వే -
ఇదిగో పరిష్కార వేదిక
షాద్నగర్: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టింది. సమస్యలను విన్నవించేందుకు అధికారుల వద్దకు వెళ్లాలంటే సుదూర ప్రాంతాలకు చెందిన వారు ఎన్నో వ్యయప్రయాసలకు గురి కావాల్సి వస్తోంది. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లోనూ ప్రజావాణి నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు జీఓ ఎంఎస్ నంబర్ 3 జారీ చేసింది. ఈ నెల 4 నుంచి ప్రతి సోమవారం ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించనున్నారు. రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో .. ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పకడ్బందీగా అమలు చేయడంలో భాగంగా ప్రజావాణి సేవలను క్షేత్ర స్థాయికి విస్తరించాలని సీఎం రేవంత్రెడ్డి నిర్ణయించారు. ఇప్పటి వరకు ప్రజావాణి కార్యక్రమం జిల్లా స్థాయిలో కలెక్టర్, రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో కొనసాగుతోంది. సర్కార్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో జిల్లా పరిధిలోని చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, కందుకూరు, రాజేంద్రనగర్, షాద్నగర్ రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో సోమవారం నుంచి ప్రజావాణి ప్రారంభం కానుంది. నోడల్ అధికారిగా ఆర్డీఓ జిల్లా స్థాయిలో నిర్వహించే కార్యక్రమానికి కలెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. కార్యక్రమాన్ని ప్రతి సోమవారం నిర్వహిస్తున్నారు. కలెక్టర్తో పాటుగా జిల్లా స్థాయి అధికారులు కూడా పాల్గొంటున్నారు. ఆయా ఫిర్యాదులను శాఖల వారీగా విభజిస్తూ పరిష్కారానికి పంపిస్తుంటారు. రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ నోడల్ అధికారిగా వ్యవహరించనున్నారు. హాజరు కానున్న డివిజన్ అధికారులు ప్రజావాణికి డివిజన్ పరిధిలోని ఆయా శాఖల అధికారులు హాజరుకానున్నారు. డివిజన్ స్థాయి వైద్యాధికారి, పంచాయతీ, వ్యవసాయ విస్తరణ, గృహ నిర్మాణ, ఆర్అండ్బీ, విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్, మంచినీటి శాఖలతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు కార్యక్రమానికి హాజరవుతారు. వీరు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, విజ్ఞప్తులు, దరఖాస్తులను స్వీకరించి 30 రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు. లేదంటే తిరస్కరణ, పెండింగ్కు సంబంధించిన స్పష్టతను తప్పనిసరి దరఖాస్తుదారుడికి ఇవ్వాల్సి ఉంటుంది. స్వీకరించిన దరఖాస్తులను ప్రజావాణి పోర్టల్ నమోదు చేసి దరఖాస్తుదారుకు రసీదు అందజేస్తారు. దరఖాస్తుకు సంబంధించిన పరిస్థితిని ప్రజావాణి పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రజావాణి కార్యక్రమాన్ని ఆర్డీఓ కార్యాలయాల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలు తమ సమస్యలను లిఖిత పూర్వకంగా అందజేయొచ్చు. సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు చేపడతాం. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – సరిత, ఆర్డీఓ, షాద్నగర్ ఇబ్రహీంపట్నం రూరల్: ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు ప్రజావాణి నిర్వహిస్తున్నట్టు ఆర్డీఓ అనంతరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్యక్రమానికి డివిజన్ స్థాయి అధికారులు డీఎల్పీఓ, డిప్యూటీ డీఎంహెచ్ఓ, ఏడీఏ, డీఈఈ (ఆర్అండ్బీ), డీఈఈ (ఆర్డబ్ల్యూఎస్), సీడీపీఓ, ఏఎస్సీడీఓ, ఏటీడీఓ, ఏబీసీడీఓ, ఏఎండబ్ల్యూఓ, ఇతర శాఖల అధికారులు హాజరవుతారని తెలిపారు. ప్రజలు ఇచ్చే అర్జీలు స్వీకరించి తక్షణం పరిష్కారం చూపుతారని చెప్పారు. అధికారులు హాజరయ్యే కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరింత చేరువగా ప్రజావాణి నేటినుంచి డివిజన్ కేంద్రాల్లో కార్యక్రమం ప్రతి సోమవారం ఆర్డీఓకార్యాలయాల్లో నిర్వహణ క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారం -
మూగజీవాలు తరలిస్తున్న ముఠా అరెస్ట్
బొంరాస్పేట: కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని జాతీయ రహదారిపై కొంత కాలంగా మూగజీవాల తరలింపు, అక్రమ రవాణా చేస్తున్న ముఠాపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. వికారాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట, కర్ణాటక రాష్ట్రం సేడం తదితర ప్రాంతాల నుంచి మేకలు, గొర్రెలను అపహరించి ఆయా పట్టణాలకు తరలించే అక్రమాలపై పోలీసులు నిఘా పెట్టారు. ఆదివారం తెల్లవారుజామున బొంరాస్పేట చెరువు వద్ద ఎర్టిగా కారు నిలిపి ఉండడంతో మఫ్టీలో ఉన్న పోలీసులు అనుమాతంతో ఆరా తీశారు. వాహనంలో ఉన్న సంజయ్కుమార్, జగత్పాల్, రోషన్, టైగర్ను అరెస్టు చేసి విచారించగా వారు నేరం అంగీకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
గృహిణి అదృశ్యం
పహాడీషరీఫ్: గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్ప్రదేశ్కు చెందిన రామ్ కరణ్ రెండు నెలల క్రితం తన భార్య రాధ(20), కుమార్తె నైనాతో కలిసి జల్పల్లి ఆర్.ఆర్.ఫాం హౌస్ ఎదురుగా ఉన్న ఓంకార్ పశువుల దాణా కంపెనీలో కార్మికుడిగా చేరి, అక్కడే నివాసం ఉంటున్నారు. ఈ నెల 1న పని మీద బయటికి వెళ్లిన రామ్ కరణ్ మధ్యాహ్నం వచ్చి చూడగా కుమార్తె ఏడుస్తూ కనిపించింది. భార్య కోసం స్థానికంగా గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డీసీఎం ఢీకొని యువకుడి దుర్మరణం షాబాద్: డీసీఎం ఢీకొని యువకుడు దుర్మరణం చెందిన సంఘటన ఆదివారం షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లారెడ్డిగూడ స్టేజీ వద్ద చోటు చేసుకుంది. ఎస్ఐ సతీష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం రాష్ట్రానికి చెందిన మనీష్దాస్(22) మల్లారెడ్డిగూడ స్టేజీ సమీపంలో అద్దె గదిలో ఉంటూ సీతారాంపూర్ సమీపంలోని సోలార్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం సెలవు ఉండడంతో మధ్యాహ్నం స్థానికంగా కూరగాయలు తీసుకొని రోడ్డు దాటుతుండగా చేవెళ్ల వైపు నుంచి అతివేగంగా వచ్చిన డీసీఎం అతన్ని ఢీకొట్టింది. దీంతో అక్కడిక్కడే మృతి చెందాడు. డీసీఎం డ్రైవర్ ఆపకుండా వెళ్తుండగా షాబాద్ పోలీసులు సర్ధార్నగర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. మృతుడి అన్న ఆకాశ దాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
హరిత రిసార్ట్కు వ్యవసాయ శాఖ ప్రొడక్షన్ కమిషనర్
స్వాగతం పలికిన కలెక్టర్ దీపక్ తివారీ అనంతగిరి: తాండూర్లో నేడు మంత్రుల కార్యక్రమం నేపథ్యంలో వ్యవసాయ శాఖ ప్రొడక్షన్ కమిషనర్ సురేంద్ర మోహన్ ఆదివారం సాయంత్రం అనంతగిరి హరిత రిసార్ట్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ ఆయనకు మొక్క అందజేసి స్వాగతం పలికారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అంజిరెడ్డి అనంతగిరి: ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభను జయప్రదం చేద్దామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్లో బీజేపీ జిల్లా ముఖ్య నాయకులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 10న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జరిగే ప్రధాని సభకు పార్టీ శ్రేణులు, అభిమానులు తరలిరావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం మాట్లాడుతూ.. మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టాక మొదటి సారిగా నగరానికి వస్తున్నారని తెలిపారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ 3– 4 రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయిందని ఆరోపించారు. కేంద్రం నిధులతోనే గ్రామాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయన్నారు. ప్రజలు మోదీ సుపరిపాలనను స్వాగతిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజు, మాధవరెడ్డి, అసెంబ్లీ కోఆర్డినేటర్ వడ్ల నందు, సీనియర్ నాయకులు శ్రీధర్రెడ్డి, పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అనిల్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు ధారూరు: నలుగురు వ్యక్తులు నన్ను చంపేందుకు యత్నిస్తున్నారని ఓ మహిళ.. ఎస్పీ స్నేహమెహ్రని ఆశ్రయించింది. వివరాలు.. మండల పరిధిలోని నాగారం గ్రామానికి చెందిన రాణెమ్మ భర్త 22 ఏళ్ల క్రితం మృతి చెందగా ఆమె గ్రామానికి చెందిన నంచర్ల మల్రెడ్డితో సహజీవనం చేస్తోంది. రెండేళ్ల క్రితం మల్రెడ్డి తన కొడుకుతో గొడవపడి హత్య చేసాడని ఫిర్యాదులో పేర్కొంది. మల్రెడ్డి వేధింపుల కారణంగా గ్రామంలో పంచాయితీ పెట్టించానని, గ్రామపెద్దలు సర్దిచెప్పినా ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదని వాపోయింది. ఏడాది మార్చి 29న పరిగి రోడ్డులో, ఏప్రిల్ 25న వికారాబాద్లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద మల్రెడ్డితో పాటు దస్తగీర్, సాయిరెడ్డి, కృష్ణారెడ్డి తనపై దాడికి పాల్పడ్డారని చెప్పింది. గొంతునులిమి చంపేందుకు యత్నించడంతో స్థానికులు రక్షించారని పేర్కొంది. అసభ్యపదజాలతో దూషిస్తూ తనను హత్య చేసేందుకు యత్నిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కల్నల్ శ్రీనివాస్ మొయినాబాద్: దేశ రక్షణకోసం అసువులుబాసిన వీర సైనికుల త్యాగాలు మరువలేనివని కల్నల్ శ్రీనివాస్ అన్నారు. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్లో వచ్చే నవంబర్లో జరగనున్న 201 మద్రాసు ఇంజనీరింగ్ రెజిమెంట్ డైమండ్ జూబ్లీ ఉత్సవాల సన్నాహక సమావేశం ఆదివారం మున్సిపల్ పరిధిలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. 1971లో ఇండియా–పాకిస్తాన్ యుద్ధ సమయంలో తాను కమాండింగ్ ఆఫీసర్గా స్వయంగా పాల్గొన్న సందర్భాన్ని గుర్తుచేశారు. సైనికులు, మాజీ సైనికులు రెజిమెంట్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వీర మరణం పొందిన సైనిక కుటుంబాలను సత్కరించారు. కార్యక్రమంలో మాజీ సైనికులు పాల్గొన్నారు. -
నీట్.. కంప్లీట్
కనీస సౌకర్యాలు కరువు వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్ష ఆదివారం వికారాబాద్లో ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ఉండగా.. విద్యార్థులు ఉదయం 11గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమంతించారు. నాలుగు సెంటర్లలో 1,179 మంది విద్యార్థులకు గాను 1,148 మంది విద్యార్థులు హాజరవ్వగా 31మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ సందర్శించారు. – అనంతగిరిఇంధన కొరత పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదని ప్రభుత్వాలు చెబుతున్నా.. ఇరాన్, ఇజ్రాయెల్–అమెరికా మధ్య యుద్ధం కారణంగా ఇంధన దిగుమతులకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో వినియోగదారులు ఆందోళనతో పెట్రోల్ బంక్ల వద్ద క్యూకడుతున్నారు. నిల్వలు తక్కువగా ఉండడంతో కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. ● నేటికీ దర్శనమిస్తున్న నోస్టాక్ బోర్డులు ● ఆంక్షలు విధిస్తున్న బంకుల యాజమాన్యాలు ● పట్టించుకోని పౌరసరఫరాల శాఖ పెట్రోల్, డీజిల్, గ్యాస్ కోసం వినియోగదారుల ఇబ్బందులు -
కో ఆప్షన్ ఎన్నిక ఎప్పుడో!
చేవెళ్ల: మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికు నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్లు స్వీకరించినప్పటికీ సభ్యుల ఎన్నిక మాత్రం జరగడం లేదు. మైనార్టీ కోటా విషయంలో నేతల మధ్య ఏకాభిప్రాయం లేక వాయిదా పడుతూ వస్తోంది. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తరువాత నలుగురు కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు అన్ని మున్సిపాలిటీలకంటే ముందుగానే చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ మార్చి 10న నోటిఫికేషన్ జారీ చేసి నామిషన్లు సైతం స్వీకరించారు. మొత్తం నలుగురు సభ్యుల్లో ప్రత్యేక అనుభవం కలిగిన ఇద్దరు, అల్పసంఖ్యాక వర్గం (మైనార్టీ) నుంచి ఇద్దరిని ఎన్నుకోవాల్సి ఉంది. మొత్తం పది మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో ప్రత్యేక అనుభవం ఉన్న కోటా నుంచి ఒకటి జనరల్, ఒకటి మహిళకు కేటాయించాలని స్పష్టత ఉన్నా, మైనార్టీ కోటాలో ఉన్న రెండు స్థానాలకు సంబంధించి నామినేషన్లు ఎక్కువగా రావడంతో పోటీ ఏర్పడింది. మైనార్టీ నేతల పట్టు పార్టీ తరఫున ఎవరిని బలపరిచాలని, ఎవరికి మద్దతు తెలపాలనే దానిపై కౌన్సిలర్లకు పార్టీ పెద్దలు నిర్ణయం చెప్పకపోవడంతో వాయిదా వేశారు. మార్చి 30న తేదీని ఖరారు చేసినప్పటికీ పార్టీలో ఏకాభిప్రాయం లేకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. తదుపరి తేదీని ప్రకటిస్తామని చెప్పి నెలరోజులు దాటినా ఇప్పటికీ ఎలాంటి ప్రకటన లేదు. తాము పార్టీకోసం పనిచేశామని తమకే కేటాయించాలని మైనార్టీ నాయకులు పట్టుబడుతున్నారు. దీంతో ఒకరికి ఇస్తే మరొకరు పార్టీకి వ్యతిరేకంగా మారతారనే ఆలోచనతో నచ్చజెప్పేందుకు పెద్దలు యోచిస్తున్నట్టు సమాచారం. దీనిపై పార్టీ నాయకులు, ఎమ్మెల్యే కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ఎవరూ సమయం కేటాయించకపోవడంతో ఆలస్యం అవుతోంది. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ నామినేషన్ల స్వీకరణ పూర్తి నెలరోజులు దాటినాజరగని ఎన్నిక ప్రక్రియ మైనార్టీ కోటాలో కుదరని ఏకాభిప్రాయం పార్టీ పెద్దల నిర్ణయం కోసం ఎదురుచూపులు -
రెడ్డి భవన్ నిర్మాణానికి రూ.కోటి విరాళం
బడంగ్పేట్: బాలాపూర్కు చెందిన పీపీరెడ్డి గ్రూప్ ఆఫ్ చైర్మన్, యాదాద్రి రెడ్డి సంఘం అధ్యక్షుడు పన్నాల పర్వతాల్రెడ్డి రెడ్డి భవన్ నిర్మాణానికి రూ.కోటి విరాళాన్ని ప్రకటించి అందజేశారు. తిరుపతిలో నిర్మించే ఆంధ్రప్రదేశ్ ఇంటర్నేషనల్ రెడ్డి భవన్ నిర్మాణానికి భారీ విరాళం అందజేయడంపై రెడ్డి సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీపీరెడ్డిని శనివారం అభినందించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మురళీకృష్ణారెడ్డి, మల్రెడ్డి రాంరెడ్డి, వినయ్కుమార్రెడ్డి, నరోత్తంరెడ్డి, కొలన్ మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇద్దరికి గాయాలు పహాడీషరీఫ్: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘటన మరువక ముందే తుక్కుగూడ ఔటర్పై శనివారం ఉదయం మరో ప్రమాదం చోటుచేసుకుంది. పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ప్రమాదంలో ఒక మహిళతో పాటు మరో వ్యక్తి గాయపడ్డారు. ఇన్స్పెక్టర్ బి.లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నర్సింహ అనే వ్యక్తి ఐదుగురితో కలిసి కారులో (టీజీ 08 ఏఏ 4704) ఔటర్పై శంషాబాద్ నుంచి తుక్కుగూడ వైపు వస్తున్నాడు. ఉదయం 11.55 గంటల సమయంలో తుక్కుగూడ ఎగ్జిట్ నంబర్–14 సమీపంలో ముందు వెళ్తున్న వాహనం అకస్మాత్తుగా ఆపడంతో, డ్రైవర్ వాహనాన్ని నియంత్రించలేక డివైడర్ను ఢీ కొట్టడంతో కారు పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఒక మహిళతో పాటు మరొకరు గాయాలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందని కారణంగా ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలిపారు. ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజల దృష్టిని మళ్లించి దొంగతనాలకు పాల్పడుతున్న కరుడుగట్టిన నేరస్తుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. హైదరాబాద్లోని గుడిమల్కాపూర్కు చెందిన మహమ్మద్ షాబాజ్ అహ్మద్ అలియాస్ హైదర్ (26) ఏప్రిల్ 19న పాత సామాన్లు అమ్ముతాననే నేపంతో నాదర్గుల్లోని పాత ఇనుప సామాన్ల వ్యాపారం చేసే కుర్వ పద్మమ్మకు దగ్గరయ్యాడు. మెటీరియల్ తనిఖీ చేయాలని చెప్పి ఆమెను మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి దృష్టి మళ్లించాడు. ఆపై రహస్యంగా ఆమె ఇంటికి చేరుకొని, ఆమె చిన్నకుమారైను నమ్మించి ఇంట్లోకి ప్రవేశించి రూ.1.40 లక్షల నగదు, 50 తులాల వెండి పట్టీలతో పరారయ్యాడు. పద్మమ్మ ఆదిబట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ పుటేజ్, సాంకేతిక నిఘాను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నిందితుడిని గుర్తించి శనివారం షాబాజ్ అహ్మద్ను అరెస్టు చేశారు. అతని నుంచి రూ.50 వేల నగదు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. 2019 నుంచి వరుస నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఇతనిపై వివిధ పోలీస్స్టేషన్లలో 53 కేసులు ఉన్నట్లు గుర్తించారు. జైలుకు వెళ్లొచ్చి మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. కేసును ఛేదించిన క్రైం టీం ఎస్ఐ నోయల్రాజ్, సభ్యుల్ రవి, ఎల్లయ్య, కిరణ్, ఎండీ సంతోష్, సందీప్, శివ, సంతోష్ను సీఐ అభినందించారు. -
సమస్యల పరిష్కారానికే ప్రగతి ప్రణాళిక
కొడంగల్ రూరల్: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం ప్రగతి ప్రణాళిక నివేదిక నిర్వహిస్తోందని జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వరి అన్నారు. శనివారం పట్టణంలోని మురారి ఫంక్షన్ హాల్లో ఎంపీడీఓ ఉషశ్రీ అధ్యక్ష్యతన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో అమలు జరుగుతున్న తీరును తెలుసుకునేందుకు ప్రభుత్వం గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ప్రధానంగా విద్య, వైద్యం, అరైవ్–అలైవ్, వ్యవసాయం, తదితర అంశాలపై ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఆయా పథకాలలో పెండింగ్లో ఉన్న వాటిని సత్వరమే పరిష్కరించి పాలనలో పారదర్శకత పాటించేందుకు అన్ని శాఖల అధికారులు కృషిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆదర్శ నియోజకవర్గంగా కొడంగల్: కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలపేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి అన్నారు. గడిచిన రెండున్నరేళ్లలో రూ.4,500 కోట్ల నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని వివరించారు. పట్టణంలోని శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీ, అంగన్వాడీ కేంద్రాల సొంత భవనాల నిర్మాణానికి నిధులు వెచ్చించనున్నట్లు తెలిపారు. నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రూ.4,500కోట్ల నిధులు మంజూరైనట్లు చెప్పారు. అంతకుముందు వ్యవసాయం, హార్టికల్చర్, హౌసింగ్, ఇందిరా మహిళా శక్తి, రెవెన్యూ, ఎకై ్సజ్, గృహజ్యోతి తదితర శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన నివేదికను చదివి వినిపించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మానానికి ఇసుక కొరత సమస్యను పరిష్కరించాలని తెలిపారు. చెరువుల అభివృద్దికి నిధులు మంజూరు చేయాలని అధికారుల దృష్టి తెచ్చారు. అనంతరం ఆయా శాఖల అధికారులు ఏర్పాటుచేసిన స్టాళ్లను కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్కుమార్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్, నారాయణపేట జిల్లాల గ్రంథాలయాల సంస్థ చైర్మన్లు రాజేశ్ రెడ్డి, వార్ల విజయ్కుమార్, మున్సిపల్ చైర్మన్లు నాగులపల్లి నాగేందర్, సరస్వతి, మున్సిపల్ కమిషనర్లు బలరాంనాయక్, నాగరాజు, శ్రీకాంత్, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, ఎన్ఆర్ఈజీఎస్ సభ్యులు నర్సింలుగౌడ్, ఏఎంసీ చైర్మన్ అంబయ్యగౌడ్, ఎనిమిది మండలాల అన్ని శాఖల అధికారులు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ రాజేశ్వరి -
అండర్పాస్ ఏర్పాటు చేయాలి
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డికి వినతి చేవెళ్ల: మండలంలోని ఖానాపూర్ గేట్ను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పరిశీలించారు. హైదరాబాద్–బీజాపూర్ రాహదారి విస్తరణలో సర్వీస్ రోడ్లు, అండర్పాస్లు ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా చేయాలని ఖానాపూర్, నాంచేరి, రేగడిఘనాపూర్, దేవరంపల్లి, కిష్టాపూర్, ఇంద్రారెడ్డినగర్ గ్రామ ప్రజలు కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ఎన్హెచ్ఏఐ అధికారులు, రోడ్డు కాంట్రాక్టర్లతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా నాంచేరి సర్పంచ్ అశోక్, బీజేపీ నాయకుడు జయశంకర్గౌడ్ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు అంతా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ రోడ్డు అభివృద్ధిని చూసి ఆనందించాలో లేక ఏర్పడుతున్న ఇబ్బందులతో బాధపడాలో తెలియటం లేదని వాపోయారు. అండర్పాస్ లేకుండా రోడ్డును ఎత్తుగా వేస్తుండటంతో ఈ గేట్ వద్ద దాదాపు ఐదారు గ్రామాల ప్రజలు, రైతులతోపాటు అటు షాబాద్ మండలానికి, ఇటు వికారాబాద్జిల్లాలోని పలు గ్రామాలకు ఉన్న లింక్రోడ్డులు తెగిపోతున్నాయన్నారు. ఖానాపూర్, నాంచేరి, కిష్టాపూర్, రేగడిఘనాపూర్, దేవరంపల్లి గ్రామాలకు వెళ్లే మార్గం లేదన్నారు. ఇక్కడ అండర్పాస్ అవసరం ఉందన్నారు. దీంతో పాటు ఈరోడ్డుకు రెండు వైపులా సర్వీస్ రోడ్డు ఉంటేనే హైవే రోడ్డు పక్కల ఉన్న రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. దీనిపై స్పందించిన ఎంపీ అధికారులు, కాంట్రాక్టర్తో మాట్లాడి ఇక్కడి ప్రజలు, రైతులకు ఉపయోగపడేలా రోడ్డు ఉండేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, చేవెళ్ల బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు అనంత్రెడ్డి, నాయకులు మాణిక్యరెడ్డి, శర్వలింగం, ఉమాశంకర్, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ పరేడ్తో క్రమశిక్షణ
అనంతగిరి: పోలీస్ పరేడ్తో క్రమశిక్షణ, సమయపాలన, సిబ్బంది మధ్య సమన్వయం పెరుగుతుందని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని జనరల్ పరేడ్కు ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి, పరేడ్ను పరిశీలించారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. నిరంతరం విధి నిర్వహణలో ఒత్తిడికి లోనయ్యే పోలీస్ సిబ్బందికి పరేడ్ శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి దోహదపడుతుందన్నారు. ప్రతి వారం క్రమం తప్పకుండా పరేడ్లో పాల్గొనడంతో క్రమశిక్షణ అలవడుతుందని చెప్పారు. ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని, యోగా, వ్యాయామం, సమతుల ఆహారం వంటి అంశాలను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఆరా తీశారు. సిబ్బంది సంక్షేమమే తమ ప్రాధాన్యత అని పేర్కొంటూ, పోలీస్ అధికారులందరూ సిబ్బందికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు. ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు నాయక్, ఏఆర్ డీఎస్పీ వీరేశ్, ఆర్ఐలు నాగరాజు, శ్రీశైలం, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సేవలే గుర్తుండి పోతాయ్ విధి నిర్వహణలో మనం చేసిన సేవలే చిరస్థాయిగా నిలిచిపోతాయని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. 41 ఏళ్లుగా పోలీసు శాఖలో సుధీర్ఘ సేవలందించి పదవీవిరమణ పొందిన డీఎస్బీ ఎస్ఐ ఆర్.గోపాల్ను శనివారం ఆమె ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగికి ఉద్యోగవిరమణ తప్పనిసరన్నారు. 41 ఏళ్ల పాటు పోలీస్ శాఖకు విశేషమైన సేవలు అందించడం గొప్ప విషయమని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఓ ఖాజా మొయినుద్దీన్, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అశోక్, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, డీపీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ స్నేహ మెహ్ర -
ఎదురెదురుగా కారు, బొలేరో ఢీ
పరిగి: బొలేరో, కారు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన పరిగి ఠాణా పరిధిలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన ఓ కుటుంబం హైదరాబాద్కు వెళ్తున్నారు. ఈ క్రమంలో పరిగి మండలం రంగాపూర్ శివారులోకి రాగానే హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న బొలేరో వాహనం కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం కారులో ఉన్న నవనీత ఆమె కుతురు శ్రీనిజ్ఞాకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తల్లీకూతురుకు గాయాలు -
సమన్వయంతోనే అభివృద్ధి
చేవెళ్ల: పరస్పర సహకారంతో అన్నిశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ప్రజాపాలన –ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం మండలకేంద్రంలోని కేజీఆర్ గార్డెన్లో నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో పార్టీలు ఉండాలని, తరువాత అభివృద్ధికోసం అందరూ కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. ప్రజలకోసం ఎవరు మంచి పనిచేసినా అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయా శాఖల వారీగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి అధికారులు వివరించారు. అనంతరం మహిళా సంఘాలకు వచ్చిన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఐదు మండలాల ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, సర్పంచులు, ఆయా శాఖల అధికారులు, నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలకు చెందిన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మహిళాసంఘాల సభ్యులు పాల్గొన్నారు. ప్రొటోకాల్ పాటించలేదని అసహనం సమావేశంలో ప్రొటోకాల్ పాటించలేదని పలువురు సర్పంచులు అసహనం వ్యక్తం చేశారు. సభావేదికపైకి మున్సిపల్ కౌన్సిలర్లను పిలిచి సర్పంచులను మాత్రం ఆహ్వానించలేదన్నారు. తాము కూడా ప్రజాక్షేత్రంలో గెలిచి వచ్చామని, తమను ఒక విధంగా కౌన్సిలర్లను ఒక విధంగా చూడడం సరికాదన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య -
స్వీయ గణనలో స్పీకర్
అనంతగిరి: స్వీయ గణనలో అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. శనివారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. భారతదేశ జనాభా లెక్కలు–2027 కు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 2026 ఏప్రిల్ 26 నుంచి స్వీయ గణన అధికారికంగా ప్రారంభమైందన్నారు. మే 10 వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు. దేశ అభివృద్ధిలో జనాభా లెక్కలకు అత్యధిక ప్రాముఖ్యత ఉంటుందన్నారు. నేను పాల్గొన్నాను, ప్రజలంతా ఈ ప్రక్రియలో పాల్గొనాలన్నారు. ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా సీపీఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ విక్రంసింహా రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి డివిజన్ స్థాయి ప్రజావాణి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: డివిజినల్ స్థాయిలో ఈ నెల 4 నుంచి నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రారెడ్డి సంబంధిత ఆర్డీఓలకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ స్థాయిలో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా శనివారం ఆయన టెలీకాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. జీవో నంబర్ 3 ప్రకారం ఆర్డీఓల ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బూత్ స్థాయి అధికారులు మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. బీఎల్ఓలు ప్రతి ఇంటికీ వెళ్లి 18 ఏళ్ల పైబడిన వారి వివరాలు సేకరించాలన్నారు. నిబంధనల ప్రకారం మ్యాపింగ్తో డూప్లికేట్ ఓటర్లు, మరణించిన ఓటర్ల వివరాలను గుర్తించి ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి పరిశీలించి వివరాలను ధ్రువీకరించి తొలగింపు లేదా సవరణ చేపట్టాలని తెలిపారు. ఆమనగల్లు: పట్టణంలోని కోర్టులో జూనియర్ సివిల్జడ్జిగా శనివారం నారం అరుణ్కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. కోర్టు జడ్జిగా ఉన్న కాటం స్వరూప బదిలీ కాగా హైదరాబాద్లోని సిటీ సివిల్కోర్టులో అసిస్టెంట్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్న అరుణ్కుమార్ ఇక్కడికి వచ్చారు. పదవీ బాధ్యతలు తీసుకున్న ఆయనకు ఆమనగల్లు ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్లు, తలకొండపల్లి ఎస్హెచ్ఓ జానకిరాంరెడ్డి, కడ్తాల ఎస్హెచ్ఓ సైదిరెడ్డి, మాడ్గుల ఎస్హెచ్ఓ వేణుగోపాల్ పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పోలీసు అధికారులతో జడ్జి సమన్వయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పీపీ కార్తీక్, సిబ్బంది పాల్గొన్నారు. ద్విచక్రవాహనదారులకు గాయాలు ధారూరు: అదుపుతప్పిన కారు బైక్ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈఘటన శనివారం రాత్రి మండల కేంద్రానికి సమీపంలో కట్ట మైసమ్మ ఆలయం వద్ద చోటు చేసుకుంది. వివరాలు.. రుద్రారం గ్రామానికి చెందిన బంటు వెంకట్, కస్తూరిపల్లికి చెందిన పాండు బైక్పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. క్షతగాత్రులను అంబులెన్స్లో వికారాబాద్ ప్రభుత్వాస్పత్రికి తర లించారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కందుకూరు: అనారోగ్యంతో ఓ భిక్షగాడు మృతి చెందిన సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని పులిమామిడిలోని కోటమైసమ్మ దేవాలయం సమీపంలో ఓ వ్యక్తి మృతి చెంది ఉన్నాడనే సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి వద్ద లభించిన వివరాల ఆధారంగా అతను వెంకటయ్యచారి అలియాస్ పెంటయ్యచారి (60), ఆదిలాబాద్ జిల్లాగా గుర్తించారు. కొన్ని సంవత్సరాలుగా గ్రామ పరిసరాల్లో భిక్షాటన చేస్తూ, మద్యం తాగుతూ రోడ్డు పక్కనే నివసించేవాడు. తరచూ ఫిట్స్ కూడా వచ్చేవి. శుక్రవారం రాత్రి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి పూర్తి వివరాలు తెలిస్తే 87126 62687, 87126 62409, 87126 62369 నంబర్లలో సంప్రదించాలని పోలీసులు సూచించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జంతుబలిపై కేసు నమోదుఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల బీరప్ప జాతరలో జరిగిన జంతుబలిపై కేసు నమోదైంది. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ శివరాత్రి వెంకటేశ్ కథనం ప్రకారం.. ఆదిబట్లలో ఏప్రిల్ 27న బీరప్ప జాతరలో భాగంగా గొర్రె పొట్టేళ్లను దేవాలయం ముందు బలిచ్చారు. ఈ వీడియోలను కొందరు యువకులు సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. వీటిని చూసి చలించిన స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎన్జీఓ క్రూయాలిటీ ప్రివెన్షన్ మేనేజర్ అడులపురం గౌతమ్ అనే వ్యక్తి ఏప్రిల్ 29న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 15 మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
చెరవులు
రియల్ ఎస్టేట్ రంగంలో వస్తున్న ఊహించని వృద్ధి కారణంగా భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో అక్రమార్కుల కన్ను చెరువులు, కుంటలపై పడింది. శిఖం భూములు ఆక్రమిస్తూ అక్రమార్జనకు తెగబడుతున్నారు. వికారాబాద్: ఫొటోలో కనిపిస్తున్నది మోమిన్పేట మండల పరిధిలోని ఎన్కతల శివారులో ఉన్న చిన్న చెరువు.. సర్వే నెంబర్ 164లో 18 ఎకరాల విస్తీర్ణంలో ఈ చెరువు నిర్మించారు. ఇటీవల హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఈ చెరువు పరిసరాల్లో భూమి కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో అతని కన్ను చెరువు స్థలంపై పడింది. చెరువుకు ఉన్న వంద మీటర్ల బఫర్ జోన్లో గతంలో ఓ వైపు నిర్మాణాలు చేపట్టగా తాజాగా టిప్పర్లతో మట్టిని తీసుకువచ్చి చెరువు పూడ్చివేతకు పూనుకున్నాడు. ఎఫ్టీఎల్ ఏరియాలోనూ ఎకరా స్థలం ఆక్రమించి పొలం చేశాడు. రికార్డులలో 20 మీటర్ల వెడెల్పుతో అలుగు ఉండగా గతంలో కబ్జా చేసి రాతి గోడ నిర్మించడంతో నాలుగు మీటర్లకు కుదించుకుపోయింది. ఇక ఈ చెరువులోకి నీరు చేరేందుకు ప్రధాన ఆధారమైన ఫీడర్ చానెల్ను కబ్జా చేసి పూడ్చేశాడు. పొలానికి ఆనుకుని ఉన్న నక్ష బాటను సైతం కబ్జాకు గురైంది. దీంతో అటు వైపున్న పొలాల రైతుల రాకపోకలకు వీలు లేకుండా పోయింది. స్థానిక అధికారులు సైతం కబ్జా దారులకే కొమ్ముకాయడంతో గతేడాది కలెక్టర్ను కలిశారు. వెంటనే స్పందించిన ఆయన కబ్జా నిగ్గు తేల్చాలని తహసీల్దార్, ఇరిగేషన్ ఈఈలను ఆదేశించారు. వెంటనే సర్వే చేపట్టిన వారు కబ్జా నిజమేనని, చెరువును మట్టితో పూడ్చేసి మరీ కబ్జాకు పాల్పడడ్డారని తేల్చారు. కబ్జా చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని నీటి పారుదల శాఖ అధికారులు మోమిన్పేట ఠాణాలో ఫిర్యాదు చేశారు. కాగా అధికారులు కబ్జా నిజమేనని తేల్చి ట్రెంచ్ కొట్టి వదిలేశారు తప్ప చెరువును కబ్జా చెర నుండి విడిపించలేదు. ఇప్పుడు చెరువుకు ఆవలి వైపు మట్టితో పూడ్చేసి చదును చేస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవంలేదని చుట్టు పక్కల రైతులు ఆరోపిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే మీకెందుకని బెదిరిస్తున్నారని వాపోతున్నారు. రికార్డులు తారుమారు జిల్లా వ్యాప్తంగా 1,196 చెరువులుండగా విడతల వారీగా గత ప్రభుత్వం మిషన్ కాకతీయ పనులు చేపట్టారు. ఈ పథకంలో భాగంగా ఎక్కడైనా చెరువులు కబ్జాకు గురైతే రెవెన్యూ అధికారుల సమన్వయంతో వాటికి హద్దులు ఏర్పాటు చేయాలనే నిబంధన ఉంది. కానీ పనులు చేపట్టిన నీటి పారుదల శాఖ అధికారులు ఎక్కడా కబ్జాల జోలికి వెళ్లలేదు. హద్దులు ఏర్పాటు చేయలేదు. నానాటికి కబ్జాల విస్తీర్ణం పెరుగుతూ.. కుంటలు, చెరువులు కుంచించికు పోతున్నాయి. పలుచోట్ల చెరువులు, కుంటలు, దారులు, పానాదులు, నాలాలకు సంబంధించి రికార్డులు సైతం తరుమారయ్యాయి. నీటిపారుదల శాఖ దగ్గర సైతం చెరువులకు సంబంధించిన రికార్డులు కనిపించటంలేదు. కొన్ని చెరువులు భౌతికంగా కనిపిస్తున్నా రికార్డుల్లో ఉండడం లేదు. రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు కొమ్ముగాస్తున్నారనే ఆరోపణలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. కబ్జాలపై ఆరోపనలు వచ్చినా.. పేపర్లలో వార్తలు ప్రచురించినా.. అక్రమార్కులతో కుమ్మకై ్క వారికి వంత పాడుతున్నారు. అంతా తాము చూసుకుంటాం అంటూ విచారణ పేరుతో వారికి అనుకూలంగా ఉన్నతాధికారులకు నివేదికలు ఇస్తున్నారు. దీంతో కబ్జా రాయుళ్లకు అడ్డూ అదుపులేకుండా పోతుంది. భూ కబ్జా రాయుళ్లకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఇటీవల కబ్జా చేసిన భూములను సైతం విక్రయిస్తున్నారు. కబ్జాలు అక్కడక్కడ అధికారుల దృష్టికి వచ్చినా.. ఎవరైనా ఫిర్యాదులు చేసినా.. తాత్కాలికంగా విచారణ పేరుతో సందర్శిస్తున్నారే తప్ప.. ఏ ఒక్క చోట చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ విషయంలో తహసీల్దార్, ఇరిగేషన్ అధికారులు మొదలుకుని అడిషనల్ కలెక్టర్, కలెక్టర్ వరకు ఫిర్యాదులు అందినా.. చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. తీసుకున్న చర్యలు సైతం తూతూ మంత్రంగానే ఉంటున్నాయి తప్ప చెరువుల చెర విడిపించేదాక వెళ్లటంలేదు. శిఖం భూములను పొలాల్లో కలిపేసుకుంటున్న వైనం నాలాలు, వాగులను సైతం వదలని కబ్జారాయుళ్లు ఫిర్యాదులు అందినా పట్టించుకోని అధికారులు కబ్జాలు నిజమైనా చర్యలు శూన్యం అక్రమార్కులకే అధికారగణం అండదండలు -
పథకాలు అమలైతేనే ప్రజాపాలనకు అర్థం
ఇబ్రహీంపట్నం రూరల్: అర్హులైన ప్రజలకు నూరు శాతం సంక్షేమ పథకాలు అందజేసే బాధ్యత అధికారులపై ఉందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం స్థాయి సమావేశం బొంగ్లూర్లోని ఓ కన్వెన్షన్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తేనే ప్రజాపాలనకు అర్థం ఉందన్నారు. అఽధికారులు కొందరు బాగా పని చేస్తున్నారని, మరి కొందరు చేయడం లేదన్నారు. అందరూ సమన్వయంతో పని చేస్తే బాగుంటుందన్నారు. గ్రామాలకు వెళ్లాలని, కార్యాలయాల్లో ఉంటే సరిపోదన్నారు. కబ్జా చేసిన భూములు లాగి పేదలకు పంచుతా.. పేదవాడు 60 గజాల జాగలో ఇళ్లు కట్టుకుంటే కూల్చివేస్తారు. కానీ నేడు పదుల ఎకరాల్లో భూములు కబ్జాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే మల్రెడ్డి అన్నారు. అలాంటి వారు ఎక్కడున్నా చెప్పండి వారి నుంచి గుంజుకొని పేదలకు పంచుతానన్నారు. కబ్జాదారులు సీఎం పేరు చెప్పినా, మంత్రుల పేరు చెప్పినా, తన పేరు చెప్పినా సహించేది లేదన్నారు. అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడైన పేదలకు దక్కేలా చేస్తానని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ అనంతరెడ్డి, హౌసింగ్ పీడీ చంప్లానాయక్, తహసీల్దార్ సునీత, వ్యవసాయ శాఖ ఏడీఏ సుజాత, మార్కెట్ కమిటీ చైర్మన్లు చిలుక మధుసూదన్రెడ్డి, గురునాథ్రెడ్డి, జీహెచ్ఎంసీ ఆదిబట్ల సర్కిల్ కమిషనర్ సత్యనారయణరెడ్డి, ఇబ్రహీంపట్నం కమిషనర్ సుదర్శన్, డీఎస్ఓ వనజాత, నాయకులు ఈసీ శేఖర్గౌడ్, పాండురంగారెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
ఉత్తమ మార్కుల సాధనకు ‘సాక్షి’
దుద్యాల్: మారుతున్న కాలనుగునంగా విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. అందుకు అనుగునంగా విద్యార్థులు పరీక్షల్లో సులువుగా మార్కులు సాధించేందుకు ‘సాక్షి’దినపత్రిక స్టడీ మెటీరియల్ సిద్ధం చేసి అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించింది. పాఠశాలలో ఉపాధ్యాయుడు భోదించిన పాఠాలకు ఉచిత స్టడీ మెటీరియల్తో మంచి మార్కులు సాధించామని విద్యార్థులు చెబుతున్నారు. సులువుగా మార్కులు సాధించేందుకు ప్రతీ పాఠ్యాంశానికి సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులను తయారు చేసింది. అలా తయారు చేసిన మెటీరియల్లను మండలంలోని అన్ని జెడ్పీహెచ్ఎస్లకు, కేజీబీవీలకు, గురుకులాలకు అందించారు. స్టడీ మెటీరియల్తో మెరిట్ సాధించామంటున్న విద్యార్థులు -
నేడు నీట్
● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ● పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ అనంతగిరి: రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. శనివారం ఆయన ఎస్పీ స్నేహ మెహ్రతో కలిసి నీట్ పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్న పరీక్షకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అభ్యర్థుల హాజరును బయోమెట్రిక్ విధానం ద్వారా తీసుకుంటామన్నారు. 1.30 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదని చెప్పారు. పరీక్ష రాసే అభ్యర్థుల తనిఖీ సక్రమంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రశ్నాపత్రాల రవాణాపై పోలీస్, రెవెన్యూ, తపాలా శాఖల అధికారుల సమన్వయంతో రక్షణ చర్యలు చేపట్టాలని, పరీక్ష కేంద్రాల వద్ద నిబంధనల ప్రకారం బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్, పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు, పరీక్ష ముగిసిన తరువాత ఓఎంఆర్ పత్రాల తరలింపు నిబంధనల ప్రకారం పకడ్బందీగా చేపట్టాలన్నారు. పరీక్షా సమయంలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా, వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందిని నియమించి అవసరమైన మందులు అందుబాటులో ఉంచుతామని వివరించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, నీట్ కోఆర్డినేటర్ సాయిలత తదితరులు పాల్గొన్నారు. తాండూరు టౌన్: ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ సోమవారం తాండూరుకు రానున్నారు. పట్టణంలోని కొడంగల్ మార్గంలో ఉన్న ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో ఉదయం 9:30 గంటలకు సమావేశం ప్రగతి ప్రణాళిక సభ ప్రారంభమవుతుంది. ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొననున్నారు. అదనపు కలెక్టర్ వెంకటాచారి పరిగి: పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వెంకటాచారి సూచించారు. శనివారం ఆయన పరిగి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూ సమస్యలపై వచ్చిన రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని సూచించారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మండలంలో భూ సమస్యలు లేకుండా చూడాలని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమయపాలన పాటిస్తూ రెవెన్యూ అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు. సాదాబైనామాల దరఖాస్తులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ వెంకటేశ్వరి, డిప్యూటీ తహసీల్ధార్ విజయేందర్, ఆర్ఐ దివ్య తదితరులు పాల్గొన్నారు. అనంతగిరి: పండుగలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని వికారాబాద్ డీఎస్పీ అంజయ్య అన్నారు. శనివారం ఆయన వికారాబాద్ పీఎస్లో బక్రీద్ పండుగ సందర్భంగా శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పండుగలు భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. ప్రతీ ఒక్కరు నిబంధనలు పాటించాలని.. చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవద్దన్నారు. ఏమైనా సమాచారం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ రఘుకుమార్, పలువురు అధికారులు, కౌన్సిలర్లు, హిందూ, ముస్లిం మత పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. -
తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శంగా ఉండాలి
నవాబుపేట: ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని జిల్లా సంక్షేమాధికారి కృష్ణవేణి అన్నారు. శనివారం మండల కేంద్రంలో 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా బాల పంచాయతీ, మాదకద్రవ్యాలపై అవగాహణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శంగా ఉండాలన్నారు. పెద్దలను చూసే పిల్లలు నేర్చుకుంటారని చెప్పారు. పిల్లలపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలన్నారు. డ్రగ్స్కు బానిసైన వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చి పునరావాస కేంద్రాల్లో ఉంచుతున్నామన్నారు. గ్రామ స్థాయిలో పిల్లల సంరక్షణ భాద్యతతోపాటు బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు. ప్రతీ ఆరు నెలలకు గ్రామ సభలు నిర్వహించి పిల్లల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని సర్పంచులు, కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్రెహమాన్, సీఐలు అన్వర్పాషా, రాఘవేణి, భరోసా ఎస్ఐలు శ్వేత, స్రవంతి, ఎంపీఓ విజయ్కుమార్ బాలల సంరక్షణ అధికారులు అంజనేయులు, రాజునాయక్, యంగిస్తాన్ ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానిక సర్పంచ్ నర్సింహారెడ్డి, ఉపాధ్యాయులు, కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, బాలబాలికలు తదితరులున్నారు. జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి -
దత్తత చట్టంలోని మార్పులు తెలుసుకోవాలి
న్యాయమూర్తి రాధిక అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని శిశుగృహను శనివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జడ్జి రాధిక సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడున్న శిశువుల ఆరోగ్యం, వారికి అందించే ఆహారం తదితర విషయాలపై సిబ్బందిని ఆరా తీశారు. అనంతరం కార్యాలయంలోని రికార్డులను తనిఖీ చేశారు. శిశువుల దత్తతకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. దత్తత చట్టంలోని మార్పులను గురించి కొత్తగా చేర్చిన అంశాలను గురించి వివరించారు. ఆమె వెంట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయవాదులు వెంకటేశ్, రాము, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
దళారులను ఆశ్రయించి మోసపోవద్దు
దౌల్తాబాద్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని కొడంగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ అంబయ్యగౌడ్ కోరారు. శనివారం ఆయన మండలంలోని గోకఫసల్వాద్, దేవర్ఫసల్వాద్ గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ధాన్యం విక్రయించేందుకు రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సేవ్యానాయక్, నర్సింలు, కొటం రాములు, సర్పంచ్లు మల్లమ్మ, కూర రాజు, పీఏసీఎస్ సిబ్బంది మల్లికార్జున్, వెంకటేశ్, ఇస్మాయిల్ తదితరులున్నారు. కొడంగల్ ఏఎంసీ చైర్మన్ అంబయ్యగౌడ్ -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
మహేశ్వరం: అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర అర్బన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో శనివారం నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్య, వైద్య సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. అనంతరం డ్వాక్రా మహిళా సంఘాలకు రుణాల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర చేనేత కళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుతు సత్యనారాయణ, కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, డీఎల్పీఓ సాంభిరెడ్డి, జీహెచ్ఎంసీ బడంగ్పేట్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, జల్పల్లి డిప్యూటీ కమిషనర్ వెంకట్రాం, మహేశ్వరం మండల ప్రత్యేకాధికారి సుభాషిణి, మహేశ్వరం, కందుకూరు, బాలాపూర్ తహసీల్దార్లు చిన్న అప్పల నాయుడు, గోపాల్, ఇందిరా దేవి, మహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహరెడ్డి -
మద్దతు ధరతో లాభాలు పొందాలి
అనంతగిరి: వికారాబాద్లో మార్క్ఫెడ్, డీసీయంఎస్ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో నిర్వహిస్తున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ దీపక్ తివారీ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులు ప్రభుత్వం నిర్ణయించిన ఽమద్దతు ధరకు విక్రయించుకుని లాభాలు పొందాలన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్, మార్క్ఫెడ్ డీఎం రేఖ, డీసీఎంఎస్ మేనేజర్ సుదర్శన్రెడ్డి, ఏయంసీ సెక్రటరీ వెంకటేశ్వర్రెడ్డి, తహసీల్దార్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ దీపక్ తివారీ -
మెజార్టీ హామీలు అమలు
వికారాబాద్: నాటి ప్రభుత్వం మాటల ప్రభుత్వం అయితే.. ఈ ప్రభుత్వం చేతల ప్రభుత్వం. రేవంత్ సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తోంది. కొన్ని హామీలు మిగిలి పోవటానికి గత ప్రభుత్వం చేసిన మితిమీరిన అప్పులేనని శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. శనివారం పట్టణంలోని సత్యభారతి ఫంక్షన్ హాల్లో 99 రోజుల యాక్షన్ప్లాన్పై నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు–అభివృద్ధికి సంబంధించిన నివేదిక శాఖల వారీగా అధికారులు చదివి వినిపించారు. ముఖ్యమంత్రి సందేశం సభికులకు చదివి వినిపించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో అందరం బాగస్వాములమవుదామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసన సభాపతి ప్రసాద్కుమార్.. కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహమిశ్రాతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నో చారిత్రాత్మక పథకాలు తీసుకువచ్చి అమలు చేస్తోందన్నారు. సంక్షేమ పథకాలు అమలు సమీక్షకే 99 రోజుల ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు. రెండున్నరేళ్లలో రూ.600 కోట్లతో నియోజకవర్గంలో రోడ్లు వేయిస్తున్నానని తెలిపారు. ప్రతి గ్రామానికి రూ.50 లక్షల నిధులు రోడ్ల నిర్మాణానికి కేటాయించామన్నారు. ఉచిత విద్యుత్, రూ.10 లక్షలకు ఆరోగ్యశ్రీ పెంపు, రూ.500 కే గ్యాస్ సిలిండర్, సన్నబియ్యం, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం లాంటి చారిత్రాత్మక పథకాలు తీసుకువచ్చి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయటమే కాకుండా గృహ ప్రవేశాలు సైతం జరుగుతున్నాయన్నారు. హాస్టల్ విద్యార్థులకు పెద్ద మొత్తంలో డైట్ చార్జీలు పెంచామన్నారు. అనంతరం కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రతినిధులకు అధికారులకు మధ్య సమన్వయానికి జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. కొందరు అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని ఓ ప్రజాప్రతినిఽధి చేసిన విమర్శలపై ఆయన స్పందించారు. జనరల్గా మాట్లాడకుండా వారెవరో చెబితే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఎస్పీ స్నేహ మెహ్ర మాట్లాడుతూ.. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వ్యవహరిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య, వైస్ చైర్మన్ సుధాకర్రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ప్రసాద్, జెడ్పీ సీఈఓ సుధీర్, ఆర్టీఏ సభ్యులు జాఫర్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్, ఆయా శాఖల జిల్లా అధికారులు రేణుక, విజయభాస్కర్గౌడ్, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధికారులు ప్రభుత్వాన్ని అభాసుపాలు చేస్తున్నారు ప్రొటోకాల్కు విరుద్ధంగా స్టేజిపై కూర్చున్న ఓ మాజీ ప్రజా ప్రతినిధి స్పీకర్, కలెక్టర్ సమక్షంలో మాట్లాడుతూ.. అధికారులపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. శాఖల వారీగా వైఫల్యాలు వివరిస్తూ అధికారుల పనితీరును తప్పుబట్టారు. వారి చేతగాని తనంతో..వారు సక్రమంగా పని చేయకపోవటంతో ప్రభుత్వం అబాసుపాలవుతుందని సభలో చెప్పుకొచ్చారు. ప్రజా ప్రతినిధులు అంటే అధికారులకు లెక్కలేదు.. నియోజకవర్గంలో 24 గ్రామాలకు నీరు లేదు. భూసార పరీక్షా కేంద్రాలకు తాళం వేశారు.. కాంట్రాక్టర్లు సక్రమంగా పని చేయరు. నాణ్యత లేకున్నా అధికారులకు పట్టదు.. రోజుకు ఒక్కో వ్యక్తికి 100 లీటర్ల నీరు ఇస్తున్నామంటూ మిషన్ భగీరథ అధికారులు చెబుతున్నారు.. అది నిజమని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని ఎద్దేవా చేశారు. అఽధికారులు బాగా పనిచేస్తే 50 వేల మెజార్టీతో గెలుస్తాం.. లేదంటే ఏమైతామో ఎవరికీ తెలియదని అన్నారు. అంతటితో ఆగకుండా స్పీకర్ జడ్జీలాంటాయన.. ఆయనకు కొన్ని పరిమితులు ఉంటాయి.. ఆయన ఇవన్ని మాట్లాడలేరు..అందుకే ఆయన ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. మరో నాయకుడు ఆర్టీఏ మెంబర్ మాట్లాడుతూ.. అధికారులపై తీవ్రమైన విమర్శలు చేశారు. ప్రజల కన్నీళ్లకు అధికారులు కారణమవుతున్నారు.. అవినీతికి పాల్పడుతున్నారు..అవసరమైతే వారు చేసే అవినీతిని నిరూపిస్తానంటూ పేర్కొన్నారు. అయితే వీరిరువురి మాటలు వివదస్పదంగా మారాయి. సమీక్షకు పిలిచారా..? లేక తమను తిట్టడానికి మీటింగ్ పెట్టారా..? అంటూ కొందరు జిల్లా అధికారులు నొచ్చుకున్నారు. ప్రొటోకాల్కు విరుద్ధంగా అధికారిక కార్యక్రమంలో స్టేజీపై ఎలా కూర్చోబెడతారని అధికారులతో పాటు కొందరు అధికార పార్టీ నేతలే ప్రశ్నించారు. అభివృద్ధి పనులకు నిధులు బంట్వారం: అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు చేస్తానని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. బస్వాపూర్ సర్పంచ్ స్రవంతి శనివారం వికారాబాద్లోని క్యాంపు కార్యాలయంలో స్పీకర్ను కలిసి పలు సమస్యలు వివరించారు. డ్వాక్రా భవనంతో పాటు సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరగా స్పీకర్ సానుకూలంగా స్పందించారు. గ్రామాభివృద్దికి నిరంతరం పాటు పడాలని తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని సర్పంచ్కు సూచించారు. ఈ కార్యక్రమంలో బస్వాపూర్ ఎస్ఎంసీ మాజీ చైర్మన్ శివరాజ్ పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజా పాలన కార్యక్రమంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ సమావేశంలో సొంత పార్టీ నేతల నుంచి వింత అనుభవం ప్రొటోకాల్ పక్కన పెట్టి ప్రసంగాలు దంచడంపై విమర్శలు అధికారుల అసహనం -
కల్లు తాగొద్దన్నందుకు..
ఉరివేసుకొని బలవన్మరణం శంకర్పల్లి: కల్లుకు బానిసైనా ఓ వ్యక్తి.. దాన్ని తాగొద్దన్నందుకు మనస్తాపంతో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మోకిల పోలీస్ స్టేషన్ పరిఽధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్ రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని గోపులారం గ్రామానికి చెందిన శ్రీశైలం (46) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఏళ్ల నుంచి కల్లు తాగే అలవాటు ఉండగా ఆరోగ్యం పాడవుతుందని మానేయాలని కుటుంబసభ్యులు చెబుతూ వచ్చారు. దీంతో మూడు రోజుల నుంచి కల్లు మానేసిన ఆయన అప్పటి నుంచి ఎవరితో మాట్లాడకుండా ఉన్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. అక్కడ చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కేశంపేట: ఆర్ఎంపీ వైద్యుడు అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేశంపేట గ్రామానికి చెందిన భూయాకర్ రవీందర్ గ్రామంలోనే ఆర్ఎంపీ వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. కుటుంబంతో కలిసి గ్రామంలోనే నివసిస్తున్నారు. గతనెల 24న ఇంట్లో పెద్ద కుమారుడితో గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన రవీందర్ మరుసటి రోజున ఇంట్లో నుంచి క్లినిక్కు వెళ్లి అక్కడి నుంచి ఆమనగల్లు వైపు ఆర్టీసీ బస్సులో వెళ్లారు. బంధువులు, తెలిసిన చోట వెతికినా ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం భార్య శోభారాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు. -
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
కుల్కచర్ల: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బీఎస్ ఆంజనేయులు ముదిరాజ్ అన్నారు. శుక్రవారం ఆయన సర్పంచ్ అంజిలయ్యతో కలిసి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. సన్నరకం వడ్లకు రూ.500 బోనస్ను అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్–బి అధ్యక్షుడు కర్రె భరత్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఆనందం, పీరంపల్లి సర్పంచ్ వెంకటయ్య, ఏపీఎం శ్రీనివాస్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం అనంతరం మండల కేంద్రంలో అనూషశాంతకుమార్ దంపతులు నిర్మించుకున్న ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి గోపాల్ నాయక్, మాజీ అధ్యక్షుడు వెంకటయ్య, మాజీ సర్పంచ్ వెంకటయ్య, రజక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి వెంకటేశ్, గ్రామస్తులు రాజు, నర్సింలు, భాను, తదితరులు పాల్గొన్నారు. డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు భీంరెడ్డి -
ఎంపీడీఓలకు ఎన్ఎఫ్బీఎస్ బాధ్యతలు
దౌల్తాబాద్: జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్ఎఫ్బీఎస్) బాధ్యతలను ఎంపీడీఓలకు బదలాయిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ పథకం తహసీల్దార్ల పరిధిలో ఉండేది. ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులు ముందుగా అన్ని ధ్రువీకరణ పత్రాలతో మీసేవల్లో దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ శాఖ అధికారులు పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారించి ఆమోదం కోసం ప్రభుత్వానికి సమర్పించేవారు. తహసీల్దార్లకు క్షేత్రస్థాయిలో పని ఒత్తిడితో పాటు విచారణలోనూ జాప్యం తలెత్తడంతో దరఖాస్తులు పెండింగ్లో ఉంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ సమస్యను అధిగమించేందుకు పథకానికి సంబంధించిన పూర్తి బాధ్యతలు నిధుల విడుదలను ఎంపీడీఓల పరిధిలోకి తీసుకువచ్చింది. పథకం వివరాలు కుటుంబంలోని ప్రధాన సంపాదకుడు మృతిచెందితే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం జాతీ య కుటుంబ ప్రయోజన పథకాన్ని అమలు చేస్తోంది. మరణించిన వ్యక్తి వయస్సు 18–60 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత గల కుటుంబాలకు ప్రభుత్వం రూ.20వేలు అందిస్తుంది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు వేగంగా విచారణ చేపట్టిన వెంటనే నేరుగా ఎంపీడీఓ కార్యాలయంలో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలి. మంజూరైన నిధులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. సాయం పంపిణీలో జాప్యాన్ని నివారించేలా ప్రణాళిక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం కుటుంబ యజమాని మరణిస్తే త్వరితగతిన సాయం అందిచేందుకు ప్రభుత్వం బాధ్యతలను మార్పిడి చేసింది. లబ్ధిదారులకు చెందిన దరఖాస్తులు ఎక్కడ పెండింగ్లో ఉన్నాయో తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. మంజూరైన నిధులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. – శ్రీనివాస్, ఎంపీడీఓ, దౌల్తాబాద్ -
చెత్త లారీ ఢీ.. ర్యాపిడో డ్రైవర్ మృతి
అడ్డగుట్ట: చెత్త లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో ర్యాపిడో రైడర్ మృతి చెందాడు. వెనుక కూర్చున్న వ్యక్తి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. లాలాగూడ ఇన్స్పెక్టర్ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాకు చెందిన ఎన్న లక్ష్మారెడ్డి (35) ర్యాపిడో రైడర్. కొంతకాలంగా హయత్నగర్లోని కుంట్లూరులో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ర్యాపిడో రైడ్ రావడంతో తుర్కపల్లికి చెందిన కె.పౌల్ అనే వ్యక్తిని తన బైక్ ఎక్కించుకొని మహేంద్రాహిల్స్లో డ్రాప్ చేయడానికి బయలుదేరాడు. లాలాపేట మీదుగా వెళ్తుండగా చెత్తలోడ్తో జవహర్నగర్ డంపింగ్ యార్డ్కు వెళ్తున్న లారీ ఎదురుగా వచ్చి బైక్ను ఢీకొట్టింది. లక్ష్మారెడ్డి తలపై నుంచి లారీ టైరు వెళ్లడంతో అతడు ధరించిన హెల్మెట్ సైతం ముక్కలై, తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న కస్టమర్కు కూడా తీవ్రగాయాలు కావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో దుర్మరణం పాలైన ర్యాపిడో రైడర్ మీదినుంచి టైరు వెళ్లడంతో ముక్కలైన హెల్మెట్ -
ఓఆర్ఆర్పై నిలిపి ఉంచుతున్న వాహనాలు
ఎక్కువ ప్రమాదాలకు ఇదే ప్రధాన కారణం సాక్షి, సిటీబ్యూరో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై వాహనం రకం, వేగాన్ని బట్టి లేన్ (వరుస) డ్రైవింగ్ను నిర్ణయించారు. కానీ.. చాలా మంది వాహనదారులు లేన్ డ్రైవింగ్ నిబంధన పాటించకపోవడంతో ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. ఔటర్పై అతి వేగంగా వస్తున్న వాహనాలు ముందు ఆగి ఉన్న వాహనాలను అంచనా వేయకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి తోడు అతివేగం, నిర్లక్ష్యం కూడా ఔటర్పై రోడ్డు ప్రమాదాలలో కారణమేనని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం తుక్కుగూడ నుంచి శంషాబాద్ వస్తున్న కారు పెద్దగోల్కొండ ఔటర్పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొని.. కుటుంబంలోని ఆరుగురు సభ్యులు అక్కడికక్కడే అసువులు బాశారు. లేన్ డ్రైవింగ్ పాటించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమైంది. ఔటర్పై అతివేగంగా వెళ్తూ తరచూ ప్రమాదాలు జరిగి మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా రహదారి భద్రతా నిపుణులు జాగ్రత్తలు సూచిస్తున్నారు. నిబంధనలు పాటిస్తే సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. ప్రమాదాలకు ఇవీ కారణాలే.. ● 158 కిలోమీటర్ల ఔటర్పై రోజూ 15 లక్షకు పైగా వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఎక్కువ మంది వాహనదారులకు ఏయే లేన్లలో ప్రయాణించాలనే విషయంపైనే అవగాహన ఉండదు. సగటున 65 శాతం వాహనాలు లేన్ డ్రైవింగ్ (వరుస క్రమం) పాటించడంలేదని ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో తేలింది. ● ఓఆర్ఆర్పై రాత్రి దాటాక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భారీ వాహన డ్రైవర్లు అవగాహన లోపంతో పక్కన నిలిపేస్తుంటారు. అతివేగంతో ముందు ప్రాంతాన్ని అంచనా వేయలేని కొందరు వీటిని ఢీకొట్టి.. మృత్యువాతపడుతున్నారు. ● కొన్నిసార్లు వెనుక నుంచి వచ్చే వాహనాలు వేగాన్ని అదుపుచేయలేక.. నెమ్మదిగా వెళ్లే ముందున్న వాహనాలను ఢీకొడుతున్నాయి. ఇంకొన్నిసార్లు వాహనాలు అదుపుతప్పి డివైడర్లను ఢీకొట్టుకుంటున్నాయి. ఇలా వెళ్తే సేఫ్ జర్నీ.. ● ఔటర్ రింగురోడ్డుపై ఒక్కోవైపు నాలుగు వరుసల చొప్పున రహదారులున్నాయి. నిబంధనల ప్రకారం 1,2 లేన్లలో కార్లు, 3,4 వరుసల్లో లారీలు, ఇతర భారీ వాహనాలు మాత్రమే ప్రయాణించాలి. ఈ నిబంధన అతిక్రమించిన సందర్భాల్లోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. 1, 2 లేన్లలో ప్రయాణించే వాహనాలు కనిష్ఠంగా 100 నుంచి గరిష్టంగా 120 కిలోమీటర్లు, 3, 4 వరుసల్లో కనిష్ఠంగా 80 నుంచి గరిష్టంగా 100 కి.మీ. వేగంతో ప్రయాణించాలి. ● లేన్లపై వాహనాలు అడ్డదిడ్డంగా ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదు. ఒకవేళ వాహనాలు లేన్లు మారాలనుకుంటే ఆకస్మాత్తుగా తీసుకోకుండా.. కచ్చితంగా ఇరువైపులా, వెనుక గమనించాలి. వెనుక నుంచి వచ్చే వాహనదారులు అప్రమత్తమయ్యేలా ఇండికేటర్లు, ఇతర సంజ్ఞలు వేయాలి. ఇవేవీ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో పక్కలేన్లలోకి దూసుకెళ్లకూడదు. ఔటర్పై జరిగే 50 శాతం ప్రమాదాలకు అడ్డదిడ్డంగా లేన్లు మారడమే కారణం. అదుపుతప్పిన అతివేగంతోనూ.. ● ఔటర్పై వేగం పెరిగే కొద్దీ ప్రమాదశాతం పెరుగుతున్నట్లు వాహనదారులు గుర్తించాలి. సాధారణంగా ఔటర్ చూసేందుకు ఖాళీగా వేగంగా దూసుకెళ్లేందుకు అనువుగా ఉన్నట్లు కనిపిస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సమయంలో ఒక్కసారిగా వాహనాన్ని అదుపుచేసే అవకాశాలు 90 శాతం తక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ముందు వెళ్తున్న వాహనం వేగం తగ్గితే అదుపు చేయలేక ఒక్కసారిగా ఢీకొడతాయి. ● ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వాహనం నిలపాలనుకుంటే పూర్తిగా ఎడమవైపున సర్వీస్ లేన్పైనే ఆపాలి. ఇందుకు కొన్ని ప్రత్యేక ప్రాంతాలున్నాయి. పార్కింగ్ లైట్లు ఆన్లోనే ఉంచాలి. రాత్రివేళ ఎక్కువ సమయం వాహనాన్ని నిలపకూడదు. అలాగే ఓఆర్ఆర్ ప్రవేశం, నిష్క్రమణ మార్గాల్లో రాంగ్ రూట్లో ప్రయాణించకూడదు. -
త్వరలో తాండూరుకు వస్తా
మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి తాండూరు రూరల్: త్వరలో తాండూరుకు వస్తానని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మండల నాయకులు పలువురు శుక్రవారం పైలెట్ను కలిసేందుకు హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా తాండూరు పరిణమాలను నాయకులు ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్ రాజుగౌడ్ మండల యూత్ ప్రెసిడెంట్ సుధాకర్ గౌడ్, నాయకులు మహేశ్, నరేశ్ తదితరులు ఉన్నారు. రైతు మృతి బొంరాస్పేట: పాముకాటుకు గురైన రైతు నాటువైద్యంతో మృతిచెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని నాందార్పూర్లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కావలి రాములు(59) గురువారం కోతకొచ్చిన వరిపంటను పరిశీలించేందుకు వెళ్లాడు. దీంతో పాముకాటుకు గురయ్యాడు. దీంతో ఆయన గ్రామంలో చేయించుకున్న నాటువైద్యం వికటించి మృతి చెందాడు. శుక్రవారం అంత్యక్రియలు చేశారు. అబ్దుల్లాపూర్మెట్ : విద్యుత్ తీగలు అల్లుకోవడంతో వచ్చిన నిప్పుతో గడ్డివాము దగ్ధమైంది. ఈ సంఘటన అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాటసింగారం గ్రామంలోని సింగరేణికాలనీలో శుక్రవారం మధ్యాహ్నం రెండు విద్యుత్ తీగలు తగలడంతో నిప్పు రవ్వలు చెలరేగి సమీపంలో ఉన్న దర్నమోని లోకనాథంకు చెందిన ఎండు గడ్డి వాముపై పడ్డాయి. దీంతో గడ్డివాము కాలిబూడిదైంది. వెంటనే అప్రమత్తమైన బాధితుడు సమీపంలోనే ఉన్న పశువులకు ఎలాంటి హాని జరగకముందే దూరంగా తీసుకెళ్లాడు. ● మాజీ ఎమ్మెల్యే కొడుకును అదుపులోకి తీసుకున్న పోలీసులు బంజారాహిల్స్: హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు మహ్మద్ రాహీల్ ఆమిర్ చట్టవిరుద్ధంగా దుబాయ్కి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. రాహీల్ ఆమిర్ 2022 మార్చి 17న ఇద్దరు స్నేహితులతో కలిసి జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45 మీదుగా కారులో బయలుదేరాడు. అదుపుతప్పిన వేగంతో దూసుకెళ్లిన కారు బెలూన్లు అమ్మే మహిళను ఢీకొట్టగా, ఆమెలోంచి చిన్నారి కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకుగాను తన స్నేహితుడు అఫ్రాన్ కారు నడిపాడంటూ పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చాడు. ఆ తెల్లవారే దుబాయ్ పారిపోయాడు. అయితే కేసును లోతుగా విచారించిన పోలీసులకు ఆ రోజు కారు నడిపింది రాహీల్ అని తెలిసింది. దీంతో ఆయనపై కూడా కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ కోసం రాహీల్ హైకోర్టును ఆశ్రయించగా పోలీసుల విచారణకు హాజరుకావాలంటూ స్పష్టం చేసింది. దీంతో గత నెల 17న జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరయ్యాడు. విచారణ కొనసాగుతుండగానే గురువారం ఉదయం దుబాయ్కు వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు వెంటనే ఇమ్మిగ్రేషన్ అధికారులను అప్రమత్తం చేసి నిందితుడిని మార్గమధ్యంలోనే అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం మరోమారు రాహీల్ విచారణకు రాగా, దుబాయ్ వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. సాక్షి, సిటీబ్యూరో: రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్డబ్ల్యుఏ) భద్రతా వ్యవస్థల క్రమబద్ధమైన నిర్వహణ, పారదర్శక పాలన,ఉమ్మడి స్థలాలపై దృష్టి పెట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. నారెడ్కో తెలంగాణ, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్(ఎఫ్టీసీసీఐ), యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ (యు–ఫెర్వాస్) సంయుక్తంగా ఫెడరేషన్ హౌస్లో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించాయి. ఆయన మాట్లాడుతూ స్వీయ జనగణనకు మద్దతు ఇవ్వాలని నివాసిత సంఘాలను కోరారు. కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ డీజీ విక్రంమాన్ సింగ్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, నారెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
షార్ట్సర్క్యూట్ కారణంగా ఇల్లు దగ్ధం
అనంతగిరి: షార్ట్ సర్క్యూట్ కారణంగా అర్ధరాత్రి ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన వికారాబాద్ మండలం అత్త్వెల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి 2 గంటలకు చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన డప్పు ఎల్లయ్య భార్య, కుమారుడితో కలిసి నిద్రిస్తున్నాడు. ఈక్రమంలో మంటలు రావడం గమనించిన కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. స్థానికులు మంటాలార్పేందుకు విఫలయత్నం చేశారు. ఫైరింజన్ వచ్చి మంటలను అదుపులోకి వచ్చాయి. అప్పటికే ఇంట్లోని సామగ్రి కాలిబూడిదయ్యాయి. ఈ ఘటనలో రూ.20 వేల నగదు, ఐదు గ్రాముల బంగారం, వెండి ఆభరణాలు, బియ్యం, నిత్యవసరాలు, టీవీ, వంట సామాగ్రితో పాటు ఇల్లంతా దగ్ధమయింది. దాదాపు రూ.7 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. సర్పంచ్ విజయక్ష్మిమహేందర్రెడ్డి ఘటనా స్థలిని పరిశీలించి రైతుకు ధైర్యం చెప్పారు. ఈ విషయం అధికారులు, స్పీకర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. రూ.7 లక్షల ఆస్తి నష్టం -
330 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం
అనంతగిరి: నవాబ్పేట మండల కేంద్రంలోని ఓ ఫాస్ట్ఫుడ్ సెంటర్ వద్ద చేసిన దాడుల్లో ముగ్గురు వ్యక్తుల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ జిల్లా టాస్క్ఫోర్స్ సీఐ శ్రీనివాస్ తెలిపిన ప్రకారం.. శుక్రవారం ఉన్నతాధికారులకు అందిన విశ్వసనీయ సమాచారం, వారిచ్చిన ఆదేశాల మేరకు ఓ ఫాస్ట్ఫుడ్ సెంటర్ వద్ద దాడులు చేపట్టారు. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తుల నుంచి 330 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి వికారాబాద్ ఎకై ్సజ్ సీఐకి అప్పగించామన్నారు. ఈ దాడుల్లో ఏఈఎస్ శ్రీనివాస్రెడ్డి, ఎస్ఐ ప్రవీణ్కుమార్రెడ్డి, సిబ్బంది యాదగిరి, యూసుఫ్, నరేశ్గౌడ్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ముగ్గురు అరెస్ట్ -
కృత్రిమ కొరత.. కేంద్రం కుట్ర
● కార్పొరేట్ సంస్థల కోసమే ఇదంతా ● ప్రజల ఇందన కష్టాలు తీర్చండి ● సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటయ్య పరిగి: కార్పొరేట్ సంస్థల లాభాల కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చమురు కృత్రిమ కొరత సృష్టించిందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటయ్య ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ లభించక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని, కొరతను నివారించి నిరంతరం సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. గురువారం పట్టణ కేంద్రంలో ధర్నా చేశారు. అనంతరం మాట్లాడుతూ.. బడా కంపెనీలతో అంటకాగుతూ.. సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, చమురు సంస్థలు కలిసి ప్రజలను దోచుకునే పనిలో భాగంగానే ఈ కొరత కుట్ర అని విమర్శించారు. దేశంలో ఎక్కడా ఇందన ఇబ్బంది లేదని చెబుతూ.. ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసమే చమురు ధరలు పెంచకుండా ఉన్న మోదీ సర్కార్.. ఎన్నికలు ముగిసిన వెంటనే నిల్వలు దాచిపెడుతూ.. ధర పెంచే యోచనలో ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దేశ ప్రజలు అన్ని చూస్తున్నారని, సమయం చూసి బీజేపీకి తగిన బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. -
దాచిదాచి.. రూ.200లకు విక్రయించి
ధారూరు: చమురు కొరతను బూచీగా చూపుతూ.. పెట్రోల్ బంకుల నిర్వాహకులు తమ చేతివాటం చూపుతున్నారు. దాచిదాచి రూ.200లకు లీటరు ఇందనం విక్రయిస్తూ దోచుకుంటున్నారని వాహనదారులు ఆరోపించారు. కృత్రిక కొరత సృష్టిస్తూ.. బ్లాక్ దందాకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందన కొరత లేదని ప్రభుత్వం, అధికారులు చెబుతున్నా.. మండల పరిధి బంకుల్లో వారం రోజులుగా నోస్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అయినప్పటికీ జిల్లా సివిల్ సప్లై అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. గురువారం ధారూరు మండల కేంద్రంలోని ఫిల్లింగ్ స్టేషన్కు డీజిల్, పెట్రోల్ రావటంతో వాహనదారులు క్యూకట్టారు. ఇక్కడ ఒక్కరికి 2 లీటర్లే పోస్తామని నిర్వాహకులు స్పష్టం చేయగా.. అంతకే సరిపెట్టుకుంటున్నారు. -
డివైడర్ను ఢీకొట్టిన కారు, వ్యక్తి మృతి
ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి సమీపంలో ఓ ఇన్నోవా కారు అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది. ఈ సంఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. సీఐ రఘు కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో కొత్తగడి వైపు నుంచి వికారాబాద్కు వెళ్తున్న కారు.. అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కలీమొద్దీన్(37) తీవ్రంగా గాయపడగా.. అక్బరుద్దీన్, నూరుద్దీన్, నజీర్ హుస్సేన్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. కలీమోద్దీన్ను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఆయన అప్పటికే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని సీఐ తెలిపారు. కాగా ప్రమాద స్థలాన్ని గురువారం ఆర్అండ్బీ ఈఈ శ్రీధర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ విక్రంసింహారెడ్డి, సీఐ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధ్యయనం చేసి, ప్రమాదాలు జరుగకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. -
బంక్లు మూసి ఇబ్బంది పెట్టొద్దు
తహసీల్దార్ సాజిదాబేగం ధారూరు: ఉద్దేశ పూర్వకంగా బంక్లను మూసేసి, వాహనదారులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని తహసీల్దార్ సాజిదాబేగం హెచ్చరించారు. హరిదాస్పల్లి సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్లో స్టాక్ ఉన్నప్పటికీ గురువారం సాయంత్రం మూసి ఉండడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బంక్ మూసి ఉండటాన్ని గమనించిన డీసీసీ కార్యదర్శి మమ్మద్ బాబాఖాన్ పెట్రోల్, డీజిల్ ఉన్నా బంక్ ఎందుకు మూసేశారని నిలదీశారు. రాత్రి వేళ బ్లాక్ మార్కెట్కు తరలించి, సొమ్ము చేసుకునే ప్రయత్నాలను సహించేది లేదని హెచ్చరించారు. దీనిపై స్పందించిన నిర్వాహకులు సిబ్బంది లేక తెరవలేదని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈవిషయాన్ని వెంటనే తహసీల్దార్తో పాటు ధారూరు సీఐ రఘురామ్కు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ హెచ్చరికలతో బంక్ తెరిచిన నిర్వాహకులు ప్రెట్ల్, డీజిల్ పంపిణీ చేశారు. -
తీగల రాపిడి..చెలరేగిన మంటలు
తాండూరు టౌన్: ప్రధాన రహదారిపై వేలాడుతున్న 11 కేవీ విద్యుత్ తీగలు ఒకదానికి ఒకటి తగిలి మంటలు చెలరేగాయి. ఈ సంఘటన పట్టణ శివారు వైట్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ సమీపాన గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రహదారి గుండా వేసిన లైన్ మార్గంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. అటుగా ఎవరూ వెళ్లకపోవడంతో ప్రమాదం తప్పింది. స్థానికుల సమా చారంతో ఘటనా స్థలిచి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పేశారు. విద్యుత్ తీగలు వేలాడి ఉండటమే ప్రమాదానికి కారణమని, విద్యుత్ అధికారులు స్పందించి వైర్లను సరిచేయాలని ప్రజలు కోరారు. సేవలతోనే గుర్తింపు మర్పల్లి: ప్రజలకు అందించిన సేవలే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయని ఏఎంసీ చైర్మన్ మహేందర్రెడ్డి అన్నారు. ఉపాధి హామీ పథకంలో ఈసీగా విధులు నిర్వహిస్తున్న ఈసీ విఠల్ గురువారం ఉద్యోగ విరమణ పొంఆరు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాస్ అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన సభకు హాజరై మాట్లాడారు. సూపరింటెండెంట్ కృష్ణారావు, ఏపీఓ అంజిరెడ్డి, ఏపీఎం సమ్మయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ మల్లేశ్యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జగదీశ్వర్, వివిధ గ్రామాల సర్పంచ్లు, అధికారులు విఠల్ దంపతులను సన్మానించి, వీడ్కోలు తెలిపారు. బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి హిమాయత్నగర్ : బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదన చారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన గురువారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీ మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్న్ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ బీసీల హామీలు తుంగలో తొక్కి, వారి ఆశల మీద నీళ్లు చల్లారని మండిపడ్డారు. ఎర్ర సత్యనారాయణ మాట్లాడుతూ ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న 42 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన రెండు బిల్లులపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, వేముల రామకృష్ణ పాల్గొన్నారు. సరోజీని దేవి కంటి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం గోల్కొండ: మెహిదీపట్నంలోని సరోజీనిదేవి కంటి ఆసుపత్రిలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. ఆసుపత్రి గ్రౌండ్ ప్లోర్ లోని సెంట్రల్ మెడిసిన్ స్టోర్ రూమ్లో ఈ ప్రమాదం జరిగింది. దీంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలను సిబ్బంది ఆర్పివేశారు. కాగా ఇండోర్ ఏసీ యూనిట్ పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఓపీ విభాగం, ఎమర్జెన్సీ విభాగంతో పాటు ఇన్పేషంట్ విభాగం కూడా ఉండడంతో అక్కడ ఉన్న రోగులు ఔట్పేషంట్కు వచ్చిన వారు భయంతో పరుగులు తీశారు. రెండు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారని ఏడిఎఫ్వో వి.భానుప్రతాప్ తెలిపారు. రోడ్లకు మరమ్మతు చేయాలని జడ్సీకి వినతి చైతన్యపురి: సరూర్నగర్ డివిజన్ చెరుకుతోట కాలనీ రోడ్నంబర్–3లోని అంతర్గత రహదారాలు అధ్వాన స్థితిలో ఉన్నాయని వాటికి వెంటనే మరమ్మతులు చేయాలని కాలనీల సంక్షేమ సంఘాల జేఏసీ చైర్మన్ బేర బాలకిషన్ కోరారు. ఈ మేరకు గురువారం ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతోకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బాలకిషన్ మాట్లాడుతూ... కేపీఎల్ షోరూం నుంచి చెరుకుతోట కాలనీ టర్నింగ్ వరకు ఉన్న 275 మీటర్ల రోడ్డు పూర్తిగా గుంతలు పడి పాడై రాకపోకలకు ఇబ్బందులు కలుతున్నాయని వివరించారు. పొచమ్మబస్తీ, పోచమ్మబాగ్ కాలనీల సమస్యలను పరిష్కరించాలన్నారు. అంబేడ్కర్నగర్ కాలనీలో ఉన్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన స్మశానవాటికకు ప్రహరీ నిర్మాణం చేయాలని, చెరుకుతోట కాలనీ కమ్యూనిటీ హాల్లో ఓపెన్ జిమ్ సగంలో ఆగిపోయిందని తెలిపారు. డివిజన్లోని పలు కాలనీలలోని రహదారులు, ఇతర సమస్యలను సత్వరమే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం జోనల్ కమిషనర్ను శాలువాతో సత్కరించారు. కాలనీ సంక్షేమ సంఘం నాయకులు తాండ్ర భాస్కర్ ఉన్నారు. -
నామినేటెడ్ ఆశలు
పరిగి: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాలను ప్రభుత్వం నామినేట్ పద్ధతిలో నియమించనుంది. పీఏసీఎస్ చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు సభ్యుల నియామకానికి నిర్ణయం తీసుకుంది. దీంతో అధికార పార్టీ నాయకుల్లో పదవులపై ఆశలు మొదలయ్యాయి. గతంలో ప్రతీ సహకార సంఘానికి 13 మంది చొప్పున డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికలు జరిగేవి. సంఘ సభ్యులు ఓటు వేసి డైరెక్టర్లను ఎన్నుకునేవారు. ఇలా ఎన్నికై న వారంతా కలిసి ఒకరిని చైర్మన్, మరొకరిని వైస్ చైర్మన్గా నియమించేవారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ విధానానికి స్వస్తి పలికినట్లయింది. ఇప్పటికే పాలకవర్గాల పదవీ కాలం ముగిసి ఏడాది దాటింది. ఈనేపథ్యంలో పాత సంఘాలను రెండుసార్లు పొడిగించింది. ఆతర్వాత పలువురు చైర్మన్లు, వైస్ చైర్మన్లపై అవినీతి ఆరోపణలు రావడంతో గత డిసెంబర్ నుంచి ఇన్చార్జ్ అధికారులను కొనసాగిస్తోంది. ఎన్నికలపై స్పష్టత కరువు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు గానూ పరిగి, పూడూరు, దోమ, కుల్కచర్లకు సహకార సంఘాలున్నాయి. నూతనంగా ఏర్పడిన చౌడాపూర్ విషయంలో స్పష్టత రాలేదు. నామినేటెడ్ పద్ధతిలో ఒక్కో సంఘానికి ఎంత మందిని ఎంపిక చేస్తారనేది కూడా కచ్చితంగా తెలియడం లేదు. ఒక్కో సంఘానికి ముగ్గురిని, ఐదుగురిని ఎంపిక చేసి వారిలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవిని కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక విధివిధానాలు రావాల్సి ఉంది. నామినేటెడ్ చేసే సభ్యులలో జనరల్, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు మహిళా వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. ఎంపిక ఎమ్మెల్యేలదే.. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు పరపతి కల్పనలో ప్రాథమిక సహకార సంఘాలు కీలకంగా పని చేస్తున్నాయి. పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ యంత్రాల సబ్సిడీలు, సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలకు ఆర్థికంగా తోడ్పాటు అందించడంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. రైతు వర్గాల్లో కీలకంగా ఉన్న ఈ పదువులు నియోజకర్గ పరిధిలో ఎమ్మెల్యేలు సూచించిన వారికే దక్కే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్ కమిటీ పాలకవర్గాల తరహాలో సహకార సంఘాల్లోనూ ఇదే తీరుగా కొనసాగనుంది. దీంతో ఈ పదవులపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. రెండున్నరేళ్లుగా ఎదురు చూస్తున్న నాయకులు స్థానిక ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికార పార్టీ నాయకులకు అవకాశాలు దక్కనున్నాయి. పీఏసీఎస్లలో పదవుల భర్తీపై నేతల్లో ఉత్కంఠ పైరవీలు ప్రారంభించిన ఆశావహులు ఎమ్మెల్యే సూచించిన వారికే పోస్టులు దక్కే అవకాశం -
స్వయం సహాయక సంఘాల ఏర్పాటుపై దృష్టి
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో స్వయం సహాయక సంఘాల ఏర్పాటుపై దృష్టి సారించాలని అధికారులకు రాజేంద్రనగర్ జోన్ జోనల్కమిషనర్ శ్రీనివాస్రెడ్డి సూచించారు. గురువారం రాజేంద్రనగర్లోని జోనల్ కార్యాలయంలో యూసీడీ అధికారులతో కలిసి ఆయన సమావేశమయ్యారు. స్వయం సహాయక సంఘాల ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు. ప్రజల్లో అవగాహన పెంచి మరిన్ని ఎస్హెచ్జీ గ్రూపులను ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ‘‘99 డేస్ ఆఫ్ యాక్షన్ ప్లాన్’కార్యక్రమం కింద ఇప్పటి వరకు జోనల్లో మొత్తం 198 గ్రూపులు ఏర్పాటు చేసినట్లు అధికారులు జోనల్ కమిషనర్కు వివరించారు. ఈ సంఖ్యను మరింత పెంచడానికి వార్డు స్థాయిలో విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. మహిళల ఆర్థిక సాధికారతకు ఎస్హెచ్జీలు కీలకంగా మారాలన్నారు. ఈ కార్యక్రమంలో అర్హత గల కుటుంబాన్ని భాగస్వామ్యం చేయాలని కమిషన పేర్కొన్నారు. -
ధర్మ రక్షణ ప్రతిఒక్కరి బాధ్యత
చేవెళ్ల: హిందూ ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ ప్రతి హిందువు బాధ్యతని వేదాంత గీత ఫౌండేషన్(నంద్యాల) సభ్యుడు అభినవ శంకరానందస్వామి, ఆర్ఎస్ఎస్ క్షేత్ర సేవా ప్రముఖ్ ఎక్క చంద్రశేఖర్, మహిళా వక్త సరస్వతీ శిశు మందిర్ సంభాగ్ సమితి సభ్యురాలు శారదా దయానిధి అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం పక్కనే బుధవారం రాత్రి హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. సమాజా నిర్మాణంలో హిందూ సమాజం, మహిళల పాత్ర, కుటుంబ విలువలపై ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. ఆధునిక కాలంలో పాశ్యాత్య ప్రభావాల నడుమ మన సంప్రదాయలను మరిచిపోతున్నారని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమ్మేళనంలో భక్తిగీతాలు, ధార్మిక నినాదాలు కార్యక్రమానికి మరింత ఉత్సవం నింపాయి. స్థానిక భక్తులు, యువకులు, మహిళలు, సామాజిక కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
‘ఆపరేషన్ ఆక్టోపస్’తో కదిలిన కేంద్రం
రెండు దఫాల్లో నిర్వహించిన హైదరాబాద్ పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: నగర కొత్వాల్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ ఆదేశాల మేరకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ నెల్లో ‘ఆపరేషన్ ఆక్టోపస్’ నిర్వహించారు. ఇది బ్యాంకింగ్ రంగంలో ఉన్న లోపాలను ఎత్తి చూపడంతో ఆయా అంశాలను వివరిస్తూ సజ్జనర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (ఆర్బీఐ) లేఖ రాశారు. దీంతో కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది. ఇందులో పాల్గొనడానికి రాష్ట్రం నుంచి వీసీ సజ్జనర్ను ప్రత్యేకంగా ఆహ్వానించింది. సమావేశంలో పాల్గొన్న ఆయన పలు కీలక సలహాలు, సూచనలు ఇచ్చారు. సైబర్ నేరాలను నిరోధించాలంటే లోపాలు అధ్యయనం చేసి, మూలాల్లోకి వెళ్లాలని భావించిన సజ్జనర్ దీనికోసం ప్రత్యేకంగా ఆపరేషన్ ఆక్టోపస్ను డిజైన్ చేశారు. తొలుత ఫిబ్రవరిలో ‘ఆపరేషన్ ఆక్టోపస్–1’ నిర్వహించిన సైబర్ క్రైమ్ పోలీసులు 16 రాష్ట్రాల్లో సోదాలు చేసి 117 మందిని అరెస్టు చేశారు. వీరిలో సైబర్ నేరాలు చేసే వారికి బ్యాంకు ఖాతాలు అందించిన వారు (మ్యూల్ అకౌంట్ హోల్డర్స్), దళారులు ఉన్నారు. వీరి విచారణలో కొందరు బ్యాంకు అధికారుల పాత్ర వెలుగులోకి వచ్చింది. దీంతో రెండో విడతగా ‘ఆపరేషన్ ఆక్టోపస్–2.0’ను ఏప్రిల్లో చేపట్టారు. బాధితుల సొమ్మును దారి మళ్లించేందుకు నేరగాళ్లు వినియోగించిన 350 బ్యాంకు ఖాతాలను గుర్తించారు. వీటికి దేశవ్యాప్తంగా నమోదైన సుమారు 850 సైబర్ కేసులతో సంబంధం ఉందని, ఈ ఖాతాల ద్వారా దాదాపు రూ.150 కోట్ల మేర అమాయకుల ధరాన్ని లూటీ చేశారని వెల్లడైంది. బ్యాంకు అధికారులు మోసగాళ్లతో చేతులు కలిపి నిబంధనలకు విరుద్ధంగా ఖాతాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారని తేలింది. దీంతో బ్యాంకు అధికారుల పనిపట్టడానికి గత నెల్లో ‘ఆపరేషన్ ఆక్టోపస్–2.0’ చేపట్టారు. సిటీ సైబర్ క్రైమ్ ఠాణాకు చెందిన 16 ప్రత్యేక బృందాలు రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గుజరాత్, బీహార్ల్లో దాడులు నిర్వహించాయి. ఫలితంగా పట్టుబడిన 52 మందిలో 32 మంది బ్యాంకు అధికారులు కాగా... 15 మంది మ్యూల్ ఖాతాదారులు, ఐదుగురు మధ్యవర్తులు ఉన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన బ్యాంకు అధికారుల్లో వివిధ బ్యాంక్లకు చెందిన మేనేజర్లు, కేవైసీ అప్రూవర్లు, రిలేషన్షిప్ మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు, క్లర్కులు ఉన్నారు. వీరి విచారణలో వెలుగులోకి వచ్చిన, దర్యాప్తులో గుర్తించిన అంశాలతో సజ్జనర్ ఆర్బీఐకి లేఖ రాయగా దీన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ సమస్య పరిష్కారం కోసం గురువారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో ఆర్థిక మంత్రిత్వ శాఖ సెక్రటరీ ఎం.నాగరాజు, ఉన్నతాధికారులు, సీబీఐ డైరెక్టర్, ఇండియన్ సైబర్ క్రైౖ మ్ కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేష్ కుమార్, వివిధ బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లతో పాటు హైదరాబాద్ కొత్వాల్ వీసీ సజ్జనర్ పాల్గొన్నారు. దీంతో బ్యాంకింగ్ రంగంలో ఉన్న లోపాలు బహిర్గతం కీలక సమావేశం ఏర్పాటు చేసిన ఆర్థిక మంత్రిత్వ శాఖ రాష్ట్రం నుంచి హాజరైనహైదరాబాద్ కొత్వాల్ సజ్జనర్ -
’కారా’ ద్వారానే పిల్లలను దత్తత తీసుకోవాలి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పిల్లలను దత్తత తీసుకోవాలని భావించే వారు విధిగా కారా (సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ) పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ కరణ్మయి కొమ్మిశెట్టి సూచించారు. ఇతర మార్గాల ద్వారా పిల్లలను దత్తత తీసుకోవడం ద్వారా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్లో ‘లీగల్ అడాప్షన్ పోస్ట్ కేర్’ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దత్తతపై సరైన అవగాహన లేక చాలా మంది తప్పుడు మార్గంలో పిల్లలను తెచ్చుకుని పెంచుకుంటున్నారని, ఆ తర్వాత ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారని తెలిపారు. చట్టబద్ధమైన దత్తత కోసం కేంద్ర ప్రభుత్వం కారా పోర్టల్ను తీసుకొచ్చిందని చెప్పారు. ఔత్సాహికులు ముందుగా ఈ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకుని, లీగల్గా దత్తత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి శ్రీలత, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు రమాదేవి, తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ బియ్యానికి రెక్కలు
దుద్యాల్: నిరుపేదల ఆకలి తీర్చాల్సిన సన్నబియ్యం పక్కదారి పడుతోంది. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఈ బియ్యానికి కర్ణాటకలో మంచి డిమాండ్ ఉంది. దీంతో కొంతమంది ముఠాగా ఏర్పడి దందాకు తెరలేపారు. లబ్ధిదారులకు కిలోకు రూ.15 చొప్పున చెల్లించి, రూ.30 లెక్కన విక్రయిస్తున్నారు. ఈక్రమంలో పెద్ద మొత్తంలో సొమ్ము చేతులు మారుతోంది. స్థానిక వ్యాపారులు, దళారులు సేకరించిన రేషన్ బియ్యాన్ని ముందుగా తెలంగాణ– కర్ణాటక సరిహద్దు గ్రామాలకు తరలించి, అక్కడి నుంచి గమ్య స్థానాలకు చేరుస్తున్నారు. దుద్యాల్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి బియ్యం సేకరించి, దౌల్తాబాద్ మీదుగా కర్ణాటకకు తరలిస్తున్నారు. నేరమని తెలిసినా.. ఆటోలు, ఇతర వాహనాల ద్వారా గ్రామాల్లో తక్కువ ధరకు బియ్యం సేకరిస్తున్న దళారులు వీటిని ఒకచోట డంప్ చేస్తున్నారు. లోడ్కు సరిపడా సరుకు సిద్ధం కాగానే, ఆటోల్లో నింపి మరో చోటకు తరలిస్తున్నారు. కొంత కమీషన్ తీసుకుని పెద్ద వ్యాపారులకు అమ్మేస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని బడా వ్యాపారులు లారీలు, డీసీఎంలలో నింపి పక్క రాష్ట్రాలకు తీసుకెళ్లి సొమ్ము చేసుకుంటున్నారు.వారం క్రితం మండలంలోని పలు గ్రామాల్లో దాడులు చేసిన అధికారులు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. దీనిపై పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. రేషన్ బియ్యం అమ్మడం, కొనడం నేరమని తెలిసినప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సివిల్ సప్లయ్ అధికారులు తమకేమీ పట్టనట్లు ఉంటున్నారు. కిలోకు రూ.15కు కొనుగోలు.. రూ.30 చొప్పున విక్రయం మండలంలో జోరుగా అక్రమ దందా లక్షలు సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు రాష్ట్రం దాటి వెళ్తున్న పేదల బియ్యం -
ఫలితం ఏముంది!
వికారాబాద్: గతంతో పోలిస్తే జిల్లా విద్యాశాఖ ఈ సారి కాస్త మెరుగైన ఫలితాలు సాధించగా ఒడిదుడుకుల్లోనే కొనసాగుతోంది. సీఎంతో పాటు విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్రెడ్డి సొంత జిల్లాలో మానవ వనరుల అభివృద్ధిలో కీలక భూమిక పోషించే విద్యాభివృద్ధి పరిస్థితి మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఇంకా వెనుకబాటులోనే ఉంది. గడిచిన ఐదేళ్ల పలితాలను విశ్లేషిస్తే ఫలితాల పరంగా అట్టడుగునే ఉండగా విద్యార్థుల ఉత్తీర్ణత శాతం మాత్రం మెరుగవుతోంది. ఫలితాల్లో వెనకబాటుకు గురైన సమయంలోనే మొక్కుబడిగా ఈ విషయం చర్చకు వస్తుందే తప్ప విద్య అనేది ప్రాధమ్యాల్లో ఒకటిగా ఉండటంలేదు. ప్రభుత్వాలు సైతం మౌలిక సదుపాయాల మీద కేంద్రీకరిస్తున్న దృష్టి విద్య, విద్యా ప్రమాణాల విషయంలో కనిపించడంలేదు. ఫలితాల్లో వెనకబడిన ప్రతిసారి జిల్లా విద్యాధికారిని లేదంటే ఆ పాఠ శాల హెచ్ఎంను బాధ్యులు చేస్తున్నారు తప్పితే మూలాలను పరిగనలోకి తీసుకుని విశ్లేషించడంలేదనేది విశ్లేషకుల భావన. రాష్ట్ర చివరి అంచుల్లో ఉన్న ములుగు జిల్లా ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిస్తే రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న సీఎంగా, విద్యా శాఖ మంత్రిగా ఉన్న రేవంత్రెడ్డి జిల్లా మాత్రం అట్టడుగున నిలుస్తోంది. జిల్లాకు చెందిన దోమ, కుల్కచర్ల, దుద్యాల, బొంరాస్పేట, బంట్వారం లాంటి మండలాలు అక్షరాస్యతా విషయంలో జాతీయ స్థాయి కంటే అట్టడుగున ఉన్నాయి. ఇలాంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్న జిల్లాలో ఫలితాల పెంపునకు ప్రభుత్వపరంగా ఎలాంటి ప్రత్యేక ప్రణాళికలు లేకుండా ఒక్కసారిగా టాప్లో నిలవాలని ఆశించటం కూడా సరికాదు. మూడేళ్లుగా అట్టడుగునే.. విద్యార్థులు పాశాలలో చేరింది మొదలు వారి ప్రతిభను గుర్తించే మొదటి బోర్డు ఎగ్జామ్ 10వ తరగతి మాత్రమే. టెన్త్ ఫలితాల్లో గడిచిన మూడేళ్లుగా రాష్ట్రంలో అట్టడుగు స్థానం(33)లోనే నిలిచాం.అయినా మన జిల్లా నేతలకు , ప్రజాప్రతినిధులకు చీమకుట్టినట్టు లేదు. ఫలితాల్లో అట్టడుగున ఉంటున్నా ఏ ఒక్క ఎమ్మెల్యే, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు కనీసం అధికారులను సమావేశమై రివ్యూ చేసిన దాఖలాలు లేవు. వెనుకబాటుకు మూలాలను అన్వేశించిన పాపాన పోలేదు. ఫలితాలు మెరుగయ్యేందుకు జిల్లా విద్యాశాఖకు ఎలాంటి సపోర్టు అవసరమో కనీసం తెలుసుకోలేదు. రోడ్లు, చెట్టు, మొక్కలు, పొలాలు, భూములు, భవనాలు ఇలాంటివాటన్నింటి గురించి సమీక్షలు చేసే ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు మన భావిభారత పౌరులు, జిల్లా భవిషత్ అయిన చిన్నారుల గురించి సమీక్షలు చేయడంలేదు. 35 జెడ్పీహెచ్ఎస్లలో వందశాతం ఉత్తీర్ణత గతంతో పోలిస్తే ఈ ఏడాది ఫలితాల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారనే చెప్పాలి. జిల్లాలో ని ప్రభుత్వ పాఠశాలల్లో 90 శాతానికి పైగా పాఠశాలల్లో తొంభై శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 85 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. 85లో 35 జెడ్పీహెచ్ఎస్లే. జిల్లా వ్యాప్తంగా 53 ప్రభుత్వ రంగ పాఠశాలల్లో వంద శాతం రిజల్టు సాధించడం సానుకూలాంశం. జిల్లా లో 13,482 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఇందులో 91.25 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యా రు. 1,180 మంది విద్యార్థులు ఫెయిల్ అవ్వగా 589 మంది విద్యార్థులు సైన్స్, 342 మంది గణితంలో అనుత్తీర్ణులయ్యాయరు. ఈ రెండు సబ్జెక్టులను మెరుగుపర్చుకుంటే రిజల్టు 95 శాతానికి పైకి ఎగబాగే అవకాశం ఉంది. విద్యాశాఖ ఈ విషయాలను గుర్తించి ఫోకస్ చేస్తే మన జిల్లా టాప్టెన్లోకి వెళ్లడం పెద్ద కష్టమేమి కాదని స్పష్టమవుతోంది. పదోతరగతి ఫలితాల్లోమళ్లీ వెనుకబాటే.. ఉత్తీర్ణత పెరిగినా.. మెరుగుపడని స్థానంవిద్యా సంవత్సరం ఉత్తీర్ణత శాతం రాష్ట్ర స్థాయి స్థానం 2021–22 90.42 24వ 2022–23 59.5 33వ 2023–24 64.8 33వ 2024–25 73.6 33వ 2025–26 91.25 31వ -
తాండూరు కేంద్రంగా రైతు వారోత్సవాలు
● ప్రారంభించనున్న మంత్రులు తుమ్మల, దుద్దిళ్ల ● జిల్లా వ్యవసాయాధికారి రాజారత్నం తాండూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4వ తేదీ నుంచి 9వరకు జిల్లా స్థాయి రైతు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి టి.రాజారత్నం తెలిపారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి నేతృత్వంలో పట్టణంలోని ఎస్వీఆర్ గార్డెన్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం ఆయన మార్కెట్ కమిటీ చైర్మన్లు పట్లోళ్ల నర్సింలు, అంజయ్య, మాధవరెడ్డి, మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్రెడ్డి, అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లాలోని ప్రతీ క్లస్టర్ నుంచి 50 మంది రైతులు వారోత్సవాలకు హాజరయ్యేలా వ్యవసాయాధికారులకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. రైతు వారోత్సవాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తాండూరు నుంచి ప్రారంభించనున్నారన్నారు. ఈ ప్రారంభోత్సవానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్కుమార్, ఎమ్మెల్యేలు బుయ్యని మనోహర్రెడ్డి, రామ్మోహర్రెడ్డి, కలెక్టర్ దీపక్ తివారీ, వ్యవసాయ శాఖ అధికారులతో పాటు అనుభంధ శాఖల అధికారులు హాజరవుతారని చెప్పారు. ఈ వారోత్సవాల్లో రైతులు పంట ఉత్పత్తుల స్టాల్స్ ప్రదర్శించనున్నారు. మరోవైపు ఉద్యాన శాఖ అయిల్ ఫామ్ సాగు చేసే రైతులు, పట్టు పరిశ్రమ సాగు చేసే రైతులు, పశు సంవర్ధక శాఖ నుంచి లబ్ధి పొందుతున్న రైతులు తప్పక హజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు తదితరులున్నారు. -
ధరలు పెరుగుతాయ్.. భూములు అమ్ముకోవద్దు
● మరో హైదరాబాద్గా మారనున్న వికారాబాద్ ● శాససనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ధారూరు: భవిషత్తులో వికారాబాద్ రెండో హైదరాబాద్గా అభివృద్ధి చెందనుందని, ఎవరూ కూడా తమ భూములు విక్రయించవద్దని శాససనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. గురువారం ధారూరు మండలం గురుదోట్ల గ్రామ పంచాయతీ పరిధి వెనకతండా, కుక్కిందలో తొలుత లబ్ధిదారు ఇందిరమ్మ ఇంటిని, అనంతరం నాగసమందర్లో నూతనంగా నిర్మించిన చర్చిని ప్రారంభించి మాట్లాడారు. వికారాబాద్ ప్రాంతానికి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చి, అభివృద్ధి చేస్తానని చెప్పారు. దీంతో మన ప్రాంతంలో భూముల ధరలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పుడు భూములు అమ్ముకుంటే.. ఆ తరువాత చింతించాల్సి వస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూ సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాన్సింగ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హన్మంత్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాములు, కుక్కింద, గురుదోట్ల సర్పంచులు మణెమ్మ, రాములు, కాంగ్రెస్ కమిటీ జిల్లా కార్యదర్శి మహ్మద్ బాబాఖాన్, నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్తోనే సొంతింటి కల సాకారం అనంతగిరి: ఇచ్చిన హామీలను ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తందని స్పీకర్ ప్రసాద్కుమార్ అన్నారు. వికారాబాద్ మండలం బురాన్పల్లిలో లబ్ధిదారు ఇందిరమ్మ ఇంటిని గురువారం ప్రారంభించారు. లబ్ధిదారు దంపతులకు నూతన వస్త్రాలు అందజేసి మాట్లాడారు. పేదవారి సొంతింటి కల కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. అర్హులు ఎవరూ ఆందోళన చెందవద్దని, విడతల వారీగా అందరికీ ఇంటిని నిర్మించి ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ రాందాస్నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు మైపాల్రెడ్డి, వైస్ చైర్మన్ మల్లేశం, ఎంపీడీఓ వినయ్కుమార్, ఎంపీఓ దయానంద్, సీనియర్ నాయకుడు మనోహర్గౌడ్, పంచాయతీ కార్యదర్శి స్వాతి, ఉప సర్పంచ్ మంజుల, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
మే డే వేడుకలు ఘనంగా నిర్వహించాలి
కలెక్టర్ దీపక్ తివారీ సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మహిపాల్ అనంతగిరి: అంగన్వాడీ టీచర్లకు బీఎల్ఓ డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మహిపాల్ అన్నారు. ఈ మేరకు గురువారం వికారాబాద్లో అంగన్వాడీ ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట ఽఅంగన్వాడీ యూనియన్(సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని, 4జీ సెల్ఫోన్లు వాపస్ తీసుకుని 5జీ మొబైల్స్ ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేయాలని, అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలని మాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మి, సుజాత, మానస, అన్నపూర్ణ, చంద్రకళ, లక్ష్మి, భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. హుడాకాంప్లెక్స్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా యువజన సేవలు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో 11వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్టు కలెక్టర్ నారాయణరెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో 162 ప్రముఖ కంపెనీలు పాల్గొని నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలను అందించనున్నట్టు తెలిపారు. ఐటీ, హెల్త్ కేర్, ఇండస్ట్రియల్, ఫార్మా, రిటైల్, బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, సేవా రంగం తదితర అనేక విభాగాలకు చెందిన సంస్థలు పాల్గొంటాయని చెప్పారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంబీఏ వంటి అర్హతలతో ఉన్న అభ్యర్థులకు అనేక ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయన్నారు. అభ్యర్థులు తమ అర్హతలకు అనుగుణంగా ఉద్యోగాలను ఎంపిక చేసుకుని, అదే రోజున ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. అర్హులైన నిరుద్యోగ యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. https://satg. `telangana.gov.in/prajapalana/ వెబ్ లింక్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. తమ బయోడేటా, విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డు, అవసరమైన ధ్రువపత్రాలతో హాజరుకావాల్సిందిగా కోరారు. సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ సుధాకర్ బండారి ఎన్నికయ్యారు. సమీప ప్రత్యర్థిపై ఆయన 28 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ మేరకు గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఓటింగ్ నిర్వహించారు. డాక్టర్ అనురాగిణిరెడ్డి, డాక్టర్ వినోద్, డాక్టర్ వినయ్, డాక్టర్ చంద్రకృష్ణ, డాక్టర్ శ్రీలత, డాక్టర్ రాకేష్, డాక్టర్ శ్రీకర్, డాక్టర్ గాయిత్రీలతో కూడిన వైద్య బృందం ఈ సందర్భంగా ఆయన్ను సన్మానించింది. బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వీరయ్య -
పిడుగుపాటుకు మేకల కాపరి మృతి
తాండూరు రూరల్: పిడుగుపాటుకు మేకల కాపరి మృతిచెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈఘటన పెద్దేముల్ మండలం కొండాపూర్లో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన కొడి ఆనందం(42), నీరటి నర్సింలు, ఏర్పుల జాని మేకలు మేపేందుకు పొలాలకు వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తున్న క్రమంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో గ్రామ సమీపంలోని ఓ చింత చెట్టుకింద జీవాలను తోలి అక్కడే నిల్చున్నారు. దీంతో ఒక్కసారిగా భారీ శబ్ధంతో పిడుగు పడడంతో వారు స్పృహతప్పి పడిపోయారు. వర్షం తగ్గాక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెళ్లి పరిశీలించి వారిని తాండూరులోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆనందం మృతి చెందినట్లు నిర్ధారించారు. మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడికి భార్య అనసూజ, కూతురు, కొడుకు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు -
జాగ ఇచ్చి ఇళ్లు కట్టిస్తాం
బషీరాబాద్: ఇందిరమ్మ పథకంతో పేదల సొంతింటి కల సాకారం చేస్తున్నామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో గూడులేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నామని చెప్పారు. బుధవారం బషీరాబాద్ మండలం కాశీంపూర్, ఇందర్చెడ్ గ్రామాల్లో ఇందిరమ్మ పథకం కింద నిర్మించిన ఇళ్లకు లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి భోజనాలు చేశారు. ఈ సంరద్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. త్వర లో మలివిడత కింద పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అవుతాయని చెప్పారు. ఇప్పటి వరకు ఇంటి జాగ ఉన్న వారికి ఇళ్లు ఇచ్చామని, మున్ముందు జాగలు లేని వారికి ప్రభుత్వమే జాగ ఇచ్చి ఇళ్లు కట్టిస్తుందని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్రెడ్డి సర్కారు అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని.. అందుకే సంక్షేమ పథకాలు వారి పేరునే అమలు చేస్తున్నామన్నారు. అంతరాష్ట్ర రోడ్ల అనుసంధానం జిల్లా సరిహద్దులో ఉన్న బషీరాబాద్కు పొరుగున ఉన్న కర్ణాటక రోడ్లతో అనుసంధానం చేయడానికి కొత్త రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. యాలాల మండలం బండమీదిపల్లి గేటు–మైల్వార్ మీదుగా కర్నాటకలోని సేడం జాతీయ రహదారికి అనుసంధానం చేస్తున్నట్లు చెప్పారు. బషీరాబాద్–హల్కోడ వరకు రోడ్డు నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయన్నారు. జీవన్గీ రోడ్డు పూర్తయితే తాండూరు మండలం కరణ్కోట్ నుంచి బషీరాబాద్ మీదుగా కర్ణాటకకు భారీ వాహనాల రాకపోకలకు వీలుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మాధవరెడ్డి, ఆత్మ చైర్మన్ శంకర్రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ వెంకట్ రామ్రెడ్డి, బషీరాబాద్ సర్పంచ్ వెంకటేశ్ మహరాజ్, మాజీ వైస్ చైర్మన్ అజయ్ప్రసాద్, మాజీ ఏఎంసీ మాణిక్రెడ్డి, నాయకులు సుధాకర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, చందర్నాయక్, బిచ్చిరెడ్డి, జీవన్గీ నర్సిరెడ్డి, మంతట్టి తలారి సురేశ్, బిచ్చిరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, లబ్ధిదారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు కుల్కచర్ల: ప్రభుత్వం అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు లందజేస్తుందని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు అన్నారు. బుధవారం మండల పరిధిలోని దాస్యనాయక్ తండాలో గంగావిఠల్ నాయక్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినహామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు తిరుపతయ్య, శ్రీను, ఎంపీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మయ్య, చౌడాపూర్ కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటయ్య గౌడ్, ఏఎంసీ డైరక్టర్ రాంచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. మలివిడతలో భారీగా ఇందిరమ్మ ఇళ్లు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి -
ప్రభుత్వ హామీలను నెరవేర్చాలి
కందుకూరు: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఎమ్మెల్యే సబితారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 257 మందికి కల్యాణలలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెబుతూ పురుషులకు టికెట్ల ధరలు పెంచారన్నారు. నేదునూరులో పండించిన కుసుమ పంట కోసం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గోపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.కృష్ణనాయక్, ఎంపీడీఓ బి.సరిత, స్థానిక సర్పంచ్ సరికొండ పాండు, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. -
ఆలయ భూముల కౌలుకు వేలం
దోమ: సంజీవ స్వామి ఆలయ భూములను దేవాదాయ శాఖ అధికారులు కౌలు వేలం వేశారు. బుధవారం మండల పరిధి దొంగ ఎన్కేపల్లి గ్రామం ఆలయ ఆవరణలో వికారాబాద్ అనంత పద్మనాభ స్వామి ఆలయ ఈఓ నరేందర్, శ్రీ సంజీవ స్వామి ఆలయ ఈఓ బాలనర్సయ్య, ఎండోమేంట్ అధికారి ప్రణీత్, పోలేపల్లి ఎల్లమ్మ తల్లి ఈఓ రాజేందర్రెడ్డిలు కార్యక్రమం నిర్వహించారు. ఆలయానికి మొత్తం 104.19 ఎకరాల భూమి ఉండగా.. కొంత అన్యాక్రాంతం అయినప్పటికీ.. మిగతా వాటికి ప్రతి రెండేళ్లకు వేలం వేస్తుంటారు. వేలం వేసిన భూములు.. కిష్టాపూర్ 167 సర్వే నంబర్లో 38 గుంటలు, బ్రాహ్మణపల్లి 103 సర్వే నంబర్ 1.31 గుంటలు, హీరాపూర్ 23 సర్వే నంబర్ 4.18, రావులపల్లి 36 సర్వే నంబర్ 4.28, మంచన్పల్లి 66 సర్వే నంబర్ 9.39, ఖుదావంద్పూర్ 108 సర్వే నంబర్లో 4.20 గుంటలకు కౌలు వేలం వేయగా.. రూ.2,27,500లు ఆదాయం సమకూరింది. -
45 రోజుల తర్వాత ఇంటికి
పైలెట్ యోగక్షేమాలు తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు తాండూరు: తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి 45 రోజుల తర్వాత బుధవారం జైలు నుంచి విడుదలయ్యారు. అజీజ్నగర్ ఫామ్ హౌస్ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, ఆయన సోదరుడు రితీష్రెడ్డి, స్నేహితుడు అమిత్శర్మలను అరెస్టు చేసి మార్చి 15వ తేదీన చంచల్గూడ జైలుకు రిమాండ్కు తరలించిన విషయం విదితమే. ఈ క్రమంలో మంగళవారం రోహిత్రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. దీంతో బుధవారం మధ్యాహ్నం ఆయన జైలు నుంచి విడుదల కావడంతో బీఆర్ఎస్ తాండూరు నియోజకవర్గ నాయకులు మణికొండలోని పైలెట్ నివాసానికి చేరుకొన్నారు. సాయంత్రం ఆయన్ను కలిసి యోగాక్షేమాలు తెలుసుకున్నారు. -
అవగాహనతోనే సాగులో లాభాలు
బొంరాస్పేట: అవగాహనతో సాగుచేస్తే అధిక లాభాలు వస్తాయని డీఏటీటీ సెంటర్ ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త రాజేశ్వర్రెడ్డి అన్నారు. వ్వయసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ బీటీటీ(బ్లాక్ టెక్నాలజీ టీమ్) కన్వీనర్ శంకర్ రాథోడ్ ఆధ్వర్యంలో బుధవారం మండల పరిధిలోని రేగడిమైలారం రైతు వేదికలో రైతులకు శాస్త్రవేత్తలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బీఎఫ్ఏసీ, సామర్థ్య నిర్మాణం, నైపుణ్యత కొరకు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించారు. డీఏటీటీ సెంటర్ ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త రాజేశ్వర్రెడ్డి వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త పద్ధతులు, వ్యవసాయ యాంత్రీకరణ, నవీన మార్పులు, నానో యూరియా, నానో డీఏపీ, పంటమార్పిడి, కంది పట్టి పంటలపై చీడపీడల నివారణ అంశాలపై వివరించారు. ఆయిల్పామ్ సాగుపై అవగాహన, సస్యరక్షణ చర్యలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ బాలకృష్ణ, వినోద్, ఏఈఓలు హేమ, స్వాతి, శైలజ, జగదీశ్, సర్పంచు చిట్టెమ్మ, ఉపసర్పంచు చంద్రప్ప, గుండప్ప, వీరప్ప, వార్ల సురేశ్ తదితరులున్నారు. డీఏటీటీ సెంటర్ ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త రాజేశ్వర్రెడ్డి -
ఉత్తీర్ణత శాతం పెరగడం సంతృప్తి
గతేడాదితో పోలిస్తే రెండు స్థానాలు మెరుగుపర్చుకోగలిగాం. ఫలితాల పరంగా చూస్తే బాగా మెరుగయ్యాం. తాము ఆశించిన ఫలితాలు వచ్చినప్పటికీ స్థానం పరంగా ఇంకా కాస్తా మెరుగవ్వాల్సింది. ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు ఉపాధ్యాయులు ఎంతో కష్టపడ్డారు. ఈ ఫలితాలను బేరీజు వేసుకొని సప్లిమెంటరీలో వందశాతం ఫలితాలకోసం కార్యాచరణను రూపొందిస్తాం. ఏయే సబ్జెక్టులల్లో, ఏయే పాఠశాలల్లో తక్కువ ఫలితాలు వచ్చాయో సమీక్షించుకుని సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే వారికోసం ప్రత్యేకంగా క్లాసులు నిర్వహించాలని యోచిస్తున్నాం. ఉత్తీర్ణులకు అభినందనలు. – జి.రేణుకాదేవి, జిల్లా విద్యాధికారి -
సైబర్ నేరాలపై అవగాహన అవసరం
అనంతగిరి: సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా సంక్షేమాధికారి కృష్ణవేణి అన్నారు. ప్రజాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిషన్ వాత్సల్య పథకం, జిల్లా మహిళా శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖల ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణవేణి మాట్లాడుతూ.. సైబర్ నేరాలు 80 శాతం మొబైల్ ఫోన్ల వల్లే జరుగుతున్నాయన్నారు. విద్యార్థులు అవగాహన పెంచుకుని మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యక్తిగత వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. బహుమతులు పేరిట వచ్చే ఫోన్ కాల్స్కు స్పందిచవద్దని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలకు ఆకర్శితులై లింకులు ఓపెన్ చేయొద్దని చెప్పారు. 1930 నంబర్కు కాల్ చేయాలి అనంతరం డీఎస్పీలు జాన్యయ్య, శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థులకు సైబర్నేరాలపై పూర్తిగా అవగాహన ఉండాలన్నారు. బ్యాంకింగ్ మోసాలు, ఓటీపీ అడుగుతున్న ఫోన్ కాల్స్, సామాజిక మాధ్యమాల మోసాలపై అప్రమత్తత అవసరమన్నారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని లేదా సైబర్ క్రై వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఓటీపీ, ఓఎల్ఎక్స్, పేటీఎం, గూగూల్ పే, ఫోన్ పే, కేవైసీ అప్ డేట్ మెసేజ్లకు స్పందించొద్దన్నారు. అనంతరం నశాముక్త్ భారత్ వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఐఓ వరలక్ష్మి, ఎకై ్సజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాఘవీణ, కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్, లీడ్ బ్యాంక్ ఇండియా మేనేజర్ యాదగిరి, డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీకాంత్, డీసీపీయూ కౌన్సిలర్ లక్ష్మణ్, సోషల్ వర్కర్ వనమాల, మహిళా సాధికారత సిబ్బంది వరలక్ష్మి, బాబు చైల్డ్ లైన్ సూపర్ వైజర్ ఆనంద్, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా సంక్షేమాధికారి కృష్ణవేణి -
రసాయన ఎరువులతో భూసారం తగ్గుదల
● ‘ఏడబ్ల్యూడీ’తో సాగునీటి ఆదా ● జిల్లా వ్యవసాయాధికారి రాజారత్నం బషీరాబాద్: పంటల సాగులో రసాయన ఎరువుల వాడకాన్ని గణనీయంగా తగ్గించాలని జిల్లా వ్యవసాయ అధికారి రాజరత్నం రైతులకు సూచించారు. బుధవారం మండలంలోని కాశీంపూర్ రైతువేదికలో ‘రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రసాయన ఎరువులు వాడడం వలన భూమి సారం తగ్గిపోయి పంట ఉత్పాదక శక్తి తగ్గుతుందన్నారు. పురుగు మందుల ప్రభావం వలన పంటలకు మేలు చేసే వానపాములు, మిత్ర పురుగులు నశిస్తున్నాయని వివరించారు. రైతులు ప్రతీ ఏడాది పంట మార్పిడి తప్పని సరిగా చేసుకోవాలని సూచించారు. తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పరిమళ మాట్లాడుతూ.. రైతులు యూరియా వాడకాన్ని తగ్గించాలని సూచించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న మేలైన వరిరకాలను సాగు చేసి ఆదాయం పొందాలన్నారు. వరి సాగులో ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ (ఏడబ్ల్యూడీ) పద్ధతిని అనుసరించడం వలన సాగునీటిని ఆదా చేసుకోవచ్చని చెప్పారు. స్ప్రింక్లర్, డ్రిప్ ఇరిగేషన్ వంటి బిందు సేద్య పద్ధతులను అవలంబించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ శంకర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి అనిత, యంగ్ ప్రొఫెషనల్స్ సల్మాన్, కేశవ, కృష్ణ, ఏఈఓలు సౌమ్య, సామేల్, వసీం, ప్రవీణ్, విజయ్, నవీన్, వివిధ గ్రామాల సర్పంచ్లు, రైతులు పాల్గొన్నారు. -
కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
యాలాల: పెట్రోల్, డీజిల్ పక్కదారి పట్టకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ దీపక్ తివారీ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ మండలంలో తహసీల్దార్ కార్యాలయం, పీహెచ్సీ, ఫర్టిలైజర్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయంలో సివిల్ సప్లయ్ అధికారులు జిల్లాలోని అన్ని బంకులను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి కృత్రిమ కొరత లేకుంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. యాప్ ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. కొత్తగా నిర్మిస్తున్న పంచాయతీ కార్యాలయ భవనాలను వేసవిలోనే పూర్తి చేసేందుకు అధికారులు దృష్టిసారించాలన్నారు. స్థానిక పీహెచ్సీ సందర్శించి ఓపీ రిజిస్టర్లు, మందుల వివరాలను సిబ్బందిని అఢిగి తెలుసుకున్నారు. యాలాల మండల కేంద్రంలో ఇటీవల పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీఏఓ రాజారత్నం, డీఎంహెచ్ఓ స్వర్ణకుమారి, తహసీల్దార్ వెంకటస్వామి, డీటీ కిరణ్కుమార్, ఎంపీడీఓ శ్రీనిజ, ఎంఈఓ మహిపాల్రెడ్డి, ఏఓ శ్వేతరాణి, వైద్యాధికారి రూబియానాజ్, యాలాల సర్పంచ్ శివయ్య, కోఆప్షన్ మాజీ సభ్యుడు అక్బర్బాబా తదితరులు ఉన్నారు. -
మొక్కజొన్న క్వింటాల్కు రూ.2,400
మోమిన్పేట: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మర్పల్లి ఏఎంసీ చైర్మన్ మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాల్కు రూ. 2,400 మద్దతు ధర ప్రకటించిందని చెప్పారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులు ఏఈఓ ఇచ్చిన కూపన్తో పాటు ఆధార్, పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు పుస్తకం జిరాక్సు, ఫోన్ నంబర్ తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఓ నాగార్జున, పీఏసీఎస్ మోమిన్పేట ప్రత్యేకాధికారి మాధవి, తహసీల్దార్ రవీందర్, ఏఓ రామకృష్ణారెడ్డి, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు సురేందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శంకర్, నాయకులు సుభాశ్గౌడ్, ఎరాజ్, ఎజాస్, నర్సింలు, సీఈఓ శేఖర్, సిబ్బంది తదితరులు ఉన్నారు. మర్పల్లి ఏఎంసీ చైర్మన్ మహేందర్రెడ్డి -
ముగిసిన జనగణన ఎన్యుమరేటర్ల శిక్షణ
కుల్కచర్ల: జనగణన సర్వే నిర్వహించేందుకు కొనసాగుతున్న రెండో విడత శిక్షణ కార్యక్రమాలు బుధవారంతో ముగిసాయి. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కొనసాగుతున్న కార్యక్రమంలో తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, రెవెన్యూ అధికారులు జనగణనలో పాటించాల్సిన నియమనిబంధనల గూర్చి వివరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కొడంగల్: అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మే 6వ తేదీన మండల పరిధిలోని అప్పాయిపల్లి(ఎరన్పల్లి)లో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ ఉంటుందని ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్లను మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ బుధవారం వేర్వేరుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మధుయాదవ్, ఎరన్పల్లి శ్రీనివాస్, మహిపాల్, గోకుల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కుల్కచర్ల: చౌడాపూర్ మండలం మందిపల్ ఓంకారేశ్వరాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. ఆలయంలో ఉన్న బోరును గుర్తుతెలియని వ్యక్తులు వేసి వదిలేశారు. తెల్లవారుజాము వరకు అలాగే ఉండడంతో మోటారు కాలిపోయి మంటలు చెలరేగి అగ్నిప్రమాదం సంభవించి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదం విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చామని ఆలయ అర్చకులు మఠం రాజశేఖర్ తెలిపారు. ఆలయ శుద్ధి అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తామన్ని చెప్పారు. కుల్కచర్ల: కంటి వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మండల వైధ్యాధికారి కిరణ్కుమార్, ఆప్తమాలిక్ అసిస్టెంట్ జవహార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రతీ బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తామని చెప్పారు. ఈ వైద్యశిబిరంలో 54 మంది పాల్గొనగా 35 మందిని ఆపరేషన్ నిమిత్తం నగరంలోని పుష్పగిరి ఆస్పత్రికి రెఫర్ చేశామన్నారు. ● గొడ్డలితో దాడి చేసిన భర్త ● అక్కడికక్కడే ప్రాణం వదిలిన భార్య మీర్పేట: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమైపె గొడ్డలితో దాడి చేసి చంపిన ఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఆదిబట్ల ఏసీపీ ప్రదీప్కుమార్రెడ్డి కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా శివన్నగూడకు చెందిన నల్లబోతు నర్సింహ, వసంత (52)కు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఉపాధి నిమిత్తం వచ్చి, ఇరవై ఏళ్లుగా బీఎన్రెడ్డినగర్ టీచర్స్కాలనీలో ఉంటున్నారు. నర్సింహ కూలీ, వసంత ఇళ్లలో పనిచేస్తూ జీవిస్తున్నారు. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున 5:45 గంటలకు ఓ ఇంట్లో పని ముగించుకుని, ఇంటికి తిరిగి వస్తున్న భార్యకు ఎదురెళ్లిన నర్సింహ గొడ్డలితో దాడి చేశాడు. మెడ భాగంలో తీవ్ర గాయాలు కావడంతో వసంత సంఘటనా స్థలిలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఏసీపీ ప్రదీప్కుమార్రెడ్డి, మీర్పేట డీఐ గౌరునాయుడు సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని, నిందితుడు నర్సింహను అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ తెలిపారు. -
చికిత్స పొందుతున్న యువకుడు మృతి
కొడంగల్ రూరల్: చికిత్స పొందుతున్న క్షతగాత్రుడు బుధవారం మృతి చెందాడు. ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన ప్రకారం.. పట్టణంలోని తెలంగ్వాడకు చెందిన శివకుమార్(31)న 27న రాత్రి రావులపల్లి రోడ్డు మీదుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో శివకుమార్ అకస్మాత్తుగా కిందపడిపోవడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. తీవ్రగాయాలు కావడంతో క్షతగాత్రుడిని నగరంలోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న శివకుమార్ పరిస్థితి విషమించి మృతి చెందాడు. కాగా ఎదురుగా వస్తున్న లారీ వెనుక భాగం శివకుమార్కు తగలడంతోనే కిందపడిపోయినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
కొడంగల్కు దొంగల భయం
కొడంగల్: పట్టణంలోని పలు కాలనీల ప్రజలకు దొంగల భయం పట్టుకుంది. గతంలో శాంతినగర్ కాలనీలో పలుమార్లు చోరీలు జరిగాయి. ఇప్పుడు పట్టణంలోని సన్సిటీ కాలనీ ప్రజలు భయం గుప్పిట్లో నిద్రిస్తున్నారు. మంగళవారం రాత్రి కొంతమంది దుండగులు తాళం వేసిన ఇళ్లల్లోకి చొరబడి చోరీకి యత్నించారు. ఇళ్లలోని బీరువాలను తెరిచి చూశారు. కాగా చోరీల్లో ఎటువంటి ఆస్తి నష్టం కలగలేదు. ఈ విషయంపై కాలనీవాసులు బుధవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సత్యనారాయణ ఉదయం కాలనీకి వెళ్లి సీసీ పుటేజీలు పరిశీలించి దుండగులు సంచరిస్తున్నట్లు నిర్ధారించారు. రాత్రి వేళ గస్తీ పెంచుతామని ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని భరోసా కల్పించారు. -
అనైక్యతతోనే గెలిచిఓడాం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆమనగల్లు: బీఆర్ఎస్ నాయకుల అనైక్యత వల్లే ఆమనగల్లు మున్సిపాలిటీ కోల్పోయామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆమనగల్లులో గెలిచి ఓడిపోయామని, దీనికి ఎవరినీ బాధ్యులను చేయనని తెలిపారు. నగరంలోని తెలంగాణ భవన్లో బుధవారం మాడ్గుల మండలం అప్పారెడ్డిపల్లికి చెందిన ఎన్ఆర్ఐ, తెలంగాణ బ్లాక్ వాయిస్ అధ్యక్షుడు గోవింద్ శ్రీధర్ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీన్కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ అతనికి కండువా వేసి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆమనగల్లు మున్సిపాలిటీలో 15 సీట్లకు గాను 8 బీఆర్ఎస్ గెలిచిందని, బీఆర్ఎస్కు మెజార్టీ సీట్లు వచ్చినా మున్సిపాలిటీ చేజారిందని ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలు మెచ్చే విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని, రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రగతిపథంలో నిలిపారని గుర్తుచేశారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ నాయకులు కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ద్యాప విజితారెడ్డి, జీఎల్ఎన్రెడ్డి, గంప వెంకటేశ్, నిర్మల శ్రీశైలంగౌడ్, శ్రీనివాస్యాదవ్, ఏమిరెడ్డి జైపాల్రెడ్డి, రమేశ్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, లాలయ్యగౌడ్, శంకర్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
డ్రోన్ పైలెట్లుగా ట్రాన్స్జెండర్లు
సాక్షి, సిటీబ్యూరో: అడుగడుగునా సామాజిక సవాళ్లు.. అయినా వారిలో గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తూ, ఉన్నతంగా జీవించాలనే కాంక్ష..! ఇదీ ట్రాన్స్జెండర్ల పరిస్థితి. అందుకే, వారి అభ్యున్నతికి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం... వివిధ రంగాల్లో మార్కెట్ అవసరాలకు తగ్గట్లు సాంకేతికత, నైపుణ్య శిక్షణ ఇస్తోంది. వ్యవసాయం, సర్వేయింగ్, పారిశ్రామికంగా డ్రోన్ల వినియోగం పెరుగుతున్నందున ఆ డిమాండ్ను తీర్చేందుకు ట్రాన్స్జెండర్లకు డ్రోన్ పైలెట్ శిక్షణ ప్రారంభించింది. దేశంలోనే తొలిసారిగా.. బేగంపేటలోని తెలంగాణ రాష్ట్ర ఏవియేషన్ అకాడమీ (టీఎస్ఏఏ)లో మొదటి బ్యాచ్లో 16 మందికి తర్ఫీదు ఇచ్చింది. ఇప్పటికే మెట్రో, హైడ్రా, ట్రాఫిక్ విభాగాల్లో పనితీరుతో గుర్తింపు తెచ్చుకుంటున్న ట్రాన్స్జెండర్లు... అతి త్వరలో పైలెట్లుగా డ్రోన్ రంగంలోనూ అడుగు పెట్టనున్నారు. డీజీసీఏ లైసెన్స్.. జ్యూట్ బ్యాగ్ల తయారీ, టైలరింగ్, వాహనాల డ్రైవింగ్ వంటి శిక్షణకే ట్రాన్స్జెండర్లు పరిమితమయ్యేవారు. ఏ విభాగంలోనైనా ఉద్యోగాలకు ప్రయత్నించినప్పుడు ప్రత్యేకంగా నైపుణ్యం ఉందా అనే ప్రశ్న ఎదురవుతుంది. అందుకే సాంకేతిక శిక్షణ అవసరమని దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, టాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ గుర్తించింది. ఈ మేరకు డ్రోన్ పైలెట్ శిక్షణకు శ్రీకారం చుట్టింది. మార్కెట్లో డిమాండ్ ఉన్న సేవల్లో సుశిక్షిత అభ్యర్థులకు జెండర్తో సంబంధం ఉండదు. అందుకే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ సహా పలు జిల్లాల నుంచి 16 మంది ట్రాన్స్జెండర్లను ఎంపిక చేసి డ్రోన్ పైలెట్లో శిక్షణ ఇచ్చారు. డ్రోన్ ఫ్లయింగ్ నిబంధనల నుంచి మొదలుపెట్టి, పైలెట్ శిక్షణ, ఉపకరణాల బిగింపు, స్పేర్ పార్ట్స్ తొలగింపు, స్టిమ్యులేషన్ దాక అన్ని దశల్లో శిక్షణ సాగింది. అనంతరం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) లైసెన్స్, టీఎస్ఏఏ సర్టిఫికేషన్తో అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా డ్రోన్ పైలెట్ చేసేందుకు అర్హులు. తెలంగాణ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ దేశంలో తొలిసారిగా మన రాష్ట్రంలో ట్రెయినింగ్ డీజీసీఏ లైసెన్స్తో దేశంలో ఎక్కడైనా పైలెట్గా అవకాశం ఇప్పటివరకు మెట్రో, హైడ్రా, ట్రాఫిక్ విభాగాల్లో ట్రాన్స్జెండర్లు త్వరలోనే పైలెట్స్గా డ్రోన్స్ విభాగంలోనూ వీరి సేవలుడిమాండ్ ఉన్న రంగం ట్రాన్స్జెండర్లు లాభదాయకమైన ఉపాధిని పొందకుండా పలు సామాజిక అవరోధాలున్నాయి. డ్రోన్ పైలెట్ శిక్షణ అనేది సాంకేతిక నైపుణ్యత. దీనిని అందిచడంలో టీఎస్ఏఏ భాగమైనందుకు సంతోషంగా ఉంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న రంగం కావడంతో త్వరలోనే వారు ఉపాధి పొందుతారని ఆశిస్తున్నాం. –దినకర్ దేవిరెడ్డి, హెడ్, తెలంగాణ ఏవియేషన్ అకాడమీ -
ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించాలి
ఉద్యానశాఖ హెచ్ఈఓ బాబ్యానాయక్ కొడంగల్ రూరల్: రైతులు ఆయిల్పామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉద్యానశాఖ హెచ్ఈఓ బాబ్యానాయక్ సూచించారు. బుధవారం మండల పరిధిలోని పర్సాపూర్ రైతువేదికలో సర్పంచ్ కన్నం రాధాశ్రీనివాస్రెడ్డి అధ్యక్ష్యతన జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ, ఇంకో ఫామ్ఆయిల్, ఫాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ అంబయ్యగౌడ్, ఏకో ఫామ్ మేనేజ్మెంట్ సంజయ్సోని, వికారాబాద్ ఏరియా మేనేజర్ రాము పంట సాగులో ప్రభుత్వ సబ్సిడీలు, మార్కెటింగ్, దిగుబడి గురించి రైతులకు వివరించారు. టేకుల్కోడ్ గోవర్దన్రెడ్డి ఆయిల్పామ్ గురించి తన అనుభవాలను రైతులకు తెలియజేశారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు, రైతులు పాల్గొన్నారు. అనంతగిరి: వికారాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారిగా పనిచేస్తున్న జ్ఞానేశ్వర్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పలువురు ఫారెస్టు అధికారుల బదిలీల్లో జ్ఞానేశ్వర్ను బదిలీ చేస్తూ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. కాగా వికారాబాద్కు ఇంకా ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. అనంతగిరి: మే 3వ తేదీన నీట్ పరీక్ష నేపథ్యంలో జిల్లాలో ఏర్పాటు చేసిన నాలుగు కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సెంటర్లలోని మౌలిక వసతులు, తదితరాలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలన్నారు. నిబంధనల ప్రకారం అభ్యర్థులను తనిఖీ చేసాకే సెంటర్లలోకి అనుమతించాలని సూచించారు. ● ఉరి వేసుకుని దుర్మరణం ● స్టేషన్ధారూరులో ఘటన ధారూరు: వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన స్టేషన్ధారూరు గ్రామంలో ఉదయం 9:30 గంటలకు చోటుచేసుకుంది. సీఐ రఘురామ్, ఎస్ఐ రాఘవేందర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. స్టేషన్ధారూరుకు చెందిన డెగావత్ రాములునాయక్, గమినిబాయిల కూతురు తులసి(23) కానిస్టేబుల్గా పనిచేస్తోంది. ఆమె అన్న రాజు వికారాబాద్లో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. రాజు పనిచేస్తున్న చోటే నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రానికి చెందిన పద్దుల మౌనిక ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తూ తులసి, రాజుకు చెందిన రూమ్లో ఏడాదిగా కలిసి ఉన్నారు. రాజు, మౌనిక మధ్య ప్రేమాయణం నడిచింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన రాజు మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. దీంతో మౌనిక రూమ్ ఖాళీ చేసి ఇంటికి వెళ్లిపోయింది. ఇటీవల తల్లిదండ్రులు ఆమెకు వివాహం కుదిర్చినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న రాజు.. మౌనికతో దిగిన ఫొటోలను పెళ్లి కొడుకుకు పంపించినట్లు సమాచారం. దీంతో ఈనెల 27న మౌనిక తన కుటుంబ సభ్యులతో వచ్చి రాజుతో పాటు తులసిపై వికారాబాద్ పీఎస్లో ఫిర్యాదు చేసింది. రాజు తనను వెంటాడి టార్చర్ చేస్తున్నాడని, తులసి ఇందుకు సహకరిస్తోందని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఎస్ఐ తులసిని పీఎస్కు పిలిపించగా అక్కడే ఉన్న మౌనిక, అతని సోదరుడు మధు, స్నేహితుడు శేఖర్ ఆమెను బెదిరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తులసి బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు మౌనికపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
నిరంతరంగా ఇంధన సరఫరా
● స్టాక్ లోపాలు లేకుండా జాగ్రత్తలు పాటించాలి ● కలెక్టర్ దీపక్ తివారీ ● పెట్రోల్ పంపు యాజమాన్యాలతో సమీక్ష అనంతగిరి: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని.. వాహనదారులు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. బుధవారం ఆయన కలెక్టరేట్ నుంచి పెట్రోల్ పంపు యాజమాన్యాలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా, ధరల ప్రదర్శన, వినియోగదారులకు అందిస్తున్న సేవల నాణ్యతపై ఆరా తీశారు. ఇంధన సరఫరా నిరంతరంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, స్టాక్ లోపాలు లేకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలను స్పష్టంగా ప్రదర్శించడం, వినియోగదారులకు సరైన కొలతలతో ఇంధనం అందించడం, అక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. పెట్రోల్ పంపుల వద్ద తహసీల్దార్, పోలీస్ సిబ్బందితో కమిటీ ఏర్పాటు చేసి అన్ని పెట్రోల్ పంపులను పర్యవేక్షించాలని చెప్పారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రాము నాయక్, డీఎస్ఓ సుదర్శన్, ఆర్టీఓ వెంకట్ రెడ్డి, పెట్రోల్ పంపుల యజమానులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి ఆలయ నిర్మాణానికి సహకరించాలి కొడంగల్: పట్టణంలోని బాలాజీనగర్లో వెలిసిన మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణ పనులకు పరిసరవాసులు సహకరించాలని కలెక్టర్ దీపక్ తివారీ కోరారు. బుధవారం ఆయన కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డితో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి నిర్మాణాలు కోల్పోతున్న వారికి పరిహారం అందిస్తామని చెప్పారు. టీటీడీ తరహాలో వైఖానస ఆగమ శాస్త్రోకంగా ప్రధాన ఆలయం, అమ్మవార్ల ఆలయాలు, ఉప ఆలయాలు, మాడ వీధులు, క్యూలైన్, కల్యాణ మండపం, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, స్నాన ఘట్టాలు, మరుగుదొడ్లు, పార్కింగ్, పుష్కరిణి, ప్రసాదం కౌంటర్లు తదితర వాటికి ప్రభుత్వం నూతన భవనాలను నిర్మంచనున్నట్లు వివరించారు. ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని చెప్పారు. శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న వారు ఇళ్లను ఖాళీ చేసి ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాంబాబు, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పాదచారిని ఢీకొట్టిన కారు
వృద్ధుడు మృతి పరిగి: నడచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధుడిని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన పట్టణ కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. గండీడ్ మండలం పీర్లగుట్టతండాకు చెందిన తుక్యానాయక్(65) పట్టణ కేంద్రంలోని బాలాజీనగర్లో తన కుమారుడి వద్ద ఉంటున్నాడు. ఉదయం టీ తాగేందుకు పట్టణ కేంద్రంలోని బహర్పేట్కు నడుకుంటూ వెళ్తుండగా అతివేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దీంతో ఎగిరిపడటంతో తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు శంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బొంరాస్పేట: ఆస్పత్రికి వెళ్తున్నాని చెప్పి వెళ్లిన వృద్ధుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మండల పరిధిలోని బుర్రితండా పంచాయతీ పరిధి పూల్యానాయక్ తండాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. తండాకు చెందిన ముడావత్ రాంచందర్(63) ఈ నెల 27న తనకు అనారోగ్యంగా ఉందని హైదరాబాద్లో ఆస్పత్రికి వెళ్తున్నాని చెప్పి బయలు దేరాడు. తిరిగి రాకపోవడంతో బుధవారం కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. కొడంగల్ రూరల్: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని రుద్రారం శివారు పాటిమీదిపల్లి రోడ్లో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ జీవీ సత్యనారాయణ తెలిపిన ప్రకారం.. బషీరాబాద్ మండలం జీవన్గీ గ్రామానికి చెందిన తలారి హరికృష్ణ(26)ను తండ్రి నర్సింలు బంధువుల ఇంటికి వెళ్లి రమ్మని చెప్పి పంపాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం తన కుమారుడు మృతి చెందాడని సమాచారం అందిందని ఆవేదన వ్యక్తం చేశాడు. మృతుడు హరికృష్ణ శరీరం నల్లగా మారడంతో విద్యుత్ షాక్కు గురయ్యాడ, లేదా పిడుగుపాటుకు గురయ్యాడా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి తండ్రి నర్సింలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పుట్టపహాడ్ సర్పంచ్ అంజిలయ్య కుల్కచర్ల: సివిల్ సప్లయ్ వ్యవస్థలో అధికారులు నియమనిబంధనలను పాటించడంలేదని పుట్టపహాడ్ సర్పంచ్ బోయిని అంజిలయ్య ఆరోపించారు. బుధవారం ఆయన గ్రామపంచాయతీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామ సర్పంచ్కు తెలియకుండా తాత్కాలిక పద్ధతిన రేషన్డీలర్ను నియమించడం సరికాదన్నారు. కేవలం కొంతమందికి మద్ధతుగా మాత్రమే రేషన్ డీలర్ ఎంపిక ప్రక్రియ కొనసాగిందని జిల్లా అధికారులు స్పందించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి ఇబ్రహీంపట్నం రూరల్: జిల్లాలో అర్హులైన జర్నలిస్టుందరికీ అక్రిడిటేషన్ కార్డులు జారీ చేస్తామని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఇందులో డీపీఆర్ఓ బాలేశ్వరి, మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు కె.శ్రీకాంత్రెడ్డి, శేఖర్ ఉప్పరి, సయ్యద్ ఇక్రముల్లా హుస్సైని, శేఖర్బాబు తదితరులు పాల్గొన్నారు. -
యువత చేతిలోనే దేశ భవిష్యత్
తాండూరు టౌన్: దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య అన్నారు. మంగళవారం పట్టణంలోని శాలివాహన డిగ్రీ కళాశాల తృతీయ సంవత్సర విద్యార్థుల వీడ్కోలు వేడుకలు స్థానిక తులసీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో నూతన ఆవిష్కరణలతో యువత ముందు దూసుకు పోతోందన్నారు. విద్యార్థులు ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని, నిర్ణయించుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు శ్రమించాలన్నారు. మీరు చేరిన ఉన్నత స్థానంతో తల్లిదండ్రులకు, కళాశాలకు గొప్ప కీర్తి ప్రతిష్టలు చేకూరుతాయన్నారు. సన్మార్గంలో నడిచి ఉత్తమ పౌరులుగా పేరు తెచ్చుకోవాలని సూచించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ శరత్ చంద్ర మాట్లాడుతూ.. కళాశాలలో క్రమశిక్షణ, అత్యుత్తమ బోధనతో పాటు నైతిక విలువలు, సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. అకాడమిక్ ఫలితాల్లో విద్యార్థులు విజయదుందుభి మోగిస్తున్నారన్నారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన స్పోర్ట్స్ మీట్లో విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల మండలి అధ్యక్షుడు కల్వ రాధాకృష్ణ, కరస్పాండెంట్ మోముల మాణిక్యం, డైరెక్టర్లు సుధాకర్, వీరేందర్, మల్లేశం, రాధమ్మ, అకడమిక్ డైరెక్టర్ సిద్ధిలింగయ్య, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ నర్సింగ్ యాదయ్య -
విద్యుత్ తీగలను తొలగిస్తాం
● చెంచుపల్లిలో పర్యటించిన అధికారులు ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆటకంగా ఉన్న వైర్ల పరిశీలన పూడూరు: విద్యుత్ తీగలు అడ్డుగా ఉండటంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయని పత్రికల్లో వచ్చిన కథనాలపై ఆశాఖ అధికారులు స్పందించారు. మంగళవారం మండల పరిధిలోని చెంచుపల్లిని సందర్శించి, సర్పంచ్ దయాకర్తో కలిని పరిస్థితిని పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్లపై ఉన్న వైర్లను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకుంటామని ఎస్సీ రవి, ఏడీ నాయుడు ప్రసాద్ హామీ ఇచ్చారు. వారం రోజుల్లో సమస్యను పరిష్కారించాలని ఏఈ రాజును ఆదేశించారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈఈ ముక్రం, ఏఈ ఉదయ్ తదితరులు ఉన్నారు. -
‘మణిపూలకు’ అద్వితీయ ఆదరణ
● కవి వడిచర్ల సత్యం ● కవి ఊర ఈశ్వరరెడ్డికి సన్మానం బొంరాస్పేట: మాత్రా ఛందస్సులో ఉన్న మణిపూసలు సాహిత్య ప్రక్రియకు దక్కుతున్న ఆదరణ అద్వితీయమని మణిపూసలు సృష్టికర్త మండల పరిధిలోని వడిచర్లకు చెందిన కవి వడిచర్ల సత్యం అన్నారు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం కోవెలదిన్నెకు చెందిన ప్రముఖ కవి ఊర ఈశ్వరరెడ్డి రచించిన ‘అక్షర మణిపూసలు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక కార్యవర్గం సమక్షంలో పుస్తకావిష్కరణ చేశారు. పుస్తక రచయితనుద్దేశించి కవి వడిచర్ల మాట్లాడుతూ.. మూడేళ్లుగా అనారోగ్యంతో మంచానికి పరిమితమై ఉన్నా అక్షర మణిపూసలు పుస్తకం రాయడం అభినందనీయమన్నారు. ఈశ్వరరెడ్డి రచించిన వెంకటేశ్వర ద్విశతి, చెన్నకేశవ శతకం, కవితా లహరి, సమస్యాపూరణం, ముక్తపదం వంటి పద్యగ్రంథాలను కొనియాడారు. అచేతన స్థితిలో ఉండికూడా మణిపూసలు సాహిత్య రచన చేయడం పట్ల అనంతవేదిక ప్రతినిధులు ఈశ్వరరెడ్డిని అభినందించి సన్మానించారు. ఇందులో అనంత వేదిక అధ్యక్షుడు ఆశీర్వాదం, పాలమూరు జిల్లా అనుపటి రాంచంద్రయ్య, హనుమంతు సుమాల తదితరులున్నారు. -
ఎదురెదురుగా రెండు కార్ల ఢీ
● ఇద్దరి మృతి, పలువురికి గాయాలు ● వెల్జాల సమీపంలో ప్రమాదం ఆమనగల్లు: తలకొండపల్లి మండలం వెల్జాల సమీపంలో మంగళవారం సాయంత్రం రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. తలకొండపల్లి ఎస్హెచ్ఓ జానకిరాంరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. అంతారానికి చెందిన పలువురు తలకొండపల్లి నుంచి కారులో వెల్జాలకు వెళ్తుండగా గ్రామ సమీపంలో ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇరు వాహనాల్లో ప్రయాణిస్తున్న శారదమ్మ, పెద్ద శ్రీను, శ్రీనుగౌడ్, పెద్దమ్మ, రిషి, మురళీధర్ శాస్త్రి, దత్తు గాయపడటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. వీరిలో శారదమ్మ(52), పెద్ద శ్రీను(45) మార్గమద్యంలో మృతిచెందారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్హెచ్ఓ తెలిపారు. -
ఫ్యూచర్ దిశగా ఒక్కో అడుగు
● ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ ● హాజరైన మంత్రులు శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు, డీజీపీ, స్థానిక నేతలు కందుకూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్సిటీలో ఒక్కో సంస్థ కొలువుదీరనుంది. ఫ్యూచర్సిటీ ప్రాంతంలో ఇప్పటికే ఎఫ్సీడీఏ, స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణాలతో పాటు 330 అడుగుల రహదారి నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. వాటితో పాటు ఫ్యూచర్సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి కందుకూరు మండలం మీర్ఖాన్పేట రెవెన్యూలో 25 ఎకరాల విస్తీర్ణంలో మంగళవారం సాయంత్రం సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ చేశారు. మంత్రులు శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డి, డీజీ మహేశ్భగవత్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్రెడ్డి, అనిల్కుమార్యాదవ్, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, మల్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేఎల్ఆర్, తీగల కృష్ణారెడ్డి, ఎస్ఐబీ ఐజీ సుమతి, అటవీశాఖ చీఫ్ కన్జర్వేటీవ్ సువర్ణ, సీపీలు సుధీర్బాబు, రమేష్ తదితరులు హాజరయ్యారు. పోలీస్ కమీషనరేట్ భవనానికి భూమి పూజ నిర్వహించిన అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. స్థానిక నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలి.. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ రెండేళ్లు సహకరిస్తే ప్రపంచంలోనే అద్భుతమైన నగరానికి ఇక్కడ పునాదులు పడతాయని సీఎం అన్నారు. ఫ్యూచర్సిటీలో ఏ కార్యక్రమం జరిగినా ఆ పరిధిలోని ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం ఇస్తూ, ప్రత్యేకంగా ఆహ్వానాలు అందించాలని కలెక్టర్, డీసీపీలను ఆదేశించారు. పేదల పట్ల మానవనీయ కోణంతో మెలగాలని, రైతులతో చర్చించి ప్రభుత్వానికి అవసమైన భూములు ఇచ్చేలా లోకల్ నాయకుల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఫ్యూచర్సిటీ పరిధిలోకి పక్కనే ఉన్న గ్రామాలను కూడా చేర్చాలని వినతులు వస్తున్నాయని, పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
మహిళా చట్టాలపై అవగాహన తప్పనిసరి
● భరోసా సెంటర్ కౌన్సిలర్లు రాజశ్రీ, పూజిత ● డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కొడంగల్ రూరల్: మహిళా చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని భరోసా సెంటర్ కౌన్సిలర్లు రాజశ్రీ, పూజిత, కొడంగల్ ఎస్ఐ జివి.సత్యనారాయణ సూచించారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సైబర్ మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే నేరాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. బాలల హక్కుల పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అన్నారు. ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే 100, 109, 112 నంబర్లకు సమాచారం అందించాలని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్స్పాల్ రఫియాఖానమ్, సిబ్బంది టి.రాంబాబు, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సోమ్లా, హరిప్రియ, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్
కుల్కచర్ల: నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను సీజ్ చేసినట్లు ఎస్ఐ రమేశ్ తెలిపారు. మహ్మదాబాద్ మండలం గాధిర్యాల్కు చెందిన మధు తన సొంత ట్రాక్టర్లో అనంతసాగర్ వాగు నుంచి ఇసుక తరలిస్తుండగా పెట్రోలింగ్ పోలీసులు అడ్డుకున్నారు. అనుమతులు చూపించాలని అడగగా లేవని చెప్పడంతో వాహనాన్ని సీజ్ చేసి, పీఎస్కు తరలించారు. పెట్రోల్ బంకుల్లో తనిఖీలు మాడ్గుల: మండల కేంద్రంలోని వివిధ పెట్రోలు బంక్లను మంగళవారం తహసీల్దార్ వినయ్సాగర్ తనిఖీ చేశారు. పెట్రోల్ బంక్లలో పెట్రోలు, డీజిల్ కొరత నేపథ్యంలో నిల్వలను పరిశీలించారు. పెట్రోల్, డీజిల్ను వాహనాలలో మాత్రమే పోయాలని, బ్యారెల్స్, డబ్బాలలో నింపరాదని సూచించారు. అలాగే నిర్వాహకులు సకాలంలో డీడీలు చెల్లించి పెట్రోల్, డీజిల్ను తీసుకువచ్చి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలని సూచించారు. కారు ఢీకొని ఇద్దరు మృతి యాచారం: అతివేగంగా వచ్చిన ఓ కారు ఆటోను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మాడ్గుల్ మండలం కొర్రతండాకు చెందిన కొర్ర జాను(47), కొర్ర నర్షా(39) వ్యవసాయం, కూలీ పనులు చేస్తూ కుటుంబాలను పోషించుకునేవారు. ప్రస్తుతం తమ పొలాల్లోని తాటి చెట్లకున్న మంజలు కోసి, నగరంలోని ఇంజాపూర్ చెరువు కట్టపైకి తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. రోజు మాదిరిగానే సోమవారం ఉదయం 10 గంటలకు ఆటోలో ముంజలతో వెళ్లి, రాత్రి 8:30 గంటలకు తిరిగి వెళ్తున్నారు. ఈక్రమంలో సాగర్ హైవేపై యాచారం పీఎస్ సమీపంలోని మాల్ నుంచి అతి వేగంగా ఇబ్రహీంపట్నం వైపు వెళ్తున్న కారు ఎదురుగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. ఈప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జాన్, నర్షాలను మాల్, మాన్యగూడలోని ప్రవేట్ ఆస్పత్రులకు తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరూ రాత్రే మృతిచెందారు. నర్షాకు భార్య సబితతో పాటు ఇద్దరు కొడుకులున్నారు. జాన్కు భార్య సరోజతో పాటు కొడుకు, కూతుళ్లు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి యాచారం: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి... మండలంలోని నందివనపర్తికి చెందిన కొర్రమోని వెంకటేశ్(38) మూడు రోజుల క్రితం నగరం నుంచి కారులో స్వగ్రామానికి వెళ్తుండగా, చౌదర్పల్లి గేట్ వద్ద ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్ను నగరంలోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య సంగీత ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపారు. బంజారాహిల్స్: యజమానుల కళ్లుగప్పి పనిమనుషులు చేతివాటం ప్రదర్శించి 20 తులాల బంగారు నగలతో ఉడాయించారు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–11లోని గఫార్ఖాన్ కాలనీలో నివసించే విజయ ఎస్.నాయక్ అనే మహిళ ఇంటి డ్రెస్సింగ్ రూమ్లోని అల్మరాను ధ్వంసం చేసి రెండు జతల బంగారు గొలుసులు, వజ్రాలతో కూడిన బ్రాస్లెట్, జత బంగారు రూబీ గాజులు, పొడవైన బంగారు గొలుసు, నెక్లెస్, ఆరు బంగారు గాజులను తస్కరించారు. తమ ఇంట్లో చాలాకాలంగా నమ్మకంగా పనిచేస్తున్న ఇద్దరు పనిమనుషులపైనే అనుమానం వ్యక్తం చేస్తూ బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన ఆభరణాల విలువ రూ.30 లక్షల వరకు ఉంటుందని వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదుతో బంజారాహిల్స్ క్రైమ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. పనిమనుషుల కదలికలపై నిఘా పెట్టారు. కేసు దర్యాప్తులో ఉంది. -
కిరాణా కొట్టులో రూ.30 వేల చోరీ
యాలాల: కిరాణ కొట్టులో చోరీ జరిగిన ఘటన మండల పరిధిలోని మార్కండేయ కాలనీలో మంగళవారం వెలుగుచూసింది. ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మాకాలి శ్రీనాథ్ కిరాణ కొట్టు వ్యాపారి. పొరుగింట్లో ఫంక్షన్ ఉండటంతో సోమవారం షాపును కట్టేసి త్వరగా ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం తెరిచేందుకు వెళ్లగా, షట్టర్ తాళాలు విరిగి ఉండటాన్ని గమనించాడు. అనంతర షాపులో గమనించగా, గల్లాపెట్టెలో ఉంచిన రూ.30వేల నగదు కనిపించలేదు. నగదు మాత్రమే ఎత్తుకెళ్లిన దొంగ, ఇతర సామాన్లను ముట్టలేదు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. శతాధిక వృద్ధురాలి కన్నుమూత దౌల్తాబాద్: మండల కేంద్రానికి చెందిన శతాధిక వృద్ధురాలు కనక మ్మ (102) మంగళవా రం తెల్లవారుజామున కన్నుమూశారు. కొడుకులు, కూతుళ్లు, మనవ లు, మనవరాళ్లతో పాటు ముని మనవలు, ముని మనవరాళ్లను ఎత్తుకుని ఆడించిన అవ్వకు పలు వురు నాయకులు ఘనంగా నివాళులర్పించారు. బస్సు ప్రమాదంలో మహిళకు గాయాలు అనంతగిరి: ఎమ్మార్పీ చౌరస్తాలో బస్సు ఎక్కుతున్న ఓ మహిళ ప్రమాదానికి గురైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. బార్వాద్ గ్రామానికి చెందిన తాండ్ర బాలమ్మ సొంతూరుకు వెళ్లేందుకు తొర్మామిడి బస్సు ఎక్కుతోంది. ఇది గమనించని డ్రైవర్ బస్సును ముందుకు తోలడంతో కింద పడిపోయిన ఆమె కాలి పైనుంచి వెనక చక్రాలు వెళ్లాయి. ప్రమాదంలో బాలమ్మ కాలు విరిగి, గాయాలయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేపీహెచ్బీకాలనీ: కూకట్పల్లి జాతీయ రహదారిపై మంగళవారం వాటర్ ట్యాంకర్ ఢీకొని ఓ ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కేపీహెచ్బీ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... బీహార్కు చెందిన అభినవ్ కుమార్ మిశ్రా(25) గాయత్రినగర్లో భార్యతో కలిసి నివసిస్తున్నాడు. అతడు ఓ ఫార్మసీ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్. మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై మియాపూర్ నుంచి కేపీహెచ్బీ వైపు వస్తుండగా నిజాంపేట క్రాస్రోడ్డు వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. తల ఛిద్రమై తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ సీఐ జాన య్య ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని తొలగించి ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించారు. -
అర్హులందరికీ ‘కల్యాణలక్ష్మి’
మహేశ్వరం: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో రాజకీయాలకు తావు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా చెక్కులు అందించాలని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో మంగళవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేద కుటుంబాల ఆడబిడ్డ పెళ్లి విషయంలో ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సాయం ఎంతో ఊరటనిస్తుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ మహిళలు, గర్భిణులు, ఆడబిడ్డల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మహేశ్వరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ నాయక్, తహసీల్దార్ చిన్న అప్పలనాయుడు, ఎంపీడీఓ శైలజ, డిప్యూటీ తహసీల్దార్ నరేష్, ఆర్ఐ స్వర్ణకుమారి పాల్గొన్నారు.మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి -
అలసత్వాన్ని ఉపేక్షించం
మర్పల్లి: విధి నిర్వహణలో అలసత్వాన్ని ఉపేక్షించేది లేదని కలెక్టర్ దీపక్ తివారి హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు సకాలంలో మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మంగళవారం మండలంలోని కొత్లాపూర్, ఘణాపూర్ గ్రామాల్లో అభివృద్ధి పనులను, మర్పల్లి కమ్యూనిటీ ఆస్పత్రి, హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది రిజస్టర్, వార్డులు, వైద్య పరికరాలను పరిశీలించారు. రోగులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైద్యులు, సిబ్బంది సమయపాలనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇంద్రసేనారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలన్నరు. సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా చొరవ చూపాలని ఆదేశించారు. ఎక్స్రే యంత్రం పాడైందని, అంబులెన్స్ లేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులతో మాట్లాడాలని సర్పంచ్ రామేశ్వర్కు, హౌసింగ్ సిబ్బందికి సూచించారు. అనంతరం కేజీబీవీని సందర్శించి నిర్మాణ దశలో ఉన్న అదనపు తరగతి గదులు, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించారు. సర్పంచ్ గ్రామ సమస్యలను కలెక్టర్కు విన్నవించారు. తహసీల్దార్ కార్యాలయ సమీపంలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని, అట్టి భూమిని స్వాధీనం చేసుకొని పంచాయతీకి అప్పగిస్తే గోదాం నిర్మించుకుంటామని సర్పంచ్ కోరారు. స్పందించిన కలెక్టర్ కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని హద్దులు ఏర్పాటు చేయాలని తహసీల్దార్కు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మికాంత్ తదితరులు పాల్గొన్నారు. అర్హులను గుర్తించండి అనంతగిరి: ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. ఇందుకు కోసం గెజిటెడ్ అధికారుల వెరిఫికేషన్ యూజర్ మాన్యువల్ విడుదల చేసినట్లు వివరించారు. మంగళవారం కలెక్టరేట్లోని ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, ఏపీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేకంగా రూపొందించిన వెరిఫికేషన్ యూజర్ మాన్యువల్ ద్వారా నిజమైన అర్హులను గుర్తించడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఎటువంటి లోపాలు లేకుండా చూస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, హౌసింగ్ పీడీ సయ్యద్ ముక్రం బాబా, డీపీఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు. టెలికాం కమిటీ సమావేశం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం కలెక్టర్ దీపక్ తివారీ అధ్యక్షతన జిల్లాస్థాయి టెలికాం కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో టెలికాం సేవల విస్తరణ, నెట్వర్క్ నాణ్యత, ప్రజలకు మెరుగైన కమ్యూనికేషన్ సదుపాయంపై సమీక్షించారు. ప్రజలకు నాణ్యమైన టెలికాం సేవలు అందించడంపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వెంకటాచారి, ఉమాశంకర్ ప్రసాద్, ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుటుర్, ఆర్అండ్బీ ఈఈ శ్రీధర్ రెడ్డి, డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్, టెలికాం సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందాలి ఇందిరమ్మ ఇళ్లనుసకాలంలో పూర్తి చేయాలి కలెక్టర్ దీపక్ తివారి -
2న ఆలయ భూములకు కౌలు వేలం
అనంతగిరి: అనంత పద్మనాభస్వామి ఆలయ భూములను కౌలుకు ఇచ్చేందుకు గాను మే 2న వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త ఎన్ పద్మనాభం, ఈఓ టీ నరేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు ఆలయ ప్రాంగణంలో వేలం ఉంటుందని తెలిపారు. వేలం హక్కులు పొందిన వారు మూడేళ్ల పాటు(మే 05 నుంచి ఏప్రిల్ 30 2029 వరకు) వ్యవసాయం చేసుకోవచ్చని తెలిపారు. వికారాబాద్ మండలం గుడుపల్లి సర్వే నంబర్ 65లో 328 ఎకరాలు, కొత్తగడి గ్రామ సర్వే నంబర్ 175లో 219 ఎకరాలు, మరో సర్వే నంబర్ 176లో 324 ఎకరాలు, పులుసుమామిడి గ్రామ సర్వే నంబర్ 180లో 228 ఎకరాలు, మరో సర్వే నంబర్ 181లో 110 ఎకరాలు, నారాయణపూర్ సర్వే నంబర్ 135లో 1,334 ఎకరాలు, పరిగి మండలం బిజ్వారం గ్రామ సర్వే నంబర్ 169/ఆలో 206 ఎకరాలు, తాండూరు మండలం అంతారం గ్రామ సర్వే నంబర్ 205లో 25ఎకరాలు, మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం కేశ్వాపూర్ గ్రామ సర్వే నంబర్ 105లో 803 ఎకరాల భూములు ఉన్నట్లు తెలిపారు. వీటికి కౌలు హక్కు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల రైతులు రూ.2 వేలు డిపాజిట్ చేసి వేలంలో పాల్గొన వచ్చని వారు తెలిపారు. కొడంగల్ రూరల్: తెలంగాణ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉద్యానశాఖ రాజేంద్రనగర్లో తేనెటీగల పెంపకంపై ఏడు రోజుల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ శాఖ హెచ్ఈఓ బాబ్యానాయక్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపిక చేసిన 25 మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణ, భోజనం, వసతి సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్ అందజేస్తారని పేర్కొన్నారు. తేనెటీగల పెంపకం ప్రాంభించాలనుకునే వారికి ప్రభుత్వం నుంచి ప్సోత్సాహం లభిస్తుందని తెలిపారు. ఇంటర్, డిగ్రీ, ఆపై ఉన్నత చదువులు చదివిన వారు ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు సెల్ నంబర్ 99487 26997లో సంప్రదించాలని తెలిపారు. పార్కు పనులను వెంటనే పూర్తి చేయండి అనంతగిరి: వికారాబాద్ పట్టణ పరిధిలో హెచ్ఎండీఏ కింద చేపట్టిన పార్కుల ఆధునీకరణ పనులను వెంటనే పూర్తి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య తెలిపారు. మంగళవారం పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రం సింహారెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ ఏసుదాసు, ఎన్విరాల్మెంట్ ఇంజనీర్ శ్రీనివాస్, మెప్మా ఇంచార్జి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతగిరి: వికారాబాద్ డీఎస్పీగా అంజయ్య నియమితులయ్యారు. ఇదివరకు ఇక్కడ విధులు నిర్వహించిన శ్రీనివాస్రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో అంజయ్యను నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు కృషి చేస్తామని తెలిపారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించండి
అనంతగిరి: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య డిమాండ్ చేశారు. సోమవారం వికారాబాద్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి పోరుబాట కార్యక్రమం వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ దీపక్ తివారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రూ.8 వేల కోట్ల బోధనా రుసుం చెల్లించపోవడంతో విద్యార్థు లు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెంటనే విడుదల చేయాలన్నారు. లేని పక్షంలో ముఖ్యమంత్రి ఇంటి ని ముట్టడిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు గోపాల్, మండల అధ్యక్షుడు మైపాల్రెడ్డి, సీనియర్ నాయకులు సురేష్, అనంత్రెడ్డి, సుభాన్రెడ్డి బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు శాంతికుమార్, దత్తాత్రేయరావు, జుబేర్, అక్రం, పర్వేజ్, అరుణ్, ఇబ్రహీం, వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
బాలిక ఆత్మహత్య.. నిందితుడికి రిమాండ్
బంట్వారం: బాలిక ఆత్మహత్య కేసులో నిందితుడిని సోమవారం రిమాండ్కు తరలించామని కోట్పల్లి ఎస్ఐ శైలజ తెలిపారు. ఎస్ఐ తెలిపిన ప్రకారం.. కోట్పల్లి మండలం నాగసాన్పల్లికి చెందిన కాళ్ల సాకేత్.. బాలికను ప్రేమపేరుతో వేధించేవాడు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన బాలిక.. ఈ నెల 23న పురుగు మందు తాగి బలవన్మరణానికిపాల్పడింది. సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 25న మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నిందితుడిని రిమాండ్కు తరలించారు. గృహిణి ఆత్మహత్య కేసులో ఇద్దరికి.. యాలాల: భర్త, తోటికోడలు వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన గృహిణి కేసులో ఇద్దరిని సోమవారం పోలీసులు రిమాండ్కు తరలించారు. ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చెన్నారం గ్రామానికి చెందిన జటంగి దేవి(33)ని, ఆమె భర్త హన్మంతు నిత్యం మానసికంగా, శారీరకంగా వేధించేవారు. ఈ నెల 13న డబ్బుల విషయంలో గొడవ జరగగా.. మనస్తాపం చెందిన ఆమె గడ్డిమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. గమనించిన స్థానికులు బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ 21న మృతి చెందింది. మృతురాలి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు.. దేవి మృతికి కారణమైన హన్మంతు, తోటి కోడలు సావిత్రమ్మపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
కార్మికుల పక్షపాతి సీఎం రేవంత్రెడ్డి
డీసీసీ అధికార ప్రతినిధి గోపాల్ తాండూరు: ఆర్టీసీ కార్మికుల పక్షపాతి సీఎం రేవంత్రెడ్డి అని డీసీసీ అధికార ప్రతినిధి గోపాల్ అన్నారు. సోమవారం తాండూరు ఆర్టీసీ డిపో ప్రాంగణంలో కార్మికులతో కలిసి అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేతన సవరణతో 37,360 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరిందన్నారు. 2021 ఏప్రిల్ నుంచి ప్రయోజనాలు వర్తించడం హర్షనీయమన్నారు. ఉద్యోగ విరమణ పొందిన వారికి ఈ ప్రయోజనాలు వర్తించేలా సీఎం నిర్ణయం తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వేతన సవరణతో కండక్టర్లకు రూ.4 వేల నుంచి 15 వేల వరకు, డ్రైవర్లకు రూ.4 వేల నుంచి రూ.17 వేల వరకు వేతనాలు పెరగనున్నాయని పేర్కొన్నారు. ఆర్థిక భారం అయినప్పటికీ.. కార్మికుల కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో కార్మికులు, కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు. -
శాంతి సేవలకు హిందూ ధర్మం ప్రతీక
తెలంగాణ సాధు పరిషత్ అధ్యక్షుడు శంకర్ స్వామీజీ దౌల్తాబాద్: సనాతన ధర్మం, శాంతి సేవలకు హిందు ధర్మం ప్రతీకగా నిలుస్తుందని తెలంగాణ సాధు పరిషత్ అధ్యక్షుడు శంకర్ స్వామీజీ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో హిందు సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో హిందు సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ సంస్కృతి, పరిరక్షణకు హిందు సమాజం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. హిందు ధర్మం గొప్పతనం, సంస్కృతి పరిరక్షణ, సామాజిక ఐక్యతపై సందేశం ఇచ్చారు. యువతలో ధార్మిక చైతన్యం పెంపొందించాలన్నారు. కలియుగంలో సనాతన ధర్మమే రక్షిస్తుందని, మునులు, ఋషులు ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. కుటుంబ వ్యవస్థ బాగుపడినప్పుడే మన సామాజిక స్థితి బాగుపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో వక్తలు కేరేల్లి అనంత్రెడ్డి, శ్రీలతరెడ్డి, బాబుసింగ్ తదితరులు పాల్గొన్నారు. -
జీతాలు రాక ఇబ్బందులున్నాయి
కడ్తాల్: జిల్లాలోని కడ్తాల్, మైసిగండి, ఆమనగల్లు, షాద్నగర్, మహేశ్వరం పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న దినసరి వేతన కూలీల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కార్మికులు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ దిలీప్కుమార్లను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాలల దినసరి వేతన కూలీలు మాట్లాడుతూ.. గత 13 నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. రికార్డుల్లో లోపాలు ఉండటంతో జీతాలు అందడంలేదని, దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే జిల్లాస్థాయి అధికారులకు విన్నవించినా ఫలితం లేదన్నారు. అనంతరం గిరిజన సంక్షేమశాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ దిలీప్కుమార్లు.. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, 15 రోజుల్లో జీతాలు కూలీల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కూలీలు తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు వెంకటేశ్, దినసరి వేతన కూలీలు సైదమ్మ, సంతోష, శోభ, చంద్రకళ, బుజ్జి, మస్రూ, సునీత, రాములు, భూదేవి, సత్యమ్మ, అలివేలు, స్వరూప, లక్ష్మి, మల్లమ్మ తదితరులు ఉన్నారు. -
నాణ్యత ప్రమాణాలు తప్పనిసరి
ఎమ్మెల్యే మనోహర్రెడ్డి తాండూరు: పొట్లి మహరాజ్ ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అఽధికారులను ఆదేశించారు. సోమవారం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్పర్సన్ నీరజాబాల్రెడ్డితో కలిసి సందర్శించారు. ఆలయ పనులు అసంపూర్తిగా ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. శివాలయ జీర్ణోద్ధారణ పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. మరోవైపు ఆలయ కమిటీ పదవీ కాలం నాలుగు రోజుల క్రితం ముగియడంతో మరో 6 నెలల పాటు పొడగించేలా ప్రతిపాదనలు పంపించడం జరిగిందని తెలిపారు. ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం పట్టణ శివారులోని రసూల్పుర ఆంజనేయ స్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్రెడ్డి హాజరయ్యారు. ఆలయ కమిటీ చైర్మన్గా రాధాకిషన్బూప్, ధర్మకర్తలుగా మహేశ్ సార్డ, దినేష్పర్తాని, మొగులంపల్లి నర్సింహులు, డప్పు పద్మమ్మలు పదవి ప్రమాణ స్వీకారం చేశారు. -
చమురు కొరత.. బంకుల మూత
ఇంధనం కోసం ఆరాటపడుతున్న వాహనదారులు పరిగి/ దుద్యాల్: పశ్చిమ దేశాల్లో కొనసాగుతున్న యుద్ధమో.. మరేదైనా కారణమో స్పష్టత లేకపోయినా.. రాష్ట్రంలో చమురు ఇక్కట్లు నెలకొన్నా యి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదని ప్రభు త్వం స్పష్టం చేస్తున్నా.. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న అసత్య ప్రచారాలతోఇంధనం కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. పొరుగు రాష్ట్రం ఏపీలో నిల్వలు అడుగంటాయన్న సమాచారంతో తెలంగాణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు ఆరాట పడుతున్నారు. బంకులకు క్యూ కడుతున్నారు. తమ వాహనాలతో పాటు.. క్యాన్లతో బారులు తీరారు. ఇలా ఒక్కసారి డిమాండ్ పెరగడంతో బంకుల నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. నో స్టాక్ అంటూ క్రమంగా మూసివేస్తున్నారు. సోమవారం దుద్యాల్ నుంచి కోస్గి వెళ్లే మార్గంలో నో స్టాక్ బోర్డుతో బంక్ వెలవెలబోయింది. పరిగి పరిసరాల ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద కిలో మీటరు మేర ప్రజలు వరుస కట్టారు. -
డంపింగ్యార్డును తరిమికొడదాం
ఎకోటౌన్కు వ్యతిరేకంగా అఖిలపక్షం సమావేశం అబ్దుల్లాపూర్మెట్: నగర శివారులోని బండరావిరాల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఎకోటౌన్ పేరుతో ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డును తరిమి కొట్టాలని అబ్దుల్లాపూర్మెట్, భూదాన్పోచంపల్లి మండలాలకు చెందిన పలువురు సర్పంచులు, రాజకీయ పార్టీ నేతలు ప్రతినబూనారు. బండరావిరాల సర్వేనంబర్ 268లోని ప్రభుత్వ భూమిలో డంపింగ్ యార్డును నెలకొల్పేందుకు సర్కారు జపాన్కు చెందిన ఓ కంపెనీకి స్థలం కేటాయించిందని ఇటీవల వచ్చిన వార్తా కథనాలతో ఆయా గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓతో ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందన్నారు. వెంటనే ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం చిన్నరావిరాలలోని ఓ ఫంక్షన్హాల్లో అన్ని పార్టీల నాయకులు, ఆయా గ్రామస్తులతో సమావేశం(అఖిలపక్షం) ఏర్పాటు చేశారు. పోరాటానికి సిద్ధం కావాలి సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. డంపింగ్ యార్డును వ్యతిరేకించకపోతే బండరావిరాల, చిన్నరావిరాల, తారామతిపేట, గౌరెల్లి, బాచారం, సద్దుపల్లి, బలిజగూడ, అబ్దుల్లాపూర్మెట్, కవాడిపల్లి, దేశ్ముఖి, పిలాయిపల్లి, పెద్దగూడెం, పోచంపల్లిలోని మరికొన్ని గ్రామాల్లో భూగర్భ జలాలు, పీల్చే గాలి కలుషితం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విపరీతమైన దుర్వాసనతో ఈగలు, దోమల బెడద పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. ఇక్కడి గ్రామాలన్నీ వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయని, ఇప్పటికే క్రషర్లతో కొంత మేర సాగుకు ఇబ్బందులు ఉన్నాయని, ఈ డంపింగ్ యార్డుతో కోలుకోలేని దెబ్బ తగిలే ప్రమాదముందన్నారు. మన గ్రామాలను, మన కుటుంబ సభ్యుల ఆరోగ్యాలను కాపాడుకోవడమే లక్ష్యంగా అన్యాయాన్ని ఎదురించి పోరాడటానికి ప్రజలందరూ సిద్ధం కావాలని భీష్మించారు. డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాటం కోసం త్వరలోనే బాధిత గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో జేఏసీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో అబ్దుల్లాపూర్మెట్ మండల సర్పంచులు విజయ్కుమార్, బాలకిషన్గౌడ్, మాధవీనవీన్, పోచంపల్లి మండల సర్పంచులు జంగయ్యయాదవ్, మహాలక్ష్మిదానయ్య, మహేశ్యాదవ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దాసుగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కిషన్గౌడ్, బీజేపీ నేతలు నవీన్కుమార్, సురేష్గౌడ్, కొండల్గౌడ్, వివిధ సంఘాల నేతలు వెంకటేశ్, అరుణ్కుమార్, మహేందర్, లింగారెడ్డి, అశోక్యాదవ్, సతీష్రెడ్డి, బసవయ్య, నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేయిస్తాం
● అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలను తొలగింప చేస్తాం ● హసింగ్ డీఈఈ సయ్యద్సాజిద్ పూడూరు: ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేయిస్తామని హౌసింగ్ డీఈఈ సయ్యద్ సాజిత్ లబ్ధిదారులకు హామీ ఇచ్చారు. సోమవారం మండల పరిధి చెంచుపల్లి, ఎన్కేపల్లి గ్రామాల్లో అసంపూర్తిగా నిలిచిన ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించి మాట్లాడారు. మండల పరిఽధిలోని ఆదర్శ గ్రామంగా ఎంపికై న ఎన్కేపల్లి, చెంచుపల్లిలో 241 ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇప్పటి వరకు 109 నిర్మాణాలు పూర్తయ్యాయని, మరో 107 నివాసాలు వివిధ స్థాయి దశలో ఉన్నాయని పేర్కొన్నారు. 25 వరకు ఇళ్లు నాట్ స్టార్టెడ్ జాబితాలో ఉన్నాయన్నారు. ఇంటిని కూల్చి, గుడిసెలో నివాసం జాబితాలో పేరు వచ్చిన వారు తమ ఇళ్లను నేల మట్టం చేసుకున్నారు. తీరా ఆధార్ మ్యాపింగ్ కాలేదని జుబ్బురు పుష్షమ్మ ఇంటికి మార్కింగ్ ఇవ్వలేదు. దీంతో ఆమె ఉన్న ఇంటిని కూల్చి, గుడిసెలో ఉంటోంది. చెంచుపల్లిలో విద్యుత్ తీగలు అడ్డు వచ్చి నిర్మాణాలు అసంపూర్తిగా ఆగాయి. వీటి పరిశీలించిన హౌసింగ్ అధికారులు.. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. అడ్డుగా ఉన్న విద్యుత్ వైర్ల గురించి ఏఈతో మాట్లాడగా.. రెండు రోజుల్లో ఆ తీగలను తొలగిస్తామని తెలిపారు. నాట్ స్టార్టెడ్ జాబితా లో ఉన్న వారికి మరోసారి అవకాశం కల్పించాలని, ఇళ్లు లేని వారికి కొత్తగా మంజూరు చేయాలని సర్పంచ్ దయాకర్ అధికారులను కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పాండు, హౌసింగ్ అధికారి చందర్నాయక్, ఉప సర్పంచ్ విజయ్కుమార్, పంచాయతీ కార్యదర్శి చంద్రకళ, వార్డు సభ్యులునరేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
దోమ: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు ఆదివారం రాత్రి సీజ్ చేశారు. మండల పరిధి తిమ్మాయిపల్లి గ్రామానికిచెందిన అలవోని తిరుపతి.. తన వాహనంలో రాకొండ వైపునకు ఇసుక తీసుకెళ్తుండగా.. నమ్మదగిన సమాచారంతో పోలీసులు ట్రాక్టర్ను పట్టుకున్నారు. ఎలాంటి ధ్రువ పత్రాలు లేకపోవడంతో వాహనాన్ని ఠాణాకు తరలించారు. తిరుపతిపై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వసంత్ జాదవ్ హెచ్చరించారు. మహిళ మృతిపై విచారణ తుర్కయంజాల్: చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన మహిళ మృతిపై పూర్తి విచారణ జరిపి, ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని డాక్టర్ రవినాయక్, డాక్టర్ భానుప్రకాశ్, డాక్టర్ వినయ్ కోట బృందం వెల్లడించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లికి చెందిన కె.దివ్య వైద్యం నిమిత్తం ఈనెల 24న రాగన్నగూడలోని మహోనియా మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి వచ్చి, మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈఅంశంపై విచారణ చేసేందుకు మహేశ్వరం మెడికల్ కళాశాలకు చెందిన వైద్య బృందాన్ని నియమించారు. సోమవారం ఆస్పత్రికి వచ్చిన వైద్యులు దివ్యకు అందించిన చికిత్స వివరాలను సేకరించడంతో పాటు పలు రిపోర్ట్లను పరిశీలించారు. ఐసీయూలోని సీసీ పుటేజీలను సైతం తీసుకున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ లక్ష్మీప్రసన్న, మండల వైద్యాధికారి ప్రియాంక, డాక్టర్ శృతి తదితరులు పాల్గొన్నారు. యువకుడి అదృశ్యం అబ్దుల్లాపూర్మెట్: ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ విజయనగరం జిల్లా కొత్తవలస మండలం దేవడ గ్రామానికి చెందిన పొడుగు ఈశ్వరమ్మ, యెరుకులు దంపతులు కుటుంబసభ్యులతో కలిసి కొంతకాలంగా అనాజ్పూర్లోని రామోజీ ఫిల్మ్సిటీకి చెందిన సహారా క్వార్టర్స్లో నివాసముంటున్నారు. ఫిల్మ్సిటీలో పనిచేస్తున్న వారి చిన్న కుమారుడు ఏసుకుమార్(24) ఈ నెల 21వ తేదీన పనికి వెళ్లి తిరిగి సాయంత్రం వచ్చి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసి పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి చూడగా ఏసుకుమార్ కనిపించకపోవడంతో పాటు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో ఆచూకీ కోసం వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించగా, ఈశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రొటోకాల్పై కలెక్టర్కు ఫిర్యాదు మంచాల: ప్రొటోకాల్ పాటించకుండా పనులకు అడ్డుతగిలి, తనను అవమాన పర్చిన వ్యక్తిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మండలంలోని ఆగపల్లి సర్పంచ్ లకుమల్ల ఉమ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈనెల 25న గ్రామంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వచ్చారన్నారు. కొన్ని పనులు ప్రారంభించిన తర్వాత సమయాభావంతో ఆయన వెళ్లిపోయారని, మిగిలిన వాటిని సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రారంభించాలని సూచించారన్నారు. అనంతరం గ్రామంలో ఓ ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవానికి వెళ్లిన తనను ఏర్పుల సంజీవ అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కాలితో తన్నడంతో పాటు కత్తెర లాక్కొని రిబ్బర్ కట్ చేశారని ఆరోపించారు. ప్రొటోకాల్ పాటించకుండా, మహిళా సర్పంచ్నైన తనను అవమానించిన వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. -
చోరీ కేసులో కేటుగాడి అరెస్టు
షాద్నగర్రూరల్: మాయమాటలు చెప్పి బంగారంతో ఉడాయించిన ఓ కేటుగాడిని పోలీసులు కటకటాలకు తరలించారు. పట్టణంలోని పోలీస్స్టేషన్లో డిటెక్టివ్ ఎస్ఐ శివారెడ్డి సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఫరూఖ్నగర్ మండలం బూర్గుల గ్రామానికి చెందిన నరేష్ ఈ నెల 18న హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తుండగా బస్సు కోసం వేచి ఉన్నాడు. అదే సమయంలో నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం రామిరెడ్డిపల్లికి చెందిన భిక్షపతి బస్టాప్లో నరేష్ దగ్గరకు వచ్చి ఉద్యోగం ఖాళీగా ఉందని, ఇప్పిస్తానని, మరిన్ని విషయాలు మాట్లాడుకుందామని లాడ్జికి తీసుకెళ్లాడు. ఇద్దరు మాట్లాడుతుండగా వాష్ రూంకు వెళతానని నరేష్ చెప్పడంతో మెడలోని చైన్, చేతి ఉంగరాలను తీసిపెట్టి వెళ్లాలని భిక్షపతి సూచించాడు. దీంతో నరేష్ తన మెడలో చైన్, చేతికి ఉన్న నాలుగు ఉంగరాలను తీసిపెట్టి వాష్రూంకు వెళ్లాడు. నరేష్ బయటకు వచ్చేలోపు భిక్షపతి గది బయట నుంచి గడియపెట్టి బంగారంతో ఉడాయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో కేసును ఛేదించి భిక్షపతిని అరెస్టు చేసి విచారించగా.. నేరం అంగీకరించాడు. నిందితుడి నుంచి బంగారు చైన్, 4 ఉంగరాలను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మినారాయణ, పట్టణ సీఐ సీతారం పర్యవేక్షణలో డీఎస్ఐ శివారెడ్డి, క్రై సిబ్బంది కేసును ఛేదించారు. -
సాగుకు దన్నుగా..
అన్నదాత చెంతకు వ్యవసాయ పరిశోధకులు బొంరాస్పేట: వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శాసీ్త్రయ పద్ధతులను అన్నదాతలకు నేరుగా చేరవేయాలని సంకల్పించింది. తద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చే పంటలను ప్రోత్సహించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సోమవారం ప్రారంభమైన ఈ కార్యక్రమం మే 23వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా కొనసాగనుంది. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాగులో మెళకువలపై అవగాహన కల్పించనున్నారు. సోమవారం బొంరాస్పేట మండలంలోని తుంకిమెట్ల గ్రామంలో, చౌడాపూర్ మండల కేంద్రంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు పాటించి రైతులకు సాగు పద్ధతులు, మెళకువలపై అవగాహన కల్పించారు. ఉద్దేశాలు.. కార్యక్రమాలు శాస్త్రవేత్తల సూచనలు ఫోన్లో శాస్త్రవేత్తలు.. జిల్లాలోని 20 మండలాల్లో.. జిల్లాలో ఈ కార్యక్రమం అమలుకు ఐదు బృందాలు ఏర్పాటు చేశారు. 40 గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లాలో వరుసగా చౌడాపూర్, బొంరాస్పేట, బషీరాబాద్, పెద్దేముల్, తాండూరు, దౌల్తాబాద్, దుద్యాల్, దోమ, మర్పల్లి, యాలాల, బంట్వారం, కుల్కచర్ల, ధారూరు, మోమిన్పేట, కోట్పల్లి, కొడంగల్, పరిగి, నవాబుపేట, పూడూరు, వికారాబాద్ మండలాల్లో శాస్త్రవేత్తలు పర్యటించనున్నారు. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు రైతులతో మమేకమై వారి సమస్యలను నివృత్తి చేస్తారు. పంటల సాగుపై అవగాహన కల్పిస్తారు. ఆరోగ్యకర నేల కోసం.. సేంద్రియ పద్ధతులు పా టించి ఆరోగ్యకరమైన నేల ను భావితరాలను అందించేందుకు ఈ కార్యక్రమం ఉపయుక్తం. ఈ ఉద్దేశాన్ని రైతులు పాటించడం లేదు. ఆదాయ పంటలపై మక్కువతో రసాయనాలను మోతాదుకు మించి వాడుతూ నేలసారాన్ని నాశనం చేస్తున్నారు. సేంద్రియ వ్యవసాయంలో కంపోస్టు, పశువుల పేడ, వానపాముల, కోళ్ల, పచ్చిరొట్టె ఎరువులు, జీలుగ, జనుము వీటన్నింటిపై అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం. గొప్ప శాస్త్రవేత్తలు రైతులకు వద్దకు వచ్చిచెప్పే సదావకాశం. – ప్రొ. డాక్టర్ సత్యనారాయణ, నేలవృచ్చిక శాస్త్రం శాస్త్రవేత్త, పాలెం పరిశోధన కేంద్రం -
స్వర్ణ కిరణం
దుద్యాల్: మారుమూల ప్రాంతంలోని ఓ పేదింట్లో పుట్టిన క్రీడాకారుడు బంగారు పతకాలతో సత్తాచాటుతూ రాష్ట్రానికే గర్వకారణంగా నిలుస్తున్నాడు. జిల్లాలోని దుద్యాల్ మండలం హస్నాబాద్కు చెందిన అల్వాల్ సాయికిరణ్ పుట్టి పెరిగింది సొంతూరిలోనే. గ్రామంలోనే ప్రాథమిక విద్య పూర్తిచేశాడు. అనంతరం గురుకుల సీటు రావడంతో ఎంజేపీ గురుకులంలో చేరి ఇంటర్ వరకు అక్కడే చదివాడు. పాఠశాలలో నిర్వహించే షాట్పుట్ పోటీల్లో మంచి ప్రతిభ కనబర్చేవాడు. ఈక్రమంలో ఎస్జీఎఫ్ పోటీల్లో సత్తాచాటి, క్రీడాధికారుల దృష్టిని ఆకర్షించాడు. దీంతో ప్రభుత్వం తరఫున ఇండోర్ స్టేడియంలో ప్రత్యేక కోచ్ను ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పించారు. దేశంలో ఎక్కడ పోటీలు జరిగినా సాయికిరణ్ను తీసుకెళ్తున్నారు. ఇలా వెళ్లిన చోటల్లా బంగారు పతకం సాధిస్తూ భేష్ అనిపించుకుంటున్నాడు. సాధించిన పతకాలు.. షాట్పుట్లోసత్తాచాటుతున్న సాయికిరణ్ దేశం తరఫున ఆడేందుకు సిద్ధం ప్రభుత్వ సహకారంతో షాట్పుట్లో సత్తా చాటుతున్నా.మాది పే ద కుటుంబం సర్కా రు నుంచి మరింత ప్రోత్సాహం లభిస్తే భారత్ తరఫున పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నా. శ్రమ, పట్టుదలను నమ్ముకుని ముందుకు సాగుతున్నా. – సాయికిరణ్, అథ్లెట్ -
బాలల రక్షణ మన బాధ్యత
అనంతగిరి: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భా గంగా మే 2వ తేదీ వరకు బాలల భద్రత, రక్షణ, డ్రగ్స్ రహిత సమాజం అనే అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని వీడి యో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ.. బాలల భద్రత, డ్రగ్స్ రహిత సమాజంపై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, యువతను భాగస్వాములను చేయాలన్నారు. మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండేలా చూడాలన్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించాలని పేర్కొన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, సీపీఓ వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్వీయ గణన చేసుకున్న కలెక్టర్ జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా సోమవారం కలెక్టర్ దీపక్ తివారి స్వయ గణన నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా సిస్టంలో తమ వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం సెల్ఫ్ ఎమ్యూ నరేషన్ పోస్టర్ను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ప్రజావాణికి 145 ఫిర్యాదులు ప్రజావాణి అర్జీలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ దీపక్ తివారి సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా వాణికి వివిధ గ్రామాలకు చెందిన పలువురు 145 అర్జీలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయి లో విచారణ చేపట్టి పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు వెంకటాచారి, ఉమాశంకర్ ప్రసాద్, జెడ్పీ సీఈఓ సుధీర్, ఆర్డీఓ వాసుచంద్ర, డీఆర్డీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఆయుర్వేదం.. అందనంత దూరం
దోమ: పురాతన సంప్రదాయ వైద్యం, రోగులపై దుష్ప్రభావాలు కలిగించకుండా స్వస్థత చేకూర్చే వైద్యం ఆయుర్వేదం. ప్రకృతిలో లభించే వనమూలికలతో చూర్ణాలు, లేహ్యాలు తయారు చేసి రోగ నివారణ చేసే అద్భుత వైద్య విధానంగా ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. ప్రజాభిమతాన్ని గమనించిన పాలకులు ఆయుష్ పేరుతో ప్రతి మండల కేంద్రంలో ఓ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. కానీ దోమ మండలంలో వైద్యులు లేక మూతబడింది. రెండేళ్ల నుంచి వైద్యం, మందుల కోసం రోగులు ఆస్పత్రి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా జిల్లా అధికారుల్లో చలనం లేదు. నిరీక్షించి.. వెనుదిరిగి.. మండలంలో 36 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా గ్రామాల నుంచి నిత్యం అనేక మంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు ఆయుర్వేద ఆస్పత్రికి వస్తుంటారు. కానీ వైద్యుడు లేక నిరాశతో వెనుదిరుగుతున్నారు. ప్రైవేటును ఆశ్రయిస్తూ.. గతంలో ఆయుర్వేద ఆస్పత్రి సేవలు ఎంతో బాగుండేవి. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచేవారు. రోగులకు మెరుగైన సేవలు అందేవి.. వైద్యుడు లేని కారణంగా ఆస్పత్రి మూత పడింది. రెండేళ్ల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం మందులు కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో మహబూబ్నగర్, షాద్నగర్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు ప్రైవేటులో వైద్యం పొంది మందులు తెచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ఆస్పత్రికి వైద్యుడు, సిబ్బందిని నియమించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. వైద్యం అందడం లేదు ఆయుర్వేద ఆస్పత్రిలో డాక్టర్ లేక వైద్యం అందడం లేదు. ఎప్పుడు వచ్చినా ఆస్పత్రికి తాళం ఉంటోంది. రెండేళ్లుగా తిరుగుతున్నా. ప్రస్తుతం నగరానికి వెళ్లి మందులు తెచ్చుకుంటున్నా. – ప్రభాకర్, బొంపల్లి సిబ్బందిని నియమించాలి ఆయుర్వేద వైద్యశాలలో సిబ్బందిని నియమించాలి. డాక్టర్ లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టాలి. – ఖాజాపాషా, కోఆప్షన్ మాజీ సభ్యుడు, దోమ -
ఈదురుగాలులు.. వడగండ్లు
● నేలరాలిన మామిడి కాయలు ● ఇళ్లపై పడిన విద్యుత్ స్తంభాలు పూడూరు: మండలంలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులు, వడగండ్లు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మా మిడి పంటకు భారీ నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు కాయలు నేలరాలాయి. మండలంలో మామిడి తోటలు అధికంగా ఉన్నాయి. స గానికిపైగా కాయలు రాలిపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్కేపల్లిలో విద్యుత్ స్తంభాలు ఇళ్లపై పడ్డాయి. చెట్లు నేలకొరిగాయి. మండలంలోని మోడల్ స్కూల్ సమీపంలో ప్రధాన రోడ్డుపై చెట్లు పడింది. దీంతో రాకపో కలకు అంతరాయం కలిగింది. జేసీపీతో కూలిన చెట్టును తొలగించారు. నవాబుపేటలో భారీ వర్షం నవాబుపేట: మండలంలో సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. మధ్యాహ్నం వరకు ఎండ దంచి కొట్టింది. సాయంత్రం భారీ వర్షం కురవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. -
ఆయుధ వినియోగంలో ప్రావీణ్యం అవసరం
అనంతగిరి: పోలీసు అధికారులకు ఆయుధాల వినియోగంపై పూర్తి ప్రావీణ్యం ఉండాలని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. వికారాబాద్ పట్టణ పరిధిలోని కొత్రేపల్లి వద్ద నిర్వహిస్తున్న వార్షిక మొబిలైజేషన్ ఫైరింగ్ ప్రాక్టీస్లో పాల్గొన్నారు. ఆయుధాల పనితీరును పరిశీలించి ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా, సమర్థవంతంగా స్పందించే సామర్థ్యం పోలీసు సిబ్బందిలో ఉండాలని ఆకాంక్షించారు. సీనియర్ అధికారులు, ఎస్హెచ్ఓలు తమ సిబ్బందికి ఫైరింగ్ ప్రాక్టీస్పై పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు. శిక్షణలో పాటించాల్సిన నియమ నిబంధనల గురించి స్పష్టంగా వివరించాలని తెలిపారు. ప్రజల భద్రతలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. తుపాకుల దగ్గర పెట్టుకొని విధులు నిర్వహించే అధికారులు తగు జాగ్రతలు పాటించాలన్నారు. ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు పోలీసుల ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, తద్వారా శాంతిభద్రతల పరిరక్షణ సులువవుతుందని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రతి అధికారి అప్రమత్తత, క్రమశిక్షణ, సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రాములునాయక్, డీసీఆర్బీ డీఎస్పీ జానయ్య, డీటీసీ డీఎస్పీశ్రీనివాసులు, డీఎస్పీలు శ్రీనివాస్ రెడ్డి, యాదయ్య, శ్రీనివాస్, వీరేష్, సీఐలు, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సామాజిక స్పృహపై షార్ట్ ఫిల్మ్ పోటీలు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సామాజిక స్పృహపై సామాజిక మాద్యమాల ద్వారా అవగాహన కల్పించేందుకు షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ స్నేహమెహ్ర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సేఫ్ యూత్ – స్ట్రాంగ్ నేషన్ అనే నినాదంతో పోటీలు నిర్వహిస్తామన్నారు. పోటీదారులు ముఖ్యంగా సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్ నివారణ, మహిళలు, పిల్లల రక్షణ, మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన, ఏటీఎం దొంగతనాలు, ఉద్యోగాలు, బహుమతుల పేరిట మోసాలు, న్యాయ విజ్ఞానం, ఆత్మహత్యల నివారణ అవగాహన అంశాల్లో షార్ట్ ఫిలిమ్ చేయాలని తెలిపారు. వ్యవధి 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే ఉండాలన్నారు. జిల్లాలోని యువత, విద్యార్థులు, క్రియేటివ్ అర్టిస్టులు, కంటెంట్ క్రియేటర్లు, యూ ట్యూబర్లు ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. వీడియో కేవలం వినోదం మాత్రమే కాకుండా సమాజంలో బాధ్యతను పెంచే విధంగా ఉండాలన్నారు. ఉత్తమంగా ఐదు షార్ట్ ఫిల్మ్లను ఎంపిక చేసి నగదు బహుమతి, ప్రశంసాపత్రాలు అందించడం జరుగుతుందన్నారు. ఆసక్తిగల వారు మీరు తీసిన వీడియోతో పాటు మీ పేరు, ఫోన్ నంబర్ను టైటిల్ను జగదీశ్వర్రెడ్డి సెల్ నంబర్ 9948542227కు పంపాలన్నారు. మరిన్ని వివరాలకు ఎస్బీ ఇన్స్పెక్టర్ నవీన్కుమార్ సెల్ నంబర్లో 8712670020లో సంప్రదించాలని తెలిపారు. అంతకుముందు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొన్నారు. ఫిర్యాదు దారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత పీఎస్లకు ఫోన్ చేసి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరించడానికి పోలీస్ శాఖ ఎల్లపుడూ అందుబాటులో ఉంటుందని ఎస్పీ తెలిపారు. -
దళారులకు ధాన్యం అమ్మొద్దు
జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం బొంరాస్పేట: రైతులు వరి ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని జిల్లా వ్యవసాయాధికారి టి.రాజరత్నం అన్నారు. సోమ వారం మండలంలోని నాగిరెడ్డిపల్లి, కొత్తూరు గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. క్వింటాలు ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 మద్దతు ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు. అవసరం మేరకు గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచామన్నారు. మెట్లకుంట, వడిచర్ల, బాపల్లి, చౌదర్పల్లి, తుంకిమెట్ల, ఏర్పుమళ్ల కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి, కొడంగల్ ఏడీఏ శంకర్ రాథోడ్, ఏఓ పోలప్ప, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రాములు గౌడ్, డైరెక్టర్ మల్లేశ్, జయకృష్ణ, నాయకులు భీంరెడ్డి ఢాక్యా నాయక్, సర్పంచ్ అనిత తదితరులు పాల్గొన్నారు. ‘టాలెంట్ సర్చ్’ అభినందనీయం యాలాల: ఇటీవల మండల స్థాయిలో నిర్వహించిన టాలెంట్ సర్చ్ టెస్ట్ కార్యక్రమం అభినందనీయమని ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అన్నా రు. సోమవారం ఎమ్మెల్యేను ఎంఈఓ మహిపాల్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టాలెంట్ సర్చ్ టెస్ట్ కార్యక్రమ వివరాలను అడిగి తెలుసుకున్నారు. జూన్లో నియో జకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాల ని విద్యాశాఖకు చెందిన అధికారులను ఎమ్మె ల్యే ఆదేశించారు. అనంతరం ఎంఈఓను సన్మానించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కృష్ణారెడ్డి, రాములు, ప్రతినిధులు శ్రీధర్రెడ్డి, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఈత నేర్చుకునేందుకు వెళ్లి..
దోమ: ఈత నేర్చుకునేందుకు వెళ్లిన ఓ బాలుడు బావిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. దోమ మండలం దిర్సంపల్లి గ్రామానికి చెందిన కారవొని నాగేశ్కు ఏడేళ్ల బాలుడు శివకుమార్ ఉన్నాడు. వేసవి సెలవులు కావడంతో శనివారం మహబూబ్నగర్ జిల్లా కొయిలకొండ మండలం కొత్లాబాద్లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆదివారం పెద్దనాన్నతో కలిసి గ్రామ సమీపంలోని బావిలో ఈత నేర్చుకునేందుకు వెళ్లాడు. అందరూ చూస్తుండగా శివకుమార్ బావిలోకి దూకాడు. ఎంతసేపటికీ బయటికి రాలేదు. దీంతో అక్కడే ఉన్న కొందరు గాలింపు చర్యలు చేపట్టారు. నీట మునిగిన బాలుడిని బయటికి తెచ్చారు. అప్పటికే శివకుమార్ చనిపోయాడు. కుమారుడి మరణ వార్త తెలుసుకున్న తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. నీట మునిగి చిన్నారి మృతి మహబూబ్నగర్ జిల్లాలో ఘటన దిర్సంపల్లిలో విషాదం -
‘అనంత వేదిక’ కృషి అభినందనీయం
బొంరాస్పేట: స్థానిక కవులు, సాహిత్య కృషిని వెలికి తీయడంలో వికారాబాద్ జిల్లా అనంత వేదిక చేస్తున్న కృషి అభినందనీయమని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. తెలంగాణ వాగ్గేయకారుడు, జిల్లా ప్రముఖ కవి శ్రీ రాకమచర్ల వెంకటదాసు సంచికను ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆవిష్కరించారు. ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి పలువురు రాకమచర్ల సంకీర్తలను కీర్తించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి సంచికను ఆవిష్కరించారు. రాకమచర్ల సంకీర్తలను ప్రచారం చేయడంలో జిల్లా కవులు, రచయితల ప్రాత ఎంతో ఉందన్నారు. కార్యక్రమంలో అనంత వ్యవస్థాపకులు దోరవెటి చెన్నయ్య, అధ్యక్షుడు ఆశీర్వాదం, కార్యదర్శి కమలేశ్, ఉపాధ్యక్షుడు వడిచర్ల సత్యం, అనంత సభ్యులు రవూఫొద్దీన్, మధుసూదన్రావు, డాకన్న, సురేశ్, రమేశ్, మల్లికార్జున్, రవికృష్ణస్వామి, రామన్న తదితరులు పాల్గొన్నారు. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి


